AP Board 8th Class Maths Study Material Guide Solutions Pdf Download State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 8th Class Maths Study Material Guide Pdf free download, 8th Class Maths Textbook Solutions in English Medium and Telugu Medium are part of AP Board 8th Class Textbook Solutions.

Students can also go through AP Board 8th Class Maths Notes to understand and remember the concepts easily. Students can also read AP 8th Class Maths Bits with Answers for exam preparation.

AP State Syllabus 8th Class Maths Guide Study Material Pdf Free Download

AP 8th Class Maths Study Material Pdf Download Andhra Pradesh | AP 8th Class Maths Textbook Pdf Download

AP 8th Class Maths Study Material Pdf Download English Medium

AP State 8th Class Maths Study Material Chapter 1 Rational Numbers

AP State 8th Class Maths Solutions Chapter 2 Linear Equations in One Variable

AP 8th Class Textbook Pdf Download Chapter 3 Construction of Quadrilaterals

AP 8th Class Maths Solutions Chapter 4 Exponents and Powers

8th Class Maths TS State Syllabus Guide Pdf Chapter 5 Comparing Quantities Using Proportion

AP 8th Class Maths Textbook State Syllabus Solutions Chapter 6 Square Roots and Cube Roots

AP Board 8th Class Maths Guide Chapter 7 Frequency Distribution Tables and Graphs

AP SCERT 8th Maths Solutions Chapter 8 Exploring Geometrical Figures

AP State 8th Class Maths Textbook Solutions Chapter 9 Area of Plane Figures

8th Class Maths Textbook State Syllabus Pdf Chapter 10 Direct and Inverse Proportions

AP State Board 8th Class Maths Syllabus Chapter 11 Algebraic Expressions

AP 8th Maths Solutions Chapter 12 Factorisation

AP State 8th Class Maths Textbook Pdf Chapter 13 Visualizing 3-D in 2-D

8th Class Maths Solution Pdf Chapter 14 Surface Areas and Volume (Cube-Cuboid)

8th Class Maths Textbook Telugu Medium Chapter 15 Playing with Numbers

AP Board 8th Class Maths Textbook Solutions in Telugu Medium

AP State 8th Class Maths Study Material Chapter 1 అకరణీయ సంఖ్యలు

AP State 8th Class Maths Solutions Chapter 2 ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు

AP 8th Class Textbook Pdf Download Chapter 3 చతుర్భుజాల నిర్మాణాలు

AP 8th Class Maths Solutions Chapter 4 ఘాతాంకాలు మరియు ఘాతాలు

8th Class Maths TS State Syllabus Guide Pdf Chapter 5 అనుపాతముతో రాశులను పోల్చుట

AP 8th Class Maths Textbook State Syllabus Solutions Chapter 6 వర్గమూలాలు, ఘనమూలాలు

AP Board 8th Class Maths Guide Chapter 7 పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు

AP SCERT 8th Maths Solutions Chapter 8 జ్యామితీయ పటాల అన్వేషణ

AP State 8th Class Maths Textbook Solutions Chapter 9 సమతల పటముల వైశాల్యములు

8th Class Maths Textbook State Syllabus Pdf Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు

AP State Board 8th Class Maths Syllabus Chapter 11 బీజీయ సమాసాలు

AP 8th Maths Solutions Chapter 12 కారణాంక విభజన

AP State 8th Class Maths Textbook Pdf Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట

8th Class Maths Solution Pdf Chapter 14 ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము)

8th Class Maths Textbook Telugu Medium Chapter 15 సంఖ్యలతో ఆడుకుందాం

AP State Board Syllabus 8th Class Textbook Solutions & Study Material

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

SCERT AP 8th Class Biology Study Material Pdf 5th Lesson కౌమార దశ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 5th Lesson Questions and Answers కౌమార దశ

8th Class Biology 5th Lesson కౌమార దశ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
బాల్యావస్థ కౌమార దశ కంటే ఏ విధంగా భిన్నమైనది ?
జవాబు:

  1. బాల్యావస్థలో శరీర అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది.
  2. కానీ కౌమార దశలో ఇది అత్యంత ఎక్కువ స్థాయికి వెళ్తుంది.
  3. అంతేకాక మానసిక ఎదుగుదల, భావోద్వేగాలు ఎక్కువగా వ్యక్తమవుతాయి.
  4. బాల్యావస్థలో ఉన్న ఆధారపడే మనస్తత్వం (తల్లి, తండ్రి, అక్క, అన్నల మీద) కౌమార దశలో తగ్గుతుంది.
  5. కౌమార దశలో వ్యక్తిగత శ్రద్ధ, స్వయంగా నా పనులు నేను చూసుకోగలననే అభిప్రాయం పిల్లలలో వ్యక్తమవుతుంది.
  6. ఇలా శారీరక, మానసిక, భావోద్వేగాల వ్యక్తీకరణలో బాల్యావస్థ కౌమార దశ కన్నా భిన్నమైనదని చెప్పవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 2.
క్లుప్తంగా రాయండి.
(i) ద్వితీయ లైంగిక లక్షణాలు
(ii) ఆడమ్స్ యాపిల్
జవాబు:
(i) ద్వితీయ లైంగిక లక్షణాలు:

  1. కౌమార దశలో, హార్మోనుల ప్రభావం వల్ల శరీరంలో వచ్చే ముఖ్య లక్షణాలను ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు.
  2. మగపిల్లలలో నూనుగు మీసాలు, గడ్డం రావటం, గొంతు బొంగురుగా మారటం.
  3. ఆడపిల్లలలో నాజూకుతనం మొదలైనవి.
  4. లైంగిక అవయవ వ్యవస్థలో పరిపక్వతకు వస్తాయి.
  5. బాహు మూలాల్లో వెంట్రుకలు పెరుగుతాయి.

(ii) ఆడమ్స్ యాపిల్ :

  1. గొంతు దగ్గర ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉన్న థైరాయిడ్ మృదులాస్థి ఎముకను ‘ఆడమ్స్ యాపిల్’ అంటారు.
  2. ఈ ‘ఆడమ్స్ యాపిల్’ మన స్వరపేటిక (Larynx) యొక్క పాక్షిక పెరుగుదల వలన పెరుగుతుంది.
  3. కౌమారదశలో థైరాయిడ్ మృదులాస్థి పెరగటం వల్ల ‘ఆడమ్స్ యాపిల్’ ఏర్పడుతుంది.
  4. ఇది మగపిల్లలలో ఒకానొక ద్వితీయ లైంగిక లక్షణం.

ప్రశ్న 3.
కౌమార దశలో మానవ శరీరంలో జరిగే మార్పుల జాబితా రాయండి.
జవాబు:
1. ‘కౌమార దశ’ ప్రతి మానవునిలో 13-19 సం||ల మధ్య వచ్చే ముఖ్యమైన దశ.
2. దీని వల్ల మానవ శరీరంలో
ఎ) కండరాలు, ఎముకల అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది.
బి) దీనివల్ల ఎత్తు, బరువు పెరుగుతారు.
సి) శరీరంలో జీవనక్రియ రేటు పెరుగుతుంది. దీనివల్ల శక్తి ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. (దీనిని + ‘tive గా మార్చుకోవాలి)
డి) ‘ఆడమ్స్ యాపిల్’ మగపిల్లలలో పెరుగుతుంది.
ఇ) ఆడపిల్లలలో స్థనాల పరిమాణం పెరుగుతుంది.
ఎఫ్) బాహు మూలాల్లో, ప్రత్యుత్పత్తి అంగాల దగ్గర వెంట్రుకలు పెరుగుతాయి.
జి) బాలికలలో ఋతుచక్రం మొదలవుతుంది.
హెచ్) మగపిల్లలలో వీర్యకణాల ఉత్పత్తి మొదలవుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 4.
జతపరచండి.
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 1
జవాబు:
1) C
2) B
3) D
4) A

ప్రశ్న 5.
కౌమార దశలో మొటిమలు, మచ్చలు ఎందుకు వస్తాయి ? వాటి పట్ల ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?
జవాబు:
1. కౌమార దశలో శరీరంలో అభివృద్ధి ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. ఈ
2. దీనివల్ల శరీరంలోని తైల గ్రంథులు, స్వేద గ్రంథులు కూడా ఎక్కువ స్థాయిలో స్పందించి తైలాన్ని, స్వేదాన్ని ఉత్పత్తి చేస్తాయి.
3. దీనివల్ల ముఖం జిడ్డుగా ఉండటం, తైల గ్రంథుల నాళాలలో బాక్టీరియా చేరి ఉబ్బుగా ఉండే బుడిపెలు (మొటిమలు) రావటం సాధారణ విషయం.
4. కొన్నిసార్లు చీము పట్టి ఇవి నొప్పిని కలుగచేస్తాయి.
5. వీటిని గిల్లినా, గోరు తగిలినా అది మచ్చగా మారుతుంది.
6. చెమట వల్ల శరీరం నుంచి ఒక రకమైన వాసన కూడా వస్తుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
ఎ) ముఖాన్ని చల్లని నీటితో రోజుకు 3, 4 సార్లు శుభ్రం చేసుకోవాలి.
బి) మాటిమాటికీ సబ్బుతో ముఖాన్ని కడగకూడదు.
సి) మొటిమలను గిల్లకూడదు. ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడాలి.
డి) వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
ఇ) ఒత్తిడి, ఆందోళన లేకుండా మానసిక ఉల్లాసానికి సాధన చేయాలి.

ప్రశ్న 6.
కౌమారదశలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించటానికి నువ్వు మీ స్నేహితుడికి ఏం సలహాలు ఇస్తావు?
జవాబు:
కౌమారదశలో వ్యక్తిగత పరిశుభ్రతకు, నా స్నేహితునికి కింది సలహాలు ఇస్తాను.

  1. ప్రతిరోజు రెండు పూటలా స్నానం చేయాలి.
  2. మర్మావయవాల శుభ్రత పట్ల శ్రద్ధ వహించాలి.
  3. ముఖాన్ని ఎక్కువసార్లు చల్లని నీటితో కడగాలి.
  4. మొటిమలను గిల్లటం కాని, వత్తటం కాని చేయరాదు.
  5. ముఖానికి లేపనాలు రాయరాదు.
  6. అవాంఛిత రోమాలను తొలగించుకోవాలి.
  7. నూనె, నెయ్యి తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
  8. తగినంత శారీరక శ్రమ కొరకు వ్యాయామం చేయాలి. ఆటలు ఆడాలి.

ప్రశ్న 7.
మీకు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులపై కోపం వచ్చిందా ? మీ తల్లిదండ్రులు ఎలా ఉండాలని మీరు భావిస్తారు ?
జవాబు:
1. నాకు చిన్నప్పటి నుండి ఎప్పుడూ నా తల్లిదండ్రులపై కోపం రాలేదు.
2. కానీ ఈ మధ్య వారిచ్చే సూచనల పట్ల విసుగు వస్తోంది.
3. నాకు తెలిసిన విషయాలు కూడా వారు పదే పదే చిన్నపిల్లవాడికి చెప్పినట్లు చెప్పటం విసుగనిపిస్తోంది.
4. నా వయస్సు ఇప్పుడు 14 సం||లు.
5. ఎండలో స్నేహితులతో ఆటలకు వెళ్ళేద్దంటారు.
6. స్నేహితులను ఇంటికి రానివ్వరు. వచ్చినా బయట మాట్లాడమంటారు. కానీ నాకు వారితో గడపటం ఇష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు కోపం వస్తుంది.
7. ఎక్కువగా ఈ మధ్య ఇది చెయ్యి. అది చేయకూడదు అన్న సలహాల ప్రక్రియ మొదలయ్యింది. ఇది నాకిష్టం లేదు.
8. నా తల్లిదండ్రులు
ఎ) నేను పెద్దవాణ్ణి అయ్యాను అని గుర్తించాలని కోరుకుంటాను.
బి) నాకు నచ్చిన, నాకిష్టమైన పనులు చేయవద్దని అనకుండా ఉంటే బాగుంటుంది.
సి) నేను పెద్దవాణ్ణి అని వారు గుర్తించాలనిపిస్తుంది.
డి) నేను కూడా స్వతంత్రంగా పనులు చేయగలనని వారు విశ్వసించాలని భావిస్తాము.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 8.
మీరు మీ తల్లిదండ్రుల కంటే స్నేహితులతో ఏ ఏ సమస్యలు, అభిప్రాయాలు పంచుకుంటారు ?
జవాబు:
నేను నా స్నేహితులతో ఈ కింది అభిప్రాయాలు పంచుకుంటాను.
1. నా శరీరంలో జరిగే మార్పులు – ఎత్తు, బరువు, మొటిమల గురించి వారి అనుభవాలను తెలుసుకోవాలని అనుకుంటాను.
2. చదువు విషయంలో ప్రగతి విషయమై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులిచ్చిన సూచనలపై వారి అభిప్రాయాలు తీసుకొని, వారి సలహాలను నిర్లక్ష్యం చేస్తాను. (చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయంలో వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తారు. )
3. సినిమాలు, హీరో, హీరోయిన్ల విషయాలు ‘స్నేహితులతో ఎక్కువగా పంచుకుంటాను.
4. వీడియో గేమ్ లు, సాంఘిక అంతర్జాల పట్టికల గురించి వారి సలహాలు, అనుభవాలు తెలుసుకోవటానికి ఉత్సాహం చూపుతాను.
5. భిన్నలింగ వర్గీయుల గురించి, కబుర్లు ఎక్కువగా స్నేహితులతో చర్చిస్తాను.
6. లైంగిక అవయవాల అభివృద్ధి గురించి కంగారు పడి స్నేహితుల సలహాల కోసం ఆత్రుతగా చూస్తాను. (ఇది కూడా 99% ఋణాత్మక ఫలితాన్ని ఇస్తుంది. సమ వయస్కులు కాబట్టి ఈ విషయంపై వారికి శాస్త్రీయ పరిజ్ఞానం ఉండదు. )

ప్రశ్న 9.
ఒకవేళ నీకు వైద్యుడ్ని సంప్రదించే అవకాశం వస్తే, కౌమార దశలో ఉద్వేగాల గురించి నీవు అడిగే ప్రశ్నలు ఏమిటి ?
జవాబు:
నాకు వైద్యుడ్ని కలిసి కౌమార దశలో నేను ఎదుర్కొనే ఉద్వేగాల గురించి ఈ కింది ప్రశ్నలు అడుగుతాను.

  1. నేను నా సౌందర్యంపై మునుపెన్నడూ లేనంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాను. ఎందుకని ?
  2. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు సలహాలు నచ్చక వారితో విభేదిస్తున్నాను. కారణం ఏమిటి ?
  3. అందరి దృష్టిలో నేను ఎందుకు అగుపడాలి అని భావిస్తున్నాను.
  4. ఈ మధ్య నా ప్రవర్తనలో దూకుడు, దుందుడుకు మనస్తత్వం ఎందుకు వస్తున్నది ?
  5. ఎందుకు నాకు అవకాశమెచ్చినప్పుడు గట్టిగా అరచి గోల చేయాలనిపిస్తున్నది ?
  6. భిన్న లైంగిక వర్గీయుల పట్ల నేను ఎందుకు ఆకర్షణకు లోనవుతున్నాను ?
  7. నా లైంగిక అవయవాల దగ్గర, బాహు మూలాల్లో వెంట్రుకలు ఎందుకు పెరుగుతున్నాయి ? చెమట ఎక్కువ పోస్తున్నది. ఎందుకు ?
  8. ఋతుచక్రం, రజస్వల అవటం ఆడపిల్లలలో జరిగే మార్పులు. మరి మగవారిలో ఎలాంటి మార్పులు వస్తాయి ?
  9. అనవసరమైన సిగ్గు, అసహనం, అరచి గోల చేయాలనిపించటం – గొంతు బొంగురు పోవటం ఎందువల్ల నాలో కలుగుతున్నాయి ?
  10. ‘వ్యక్తిగత పరిశుభ్రత’ అంటే ఏమిటి ? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

ప్రశ్న 10.
కొన్ని మొబైల్ ఫోన్లలో ఉండే ఆడియో మీటరును ఉపయోగించి 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న కొందరి విద్యార్థుల స్వరాల పౌనఃపున్యాన్ని నమోదు చేసి మీ పరిశీలనలు రాయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 2
పరిశీలనలు :
1. 6వ తరగతి పిల్లలలో స్వర పౌనఃపున్యం దాదాపు ఆడ, మగపిల్లల్లో ఒకే విధంగా ఉందని గమనించాను.
2. 7వ తరగతిలో కూడా స్వర పౌనఃపున్యం ఆడ, మగపిల్లల్లో ఒకే విధంగా ఉంది.
3. 8వ తరగతిలో మగపిల్లలలో పౌనఃపున్యం తగ్గింది. అంటే వారి స్వరం బొంగురుగా ఉంది. ఆడపిల్లల్లో మాత్రం సన్నగా ఉండి పౌనఃపున్యం 6, 7వ తరగతుల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. (కౌమార దశ ప్రారంభమైనదని సూచన)
4. 9,10 తరగతుల మగపిల్లల్లో బొంగురు గొంతు ఉంది. సాధారణంగా పురుషులలో ఉండాల్సిన పౌనఃపున్యం 120 Htz కు దగ్గరగా ఉన్నది. అమ్మాయిలలో సన్నని గొంతు ఇంకా సున్నితత్వంతో ఉందని మా పరిశీలనలో తేలింది.
5. టెస్టోస్టిరాన్, అడ్రినలిన్ల ప్రభావం వల్ల 13 నుండి 15 సం|| వయస్సుకు వచ్చిన పిల్లల గొంతు బొంగురుగా వుంటుంది.
6. ఈస్ట్రోజన్ ప్రభావం వల్ల ఆడపిల్లల గొంతులో సున్నితత్వం మొదలయిందని గమనించాము.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 11.
బాల్యవివాహాలు, బాలికల ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి సమాచారం సేకరించి నివేదిక తయారుచేయండి.
జవాబు:
బాల్యవివాహాలు ఒక సాంఘిక దురాచారం. చిన్న వయస్సులోనే వివాహం చేయటం వలన వారిలో గర్భధారణకు
కావలసిన శారీరక పరిణితి ఉండదు. అందువలన ప్రసవ సమయంలో తల్లి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. వీరికి కలిగే సంతానం కూడా సరైన ఎదుగుదల లేకపోవటం వంటి సమస్యలతో బాధపడతారు.

అంతేగాక వివాహ బంధాన్ని కొనసాగించటానికి కావలసిన మానసిక పరిణితి లోపించి వివాహాలు విఫలమవుతాయి. చిన్న వయస్సులోనే తల్లి కావటం వలన వారి గర్భాశయం సరిగా ఎదగక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువలన భారత ప్రభుత్వం వివాహానికి కనీస వయస్సు పురుషులకు 21 సంవత్సరాలుగాను, స్త్రీలకు 18 సంవత్సరాలుగాను నిర్ణయించింది. బాధ్యత గల పౌరునిగా మనం వీటిని పాటించాలి.

ప్రశ్న 12.
పటంను పరిశీలించండి. మానవ శరీరంలో ఉండే అంతఃస్రావ గ్రంథులు, అవి ఉండే చోటును తెలిపే పటం గీయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 3
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 10

ప్రశ్న 13.
ఆడమ్స్ యాపిల్ పటం గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 4

ప్రశ్న 14.
కౌమార దశలో జరిగే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తూ ఒక ఉపన్యాస వ్యాసం తయారుచేయండి. (లేదా) ఏ లక్షణాలను బట్టి బాలబాలికలు కౌమారదశను చేరుకున్నారని తెలుసుకోవచ్చు.
జవాబు:
1. 13-19 సం|| మధ్య వయస్సు గల పిల్లలలో కనిపించే అతి సున్నితమైన, ముఖ్యమైన దశను కౌమార దశ అంటారు.
2. దీనినే టీనేజ్ అంటారు. ఇది శారీరక, మానసిక భావోద్వేగాల అభివృద్ధిని వేగవంతం చేసే వయస్సు.

మార్పులు :

(1) శారీరక మార్పులు :

  1. ఈ దశలో శరీరంలో అభివృద్ధి బాగా ఎక్కువ జరుగుతుంది.
  2. BMR (Basal Metabolic Rate) ఎక్కువగా ఉంటుంది.
  3. కండరాల అభివృద్ధి, ఎముకల పెరుగుదల ఎక్కువవటం వల్ల ఎత్తు, బరువు పెరుగుతారు.
  4. మగపిల్లల్లో గొంతు బొంగురుపోవటం, మీసాలు, గెడ్డాలు రావటం, జననాంగాల వద్ద వెంట్రుకలు రావటం ప్రారంభమవుతుంది.
  5. బాహు మూలాల్లో వెంట్రుకలు పెరిగి, శరీరంలో చెమట ఎక్కువ పోస్తుంది.
  6. ఆడపిల్లల్లో రజస్వల అయ్యి, ఋతుచక్రం ప్రారంభమవుతుంది.
  7. ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తాయి.

(2) మానసిక మార్పులు :

  1. వీరిలో దేనిపైనా సరైనా ఆసక్తి ఉండదు.
  2. విసుగు ఎక్కువ.
  3. నిర్లక్ష్యంగా ఉంటూ, ఎక్కువ సార్లు అసహనం వ్యక్తపరుస్తారు.
  4. అరచి గోల చేయాలనిపిస్తుంది.
  5. అందరి దృష్టి తన పైనే ఉండాలని, తాను పెద్దవాడ్ని అయ్యాను కాబట్టి తన నిర్ణయాల పట్ల అందరూ సానుకూలంగా స్పందించాలని కోరుకుంటారు.
  6. భావోద్వేగాల స్థాయి ఎక్కువగా ఉంటుంది.
  7. ఎక్కువ సేపు అద్దం ముందు గడుపుతూ తమ సౌందర్యంపై ఎక్కువ మక్కువ చూపిస్తారు.
  8. సమ వయస్కులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు.
  9. కలల ప్రపంచంలో విహరిస్తూ, ఆ స్వప్నంలో తమ కోరికలు నెరవేరినట్లు హిస్తూ గడపటానికి ప్రాధాన్యం ఇస్తారు.
  10. భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షణకు లోనవుతారు.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

  1. ఈ భావోద్వేగ మార్పులను తనలో సహజంగా హార్మోనుల వల్ల వచ్చే మార్పులని ముందుగా తనకు తాను చెప్పుకోవాలి.
  2. స్నేహితుల ప్రోదల్బంతో చెడు అలవాట్లకు దగ్గరవకుండా స్వీయ క్రమశిక్షణ పాటించాలి.
  3. తనలో జరిగే ఈ ‘సంక్లిష్ట సంఘర్షణ’ నుండి బయటపడడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సాయం, అవసరమైతే డాక్టర్ల సాయం తీసుకోవాలి.
  4. మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయాలి.
  5. ‘వ్యక్తిగత పరిశుభ్రత’ పాటిస్తూ వ్యాధుల నుండి కాపాడుకోవాలి.
  6. ‘తేలికపాటి వ్యాయామం’ ఆటల ద్వారా శరీరాన్ని అలసట చెందించటం ద్వారా మంచి నిద్రను ఆహ్వానించవచ్చు.
  7. టివిల ముందు వీడియో గేమ్ ల ముందు, చాటింగ్ (చరవాణి ద్వారా SMS) లను నివారించి, స్థూలకాయత్వం రాకుండా చూసుకొనవచ్చు.
  8. భిన్నలింగ వర్గీయుల పట్ల గౌరవ భావాన్ని పెంచుకోవాలి.
  9. ఇది ఇప్పటి సమాజ శ్రేయస్సుకు ఎంతో ముఖ్యమైనది.
  10. తల్లిదండ్రులు పిల్లల్ని ఈ దశలో నిశిత పరిశీలన చేస్తూ వారికి మానసికంగా కావలసిన అండదండలను అందించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 15.
ప్రత్యుత్పత్తిపరంగా మరొక తరం సంతతిని ఉత్పత్తి చేసే విధంగా ప్రకృతి మానవ శరీరాన్ని తయారుచేసింది. దీన్ని నువ్వెట్లా అభినందిస్తావు ?
జవాబు:

  1. ప్రత్యుత్పత్తిపరంగా మరొక తరం సంతతిని ఉత్పత్తి చేసే విధంగా ప్రకృతి మానవ శరీరంలో లింగ భేదం ఉన్న ప్రత్యుత్పత్తి వ్యవస్థలను తయారుచేసింది.
  2. పురుషులలో ఒక జత ముష్కాలతో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను, స్త్రీలలో ఒక జత స్త్రీ బీజకోశాలతో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను, ప్రకృతి అభివృద్ధి చేసింది.
  3. పురుషుల నుండి శుక్రకణం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో విడుదలైన అండంతో కలిసి సంయోగం చెంది సంయుక్త – బీజంగా అభివృద్ధి చెందుతుంది.
  4. దీనిని అంతర ఫలదీకరణ అంటారు.
  5. ఇది స్త్రీలలోని ఫాలోపియన్ నాళాలలో జరుగుతుంది.
  6. తరువాత పిండం ఏర్పడి గర్భాశయ గోడలకు అంటిపెట్టుకుని ‘భ్రూణం’గా అభివృద్ధి చెందుతుంది.
  7. ఈ భ్రూణం ‘గర్భావధి కాలం 270-280 రోజుల మధ్య ఉంటుంది. పూర్తిగా అభివృద్ధి చెంది శిశువుగా మారిన తరువాత తల్లి బిడ్డకు జన్మనిస్తుంది.
  8. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికి అవసరమైన ఏర్పాట్లు గర్భాశయంలోనే ప్రకృతి అభివృద్ధి చేసింది.
  9. ఇది ఎంతో అభినందించవలసిన విషయం.
  10. ఈ ఏర్పాట్ల వల్ల మానవ సంతతి తరం తర్వాత తరంలో అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది.

ప్రశ్న 16.
బాల్యవివాహం ఒక సామాజిక దురాచారం అని మీకు తెలుసు. దీని నివారణకై కొన్ని నినాదాలు తయారుచేయండి.
జవాబు:
1. వివాహం మరొక తరాన్ని సృష్టించటంలో కీలకపాత్ర పోషించే ఒక సామాజిక, సాంస్కృతిక ప్రక్రియ.
2. దీనికి పురుషులలో 21 సంవత్సరాలు. స్త్రీలలో 18 సంవత్సరాల కనిష్ఠ వయస్సును మన దేశ రాజ్యాంగం చట్టంగా చేసింది. దీనిని మనందరం గౌరవించాలి.
నినాదాలు :

  1. బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకం.
  2. బాల్య వివాహాలు నేరం.
  3. పిల్లల్ని ఎదగనీయండి. తరువాత వివాహం చేయండి. ఆరోగ్యమైన సంతతిని పొందండి.
  4. ఆడపిల్లల చదువు – ఆ ఇంటికి వెలుగు.
  5. బాల్య వివాహం – తల్లీ బిడ్డల ఆరోగ్యానికి హానికరం.
  6. బాల్య వివాహాలు – వారి జీవితాల్లో ఆటుపోటులకు ఆనవాలు.
  7. బాల్య వివాహాలు ఆపుదాం – ముందు తరాలను కాపాడదాం.
  8. బాల్య వివాహం – ఒక సామాజిక దురాచారం.

ప్రశ్న 17.
13 ఏళ్ళ స్వరూప్ తన ఎత్తు గురించి కలవరపడుతున్నాడు. అతడు ఎత్తు పెరుగుతాడా ? తనకి నువ్వు ఇచ్చే సలహా ఏమిటి ?
జవాబు:
1. స్వరూప్ ప్రస్తుత వయస్సు 13 సంవత్సరాలే.
2. పిల్లలు సాధారణంగా కౌమార దశ చివరి వరకు ఎత్తు బాగా పెరుగుతారు.
3. కౌమార దశ 13-19 సం|| వరకు, కాబట్టి స్వరూప్ ఇంకా కౌమార దశ మొదట్లోనే ఉన్నాడు. ఇంకా అతను 6 సం||ల వరకు ఎత్తు ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
4. 19 సం|| దాటిన తర్వాత కూడా 25 నుండి 30 సం|| వరకూ స్వల్పంగా ఎత్తు పెరిగే అవకాశం ఉన్నది.
5. కాబట్టి స్వరూప్ తన ఎత్తు గురించి కలవరపడే అవసరం లేదని నేను అతనికి సలహా .(శాస్త్రీయంగా) ఇస్తాను.

ప్రశ్న 18.
మీ పాఠశాలలో ఉన్న రెడ్ రిబ్బన్ క్లబ్ నిర్వహించే కార్యక్రమాలు మెరుగుపరచుకోవడానికి ఏవైనా ఐదు సలహాలు సూచించండి.
జవాబు:
1. మా పాఠశాలలో ‘కౌమార విద్య’ పై అవగాహన కల్పిస్తూ వాటి కార్యక్రమాల రూపకల్పన మరియు నిర్వహణ కోసం రూపొందించబడిన వాలంటరీ జట్టునే ‘రెడ్ రిబ్బన్ క్లబ్’ అంటారు.
2. చాలామంది దీనిని HIV / AIDS కార్యక్రమ ప్రచారం కోసమే అని భావిస్తారు. కానీ అది తప్పు.
3. ఇది కౌమార దశలో ఉన్న టీనేజర్లు చేసే తప్పులను చేయకూడదని చెప్తూ వారిని చైతన్యపరచి వారి భావోద్వేగాల నియంత్రణకు అవసరమైన కార్యక్రమాలను రూపకల్పన చేస్తుంది.

ఈ క్లబ్ నిర్వహణ మెరుగుపడడానికి కొన్ని సూచనలు :

  1. క్లబ్ నిర్మాణం పారదర్శకంగా ఉండాలి.
  2. సమూహాన్ని జట్లుగా విభజించి ప్రతి జట్టుకు నిర్దిష్టమైన బాధ్యతలను, విధులను కేటాయించాలి.
  3. వీరందరినీ సమన్వయపరచటానికి ఒక ఉపాధ్యాయినీ (బాలికలకు), ఒక ఉపాధ్యాయుడు (బాలురకు) విడిగా ఉండాలి.
  4. చేసిన కార్యక్రమ వివరాలు విధిగా ‘ఒక రిజిస్టరు నందు నమోదు చేయాలి.
  5. ఈ క్లబ్ నిర్వహణ ‘ఒక సామాజిక బాధ్యత’గా పాఠశాల ఉపాధ్యాయులు స్వీకరించాలి.

8th Class Biology 5th Lesson కౌమార దశ InText Questions and Answers

కృత్యములు

1. పట్టికను గమనించండి. క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
జవాబు:
బాల బాలికల వయస్సు ఆధారంగా ఉండవలసిన సగటు ఎత్తు.
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 5
(a) ఏ వయస్సుకు చేరుకున్న తర్వాత అబ్బాయిలలో ఎత్తు పెరుగుదల దాదాపుగా ఆగిపోయింది?
జవాబు:
18 సం|| వయస్సు నాటికి అబ్బాయిలలో పెరుగుదల 100% పూర్తి అవుతుంది.

(b) అమ్మాయిలలో పెరుగుదల ఏ వయస్సులో వేగంగా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు ?
జవాబు:
అమ్మాయిలలో పెరుగుదల 8 సంవత్సరాల నుండి వేగంగా ప్రారంభమై 16 సం|| పూర్తి అవుతుంది.

(c) అమ్మాయిల్లో పెరుగుదల ఏ వయసులో ఎక్కువగా జరుగుతుంది ?
జవాబు:
అమ్మాయిల్లో పెరుగుదల ప్రధానంగా 11 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య ఎక్కువగా (4%) జరుగుతుంది.

(d) అబ్బాయి, అమ్మాయిలలో ఎవరు వేగంగా పెరుగుతారు ? ఎట్లా చెప్పగలవు ?
జవాబు:
1. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలలో పెరుగుదల రేటు అధికం అనిపిస్తుంది.
2. మొదట అమ్మాయిలు వేగంగా పెరిగినప్పటికీ 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల సమానంగా ఉంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

(b) మీ సంపూర్ణ ఎత్తు ఎంతో ఎలా లెక్కకట్టగలవు ? (పేజీ నెం. 70)
జవాబు:
1. దీనికి నా ప్రస్తుత వయస్సు ఎంతో కావాలి.
2. తరువాత ఈ వయస్సులో ఎంత ఎత్తు ఉన్నానో తెలియాలి.
3. చివరగా ఎత్తు పెరుగుదల శాతం, ఈ వయస్సుకు ఎంతో తెలియాలి.
అంటే నా ప్రస్తుత వయస్సు = 14 సం||
నా ప్రస్తుత ఎత్తు = 130 సెం.మీ.
ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం = 92
ఈ విషయాలను కింది సూత్రంలో ప్రతిక్షేపించాలి.
నా సంపూర్ణ ఎత్తు = ప్రస్తుత ఎత్తు / ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం × 100 = [latex]\frac {130}{92}[/latex] × 100 = 141.3 సెం.మీ.
నేను టీనేజ్ పూర్తయ్యే నాటికి 141.3 సెం.మీ. ఎత్తు పెరుగుతాను. అంటే ఇంకా 11.3 సెం.మీ. ఎత్తు పెరుగుతానన్న మాట!
(దీనికి అనుబంధంగా వయస్సు, పెరుగుదల శాతం గల పట్టిక సహాయం తీసుకోవాలి)

ఎత్తు అంచనావేద్దాం.

ప్రశ్న 2.
నీ స్నేహితులు ఆరుగురిని ఎంపిక చేసి వారి ప్రస్తుత ఎత్తు, భవిష్యత్ ఎత్తు ఎలాప్రశ్న అంచనా వేస్తావో చెప్పు. (పేజీ నెం. 71)
జవాబు:
సూత్రం : మీ సంపూర్ణ ఎత్తు = ప్రస్తుత ఎత్తు (సెం.మీ.లలో) / ఉండవలసిన పూర్తి ఎత్తు శాతం × 100
(పట్టిక – 1లోని సమాచారం ఉపయోగించుకున్నాను.)
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 6

మీ శరీరంలో మార్పులు పరిశీలిద్దాం.

3. మీ పాఠశాలలోని లేదా మీ తరగతిలోని స్నేహితుల ఆరోగ్య కార్డులను గమనించి కింది పట్టిక పూరించండి. మీ పరిశీలనలు రాయండి. (పేజీ నెం. 71)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 7
పరిశీలనలు :
1. కౌమార దశలో శారీరక మార్పులు వేగంగా జరుగుతాయి.
2. అమ్మాయిల కంటే అబ్బాయిల భుజాలు వెడల్పుగా మారాయి.
3. అమ్మాయిలలో నడుం కింద భాగం వెడల్పుగా మారడం గమనించాము. (ఈ మార్పు ముందు ముందు బిడ్డకు జన్మ నివ్వడంలో తోడ్పడుతుంది.)

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

4. మీ స్నేహితుని ప్రవర్తన మీ ప్రవర్తనలు కింది చెక్ లిస్ట్ తో సరిపోతాయో లేదో సరిచూసుకోండి. దానిని బట్టి నువ్వు ఏ ఏ విషయాలు గమనించావో తెలపండి.
జవాబు:
చెక్ లిస్ట్ :
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 8
పై చెక్ లిస్టు ఆధారంగా చేసుకుని ఈ కింది విషయాలు అర్థం చేసుకున్నాను.

  1. బాల్యంలో చేసే పనులకు, కౌమార దశలో చేసే పనులకు తేడా ఉంటుంది.
  2. ఈ దశలో బాలబాలికలు స్వతంత్రంగా వ్యవహరిస్తారు.
  3. శారీరక, మానసిక మార్పులు వస్తాయి.
  4. ఉద్వేగానికి, అయోమయానికి లోనయ్యే దశలో మేమున్నాం అని గుర్తించాం.
  5. కొత్త ఆలోచనల వెల్లువ మనసులో ఏర్పడుతుంది.
  6. కొత్త విషయాలు అన్నీ తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది.
  7. మానసిక ఒత్తిడి ఉంటుంది.
  8. అనుమానాలు, సంశయాలు తీర్చే ఉపాధ్యాయులన్నా, పెద్దలన్నా చాలా గౌరవభావం ఏర్పడుతుంది. (కౌమార దశలో ప్రకృతి సహజంగా ఉన్న రహస్యాల గురించి దాచి పెట్టకుండా అన్నింటినీ నివృత్తి చేయాలి.)

పాఠ్యాంశములోని ప్రశ్నలు

ప్రశ్న 1.
చిన్న పిల్లలు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు గొంతును బట్టి అమ్మాయా, అబ్బాయో చెప్పగలమా ? (పేజి నెం. 72)
జవాబు:
చిన్న పిల్లల గొంతును బట్టి అబ్బాయో, అమ్మాయో చెప్పలేము. ఇద్దరి గొంతు ఒకే విధంగా ఉంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 2.
మాట్లాడేవారు అబ్బాయో, అమ్మాయో ఎప్పుడు ఎలా చెప్పగలుగుతాం ? (పేజి నెం. 72)
జవాబు:
యుక్త వయస్సు వచ్చిన తర్వాత అబ్బాయిల గొంతు గంభీరంగా మారి అమ్మాయిల కంటే విభిన్నంగా ఉంటుంది. అప్పుడు గొంతు ఆధారంగా అబ్బాయో, అమ్మాయో చెప్పలేము.

ప్రశ్న 3.
కౌమార దశలో సాధారణంగా మగపిల్లల కంఠస్వరంలో మార్పు ఎందుకు వస్తుంది ? (పేజి నెం. 72)
జవాబు:
కౌమార దశలో మగపిల్లల స్వరకోశం పరిమాణంలో పెద్దదిగా పెరుగుతుంది. దీనినే ఆడమ్స్ యాపిల్ అంటారు. దీని పరిమాణం పెరగటం వలన గొంతు గంభీరంగా ఏర్పడి ఆడవారి నుండి విభేదిస్తుంది.

ప్రశ్న 4.
ప్రత్యుత్పత్తి దశలను, ప్రత్యుత్పత్తి దశల క్రమాన్ని ఫ్లోచార్టు రూపంలో రాయండి. ఫ్లోచార్టు ఆధారంగా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (పేజి నెం. 74)
AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ 9

(a) స్త్రీలలో అండం విడుదల చాలా రోజుల వరకు కొనసాగుతుందా ?
జవాబు:
స్త్రీలలో అండం విడుదల దాదాపు 50 నుండి 55 సంవత్సరాలపాటు కొనసాగుతుంది.

(b) ఒక వేళ అండం విడుదల ఆగిపోతే ఏం జరుగుతుంది ?
జవాబు:
1. అండం విడుదల కాకపోతే, ఫలదీకరణ జరగదు.
2. కావున కొత్త జీవులు ఏర్పడవు.

(c) ఫలదీకరణ చెందిన అండాలు ఏమవుతాయి ?
జవాబు:
1. ఫలదీకరణ చెందిన అండాలు సంయుక్త బీజంగా మారతాయి.
2. సంయుక్త బీజం గర్భాశయంలో జీవిగా ఎదుగుతుంది.

(d) ఫలదీకరణ జరగకపోతే ఏమౌతుంది ?
జవాబు:
1. ఫలదీకరణ జరగకపోతే జీవులు ఏర్పడవు.
2. జాతి అంతరించి పోతుంది.

(e) అసలు అండమే విడుదల కాకపోతే ఏమౌతుంది ?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తికి అండము తప్పనిసరి. అసలు అండము విడుదల కాకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. దానివలన కొత్త జీవులు రూపొందవు.

AP Board 8th Class Biology Solutions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 5.
NPEGEL కార్యక్రమం ద్వారా పాఠశాలలో అమ్మాయిలకు నాప్ కిన్లు అందజేస్తున్నారు. మీ పాఠశాలలో ఈ పథకంలో భాగంగా ఏ ఏ కార్యక్రమాలు చేస్తారో రాయండి. (పేజీ నెం. 79)
జవాబు:
NPEGEL కార్యక్రమం మా పాఠశాలలో

  1. ఆరోగ్య విద్య మీద చర్చ నిర్వహిస్తారు.
  2. కౌమార దశలో శారీరక శుభ్రత ప్రాధాన్యత వివరిస్తారు.
  3. ఉద్వేగ నియంత్రణ అంశంపై క్లాసులు నిర్వహిస్తాడు.
  4. మంచిగా ఆలోచించటం, కలిసి జీవించటం వంటి అంశాలపై అవగాహన ఏర్పరుస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం – సంరక్షణ

SCERT AP 8th Class Biology Study Material Pdf 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 6th Lesson Questions and Answers జీవ వైవిధ్యం – సంరక్షణ

8th Class Biology 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
దీనిని చదివి కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
జీవవైవిధ్యం – 2050 :
జవాబు:
అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు COP-2012 Hyd (Conference of Parties) తీర్మానాల ప్రకారం వచ్చే 4 దశాబ్దాలలో భూమిపై గల సహజవనరులు గడ్డిమైదానాలు, కొండలు, మంచు మరియు శీతోష్ణ. సమశీతోష్ణ మైదానాలకు మాత్రమే పరిమితం అవుతాయి. 2050 నాటికి జీవవైవిధ్య నష్టం అంచనాలకు మించిపోతుంది. శీతోష్ణస్థితి మార్పు దీనికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. దాదాపు 1.3 మిలియన్ల సహజ ఆవరణ వ్యవస్థలలో ఎలాంటి సహజ జీవజాతులు ఉండవు. (దిగువ రంగు ప్రాంతాలు జీవవైవిధ్య నష్ట సూచికలు. నీలిరంగు ప్రాంతాలు గరిష్ఠ జీవవైవిధ్య నష్టాన్ని సూచిస్తుంది).
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 1
ఎ. సూచిక రంగు ప్రాంతం (కలర్ కోడ్) ఏమి సూచిస్తుంది ?
బి. ఏ ప్రాంతం గరిష్ఠ జీవవైవిధ్య నష్టాన్ని సూచిస్తుంది ?
సి. ఏయే ప్రాంతాలు కనిష్ఠ జీవవైవిధ్య నష్టాన్ని సూచిస్తున్నాయి ?
డి. 2010 నుండి 2050 వరకు జీవవైవిధ్య పరిస్థితిలో గమనించిన మార్పులేవి ?
ఇ. జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు ఏం చర్యలు సూచించగలవు ?
(సి.ఒ.పి. – 2012 జీవవైవిధ్యం, హైదరాబాద్ వారి సౌజన్యంతో)
జవాబు:
ఎ. జీవవైవిధ్య నష్ట సూచికలను చూపిస్తుంది.
బి. 1) కెనడా పై ప్రాంతం.
2) ఐరోపా ఖండంపై ప్రాంతాలు.
3) దక్షిణాఫ్రికాలో … జీవవైవిధ్య నష్టం ఎక్కువ ఉంది.

సి. 1) దక్షిణ అమెరికా పై భాగం.
2) ఆస్ట్రేలియా ఖండం.
డి. దాదాపు 1.3 మిలియన్ల ప్రదేశాలలో ఎలాంటి జీవజాతులూ ఉండవు.
ఇ. ప్రకృతిని గౌరవించి, అన్ని జీవుల ప్రాముఖ్యతను గుర్తించి, వాటి సంరక్షించాలి.
1. జీవ వైవిధ్యంపై ప్రజలలో, పిల్లల్లో అవగాహన కల్పించాలి.
2. ప్రభుత్వాలు దీనిపై కృతనిశ్చయంతో కార్యక్రమాలను రూపకల్పన చేయాలి.
3. ఇది ఒక సామాజిక బాధ్యతగా అందరూ భావించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 2.
అడవులు జీవావరణ నిల్వలని ఎలా చెప్పగలవు ? తగిన కారణాలు రాయండి.
జవాబు:

  1. అడవులలో వృక్ష, జంతు జాతులు, క్రిమికీటకాలు అనేకం ఉంటాయి.
  2. ఒకే జీవిలో ‘వైవిధ్యం ఉన్న జాతులను, ప్రజాతులను అడవులలో మనం చూడవచ్చు.
  3. అడవులలో ఉన్న సజీవ, నిర్జీవ వనరులు పరిసరాలు ఈ జీవరాశులకు వైవిధ్యం ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నాయి.
  4. ఇక్కడ జీవరాశులు తమ సహజ ప్రత్యుత్పత్తి పద్ధతుల ద్వారా, పరాగ సంపర్కం ద్వారా, విత్తన వ్యాప్తి ద్వారా, ఒక దానిపై ఒకటి ఆధారపడి, ఒకదానితో ఒకటి సహజీవనం చేస్తూ తమ మనుగడ కొనసాగిస్తాయి.
  5. కాబట్టి అడవులను జీవావరణ నిల్వలని మనం చెప్పవచ్చు.

ప్రశ్న 3.
జీవవైవిధ్యం అంటే ఏమిటి ? జీవుల్లో వైవిధ్యాలు ఉంటాయని ఎలా చెప్పగలవు ?
జవాబు:
జీవవైవిధ్యం :
1. మొక్కలు, జంతువుల్లో కనపడే వైవిధ్యాలను జీవవైవిధ్యం అంటారు.
2. ఉదాహరణకు 1. ‘మందార’ మొక్కను తీసుకుందాం. 100 ఎర్రమందార మొక్కలు ఒక్కచోటే ఉన్నాయనుకోండి. అది జీవవైవిధ్యం కాదు.
3. కానీ అదే ప్రదేశంలో (ఆవరణ వ్యవస్థలో)
30 ఎర్ర మందారాలు, 10 తెల్ల మందారాలు, 10 ముద్ద మందరాలు, 10 రేక మందారాలు, 20 గులాబి రంగు మందారాలు, 20 వివిధ రంగు రేకులు గల మందారాలు ఉన్నాయనుకోండి. ఈ ప్రదేశం జీవవైవిధ్యం ఆరోగ్యంగా ఉన్న ఆవరణ వ్యవస్థ అని గుర్తించబడుతుంది. 4. ఒక ఆవరణ వ్యవస్థలో గడ్డి మాత్రమే ఉండకూడదు. దానితో పాటు ఇంకా రకరకాల మొక్కలు, జంతువులు, కీటకాలు ఉండాలి.
5. కోడిలో అడవి కోడి, నీటి కోడి, నాటు కోడి లాంటి వైవిధ్య జాతులు ఉండాలి.
6. ‘జాతి’ ఒకటే అయినా వాటి బాహ్య, అంతర నిర్మాణంలో వివిధ లక్షణాలు ఉంటే ఇది వైవిధ్యంగా గుర్తించబడుతుంది.
7. సూక్ష్మ జీవ ప్రపంచంలో కూడా వైవిధ్యం బాగా కనపడుతుంది.
8. మానవులలో కూడా ప్రదేశాన్ని, ఖండాన్ని బట్టి వైవిధ్యం ఉంటుంది.
ఉదా : వెస్టిండియన్లు – ఇండియన్లు – అమెరికన్లు.

ప్రశ్న 4.
ఈ పదాలను మీరు ఎలా అర్థం చేసుకున్నారు ? వివరించండి.
ఎ. అంతరించిన జాతులు
బి. ఆపదలో ఉన్న జాతులు
సి. ఎండమిక్ జాతులు
జవాబు:
ఎ) అంతరించిన జాతులు : భూమిపై నున్న ఆవరణ వ్యవస్థలలో పూర్తిగా కనబడకుండా అంతరించిపోయిన జాతులను అంతరించిన జాతులు అంటారు.
ఉదా : డైనోసార్లు, హంసల్లాంటి తెల్ల కొంగలు మొ॥. ఇక ఇలాంటి జీవులను మనం తిరిగి భూమిపై చూడలేము.
బి) ఆపదలో ఉన్న జాతులు : భూమిపై నున్న ఆవరణ వ్యవస్థలలో సంఖ్యాపరంగా బాగా తక్కువగా ఉన్న జాతులను ఆపదలో ఉన్న జాతులు అంటారు. 1) అవి నివసించే ప్రాంతాలు మానవుని వల్ల నాశనం చేయబడటం వల్ల అవి నివాసం కోల్పోయి ఆపదలో పడతాయి.
సి) ఎండమిక్ జాతులు : భూమిపై ఒక ప్రత్యేక ఆవాసానికి పరిమితమైన జాతులను ఎండమిక్ జాతులు అంటారు.
ఉదా : (1) కంగారూలు ఆస్ట్రేలియాలోనే ఉంటాయి. (2) కోపిష్టి మదపుటేనుగులు ఆఫ్రికా అడవులలోనే ఉంటాయి. (3) ఒంగోలు జాతి గిత్తలు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాయి. (కానీ ఈ మధ్య వీటిని కృత్రిమ గర్భధారణ ద్వారా బ్రెజిల్ లో పెంచుతున్నాం)

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 5.
పులిని సంరక్షించడానికి చర్యలు చేపట్టినప్పుడు పులితో పాటు సంరక్షించాల్సిన అంశాలు ఏవి ?
జవాబు:
1. పులిని సంరక్షించాలని అనుకున్నప్పుడు మొదట అడవులను సంరక్షించాలి.
2. వాటి ఆహారమైన చిన్న జంతువుల సంరక్షణ చేపట్టాలి.
3. పులులలో జనాభా లెక్కించేటప్పుడు ఆడ, మగ పులుల కచ్చితమైన సంఖ్యను తీసుకోవాలి.
4. వాటి ప్రజననానికి తగిన ఏర్పాటు అడవిలో చేయాలి. (లేదా కృత్రిమ ప్రజననమునకు ఏర్పాటు చేయాలి) (ప్రజననము అంటే ప్రత్యుత్పత్తి)
5. పులులు నీటి గుంటలు, వాగుల వద్దకు దాహం తీర్చుకోవటానికి వస్తాయి. వీటిలో నీటి ప్రవాహం వుండేలా చూడాలి. (వాగులపై లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చిన్న (చెక్ డామ్ లు) ఆనకట్టలు కడుతున్నారు. వేసవిలో నీటిని అడవిలోని దిగువ ప్రాంతానికి వదిలేలా చర్యలు తీసుకోవాలి.)
6. పులుల వేటను పూర్తిగా నిషేధించాలి.
7. ఇవి ఎక్కువ రాత్రిపూట అడవిలో సంచరిస్తాయి. అందువల్ల రాత్రిపూట స్వేచ్ఛగా అడవిలో తిరిగే అవకాశం కల్పించాలి. (శ్రీశైలం అడవులలో రాత్రి 10 గం|| తరువాత వాహనాలను అడవిలోకి అనుమతించరు. పులులు స్వేచ్ఛగా ఒక చోట నుండి మరోచోటకు వెళ్ళాలి. అప్పుడే వాటి ప్రజననం సులువవుతుంది).

ప్రశ్న 6.
మానవ కార్యకలాపాలు ఏ విధంగా జీవ వైవిధ్యానికి నష్టం కలిగిస్తున్నాయి ? జీవవైవిధ్య ఆవశ్యకతను ప్రజలు గుర్తించటానికి చేపట్టవలసిన చర్యలు ఏమిటి ?
జవాబు:
జీవవైవిధ్యానికి నష్టం కలిగిస్తున్న మానవ కార్యకలాపాలు :

  1. అడవులను నరికి, వ్యవసాయానికి, నివాసానికి వినియోగించటం.
  2. కాలుష్యాన్ని పెంచటం.
  3. ఇళ్ళన్నీ కాంక్రీటుతో నిర్మించటం. పిచ్చుకల లాంటి వాటికి నష్టం కలుగుతోంది.
  4. సెల్ టవర్ నుండి వచ్చే రేడియేషన్.
  5. ఇంటిలో, ‘పెరడు’ లేకుండా అంతా రాళ్ళు సిమెంటుతో నేలను కప్పటం.
  6. విదేశీ ఆక్రమణ జాతులను ఎక్కువగా పెంచటం (హైదరాబాద్ పావురాళ్ళు).
  7. జంతువుల, మొక్కల సహజ నివాసాన్ని ధ్వంసం చేయటం.

చేపట్టవలసిన చర్యలు :

  1. అడవుల నరికివేతను తగ్గించాలి.
  2. సామాజిక అడవుల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
  3. ఇంటిలో కనీసం కొద్ది స్థలంలోనైనా ‘పెరడు’ ఉంచి మొక్కలు పెంచాలి.
  4. పక్షులకు ప్రత్యేక సంరక్షణ కల్పించాలి. (పాలపిట్ట కొన్ని జిల్లాల్లో, కొన్ని మండలాల్లో కనిపించకుండా పోతోంది)
  5. సెల్ టవర్ల నిర్మాణాలను నియంత్రించాలి.
  6. స్థానిక జాతులను, ప్రజాతులను పెంచటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
  7. ప్రకృతిలో ప్రతి జీవి ముఖ్యమైనది. దాని పాత్ర దానికి నిర్దేశించబడివుంది అన్న సత్యం గమనించాలి. ‘జీవించు – జీవించనివ్వు’ (Live – Let Live)
  8. జీవుల పట్ల భూత దయ చూపాలి.
  9. పిల్లలకు అవగాహన (NGC), (WWF) ల ద్వారా కల్పించాలి.
  10. అందమైన ఒకే జాతి జీవుల పట్ల ఆకర్షితమవకుండా, వేరు వేరు రకాలకు, జాతులకు సంబంధించిన మొక్కలను, జంతువులను అభివృద్ధి చేయాలి.

ప్రశ్న 7.
ఈ కింది వాటిలో ఆపదలో వున్న, ఎండమిక్ జీవులను గుర్తించి పటాల కింద పేరు రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 2
జవాబు:
1. ఎండమిక్ జీవులు :
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 3
2. ఆపదలో వున్న జీవులు :
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 4

ప్రశ్న 8.
పక్షుల వలస వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి ?
జవాబు:
1. వాతావరణ ప్రతికూలతల వల్ల ప్రత్యుత్పత్తి జరుపుకొనటానికి పక్షులు వాటి సహజ నివాసం వీడి మరొక చోటుకు (మారటాన్ని) వెళ్ళటాన్ని ‘వలస’ అంటారు.
2. దీని వెనకున్న శాస్త్రీయ కారణాలు :
(i) ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే అతివేడి, అతిశీతల పరిస్థితులు పక్షుల ప్రజననానికి (ప్రత్యుత్పత్తికి) ఆటంకం అవుతుంది.
(ii) ఈ ప్రతికూల పరిస్థితులలో పిల్ల పక్షులు తట్టుకోలేక చనిపోయే అవకాశం ఉంటుంది.
(iii) మంచు గడ్డకట్టే ప్రాంతాలలో, మంచు ధారాళంగా కురిసే శీతాకాలంలో పక్షులు గుడ్లు పెట్టి పొదగటం, ఆహార సేకరణ, పెద్ద పక్షుల జీవనం దుర్లభమవుతుంది.
(iv) ఇలా పక్షులు నివాసం కోసం, ఆహారం కోసం, సురక్షితంగా ప్రత్యుత్పత్తి జరుపుకొనటానికి ‘వలస’ వస్తాయి. వీటిని ‘వలస పక్షులు’ అంటారు.
మనం వీటికి తగిన చెట్లు, పొదలు, తావులను సంరక్షిస్తూ అవి వచ్చి వెళ్లటానికి సాయం చేయాలి.

ప్రశ్న 9.
ఈ రోజుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు మన నివాసాల్లో చొరబడుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది ? కొన్ని కారణాలు తెలుసుకోవడానికి నీవు ఏమేమి ప్రశ్నలడుగుతావు ?
జవాబు:

  1. చిరుతలు అడవిలో ఉండాలి. మరి జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి ?
  2. వాటి నివాసయోగ్యమైన అడవి ప్రాంతం తగ్గిందా ?
  3. అడవిలో వాటికి ఆహారం, నీరు దొరకటం లేదా ?
  4. అవి స్వేచ్ఛగా తిరుగుతూ నివసించే ప్రాంతంలోకి మనం వెళ్ళామా ? వాటి నివాసాలలో మన ఆవాసాలు నిర్మించామా?
  5. ఎలుగుబంట్లు ఇష్టంగా తినే పుట్టతేనె పురుగులు, చెద పురుగులు అడవిలో లభిస్తున్నాయా ? లేదా ?
  6. వాటి సంఖ్య తగ్గిపోతున్నది ? ఎందుకు ?
  7. పాములు మన ఇళ్ళల్లోకి ఎందుకు చొరబడుతున్నాయి ?
  8. చీమల పుట్టలు అరుదుగా కనిపిస్తున్నాయి. ఎందుకు ?

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 10.
మీ పరిసరాలలో ఒక ప్రాంతాన్ని ఎంచుకోండి. అక్కడ జంతువులను ఒక రోజంతా గమనించండి. ఒక జాబితా తయారుచేయండి. ఏమి గమనించారో రాయండి.
జవాబు:
మా ఊరిలో మా వీధిని ఎంచుకుని, అక్కడ ఉన్న జంతువుల జాబితాను సేకరించాను.

  1. ఆవులు
  2. గేదెలు
  3. మేకలు
  4. కోళ్ళు
  5. కొంగలు
  6. బల్లులు.
  7. తొండలు
  8. గొల్లభామలు
  9. తూనీగలు
  10. పిల్లులు
  11. కుక్కలు
  12. పందులు
  13. కాకులు
  14. గబ్బిలాలు
  15. ఎలుకలు
  16. పాములు
  17. పావురాలు (పెంపుడు)
  18. గిన్నె కోళ్ళు
  19. ఈము పక్షులు
  20. పిచ్చుకలు (విదేశీ ఆక్రమణ జాతి)

కింది విషయాలు గమనించాను :

  1. కొంగలు ప్రత్యేక సమయంలోనే వచ్చి వెళ్ళే వలస పక్షులు.
  2. గబ్బిలాల సంఖ్య తక్కువ ఉంది. (రేడియేషన్ వల్ల)
  3. పాముల సంఖ్య తక్కువయిందని మా నాన్న అన్నారు. (వీటిని విషపూరితమైనవని చంపటం ఒక కారణం.)
  4. పావురాలు పెంచుకుంటున్నారు.
  5. 5 నుండి 10 వరకు ఏమేరిన్ కుక్క పిల్లలు ఉన్నాయి.
  6. పిచ్చుకల సంఖ్య బాగా తక్కువగా ఉంది.
  7. పాలపిట్ట అసలు కనిపించలేదు.

ప్రశ్న 11.
ఇప్పుడు మరియు 30 ఏళ్ళ క్రితం ఉండే జంతువులు/పక్షుల జాబితాను తయారుచేయండి. ఇందుకోసం పెద్దల సహాయం తీసుకోండి. కొన్ని జంతువులు ప్రస్తుతం కనిపించక పోవటానికి గల కారణాలేమిటో రాయండి.
జవాబు:
మా తాతయ్య, ఆయన మిత్రుల సాయంతో నేను ఈ క్రింది జాబితా తయారుచేశాను.
(i) జంతువులు : 1. హైనాలు 2. అడవి పిల్లి 3. నీటి పిల్లి (ఫిషింగ్ పిల్లి). 4. చిరుత పులులు 5. ఉడుములు 6. ముంగిసలు 7. ముళ్ళ పందులు 8. జడల బర్రె 9. తోడేళ్ళు 10. అడవి తాబేళ్ళు
(ii) పక్షులు : 1. రాబందులు 2. గ్రద్దలు 3. నెమళ్ళు . 4. పిచ్చుకలు (సంఖ్య తగ్గింది) 5. నీటి కోళ్ళు 6. పాలపిట్టలు (సంఖ్య తగ్గింది) 7. కౌజు పిట్టలు (కనుజు) 8. ఎర్ర కాకులు 9. ఊర పిచ్చుకలు.

కారణాలు :

  1. అడవులను నరికివేయటం.
  2. హానికర క్రిమిసంహార మందులు పంటలపై, వాడటం.
  3. గాలిలో రేడియేషన్ ప్రభావం ఎక్కువ అవటం. (ఇది సెల్ ఫోన్లు, సెల్ టవర్ల నుండి వచ్చే రేడియేషన్)
  4. ప్రజననానికి ఆటంకం ఏర్పడటం.
  5. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల మనుగడ కొనసాగించటం కష్టమవుతున్నది.
  6. ఆధునిక వ్యవసాయ పద్ధతులు. (వరి గూళ్ళు, గాదెలు ప్రస్తుతం తగ్గి, గోడౌన్లలోనే ఎక్కువగా నిల్వ చేస్తున్నారు.) (వరికోత యంత్రాల వల్ల వరికుప్ప (గూళ్ళు) వేసే అవసరమే వుండటంలేదు.)

ప్రశ్న 12.
ఒక వృక్షాన్ని ఆవరణ వ్యవస్థగా తీసుకుని దానితో సంబంధం ఉన్న మొక్కలు, జంతువులను నమోదు చేయండి.
జవాబు:

  1. ఒక వృక్షాన్ని ఒక ఆవరణ వ్యవస్థగా పరిగణించినప్పుడు దీనితో అనేక మొక్కలు, జంతువులు సంబంధం కలిగి ఉంటాయి.
  2. దీనిపై పరాన్నజీవులైన చిన్న మొక్కలు చెట్టు కాండం, శాఖలపై పెరుగుతాయి.
  3. చెట్టుపై అనేక కీటకాలు, తుమ్మెదలు వచ్చి వెళ్ళుతూ ఉంటాయి.
  4. అనేక పక్షులు, చిలుకలు, కాకులు, పిచ్చుకలు నివాసం ఏర్పర్చుకుంటాయి.
  5. వలస పక్షులలాంటి కొంగలు వచ్చి వాటి గూడులను ఏర్పర్చుకుంటాయి.
  6. కొంత కాలం తరువాత అవి వెళ్ళిపోతాయి.
  7. చెట్టు బెరడు కింద చెద పురుగులు ఉంటాయి.
  8. వీటిని తినడానికి వడ్రంగి పిట్టలు వస్తాయి.
  9. తేనెటీగలు తేనెతెట్టును పెట్టి నివశిస్తాయి.
  10. ఉడతలు చెట్టుపై తిరుగుతూ ఉంటాయి.
  11. కుక్కలు, గేదెలు, ఆవులు చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటాయి.
  12. పసిరిక పాములు చెట్టుపై నివాసముంటాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 13.
ఇంటర్నెట్ లేదా గ్రంథాలయం పుస్తకాల సహాయంతో భారతదేశంలోని పక్షి సంరక్షణ కేంద్రాల సమాచారం సేకరించి జాబితా తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 5

ప్రశ్న 14.
భారతదేశానికి వలస వచ్చే పక్షుల జాబితాను తయారుచేయండి.
జవాబు:
శీతాకాలం వలస వచ్చే పక్షులు :

  1. సైబీరియన్ కొంగలు
  2. గ్రేటర్ ఫ్లెమింగో పక్షులు
  3. రఫ్ పక్షులు
  4. నల్లరెక్క కొంగలు
  5. కామన్ టీల్
  6. యెల్లో వ్యాగ్ టేల్
  7. వైట్ వ్యాగ్ టేల్
  8. రోసీ పెలికాన్
  9. వుడ్ శాండ్ పైపర్
  10. స్పాటెడ్ శాండ్ పైపర్

వేసవికాలం వలస వచ్చే పక్షులు :

  1. ఏసియన్ కోయల్
  2. కుకూస్
  3. కోంచ్ డక్
  4. యురేషియం గోల్డెన్ ఓరియల్ .
  5. బ్లూ చీక్ డ్ బీ ఈటర్
  6. బ్లూ టైల్డ్ బీ ఈటర్
  7. బ్లాక్ క్రోడ్ నైట్ హెరోన్.

ప్రశ్న 15.
సమీపంలో గల అటవీశాఖ కార్యాలయాన్ని సందర్శించి అచ్చటి స్థానిక మొక్కలు, జంతువుల సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
మా పాఠశాల దగ్గరలో ఉన్న అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్టర్ గార్ని, కలసి ఈ కింది సమాచారం సేకరించాము.
మా ప్రాంత సమీప అడవిలో ఉన్న మొక్కలు :

  1. టేకు చెట్లు
  2. మద్ది చెట్లు
  3. విప్ప చెట్లు
  4. తునికి చెట్లు
  5. వాక్కాయల చెట్లు
  6. బుడంకాయల తీగ
  7. రేగు చెట్లు
  8. నక్కేరుకాయల చెట్లు
  9. పల్లేరు కాయల తీగ
  10. పరిక్కాయ చెట్టు
  11. పాలచెట్టు
  12. వెదురు పొదలు
  13. తుమ్మచెట్లు
  14. జిట్రేగు చెట్లు
  15. నార వేప
  16. బూరుగు దూది చెట్లు
  17. దేవదారు
  18. అడవి నారింజ
  19. గిన్నె చెట్టు
  20. దాల్చిన చెక్క, లవంగ చెట్టు (చింతపల్లి అడవులు)

జంతువులు :

  1. పాల పిట్ట
  2. మొసలి
  3. ఎలుగుబంట్లు
  4. లేడి
  5. కొండచిలువలు
  6. పాములు (గోధుమ త్రాచు)
  7. రక్తపింజర
  8. కుందేళ్ళు
  9. నక్కలు
  10. అడవి కుక్కలు
  11. నీటి కోళ్ళు
  12. గువ్వ పిట్టలు (చిన్నపొదలో ఉంటాయి)
  13. గోరింకలు
  14. ఉడుము (అతితక్కువ ఉన్నాయట)
  15. అడవిదున్న
  16. మనుబోతులు
  17. అడవి పందులు
  18. నెమళ్ళు (మా ప్రాంతంలో అతితక్కువ)
  19. దుప్పి
  20. చిరుతపులి (ఒక్కటే ఉందని రేంజర్ గారు చెప్పారు)

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 16.
జీవవైవిధ్యంపై సమావేశాలు నిర్వహించాల్సిన అవసరమేమిటి ? ఈ సమావేశాలపై సమాచారం సేకరించి అవి ఎక్కడ – ఎప్పుడు ఏ ఉద్దేశంతో నిర్వహించారో రాయండి.
జవాబు:
1. జీవవైవిధ్యంపై అవగాహన కోసం, అన్ని దేశాల ప్రజలు సమష్టిగా ఈ భూమిని ఎక్కువ జాతులతో నిలకడగా, సమతుల్యంగా ఉంచే ఉద్దేశ్యంతో ఈ జీవ వైవిధ్య సమావేశాలు జరుగుతాయి.
2. వీటివల్ల పూర్తిగా అంతరించిపోయే జాతుల సంరక్షణ, పరిరక్షణ జరపటానికి అవకాశం ఉంటుంది.
3. ఈ సమావేశాలలో ప్రపంచ దేశాలకు దిశా నిర్దేశం చేయబడుతుంది.
4. అందువల్ల జీవవైవిధ్య సదస్సులు జరపటం అవసరం.

సదస్సుల వివరాలు :
1. ప్రపంచ జీవవైవిధ్య సదస్సు – 2012 – హైదరాబాద్ – ఆంధ్రప్రదేశ్ – ఇండియా
2. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘ సమావేశం – జేజూ – దక్షిణ కొరియా

ప్రశ్న 17.
భూమిపై అధిక జీవవైవిధ్యం ఎక్కడ కనిపిస్తుంది ? ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో అత్యధిక జీవవైవిధ్యం గల ప్రాంతాలు గుర్తించండి.
జవాబు:

  1. భూమిపై అధిక జీవవైవిధ్యం అడవులలో మాత్రమే కనిపిస్తున్నది.
  2. అడవులలో ఒకే జాతి మొక్కలు, జంతువుల మధ్య వైవిధ్యం కనబడుతుంది.
  3. అడవిని కాపాడుకోవటం మన కర్తవ్యం.
  4. ‘అడవి’ జీవావరణాన్ని నిల్వ చేసే ఒక ప్రదేశంగా చెప్పవచ్చు.
  5. కానీ దురదృష్టవశాత్తు మనుషులే అడవులను నాశనం చేస్తూ, జీవవైవిధ్యాన్ని దెబ్బ తీస్తున్నారు.

ప్రశ్న 18.
మానవ క్రియల వల్ల మన జీవవైవిధ్యానికి ఎక్కువ నష్టం చేకూరింది. వీటిని రక్షించే కొన్ని మార్గాలను సూచించండి.
జవాబు:
మానవ క్రియల వల్ల జీవవైవిధ్యానికి నష్టం జరిగింది. దీనిని రక్షించే కొన్ని మార్గాలు.

  1. అడవులను సంరక్షించాలి.
  2. జంతువుల, మొక్కల సహజ ఆవాసాలు ధ్వంసం చేయకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలి.
  3. వంట చెరకు సేకరణను ఆపి కిరోసిన్, గ్యా స్లతో వంట చేసుకోవాలి.
  4. పేపర్ వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించాలి.
  5. పేపర్ రీ సైక్లింగ్ ప్రక్రియను ప్రోత్సహించాలి.
  6. వన్య ప్రాణులను అమ్మటం, చంపటం చేయకుండా విదేశాలకు ఎగుమతి చేయకుండా చట్టాన్ని కఠినం చేసి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
  7. పొలాలలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగంపై నియంత్రణ వుండాలి.
  8. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి.
  9. పిల్లలకు జీవవైవిధ్యం పై అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించి ప్రోత్సహించాలి.
  10. పారిశ్రామిక అవసరాలకు ప్రకృతి. వనరుల వినియోగం సున్నితమైన అంశం. దీనిపై ప్రజల, ప్రజాసంఘాల పర్యావరణ కార్యకర్తల అభిప్రాయాలు గౌరవించాలి.
  11. మనం అభివృద్ధి కోసం ఎంతైతే అడవులను నాశనం చేశామో, అదే విస్తీర్ణంలో వేరే బీడు, మైదాన ప్రాంతాల్లో అడవుల పెంపకం చేపట్టాలి.

ప్రశ్న 19.
పలు రకాల మొక్కలు, జంతువులతో కూడిన పార్కు వన్యసంరక్షణ కేంద్రం లేదా జంతు ప్రదర్శనశాల చూసినప్పుడు మీ సంతోషాన్ని ఎలా వ్యక్తపరుస్తారు ? కొన్ని వాక్యాలలో తెలపండి.
జవాబు:
1. వన్య సంరక్షణ కేంద్రంలో సంరక్షింపబడుతున్న పక్షులను చూసినపుడు చాలా ఆనందం, గొప్ప అనుభూతి కలుగుతుంది.
2. వాటిని నేను మునుపెన్నడూ చూడలేదు. వాటిని చూస్తే ఎంతో ఆనందంగా అనిపించింది.
3. రంగు, రంగు పూలమొక్కలు, వాటి ఉపయోగాలు అక్కడ తెలుసుకుని ఆశ్చర్యపడ్డాను.
4. రకరకాల మందు మొక్కలు, వాటి నుండి తయారయ్యే మందుల పేర్ల గురించి నాకు మునుపెన్నడూ తెలియదు. తెలుసుకున్న తర్వాత సంబరం అనిపించి వాటి ఉపయోగాన్ని నా స్నేహితులతో పంచుకుని మరింత ఆనందించాను.
5. అడవిలో పెరిగి సంచరించే పులి, సింహాలను చూసి మొదట భయపడ్డాను. కానీ తరువాత వాటిని ఇంకా ఇంకా చూడాలనిపించింది.
6. కోతులు, కొండముచ్చులు చేసే చిలిపి చేష్టలు నవ్వు తెప్పించాయి.

ప్రశ్న 20.
జీవవైవిధ్య సంరక్షణ పై మాట్లాడుకు ఒక ఉపన్యాస వ్యాసం తయారుచేయండి.
జవాబు:
ఉపయోగపడేదీ, ఉపయోగపడనిదీ ఏదైనప్పటికీ ప్రతి చెట్టుకు, జంతువుకు భూమిపై జీవించే హక్కు ఉందని గ్రహించడమే జీవవైవిధ్య సారాంశం. ప్రతిజీవి ఆవరణ వ్యవస్థలోని భాగమే. ఏ జీవి నశించినా (అది ఎండమిక్ కావచ్చు లేదా ఇతర ఆవాసాలలో ఉండవచ్చు) ఆవరణ వ్యవస్థలోని ఆహార గొలుసులు, ఆహార జాలకంపై దాని ప్రభావం ఉంటుంది.

దీని మూలంగా ప్రపంచ జీవవైవిధ్యం ప్రభావితం అవుతుంది. కాబట్టి భూమిపైన జీవవైవిధ్యాన్ని రక్షించాలంటే ముందుగా మనం ప్రకృతి పరిరక్షణలో భాగస్థులం కావాలి. తరువాత ఇతరులకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. ఈ రోజు కొన్ని జాతులు అంతరించిపోతే, రేపు అంతరించిపోయే జాబితాలో మనం ఉంటాం.

జీవవైవిధ్యాన్ని సంరక్షించుకోవడం అంటే అటవీ వనరులను అతిగా కాకుండా మితంగా వినియోగిస్తూ ఆవరణ వ్యవస్థలపై ఎలాంటి దుష్ప్రభావం చూపకుండా జాగ్రత్త వహించడం. ఇలా చేయటం వలన అడవులు నిరంతరం అభివృద్ధి చెందుతూ ముందు తరాలకు జీవ వైవిధ్యాన్ని అందించగలుగుతాయి.

ప్రకృతి మానవ అవసరాలకే గాని మానవ అత్యాశలకు కాదు. మానవులుగా మనం ఎప్పుడూ ప్రకృతిని మన అవసరాలకు ఎలా వినియోగించాలి అనే కోణంలో ఆలోచించాం కాని ! ప్రకృతిని ఎలా సంరక్షించుకోవాలి అనే కోణంలో ఆలోచించలేదు. మానవుడు ప్రకృతిలోని ఒక భాగం మాత్రమే. యావత్ ప్రకృతి కాదు. ప్రకృతిని సంరక్షిస్తే అది మనలను రక్షిస్తుంది.

ప్రశ్న 21.
జీవవైవిధ్య సంరక్షణ మన ఇంటి నుండే మొదలు అవుతుందని రాణి చెప్పింది. ఇది సరైనదేనా ? ఆమెను నీవు ఎలా సమర్థిస్తావు ?
జవాబు:
అవును. రాణి అన్నది నిజమే. నేను రాణిని సమర్థిస్తాను. ఎందుకంటే

  1. జీవుల సంరక్షణ మన ఇంటి నుండి ప్రారంభమవ్వాలి.
  2. మన ఇల్లు ‘ప్రకృతి’ అనే పెద్ద ఆవరణలో ప్రాథమిక ఆవాసం.
  3. దీనిలో జీవవైవిధ్యం ఉంటే, అది మన బజారుకి, అక్కడ నుండి గ్రామానికి, పట్టణాలకి, నగరాలకి, రాష్ట్రాలకి, దేశానికి, దేశ దేశాలకు విస్తరిస్తుంది.
  4. ఇది ఎవరో ఒక్కరే చేసే పనికాదు.
  5. ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఇది అందమైన కలసికట్టుగా, సామాజిక బాధ్యతగా భూతదయ ఉన్న మానవులుగా మనందరం చేయవలసిన ముఖ్యమైన పని.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 22.
ప్రజల్లో జీవవైవిధ్యంపై అవగాహన కలిగించుటకు కొన్ని నినాదాలు లేదా ఒక కరపత్రం చేయండి.
జవాబు:
నినాదాలు :
1. జీవవైవిధ్యాన్ని కాపాడుదాం. మనల్ని మనం కాపాడుకుందాం.
2. జీవించు – జీవించనివ్వు.
3. జీవుల మనుగడే – జీవవైవిధ్యం నిలకడ.
4. జీవించే హక్కు – ప్రకృతిలో ప్రతి జీవి హక్కు.

8th Class Biology 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ InText Questions and Answers

కృత్యములు

1. ‘పరిసరాల నమూనా’ నువ్వు తయారుచేయగలవా ? (పేజీ నెం. 84)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 6
నేను చేయగలను. ఉదాహరణకు మా ఇంటి చుట్టూ ఉన్న పరిసరాల పటంలో వివిధ మొక్కలు, జంతువులు మొ|| వాటిని గుర్తించి నమూనా చిత్రం గీస్తాను.
ఇది మా ఇల్లు రంగు సూచిక (Colour Code)
1. మొక్కల – మొ – లేత ఆకుపచ్చ (మొక్కలు)
2. మొక్కలు – మొ – ముదురు ఆకుపచ్చ (చెట్లు)
3. జంతువులు – జ – ఎరుపు
4. మనుషులు – మ – ముదురు నీలిరంగు
5. పక్షులు – ప – గులాబి రంగు
6. కీటకాలు – కీ – గోధుమరంగు
7. చేపలు – చే – లేత నీలిరంగు

(a) చార్టులో ఎన్ని రంగులు గుర్తించావు ?
జవాబు:
చార్టులో ఏడు రంగులు గుర్తించాను.

(b) అది ఏమి తెలుపుతుంది ?
జవాబు:
ఆ ప్రాంతంలో విభిన్న రకాల మొక్కలు, జంతువులు గురించి తెలుపుతుంది.

(c) రంగు సూచికలోని మొత్తం సంఖ్య దేనిని తెలియచేస్తుంది ?
జవాబు:
రంగు సూచికలోని మొత్తం సంఖ్య జీవవైవిధ్యాన్ని సూచిస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

2. ప్రకృతి పరిశీలన (పేజీ నెం. 85)
జవాబు:
సమీపంలోని అడవులలో (సాధ్యమైతే) ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు లేదా పొలాలు, తోటలు సందర్శించినపుడు ఇలాంటి అధ్యయనాన్ని (సర్వే) నిర్వహించండి.

మీ పరిశీలనలో ఏవీ తప్పిపోకుండా, మరచిపోకుండా జాగ్రత్త పడండి. పక్షుల గూళ్ళు, సాలీడు గూళ్ళు, పురుగులు, కీటకాలు, నాచుమొక్కలు, శిలీంధ్రాలు మొదలైనవన్/నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

అలాగే అధ్యయనం చేస్తున్నప్పుడు పక్షుల గూళ్ళు మొదలైన ఆవాసాలను కదిలించరాదు. ఇది వరకు వాడిన రంగుసూచికలనే వినియోగిస్తూ నమూనా చిత్రం తయారు చేయండి. అడవుల్లో ఉండే వన్యజీవులలోని వైవిధ్యం మనలను ఆశ్చర్యపరుస్తుంది. ఇలా చేద్దాం

(a) ప్రకృతిలో మిమ్మల్ని అధికంగా ఆకర్షించినదేది ?
జవాబు:
ప్రకృతిలో మా ఊరి చెరువు, దాని ప్రక్కన ఉన్న దేవాలయం నన్ను అధికంగా ఆకర్షించాయి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, అందంగా, హాయిగా ఉంటుంది.

(b) వీటిని పరిశీలించినపుడు మీ పరిసరాల గురించి ఎన్నో ఆలోచనలు స్ఫురించి ఉంటాయి. ఆలస్యం చేయకుండా సంకోచించకుండా మీ ఆలోచనలు రాయండి.
జవాబు:

  1. ప్రకృతి చాలా అందమైనది, మనోహరమైనది.
  2. ఇది ఎన్నో జీవులకు ఆశ్రయం కల్పిస్తుంది. జీవితాన్ని ప్రసాదిస్తుంది.
  3. మనం కూడా ప్రకృతిలో ఒక ప్రాణిగా జీవించాలి.
  4. ప్రకృతిని మనం పాడుచేయకూడదు.
  5. మన అవసరాలకు ప్రకృతి స్వభావాన్ని నాశనం చేయరాదు.
  6. జీవించు – జీవించనివ్వు అనేది అందరికి ఆదర్శం కావాలి.

(c) రెండు నమూనా చిత్రాలను పోలుస్తూ మీ పరిశీలనలు రాయండి.
జవాబు:
పాఠ్యపుస్తకంలోని పటంతో పోల్చితే నేను గీచిన పటాలలో పచ్చదనం తక్కువగా ఉంది. అంటే మా ప్రాంతంలో చెట్లు తక్కువగా ఉన్నాయి. కావున జీవవైవిధ్యం కూడా తగ్గుతుంది. జీవవైవిధ్యం పెంచటానికి చెట్ల సంఖ్యను పెంచాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

3(a) మొక్కలలో వైవిధ్యం ఉందని నువ్వు ఎలా చెప్పగలవు ? (పేజీ నెం. 85)
జవాబు:
ఏవైనా రెండు మొక్కలను (ఉదా : మందార, మల్లె) గమనిస్తే
AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 7
దీని ద్వారా మొక్కలలో వైవిధ్యం ఉందని మనకు తెలుస్తుంది.

(b) జంతువులన్నీ ఒకేలా ఉంటాయా ? నీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు:
జంతువులన్నీ ఒకేలా ఉండవు. వైవిధ్యాలు (తేడాలు, భేదాలు, అనేక వేరు వేరు లక్షణాలు) ఉంటాయి.
ఉదా : గేదె, ఆవు (రెండూ క్షీరదాలే అయినా)

గేదెలు ఆవులు
1. ఇవి నల్లగా ఉంటాయి. 1. ఇవి నల్లగా, ఎర్రగా, తెల్లగా, మచ్చలుగా, కూడా ఉంటాయి.
2. ఇవి ఎండను తట్టుకోలేవు. 2. ఎండను భరిస్తాయి.
3. వర్షానికి బెదరవు. 3. వర్షంలో గడపటానికి అంతగా ఇష్టపడవు.
4. పాలు చిక్కగా ఉంటాయి. 4. పాలు పలుచగా ఉంటాయి.
5. పనిచేసే సామర్థ్యం తక్కువ. 5. కష్టమైన పనులు కూడా చేస్తాయి.
6. చలాకీతనం తక్కువ. 6. చలాకీగా, హుషారుగా ఉంటాయి.

4(a) నీకు తెలిసిన క్రికెట్ ఆటగాళ్ళ ఫోటోలు సేకరించి వారి మధ్య తేడాలు రాయగలవా ? (పేజీ నెం. 86)
జవాబు:

వెస్టిండియన్లు ఆస్ట్రేలియన్లు
1. జుట్టు రింగులుగా, నల్లగా ఉంది.

2. శరీరం నలుపు రంగులో ఉండి మెరుస్తోంది.

3. ముక్కు చివర్లు ఉబ్బినట్లు వున్నాయి.

4. పెదవులు పెద్దగా వున్నాయి.

5. కంటిపాప నల్లగా వుంది.

6. శారీరక దారుఢ్యం సాధన చేస్తే వచ్చినట్లుగా కనపడుతుంది.

1. జుట్టు తిన్నగా, రాగి రంగులో ఉంది.

2. శరీరం తెల్లగా, పాలినట్లుగా ఉంది.

3. ముక్కులు ఆకర్షణీయంగా వున్నాయి.

4. పెదవులు ఆకర్షణీయంగా వున్నాయి.

5. కంటిపాప పిల్లి కళ్ళలా వున్నాయి.

6. శారీరక దారుఢ్యం పుట్టుకతో వచ్చినట్లు వుంటుంది.

(b) కింది ప్రశ్నలు చర్చించండి. సారాంశాన్ని కింద రాయండి.

ప్రశ్న (i)
పూర్తిగా ఒక దానిదానితో మరొకటి పోలిన జీవులు ఉన్నాయా ?
జవాబు:
లేవు.

ప్రశ్న (ii)
వాటి మధ్యలో భేదాలు ఎందుకు ఉన్నాయి ?
జవాబు:
ఏ జీవి మరో జీవిలా ఉండదు. దాని ప్రత్యేకత ఉంటుంది. ఇది దాని నిర్మాణంపై, దాని ఆహార అలవాట్లు, నివాస ఆ ప్రాంత ప్రభావం ఉంటుంది.

ప్రశ్న (iii)
మొక్కలన్నీ తీగల మాదిరిగా పాకేవి అయితే ఏమవుతుంది ?
జవాబు:
1. మొక్కలన్నీ తీగలైతే నడవటానికి చోటుండదు.
2. జంతువులకు నీడ ఉండదు.
3. భూమిలో నీరు ఇంకదు.
4. విత్తన వ్యాప్తికి ఆటంకం కలుగుతుందని చర్చలో పాల్గొన్న నా మిత్రులు చెప్పారు.

ప్రశ్న (iv)
కోడికి, మేకకు కాళ్ళలో భేదం ఉందా ? లేదా ?
జవాబు:
ఉంది. కోడి కాళ్ళు చిన్నవి ; వీటి వేళ్ళ మధ్య చర్మం వుంది.
మేక కాళ్ళు పెద్దవి, వీటి వేళ్ళు గోర్లు గిట్టలుగా మారాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న (v)
పక్షుల గూళ్ళు ఒకే రకంగా ఉన్నాయా ?
జవాబు:
ఉండవు. కారణం ఒక్కొక్క పక్షి ఆకారం, దాని సౌకర్యాల మీద ఆధారపడి గూడు ఉంటుంది.
కాకి – పెద్ద పుల్లలతో గూడుకడతే – గిజిగాడు సన్నని తీగలు, కొబ్బరి ఆకు ఈనెలతో చిత్రంగా గూడు కడుతుంది.

5. మానవుడు కూడా ప్రకృతిలో ఒక భాగమేనా ? మీరేమంటారు ? (పేజీ నెం. 92)
జవాబు:
అవును. మానవుడు కూడా పక్షులు, జంతువులు మాదిరిగానే ప్రకృతిలో ఒక భాగమే !

  1. ఎందుకంటే వాటితో పాటే మనం. వాటి మీద ఆధారపడి మనం ఇన్ని లక్షల సంవత్సరాలు జీవించాం.
  2. కానీ ఇప్పుడు మన కార్యకలాపాల వల్ల ప్రకృతి నాశనం అవుతుంది.
  3. దీని వల్ల జీవవైవిధ్యం నాశనమవుతుంది.
  4. ప్రకృతి లేకపోతే మానవ మనుగడే ఉండదు.
  5. అన్ని జీవులలాగా మానవుడు కూడా ప్రకృతిలో ఒక భాగం అని నా అభిప్రాయం.

పాఠ్యాంశములోని ప్రశ్నలు

ప్రశ్న 1.
రంపచోడవరం పులులు ఎందుకు అంతరించాయి ? (పేజీ నెం. 87)
జవాబు:
1. రంపచోడవరంలో రంగు మట్టితవ్వకాలు వలన వందల ఎకరాల అటవీ భూమి తగ్గిపోయింది.
2. అందుకే పులుల సంఖ్య తగ్గింది.

ప్రశ్న 2.
మన దేశంలో పులులు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ?
జవాబు:
అవును. శ్రీశైలం అడవులలో కనిపిస్తున్నాయి.

ప్రశ్న 3.
రంపచోడవరం నెమళ్ళ సంఖ్య పెరిగింది. కారణం ఏమిటి ?
జవాబు:

  1. రంపచోడవరంలో రంగు మట్టి కోసం తవ్వకాలు చేసారు.
  2. అందువల్ల అడవి పలుచబడింది.
  3. ఆవాసం లేక పాములు బయట సంచరించాయి.
  4. అవి నెమళ్ళ కంటపడ్డాయి.
  5. పాములు నెమళ్ళకు ఇష్టమైన ఆహారం కాబట్టి అవి ఎక్కువ పాముల్ని తిన్నాయి.
  6. ఆహారం పుష్టిగా ఉంది. కాబట్టి ప్రత్యుత్పత్తిలో ఎక్కువ సఫలత వచ్చి నెమళ్ళ సంఖ్య పెరిగింది.

ప్రశ్న 4.
అడవిని, అడవి జీవులను కాపాడటంలో టైగర్ ప్రాజెక్ట్ ఎలా ఉపయోగపడింది ? అసలు అలు (పేజీ నెం. 92)
జవాబు:
1. పులిని కాపాడాలంటే అడవిని కాపాడాలి.
2. అడవిని కాపాడితే అది జీవవైవిధ్యపు నిల్వగా మారి ఎన్నో రకాల మొక్కలు, జంతువులు, పక్షులకు ఆవాసంగా మారుతుంది.
3. ఇలా అడవిని సంరక్షించటం అంటే పులుల సంరక్షణే !

ప్రశ్న 5.
ఇదివరకు పులులు ఉండి, ఇప్పుడు తగ్గితే అది జింకలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
జవాబు:
1. పులుల ఆహారం ఎక్కువగా జింకలే !
2. పులులు తగ్గితే జింకల జనాభా పెరుగుతుంది కదా !

AP Board 8th Class Biology Solutions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 6.
జింకల సంఖ్య పెరిగితే మొక్కల పరిస్థితి ఏమిటి ?
జవాబు:
1. జింకలు గడ్డిని, మొక్కలను, వేరుశనగ, కందిచెట్లను తింటాయి.
2. పులులు తగ్గి, జింకల సంఖ్య పెరగటం వల్ల, అవి మొక్కలను తింటాయి కాబట్టి మొక్కల సంఖ్య బాగా తగ్గుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

SCERT AP 8th Class Biology Study Material Pdf 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 7th Lesson Questions and Answers వివిధ ఆవరణ వ్యవస్థలు

8th Class Biology 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థను ఎలా నిర్వచిస్తావు ? సరైన ఉదాహరణతో వివరించండి.
జవాబు:
1. సజీవులు, నిర్జీవులు వాతావరణ కారకాలు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ వున్న ప్రకృతి యొక్క మూల ప్రమాణం అని నేను నిర్వచిస్తాను.
2. ఎందుకంటే ‘ఆవరణ వ్యవస్థ’లో ఈ మూడు ముఖ్యమైనవి.
ఉదా : ఇల్లు ‘ఒక’ ఆవరణ వ్యవస్థగా తీసుకుంటే, ఇంటిలో మనుషులు, కీటకాలు, చీమలు, ఈగలు, బల్లులు, మొక్కలు, పక్షులు ఇవన్నీ సజీవులు. మట్టి, కుర్చీలు, కర్రలు, గ్యాస్, గ్యాస్ పొయ్యి, పాత్రలు, దుస్తులు, సైకిళ్ళు, కార్లు, పుస్తకాలు ఇవన్నీ నిర్జీవులు.
3. ఇంటిలోని వాతావరణం – గాలి, ఉష్ణోగ్రత, నీరు, గాలిలో తేమ ఇవన్నీ వాతావరణ కారకాలు. వీటి మధ్య బంధం ఉంటుంది. ఇది నిలకడగా కొనసాగుతుంది. అందువల్ల మన ఇంటిని ‘ఒక ఆవరణ వ్యవస్థగా’ చూడవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 2.
జీవవైవిధ్యం ఆవరణవ్యవస్థను బలోపేతం చేయడానికి ఎలా దోహదపడుతుందో వివరించండి.
జవాబు:

  1. అనేక జాతులు, లక్షణాలు, భేదాలు గల జీవుల అభివృద్ధినే ‘జీవవైవిధ్యం’ అంటారు.
  2. ‘ఆవరణ వ్యవస్థ’ బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దీనిలో జీవవైవిధ్యం ఉండాలి.
  3. ఒక ‘పార్కును’ తీసుకోండి. దీనిలో ఒక్క ‘గడ్డి’ (పచ్చిక) ఉంటే సరిపోతుందా ?
  4. లేదు. పార్కులో అనేక రకాల మొక్కలు, పూల మొక్కలు, తీగలు, పొదలు, గుల్మాలు, అలంకార మొక్కలు, చెట్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి. అది చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
  5. ఒకే జాతి కాకుండా, దీనిలోనే ఎన్నో ప్రజాతులు ఉండేలా చేస్తే ఎక్కువ జీవవైవిధ్యం ఉంటుంది.
  6. ఒక ఆవరణ వ్యవస్థలో జీవవైవిధ్యం ఎక్కువ ఉంటే అది మంచి ఆవరణ వ్యవస్థగా కొనసాగుతుంది.

ప్రశ్న 3.
ఆవరణ వ్యవస్థలో ఎలుకలు ఉన్నాయి. అందులో ఎక్కువ పిల్లులను ప్రవేశపెడితే ఏమవుతుంది ?
జవాబు:

  1. ఒక ఆవరణ వ్యవస్థలో ఎలుకలు ఉన్నాయి. వాటి సంఖ్య ఆ వ్యవస్థ శక్తి ప్రసరణకు అనుకూలంగా ఉంది.
  2. అక్కడి ఆహార గొలుసుకు అనుబంధంగా వాటి సంఖ్య ఉంది.
  3. మరి మనం కావాలని ఎక్కువ పిల్లులను ఈ ఆవరణ వ్యవస్థలోకి వదిలామనుకోండి.
  4. ఇవి (పిల్లులు) ఎక్కువ ఎలుకలను చంపివేస్తాయి. తద్వారా ఎలుకల సంఖ్య బాగా తగ్గి పిల్లుల సంఖ్య బాగా పెరిగి ఆవరణ వ్యవస్థ ‘సమతాస్థితి’ దెబ్బ తింటుంది.

ప్రశ్న 4.
ఈ క్రింది వాటిలో ఉత్పత్తిదారుడు ఏది ? ఎందుకు?
ఎ) నక్క
బి) శిలీంధ్రం
సి) కోడి
డి) గడ్డి
జవాబు:
పైన పేర్కొన్న నాలుగింటిలో ‘గడ్డి’ని ‘ఉత్పత్తిదారు’గా నేను భావిస్తాను. ఎందుకంటే
ఎ) నక్క – ఇది మాంసాహారి. తృతీయ వినియోగదారుని హోదాలో ఆహార జాలకంలో వుంది.
బి) శిలీంధ్రం – ఇది విచ్ఛిన్నకారి. కుళ్ళిన పదార్థాలపై నివసిస్తూ శక్తిని తీసుకుని, జీవిస్తూ ఆ పదార్థాలలో ఉన్న పోషకాలను తిరిగి మృత్తిక (భూమిపై పొర) లోనికి పంపుతుంది.
సి) కోడి – ఇది సర్వ భక్షకాహారి. ద్వితీయ వినియోగదారు హోదాలో ఉంది. పై మూడూ కాదు.
డి) గడ్డి – పచ్చిక – ఇది సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆహారాన్ని తయారు చేస్తుంది. కాబట్టి ఇది ‘ఉత్పత్తిదారుడు’.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 5.
ఆవాసానికి, ఆవరణవ్యవస్థకు మధ్య తేడా ఏమిటి ?
జవాబు:

ఆవాసము ఆవరణ వ్యవస్థ
1. ఇది నివసించే ప్రదేశాన్ని తెలియచెప్పే పదం.

2. మొక్కలు, జంతువులు పెరిగే చోటు.

3. దీనిలో నిర్జీవ అంశాల ప్రస్తావన ఉండదు.

4. వాతావరణ కారకాలు, వాటి ప్రభావం ఇక్కడ పట్టించుకోరు.

1. ఇది ఆ ప్రదేశంలోని సజీవ, నిర్జీవ, వాతావరణ కారకాల మధ్య సంబంధాన్ని వివరించే పదం.

2. మొక్కలు, జంతువుల మధ్య సంబంధాన్ని కొనసాగించే ఒక మూల ప్రమాణం.

3. నిర్జీవ అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి.

4. ఇక్కడ వాతావరణ కారకాల ప్రభావం కీలకం అని భావిస్తారు.

6. నేనెవరిని ?

ప్రశ్న (అ)
నేను ఆహారపు గొలుసులో ప్రధాన మూలం.
జవాబు:
గడ్డి – ఉత్పత్తిదారులు

ప్రశ్న (ఆ)
నేను ఆహారం కోసం ఇతరులపై ఆధారపడతాను.
జవాబు:
వినియోగదారులు – జంతువులు, క్షీరదాలు, మానవులు.

ప్రశ్న (ఇ)
నేను చనిపోయిన మొక్కల, జంతువుల శరీరాలను కుళ్ళింపచేస్తాను.
జవాబు:
విచ్ఛిన్నకారులు – బాక్టీరియా, శిలీంధ్రాలు.

ప్రశ్న 7.
మొక్క పులి, కుందేలు, నక్క, గ్రద్ద.
పై వాటిలో ఏదైనా సంబంధాన్ని తెలుసుకోగలరా ? పై జాబితా నుండి కుందేలును తీసివేస్తే ఏమి జరుగుతుంది ?
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 1

  1. ఈ జంతువులు, మొక్కలు ఒక ఆహార జాలకంలో భాగమై ఉన్నాయి.
  2. వేరు, వేరు ఆహార గొలుసులలో ఉన్నా ఒకే జాలకంలో ఉన్నాయి కాబట్టి వీటి మధ్య పరస్పర ‘సంబంధం’ ఉంది.
  3. ఇవి ఒక దానిపై మరొకటి ప్రభావం చూపుతాయి.
  4. మొక్క – ఉత్పత్తిదారు; కుందేలు – ప్రాథమిక వినియోగదారు. నక్క, పులి, గద్ద – తృతీయ వినియోగదారులు.
  5. పై జాబితా నుండి కుందేలును తీసివేస్తే, నక్కకు ఆహారం అందదు – నక్కల సంఖ్య తగ్గుతుంది.
  6. అలాగే గడ్డి తినే కుందేలు లేకపోవటం వల్ల ఆవరణ వ్యవస్థలో గడ్డి ఎక్కువ పెరుగుతుంది. దాంతో కీటకాల సంఖ్య, పురుగుల సంఖ్య పెరిగి ఆవరణ వ్యవస్థ ‘సమతాస్థితి’ లయ తప్పుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 8.
మీ దగ్గరలోని పార్ము/తోటను సందర్శించి అక్కడ మీరు పరిశీలించిన మొక్కల, జంతువుల వివరాలు సేకరించి పేజీ. నంబరు 110 లోని పట్టిక నింపి నివేదిక తయారుచేయండి.
జవాబు:
అడవి పేరు : నల్లమల
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 2
నివేదిక :

  1. నేను శ్రీశైలంలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించాను. అది అనేక వృక్ష, జంతు జాతులను కలిగి ఉంది.
  2. మద్ది, టేకు, వేప, రావి, మర్రి వంటి పెద్ద పెద్ద వృక్షాలు ఉండి అనేక పక్షులకు, జంతువులకు ఆవాసంగా ఉంటున్నాయి.
  3. రాగి, బలుసు, వెంపలి వంటి చిన్న మొక్కలు పొదలుగా ఏర్పడ్డాయి. వీటిలో కుందేలు వంటి చిన్న జంతువులు నివసిస్తున్నాయి.
  4. అడవిలో కుందేలు, జింకలు, దుప్పులు వంటి శాకాహార జంతువులు ఉన్నాయి.
  5. వీటిని ఆహారంగా తీసుకొంటూ, పులులు, సింహాలు, నక్కలు వంటి మాంసాహారులు ఉన్నాయి.
  6. పక్షులలో నెమలి, చిలుకలు, పిచ్చుకలు వంటి విభిన్న జీవులు ఉన్నాయి.
  7. అడవి మంచి జీవవైవిధ్యాన్ని కలిగి ఉంది.

ప్రశ్న 9.
మీ పొలంలో లేదా పాఠశాల తోటలో పరిశీలించి ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు విచ్ఛిన్నకారుల జాబితాను తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాల ఆవరణను పరిశీలించి ఈ కింది జాబితాను తయారు చేశాను.
1. ఉత్పత్తిదారులు : మొక్కలు, పచ్చిక, అశోక చెట్లు, బంతి చెట్లు, క్రోటన్లు, కాగితపు పూల చెట్లు, విప్ప చెట్టు, వేప చెట్టు, పాల చెట్టు, సపోటా చెట్టు, కొబ్బరి మొక్కలు.
2. వినియోగదారులు : విద్యార్థులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు (మానవులు), కప్పలు, వాన కోయిలలు, కీటకాలు, మేకలు, పశువులు, బల్లులు, తొండలు, పక్షులు, గబ్బిలం.
3. విచ్ఛిన్నకారులు : పుట్ట గొడుగులు, లైచెన్లు (కర్రలపై పెరిగే తెల్ల పెచ్చుల్లాంటి జీవులు).

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 10.
ఎడారి జంతువులు ఏ ఏ అనుకూలనాలను పొందినాయో మీ పాఠశాల గ్రంథాలయంలో పరిశీలించి పట్టిక తయారు చేయండి.
జవాబు:

  1. సగటు వర్షపాతం అతి తక్కువగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాన్ని ‘ఎడారి’ అంటారు.
  2. ఇక్కడ పెరిగే మొక్కలు, జంతువులు తమకు తాము కొన్ని మార్పులు చేసుకుని అనుకూలనాలు పొంది జీవించటానికి పాటుపడుతుంటాయి.
  3. జంతువులలో కింది అనుకూలనాలను మనం గమనించవచ్చు.
    1. ఎడారిలో జంతువుల సంఖ్య తక్కువ.
    2. నీటి కొరత తట్టుకునే జాతులు ఇక్కడ పెరుగుతాయి.
    3. శరీరంపై పొలుసులు గల పాములు (సరీసృపాలు) ఎక్కువ.
    4. కొన్ని రకాల కీటకాలు పైన ఉన్న కైటిన్ పొరను మందంగా అభివృద్ధి చేసుకున్నాయి.
    5. ఒంటె నీటిని తనలో దాచుకోవటానికి మొక్కల లేత కాండాలు తింటుంది. నీటిని జీర్ణాశయంలో నిల్వచేసుకుంటుంది. అందుకే దీనిని ‘ఎడారి ఓడ’ అన్నారు.
    6. వీటి శరీరం భూమి ఉపరితలానికి తగలకుండా ఇవి మార్పులు చేసుకున్నాయి.
    7. పగటి పూట జంతువులు బయట తిరగవు. రాళ్ళ క్రింద, పొదలలో, చెట్ల పైకి ఎక్కి రాత్రిపూట ఆహార వేటకు ఉపక్రమిస్తాయి. అందుకే వీటిని ‘నిశాచరులు’ అంటారు.

ప్రశ్న 11.
‘ఆహార జాలకం’ అంటే మీరేమి అవగాహన చేసుకున్నారు ? ఆహార జాలకాన్ని మీ సొంత మాటలతో వర్ణించండి. రేఖాచిత్రం ద్వారా ఆహారజాలకం గురించి నీకేం అవగాహన అయింది. మీ సొంత ఆహారజాలకం చిత్రాన్ని గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 3
1. ఉత్పత్తిదారుడు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఉన్న గొలుసు లాంటి జంతువుల శక్తి మార్పిడి వ్యవస్థను ‘ఆహారపు గొలుసు’ అంటారు.
2. అనేక ‘ఆహారపు గొలుసులు’ ఒక దానిలో ఒకటి కలిసిపోయి ఒక సమూహంగా, ఆవరణ వ్యవస్థలో కొనసాగే క్రియాత్మక వ్యవస్థను ‘ఆహార జాలకం’ అంటారు.
3. దీనిలో నీటిలో మొక్కలు, నేలపై మొక్కలు, నీటిలో కీటకాలు, నేలపై కీటకాలు, జలచరాలు, ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలు, పక్షులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఉంటాయి.
4. చివరగా అతిశక్తివంతమైన తృతీయ వినియోగదారు (సింహం, పులి, గద్ద మొదలగునవి) ఉంటుంది.

ప్రశ్న 12.
మొక్కలు, జంతువుల మధ్య పరస్పర సంబంధాలపై మీ అవగాహన ఏమిటి ? దీనిని మీరు ఎలా అభినందిస్తారు ?
జవాబు:

  1. మొక్కలు స్వయం పోషకాలు మరియు ఉత్పత్తిదారులు.
  2. ఇవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వివిధ భాగాలలో నిల్వ చేస్తాయి.
  3. జంతువులు వినియోగదారులు. ఇవి మొక్కల నుండి శక్తి బదలాయింపు జరుపుకుంటాయి.
  4. తద్వారా ఇవి ఆవరణ వ్యవస్థలో పరస్పరం ఆధారపడి జీవిస్తాయి అని పరిశీలించినపుడు – వీటిని అభినందించాల్సిన అవసరం ఉంది.
  5. జంతువుల నుండి వివిధ రూపాలలో పోషకాలు నేలకు చేరి మరలా వాటిని మొక్కలు ఉపయోగించుకునేలా మారతాయి.
  6. మొక్కల జనాభా పెరుగుదలను జంతువులు నియంత్రిస్తాయి. ఎలా అంటే మొక్కలు వాటి ఆహారం కనుక.
  7. జంతువుల సంఖ్య తగ్గించాలంటే మొక్కల సంఖ్య తగ్గిపోతుంది. తద్వారా ఆహార లభ్యత లేక జంతువుల సంఖ్య తగ్గుతుంది. ఇలాంటి విషయాలు ప్రకృతిలో సర్వ సామాన్యం. కాబట్టి నేను అభినందిస్తాను.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 13.
గడ్డి – మొక్కలు – మిడత – కప్పు – పాము – గ్రద్ద – మేక – నక్క – పులి – తోడేలు – కుందేలు – వీటి సహాయంతో ఆహారజాలకం పటం గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 4

ప్రశ్న 14.
గట్టి నేల ఆవరణ వ్యవస్థలో కుందేలు మొక్కలను మాత్రమే తింటుంది. మొక్కలు పెరిగే లోపలనే అవి మొక్కలను తొందరగా తింటాయి. అలాంటప్పుడు ఆవరణ వ్యవస్థను సమతాస్థితికి తీసుకునిరావడానికి ఏమి జరగాల్సిన అవసరముంది?
జవాబు:

  1. కుందేలు మొక్కలను పెరిగే లోపల తినేస్తుంది.
  2. ఎక్కువ సంఖ్యలో మొక్కల సంఖ్య ఆవరణ వ్యవస్థలో ఉంటాయి. కాబట్టి కుందేలు పెరిగే లోపల మొక్కలను తిన్నా – పెద్దగా ప్రభావం ఉండదు. కానీ
  3. ఒక వేళ కుందేళ్ళ సంఖ్య, మొక్కలు కుందేళ్ళ నిష్పత్తి కన్నా ఎక్కువ ఉన్నట్లైతే ఆ ప్రభావం మొక్కలపై పడుతుంది.
  4. మొక్కల సంఖ్య తగ్గి, కుందేళ్ళ సంఖ్య పెరుగుతుంది.
  5. అప్పుడు వీటిపై ఆధారపడి జీవించే నక్కలు, కుక్కలు, తోడేళ్ళకు ఇవి అందుబాటులోకి వస్తాయి.
  6. లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల, వాతావరణ కారకాల వల్ల, తప్పనిసరిగా కుందేళ్ళ సంఖ్య మొక్కల నిష్పత్తికి తగినట్లుగా తగ్గించబడి, సమతాస్థితిని కొనసాగించటానికి వీలవుతుంది.

ప్రశ్న 15.
ఒకేరకమైన అలవాట్లు కలిగిన రెండు . జంతువులు ఒకే ఆవరణవ్యవస్థను ఎంచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది ? ఈ వైవిధ్యాన్ని కాపాడటానికి నీవు ఏమి చేస్తావు ?
జవాబు:

  1. ఒకేరకమైన అలవాట్లు కలిగిన రెండు జంతువులు ఒకే ఆవరణ వ్యవస్థను ఎంచుకున్నప్పుడు వాటి మధ్య పోటీ ఏర్పడుతుంది.
  2. సాధారణంగా ఈ పోటీలో తట్టుకొన్న జీవులు మనుగడను సాగిస్తాయి. మిగిలిన జీవులు నశిస్తాయి.
  3. ఉదాహరణకు ఆవు, గుర్రం ఒకే ఆహారపు అలవాట్లు కలిగి ఉంటాయి. ఈ రెండు ఒకే ప్రదేశంలో ఉన్నప్పుడు – ఆహారం కొరకు వాటి మధ్య పోటీ ఏర్పడుతుంది. తగినంత ఆహారం లభించనపుడు బలమైన జీవి మాత్రమే ఆహారం సంపాదించుకొని జీవిస్తుంది.
  4. ప్రకృతి ధర్మాలలో జీవవైవిధ్యం ఒకటి. జీవవైవిధ్యం కాపాడటానికి ఆవాసంలోని జీవుల అవసరాలను తీర్చే మార్గాలను అన్వేషించాలి.
  5. ఎక్కువ ఆహార వసతి, ఆవాసాలు ఏర్పాటు చేయటం వలన జీవవైవిధ్యం కాపాడవచ్చును.
  6. పిల్ల జీవులను సంరక్షణ చర్యలు తీసుకోవటం వలన జీవవైవిధ్యాన్ని పెంచవచ్చు.

8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers

కృత్యములు

ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థను అర్ధం చేసుకోవటానికి నీవు నిర్వహించే ప్రాజెక్ట్ వివరాలు తెలపండి. ( లేదా)
ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని తెలుసుకొనుటకు చేయు ప్రయోగంలో మీరు ఉపయోగించిన పరికరాలను పేర్కొని, ప్రయోగ విధానాన్ని రాయండి.
జవాబు:
ఉద్దేశం : ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడానికి పాఠశాల లేదా ఇంటి తోటను అధ్యయనం చేయడం.
కావల్సిన పదార్థాలు : కొలిచే టేపు, దారం, చిన్న చిన్న కట్టెపుల్లలు, భూతద్దం, గడ్డపార (hand towel).
విధానం : ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని తెలుసుకోడానికి ఈ కింది విధానాన్ని అనుసరించాలి.
1. నలుగురు విద్యార్థుల చొప్పున జట్లుగా ఏర్పడండి. మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశంలో టేపుతో కొలిచి ఒక మీటరు పొడవు, ఒక మీటరు వెడల్పు ఉండే చతురస్రాకారపు ప్రాంతాన్ని నిర్ణయించుకోండి. ఈ ప్రాంతంలో గడ్డి ఉండవచ్చు లేదా గడ్డి ఉండకపోవచ్చు (baredirt) లేదా కాలిబాట (side walk) కావచ్చు.
2. ఆ ప్రాంతానికి నాలుగు వైపులా చిన్న కర్ర ముక్కలు పాతి దారంతో చతురస్రం ఒక చదరపు మీటరు ప్రాంతం యొక్క అంచులను పటంలో చూపిన విధంగా గుర్తించండి. ఇదే మనం పరిశీలించవలసిన ప్రదేశం.
3. అధ్యయనం చేసే ప్రాంతాన్ని పరిశీలించండి. ఆ ప్రాంతంలో నివసించే మొక్కలు, జంతువులను అవసరమైతే భూతద్దంతో నిశితంగా పరిశీలించండి.
4. మీరు పరిశీలించిన జీవులన్నింటినీ మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి. మీరు ఆ ప్రాంతంలోని మట్టిని తవ్వి అందులోని జీవులన్నింటిని కూడా పరిశీలించాలి. దేనినీ వదిలివేయకుండా జాగ్రత్తగా పరిశీలించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

2. ప్రక్కపటంలోని ఆహార జాలకాన్ని పరిశీలించండి. ఈ కింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 5

ప్రశ్న (i)
ఆహార జాలకంలో ఉత్పత్తిదారులేవి ?
జవాబు:
నీటి మొక్కలు, నాచు, శైవలాలు, గడ్డి, మొక్కలు.

ప్రశ్న (ii)
వినియోగదారులేవి ?
జవాబు:
కీటకాలు, ఎలుకలు, సాలె పురుగులు, కుందేలు, జింక, పిల్లి, నక్క, కప్ప, చేప, పాము, తోడేలు, నెమలి, గుడ్లగూబ, రాబందు, గద్ద, కొంగ, పులి, సింహం.

ప్రశ్న (iii)
ఆహార జాలకం ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది ?
జవాబు:
ఆహార జాలకం ఉత్పత్తిదారుల నుంచి ప్రారంభమవుతుంది.

ప్రశ్న (iv)
ఆహార జాలకం ఎక్కడ ముగుస్తోంది ?
జవాబు:
నాల్గవ స్థాయి వినియోగదారు అయిన సింహం దగ్గర ముగుస్తోంది.

ప్రశ్న (v)
ఆహార జాలకంలోని మొక్కలు చనిపోతే ఏమవుతుంది ?
జవాబు:

  1. ఆహార జాలకంలో మొక్కలు చనిపోతే శక్తి ఉత్పత్తిచేసే అవకాశం పోతుంది.
  2. దీనితో సూర్యరశ్మి నుంచి శక్తి బదలాయింపు ఆగిపోతుంది.
  3. కొంత కాలం తర్వాత నెమ్మదిగా క్రింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి జీవులన్నీ అంతరించిపోతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

3. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ రకాల మొక్కలు, జంతు జాతుల పేర్లను పట్టికలో నింపి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
జవాబు:
అడవి పేరు : నల్లమల
ప్రదేశం : శ్రీశైలం
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 6

ప్రశ్న (i)
అన్ని రకాల అడవులలో ఒకే రకమైన వృక్ష సంపద ఉందా ! (పేజీ నెం. 110)
జవాబు:
1. ఉండదు. ఎందుకంటే ఆవరణ వ్యవస్థ ప్రదేశం మారే కొద్దీ అక్కడ వాతావరణ కారకాలు మారతాయి.
2. సూక్ష్మ, స్థూల పోషకాల లభ్యత వేరుగా ఉంటుంది.
3. కాబట్టి వైవిధ్యం ఎక్కువ మార్పుతో ఉంటుంది.
AP Board 8th Class Biology Solutions Chapter 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు 7

ప్రశ్న (ii)
అడవి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు వినియోగదారుల కంటే ఎక్కువగా ఉన్నాయా ? ఎందుకు ?
జవాబు:
1. ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువ ఉంది.
2. కారణం వినియోగదారులు తమ ఆహారం కోసం ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిదారులను వినియోగించుకుని శక్తిని పొందుతాయి.
3. సుమారుగా 1 : 20 గా వినియోగదారు ఉత్పత్తిదారు నిష్పత్తి ఉంటుంది.
ఇవి కొన్ని సార్లు పెరగవచ్చు. తగ్గవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న (iii)
అన్ని రకాల అడవులలో ఒకే రకమైన జంతువులు ఉన్నాయా ? ప్రత్యేకమైనవి ఏమైనా ఉన్నాయా ?
జవాబు:
1. అన్ని రకాల అడవులలో ఒకే రకమైన జంతువులు ఉండవు.
2. కొన్నిచోట్ల ప్రత్యేకమైన జంతువులు ఉంటాయి.
ఉదా : శ్రీశైలం, నల్లమల అడవులలో పులులుంటాయి. చిత్తూరు, శేషాచలం అడవులలో ఔషధ మొక్కలు ఎక్కువగా ఉంటాయి.

పాఠ్యాంశములోని ప్రశ్నలు

1. ఈ పటాన్ని పరిశీలించి ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (పేజీ. నెం. 105)

ప్రశ్న (ఎ)
బొమ్మలో బాణం గుర్తు ఏం సూచిస్తుంది ?
జవాబు:
బొమ్మలో బాణం గుర్తు జీవుల మధ్య ఆహార సంబంధాలను సూచిస్తున్నది.

ప్రశ్న (బి)
గడ్డి నుండి పులి వరకు ఉన్న మార్గాన్ని గుర్తించండి.
జవాబు:
గడ్డి → కుందేలు → పులి.

ప్రశ్న (సి)
కుందేలు ఎన్ని రకాల ఆహారాలపైన ఆధారపడుతుంది ? వాటి పేర్లు రాయండి.
జవాబు:
కుందేలు మూడు రకాల పదార్థాలపై ఆధారపడింది. అవి 1. క్యారెట్ 2. గడ్డి 3. గింజలు.

AP Board 8th Class Biology Solutions Chapter 7 వివిధ ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న (డి)
కుందేలుపై ఆధారపడ్డ జీవులు ఎన్ని ? వాటి పేర్లు రాయండి.
జవాబు:
కుందేలుపై నాలుగు రకాల జీవులు ఆధారపడ్డాయి. అవి 1. కొండచిలువ 2. నక్క 3. గుడ్లగూబ 4. పులి.

ప్రశ్న 2.
మొక్కలు ఆహారాన్ని ఎక్కడ నుండి గ్రహిస్తాయి ? (పేజీ.నెం. 105)
జవాబు:
1. మొక్కలు స్వయం పోషకాలు.
2. ఇవి తమ ఆహారాన్ని తామే తయారుచేసుకొంటాయి.
3. సూర్యరశ్మి, కార్బన్ డై ఆక్సైడ్, నీరులతో పత్రాలు ఆహారం తయారుచేసే ఈ ప్రక్రియను ‘కిరణజన్య సంయోగక్రియ’ అంటారు.

ప్రశ్న 3.
ఆహారం ఒక్కటే కాకుండా జంతువులు బ్రతకటానికి కావల్సిన ఇతర అంశాలు ఏమిటి ? (పేజీ.నెం. 105)
జవాబు:
జంతువులకు ఆహారంతో పాటు,

  1. నీరు
  2. గాలి
  3. ఆవాసం బతకటానికి కావాల్సి ఉంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

SCERT AP 8th Class Biology Study Material Pdf 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 8th Lesson Questions and Answers మొక్కల నుండి ఆహారోత్పత్తి

8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
గోధుమ పంటను రబీలోనే ఎందుకు పండిస్తారో కారణాలు చెప్పండి.
జవాబు:

  1. చాలా మొక్కలు పుష్పించుటకు, రాత్రి సమయానికి దగ్గర సంబంధం ఉంటుంది.
  2. గోధుమ మొక్కలు పుష్పించుటకు రాత్రి సమయం సుమారుగా 12 గంటలు కావాలి.
  3. గోధుమపంట సాగు రబీలో అనగా (అక్టోబర్, నవంబర్ మధ్య) మొదలు పెడితే అవి పుష్పించుటకు 8-10 వారాలు పట్టును.
  4. జనవరి చివరి నుంచి ఫిబ్రవరి వరకు రాత్రి సమయం సుమారుగా 12 – గంటలు ఉంటుంది.
  5. కాబట్టి గోధుమపంటను రబీలోనే సాగుచేస్తారు.

ప్రశ్న 2.
రామయ్య తన పొలాన్ని చదునుగా దున్నాడు. సోమయ్య పొలం హెచ్చుతగ్గులు ఉంది. ఎవరు అధిక దిగుబడి సాధిస్తారు? ఎందుకు ?
జవాబు:
రామయ్య ఎక్కువ దిగుబడి సాధిస్తాడు. కారణం నేలను చదును చేయడం వలన పొలంలో నీరు అన్నివైపులకు సమానంగా ప్రసరించును. పొలంలో వేసిన పశువుల ఎరువు కూడా సమానంగా నేలలో కలిసి అన్ని మొక్కలకు అందును. విత్తనాలు వేయుటకు లేదా నారు మొక్కలు నాటడానికి వీలుగా ఉండును.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 3.
పొలాన్ని దున్నడం వల్ల ప్రయోజనాలేమిటి ?
జవాబు:
పొలాన్ని దున్నడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి :

  1. మట్టి మృదువుగా మారడం వల్ల నేల లోపల నీరు చాలాకాలం నిల్వ ఉంటుంది.
  2. వేళ్ళు నేలలోకి సులభంగా చొచ్చుకొని పోవడానికి వీలు అగును.
  3. వేళ్ళకు శోషించడానికి అవసరమైన గాలి, నీరు నేలలోకి సులభంగా చేరును.
  4. రైతులకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు వంటివి మెత్తటి మృదువైన మట్టిలో బాగా పెరుగుతాయి.
  5. నేలను దున్నడం వల్ల నేల లోపల ఉన్న కొన్ని రకాల అపాయకరమైన సూక్ష్మజీవులు, క్రిమికీటకాల గ్రుడ్లు బయటికి వచ్చి సూర్యుని వేడికి నశించును.

ప్రశ్న 4.
నేనొక మొక్కను, నేను పంటపొలాల్లో పెరుగుతాను. రైతులు నన్ను చూస్తేనే పీకేస్తారు. కారణం ఎందుకో నాకు తెలియదు. నీవు చెప్పగలవా ? నేనెవరిని ?
జవాబు:
నీవు పొలాల్లో సాగు మొక్కలతో బాటు పెరిగే కలుపుమొక్కవి. రైతులు నిన్ను చూస్తేనే పీకేస్తారు. కారణం సాగు మొక్కలతో ఆశ్రయం కోసం, ఆహారం కోసం పోటీపడతావు. వాటికి చేరవలసిన పోషక పదార్థాలు నీవు గ్రహిస్తావు. అంతేకాకుండా వ్యాధుల వ్యాప్తిలో కూడా పాత్ర పోషిస్తావు.

ప్రశ్న 5.
రైతులు వరిపంటను కోసిన తర్వాత ఎండలో ఎందుకు ఆరబెడతారు. ఎందుకు ?
జవాబు:
రైతులు వరిపంటను కోసిన తర్వాత ఎండలో ఎందుకు ఆరబెడతారంటే దాని కాండంలోను, ఆకులలోను, కంకులలోను ఉన్న తేమ పోవటం కోసం. కాండంలోను, ఆకులలోను తేమ పోకపోతే కుప్పగా వేసిన తర్వాత వాటినుండి ఆవిరి వచ్చి కంకులలో ఉండే ధాన్యం రంగు మారుతుంది.
కంకులలో ఉండే తేమ పోకపోతే కంకులకు బూజు (శిలీంధ్రాలు) పడుతుంది.

ప్రశ్న 6.
వేసవి దుక్కులు అంటే ఏమిటి ? ఇవి పర్యావరణానికి ఏ విధంగా మేలుచేస్తాయో రాయండి.
జవాబు:
రైతులు వేసవికాలంలోనే తమ పొలాలను దున్నుతారు. వీటిని వేసవి దుక్కులు అంటారు. వాటివలన గాలి మట్టి రేణువుల మధ్య చేరును. అందువలన నేల గుల్లబడును. అంతేకాకుండా నేలలో క్రిములు, సూక్ష్మజీవులు కూడా నశించును. కాబట్టి పంటలు వేసినప్పుడు వ్యాధులు తక్కువగా వచ్చును. దీనివలన క్రిమిసంహారక మందులు తక్కువగా వాడుట జరుగును. ఈ విధంగా వేసవి దుక్కులు పర్యావరణానికి మేలు చేస్తున్నాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 7.
గ్రామంలో రైతులందరూ ఒకే రకమైన పంట వేశారు. దీని వలన కలిగిన నష్టాలు ఏమిటో వివరించండి.
జవాబు:
గ్రామంలో రైతులందరూ ఒకే రకమైన పంటలు వేయడం వలన చాలా నష్టాలు కలుగుతాయి. అవి :

  1. అందరూ ఒకే పంటవేస్తే విత్తన కొరత వచ్చును.
  2. అందరూ వరి వేస్తే నీటి సమస్య వచ్చి జీవరాసులపై ప్రభావం చూపును.
  3. అందరికీ ఒకే ఎరువులు కావాలి. కాబట్టి వాటి ధర కూడా పెరుగును.
  4. ఒక పొలంలో వ్యాధులు సోకితే మిగతా పొలాలకు కూడా చాలా తొందరగా వ్యాధులు వ్యాపించును. దీనివలన జీవవైవిధ్యానికి ఆటంకం వచ్చును.
  5. ఒకవేళ, అందరికీ పొలాలు బాగా పండి పంట దిగుబడి ఎక్కువ వస్తే అమ్మకపు ధర పడిపోవును.
  6. అమ్మకపు ధర తగ్గితే రైతు నష్టపోవును.

ప్రశ్న 8.
రాత్రి కాలానికి, పంట దిగుబడికి సంబంధం ఏమిటి ?
జవాబు:
రాత్రి కాలానికి, పంట దిగుబడికి చాలా దగ్గర సంబంధం గలదు. మొక్క పుష్పించడం రాత్రికాల సమయం పై ఆధారపడి ఉంది. ఉదా : కొన్ని మొక్కలు రాత్రికాల సమయం 12 1/2 గంటలు ఉన్నప్పుడు మాత్రమే అధికంగా పుష్పించును. ఉదా: గోధుమ.
మరికొన్ని మొక్కలు రాత్రికాల సమయం 12 1/2 గంటలు కన్నా ఎక్కువ ఉన్నప్పుడే బాగా పుష్పిస్తాయి. ఉదా : జొన్న, ప్రత్తి.
పుష్పించిన తర్వాత పరాగ సంపర్కం జరుగును. పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఫలదీకరణ జరుగును. ఫలదీకరణ తర్వాత పుష్పాలు కాయలుగా మారును. కాసిన దానిని బట్టే పంట దిగుబడి ఉండును.

ప్రశ్న 9.
విత్తనాలు నేలలో విత్తే ముందర శిలీంధ్ర నాశకాల వంటి రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు. ఎందుకు ?
జవాబు:
విత్తనాలు నేలలో విత్తే ముందర శిలీంధ్ర నాశకాల వంటి రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు. ఎందుకంటే నేలలో ఉన్న ఏవైనా శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవుల నుండి విత్తనాలను రక్షించుకొనుటకు రసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు.

ప్రశ్న 10.
నారు పోసి పెంచి వాటిని తిరిగి పొలాల్లో నాటే పద్ధతిలో పెంచే పంటలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
1. వ్యవసాయంలో కొన్ని పంటలను నారు పోసి పెంచి తిరిగి పంట పొలాల్లో నాట్లు వేస్తారు.
2. ఈ పద్ధతిని ప్రధానంగా వరి పంటలో పాటిస్తారు.
3. వరితో పాటుగా, మిరప, వంగ, టమోటా, పొగాకు వంటి పంటలలోనూ నాట్లు వేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 11.
సత్యనారాయణ తన పొలంలో ప్రత్తి పంట పండించాడు. అతనికి సరైన దిగుబడి రాలేదు. పంట దిగుబడి సరిగా రాకపోవడానికి గల కారణాలు ఊహించి చెప్పగలరా ? (లేదా) ఒక రైతు తన పొలంలో పత్తి పంట పండించాడు. పత్తి దిగుబడి సరిగా రాలేదు. దీనికి ఏవైనా నాలుగు కారణాలు ఊహించి రాయండి.
జవాబు:

  1. అతను వేసిన నేల ప్రత్తి పంటకు అంత అనుకూలంగా లేకపోవచ్చు.
  2. అతను పంటను రబీ సీజన్లో వేసి ఉండవచ్చు. దీనివలన అది పుష్పించుటకు కావలసిన రాత్రి సమయం (12 1/2 గంటల కంటే ఎక్కువ) ఉండదు.
  3. పొలాన్ని సరిగా దున్ని, చదును చేయకపోవచ్చు.
  4. ప్రత్తి పంటకు సరైన నీటి పారుదల వసతి కల్పించకపోవచ్చు.
  5. ప్రత్తి విత్తనాల ఎంపిక సరిగా చేయకపోవచ్చు.
  6. కలుపు మొక్కలను పత్తి పంట నుంచి తొలగించకపోవచ్చు.
  7. ప్రత్తి పంటకు. వ్యాధులు సోకిన గమనించక పోవచ్చు.
  8. ప్రత్తి పంటకు సరైన కాలంలో శిలీంధ్ర నాశకాలు ఉపయోగించటం జరగకపోవచ్చు.

ప్రశ్న 12.
రహీం తన పంట పొలంలో కలుపు మొక్కలను తొలగించాడు. కాని డేవిడ్ కలుపు తీయలేదు. ఎవరు అధిక దిగుబడి సాధిస్తారో ఊహించండి ? ఎందుకు ?
జవాబు:
డేవిడ్ ఎక్కువ దిగుబడి సాధిస్తాడు. కారణం కలుపు మొక్కలను పొలంలో కలియదున్నాడు. అవి మడి ఉన్న నీటిలో కుళ్లి పోతాయి. అప్పుడు వాటిలోని పోషక పదార్థాలు నేలలోకి చేరతాయి. అది జీవ ఎరువు వలె పని చేయును.

ప్రశ్న 13.
పిడికెడు శెనగలను నీళ్ళలో వేయండి. మీరేమి పరిశీలించారో కింది ప్రశ్నల ఆధారంగా విశ్లేషించండి.
ఎ) రెండు రకాల విత్తనాల్లో మీరేమి తేడాను గమనించారు ?
బి) ఏ విత్తనాలు తక్కువ బరువు కలిగి ఉన్నాయి ? ఎందుకు ?
సి) ఏ విత్తనాలు బాగా మొలకెత్తాయి? ఎందుకు ?
డి) ఏ విత్తనాలు సరిగా మొలకెత్తవు ? ఎందుకు ?
జవాబు:
ఎ) కొన్ని విత్తనాలు నీటిపై తేలుతున్నాయి. కొన్ని విత్తనాలు నీటిలో మునిగిపోయాయి.
బి) కీటకాలు విత్తనం లోపల గల ఆహార పదార్థాలు తినుట వలన పుచ్చులు ఏర్పడి తక్కువ బరువు కలిగి ఉన్నాయి.
సి) నీటిలో మునిగి నీటిని బాగా పీల్చుకున్న విత్తనాలు బాగా మొలకెత్తాయి. కారణం పోషక పదార్థాలలో ఉన్న షుప్తావస్థ మేలుకోవడం వలన.
డి) నీటిపై తేలిన విత్తనాల లోపల పోషక పదార్థాలు తక్కువగా ఉండబట్టి సరిగా మొలకెత్తవు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 14.
వరి (వడ్ల గింజలు) విత్తనాలు తీసుకొని ఒక రోజంతా నానబెట్టండి. వాటిని వాచ్ గ్లాస్ లో తీసుకొన్న మట్టిలో నాటండి. మొలకెత్తిన తర్వాత భూతద్దంలో పరిశీలించి ప్రథమమూలం, ప్రథమ కొండం మొదలైన భాగాలు గుర్తించి, పటం గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 1

ప్రశ్న 15.
మీ దగ్గరలోని ఎరువుల దుకాణానికి వెళ్ళి రసాయనిక ఎరువుల వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 2
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 3

ప్రశ్న 16.
వరి పంటలో నాటడం నుండి దాచడం వరకు ఉన్న వివిధ దశలను వివరించే ఫ్లోచార్టును తయారు చేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 4
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 5

ప్రశ్న 17.
తక్కువ నీటి లభ్యత గల ప్రాంతాలలో అనుసరించే నీటిపారుదల పద్ధతులను నీవెలా ప్రశంసిస్తావు?
జవాబు:

  1. తక్కువ నీటి లభ్యత గల ప్రాంతాలలో నీటిని పొదుపుగా వాడుకోవటానికి బిందు సేద్యం, స్ప్రింక్లర్స్ వంటి పరికరాలు ఉపయోగిస్తారు.
  2. వీటి వలన చాలా తక్కువ నీటితో వ్యవసాయం చేయవచ్చును.
  3. శాస్త్ర విజ్ఞానం అందించిన ఈ పద్దతులు నాకు బాగా నచ్చాయి.
  4. ఈ పద్దతుల వినియోగం వలన నీటికొరత ప్రాంతాలు ఆర్థికంగా బలపడ్డాయి.
  5. వీటి వినియోగం వలన సహజవనరు అయిన నీరు ఆదా చేయబడుతుంది.
  6. ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చే ఇటువంటి పద్ధతులు అభినందనీయమైనవి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 18.
నరేంద్ర ప్రత్తిపంటపై అధిక మోతాదులో క్రిమిసంహారక మందులు చల్లాడు. ఇది జీవవైవిధ్యానికి, పంట దిగుబడికి ఎంతో హానికరం అని రమేష్ అన్నాడు. నీవు రమేష్ చెప్పిన దానితో ఏకీభవిస్తున్నావా ? ఎందుకు ?
జవాబు:
నేను రమేష్ చెప్పిన దానితో ఏకీభవిస్తాను. ఇది జీవవైవిధ్యానికి, పంట దిగుబడికి ఎంతో హానికరం. అధిక మొత్తంలో క్రిమిసంహారక మందుల వలన హానికరమైన కీటకాలతో బాటు పరాగ సంపర్కానికి సహాయపడు కీటకాలు మరణించును. పరాగ సంపర్కం జరగకపోతే ఫలదీకరణం జరగదు.

అప్పుడు పంట దిగుబడి తగ్గును. క్రిమిసంహారక మందుల వలన కొన్ని కీటక జాతులు అంతరించిపోవును. అప్పుడు ఆ కీటకాలను తిని బ్రతికే జీవులు అంతరించిపోవును. ఆ విధంగా జరిగితే ఆహారపు గొలుసు అస్తవ్యస్తం అగును. ఇది జీవవైవిధ్యంపై ప్రభావం చూపును.

ప్రశ్న 19.
వెంకటేష్ వరిపంటకు నీళ్లను పెట్టే పద్ధతిని చూశాడు. తాను కూడా మొక్కజొన్న పంటకు ఇలాగే నీళ్లను పెట్టాలనుకున్నాడు. నీవు అతనికి ఏ సూచనలు, సలహాలు ఇస్తావు ?
జవాబు:
వెంకటేష్ కు మొక్కజొన్న పంటకు, వరిపంటకు నీళ్ళు పెట్టే విధంగా పెట్టవద్దు అని నేను సూచన చేస్తాను. ఇంకా అతనికి మొక్కజొన్న అనేది. మెట్ట పంట మరియు వర్షాధారపు పంట అని, వరిపంటకు అవసరమైనంత నీళ్ళు మొక్కజొన్నకు అవసరం లేదు అని సలహా ఇస్తాను.

8th Class Biology 8th Lesson మొక్కల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers

కృత్యములు

ప్రశ్న 1.
భారతదేశ పటం చూడండి. మన దేశంలో ఏ ఏ పంటలు ఎక్కడెక్కడ పండిస్తున్నారో పరిశీలించి రాయండి. (అవసరమైతే అట్లాసును కూడా ఉపయోగించుకోండి.)
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 6
జవాబు:
వరి : అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్, హర్యానా, కాశ్మీర్
గోధుమ : ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర
మొక్కజొన్న : రాజస్థాన్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, గుజరాత్
జొన్న : రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్
పప్పుధాన్యాలు: మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్
చెరకు : ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్
జనపనార : పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిశా, అసోం
కొబ్బరి : కేరళ
ప్రత్తి : కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్
టీ : కర్ణాటక, అసోం, మణిపూర్

1. మన దేశంలోని అన్ని ప్రాంతాలలో పండే పంటలు ఏవి ?
జవాబు:
వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, ప్రత్తి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

2. కొన్ని పంటలను అన్ని ప్రాంతాలలోనూ ఎందుకని పండించగలుగుతున్నారు ?
జవాబు:
సారవంతమైన భూమి, నీరు లభ్యత వలన.

3. పై పట్టికలో మీ ఊళ్ళో పండే పంటలు ఏవో గుర్తించి రాయండి.
జవాబు:
వరి, చెరకు, మొక్కజొన్న, పెసలు.

4. మీ సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకాన్ని గాని, గ్రంథాలయంలోని పుస్తకాలను గాని చూసి వివిధ ప్రదేశాలలో ప్రధానంగా పండే పంటలు జాబితా తయారుచేయండి.
జవాబు:
దేశం : వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న.
రాష్ట్రం : వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ప్రత్తి, చెరకు, జనపనార జిల్లా : వరి, చెరకు, మామిడి, అరటిపండు
మీ గ్రామం : వరి, చెరకు (గమనిక : ఏ గ్రామ విద్యార్థులు అక్కడ పండే పంటలు సేకరించి రాసుకోవాలి.)

ప్రశ్న 2.
మీ గ్రామంలోని రైతులను అడిగి ఏ పంటలు పండడానికి ఎంతకాలం పడుతుందో వివరాలు సేకరించండి. కింది పట్టికలో రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 7

1. పంటలు పండుటకు ఎంత కాలం పడుతుంది ?
జవాబు:
సుమారుగా 100 రోజుల లోపు నుంచి దాదాపుగా 365 రోజులు పడుతుంది.

2. అన్ని పంటలు పండడానికి పట్టేకాలం ఒక్కటేనా ?
జవాబు:
కాదు.

3. మీకు తెలిసిన పంటలలో ఏ పంట పండడానికి ఎక్కువ సమయం పడుతుంది ?
జవాబు:
చెరకు

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

3. పంటలను ఎప్పుడు పండిస్తారు ?

ప్రశ్న 1.
మనం రకరకాల పండ్లు, కూరగాయలు తింటుంటాం. సంవత్సరం పొడవునా అన్ని రకాల పండ్లు, కూరగాయలు మనకు లభిస్తాయా ? కొన్ని కాలాల్లో అధికంగాను, కొన్ని కాలాల్లో తక్కువగాను లభిస్తాయి. కొన్ని ఒక ప్రత్యేక రుతువులో తప్ప మిగిలిన సమయాల్లో అసలు లభించవు. జట్టులో చర్చించి ఏ కాలంలో ఏవి లభిస్తాయో కింది పట్టికలో రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 8

1. ఏ కాలంలో ఎక్కువ రకాల కూరగాయలు మనకు మార్కెట్లలో లభిస్తాయి ? ఎందుకు ?
జవాబు:
వర్షాకాలంలో వర్షపు నీరు వలన.

సాధారణంగా రైతులు వర్షాకాలంలోనే వివిధ రకాల కూరగాయలు పండిస్తారు. కారణమేమిటో ఊహించి చెప్పగలరా ?
జవాబు:
కావలసినంత నీరు లభిస్తుంది. కాబట్టి.

ప్రశ్న 4.
కింది ఫోను చూడండి. ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 9

1. రబీ సీజన్లోనే గోధుమ పంటను ఎందుకు సాగుచేస్తారు ?
జవాబు:
ఫిబ్రవరి నెలలో వాతావరణం వేడిగా ఉంటుంది. గింజ అభివృద్ధి చెందడానికి ఇది సరైన సమయం. గోధుమ పుష్పించడానికి రాత్రి కాల సమయం తక్కువగా ఉండటంతో పాటు విత్తనాలు ఏర్పడటానికి తగినంత వేడి కూడా వాతావరణంలో ఉండటం అవసరము. అందుకే గోధుమపంటను రబీ సీజన్ లోనే సాగుచేస్తారు.

2. సెప్టెంబరు నెలలో సాగుచేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
సెప్టెంబరులో సాగుచేస్తే అవి పుష్పించుటకు 8 నుండి 10 వారాలు పట్టును. అనగా జనవరిలో పుష్పించుట జరుగును. రాత్రి సమయం ఎక్కువగా అనగా 12 1/2 గంటలు ఉంటుంది. కాబట్టి పుష్పాలు సరిగా రావు. పంట దిగుబడి తగ్గుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

3. ఎందుకు ఖరీఫ్ సీజన్లో గోధుమపంట సాగు చేయరు ?
జవాబు:
అవి పుష్పించుటకు కావల్సినంత రాత్రి సమయం ఉండదు కాబట్టి.

4. గోధుమ పంటను నవంబర్ లో సాగుచేస్తే ఏమవుతుంది ?
జవాబు:
గోధుమ పంటను నవంబర్ లో సాగుచేస్తే పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. కారణం ఫిబ్రవరిలో రాత్రి కాల సమయం తక్కువగా ఉండి, విత్తనాలు ఏర్పడటానికి తగినంత వేడి కూడ వాతావరణంలో ఉండును.

5. గింజలు బలంగా పెరగడానికి తగినంత ఉష్ణోగ్రత అవసరం. మరి మనకు ఎప్పుడు వేడి అధికంగా ఉంటుంది ?
జవాబు:
రబీ సీజన్లో వేడిమి ఎక్కువగా ఉంటుంది.

5. వరిసాగు

ప్రశ్న 5.
మీ దగ్గరలోని రైతులను అడిగి వివరాలు సేకరించి కింది పట్టిక నింపండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 10

1. ఏ కాలంలో రైతులు అధిక ఫలసాయం, ఆదాయం పొందుతున్నారు ?
జవాబు:
ఖరీఫ్ కాలంలో.

2. మంచి పరిమాణంలో ఉండే గింజలు ఏ కాలంలో వస్తాయి ? రబీలోనా ? ఖరీఫ్ లోనా ?
జవాబు:
ఖరీఫ్ లో.

3. మూడవ పంట గురించి తెలుసా ? మన రాష్ట్రంలో మూడవ పంటగా వేటిని పండిస్తారు ?
జవాబు:
తెలుసు. అపరాలను మన రా” లో 3వ పంటగా పండిస్తారు.

4. ఖరీఫ్, రబీ రెండు కాలాలలోనూ పండే పంటలు ఏమిటి ?
జవాబు:
వరి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

5. రబీ సీజన్ కంటే ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని మీరు అంగీకరిస్తారా ? అయితే కారణాలు చెప్పండి.
జవాబు:
అంగీకరిస్తాను. కారణాలు ఖరీఫ్ సీజన్ లో వరి మొక్కల పెరుగుదలకు అవసరమైనంత నీరు లభించును. వేడిమి తక్కువగా ఉండును

6. మంచి విత్తనాలను వేరు చేయడం, ఎంపిక చేయడం ఎలాగో మీకు తెలుసా ?

ప్రశ్న 6.
గుప్పెడు శనగ విత్తనాలను తీసుకొని బక్కెట్లోని నీళ్లలో వేయండి. కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. నీళ్ళపై తేలిన విత్తనాలన్నింటిని తీసివేయండి. నీళ్ళలో మునిగిన వాటిని అలాగే ఒక రోజంతా ఉంచండి. మరుసటి రోజు వీటిని ఆరబెట్టి గిన్నెలోగాని, పాత్రలోగాని వేసి మూత పెట్టి తగినంత వేడిగా ఉండే చీకటి గదిలో ఉంచండి. 2 లేక 3 రోజుల తర్వాత విత్తనాలను పరిశీలించండి. ఏం జరిగినది ? నీవెప్పుడైనా మొలకెత్తిన గింజల్ని తిన్నావా ?
జవాబు:
శనగ విత్తనాల నుంచి మొలకలు రావడం జరిగినది. నేను చాలాసార్లు మొలకెత్తిన గింజలు తిన్నాను.

1. ఎందుకు కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలాయి ?
జవాబు:
కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. కారణం అవి పుచ్చు విత్తనాలు అయి ఉండటం వలన విత్తనం లోపల ఖాళీగా ఉండి నీటికన్న తక్కువ సాంద్రత ఉంటాయి. అందుకని నీటిపై తేలుతాయి.

2. తేలిన విత్తనాలను ఎందుకు తీసి వేయాలి ?
జవాబు:
తేలిన విత్తనాలకు మొలకెత్తే సామర్థ్యం ఉండదు కాబట్టి వాటిని తీసివేయాలి.

3. విత్తనాలను ఒక రోజంతా నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి ?
జవాబు:
విత్తనాలను ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టడం వలన విత్తనం తేమగా అయ్యి విత్తనాలకు అంకురించే శక్తి వస్తుంది.

7. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి. ఒక పిడికెడు గింజల్ని నీళ్ళలో వేయండి. కొన్ని విత్తనాలు నీళ్ళపై తేలుతాయి. వాటిని వేరుచేసి భూతద్దంలో పరిశీలించండి. నీటమునిగిన గింజలకు, తేలిన గింజలకు గల పోలికలు, భేదాలను గుర్తించి మీ పరిశీలనలను కింది పట్టికలో ‘✓’ గుర్తు పెట్టండి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 11

1. పై రెండు రకాల గింజల్లో ఏవైనా తేడాలను మీరు గుర్తించారా ?
జవాబు:
పై రెండు రకాల గింజల్లో తేడాలను మేము గమనించాము.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

2. నీళ్ళపై తేలిన విత్తనాలు తక్కువ బరువు ఎందుకున్నాయో చెప్పగలరా ?
జవాబు:
లోపల పోషక పదార్థాలు లేక ఖాళీగా ఉండడం వలన.

8. ఎంపిక మరియు మొలకెత్తుట

నీళ్ళలో తేలిన విత్తనాలను, మునిగిన విత్తనాలను వేరువేరుగా కుండీల్లో నాటండి. రెండు కుండీల్లోనూ సమానంగా నీరు పోయండి. రెండు కుండీల్లోని మొక్కల పెరుగుదలను పరిశీలించండి. నివేదిక తయారుచేయండి.
తేలిన విత్తనాలు : ఇవి వేసిన కుండీలో మొక్కలు సరిగా రాలేదు. పెరుగుదల తక్కువగా ఉంది.
మునిగిన విత్తనాలు : ఇవి వేసిన కుండీలో మొక్కలు బాగా వచ్చాయి. పెరుగుదల కూడా చాలా బాగుంది.

1. ఏ గింజలు బాగా మొలకెత్తినాయి ? ఎందుకు ?
జవాబు:
నీటిలో మునిగిన విత్తనాలు. కారణం లోపల ఉన్న పోషక పదార్థాలు ఉత్తేజితం అయి విత్తనాలు మొలకెత్తుటకు కావలసిన
శక్తిని ఇస్తుంది.

2. ఏ గింజలు సరిగా మొలకెత్తలేదు ? ఎందుకు ?
జవాబు:
నీటిపై తేలిన గింజలు. కారణం పోషక పదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి విత్తనాలు మొలకెత్తుటకు కావలసిన శక్తి సరిగా రాదు.

3. అన్ని రకాల పంట గింజలను ఇలాగే పరీక్ష చేస్తారా ?
జవాబు:
అవును, ఇలాగే పరీక్ష చేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

9. ఏ విత్తనాలను ఏ ఏ పద్ధతుల్లో నాటుతారో రైతుల నుండి వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 12

1. ఒక ఎకరా వరి పంట పండించడానికి ఎన్ని కిలోల వరి గింజలు అవసరమో నీకు తెలుసా ?
జవాబు:
సుమారు 25 కేజీలు.

2. అన్ని రకాల వరి పంటలకు ఇదే పరిమాణంలో అవసరమవుతాయా ?
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 13
జవాబు:
అన్ని రకాల వరి పంటలకు ఇదే పరిమాణంలో అవసరమవ్వవు.
ఉదా : నాటే పద్ధతి – 20 – 25 కేజీలు,
వెదజల్లటానికి – 24 – 30 కేజీలు
శ్రీ పద్ధతి – 2 కేజీలు

3. తక్కువ వితనాలు ఉపయోగించి వరిసాగు చేసే పదతులు ఏమైనా ఉన్నాయా ? విత్తనాలు చెత చల్లటం
జవాబు:
ఉన్నది. ఆ పద్ధతి శ్రీ పద్ధతి.

4. విత్తనాలను నేలలో విత్తిన తరువాత మట్టితో ఎందుకు కప్పుతారు ?
జవాబు:
విత్తనాలను నేలలో విత్తిన తరువాత మట్టితో కప్పుటకు కారణాలు మట్టి నుండి వాటికి కావలసిన తేమను, వేడిమిని పొందుటకు మరియు గుల్లగా ఉన్న నేల నుండి గాలిని తీసుకొనుటకు. మట్టిలో విత్తిన తర్వాత కప్పకపోతే పక్షులు, ఇతర జంతువులు ఆ విత్తనాలను తినేస్తాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

10. నలుగురైదుగురు విద్యార్థులతో జట్లుగా ఏర్పడండి. మీ దగ్గరలోని పొలంలో మందులు ‘చల్లుతున్న రైతులను అడిగి ఏ ఏ పంటలకు ఏ ఏ వ్యాధులు ఎలా వస్తాయి ? వాటిని ఎలా అదుపు చేస్తారు ? ఏ మందులు చల్లుతారు ? వంటి వివరాలు సేకరించి కింది పట్టికలో నింపండి. వ్యాధి పేరు తెలియకపోతే దానిని స్థానికంగా ఏమంటారో రాయండి.
పంటలకు (వరి, వేరుశనగ, చెరకు, మినుము) ముఖ్యంగా అగ్గితెగులు, టిక్కా, ఆకుపచ్చ తెగులు, తుప్పు తెగులు బూడిద తెగులు.
ముఖ్యంగా వ్యాధులు బాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు కొన్ని రకాల కీటకాల వలన వచ్చును.
పంట పేరు, పరిశీలించిన వ్యాధులు, ఉపయోగించిన క్రిమిసంహారక మందులు, ఫలితాలు క్రింది పట్టికలో ఉన్నాయి.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 14

1. అందరు రైతులు ఒకే రకమైన పంటపైన ఒకే రకమైన మందులే చల్లుతున్నారా ?
జవాబు:
చల్లరు. అది వాళ్ళ ఇష్టం. ఉదాహరణకు వరి అగ్గి తెగులుకు ట్రైసైక్లోజన్ 75% లేదా ఎడిఫెన్ పాస్ 1 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తారు.

2. అన్ని రకాల పంటల్లో సాధారణంగా కనిపించే వ్యాధి ఏదో గుర్తించావా ?
జవాబు:
రసంపీల్చే పురుగు వ్యాధి.

3. రైతులు క్రిమి సంహారక మందులను ఎక్కడ కొనుక్కుంటారు ?
జవాబు:
ఎరువులు మరియు క్రిమి సంహారక మందులు అమ్మే కొట్టులో కొనుక్కుంటారు.

4. మందులు చల్లడానికి వారు ఎలాంటి పనిముట్లను వాడుతున్నారు ?
జవాబు:
నాక సాక్ స్ప్లేయర్, గటార్ ప్రేయర్, తైవాన్ ప్రేయర్, పవర్ స్ప్లేయర్, రోటరీ డస్టర్.

5. క్రిమి సంహారక మందులు చల్లినప్పుడు క్రిమికీటకాలతో పాటు ఇంకా ఏవైనా చనిపోయినట్లు నీవు గుర్తించావా ? అయితే అవి ఏమిటి ?
జవాబు:
క్రిమిసంహారక మందులు చల్లినప్పుడు క్రిమికీటకాలతో పాటు పరాగ సంపర్కంకు సహాయపడు జీవులు చనిపోయినట్లు నేను గుర్తించితిని. అవి తూనీగలు, సీతాకోక చిలుకలు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

11. మీ పాఠశాల తోటలోని మొక్కలను పరిశీలించండి. మొక్కల ఆకులు, కాండాలను జాగ్రత్తగా పరిశీలించి కింది వివరాలు సేకరించండి. లక్షణం ఉంటే “✓” లేకపోతే “×” పెట్టండి. లక్షణం
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 15
పంటపేరు /మొక్క పేరు : వేరుశనగ స్థలం : మొక్కలలోని ఆకులపైన

1. మొక్కలోని అన్ని ఆకులపైనా మచ్చలున్నాయా ?
జవాబు:
ఉన్నాయి.

2. మచ్చలతో ఉన్న ఆకు బొమ్మను మీ నోటు పుస్తకంలో గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 16

3. ఆకుల అంచులు కత్తిరించబడినట్లుగా ఉండడానికి కారణమేమి ?
జవాబు:
చీడల వలన ఆకులు అంచులు కత్తిరించబడినట్లు ఉండును.

4. కాండంపై ఉండే చారలు, ఆకులపై ఉండే మచ్చలు ఒకేలా ఉన్నాయా ?
జవాబు:
ఒకేలా ఉన్నాయి.

5. ముడుచుకొనిపోయిన ఆకుల్లో ఏవైనా కీటకాలను గుర్తించావా ? అయితే అవి ఏమిటి ?
జవాబు:
కీటకాలు ఉన్నాయి అవి రసం పీల్చే పురుగులు, రెక్కల పురుగులు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

6. ఆకుల మచ్చలపై ఉన్న పొడిలాంటి పదార్థాన్ని సేకరించండి. దాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి. మీరేం గమనించారో మీ నోటుపుస్తకంలో రాయండి.
జవాబు:
ఆకుల మచ్చలపై ఉన్న పొడిలాంటి పదార్థాన్ని సేకరించితిని. దాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించితిని. అప్పుడు ఆ పొడిలో శిలీంధ్రం యొక్క తంతువులు, స్పోర్సు కనిపించాయి.

12. చీడ పీడల్ని నియంత్రించే పద్ధతులు

ప్రశ్న 1.
మీ గ్రామంలోని రైతులు వివిధ పంటల్లో వచ్చే క్రిమి కీటకాలను అదుపు చేయడానికి వివిధ రకాల కీటక నాశనులు ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు. మీ పెద్దలను కాని), రైతులను కాని అడిగి ఏ ఏ పురుగు మందులను కింది పద్ధతుల్లో ఉపయోగిస్తారో తెలుసుకొని రాయండి.
జవాబు:
1. స్పేయర్ తో చల్లడం : మోనోక్రోటోపాస్, ప్రొఫేనోపాస్, నూవాన్, స్పైనోఫాడ్
2. పొడి మందులు చల్లడం : మిథైల్ థెరాఫియాన్, ఫాలిడాల్
3. నేలలోపల ఉంచడం : కార్బొప్యూరాన్, కార్టాక్ హైడ్రోక్లోరైడ్
4. కాల్చడం, పీకివేయడం : వైరల్ కి సంబంధించిన వ్యాధులలో పొలాల నుంచి ,రోగకారక మొక్కలను కాల్చడం, పీకివేయడం చేస్తారు.
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 17

13. రైతులు పంటలకు నీళ్ళెప్పుడు పెడతారు ?

ప్రశ్న 1.
మీ దగ్గరలోని రైతులను అడిగి ఏ ఏ పంటలకు నీళ్ళను ఎప్పుడెప్పుడు పెడతారో తెలుసుకొని కింది పట్టిక నింపండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 18

ప్రశ్న 2.
అన్ని పంటలకు నీళ్ళు ఒకేసారి అందిస్తారా ?
జవాబు:
లేదు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

14. మీ దగ్గరలోని తోటకు వెళ్ళి స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను పరిశీలించండి. ఈ పద్ధతిలో ఉపయోగించే పరికరాలు పనిముట్లు వాటిని అమర్చిన విధానం, నీటిని పంపిణీ చేసే విధానం, ఈ పద్ధతి వల్ల కలిగే లాభాలు, నష్టాలు మొదలగు వివరాలతో నివేదిక తయారుచేయండి. ఇందుకోసం అక్కడి రైతులను కలిసి మాట్లాడండి. వివరాలు సేకరించండి.
జవాబు:
స్ప్రింక్లర్ పద్ధతి :
ఎ) పరికరాలు & పనిముట్లు : మోటారు, గొట్టాలు, గుండ్రంగా తిరిగే స్ప్రింక్లర్స్, కవాటాలు, నాజిల్స్.
బి) వాటిని అమర్చిన విధానం మరియు నీటిని పంపిణీ చేయు విధానం : నీరు ఉన్న ప్రాంతాలలో గొట్టాలు అమర్చి ఒక మోటారు సహాయంతో నీరు బయటకు తెచ్చి పొలంలో లంబంగా అమర్చబడిన గొట్టాలకు గుండ్రంగా తిరిగే స్ప్రింక్లిల్స్ ద్వారా నీటిని పొలంలో వెదజల్లుతారు.
డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) : నీరు ఉన్న ప్రాంతాలలో గొట్టాలు అమర్చి ఒక మోటారు సహాయంతో నీరు బయటకు తెచ్చి పొలంలో సమాంతరంగా నిర్ణీత ప్రదేశాలలో రంధ్రాలు (మొక్క వేరుకు దగ్గరగా) చేయబడిన గొట్టాలు అమర్చి నీటి బిందువుల రూపంలో మొక్క వేరుకు సరఫరా చేస్తారు.
లాభాలు :
1. నీరు ఎక్కువగా అందుబాటులేని చోట
2. ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిలో
3. ఇసుక నేలలకు ఈ పద్దతి బాగా ఉపయోగపడును.

నష్టాలు :
1. ఖర్చుతో కూడి ఉన్నది.
2. అన్ని రకాల పంటలకు అనుకూలం కాదు.

15. కలుపు మొక్కల సమాచారం :

ప్రశ్న 1.
మీ దగ్గరలోని రైతులను అడిగి ఏ ఏ పంటలలో ఏ ఏ కలుపు మొక్కలు పెరుగుతాయో తెలుసుకుని ఒక నివేదిక తయారు చేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 19

16. మీ గ్రామంలోని చుట్టుప్రక్కల గాని, వివిధ పంటలకు పంట నూర్పిడి చేసే పద్ధతుల వివరాలు సేకరించి పట్టిక నింపండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 20

ఆలోచించండి – చర్చించండి

ప్రశ్న 1.
జపాన్లో అధిక దిగుబడి సాధించడానికి గల కారణాలేవి ? (పేజీ.నెం.118)
జవాబు:
జపాన్ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ఉపయోగించటం. జపాన్ అత్యధిక దిగుబడి వచ్చే వరి విత్తనాలు ఉపయోగించటం.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 2.
భారతదేశంలో తక్కువ దిగుబడి సాధించడానికి గల కారణాలేవి ? (పేజీ.నెం. 118)
జవాబు:
భారతదేశం వ్యవసాయ రంగంలో ప్రాచీన పద్ధతులు ఉపయోగించుట. వ్యవసాయంలోనికి చదువుకున్న వాళ్ళు రాకపోవటం.

ప్రశ్న 3.
నాగలి కర్రు పొడవుకి, విత్తటానికి ఏమైనా సంబంధం ఉందా ? (పేజీ.నెం. 119)
జవాబు:
లేదు.

ప్రశ్న 4.
మెట్ట పొలాల్లో కూడా నేలను ఇలాగే తయారు చేస్తారా ? (పేజీ.నెం. 119)
జవాబు:
మెట్ట పొలాల్లో కూడా నేలను ఇలాగే తయారు చేస్తారు.

ప్రశ్న 5.
నేలను దున్నడం వల్ల కలిగే ప్రయోజనాలేవి ? (పేజీ.నెం. 119)
జవాబు:
నేలను దున్నడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి :
1) మట్టి మృదువుగా మారడం వల్ల నేల లోపల నీరు చాలా కాలం నిల్వ ఉంటుంది.
2) వేళ్ళు నేలలోకి సులభంగా చొచ్చుకొనిపోవడానికి వీలు అగును.
3) వేళ్ళకు శోషించడానికి అవసరమైన గాలి, నీరు నేలలోకి సులభంగా చేరును.
4) రైతులకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు వంటివి మెత్తటి మృదువైన మట్టిలో బాగా పెరుగుతాయి.
5) నేలను దున్నడం వల్ల నేల లోపల ఉన్న కొన్ని రకాల అపాయకరమైన సూక్ష్మజీవులు, క్రిమికీటకాల గుడ్లు బయటికి వచ్చి సూర్యుని వేడికి నశించును.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 6.
ఎందుకు ఈ చాళ్లు “v” ఆకారంలో ఏర్పడతాయి? నేలలో “V” ఆకారంలో చాళ్లు ఏర్పడటం వల్ల చాళ్ల వెంట నీళ్ళను పాగించడమే కాక ఇంకా ఏ ఏ రకాలుగా ఉపయోగపడుతుందో చెప్పండి. (పేజీ.నెం. 120)
జవాబు:
నాగలి చివర పదునైన ఇనుపబద్ధ (కర్ర) ఉంటుంది. నాగలితో చాళ్ళను చేయునపుడు ఈ కర్ర నేలలోనికి చొచ్చుకొని పోతుంది. అందువలన ఆ ప్రదేశంలో ఉన్న మట్టి కర్రుకు ఇరువైపులా గట్టురూపంలో ఏర్పడుతుంది. కనుక వాళ్ళు v ఆకారంలో ఏర్పడతాయి.

v ఆకారం చాళ్ళు వల్ల ఉపయోగములు :

1) ఈ చాళ్ళ వలన గాలి నీరు లోపలి మట్టి కణాల మధ్యకు సులభంగా చేరతాయి.
2) విత్తనాలను ఒక వరుస తరువాత ఒక వరుస విత్తుతుంటారు. ఆ సమయంలో మొదటి వరుస మట్టితో రెండవ వరుస మూసుకొనుటకు ఈ v ఆకారపు చాళ్ళు ఉపయోగపడును.

ప్రశ్న 7.
ఎరువుల కోసం రైతులు పోట్లాడుకోవడం, ఉద్యమాలు చేయడం మీరెప్పుడైనా చూశారా లేదా పత్రికల్లో చదివారా ? ఎందుకు ఇలా జరుగుతోంది ? ఎందుకు రైతులు ఎక్కువ ఎరువుల బస్తాలు కావాలని కోరుకుంటారు ? దీనికి సంబంధించిన మీ ఆలోచనలు చార్టు మీద రాసి గోడ పత్రికలో ప్రదర్శించండి. (పేజీ.నెం. 130)
జవాబు:
చూశాను మరియు పత్రికల్లో చదివాను. ఇలా జరుగుటకు కారణం ఎరువుల కొరత. రైతులు ఎక్కువ ఎరువుల బస్తాలు కావాలని ఎందుకు కోరుకుంటారు అంటే పంట దిగుబడి పెంచుటకు. దానికి సంబంధించిన నా ఆలోచనలు
1. రసాయనిక (కృత్రిమ) ఎరువులు తక్కువగా వాడటం.
2. జీవ (సహజ) ఎరువుల వాడకాన్ని పెంచటం.

పాఠ్యాంశంలోని ప్రశ్నలు

ప్రశ్న 1.
మూడవ పంట అన్ని ప్రాంతాలలో పండించకపోవడానికి కారణాలు ఏమిటో మీ ఉపాధ్యాయుడితో చర్చించండి. (పేజీ.నెం. 117)
జవాబు:
నీటి పారుదల వసతి లేకపోవడం. నేల సారాన్ని కోల్పోవడం.

ప్రశ్న 2.
వరి పండించే పొలాన్ని చిన్న చిన్న మడులుగా ఎందుకు చేస్తారు ? (పేజీ.నెం. 118)
జవాబు:
పంటకు నీరు అందించుట సులభంగా ఉంటుంది. కాబట్టి వరి పండించే పొలాన్ని చిన్న చిన్న మడుగులుగా చేస్తారు.

ప్రశ్న 3.
వరిని ఎలా పండిస్తారు ? (పేజీ.నెం. 121)
జవాబు:
వరిని నారుపోసి, నాట్లు వేసి చిన్న చిన్న మడులలో పండిస్తారు.

ప్రశ్న 4.
మీ పెద్దలను గాని, రైతులను గాని అడిగి విత్తనాలు ఎక్కడ కొంటారో తెలుసుకోండి. (పేజీ.నెం. 121)
జవాబు:
విత్తనాలను అమ్ముటకు ధ్రువీకరించిన దుకాణాలలో కొంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 5.
ప్రస్తుతం సంప్రదాయంగా సాగుచేస్తున్న విత్తనాలు కనుమరుగవుతున్నాయి ? ఇలా ఎందుకు జరుగుతోంది ఆలోచించండి. (పేజీ.నెం. 122)
జవాబు:
ప్రస్తుతం సంప్రదాయంగా సాగుచేస్తున్న విత్తనాలు కనుమరుగవుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే వాటి స్థానాన్ని సంకరణ జాతి విత్తనాలు ఆక్రమించటం వలన.

ప్రశ్న 6.
మొక్కలో ఏ భాగం వేరుగా మారుతుంది ? (పేజీ.నెం. 122)
జవాబు:
ప్రథమ మూలం మొక్కలో వేరు భాగంగా మారును.

ప్రశ్న 7.
ఏ భాగం కాండంగా మారుతుందో చెప్పగలరా ? (పేజీ.నెం. 122)
జవాబు:
ప్రథమ కాండం కాండంగా మారుతుంది.

ప్రశ్న 8.
ఏ ఏ పదార్థాలు ఉపయోగించి విత్తనశుద్ధి చేస్తారో జాబితా రాయండి. అదే విధంగా విత్తనాలు నాటే ముందు మీ ఊళ్ళో ఇంకా ఏ ఏ రకమైన పద్ధతులు అవలంభిస్తారో తెలుసుకొని మీ నోటు పుస్తకంలో రాయండి. (పేజీ.నెం. 123)
జవాబు:
విత్తనాలను ఈ కింది రసాయనిక పదార్థాలు ఉపయోగించి శుద్ధి చేస్తారు. అవి :
1. కార్బడిజ
2. మాంకో జాజ్
3. ఇమడోకోట్రిడ్

ప్రశ్న 9.
నారు నాటడం ద్వారా ఇంకా ఏ ఏ పంటలు పండిస్తారో మీ స్నేహితులతో చర్చించి రాయండి. (పేజీ.నెం. 123)
జవాబు:
మిరప, వంగ, టమోటా మొదలైనవి నారు నాటడం ద్వారా పంటలు పండిస్తారు.

ప్రశ్న 10.
ఎందుకు నారు మొక్కలను దూరం దూరంగా నాటుతారు ? (పేజీ.నెం. 125)
జవాబు:
నారు మొక్కలు దూరం దూరంగా నాటుటకు కారణం అవి పెరిగి పెద్దగా అయిన తర్వాత స్థలం కోసం, నీటి కోసం, ” ఆహార పదార్థాల కోసం పోటీ లేకుండా ఉండుటకు.

ప్రశ్న 11.
అన్ని రకాల పంటలను నారు మొక్కల్లాగానే పీకి మళ్ళీ నాటుతారా ? అలా ఎందుకు చేయరు ? (పేజీ.నెం. 125)
జవాబు:
అన్ని రకాల పంటలను నారు మొక్కల్లాగా మళ్ళీ పీకి నాటరు. కారణం వాటి విత్తనాలు పెద్దవిగా ఉండటం.

ప్రశ్న 12.
వ్యాధి సోకిన పంటలోని మొక్కలను రైతు ఏం చేస్తాడు ? (పేజీ.నెం. 127)
జవాబు:
వ్యాధి సోకిన పంటలోని మొక్కల ఆకులు, అవసరం అనుకొంటే మొక్కలను రైతు తొలగిస్తాడు. అవి అన్నీ ఒకచోట వేసి కాలుస్తాడు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 13.
రామయ్య, అనే రైతు వ్యాధి సోకిన మొక్కలను పొలం నుండి పీకి కాల్చి వేశాడు. ఇది మంచిదా ? నీ స్నేహితులతో – చర్చించండి. (పేజీ.నెం. 127)
జవాబు:
రామయ్య అనే రైతు వ్యాధి సోకిన మొక్కలను పొలం నుండి పీకి కాల్చి వేశాడు. ఇది చాలా మంచిది. కారణం ఇతర , మొక్కలకు వ్యాధి కొంతమేర సోకదు.

ప్రశ్న 14.
రెండు రకాల కీటక నాశకాలను ఉపయోగిస్తే కీటక సంఖ్య మొదటి సంవత్సరం తగ్గింది కాని మరునాటి సంవత్సరం వాటి సంఖ్య పెరిగింది. కారణాలు తెలపండి. (పేజీ.నెం. 127)
జవాబు:
రెండు రకాల కీటక నాశకాలను ఒక్కసారి ఉపయోగించినపుడు మొదటి సంవత్సరం కీటకాల సంఖ్య తగ్గినది. రెండవ సంవత్సరం పెరిగాయి. కారణం ఆ మందులకు కీటకాలు నిరోధకతను ఏర్పరచుకున్నాయి.

ప్రశ్న 15.
రైతులు ఎరువులను ఎలా వేస్తారు ? (పేజీ.నెం.130)
జవాబు:
రైతులు ఎరువులను చేతితోగాని, కొన్ని పనిముట్లతో గాని వేస్తారు.

ప్రశ్న 16.
మీ పాఠశాలలో కంపోస్టు గుంత ఉందా ? అందులో ఏమేమి వేస్తుంటారు ? (పేజీ.నెం.130)
జవాబు:
మా పాఠశాలలో కంపోస్టు గుంత ఉంది. అందులో కూరగాయల తొక్కలు, మిగిలిన అన్నం, ఎండిన ఆకులు వేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 17.
కింది చిత్రాన్ని చూడండి. దీనిలో ఏ మూలకం ఏ పరిమాణంలో ఉందో చెప్పండి. (పేజీ.నెం. 130)
జవాబు:
నైట్రోజన్ 20%
ఫాస్ఫరస్ 5%
పొటాషియం 10%
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 21

ప్రశ్న 18.
ఏది మంచి ఎరువు ? రసాయనిక ఎరువులకు, సహజ ఎరువులకు మధ్యగల తేడాలు ఏవి (పేజీ.నెం. 131)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి 22
(i) పై రెండింటిని పోల్చి ఏది మనకు ప్రయోజనకరమో చెప్పండి.
జవాబు:
సహజ ఎరువు.

(ii) పై పట్టికను జాగ్రత్తగా పరిశీలించండి. ఏ ఎరువులు వాడితే రైతులకు ప్రయోజనమో మీ ఉపాధ్యాయునితో చర్చించి రాయండి.
జవాబు:
సహజ ఎరువులు వాడితే రైతులకు ప్రయోజనం. ఇవి వేస్తే నేలలో హ్యూమస్ చేరుతుంది. అదే విధంగా నేల ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి.

ప్రశ్న 19.
రైతులు వరి పొలాలకు నీళ్ళు ఎప్పుడు అందిస్తారు ? (పేజీ.నెం. 132)
జవాబు:
నాట్లు వేసేటప్పుడు, మూన తిరిగిన రోజు నుండి పైరు దబ్బు చేయుటకు 2-3 రోజులకు ఒక్కసారి.

AP Board 8th Class Biology Solutions Chapter 8 మొక్కల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 20.
మీ గ్రామంలో నీటి వనరులను వ్రాయండి. (పేజీ.నెం. 132)
జవాబు:
కాలువలు, చెరువులు, బావులు.

ప్రశ్న 21.
ఆ నీటి వనరులు రైతులకు ఉపయోగపడుతున్నాయా ? (పేజీ.నెం. 132)
జవాబు:
ఆ నీటి వనరులు రైతులకు ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 22.
మీ గ్రామంలో రైతులు ఏ రకంగా పొలాలకు నీళ్ళు పెడుతున్నారు ? (పేజీ.నెం. 132)
జవాబు:
మా గ్రామంలో రైతులు ఎక్కువమంది ఆధునిక పద్ధతుల ద్వారా, కొంతమంది పురాతన పద్ధతుల ద్వారా పొలాలకు నీళ్ళు పెడుతున్నారు.

ప్రశ్న 23.
కలుపు మొక్కలను ఎందుకు తొలగించాలి ? (పేజీ.నెం. 134)
జవాబు:
కలుపు మొక్కలు పోషక పదార్థాలు, నీరు, వెలుతురు కోసం పంట మొక్కలతో పోటీపడతాయి. దీనివల్ల సాగు మొక్కలు పెరగవు. అందుకే కలుపు మొక్కలు తొలగించాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

SCERT AP 8th Class Biology Study Material Pdf 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 9th Lesson Questions and Answers జంతువుల నుండి ఆహారోత్పత్తి

8th Class Biology 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి Textbook Questions and Answers

ప్రశ్న 1.
ఒక తేనెపట్టులో వివిధ రకాల తేనెటీగలు ఉంటాయి ? అవి ఏవి ? అవి ఒకదానికంటే మరొకటి ఎలా భిన్నంగా ఉంటాయి ?
జవాబు:
ఒక తేనెపట్టులో 3 రకాల తేనెటీగలు ఉంటాయి. అవి ఒకదాని కంటే మరొకటి ఎలా భిన్నంగా ఉంటాయి. అంటే
కూలీ ఈగలు : కొన్ని తేనెటీగలు వేల సంఖ్యలో ఉంటాయి. ఇవి కూలీ ఈగలు. తేనెపట్టు పెట్టి, తేనెటీగల పిల్లలను పోషించి, తేనెను సేకరించును. రాణి ఈగ : తేనెటీగల సమూహంలో ఒక్క రాణి ఈగ ఉంటుంది. ఇది ప్రతిరోజు 800-1200 గుడ్లను పెడుతుంది.
డ్రోన్ ఈగలు : ఇవి కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. వీటిని మగ ఈగలు అంటారు. ఇవి సోమరులు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 2.
మీ గ్రామంలో అధిక పాలనిచ్చే గేదెల లక్షణాలను రాయండి.
జవాబు:
మా గ్రామంలో అధిక పాలనిచ్చే గేదెల లక్షణాలు :

  1. చక్కని శరీర నిర్మాణం కలిగి ఉంటాయి.
  2. శరీర బరువు ఎక్కువగా ఉంటుంది.
  3. అధికంగా ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటాయి.
  4. మంచి ఆరోగ్యం కలిగి ఉంటాయి.
  5. శారీరక రోగాలు కలిగి ఉండవు.
  6. గేదెల చూపు చక్కగా ఉంటుంది.
  7. గేదెలు చక్కని పొదుగు నిర్మాణం ఉండి మరియు పాలు తీయుటకు తేలికగా ఉండును.
  8. ఆహారం (మేత) ఎక్కువగా తీసుకొనును.
  9. సన్నని మెడ కలిగి ఉంటాయి.

ప్రశ్న 3.
గ్రామీణ ప్రాంతాలలో గుడ్లను పొదిగే విధానాన్ని వివరించండి.
జవాబు:
గ్రామాలలో గుడ్లను పొదిగించడం ఆసక్తికరమైన పని. గ్రామాలలో కోళ్ళకు పొదిగే కాలం రాగానే ఒక పెద్ద గంపలో గడ్డి పరచి దానిమీద గుడ్లు ఉంచితే కోళ్ళు గుడ్లపై కూర్చొని గుడ్లను పొదుగుతాయి.

ప్రశ్న 4.
పశువుల పెంపకంలో అనుబంధ ఉత్పత్తులు, పరిశ్రమల గురించి రాయండి.
జవాబు:
పశువుల పెంపకంలో అనుబంధ ఉత్పత్తులు :
మాంసం, పేడ, తోళ్ళు, ఎముకలు, చర్మం, వాటి కొమ్ములు.
పరిశ్రమలు :

  1. డైరీ పరిశ్రమ : దీనిలో పాలు, పాల ఉత్పత్తులు చేస్తారు.
  2. కబేల (పశువధశాల) : ఎద్దు మాంసం ఇక్కడ తయారుచేస్తారు.
  3. తోళ్ళ పరిశ్రమ : ఇక్కడ తోళ్లను శుభ్రపరిచి పర్సులు, బెల్ట్ లు, చెప్పులు తయారుచేస్తారు.
  4. ఎరువుల పరిశ్రమ : పేడను ఉపయోగించి బయోగ్యాస్ తయారుచేస్తారు.
  5. బయోగ్యాస్ పరిశ్రమ : పశువుల ఎముకలను ఎరువుల కర్మాగారాలలో వాడతారు.
  6. వస్తువులు తయారుచేసే పరిశ్రమ : పశువుల చర్మం, కొమ్ములను ఉపయోగించి వివిధ రకాల ఆట మరియు అలంకార వస్తువులు తయారుచేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 5.
మీ గ్రామంలో ఎక్కడైనా కోళ్ళ ఫారం ఉందా ? గ్రుడ్లను ఎలా మార్కెట్ కి ఎగుమతి చేస్తారు ? ప్యాకింగ్ కు ఏ రకమైన పదార్థాలను వాడతారు ?
జవాబు:
మా గ్రామంలో కోళ్ళ ఫారం ఉంది. గ్రుడ్లు, మార్కెట్ కి ఎగుమతి చేయుటకు 30 గ్రుడ్లు పట్టే ట్రేలో ఉంచుతారు. ఇలాంటి 10 ట్రేలను ఒక అట్టపెట్టిలో పెట్టి దూరంను బట్టి లారీ కాని, ఆటో కాని లేదా రిక్షాలో కాని పెడతారు. ఈ ట్రేలో గ్రుడ్లు ఆకారంలో గుంటలు ఉంటాయి. ప్యాకింగ్ కు కాగితం, వేస్ట్ ప్లాస్టిక్, అట్టలు (మొక్కజొన్న ఆకుల నుండి తయారు చేస్తారు) వంటివి వాడతారు.

ప్రశ్న 6.
నదీముఖ ద్వారాలు అనగానేమి ? అవి సముద్రపు మరియు నీటి చేపలు నివసించటానికి ఎలా అనువుగా ఉంటాయి ?
జవాబు:
నదీముఖ ద్వారాలు అనగా నదులు సముద్రంలో కలిసే చోటు. నదీముఖ ద్వారాలలో సముద్రపు మరియు మంచినీటి చేపలు నివసించటానికి ఎలా అనువుగా ఉంటుంది అంటే ఈ ప్రాంతాలలో నివసించే చేపలు లవణీయత వ్యత్యాసాన్ని తట్టుకొనే శక్తిని కలిగి ఉంటాయి.

ప్రశ్న 7.
అక్టోబర్, నవంబర్ మాసాలలో చికెన్ మరియు గుడ్ల రేట్లు తగ్గుతాయి ? ఎందుకు ? కారణాలను చర్చించి రాయండి.
జవాబు:
1. ఈ నెలలందు తయారు అయిన గుడ్లు పొదగటానికి ఉపయోగించరు. కారణం ఉష్ణోగ్రత 38.39°C ఉండదు.
2. వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువ కాబట్టి గ్రుడ్లు చెడిపోవు.
3. అంతేకాక అక్టోబర్ లో సాధారణంగా దసరా మరియు దీపావళి పండుగలు వచ్చును. నవంబర్ కార్తీకమాసం ప్రభావం వలన ఎక్కువమంది మాంసాహారాన్ని తినరు. పై కారణాల వలన అక్టోబర్, నవంబర్ మాసాలలో చికెన్ మరియు గుడ్ల రేట్లు తగ్గుతాయి.

ప్రశ్న 8.
ఈ క్రింది పదాలను గురించి రాయండి.
శ్వేత విప్లవం, నీలి విప్లవం, ఎపిస్ టింక్చర్, హాల్ స్టీన్.
జవాబు:
శ్వేత విప్లవం : పాల ఉత్పత్తిని పెంచటం. పాల నుండి లభించే ఇతర పదార్థాల నాణ్యతని, పరిమాణాన్ని పెంచి, సాధ్యమైనంత తక్కువ ధరలో అందరికీ అందించటానికి జరిగిన ప్రయత్నమే శ్వేత విప్లవం అంటారు.
నీలి విప్లవం : చేపల పెంపకం. దిగుబడి పెంచటానికి, నాణ్యత అధికం చేయుటకు జరిగిన ప్రయత్నమే నీలి విప్లవం అంటారు. ఎపిస్ టింక్చర్ : తేనెటీగల విషంతో తయారుచేయబడిన హోమియో మందుని ఎపిస్ టింక్చర్ అంటారు.
హాల్ స్టీన్ : ప్రతిరోజు 25 లీటర్ల పాలు ఇచ్చే డెన్మార్క్ దేశానికి చెందిన ఆవు జాతి పేరు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 9.
చేపలను నిలవ చేయడంలో పాటించే పద్ధతులను వివరించండి.
జవాబు:
చేపలు నిలువ చేయడంలో పాటించే పద్ధతులు

  1. ఎండలో ఎండబెట్టడం
  2. పాక్షికంగా ఎండబెట్టడం
  3. పొగ బెట్టడం
  4. ఉప్పులో ఊరబెట్టడం

ప్రశ్న 10.
పాలశీతలీకరణ కేంద్రాన్ని పరిశీలించినప్పుడు నీవు ఏ రకమైన అనుమానాలు నివృత్తి చేసుకుంటావు ? వాటి జాబితా తయారుచేయండి.
జవాబు:
పాలశీతలీకరణ కేంద్రాన్ని పరిశీలించినప్పుడు నేను ఈ అనుమానాలు నివృత్తి చేసుకొనుటకు తయారుచేసిన జాబితా.
అవి:

  1. పాలశీతలీకరణ కేంద్రాలలో ఉన్న పాలు ఎందుకు తొందరగా పాడు అవ్వవు?
  2. పాశ్చరైజేషన్ ఎలా చేస్తారు ?
  3. పాల కేంద్రాలలో పాల శుద్ధితో పాటు ఇతర పదార్థాలు ఏవైనా తయారుచేస్తారా ?
  4. శీతాకాలంలో అధికంగా వచ్చిన పాలను ఏమి చేస్తారు ?
  5. పాలపొడి ఎలా చేస్తారు?
  6. పాలను, పాల పొడిని ఎందుకు సూక్ష్మజీవ రహిత ప్లాస్టిక్ కవరులలోను, డబ్బాలలో నిల్వచేస్తారు ?

ప్రశ్న 11.
కోళ్ళ/ఈము/చేపల/పశువుల/తేనెటీగల పెంపకంలో ఏదో ఒకదానిని సందర్శించి, అక్కడి రైతులనడిగి యాజమాన్య పద్ధతులపై ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
నేను మాకు దగ్గరలో ఉన్న కోళ్ళ పరిశ్రమను సందర్శించాను. కోళ్ళ పెంపక విధానంలో యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవటం గమనించాను.

  1. నేల క్రింది భాగంలో తడి, తేమను నివారించటానికి, నేలను పొట్టుతో కప్పారు.
  2. నేల సహజత్వాన్ని కాపాడటానికి సున్నం చల్లుతున్నారు. ఇది వ్యర్థాల వలన ఏర్పడే ఆమ్లత్వాన్ని నివారించటానికి తోడ్పడుతుంది.
  3. నీరు, ఆహారం వృధా కాకుండా తొట్టెలను ఎత్తులో అమర్చారు.
  4. రాత్రివేళలో సరైన ఉష్ణోగ్రతను నెలకొల్పటానికి విద్యుత్ దీపాలను ఉంచారు.
  5. కోడిపిల్లలు పొడుచుకోకుండా, డీబికింగ్ (ముక్కు కత్తిరించటం) చేస్తున్నారు.
  6. రోజు ఆహారాన్ని నిర్ణీత మోతాదులో నిర్ణీత వేళకు అందిస్తున్నారు.
  7. వేడిని నివారించటానికి, కోళ్ళ షెడ్ ను కొబ్బరి మట్టలతో కప్పారు. పరిసరాలలో చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చారు.
  8. కోడి వయస్సును బట్టి ఆహార మోతాదు మార్చి అందిస్తున్నారు. మూడు నెలల వయస్సు నుండి కోళ్ళ పెరుగుదల అధికంగా ఉంటుంది కావున పౌష్ఠిక ఆహారం అందిస్తున్నారు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 12.
వార్తాపత్రికల నుండి పాల ఉత్పత్తికి, పాలలో కలుషితాలకు సంబంధించిన వార్తను సేకరించి నివేదికను తయారుచేసి గోడపత్రికపై ప్రదర్శించండి.
జవాబు:
పాల ఉత్పత్తికి తీసుకోవలసిన చర్యలు :

  1. రైతులు ముందుగా మంచి పాలు ఇచ్చే పశువులను ఎంచుకోవాలి.
  2. పచ్చిమేత 20 కేజీల వరకు రోజూ పెట్టాలి.
  3. ఆ పశువులు పాలిచ్చే దానిని బట్టి దాణా పెట్టాలి. సుమారుగా ప్రతి పది లీటర్ల పాలకు నాలుగు కిలోల మిశ్రమ దాణా పెట్టాలి.
  4. పశువులు నివసించే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి.
  5. కాలం బట్టి వచ్చే వ్యాధులు నివారించుటకు టీకాలు ఇప్పించాలి.

పాలలో కలుషితాలకు సంబంధించిన నివేదిక :

  1. పాలలో ఈ క్రింది పేర్కొన్న కలుషితాలు కలుపుతున్నారు.
  2. సోడియం బై కార్బొనేట్, గంజిపిండి, సబ్బునీళ్ళు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, మెలనిన్.
  3. కొన్ని ప్రాంతాలలో కలుషితమైన ఆహారము పశువులకు పెట్టుట వలన పాలు కలుషితం అవుతున్నాయి.
    ఉదా : మెలనిన్ ఉన్న పాలు త్రాగుట వలన పిల్లలు చనిపోవుదురు. కొందరిలో మూత్రపిండాలు చెడిపోవును.

ప్రశ్న 13.
సముద్రపు కలుపుమొక్కలకు సంబంధించిన సమాచారాన్ని మీ పాఠశాల గ్రంథాలయం నుంచి సేకరించండి. ఉదాహరణలతో వివరించండి.
జవాబు:

  1. సముద్రపు కలుపు మొక్కలు గోధుమవర్ణ శైవలాలకు చెందినవి.
  2. సముద్రంలో ఇవి అతిపెద్ద పరిమాణంలో తుట్టలు తుట్టలుగా, సమూహంగా పెరుగుతాయి.
  3. వీటిని కెర్బ్స్ అంటారు. వీటివలనే అనేక ఉపయోగాలు ఉన్నాయి.
    • పశువుల మేతగా ఉపయోగపడును (సముద్రపు కలుపుమొక్క)
    • బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగపడును (సముద్రపు కలుపు మొక్క)
    • పైకో కొల్లాయిడ్ ఉపయోగపడును (సముద్రపు కలుపు మొక్క అగార్ – అగార్)
      పొగ పెట్టించి ఈగలను ప్రక్కకు మళ్ళించి తేనెపట్టును జాగ్రత్తగా కత్తిరించి తేనె తీస్తారు.

ప్రశ్న 14.
సాధారణంగా ఏ కాలంలో తేనెపట్టునుండి తేనెను సేకరిస్తారు. తేనెను సేకరించడానికి తియ్యడానికి అనుసరించే విధానాన్ని రాయండి.
జవాబు:
సాధారణంగా మా గ్రామంలో తేనెపట్టును పువ్వులు బాగా పూసే కాలమైన అక్టోబరు / నవంబరు మరియు ఫిబ్రవరి / జూన్ సీజన్లో చూస్తాము. తేనెపట్టు నుంచి తేనెను తీయడానికి అనుసరించే విధానము :
పొగ పెట్టించి ఈగలను ప్రక్కకు మళ్ళించి తేనెపట్టును జాగ్రత్తగా కత్తిరించి తేనె తీస్తారు.

ప్రశ్న 15.
ఎండిన తేనెపట్టును పరిశీలించండి. అది ఎలా నిర్మితమైనదో పరిశీలించి, బొమ్మను గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 1
ఎండిన తేనెపట్టును పరిశీలించితిని. అది అనేక చిన్న చిన్న గదులతో విభజింపబడి ఉండును. తేనెపట్టు మైనపు పధార్థం వలన చిన్నచిన్న గదులు ఏర్పడుటకు సహాయపడును. ఈ మైనం కూలీ ఈగలు స్రవించి తయారుచేస్తాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 16.
పశువులు మన ఆహారం కొరకే కాదు. వాటి విసర్జితాలు (వ్యర్థ పదార్థాలు) కూడా మనకు ఉపయోగపడతాయి. ఈ వినూత్న విషయాన్ని ఎలా అభినందిస్తారు ?
జవాబు:
పశువులు మన ఆహారం కొరకే కాదు. వాటి విసర్జితాలు పేడ మనకు బాగా ఉపయోగపడును. దీనిని ఎరువుగా పొలంలో వేయవచ్చు. పూర్వపు రోజులలో పిడకల కోసం పేడను ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ పేడను కుళ్ళబెట్టి బయోగ్యాస్ తయారుచేస్తున్నారు. దానితో ఇంధన కొరత కొంత వరకు అధిగమించవచ్చు మరియు కాలుష్యం కొంతవరకు తగ్గుతుంది. అంతేకాక విద్యుత్ శక్తి కూడా ఉత్పత్తి చేయవచ్చు.

ఆహారంతో పాటు కాలుష్యాన్ని, ఇంధన కొరతలను తగ్గించిన పశువులను చూస్తే నాకు చాలా ఆనందంగా, కొంత ఆశ్చర్యంగాను ఉంది. అందుకే కొంతమంది వాటికి ప్రేమతో పేర్లు కూడా పెట్టి పిలుస్తారు.

ప్రశ్న 17.
రాజు పశుపోషణకు, వ్యవసాయానికి సంబంధం ఉంది అని తెలిపాడు. నీవు అతడిని ఎలా సమర్థిస్తావు?
జవాబు:

  1. పశుపోషణకు, వ్యవసాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది.
  2. ఈ రెండూ పరస్పరం ఆధారనీయమైనవే గాక, ఒకే నాణేనికి బొమ్మా బొరుసూ వంటివి.
  3. వ్యవసాయ ఉత్పత్తులైన గడ్డి, ధాన్యం వంటి పదార్థాలు పశుపోషణలో ఆహారంగా ఉపయోగపడతాయి.
  4. జంతువుల వ్యర్థాలైన పేడ, మూత్రం వ్యవసాయ రంగంలో ఎరువులుగా వాడతారు.
  5. ఎద్దులు, దున్నల వంటి జంతువుల ఆధారంగా చాలా వ్యవసాయపనులు జరుగుతుంటాయి.
  6. దుక్కిదున్నటం, చదునుచేయటం, రవాణా వంటి వ్యవసాయ పనులకు నేడు ఇంకా జంతువులను ఉపయోగిస్తున్నారు.
  7. తేనెటీగల పరిశ్రమ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. మొక్కలు బాగా పుష్పించినపుడే తేనెటీగలు తేనెను బాగా ఉత్పత్తి చేయగలవు.
  8. తేనెటీగలు మొక్కలలో ఫలదీకరణ రేటును పెంచి పంట దిగుబడిని పెంచుతాయి. కావున వ్యవసాయానికి, పశుపోషణకు చాలా దగ్గర సంబంధం ఉంది.

ప్రశ్న 18.
వ్యవసాయం, పశుపోషణ నాణానికి ఇరువైపులా ఉన్న అంశాలు. దీనిని నీవు ఎలా సమర్థిస్తావు ?
జవాబు:
వ్యవసాయం, పశుపోషణ నాణానికి ఇరువైపులా ఉన్న అంశాలు. ఎందుకంటే వ్యవసాయంలోని పచ్చగడ్డి, ఎండిన పశు గ్రాసం, ధాన్యం ఇంకా ఇతర ఉత్పత్తులు పశువుల దాణాగా ఉపయోగిస్తారు. అదే విధంగా పశువులను ముఖ్యంగా ఎద్దులను నేల దున్నుటకు, నూర్పిడిలోను, పశువుల పేడను ఎరువుగాను, పండిన పంటను కూడా ఇంటికి చేర్చుటకు ఎద్దులను ఉపయోగిస్తారు. ఈ రెండింటిలో ఏ ఒకటి లేకపోయిన రెండోది లేదు. కాబట్టి వ్యవసాయం, పశుపోషణ నాణానికి ఇరువైపులా ఉన్న అంశాలు.

ప్రశ్న 19.
పంట పొలాలను చేపకుంటలుగా మార్చటం వలన పర్యావరణం చెడిపోతుంది. ఆహారపు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ సమస్యపై చర్చలో పాల్గొనటానికి మీ అభిప్రాయాలను తెల్పండి.
జవాబు:
పంట పొలాలను చేపకుంటలుగా మార్చటం వలన పర్యావరణం చెడిపోతుంది మరియు ఆహారపు కొరతను ఎదుర్కొంటాము. అందుకు నా అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.
1. పొలంలో వరి మొక్కలు ఉంటే కిరణజన్య సంయోగక్రియ జరిగి వాతావరణంలోనికి ఆక్సిజన్ విడుదల అవుతుంది. కాని చేపకుంట వలన ఆ విధంగా జరగదు.
2. చేపలు కూడా నీటిలోకి CO2 విడుదల చేస్తాయి. దాని వలన వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగును.
3. చేప కుంటలో ఎక్కువగా చేపల కోసం వేసిన ఆహారం వలన, వాటి రక్షణకు ఉపయోగించే రసాయనాల వలన నీటి కాలుష్యం, భూకాలుష్యం వచ్చును.
4. చేపల కుంటలుగా మార్చుట వలన ముఖ్యంగా వరి పంట దెబ్బతిని ఆహారపు కొరత వచ్చును.

8th Class Biology 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి InText Questions and Answers

కృత్యములు

1. పశువుల పెంపకం :

(a) తరగతిలో ఐదుగురు విద్యార్థుల చొప్పున కొన్ని జట్లుగా ఏర్పడండి. రైతులు పశువులను ఎందుకు పెంచుతారో, కారణాలు చర్చించి రాయండి. మీరు పరిశీలించిన అంశాలను నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:
రైతులు పశువులను పెంచుటకు కారణాలు :
1. వారికి పశువులను పెంచుట వలన కొంత ఆదాయం వచ్చును.
2. వారికి వ్యవసాయంలో సహాయపడును. (దున్నుటకు, నూర్పిడులకు)
3. వ్యవసాయంలో లభించిన పశుగ్రాసం తిరిగి పశువుల మేతగా వాడుటకు.

(b) మీ గ్రామంలో పశువులను ఎక్కడికి తోలుకుపోతారు. పశువులను పెంచే వ్యక్తితో మాట్లాడి పశువుల పెంపకానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించండి. ఈ క్రింది ప్రశ్నల సహాయంతో

(ఎ) ఇక్కడ ఏ ఏ రకాల పశువులను పెంచుతారు ?
జవాబు:
ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మొదలైన పశువులు పెంచుతారు.

(బి) పశుగ్రాసం ఉన్న ప్రాంతాలు. ఎక్కడ ఉన్నాయి ?
జవాబు:
ఊరికి చివర ఉన్న పొలాలు, పచ్చిక బయళ్ళ దగ్గర ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి.

(సి) నీరు ఉన్న ప్రాంతం ఎక్కడ ఉన్నది ?
జవాబు:
పొలాలకు దగ్గరగా.

(డి) ఆవు, గేదెలు, మేక, గొర్రెల పెంపకంలో ఏమైనా తేడాలున్నాయా ?
జవాబు:
ఆవు, గేదెలు, ఎండిన గడ్డితో పాటు పచ్చిగడ్డి తింటాయి. మేకలు చెట్ల ఆకులను, పచ్చిగడ్డిని ఆహారంగా తీసుకొంటాయి. గొర్రెలు పచ్చిగడ్డిని, నూకలను ఆహారంగా తీసుకుంటాయి.

(ఇ) పశువులను పెంచేవారు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలేవి ?
జవాబు:
అనావృష్టి పరిస్థితులలో పశుగ్రాసం కొరత పశువులు పెంచేవారు సాధారణంగా ఎదుర్కొనే సమస్య.

(c) పశువైద్యుని దగ్గరకు వెళ్ళి పశువులకు వచ్చే సాధారణ వ్యాధుల సమాచారాన్ని తెలుసుకుని ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 2

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

పాఠ్యాంశములోని ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆదిమానవుడు కొన్ని జంతువులను మాత్రమే ఎందుకు మచ్చిక చేసుకున్నాడు ? (పేజి.నెం. 141)
జవాబు:
ఆదిమానవుడు కొన్ని జంతువులు (ఉదా : కుక్క, పిల్లి, పశువులు, పక్షులు, కోళ్ళు, చిలుక మొదలైన) వాటివలన తనకు కలుగు ఉపయోగాలు గ్రహించి వాటిని మచ్చిక చేసుకున్నాడు. అందువలన ఆదిమానవుడు కొన్ని జంతువులనే మచ్చిక చేసుకున్నాడు.

ప్రశ్న 2.
ఏనుగు, పులి, సింహం వంటి జంతువులను గ్రద్ధ, గుడ్లగూబ వంటి పక్షులను ఎందుకు మచ్చిక చేసుకోలేకపోయాడు ? (పేజి.నెం.141)
జవాబు:
ఏనుగు, పులి, సింహం వంటి జంతువులను గ్ర, గుడ్లగూబ వంటి పక్షులను ఆదిమానవుడు ఎందుకు మచ్చిక చేసుకోలేకపోయాడు అంటే ఏనుగు, పులి, సింహం క్రూరజంతువులు మరియు ఆ పక్షుల వలన లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి.

ప్రశ్న 3.
జంతువులను మచ్చిక చేసుకోవడానికి ఆనాటి మానవుడు ఏ ఏ విధానాలను పాటించి ఉంటాడో జట్లలో చర్చించి రాయండి. (పేజి.నెం. 142)
జవాబు:

  1. జంతువులు మచ్చికకు అలవాటు పడతాయి.
  2. మచ్చిక చేసుకొనుటకు పట్టుకాలం
  3. మచ్చిక వలన ఆ జంతువుకు అయ్యే ఖర్చు
  4. మచ్చిక చేసుకున్నాక అతనికి వచ్చే లాభం మొదలైన అంశాలను ఆనాటి మానవుడు జంతువులను మచ్చిక చేసుకొనేటపుడు పాటించిన పద్దతులు.

ప్రశ్న 4.
వ్యవసాయం చేసే వాళ్ళందరూ పశువులను పెంచుతారా ? (పేజి.నెం. 142)
జవాబు:
ఇంచుమించు వ్యవసాయం చేసే వాళ్ళందరూ పశువులను పెంచుతారు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 5.
వ్యవసాయానికి, పశుపోషణకు ఏమైనా సంబంధం ఉందా ? (పేజి.నెం. 142)
జవాబు:
వ్యవసాయానికి, పశుపోషణకు చాలా దగ్గర సంబంధం ఉంది.

ప్రశ్న 6.
ఎద్దులను, దున్నపోతులను ఉపయోగించి ఏమేమి వ్యవసాయ పనులు చేస్తారో రాయండి. (పేజి.నెం. 143)
జవాబు:
1. ఎద్దులను ఉపయోగించి పొలం, దుక్కి దున్నుతారు. పంట నూర్పిడి సమయంలో కూడా ఎద్దులను ఉపయోగిస్తారు.
2. దున్నపోతులను ప్రాచీన పద్ధతులలో నీటి పారుదలకు, పంట నూర్పిడి యందు ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
మీ ప్రాంతంలో పశువైద్యశాల ఎక్కడ ఉంది ? (పేజి.నెం. 143)
జవాబు:
మా ప్రాంతంలో పంచాయతీ రాజ్ ఆఫీసుకు దగ్గరగా ఉంది.
గమనిక : ఎవరి ప్రాంతంలో ఎక్కడ ఉంటే అక్కడే పేరు వ్రాసుకోవాలి.

ప్రశ్న 8.
అక్కడ (పశు వైద్యశాలలో) ఎవరు పనిచేస్తున్నారు ? ఏ పని చేస్తారు ? (పేజి.నెం. 143)
జవాబు:
అక్కడ (పశు వైద్యశాలలో) పశువైద్యులు పనిచేస్తారు. పశువుల వైద్యం, ఆరోగ్యం గురించి చూస్తారు.

ప్రశ్న 9.
మనకు పాల ఉత్పత్తి ఎక్కువగా ఎక్కడి నుండి వస్తుంది ? (పేజి.నెం. 144)
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 3
జవాబు:
మనకు పాల ఉత్పత్తి ఎక్కువగా గ్రామాల నుండి వస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 10.
ఒంటె పాలను ఏ ప్రాంతంవారు ఉపయోగిస్తారు ? (పేజి.నెం. 144)
జవాబు:
ఎడారి ప్రాంతంవారు ఒంటె పాలను ఉపయోగిస్తారు.

ప్రశ్న 11.
గాడిద పాలను ఉపయోగించటం చూశారా ? (పేజి.నెం. 144)
జవాబు:
గాడిద పాలను ఉపయోగించటం చూడలేదు.
గమనిక : ఈ మధ్య గాడిద పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటాము అని పుకార్లు బాగా వచ్చినాయి. పుకార్లు అని ఎందుకు అన్నాము అంటే శాస్త్రవేత్తలు ఎవరూ అవి మంచివి అని చెప్పలేదు కాబట్టి.

ప్రశ్న 12.
మీ గ్రామంలో రైతులు ఏ రకమైన పశుగ్రాసాన్ని వాడతారు ? (పేజి.నెం. 144)
జవాబు:
మా గ్రామంలో రైతులు వరిగడ్డి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, ఉలవలు మొదలైనవి పశుగ్రాసంగా వాడతారు.

ప్రశ్న 13.
పంటకోత కోసిన తరువాత పశుగ్రాసాన్ని ఎలా భద్రపరుస్తారు ? (పేజి.నెం. 144)
జవాబు:
పంటకోత కోసిన తరువాత దానిని రెండు లేక మూడు రోజులు ఎండలో ఆరబెట్టి ధాన్యాన్ని నూర్పిడి చేసి వచ్చిన గడ్డి కట్టలు క్రింద కట్టి ఇంటికి తీసుకువచ్చి గడ్డివాముగా వేసి భద్రపరుస్తారు.

ప్రశ్న 14.
క్రింది గ్రాఫ్ ను పరిశీలించండి. ఇది వివిధ దేశాలలో పాల ఉత్పత్తిని సూచిస్తుంది. మనదేశంలో పాల ఉత్పత్తిని పరిశీలించండి. మిగతా దేశాలతో పోల్చినప్పుడు పాల ఉత్పత్తిలో మనము ఎందుకు వెనుకబడి ఉన్నామో జట్లలో చర్చించండి. (పేజి.నెం. 144)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 4
1. పాల ఉత్పత్తిలో ఇజ్రాయిల్ అగ్రస్థానంలో ఉంది.
2. మన ఇండియా అన్నింటికన్నా దిగువస్థానంలో ఉంది.
కారణాలు :

  1. మనదేశంలో పాడిపరిశ్రమ ఇంకా గ్రామీణ కుటీర పరిశ్రమగానే ఉంది.
  2. పాడి పరిశ్రమను ఒక వ్యాపారాత్మకంగా లాభసాటిగా భావించటం లేదు.
  3. కేవలం వ్యవసాయంలో అంతర్భాగంగానే, పాడిపరిశ్రమ నడుస్తుంది.
  4. దేశీయ గేదెలనే ఎక్కువ ప్రాంతాలలో మేపుతున్నారు.
  5. పశువుల పెంపకంలో మెలకువలకు, పోషణ విధానంపై సరైన అవగాహన లేదు.
  6. వ్యాధుల విషయంలో రైతులకు పరిజ్ఞానం లేదు.

ప్రశ్న 15.
మీ గ్రామంలో పాల సేకరణ కేంద్రం ఉందా ? (పేజి.నెం. 145)
జవాబు:
మా గ్రామంలో పాల సేకరణ కేంద్రం ఉంది.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 16.
పాలను సేకరించి ఎలా ఎగుమతి చేస్తారు ? (పేజి.నెం. 145)
జవాబు:
పాలను పాలు సేకరించు కేంద్రం నుంచి 40 లీటర్ల క్యాన్ నింపి వాటిని పాల శీతలీకరణ కేంద్రంనకు ఎగుమతి చేస్తారు.

ప్రశ్న 17.
పాలధరను ఎలా నిర్ణయిస్తారు ? (పేజి.నెం. 145)
జవాబు:
పాలధరను పాల శీతలీకరణ కేంద్రం యొక్క చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు పాలలో గల వెన్న శాతాన్ని బట్టి పాల ధరను నిర్ణయిస్తారు.

ప్రశ్న 18.
మీ ప్రాంతంలో పాల శీతలీకరణ కేంద్రం ఎక్కడ ఉంది ? (పేజి.నెం.145)
జవాబు:
మా ప్రాంతంలో పాల శీతలీకరణ కేంద్రం విజయవాడలో ఉంది :
గమనిక : మీ ప్రాంతంలో ఇంకా దగ్గరలో ఏది, ఉంటే అది వ్రాయాలి.

ప్రశ్న 19.
పాల ఉత్పత్తి ఏ నెలలో అధికంగా ఉంటుందో చెప్పగలరా ? (పేజి.నెం. 145)
జవాబు:
పాల ఉత్పత్తి నవంబరు నెలలో అధికంగా ఉంటుంది.

ప్రశ్న 20.
ఏ నెలల్లో పాల ఉత్పత్తి ఎందుకు అధికంగా ఉంటుందో కారణాలను మీ తరగతిలో చర్చించండి. (పేజి.నెం. 145)
జవాబు:
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఈ నెలల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉండుటకు కారణాలు :
1. గేదెలు జులై నుంచి సెప్టెంబరు మధ్య ఎక్కువగా ఈనుతాయి. ఈనిన మొదటి మూడు నెలల్లో పాలు ఎక్కువ ఇస్తాయి.
2. పచ్చిమేత ఎక్కువగా అందుబాటులో ఉండును.
3. వాతావరణం కూడా పశువుల పెరుగుదలకు, ఈనుటకు, మేతను ఎక్కువగా తీసుకొనుటకు చాలా అనుకూలంగా ఉండును.

ప్రశ్న 21.
పౌల్టీలలో పెంచే కోళ్ళు, గ్రామాలలో పెంచే దేశీయ కోళ్ళు ఒకే రకంగా ఉంటాయా ? (పేజి.నెం. 148)
జవాబు:
పౌల్టీలలో పెంచే కోళ్ళు, గ్రామాలలో పెంచే దేశీయ కోళ్ళు ఒకే రకంగా ఉండవు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 22.
జన్యుపరంగా మార్పు చెందిన ఆహారం వాడటం మంచిదా ? కాదా ? ఆలోచించండి. (పేజి.నెం. 148)
జవాబు:
జన్యుపరంగా మార్పు చెందిన ఆహారం వాడటం మంచిది కాదు.

ప్రశ్న 23.
చికెన్-65 అంటే ఏమిటో తెలుసా ? అలా ఎందుకు అంటారు ? (పేజి.నెం. 148)
జవాబు:
చికెన్ – 65 అంటే అదో వంటకం పేరు. అలా ఎందుకు అంటారు అంటే దీనిని 1965వ సంవత్సరంలో చెన్నైలోని బుహారి హోటల్ లో మొదటగా తయారుచేస్తారు.

ప్రశ్న 24.
కోడిగుడ్లు పొదగటానికి పట్టేకాలం ఎంతో మీకు తెలుసా ? (పేజి. నెం. 149)
జవాబు:
కోడిగుడ్లు పొదగటానికి పట్టేకాలం 21 రోజులు అని నాకు తెలుసు.

ప్రశ్న 25.
మీ గ్రామాలలో గుడ్లను పొదిగే విధానంపై నివేదిక తయారుచేయండి. బొమ్మలు కూడా గీయండి. (పేజి.నెం. 149)
జవాబు:
మా గ్రామాలలో పొదిగే కాలం రాగానే గంపలో గడ్డిపరచి దానిమీద గుడ్లు ఉంచితే కోళ్ళు గుడ్లపై కూర్చొని గుడ్లన పొదుగుతాయి. . విద్యార్థి స్వయంకృత్యం

ప్రశ్న 26.
పరాగ సంపర్కానికి తేనెటీగలు ఎలా తోడ్పడతాయి ? (పేజి.నెం. 150)
జవాబు:
తేనెటీగలు మకరందం కోసం ఒక పువ్వుపై వాలుతాయి. అప్పుడు దాని శరీరానికి పరాగరేణువులు అంటుకొని ఉంటాయి. అది తర్వాత వేరే పుష్పంపై మకరందం కోసం వెళితే ఆ పరాగరేణువులు ఆ పుష్పంలోని కీలాగ్రంపై చేరును.
ఈ విధంగా తేనెటీగలు పరాగసంపర్కానికి సహాయపడును.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 27.
మీ పరిసరాలలో తేనెపట్టును ఎక్కడ గమనించారు ? (పేజి.నెం. 152)
జవాబు:
మా పరిసరాల్లో పెద్ద పెద్ద చెట్లకు మరియు పెద్ద పెద్ద భవనాలకు తేనెపట్టు ఉండటం గమనించాం.

ప్రశ్న 28.
తేనెపట్టును ఏ కాలంలో ఎక్కువగా చూడవచ్చు ? (పేజి.నెం. 152)
జవాబు:
తేనెపట్టు ఏ కాలంలో అయితే ఎక్కువగా మొక్కలకు పూలు పూస్తాయో ఆ కాలంలో చూస్తాము. అది వర్షాకాలం, ఎండకాలానికి ముందు (శిశిర ఋతువు) పూలు బాగా పూస్తాయి.

ప్రశ్న 29.
తేనెపట్టు నుంచి తేనె సేకరించడం జాగ్రత్తగా చేసే పని. తేనెపట్టు నుంచి తేనె ఎలా సేకరిస్తారో, సేకరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో రాయండి. (పేజి.నెం. 152)
జవాబు:
తేనెపట్టు ఉన్న చోట పొగ పెట్టించి ఈగలను ప్రక్కకు మళ్లించి తేనె తీయడం “జరుగును. ఈగలు ప్రక్కకు వెళ్ళిన ఆ తరువాత తేనెపట్టును జాగ్రత్తగా కత్తిరించి తేనెను తీస్తారు. తేనె తీసే మనిషి గోనె సంచి ఒంటినిండా కప్పుకుంటారు.

ప్రశ్న 30.
కృత్రిమ మరియు సహజ తేనెపట్టుల మధ్య గల వ్యత్యాసాలను గురించి చర్చించండి. (పేజి.నెం. 152)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి 5

ప్రశ్న 31.
తేనెటీగల మైనం యొక్క ఉపయోగాలు వ్రాయండి. (పేజి.నెం. 152)
జవాబు:
తేనెటీగల మైనంతో అలంకరణ సామగ్రి, గోళ్ళ రంగు, కొవ్వొత్తులు, చెప్పుల పాలిష్ మొదలైనవి తయారుచేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 32.
మీ చుట్టుపక్కల దొరికే వివిధ రకాల చేపల జాబితాను తయారుచేయండి. స్థానిక పేర్లను మాత్రమే రాయండి. (పేజి.నెం. 153)
జవాబు:
మా చుట్టుపక్కల దొరికే వివిధ రకాల చేపల స్థానిక పేర్లు :

  1. బొచ్చె
  2. రాహు, ఎర్రగండు
  3. రాగండి
  4. ఎర్రమోసు
  5. పెద్ద బొచ్చె
  6. వాలుగ
  7. మట్ట గిడస
  8. పులస
  9. సొర

ప్రశ్న 33.
మీకు కొలనులో చేపలను ఎలా పట్టాలో తెలుసా ? (పేజి.నెం. 153)
జవాబు:
తెలుసు, మేము కొలనులో చేపలను పట్టుటకు ఫిషింగ్ నెట్స్, ఫిషింగ్ రాడ్స్ ఉపయోగిస్తాము.

ప్రశ్న 34.
అధిక మొత్తంలో చేపలను పట్టడానికి ఏం చేస్తారు ? (పేజి.నెం. 153)
జవాబు:
అధిక మొత్తంలో చేపలు పట్టడానికి ఈ క్రింది విధంగా చేస్తాము.
1. అధిక మొత్తంలో చేపలు పట్టుకొనుటకు నైలాన్ వలలు ఉపయోగిస్తారు. .
2. పెద్ద వలలను, మోటార్ పడవలను ఉపయోగిస్తారు.

ప్రశ్న 35.
మర పడవలు ఉపయోగించి చేపలు పట్టడాన్ని నిరంతరంగా కొనసాగిస్తే ఏం జరుగుతుంది ? (పేజి.నెం. 153)
జవాబు:
మర పడవలు ఉపయోగించి చేపలు పట్టడాన్ని నిరంతరం కొనసాగిస్తే

  1. సహజ వనరుల దుర్వినియోగం జరుగును.
  2. కొన్ని చేపల జాతులు అంతరించును.
  3. చేపలను ఆహారంగా తినే ఇతర జీవులకు హాని కలుగును.
  4. ఆహారపు గొలుసు, ఆవరణ వ్యవస్థ అస్తవ్యస్థం అగును.

ప్రశ్న 36.
ఆలుచిప్పలు వలన కలిగే ఉపయోగాలను మీ ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకోండి. (పేజి.నెం.153)
జవాబు:

  1. ఆలుచిప్పలు విటమిన్ – డి, కాల్షియం, విటమిన్ – బి, ప్రొటీన్లు, మంచి కొలెస్ట్రాల్, ఇనుమును కలిగి ఉంటాయి.
  2. నీటిని వడకట్టి శుభ్రపరుస్తాయి.
  3. ఆలుచిప్పలు తినుటవలన లైంగిక సామర్థ్యం పెరుగును.
  4. కొన్ని ఆలుచిప్పలు ముత్యాల తయారీలో ఉపయోగపడును.

AP Board 8th Class Biology Solutions Chapter 9 జంతువుల నుండి ఆహారోత్పత్తి

ప్రశ్న 37.
మన సముద్ర జలాలలో “టూనా” అనే ముఖ్యమైన చేప లభిస్తుంది. టూనా చేపకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి గోడ పత్రికలో ప్రదర్శించండి. (పేజి.నెం. 153).
జవాబు:
టూనా చేప 1 నుంచి 10 అడుగుల వరకు పెరుగును. 600 కేజీల బరువు ఉండును. 70 కి.మీ. వేగంతో ఈదును. 26°C ఉష్ణోగ్రత వద్ద నివసించును. దీనిలో ముఖ్యంగా 3 ఓమెగో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అసలు ఉండవు. క్రొవ్వులు కూడా తక్కువగా (8 గ్రాములు) ఉండును. ప్రొటీన్స్ ఎక్కువగా ఉండును.
ఈ “టూనా” చేపల ఉపయోగాలు :

  1. గుండెపోటు రాకుండా చేయును.
  2. పిల్లలలోను ఆస్మా తగ్గించును.
  3. మానసిక ఒత్తిడులను తగ్గించును.
  4. కీళ్ళ నొప్పులను తగ్గించును.
  5. పక్షవాతం నుంచి వ్యక్తి తొందరగా కోలుకొనుటకు సహాయపడును.

ప్రశ్న 38.
నీలి విప్లవం అనగానేమి ? దాని ప్రభావాన్ని తరగతి గదిలో ఉపాధ్యాయునితో చర్చించండి. (పేజి.నెం. 154)
జవాబు:
చేపల పెంపకం, దిగుబడి పెంచటానికి, నాణ్యత అధికం చేయుటకు జరిగిన ప్రయత్నమే నీలి విప్లవం అంటారు.
నీలి విప్లవం ప్రభావం :

  1. పెరుగుతున్న జనాభా అవసరానికి సరిపోవును.
  2. ఎగుమతులకు సరిపోయినన్ని చేపలు లభించును.
  3. సముద్రాలలో ఆవరణ వ్యవస్థ అంతగా పాడవదు.
  4. వ్యవసాయదారులకు రెండవ పంటగా ఉపయోగపడును.

ప్రశ్న 39.
మీ ప్రాంతంలో చేపలను నిల్వచేసే పద్ధతుల జాబితా రాయండి. (పేజి.నెం. 155)
జవాబు:
మా ప్రాంతంలో చేపలను క్రింది పద్ధతుల్లో నిల్వ చేస్తారు.

  1. ఎండలో ఎండబెట్టడం
  2. పాక్షికంగా ఎండబెట్టడం
  3. ఉప్పులో ఊరబెట్టడం
  4. పొగబెట్టడం

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

SCERT AP 8th Class Biology Study Material Pdf 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 4th Lesson Questions and Answers జంతువులలో ప్రత్యుత్పత్తి

8th Class Biology 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
ప్రకృతిలో అన్ని జీవులు ప్రత్యుత్పత్తిని ఆపివేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:

  • ప్రత్యుత్పత్తి అనేది సజీవులలో ఒక ముఖ్యమైన జీవనక్రియ.
  • దీనివల్ల ప్రౌఢ జీవులు, పిల్ల జీవులను ఉత్పత్తి చేసి తమ తమ జాతులను, వాటి జనాభాను పెంచుకుంటూ ఈ జీవావరణంలో తమ ప్రభావం కోల్పోకుండా చూసుకుంటాయి.
  • దీనివల్ల పాత తరం స్థానంలో కొత్త తరం వచ్చి ఆవరణ వ్యవస్థలో వాటి పాత్రను పూర్తిచేసి ప్రకృతి సమతుల్యతను కాపాడతాయి.
  • ప్రత్యుత్పత్తిని జీవులు ఆపివేస్తే, ఉన్న జీవులు ముసలివై కొంతకాలం తర్వాత చనిపోతాయి. తరువాత వాటి స్థానాన్ని భర్తీచేసే కొత్తతరం ఉండదు.
  • కాబట్టి ‘ప్రకృతిలో సమతుల్యత’ దెబ్బతిని సృష్టి అంతానికి కారణమవుతుంది.

ప్రశ్న 2.
ఈ కింది వాటిలో తేడాలను తెలపండి.
ఎ) లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి
జవాబు:

లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి
1. ఒక జీవి లేదా స్త్రీ పురుష జీవులు అవసరం. 1. ఒక జీవి మాత్రమే అవసరమవుతుంది.
2. స్త్రీ పురుష బీజకణాలు ఏర్పడతాయి. 2. బీజ కణాలు ఏర్పడవు.
3. సంయుక్త బీజం ఏర్పడుతుంది. 3. సంయుక్తబీజం ఏర్పడదు.
4. సగం తల్లి లక్షణాలు, సగం తండ్రి లక్షణాలు వస్తాయి. 4. ఇవి తల్లి జీవి నకలు (జిరాక్స్) గా ఉంటాయి.

బి) సంయోగ బీజం, సంయుక్త బీజం
జవాబు:

సంయోగ బీజం సంయుక్త బీజం
1. ఇది స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల నుండి తయారవుతుంది. 1. ఇది స్త్రీ, పురుష బీజకణాల కలయిక వల్ల ఏర్పడుతుంది.
2. ఇది ఏకస్థితికం. 2. ఇది ద్వయ స్థితికం.
3. ఇది ఫలదీకరణలో పాల్గొంటుంది. 3. ఫలదీకరణ తరువాత మాత్రమే ఇది ఏర్పడుతుంది. తద్వారా జీవి పెరుగుదల మొదలవుతుంది.

సి) బాహ్య ఫలదీకరణం, అంతర ఫలదీకరణ
జవాబు:

బాహ్య ఫలదీకరణ అంతర ఫలదీకరణ
1. శరీరం బయట జరుగు ఫలదీకరణను బాహ్య ఫలదీకరణ అంటారు. 1. శరీరం లోపల (స్త్రీ జీవిలో) జరిగే ఫలదీకరణను అంతర ఫలదీకరణ అంటారు.
2. సంయుక్తబీజం బయట (గాలి, నీరు, నేల) అభివృద్ధి చెందుతుంది. ఉదా : కప్ప, చేప 2. సంయుక్త బీజం స్త్రీ జీవి శరీరంలోపల అభివృద్ధి చెందుతుంది. ఉదా : క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు మొ॥నవి.

డి) అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు
జవాబు:

అండోత్పాదకాలు శిశోత్పాదకాలు
1. గుడ్లు పెట్టి పిల్లతరాన్ని అభివృద్ధి చేసే జీవులను అండోత్పాదకాలు అంటారు. 1. పిల్లల్ని కని, పెంచి తరువాతి తరాన్ని అభివృద్ధి చేసే వాటిని శిశోత్పాదకాలు అంటారు.
2. వీటిలో అంతర ఫలదీకరణ జరుగును.
ఉదా : పక్షులు, సరీసృపాలు
2. వీటిలో కూడా అంతర ఫలదీకరణ జరుగును.
ఉదా : క్షీరదాలు, గబ్బిలం (ఎగిరే క్షీరదం)

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 3.
హైడ్రా, అమీబాల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియను పోల్చండి.
జవాబు:

హైడ్రా ప్రత్యుత్పత్తి అమీబాలో ప్రత్యుత్పత్తి
1. ఇది బహుకణ జీవి. 1. ఇది ఏకకణ జీవి.
2. దీనిలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. 2. దీనిలో కూడా అలైంగిక పద్ధతిలోనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
3. ఈ పద్ధతిని మొగ్గ తొడగడం లేదా ‘కోరకీ భవనం’ అంటారు. 3. ఇది ద్విధావిచ్ఛిత్తి లేదా బహుధా విచ్ఛిత్తిల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
4. ప్రత్యుత్పత్తి తరువాత తల్లిజీవి అంతరించిపోదు. 4. కానీ దీనిలో మాత్రం ద్విధా లేదా బహుధా విచ్ఛిత్తి తల్లిజీవి, పిల్లజీవి రెండూ జీవనం కొనసాగిస్తాయి. తరువాత తల్లి కణం అంతర్ధానమయ్యి పిల్ల కణాలను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 4.
సంయుక్తబీజం ఏర్పరచకుండానే జంతువులు వాటి సంతతిని ఉత్పత్తి చేయగలవా ? ఉదాహరణతో వివరించండి.
జవాబు:

  • లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయుక్తబీజం ఏర్పడి, దాని నుండి జీవులు ఏర్పడతాయి.
  • కాని అన్ని జంతువులు లైంగిక ప్రత్యుత్పత్తిని అనుసరించవు.
  • కొన్ని జీవులు అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయుక్తబీజం ఏర్పడకుండానే సంతతిని ఉత్పత్తి చేస్తాయి.
  • ఉదా : అమీబా – ద్విదావిచ్ఛిత్తి
    హైడ్రా – మొగ్గతొడగటం

ప్రశ్న 5.
బాహ్య లక్షణాలు పరిశీలించి ఒక జీవి అండోత్పాదకమో, శిశోత్పాదకమో ఎలా గుర్తించగలవు ?
జవాబు:
1) అండోత్పాదక జీవిలో

  • చెవులు బయటకు కనిపించవు.
  • చర్మంపై రోమాలు ఉండవు. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు గుడ్లు పెడతాయి.
  • ఉదా : పక్షులు, మొసలి,తాబేలు, పాము.

2) శిశోత్పాదక జీవిలో

  • చెవులు బయటకు కనిపిస్తాయి.
  • చర్మంపై రోమాలు ఉంటాయి. ఇలాంటి బాహ్య లక్షణాలు ఉన్న జీవులు పిల్లల్ని కని పెంచుతాయి.
  • ఉదా : క్షీరదాలు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 6.
నేను ఎవరిని ?
i) నేను పురుష, స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల ఏర్పడతాను.
జవాబు:
సంయుక్త బీజము అంటారు.

ii) నాకు తోక ఉంటుంది. అండంతో సంయోగం చెందుతాను.
జవాబు:
శుక్రకణం అంటారు.

iii) తల్లి గర్భాశయంలో పూర్తిగా ఎదిగిన పిండాన్ని నేను.
జవాబు:
భ్రూణం అంటారు.

ప్రశ్న 7.
అనేక భూచరాలలో అంతర ఫలదీకరణ జరుగుటకు కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:

  • బాహ్య ఫలదీకరణలో నీరు మాధ్యమంగా పనిచేస్తుంది.
  • అందువలన సంయోగబీజాలు ఎండిపోయి చనిపోవటం జరగదు.
  • వీటి చలనానికి నీరు దోహదపడుతుంది.
  • భూచర జీవులు భూమిమీద నివశిస్తాయి.
  • నేలమీద సంయోగబీజాలు చలించలేవు.
  • వేడికి, గాలికి సంయోగబీజాలు చనిపోతాయి.
  • అందువలన భూచరజీవులు అంతర ఫలదీకరణను అవలంబిస్తాయి.

ప్రశ్న 8.
కింది పటం సహాయంతో అందులోని జీవి యొక్క జీవిత చరిత్రలో వివిధ దశలను గుర్తించండి. ఈ జీవిలో రూపవిక్రియ ఎలా జరుగుతుందో వివరించండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 1
జవాబు:

  • ఈ పటంలో ఉన్నది ‘పట్టు పురుగు’ జీవిత చక్రంనకు సంబంధించినది.
  • దీనిలో ఎ) ప్రౌఢజీవి b) గుడ్ల దశ c) లార్వా దశ d) ప్యూపా దశలు ఉన్నాయి.
  • పట్టు పురుగు నందు అంతర ఫలదీకరణ జరిగి సంయుక్త బీలు – స్త్రీ జీవిలో ఏర్పడతాయి.
  • ఇది మల్బరీ ఆకుల వెనుకభాగాన గుడ్లు దశలు దశలుగా, గుంపులుగా పెడుతుంది.
  • ఇవి ‘సూర్యరశ్మి’ సమక్షంలో పొదగబడి లార్వా దశకు చేరుకుంటాయి.
  • ఇది ‘గొంగళి పురుగు’ మాదిరిగా ఉండి మల్బరీ ఆకులను తింటూ జీవిస్తుంది.
  • తరువాత ‘ప్యూపాదశ’లో ఈ డింభకం ఒక సంచి వంటి కోశాన్ని నిర్మించి దానిలో సుప్తావస్థలోకి వెళ్తుంది.
  • తరువాత అది కోశం నుండి ‘ప్రౌఢజీవి’ గా అభివృద్ధి చెందుతుంది.
  • ప్రౌఢజీవి లక్షణాలు లార్వా, ప్యూపా దశలలో లేనప్పటికీ చివరికి మరలా తల్లి లక్షణాలతో జీవి అభివృద్ధి చెందింది. దీనిని రూపవిక్రియ అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 9.
జతపరచండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 2
జవాబు:
ఎ) 2
బి) 1
సి) 4
డి) 3

ప్రశ్న 10.
ఈ కింది ఖాళీలను పూరింపుము.
ఎ) పిల్లలను కనే జంతువులను ……………….. అంటాం.
బి) మానవులలో శిశువు పెరుగుదల …………………. లో జరుగుతుంది.
సి) అండాలు ……………………… నుండి విడుదలవుతాయి.
డి) టాడ్ పోల్ అనేది ……………………… యొక్క ప్రాథమిక రూపం.
ఇ) కోరకీభవనం, ద్విధా విచ్ఛిత్తి …………………… ప్రత్యుత్పత్తి విధానాలు.
జవాబు:
ఎ) శిశోత్పాదక జీవులు
బి) స్త్రీ జీవి గర్భాశయం
సి) స్త్రీ జీవి బీజకోశం
డి) కప్ప
ఇ) అలైంగిక

ప్రశ్న 11.
అమీర్ ఒక చెరువులో టాడ్ పోల్ ను చేపగా భావించి జాగ్రత్తగా అక్వేరియంలో ఉంచాడు. కొన్ని రోజుల తరువాత అమీర్ దానిలో ఏమేమి మార్పులు గమనిస్తాడో రాయండి.
జవాబు:

  • ‘టాడ్పేల్’ అచ్చం చేపపిల్ల లక్షణాలు కలిగిన ‘కప్ప డింభకం’.
  • పిల్లలు (అమీర్) దానిని చెరువులో చూసి చేపపిల్ల అనుకుని ఆక్వేరియంలో ఉంచాడు.
  • ముందు దీనికి జిగురు ముద్ద లాంటి మూతి ఉండటం గమనించాడు.
  • అది నీళ్ళలో నాచును, అక్వేరియంలో గోడలను అంటిపెట్టుకోవటానికి పనికి వస్తుందని గమనించాడు.
  • దీనికి ఉన్న తోక సాయంతో ఈదగలుగుతుందని గమనించాడు.
  • ఇది బాహ్య మొప్పల ద్వారా ‘జల శ్వాసక్రియ’ జరుపుతుందని తెలుసుకున్నాడు.
  • నెమ్మదిగా ముందున్న శ్లేష్మస్థర ముద్ద నోరుగా పై క్రింది పెదవులుగా విడిపోవటం చూసాడు.
  • తరువాత మొప్పలపై ఉపరికుల ఏర్పడింది.
  • తరువాత దీని తోక కొంచెం కొంచెం పొడవు తగ్గటాన్ని గమనించాడు.
  • ఉపరికుల, బాహ్య మొప్పల స్థానంలో ముందు కాళ్లు ఆవిర్భవిస్తున్నాయి.
  • తరువాత తోక మొదలైన స్థానం నుంచి ఇరుపక్కల వెనుక కాళ్లు ఆవిర్భవిస్తున్నాయి.
  • తల కింది భాగంలో ఇరువైపులా ఉన్న బాహ్య మొప్పలు అంతరించిపోయాయి.
  • తోక పూర్తిగా కుంచించుకుపోయింది.
  • ముందు, వెనుక కాళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందాయి.
  • ఊపిరితిత్తులు ఏర్పడి ఇది నీటి పైకి మూతి పెట్టి బాహ్య నాసికా రంధ్రాల ద్వారా గాలి పీల్చుకోవటం గమనించాడు.
  • ఇది ఇప్పుడు పూర్తిగా రూపాంతరం చెంది కప్ప పిల్లగా మారిపోవడాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయాడు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 12.
చేపలు, కప్పలు అధిక సంఖ్యలో అండాలను ఎందుకు విడుదల చేస్తాయి ? మానవుని వంటి క్షీరదాలు అధిక సంఖ్యలో అండాలు విడుదల చేయకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయో ఉపాధ్యాయునితో చర్చించి రాయండి.
జవాబు:

  • చేపలు, కప్పలలో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది.
  • కావున ఇవి అండాలు, శుక్రకణాలను నీటిలోనికి విడుదల చేస్తాయి.
  • నీటి ప్రవాహానికి వర్షాలకు ఇతర జీవుల ఆహారంగా కొన్ని అండాలు నశిస్తాయి.
  • అందువలన అండాలలో ఫలదీకరణ అవకాశాలు తగ్గుతాయి. కావున ఈ జీవులు అధిక సంఖ్యలో అండాలను ఉత్పత్తి చేస్తాయి.
  • మానవుని వంటి క్షీరదాలలో అంతర ఫలదీకరణ జరుగుతుంది.
  • అండాలు నశించటం ఉండదు. ఫలదీకరణ అవకాశాలు అధికం.
  • కావున క్షీరదాలలో అండాలు తక్కువ సంఖ్యలో విడుదల అవుతాయి.

ప్రశ్న 13.
మీ గ్రంథాలయము నుండి గాని, ఇతర వనరుల నుండి గానీ తేనెటీగ యొక్క జీవిత చరిత్రను సేకరించి, పాఠశాల సింపోసియంలో ఆ అంశాలను చర్చించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 3

  • తేనెటీగ ‘ఆర్థోపొడ’ వర్గానికి చెందిన జీవి.
  • ఇవి చాలా కష్టజీవులు. పువ్వుల నుండి మకరందం సేకరించి ‘తేనె’ తయారు చేస్తాయి.
  • క్రమ శిక్షణకు, నాయకత్వ విధేయతకు, మాతృసామ్య వ్యవస్థ మూలాలకు ఈ తేనెటీగలు మంచి ఉదాహరణ.
  • వీని జీవిత చరిత్రలో 4 దశలు ఉన్నాయి. a) గుడ్లు b) లార్వా c) ప్యూపా d) ప్రౌఢజీవి.
  • ఆడ ఈగలు ప్రత్యుత్పత్తి తర్వాత గుడ్లు పెడతాయి.
  • ఇవి పొదగబడిన తరువాత వాటి నుండి లార్వాలు వస్తాయి.
  • ఈ లార్వాలు తేనెటీగలు ఏర్పరచుకున్న తెట్టులోగానీ, పుట్టలోగానీ ఉంచబడతాయి.
  • ఇవి తరువాత పొదగబడి పౌడజీవులుగా ఏర్పడతాయని తెలుసుకున్నాను.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 14.
కింది పటాలను గమనించి బొమ్మలు గీయండి. వాటి విధులు రాయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 4
జవాబు:
ముష్కము విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 5

  • ముష్కము పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్య భాగం.
  • ఇది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది.
  • పురుష లైంగిక హార్మోన్ టెస్టోస్టిరాన్ ను ఉత్పత్తి చేస్తుంది.
  • మగ పిల్లలలో యుక్తవయస్సుకు రాగానే “ద్వితీయ లైంగిక” లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. ముష్కము
  • ఇది పీయూష గ్రంథి ఆజ్ఞల ప్రకారం పని చేస్తుంది.

స్త్రీ బీజకోశాలు-విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 6

  • స్త్రీ బీజకోశాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్య భాగాలు.
  • వీటిలో ‘అండ పుటికలు’ ఉంటాయి.
  • ఇవి యుక్త వయసు వచ్చిన తర్వాత నుండీ మోనోపాజ్ దశ వరకు ప్రతి 28 రోజులకొకసారి ఒక పుటిక పక్వానికి వచ్చి అండాన్ని విడుదల చేస్తుంది.
  • పగిలిన పుటిక స్త్రీ లైంగిక హార్మోన్లయిన 1) ఈస్ట్రోజన్ 2) ప్రొజెస్టిరాన్లను ఉత్పత్తి చేస్తుంది.

ఫాలోపియన్ నాళాలు-విధులు :

  • ఇవి ఆడపిల్లలలో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని జరిపిస్తాయి.
  • తల్లుల ఆరోగ్యానికి, గర్భం దాల్చినప్పుడు మార్పులకు, బిడ్డకు పాలివ్వటానికి ప్రొజెస్టిరాన్ సహకరిస్తుంది.
  • అండం గర్భాశయానికి చేరటానికి సహకరిస్తాయి.
  • ఫలదీకరణకు అవకాశమిస్తాయి.

మానవ శుక్రకణం-విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 7

  • ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న ‘ముష్కము’ నుండి విడుదల అవుతుంది.
  • ఇది ఏక స్థితికం.
  • కదలగలిగి ఉంటుంది. (దీని తోక సాయంతో)
  • అండాన్ని గర్భాశయంలో కనుగొని ఫలదీకరణ చెందించేందుకు పనిచేస్తుంది.
  • దీని జీవితకాలం 24-72 గంటలు.

అండం-విధులు :
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 8

  • ఇది స్త్రీ బీజకణం.
  • స్త్రీ బీజకోశాలలోని అండ పుటికలు దీనిని ఉత్పత్తి చేస్తాయి.
  • ఇది ఫాలోపియల్ నాళం గుండా ప్రయాణించే సమయంలోనే ఫలదీకరణ చెందేందుకు అవకాశం ఉంటుంది.
  • దీని జీవిత కాలం 24 గం॥ మాత్రమే.

ప్రశ్న 15.
మానవ పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటాన్ని గీయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 9

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 16.
కప్ప జీవిత చరిత్ర పటం గీచి దానిలో ఏవి శాఖాహార దశలో గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 10

  • కప్ప లార్వాను చిరుకప్ప లేదా టాడ్ పోల్ అంటారు.
  • ఈ దశలో కప్ప చేపను పోలి ఉండి శాకాహారిగా ఉంటుంది.

8th Class Biology 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి InText Questions and Answers

8th Class Biology Textbook Page No. 54

ప్రశ్న 1.
కింద కొన్ని జంతువుల పేర్లు ఇవ్వబడ్డాయి. వాటిని పరిశీలించి జ్ఞాపకం తెచ్చుకుని పట్టిక నింపండి.
(లేడి, చిరుత, పంది, చేప, గేదె, జిరాఫీ, కప్ప, బల్లి, కాకి, పాము, ఏనుగు, పిల్లి)
జవాబు:

క్ర.సం. చెవి బయటకు కనిపించే జీవులు చెవులు బయటకు కనిపించని జీవులు
1. లేడి చేప
2. చిరుత కప్ప
3. పంది బల్లి
4. గేదె కాకి
5. జిరాఫీ పాము
6. ఏనుగు
7. పిల్లి
ఇవన్నీ శిశోత్పాదక జీవులు ఇవన్నీ అండోత్పాదక జీవులు

a) చెవులు బయటకు కనిపించకపోయినా ఈ జీవులు ఎట్లా వినగల్గుతున్నాయి ?
జవాబు:

  • చెవి నిర్మాణంలో, వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి అనే మూడు నిర్మాణాలు ఉంటాయి.
  • వినటంలో కీలక పాత్ర వహించేది లోపలి చెవి.
  • గుడ్లు పెట్టే జంతువులలో బాహ్య చెవి మాత్రమే ఉండదు. మధ్య చెవి, లోపలి చెవి ఉంటుంది.
  • అందువలన ఇవి ధ్వని వినగల్గుతాయి.

8th Class Biology Textbook Page No. 54

ప్రశ్న 2.
కింద కొన్ని జంతువుల పేర్లు ఇవ్వబడ్డాయి. వాటిని జ్ఞాపకం చేసుకుని ఈ పట్టికను నింపండి.
(ఆవు, ఎలుక, కాకి, పంది, నక్క కోడి, ఒంటె, బాతు, కప్ప, ఏనుగు, గేదె, పావురం, పిల్లి, నెమలి, బల్లి )
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 11

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

8th Class Biology Textbook Page No. 57

ప్రశ్న 3.
ఈ క్రింది దానిమ్మ పుష్పాలు పరిశీలించి వాటి ప్రత్యుత్పత్తి భాగాలు రాయండి. (పేజీ నెం. 57)
ఎ) మొక్కలలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 12
1) ………………….
2) ………………….
3) ………………….
4) ………………….
5) ………………….
6) ………………….
జవాబు:
వాటి భాగాలు
1) కేసరము
2) కేసర దండము
3) పరాగ కోశము
4) పరాగ రేణువులు
5) సంయోజకము
6) కేసరావళి

బి) మొక్కలలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ వాటి భాగాలు
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 13
1) ………………….
2) ………………….
3) ………………….
4) ………………….
5) ………………….
6) ………………….
జవాబు:
వాటి భాగాలు
1) అండకోశము
2) అండాశయము
3) కీలము
4) కీలాగ్రము
5) అండన్యాస స్థానము
6) అండాలు

8th Class Biology Textbook Page No. 59

ప్రశ్న 4.
ఈ క్రింది స్లో చార్టును పూరించండి.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 14
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 15

a) శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే ఏమవుతుందో చెప్పగలరా ?
జవాబు:
శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. వైవిధ్యం గల జీవులు ఏర్పడవు. క్రొత్త జాతులు అవతరించవు.

b) కొన్ని జంతువులు మాత్రమే పిల్లలకు ఎందుకు జన్మనిస్తాయో చెప్పగలరా ?
జవాబు:
పిల్లల్ని కనే స్త్రీ జంతువుల్లో గర్భాశయము, పిండాభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అందువలన పిండాలు గర్భాశయంలో ఎదిగి పిల్ల జీవులుగా పుడతాయి. గుడ్లు పెట్టే జంతువులలో ఈ అమరిక ఉండదు.

c) జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
జంతువులన్నీ పిల్లలకు జన్మనివ్వడం ఆపివేస్తే, తదుపరి తరం జీవులు ఉత్పత్తికావు. ఉన్న జీవులు కొంత కాలానికి మరణిస్తాయి. కావున భూమి మీద జీవరాశి అంతరించిపోతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

8th Class Biology Textbook Page No. 61

ప్రశ్న 5.
టాడ్ పోల్ లార్వాలు ఏ ఏ ఋతువులలో కనిపిస్తాయో చెప్పండి.
జవాబు:

  • టాడ్ పోల్ లార్వాలు వర్షాకాలంలో బాగా కనిపిస్తాయి.
  • వర్షాకాలంలో కప్ప వర్షపు నీటిలో ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
  • అందువలన కప్ప అండాలు బాహ్యఫలదీకరణం చెందుతాయి.
  • ఇవి సూర్యరశ్శికి పొదిగి టాడ్ పోల్ లార్వాలను ఉత్పత్తి చేస్తాయి..
  • ఇవి చేపల వలె నీటిలో ఈదుతూ రూపవిక్రియ చెంది కప్పలుగా మారతాయి.

ప్రశ్న 6.
వర్షాకాలంలో కప్పలు ఎందుకు బెక బెకమని శబ్దాలు చేస్తాయి ?
జవాబు:

  • వర్షాకాలం కప్పల ప్రత్యుత్పత్తికి అనుకూల సమయం.
  • ఈ కాలంలో మగకప్ప బెక బెకమని శబ్దాలు చేసి ఆడకప్పను ఆకర్షిస్తుంది.
  • ఆడ, మగ, కప్పలు కలిసి వర్షపు నీటిలో శుక్రకణాలు, అండాలను విడుదల చేస్తాయి.

8th Class Biology Textbook Page No. 62

ప్రశ్న 7.
కప్ప జీవిత చక్రాన్ని పరిశీలించటానికి నీవు చేయు ప్రాజెక్ట్ వివరాలు తెలపండి.
జవాబు:
ఉద్దేశం : కప్ప జీవిత చక్రం పరిశీలించుట.
పరికరాలు : వెడల్పు మూతిగల తొట్టి లేదా గాజుసీసా, పారదర్శక గ్లాసు, డ్రాపర్, పెట్రెడిష్, గులకరాళ్ళు, భూతద్దం, బీకరు.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 16
విధానము :

  • వర్షాకాలంలో దగ్గర ఉన్న చెరువు వద్దకు వెళ్ళి నురగ వంటి కప్ప గుడ్లను పరిశీలించాను.
  • దానిని జాగ్రత్తగా వెడల్పు మూతిగల సీసాలోనికి తీసుకున్నాను.
  • ఇలా సేకరించిన అండాలను 15 సెం.మీ. లోతు, 8 – 10 సెం.మీ. వ్యాసార్ధం కలిగిన తొట్టిలోకి మార్చాను.
  • భూతద్దం సహాయంతో అండాలను పరిశీలించాను.
  • అండం మధ్య భాగంలో చుక్కవంటి నిర్మాణం గమనించాను. అదే కప్ప పిండం.
  • గుడ్లు పొదిగి కొన్ని రోజులకు, టాడ్ పోల్ లార్వాలు బయటకు వచ్చాయి.
  • ఈ లార్వాలు చేపను పోలి ఉన్నాయి.
  • వీటి తల భాగంలో మొప్పలు ఉన్నాయి.
  • ఇవి క్రమేణా అనేక శారీరక మార్పులు చెందాయి.
  • పరిమాణంలో పెరిగి కాళ్ళు, చేతులు ఏర్పరచుకున్నాయి.
  • తోక అంతరించిపోయింది.
  • మొప్పలు అదృశ్యమైపోయాయి. ఊపిరితిత్తులు ఏర్పడ్డాయి.
  • చివరికి అది తోక కలిగిన కప్ప ఆకారం నుండి కప్పగా మార్పు చెందింది.
  • ఈ ప్రక్రియనే రూపవిక్రియ అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 17

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 8.
a) గుడ్లు పొదగటానికి ఎన్ని రోజులు పట్టింది ?
జవాబు:
గుడ్లు పొదగటానికి వారం రోజులు పట్టింది. (7 నుండి 9 రోజులు)

b) టాడ్పల్ ఏ ఆకారాన్ని పోలి ఉంది ?
జవాబు:
టాడ్ పోల్ చేప ఆకారాన్ని పోలి ఉంది.

c) ఏ దశలో టాడ్ పోల్ లో మొప్పలు కనిపిస్తాయి ?
జవాబు:
గుడ్డు నుండి వచ్చిన టాడ్పేల్ బాహ్య మొప్పలు కల్గి ఉంది. మొదటి దశలో టాడ్ పోల్ లార్వా బాహ్య మొప్పలు కల్గి ఉంది.

d) సేకరించిన ఎన్ని రోజులకు టాడ్ పోల్ కు కింది అవయవాలు కనిపించాయి ?
జవాబు:
గుండె – 2వ వారము (14 రోజులు తరువాత)
ప్రేగులు – 3వ వారము (21 రోజులు)
ఎముకలు – 4వ వారము (28 రోజులు)
పురీషనాళం – 3వ వారము (21 రోజులు)
ముందు కాళ్ళు – 9వ వారము (63 రోజులు)
వెనుక కాళ్ళు – 10వ వారము (70 రోజులు)

e) టాడ్ పోల్ లార్వాలో మొప్ప చీలికలు ఎన్నవ రోజు నుండి కనిపించకుండాపోయాయి ?
జవాబు:
28 రోజులు (నాలుగు వారాలు) తరువాత మొప్ప చీలికలు అదృశ్యమైనాయి.

f) ఎన్నవ రోజు తోక పూర్తిగా కనిపించకుండా పోయింది ?
జవాబు:
84 రోజులు (12 వారాలు) తరువాత తోక కనిపించకుండా పోతుంది.

g) టాడ్ పోల్ లార్వా కప్పగా మారుటకు ఎన్ని రోజులు పట్టింది ?
జవాబు:
టాడిపోల్ లార్వా కప్పగా మారుటకు 48 రోజులు పట్టింది.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

ఆలోచించండి – చర్చించండి

ప్రశ్న 1.
అన్ని జంతువులు గుడ్లు పెడతాయా ?
జవాబు:
లేదు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మాత్రమే గుడ్లు పెడతాయి. క్షీరదాలు గుడ్లు పెట్టవు. పిల్లల్ని కంటాయి.

ప్రశ్న 2.
ఏ ఏ జంతువులు పిల్లల్నికంటాయి ?
జవాబు:
క్షీరదాలు అన్ని పిల్లల్ని కంటాయి. ఉదా : ఆవు, గేదె, గుర్రం, ఎలుక, పిల్లి, ఏనుగు, మనిషి.

ప్రశ్న 3.
ఏ ఏ జంతువులు గ్రుడ్లు పెడతాయో, ఏవి పిల్లల్ని కంటాయో తెలుసుకోవటం ఎలా ?
జవాబు:
పిల్లల్ని కనే జంతువులలో కొన్ని బాహ్య లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుడ్లు పెట్టే వాటి నుండి వేరుగా తెలుసుకోవచ్చు.

ప్రశ్న 4.
అలా తెలుసుకోవడానికి పద్ధతులేమైనా ఉన్నాయా ?
జవాబు:
పిల్లల్ని కనే జంతువులు బాహ్య చెవులను, చర్మం మీద రోమాలను కలిగి ఉంటాయి. వీటి ఆధారంగా పిల్లల్ని కనే జంతువులను గుర్తించవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
మీ ప్రయోగశాలలో ఉన్న హైడ్రా సైడ్ ను చూస్తే, దానిపై ఉబ్బెత్తు బుడిపెలు కనపడ్డాయా ? అవి ఏమిటి ? మీ పరిశీలన ఆ రాయండి.
జవాబు:
1) హైడ్రా సైడ్ ను పరిశీలిస్తున్నప్పుడు ఈ ఉబ్బెత్తు భాగాలను పరిశీలించాను.
2) మా టీచరు వాటిని ‘మొగ్గలు’ (కోరకాలు) అన్నారు.
3) అవి ఎలా ఏర్పడతాయి ?
4) లైబ్రరీ నందున్న జీవశాస్త్ర పుస్తకంలో ఈ కింది విధానం ఉంది. గమనించండి.

  • ముందుగా హైడ్రా శరీరంపై ఉన్న ఒక భాగం జీవ పదార్థ పీడనం వల్ల బయటకు నెట్టబడుతుంది.
  • తరువాత దీని లోపలి గోడలపై కొత్త కణాలు, కణ ద్రవ్యం ఏర్పడి దాని పరిమాణం పెరుగుతుంది.
  • తరువాత ఈ ఉబ్బెత్తు భాగం చివర కళాభాలు మొలుస్తాయి.
  • దానిని సంపూర్ణ పిల్ల హైడ్రాగా మనం చూడవచ్చు.
  • ఇది తల్లి నుండి వేరై, స్వతంత్రంగా జీవనం సాగిస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 18

కృత్యం – 2

ప్రశ్న 2.
అమీబాలో ‘ద్విధావిచ్ఛిత్తి’ జరుగుతుందని చెప్పే బొమ్మలను పరిశీలించి మార్పులు పొందుపరచండి. (లేదా) అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏమిటి ? దానిని పటం ద్వారా చూపుము.
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 19
జవాబు:
పటం – 1
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 20

  • అమీబా కేంద్రకం మామూలుగా ఉంది.
  • శరీరం (అంటే కణకవచం) సాధారణంగా ఉంది.

పటం – 2
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 21

  • అమీబా శరీరం గుండ్రని ఆకృతి పొందింది.
  • మిద్యాపాదాలు చాలా వరకు లేవు.
  • కేంద్రకం సాగి, మధ్యలో నొక్కు ఏర్పడింది.

పటం – 3
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 22

  • కేంద్రకం రెండుగా విడిపోయింది.
  • శరీరం మధ్యలో నొక్కు ఏర్పడి అది కణం మధ్య వైపునకు పెరుగుతుంది.
  • పెరుగుదల రెండు పక్కలా అంటే కింది నుంచి, పై నుంచి కూడా ఉంది.

పటం – 4
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 23

  • కణం మధ్యలో నొక్కు బాగా దగ్గర వచ్చింది.

పటం – 5
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 24

  • నొక్కు ఇంకా దగ్గరకు వచ్చింది.
  • అటు పక్క, ఇటు పక్క మిద్యాపాదాలు ఏర్పడటం గమనించాను.

పటం – 6
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 25

  • రెండుగా విడిపోయాయి.
  • తద్వారా తల్లి కణం అంతరించి రెండు పిల్లకణాలు ఉద్భవించాయి.

ఇలా అమీబాలో ద్విధావిచ్ఛిత్తి జరగటం నేను గమనించాను.

AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

కృత్యం – 3

ప్రశ్న 3.
ఐదారుగురు విద్యార్థులతో జట్టుగా ఏర్పడండి. మీ జట్టు సభ్యుల తల్లిదండ్రుల ఫోటోలను సేకరించండి. ఆ ఫోటోలతో వారిని పోల్చండి. ఏ ఏ భాగాలు / అవయవాలు, తల్లి లేదా తండ్రిని పోలిఉన్నాయో పరిశీలించి, పట్టికలో నమోదు చేయండి. (పాఠ్యాంశంలోని ప్రశ్న పేజీ నెం. 60)
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 26
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 27

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము – తాగలేము

SCERT AP 8th Class Biology Study Material Pdf 10th Lesson పీల్చలేము – తాగలేము Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 10th Lesson Questions and Answers పీల్చలేము – తాగలేము

8th Class Biology 10th Lesson పీల్చలేము – తాగలేము Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
గాలి కాలుష్యం నీటి కాలుష్యానికి ఏ విధంగా దారితీస్తుంది ?
జవాబు:
గాలికాలుష్యం నీటి కాలుష్యానికి ఈ క్రింది విధంగా దారితీయును.
1. గాలిలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సెడ్ నీటి ఆవిరిలో కరిగి ఆమ్లాలుగా మారి వర్షం పడినపుడు నీటిలో ఆమ్లం 2. గుణం తెచ్చును.
2. గాలిలో ఉన్న CO2 గ్లోబల్ వార్మింగ్ వలన నీటి ఉష్ణోగ్రత పెరిగి నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి నీటి కాలుష్యం జరుగును.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

ప్రశ్న 2.
“పారదర్శకంగా మరియు స్వచ్ఛంగా కనిపించే నీరు త్రాగుటకు అన్నివిధాలా సరిపోతుంది” దానిపై మీ అభిప్రాయంను తెలియచేయండి.
జవాబు:

  1. పారదర్శకంగా మరియు స్వచ్చంగా కనిపించే నీరు త్రాగుటకు అన్నివిధాలా సరిపోదు.
  2. కారణం దానిలో కంటికి కనిపించని సూక్ష్మజీవులు అయిన వైరస్లు, బాక్టీరియాలు, ప్రోటోజోవాలు ఉండవచ్చు.
  3. అంతేకాక నీటి కలుషితాలు కూడా ఉండవచ్చు.

ప్రశ్న 3.
తాజ్ మహల్ వంటి చారిత్రక కట్టడం గాలి కాలుష్య ప్రభావానికి లోనవుతుంది. దానిని రక్షించటానికి నీవు ఇచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు:
తాజ్ మహల్ వంటి చారిత్రక కట్టడం గాలి కాలుష్యం నుండి రక్షించడానికి నేను ఇచ్చే సలహాలు :

  1. మోటారు సైకిలు, కార్లు బదులు ఆ ప్రాంతంలో సైకిళ్ళు, గుర్రపు బండ్లు వాడాలి.
  2. వాహనాలలో కాలుష్యం తక్కువ వెదజల్లే CNG, LPG ల వంటి ఇంధనాలు వాడాలి.
  3. సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చి దానితో నడిచే వాహనాలను ప్రోత్సహించాలి.
  4. తాజ్ మహల్ పరిసరాలలో సీసం లేని పెట్రోల్ ఉపయోగించే వాహనాలనే వాడాలి.
  5. కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను ఆగ్రా నగరానికి దూరంగా తరలించాలి
  6. ఆగ్రా నగర చుట్టుప్రక్కల చెట్లు బాగా పెంచాలి.

ప్రశ్న 4.
గాలి కాలుష్యం, నీటి కాలుష్యం నియంత్రించుటకు తీసుకోదగిన చర్యలు ఏవి ?
జవాబు:

  1. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఫ్యాక్టరీల మీద పొడవైన చిమ్నీలు ఏర్పాటుచేయాలి.
  2. ఇంటిలో గాని, పరిశ్రమలోగాని ఇంధనాలను పూర్తిగా మండించే పరికరాలను ఉపయోగించాలి.
  3. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ (Electrostatic precipitaters) పరిశ్రమల చిమ్నీలలో ఏర్పాటుచేయాలి.
  4. వాహనాల నుండి వెలువడే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సి.ఎన్.జి (Compressed Natural Gas) ని వాడాలి.
  5. ఇంటిలో వంటకు ఎల్.పి.జి (Liquid Petroleum Gas) ఉపయోగించాలి.
  6. వాహనాలలో వాడే ఇంధనాలు నాణ్యత కలిగి ఉండాలి.
  7. పునరుద్దరింపదగిన శక్తి వనరులైన సౌరశక్తి, పవన శక్తి, అలల శక్తి, జలవిద్యుత్ ను ఉపయోగించాలి.
  8. కాలుష్య నియంత్రణ నియమాల ప్రకారం అన్ని వాహనాలు తప్పకుండా క్రమపద్ధతిలో నిర్వహించాలి.
  9. సీసం లేని పెట్రోల్‌ను ఉపయోగించాలి.
  10. మీ చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాలలో వీలైనన్ని ఎక్కువ చెట్లను పెంచాలి.

నీటి కాలుష్యం నియంత్రించుటకు తీసుకోదగిన చర్యలు :

  1. పరిశ్రమల నుండి విడుదల అయ్యే వ్యర్థ పదార్థములను రసాయనికంగా శుద్ధి చేయడం లేదా హానికరమైన దార్థములను లేకుండా చేసి నదులలోనికి, సరస్సులలోనికి విడుదల చేయడం.
  2. మురుగునీరు ప్రత్యక్షంగా నదులలోనికి విడుదల చేయకూడదు. ముందుగా శుద్ధి చేసే ప్లాంట్ లో శుద్ధిచేసి వాటిలో ఉండే ఆర్గానిక్ పదార్థాలను తీసివేయాలి.
  3. ఎరువులను, పురుగులను చంపే మందులను ఎక్కువ ఉపయోగించడం తగ్గించాలి.
  4. సింథటిక్ డిటర్జెంట్ల వినియోగం తగ్గించాలి. నీటిలో, నేలలో కలిసిపోయే డిటర్జెంట్లు ఉపయోగించాలి.
  5. చనిపోయిన మానవుల శవాలను మరియు జంతు కళేబరాలను నదులలోనికి విసిరివేయరాదు.
  6. వ్యర్థ పదార్థాలను, జంతువుల విసర్జితాలను బయోగ్యాస్ ప్లాంట్ లో ఇంధనం కోసం ఉపయోగించిన తర్వాత ఎరువుగా వాడుకోవాలి.
  7. నదులు, చెరువులు, కుంటలు, సరస్సులలోని నీరు తప్పకుండా శుభ్రం చేయాలి. ఈ విధానాన్ని పరిశ్రమల యాజమాన్యాలు మరియు ప్రభుత్వం వారు తప్పకుండా చేపట్టాలి. ఉదాహరణకు భారత ప్రభుత్వం వారిచే నిర్వహించబడిన గంగానది ప్రక్షాళన పథకం.
  8. నదుల తీరం వెంబడి చెట్లు, పొదలు తప్పకుండా పెంచాలి.
  9. నీరు కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం నీటి కాలుష్యం వల్ల కలిగే నష్టాల పట్ల అవగాహన కార్యక్రమాలు తప్పకుండా చేపట్టాలి. ముఖ్యంగా ప్లాస్టిక్, వ్యర్థాలు, కాగితాలు, వ్యర్థ ఆహారపదార్థాలు, మురిగిపోయిన ఆహారపదార్థాలు, . కూరగాయలు మొదలైన వాటిని వీధిలోకి విసిరివేయకుండా చూడాలి.
  10. కాలుష్యాన్ని తగ్గించుటకు 4R (Recycle, Reuse, Recover, Reduce) నియమాలను అమలుపరచి వనరులను పునరుద్ధరించాలి.
  11. తరిగిపోయే ఇంధనాలను ఉపయోగించడం చాలావరకు తగ్గించాలి. ప్రత్యామ్నాయ శక్తి వనరులను వాతావరణానికి హానికరం కాకుండా ఉపయోగించాలి.
  12. ప్రాథమిక ఉద్దేశంతో పదార్థాలను ఉపయోగించినపుడు వాటిలో కొన్నింటిని రెండవసారి కూడా ఉపయోగించాలి (తిరిగివాడుకోవడం).
  13. ఉదా : తెల్ల కాగితానికి ఒకవైపు ప్రింట్ తీసుకోవడం, ఒకే వైపు రాయడం కాకుండా రెండవవైపును కూడా ఉపయోగించినట్లయితే ఎక్కువ కాగితాలు వృథాకాకుండా చూడవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే కాగితం కోసం ఎక్కువ చెట్లు నరకడం తగ్గిపోతుంది.
  14. వీలైనన్ని ఎక్కువ పదార్థాలు తిరిగి వినియోగించుకోవడానికి వీలుగా నష్టం జరగనంత వరకు చేస్తూనే ఉండాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

ప్రశ్న 5.
నీటిలో పోషకాల స్థాయి పెరగటం వలన నీటి జీవుల మనుగడపై ఏవిధంగా ప్రభావం చూపుతుంది ?
జవాబు:
నీటిలో పోషకాల స్థాయి పెరగడం వలన శైవలాలు, కలుపు మొక్కలు మరియు బాక్టీరియాలు విస్తరించును. నీరు చివరకు ఆకుపచ్చగా, మురికిగా వాసనపట్టిన పెట్టుగా తయారవుతుంది. నీటిలో కుళ్లుతున్న మొక్కలు ఆక్సిజనన్ను ఉపయోగించు కొంటాయి. నీటి జీవులకు సరిపడు ఆక్సిజన్ అందక చివరకు అవి మరణించును. జీవవైవిధ్యం తగ్గును.

ప్రశ్న 6.
రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు సక్రమంగా పెరగవు. కారణాలు కనుగొని, మీ వాదనను వివరించండి.
జవాబు:

  1. ఎక్కువ వాహనాలు రోడ్డుపై తిరుగుతాయి. వాహనాల నుండి విడుదలగు కాలుష్య పదార్థాలు మొక్కల పెరుగుదల తగ్గిస్తాయి.
  2. జనం ఎక్కువగా ఉండటం వలన పచ్చిగా ఉన్నప్పుడే చెట్లను తుంపుతారు.
  3. మొక్కల ఆకులపై కాలుష్య పదార్థాలు చేరి కిరణజన్య సంయోగక్రియ జరుగుటకు ఆటంకము ఏర్పడును మరియు బాష్పోత్సేకపు రేటు తగ్గును.
  4. హైడ్రోకార్బనులు ఆకులు రాలుటకు సహాయపడును మరియు మొక్కల అనేక భాగాల రంగును కోల్పోయేలా చేయును.
  5. రాత్రిపూట రోడ్లపై ఉన్న ప్రదేశాలలో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉండును. మొక్కలకు రాత్రి సమయంలో సరిపడు ఆక్సిజన్ కూడా అందక పెరుగుదల తక్కువగా ఉండును.
  6. వాటికి నీటి సదుపాయం కూడా సరిగా ఉండకపోవడం వల్ల పెరుగుదల సక్రమంగా ఉండదు.

ప్రశ్న 7.
రసాయనిక పరిశ్రమలో నీవు జనరల్ మేనేజర్ గా ఉంటే నీవు గాలి మరియు నీరు కాలుష్యం కాకుండా తీసుకొను చర్యలు మరియు ముందు జాగ్రత్తలు ఏమి ?
జవాబు:
గాలి మరియు నీరు కాలుష్యం కాకుండా తీసుకొను చర్యలు:

  1. గాలిలో తేలియాడే రేణువులను తొలగించుట స్థిర విద్యుత్ అవక్షేపాలను ఉపయోగించటం చేస్తాను.
  2. లెడ్ లేని పెట్రోల్ ను వాహనాలకు ఉపయోగిస్తాను.
  3. చెట్లను బాగా పెంచుతాను.
  4. మురుగు నీరు నదులలోకి, చెరువులలోకి కలవకుండా చూస్తాను.
  5. ఒకవేళ కలిసే పరిస్థితి వస్తే దానిలోని హానికారక పదార్థాలు తొలగిస్తాను.
  6. పరిశ్రమ నుంచి వచ్చే వేడినీటిని కూలింగ్ టవర్స్ లో చల్లబరచి విడుదల చేస్తాను.

గాలి మరియు నీరు కలుషితం కాకుండా ముందు జాగ్రత్తలు :

  1. విద్యుత్ దుర్వినియోగం లేకుండా ఉంచుతాను. దీని వలన విద్యుత్ ఆదా అగును. అందువలన థర్మల్, అణు విద్యుత్ తయారీ వలన వచ్చే కాలుష్యం తగ్గించవచ్చును.
  2. అందరూ పబ్లిక్ ట్రాన్స్పర్ట్ ఉపయోగించేలా చేస్తాను. దీని వలన చాలా కార్లు మరియు బైకులు ఇతర వాహనాల వినియోగం తగ్గి వాయు కాలుష్యం తగ్గును.
  3. పరిశ్రమలో ఉన్న అంతా సామగ్రి చక్కని నిర్వహణలో ఉంచుతాను. దీని వలన అన్ని యంత్రాలు చక్కగా పనిచేయును. అందువలన కాలుష్య పదార్థాలు గాలిలోకి, నీటిలోకి విడుదల అవ్వవు.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

ప్రశ్న 8.
కింది అంశంపై చర్చించండి. కార్బన్ డయాక్సెడ్ కాలుష్యకారకమా ? కాదా ?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో 0.03% ఉంటే కాలుష్య కారకము కాదు. కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో 0.03% కంటే ఎక్కువ ఉంటే కాలుష్య కారకం అంటారు. కారణం కారకం చేరిక వలన వాతావరణంలో సజీవ, నిర్జీవ అంశాలలో వచ్చే మార్పులను కాలుష్యం అంటారు. కాలుష్యం కలుగజేయు కారకాలను కలుషితాలు అంటారు. CO2 వాతావరణంలో 0.03% కంటే ఎక్కువ ఉంటే భూమి ఉష్ణోగ్రత పెరుగును.

అప్పుడు గ్లోబల్ వార్మింగ్ వచ్చును. CO2 వలన మానవులకు అలసట, చికాకు కలుగును. గ్లోబల్ వార్మింగ్ వలన ధృవ ప్రాంతాలలో మంచు కరిగి భూమిపై పల్లపు ప్రాంతాలను ముంచును. వాతావరణంలో ఏ వాయువు కాని, పదార్థము కాని ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే అది కాలుష్య కారకమే.

ప్రశ్న 9.
గాలి, నీరు కాలుష్యంపై క్విజ్ ప్రోగ్రామ్ ను నిర్వహించటానికి ఆలోచన రేకెత్తించే 5 ప్రశ్నలు తయారుచేయండి.
జవాబు:

  1. హీమోగ్లోబిన్ ఆక్సిజన్ కంటే దేనిని తొందరగా అంటిపెట్టుకొనును ?
  2. C.N.G అనగా నేమి?
  3. యూట్రాఫికేషన్ అనేది ఏ కాలుష్యంలో వింటాము ?
  4. ఆమ్ల వర్షమునకు కారణమైన వాయువులు ఏవి ?
  5. భారత పురావస్తుశాఖ ‘నో డ్రైవ్ జోన్”గా ఎక్కడ ప్రకటించినది ?
    గమనిక : ఇంకా చాలా ప్రశ్నలు టీచర్స్ పిల్లల చేత తయారు చేయించవచ్చును.

ప్రశ్న 10.
నీకు దగ్గరలో ఉన్న కాలుష్య నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి, వాహనాల కాలుష్యం నిర్ధారించే విధానాన్ని పరిశీలించండి. దిగువ చూపబడిన అంశాలను నమోదు చేయండి. నిర్ణీత సమయములో పరిశీలించిన సరాసరి వాహనాల సంఖ్య, ప్రతి వాహనం తనిఖీ చేయడానికి పట్టు సమయం, ఏయే కాలుష్య కారకాలు తనిఖీ చేశారు ? పరీక్ష పద్ధతి ఏ విధంగా ఉన్నది ?, వివిధ కాలుష్య కారకాలు విడుదల అయ్యే వాటిలో అనుమతించబడిన వాటి పరిధి ఎంత ? విడుదల అయ్యే వాయువుల పరిధి దాటితే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవి ?
జవాబు:

  1. నిర్ణీత సమయంలో. పరిశీలించిన సరాసరి వాహనాల సంఖ్య – 5 లేదా 6 – గంటకు.
  2. ప్రతి వాహనం తనిఖీ చేయటానికి పట్టిన సమయం – 10 నిమిషాలు
  3. ఏయే కాలుష్య కారకాలు తనిఖీ చేశారు – కార్బన్ మోనాక్సైడ్ (CO), హైడ్రోకార్బన్స్ (HC) & CO2
  4. పరీక్ష పద్ధతి – Computer Analysis
  5. వివిధ కాలుష్య కారకాలు విడుదల అయ్యే వాటిలో అనుమతించబడిన వాటి పరిధి – కార్బన్ మోనాక్సైడ్ 2000 సంవత్సరం ముందు వాహనం అయితే 4.5%, 2000 సంవత్సరం తర్వాత అయితే 3.5% ఉండాలి.

హైడ్రోకార్బన్లు 2000 సంవత్సరం ముందు వాహనం అయితే 9,000, 2000 సంవత్సరం దాటిన తర్వాత అయితే 4,500 వరకు ఉండవచ్చు. విడుదల అయ్యే వాయువుల పరిధి దాటితే తీసుకోవలసిన జాగ్రత్తలు :
1. ఇంజన్ సరిగా పనిచేసే విధంగా చూడాలి. దీని వలన ఇంధనం పూర్తిగా మండి CO2 విడుదల అవుతుంది.
2. వాయువులు విడుదల చేసే గొట్టంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి.

ప్రశ్న 11.
మీ గ్రామానికి దగ్గరలో ఉన్న చెరువు / సరస్సు /నది దగ్గరకి మీ టీచరుతో కలసి వెళ్ళండి. కింది అంశాలు పరిశీలించి చర్చించండి. చెరువు / సరస్సు / నది గతచరిత్ర, నది / చెరువు / సరస్సు. కాకుండా వేరే నీటి వనరులు ఉన్నాయా ! సాంస్కృతిక అంశాలు, కాలుష్యానికి కారణాలు, కాలుష్యం జరగటానికి మూలం, నది దగ్గరలో మరియు దూరంగా నివసిస్తున్న వారిపై కాలుష్య ప్రభావం ఎంత వరకు ఉన్నది ?
జవాబు:
1. మా గ్రామానికి దగ్గరగా ఉన్నది కృష్ణానది. ఈ నది అంతా నల్లరేగడి నేలలో ప్రవహించుట వలన కృష్ణానది అని పేరు వచ్చినది (కృష్ణా – నలుపు).
2. వేరే నీటి వనరులు ఉన్నాయి. బావులు, కాలువలు.
3. సాంస్కృతిక అంశాలు : ఈ నదిలో స్నానం చేయుట వలన పుణ్యం వస్తుందని భావిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు మరియు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలలో కృష్ణానదిలో కనకదుర్గ అమ్మవారి తెప్పోత్సవం జరుగును.

కాలుష్యానికి కారణాలు : కృష్ణానదిలో పరిశ్రమల కాలుష్యాలు కలవడం, పట్టణ జనాభా వలన కొన్ని కలుషితాలు కృష్ణా నదిలోనికి విడుదలవడం, బట్టలు ఉతకడం, మలమూత్రాల విసర్జన, దహన సంస్కారాలు చేయుట, నదిలో పుణ్య స్నానాలు ఆచరించడం, థర్మల్ పవర్ స్టేషన్లోని కలుషితాలు చేరడం.

కాలుష్యం జరగటానికి మూలం : నది దగ్గరలో పరిశ్రమలు ఉంటే అక్కడి వారిపై కాలుష్య ప్రభావం ఎక్కువగాను, నది ప్రవహించుట వలన దూరంగా నివసిస్తున్న వారిపై కాలుష్య ప్రభావం తక్కువగాను ఉండును.
గమనిక : వారి గ్రామంలో / దగ్గరలో ఉన్న దానిపై పై అంశాలు పరిశీలించి చర్చించండి.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

ప్రశ్న 12.
గాలి కాలుష్యం అనగానేమి ? గాలి కాలుష్యానికి కారణాలు దానివల్ల తలెత్తే సమస్యలను, చార్ట్ ను తయారుచేయండి.
జవాబు:
మానవ చర్యల వలన గాని, ప్రకృతిలో జరిగే మార్పుల వలన గాని వాతావరణ సమతుల్యతలో మార్పు సంభవిస్తే దానిని గాలి కాలుష్యం (Air pollution) అంటారు . గాలి కాలుష్యానికి కారణాలు మరియు ప్రభావములతో కూడిన ఫ్లోచార్ట్:
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 1

ప్రశ్న 13.
సుధీర్ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఇతను ఆరోగ్యవంతంగా ఉండటానికి నీవు ఏమి సూచనలు ఇస్తావు ? ఇతని విధి నిర్వహణలో ఆరోగ్య రక్షణకు నీవు ఇచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు:
ఇతను ఆరోగ్యవంతంగా ఉండడానికి నేను ఇచ్చే సూచనలు :
1. ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే దుమ్ము, ధూళి ఉన్న బట్టలు మార్చుకోవాలి.
2. ఎండలో ఎక్కువసేపు ఉంటాడు కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవాలి.
3. ఎక్కువ సేపు నుంచొని ఉండాలి కాబట్టి శక్తిని ఇచ్చే పదార్థాలు తీసుకోవాలి.

ఇతని విధి నిర్వహణలో ఆరోగ్య రక్షణకు నేను ఇచ్చే సలహాలు :
1. దుమ్ము, ధూళి, కాలుష్య పదార్థాలు శరీరంలోనికి ప్రవేశించకుండా మ్కాలు వేసుకోవాలి.
2. తలకు ఉష్ణవాహక పదార్థాలతో తయారుచేయబడిన హెల్మెట్ వాడాలి.
3. ఎండ, వాన నుంచి రక్షణకు అతనికి ఇచ్చిన కాబిలో ఉండాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

ప్రశ్న 14.
“బైకులు, కార్లు వద్దు సైకిలే ముద్దు” ఈ నినాదాన్ని శ్రీవాణి తయారుచేసినది. మీరు కూడా కాలుష్యం నియంత్రణపై కొన్ని నినాదాలు తయారుచేయండి.
జవాబు:
బైకులు, కార్లు వద్దు సైకిలే ముద్దు ఈ నినాదాన్ని శ్రీవాణి తయారుచేసింది. నేను కూడా కాలుష్య నియంత్రణపై కొన్ని నినాదాలు తయారుచేశాను. అవి

  1. చెట్లు పెంచు-కాలుష్యాన్ని తగ్గించు.
  2. కాలుష్యాన్ని తగ్గించు-మంచి ఫలితాన్ని పొందు.
  3. మనిషి స్వార్థమే-కాలుష్యానికి మూలం.
  4. గాలి కాలుష్యం తగ్గించు-ప్రకృతిని కాపాడు.
  5. చెట్లు పెంచు-కాలుష్యాన్ని పారద్రోలు.
  6. ఫ్రిజ్ లు తగ్గించు-కుండలు పెంచు.
  7. కాలుష్యాన్ని తగ్గించు-జీవితకాలం పెంచు.
  8. కాలుష్య నివారణకు-అందరూ కృషి చేయాలి.

ప్రశ్న 15.
రేష్మ నేల కాలుష్యంపై వక్తృత్వ పోటీలో పాల్గొనదలచింది. ఆమె కోసం ఒక వ్యాసం రూపొందించండి.
జవాబు:
నేల మనతోపాటు వందలాది జీవులకు జీవనాధారం. కానీ మానవుని విచక్షణా రహిత చర్యల వలన నేల కాలుష్యకోరలలో చిక్కుకొనిపోయింది. నేల తన సహజ స్వభావాన్ని కోల్పోవుట వలన నేలలోని సూక్ష్మజీవుల నుండి, నేలపైన నివసించే వేలాది జీవుల వరకు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారాలు, గుల్మనాశకాలు, పరిశ్రమవ్యర్థాలు, భూమిని పాడుచేస్తున్నాయి. ప్లాస్టిక్ వస్తువులు, పాలిథీన్ కవర్లు భూమాత గర్భంలో జీర్ణంకాని పదార్థాలుగా మిగులుతున్నాయి.

పరిస్థితి ఇలాగే కొనసాగితే, నేల తన సహజగుణాన్ని కోల్పోయి నిర్జీవ ఆవాసంగా మారుతుంది. ఇది మనం కూర్చున్న కొమ్మను నరుక్కొన్న రీతి అవుతుంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా నేలకాలుష్యం గురించి తీవ్రంగా ఆలోచిద్దాం. కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేద్దాం. ప్లాస్టిక్స్, పాలిథిన్ కవర్లను నిషేధిద్దాం. మన భూమాతను రక్షించుకుందాం.

ప్రశ్న 16.
కవిత తన మిత్రుడు కౌశిక్ తో “ప్లాస్టర్ ఆఫ్ పారితో తయారుచేసిన వినాయకుని కన్నా మట్టితో చేసిన వినాయకుని పూజించటం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు” అని చెప్పింది. నీవు ఆమెను ఎలా ప్రశంసిస్తావు ?
జవాబు:
మట్టితో చేసిన వినాయకుడు నీటిలో వెంటనే కలిసిపోవును. అందువలన నీటి కాలుష్యం జరగదు. దీని వలన పర్యావరణానికి హాని జరగదు. ప్లాస్టర్ ఆఫ్ పారితో తయారుచేసిన వినాయకుని వలన అనేక నష్టాలు ఉన్నాయి. అవి నీటిలో కరగవు. అంతేకాక వాటిలో ఆస్ బెస్టాస్, ఆంటిమొని, పాదరసం, లెడ్ వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. దీని వలన ఆ నీరు మరియు ఆ నీటిలో నివసించు జీవులకు హాని కలిగి కొన్నిసార్లు చాలా జీవులు చనిపోవును.

మట్టి వినాయకుని వలన పై నష్టాలు జరుగవు. కాబట్టి కవిత తన మిత్రుడు కౌశిక్ తో “ప్లాస్టర్ ఆఫ్ పారితో తయారుచేసిన వినాయకుని కన్నా మట్టితో చేసిన వినాయకుని పూజించటం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు” అని చెప్పింది.

పై విషయాలు తెలుసుకొని తన మిత్రుడితో చెప్పినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. అంతేకాకుండా టీచర్ కి చెప్పి స్కూల్లో పిల్లలు అందరికి మట్టి వినాయకుని వలన కలిగే లాభాలు కవిత చేత వివరించి మరియు అసెంబ్లీలో హెడ్ మాష్టారుకి చెప్పి స్కూలు పిల్లల చేత చప్పట్లు కొట్టిస్తాను. 8వ తరగతిలోనే పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కలిగి ఉండుట మాత్రమేకాక దాన్ని నిజజీవిత పరిస్థితులకు అన్వయించినందుకు కవితను నేను మెచ్చుకుంటాను.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

ప్రశ్న 17.
మీ గ్రామంలోని లేదా దగ్గరలో ఉన్న చెరువు ఏవిధంగా కాలుష్యానికి గురి అవుతుందో తెలుసుకొని, కాలుష్యానికి గురి కాకుండా నీవేమి చేస్తావు?
జవాబు:

  1. పశువులను చెరువులో కడుగుట వలన
  2. చెరువులలో మనుషులు స్నానాలు చేయుట వలన , చెరువులో బట్టలు ఉతుకుట వలన
  3. చెరువులో మలమూత్రాలు విసర్జించుట వలన
  4. చెరువులోనికి ఇంట్లో నుంచి వచ్చిన చెత్తా చెదారములను వేయుట వలన
  5. వ్యవసాయదారులు మొక్కలకు ఉపయోగించిన ఎరువులు మరియు శిలీంధ్రనాశకాలను, డబ్బాలను చెరువులలో కడుగుట వలన, చెరువు గట్టుపై నివసించువారు అంట్లు చెరువులో కడుగుట వలన
  6. చెరువు దగ్గరగా పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాస్టు పారవేయుట వలన
  7. చెరువులలో ఇష్టానుసారంగా నీటి మొక్కలు (గుర్రపు డెక్క) పెరుగుట వలన.
    పై కారణాల వలన మా ఊరిలో చెరువు కాలుష్యం అగును.

8th Class Biology 10th Lesson పీల్చలేము – తాగలేము InText Questions and Answers

కృత్యములు

1. ప్రకృతి వైపరీత్యాలు – కాలుష్యం :
మీరు పాఠశాల గ్రంథాలయానికి వెళ్ళి ఈ దశాబ్దంలో ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన ఈ కింది ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని జాబితా రాయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 2

2. నూనె కాగిత ప్రయోగం:
5 × 5 సెం.మీ. కొలతలు గలిగిన చతురస్రాకారపు తెల్లకాగితాలను మూడింటిని తీసుకొని నూనెలో ముంచండి. వీటిని మూడు వేర్వేరు ప్రాంతాలలో వ్రేలాడదీయండి. ఒకదానిని మీ ఇంటి దగ్గర, రెండవదానిని పాఠశాలలో, మూడవదానిని ఉద్యానవనం దగ్గర కాని వాహనాలు నిలిపే స్థలంలో గాని వ్రేలాడదీయండి. వాటిని 30 ని||లు వరకు ఉంచి పరిశీలించండి.

ఎ) నూనెలో ముంచిన తెల్ల కాగితాల మీద మీరు ఏమి గమనించారు ?
జవాబు:
నూనెలో ముంచిన తెల్ల కాగితాల మీద మేము దుమ్ము, ధూళి గమనించాము.

బి) ఈ మూడు ప్రాంతాలలో ఉంచిన కాగితాలపై ఏమైనా మార్పులు ఉన్నాయా ?
జవాబు:
ఈ మూడు ప్రాంతాలలో ఉంచిన కాగితాలపై మార్పులు ఉన్నాయి.

సి) వీటికి జవాబులు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాటి కారణాలు తెలుసుకోండి.
జవాబు:
1. మా ఇంటి దగ్గర ఉంచిన కాగితంపై దుమ్ము, ధూళి కొంచెం తక్కువగా ఉన్నాయి.
2. పాఠశాలలో ఉంచిన కాగితంపై దుమ్ము, ధూళి కొంచెం ఎక్కువగా ఏర్పడినది. కారణం మా పాఠశాల జనం రద్దీ ఉన్నచోట ఉంటుంది.
3. మూడవదానిని నేను వాహనాలు నిలిపిన స్థలంలో ఉంచాను. కాబట్టి కాగితంపై చాలా ఎక్కువ దుమ్ము, ధూళితో పాటు కొంచెము మసి కూడా గమనించాను. కారణం వాహనాల నుండి పొగ ఎక్కువ వస్తుంది కాబట్టి.

3. విద్యుత్ ఉత్పాదక కేంద్రాల సమాచారము :
విద్యుత్ ఉత్పాదక కేంద్రాల సమాచారం : మీరు పాఠశాల గ్రంథాలయాన్ని సందర్శించి వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సమాచారంతో పట్టికను తయారుచేయండి. ఇంతే కాకుండా మన దేశంలో అనేక తక్కువ స్థాయి విద్యుదుత్పత్తి కేంద్రాలు కూడా కాలుష్య కారకాలను గాలిలోనికి విడుదల చేసి కాలుష్యాన్ని పెంచుతున్నాయి. వాటిపై చర్చించండి.
జవాబు:
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి.
1. జలవిద్యుచ్ఛక్తి కేంద్రాలు
2. థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాలు
3. అణువిద్యుచ్ఛక్తి కేంద్రాలు.
జలవిద్యుత్ శక్తి కేంద్రాలు :
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 3
థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాలు :
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 4

అణు విద్యుత్ శక్తి కేంద్రాలు :
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 5
తక్కువ స్థాయి విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి (ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు) బూడిద, ధూళి, సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ వంటి పదార్థాలు, ఇతర వ్యర్థ పదార్థాల ద్వారా గాలి, నీరు, నేల కాలుష్యం అవుతున్నాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

4. క్షేత్రపర్యటన :
క్షేత్రపర్యటన : దగ్గరలో ఉన్న పరిశ్రమను (ఇటుకల తయారీ, బియ్యం మిల్లు, ఆయిల్ మిల్లు, ఆహారపదార్థాలను తయారుచేసేవి మొదలగునవి) సందర్శించి దిగువ పేర్కొన్న అంశాలను పరిశీలించండి.

అ) ఇవి గాలి, నీటిని ఏ విధముగా కలుషితం చేస్తున్నాయి ?
జవాబు:
గాలిలోకి బియ్యపు ఊక విడుదల అవుతుంది. ఊక గాలిలో కలిసి కాలుష్యం చేస్తుంది. ఉప్పుడు బియ్యం తయారుచేయుట, నీటిని ఎక్కువగా ఉపయోగించుట వలన కర్బనిక పదార్థాలు నీటిలోకి చేరి నీటిని పాడు (కాలుష్యం) చేస్తాయి.

ఆ) ఫ్యాక్టరీల చుట్టూ పచ్చదనం ఉందా ? ఉంటే వాటి పేర్లను రాయండి.
జవాబు:
ఫ్యాక్టరీల చుట్టూ పచ్చదనం ఉంది. వాటి పేర్లు : అశోక చెట్లు, తురాయి పూలచెట్లు.

ఇ) కాలుష్యం నివారించడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ?
జవాబు:

  1. ఊక నిల్వ చేయు గది నిర్మించాలి. దీని వలన ఊక పరిసరాలలోనికి రాదు.
  2. మిల్లు యొక్క వెంట్లు పైకి ఉండాలి.
  3. మిల్లు యొక్క గదులకు రంధ్రాలు లేకుండా చూసుకోవాలి.
  4. ఉప్పుడు బియ్యం నుంచి వచ్చే నీటి కాలుష్యం నివారించుట, అవాయుగత బాక్టీరియాను ఉపయోగించి బయోగ్యాస్ తయారుచేయాలి.
  5. సరైన పరికరాలు ఉపయోగించి దుమ్ము, ధూళి నివారించాలి.
    గమనిక : ఎవరి దగ్గరలో ఉన్న పరిశ్రమ గురించి వాళ్లు వ్రాయాలి.

5. ప్రయోగశాల కృత్యం :
స్థానిక నీటి నమూనాలలో కాలుష్య కారకాలను పరిశీలించు ఒక ప్రయోగశాల కృత్యం చేయండి.
జవాబు:
ఉద్దేశం : స్థానికంగా నీటి నమూనాలలో కాలుష్య కారకాలను పరిశీలించుట
కావలసిన పరికరాలు : గాజు బీకర్లు, కుళాయి, బావి, సరస్సు, నది నుండి సేకరించిన నీటి నమూనాలు, నీలం, ఎరుపు లిట్మస్ పేపర్, సబ్బు.
పద్ధతి : వేరు వేరు గాజు బీకరులలో కుళాయి, నది, బావి, సరస్సుల నుండి నీటి నమూనాలను సేకరించాలి. వాటి మధ్య వాసన, రంగు, ఉదజని సూచిక pH మరియు కఠినత్వమును పోల్చాలి.

pH కనుగొనుట : లిట్మస్ పేపరుతో నీటి నమూనాలలో ఉదజని సూచిక pH ను కనుగొనవచ్చును. నీలం రంగు లిట్మస్ పేపరు నీటి నమూనాలో ముంచినప్పుడు ఆ పేపరు ఎరుపుగా మారితే ఆ నీటికి ఆమ్లత్వం కలిగి ఉన్నట్లు ! ఎరుపు లిట్మస్ పేపరు నీలం రంగుగా మారితే ఆ నీటికి క్షారత్వం ఉందని భావించాలి.
కఠినత్వం కనుగొనుట : నీటి కఠినత్వమును సబ్బును ఉపయోగించి కనుగొనవచ్చును. ఆ నీరు ఎక్కువ నురగ వస్తే మంచినీరు, తక్కువ నురగ వస్తే ఆ నీటికి కఠినత్వం ఉందని తెలుసుకోవచ్చును.
పరిశీలనలు : మీ పరిశీలనలు దిగువ పట్టికలో నమోదు చేయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 6

ప్రయోగం నిర్వహించేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :

  1. లిట్మస్ పేపరు రంగు మారడాన్ని జాగ్రత్తగా గమనించాలి.
  2. ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకోవాలి.
  3. ఏ నీటి నమూనాను రుచి చూడడానికి ప్రయత్నించవద్దు.
  4. ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నారా ? మీ నోట్స్ లో రాయండి. .

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

6. మీ దగ్గరలో ఉన్న చెరువు లేదా నదిని సందర్శించి, అక్కడ చేరుతున్న కాలుష్య పదార్థాలను మరియు దాని వలన కలిగే పరిణామాలను పరిశీలించి ఒక ప్రాజెక్ట్ తయారుచేయండి. దాని ఆత్మకథను రాయండి. పాఠశాల ‘థియేటర్ డే’ లో ప్రదర్శించండి.
జవాబు:
పిల్లలూ బాగున్నారా ? నన్ను గుర్తుపట్టలేదా ? అవునులే నేను ఇప్పుడు పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతూ ముసలిదానినై పోయాను. నాలో గతం నాటి ఉత్సాహం లేదు. ఆనందం లేదు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఎన్నో విధాలుగా మీకు ఉపయోగపడిన నన్ను మీరే అనారోగ్యం పాలుచేశారు. నేను మీకు జీవనాధారమైన నీరు ఇచ్చాను. తాగటానికి మంచినీరు ఇచ్చాను. పంటపొలాలకు నీరు అందించాను. మీ గ్రామ అవసరాలన్నింటినీ తీర్చాను.

కానీ మీరు మాత్రం, నాలోనికి రకరకాల వ్యర్థాలను వదిలి, నన్ను కలుషితం చేసి పాడుచేశారు. ఇప్పుడు నేను ఎవరికీ పనికిరాని వ్యర్థంగా, మురికి కూపంగా మీకు కనిపిస్తున్నాను. నన్ను ఇంత ఇబ్బంది పెట్టి మీరు సుఖంగా ఉన్నది ఏది ? మీరు నాకన్నా ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు. తాగునీటికి – మైళ్ళదూరం వెళుతున్నారు. పంటలకు నీరు లేక ఎండబెట్టుకొంటున్నారు. మేత లేక పశువులను అమ్ముకొంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి నా గట్టు వద్దకు వచ్చి ఆలోచించండి. కారణం మీకే తెలుస్తుంది. చేసిన తప్పును సరిదిద్దుకోండి. మీ కష్టాలకు మీరే కారణం అని తెలుసుకోండి. సరేనా, ఇంతకూ నన్ను గుర్తుపట్టారా, నేను మీ గ్రామ చెరువును !

7. మీరు కింద ఇచ్చిన కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ నమూనాను చూడండి. సర్టిఫికేట్ ను పరిశీలించి దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి. (పేజీ.నెం.158)
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 7
ఎ) కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ ఏ డిపార్ట్ మెంట్ పారు జారీచేస్తారు ?
జవాబు:
ట్రాన్స్ పోర్ట్ డిపార్టుమెంట్ ఆంధ్రప్రదేశ్ వారు కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ జారీ చేస్తారు.

బి) ఈ సర్టిఫికెట్ కాలపరిమితి ఎంత ?
జవాబు:
ఈ సర్టిఫికెట్ కాలపరిమితి ఆరు నెలలు.

సి) ఏ రకమైన వాహనానికి ఈ సర్టిఫికెట్ జారీచేస్తారు ?
జవాబు:
అన్ని డీజిల్, పెట్రోల్ తో నడిచే వాహనాలకు ఈ సర్టిఫికెట్ జారీ చేస్తారు.

డి) కాలుష్య తనిఖీ కేంద్రాలలో ఏయే వాయువులు పరీక్షిస్తారు ?
జవాబు:
కాలుష్య తనిఖీ కేంద్రాలలో హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులు పరీక్షిస్తారు.

ఇ) కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్ అనుమతించబడ్డ పరిమితి కంటే రీడింగ్ ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది ?
జవాబు:
కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోకార్బన్స్ అనుమతించబడ్డ పరిమితి కంటే రీడింగ్ ఎక్కువ ఉంటే ఆ వాహనానికి అపరాధ రుసుము విధిస్తారు.

ఎఫ్) పై విషయాలపై తరగతి గదిలో చర్చించండి. కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఎందుకు ? ఆలోచించండి. చెప్పండి.
జవాబు:
కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఎందుకు అంటే వాహనాల నుంచి పరిమితికి మించి కాలుష్య పదార్థాలు వాతావరణంలోకి విడుదల కాకుండా ఉండుటకు.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

8. కింద ఇచ్చిన వార్తను చదవండి. మీరు అవగాహన చేసుకొన్న దానిని బట్టి వాటి దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. (పేజీ.నెం. 167)
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 8
ఎ) వార్తాపత్రిక క్లిప్పింగ్ చదివిన తరువాత మీకు అర్థమైన విషయం ఏమిటి ? (పేజీ.నెం. 168)
జవాబు:
కొన్ని పరిశ్రమల వలన భూగర్భజలం విషతుల్యంగా మారుతోంది.

బి) వార్తాపత్రికలో ఏ విషయం గురించి చర్చించారు ?
జవాబు:
రసాయన పరిశ్రమల కాలుష్యంతో భూగర్భజలం విషతుల్యంగా మారి తాగుటకు, వ్యవసాయానికి ఏ విధంగా పనికిరాదో, ఆ కాలుష్య నియంత్రణకు తీసుకొన్న చర్య గురించి చర్చించినారు.

సి) దానికి కారణం ఏమిటి ? దాని ప్రభావం ఏమిటి ?
జవాబు:
దానికి కారణం రసాయనిక పరిశ్రమలు. దాని ప్రభావం మునుషుల పైనేగాక జీవరాశులు అన్నింటిపైనా ఉంది.

డి) సమస్య ఏ విధంగా ఉత్పన్నమైనది ?
జవాబు:
ఇష్టానుసారంగా రసాయనిక పరిశ్రమలు స్థాపించుటకు అనుమతి ఇవ్వడం, వాటి కాలుష్యాలను శుద్ధి చేయకుండా నేల, గాలి, నీటిలోకి విడుదల చేయడం వలన ఈ సమస్య ఉత్పన్నమైనది.

ఇ) మీ ప్రాంతంలో ఈ రకమైన సమస్యను ఎప్పుడైనా ఎదుర్కొన్నారా ? దీనికి వెనుక ఉన్న కారణాలు చెప్పగలరా ?
జవాబు:
ఎదుర్కొనలేదు.
గమనిక : ఎవరికి వారు తమ ప్రాంతంలోని కాలుష్యాలకు గల కారణాలను తెలుసుకొని రాయాలి.

ఆలోచించండి – చర్చించండి

1. టైర్లను, ఎండిపోయిన ఆకులను కాలిస్తే దాని వలన వచ్చే పొగ, బూడిద మొదలైనవన్నీ ఎక్కడికి పోతాయి ? ఏమవుతాయి? (పేజీ.నెం. 160)
జవాబు:
టైర్లను, ఎండిపోయిన ఆకులను కాలిస్తే దాని వలన వచ్చే పొగ, బూడిద మొదలైనవన్నీ వాతావరణం (గాలిలోకి) లో చేరి కాలుష్యం కలుగజేయును.

2. మనం రద్దీగా ఉన్న రోడ్డు పైన సాయంత్రం వేళ పోతున్నప్పుడు చుట్టూ పొగ దట్టంగా ఉంటుంది. మనం రుమాలుతో ముక్కు మూసుకున్నప్పటికీ దగ్గు, చికాకు కలుగుతుంది. ఈ లక్షణాలు ఎందుకు కలుగుతాయో ఆలోచించండి – చర్చించండి. (పేజీ.నెం. 166)
జవాబు:
మనం రద్దీగా ఉన్న రోడ్డు పైన సాయంత్రం వేళ పోతున్నప్పుడు చుట్టూ పొగ దట్టంగా ఉంటుంది. మనం రుమాలుతో ముక్కు మూసుకున్నప్పటికీ దగ్గు, చికాకు కలుగును. కారణం ఆ పొగలో ఉన్న అతి చిన్న కణాలు రుమాలు ద్వారా ముక్కు లోపలికి వెళ్ళి అక్కడ మనకు. ఎలర్జీ కలుగజేయును. దీనినే మనం డస్ట్ ఎలర్జీ అంటాము.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

3. ఈ రకమైన లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే ఏమి జరుగుతుంది ? (పేజీ.నెం. 166)
జవాబు:
ఈ రకమైన లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే శ్వాసవ్యవస్థలో ముఖ్యంగా ఊపిరితిత్తులు పాడవుతాయి. ఆస్తమా వంటి వ్యాధులు వస్తాయి.

4. నీటిలో ఉదజని సూచిక pH మరియు కఠినత్వముల మధ్య ఏదైనా సంబంధాన్ని గుర్తించారా ? (పేజీ.నెం. 169)
జవాబు:
నీటిలో ఉదజని సూచిక pH మరియు కఠినత్వముల మధ్య సంబంధాన్ని గుర్తించాను. క్షారత్వం పెరిగేకొలదీ నీటి కఠినత్వం పెరుగును.

5. ఏ నీటి నమూనా రంగు లేకుండా ఉంది ? (పేజీ.నెం. 169)
జవాబు:
కుళాయి నీరు రంగు లేకుండా ఉంది.

6. త్రాగడానికి ఏ నీరు పనికి వస్తుంది ? ఎందుకు ? (పేజీ.నెం. 169)
జవాబు:
తాగడానికి కుళాయి నీరు పనికి వస్తుంది. కారణం కుళాయిలో ఉన్న నీటిని వివిధ దశలలో శుభ్రపరచి పంపిస్తారు. స్వచ్ఛమైన నీటికి రంగు, వాసన ఉండదు.

7. కొన్ని నీటి నమూనాల్లో రంగు, వాసనలో మార్పు రావడానికి గల కారణాలు ఏమిటి ? (పేజీ.నెం. 169)
జవాబు:
కొన్ని నీటి నమూనాల్లో రంగు, వాసనలో మార్పు రావడానికి కారణాలు :
1. నీటిలో ఉన్న బాక్టీరియాలు, శైవలాలు ఇతర సూక్ష్మజీవులు చేరుట వలన
2. నీటిలో కలుషితాలు చేరినప్పుడు కూడా నీటికి రంగు, వాసనలో మార్పు వచ్చును.

8. నీటి నమూనాలో కంటికి కనిపించే కాలుష్య కారకాలు ఏమైనా ఉన్నాయా ? (పేజీ.నెం. 169)
జవాబు:
నీటి నమూనాలో కంటికి కనిపించే కాలుష్య కారకాలు ఏమీ లేవు.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

పాఠ్యాంశములోని ప్రశ్నలు

1. హానికరమైన జీవులు లేదా పదార్థాలు మన శరీరంలో ప్రవేశిస్తే ఏమి జరుగుతుంది ? వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ? (పేజీ.నెం. 159)
జవాబు:
హానికరమైన జీవులు లేదా పదార్థాలు మన శరీరంలో ప్రవేశిస్తే మనకు అనారోగ్యం కలుగును.
వాటి ఫలితాలు :
1. చాలామంది ప్రజలు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడతారు.
2. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగును.
3. హానికరమైన జీవుల వలన రోగాలు (సూక్ష్మజీవ సంబంధ) వచ్చును.

2. గాలిలోని వివిధ వాయువుల జాబితాను తయారుచేయండి. (పేజీ. నెం. 159)
జవాబు:
గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్, నీటి ఆవిరి మరియు ఇతర జడవాయువులు ఉంటాయి.
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 9

3. కాలుష్య కారకాలు ఎన్ని రకాలు ? అవి ఏవి ? (పేజీ.నెం. 151)
జవాబు:
కాలుష్య కారకాలు ముఖ్యంగా రెండు రకాలు అవి :
1. ప్రాథమిక కాలుష్య కారకాలు
2. ద్వితీయ కాలుష్య కారకాలు

4. సహజ కారణాల వల్ల ఏర్పడే కాలుష్యం వివరింపుము. (పేజీ.నెం.151)
జవాబు:
సహజ కారణాల వల్ల ఏర్పడే కాలుష్యం :
1. అడవుల దహనం వల్ల కర్బన పదార్థాలు (బూడిద) గాలిలో కలిసి కాలుష్య కారకంగా మారుతున్నాయి.
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 10
2. అగ్ని పర్వతములు బద్దలై CO2, SO2 వంటి చాలా రకాలైన విషవాయువులు మరియు బూడిద వాతావరణంలో కలిసి కాలుష్యానికి దారితీస్తోంది.
3. కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి అమ్మోనియా వాయువు విడుదల అయి గాలి కాలుష్యానికి కారణమవుతున్నది.
4. నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి మీథేన్ వాయువు విడుదలై కాలుష్య కారకంగా మారుతున్నది.
5. మొక్కల పుష్పాల నుండి విడుదల అయ్యే పుప్పొడి రేణువులు కూడా గాలి కాలుష్య కారకాలుగా మారుతున్నాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

5. మానవ చర్యల వల్ల ఏర్పడే కాలుష్యం గురించి వివరింపుము. (పేజీ.నెం. 162)
జవాబు:
1. ఇంధనాలు : వీటిని మండించడం ద్వారా కార్బన్‌ మోనాక్సైడ్ (CO), SO2 పొగ, ధూళి మరియు బూడిద వెలువడును.
2. వాహనాలు : మోటారు వాహనాల నుంచి విడుదలయ్యే పొగలో SO2, NO2, CO పూర్తిగా మండని హైడ్రోకార్బన్లు మరియు సీసం సంయోగ పదార్థాలు, మసి ఉంటాయి.
3. పరిశ్రమల నుంచి ముఖ్యంగా గ్రానైట్, సున్నపురాయి, సిమెంట్ పరిశ్రమల నుండి విడుదలయ్యే పొగలో నైట్రస్ ఆక్సెడ్, SO2 క్లోరిన్ బూడిద మరియు దుమ్ము ఉంటాయి.
4. అణుశక్తి విద్యుత్ కేంద్రాలు కాలుష్యానికి కారణం.
5. ఎరువులు – పురుగుల మందులు గాలి, నీరు, నేల కాలుష్యానికి కారణం.
6. అడవుల నరికివేత కూడా కాలుష్యానికి ప్రధాన కారణం.
7. క్లోరోఫ్లోరో కార్బనులు, గనుల నుంచి విడుదలైన పదార్థాలు కాలుష్యానికి కారణం.
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 11

6. గ్రామాల్లో, పట్టణాల్లో సాధారణంగా మండించే ఇంధనాల జాబితా రాయండి. (పేజీ.నెం. 162)
జవాబు:
గ్రామాల్లో సాధారణంగా మండించే ఇంధనాలు : కట్టెలు, కిరోసిన్, బయోగ్యాస్, పొట్టు, కంది కంప మొదలైనవి.
పట్టణాల్లో సాధారణంగా మండించే ఇంధనాలు : గ్యాస్, కిరోసిన్.

7. సి.ఎఫ్.సి ల గురించి వ్రాయండి. (పేజీ.నెం. 163)
జవాబు:
రిఫ్రిజిరేటర్స్, ఎ.సి.లు, విమానాల నుండి వెలువడే వ్యర్థ రసాయనాలను సి.ఎఫ్.సి (క్లోరోఫ్లోరో కార్బన్) లు అంటారు. ఇవి గాలిలోకి విడుదలై వాతావరణంలో ఓజోన్ పొరను దెబ్బతీయును. దీని వలన ఓజోన్ పొరలో అక్కడక్కడ రంధ్రాలు ఏర్పడును. దీని వలన అతి ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలు భూమి మీద పడును. ఈ విధంగా జరుగుట వలన భూమి పైన జీవకోటికి ప్రమాదం జరుగును.

8. అతినీలలోహిత కిరణాలు మనపై పడటం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? (పేజీ.నెం. 163)
జవాబు:
అతినీలలోహిత కిరణాలు శక్తివంతమైనవి. ఇవి మన శరీరంపై పడటం వలన
1. చర్మ కణాలు దెబ్బతింటాయి.
2. చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
3. జన్యు ఉత్పరివర్తనాలను కలిగిస్తాయి.

9. వాయు కాలుష్యం వల్ల జరిగే దుష్ఫలితాలు రాయండి. (పేజీ.నెం. 166) (లేదా) ప్రపంచ ఆరోగ్య సంస్థ నూతన నివేదిక ఆధారంగా ఏడాదికి 4.3 మిలియన్ల మంది గృహం లోపల వాయు కాలుష్యం వలన, 3.7 మిలియన్ల మంది వాయు కాలుష్యం వలన ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే జరిగే పర్యవసానాలను నాలిగింటిని రాయండి.
జవాబు:
వాయు కాలుష్యం వల్ల జరిగే దుష్ఫలితాలు :
1. వాయుకాలుష్యం వల్ల శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి, ఛాతి నొప్పి, ముక్కు దిబ్బడ, ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు కలుగును.
2. వాయు కాలుష్యం వలన హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్త పీడనం లాంటి వ్యాధులకు గురి అగును.
3. దుమ్ము మరియు పొగ ఆకుల మీద పేరుకున్నప్పుడు మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ, బాష్పోత్సేకం మొదలైన జీవక్రియలు ప్రభావితం అగును.
4. హైడ్రోజన్ సల్ఫైడ్ పీల్చడం వలన మానవులకు విపరీతమైన తలనొప్పి వచ్చును.
5. విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ మన రక్తంలోని హీమోగ్లోబిన్ తో కలవడం వలన స్థిరమైన కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడి ఆక్సిజన్ శరీర భాగాలకు అందక చనిపోయే ప్రమాదం ఉంది.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

10. నీటి కాలుష్యానికి దారితీసే కారణాల జాబితా రాయండి. మీ ప్రాంతంలో జరిగే నీటి కాలుష్యం పోల్చి చూడండి. (పేజీ.నెం. 170)
జవాబు:

  1. పరిశ్రమల వలన జల కాలుష్యం జరుగును.
  2. పరిశ్రమల వలన జలాలలో ఉష్ణ కాలుష్యం.
  3. కబేళా, కోళ్ళ, డెయిరీఫారమ్ ల వలన జల కాలుష్యం జరుగును.
  4. ఎరువులు, క్రిమి సంహారక రసాయనాల వలన జల కాలుష్యం జరుగును.
  5. ముడి చమురు వల్ల సముద్ర జల కాలుష్యం జరుగును.
  6. మానవుని అపరిశుభ్ర అలవాట్ల వల్ల జల కాలుష్యం జరుగును.
    మా ప్రాంతంలో కూడా ఇంచుమించు ఇదే రకంగా జరుగును.

11. మూసీ నది కాలుష్య నియంత్రణకు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి ? (పేజీ. నెం. 170)
జవాబు:

  1. ఘనరూప వ్యర్థాల నియంత్రణ.
  2. మురికినీరు శుద్ధిచేయు ప్లాంట్ ను నెలకొల్పడం.
  3. తక్కువ ఖర్చుతో మురుగునీటి వ్యవస్థ కల్పించడం.
  4. నదీ తీరాన్ని అభివృద్ధి పరచడం.
  5. ప్రజలలో అవగాహన కలిగించుటకు కృషిచేయడం.

12. మీ టీచర్ ను అడిగి వాయుసహిత (ఏరోబిక్) బాక్టీరియాల గురించిన సమాచారాన్ని ఉదాహరణలతో రాయండి. (పేజీ.నెం. 171)
జవాబు:
ఆక్సిజన్ కలిగిన వాతావరణంలో నివసించు బాక్టీరియాలు. ఇవి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను ఎక్కువ మోతాదులో వినియోగించుకొంటాయి. అందువలన మిగతా జీవులకు ఆక్సిజన్ అందక మరణిస్తాయి. ఏరోబిక్ బాక్టీరియాలకు
ఉదాహరణ :
1. స్టెఫైలో కోకస్ జాతి
2. స్ట్రెప్టో కోకస్
3. ఎంటరో బాక్టీరియాకాక్
4. మైక్రో బాక్టీరియమ్ ట్యూబర్కోలస్
5. బాసిల్లస్
6. సూడోమోనాస్

13. ఓడ ప్రమాదాల వలన సముద్రం నీటిపై ఏర్పడే నూనెతెట్టు ఏ రకమైన ప్రమాదాన్ని ‘జీవులకు కలుగజేస్తుందో మీకు , తెలుసా ? (పేజీ.నెం. 172)
జవాబు:
ఓడ ప్రమాదాల వలన సముద్రం నీటిపై ఏర్పడిన నూనె తెట్టు వలన నీటి లోపలకు ఆక్సిజన్ వెళ్ళదు. దీని వలన జలచర జీవుల మనుగడ కష్టమై నీటిలో ఉన్న ఆవరణ వ్యవస్థ దెబ్బతినును.

AP Board 8th Class Biology Solutions Chapter 10 పీల్చలేము - తాగలేము

14. వాతావరణంలో కాలుష్య కారకాలు – వాటి మూలాలు తెలుపు ఒక పట్టిక తయారు చేయండి. (పేజీ.నెం. 164)
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 10th Lesson పీల్చలేము - తాగలేము 12

15. మీ ఉపాధ్యాయుడిని అడిగి ద్వితీయ కాలుష్య కారకాలు అని వేటిని, ఎందుకు అంటారో తెలుసుకోండి. (పేజీ.నెం. 164)
జవాబు:
ప్రాథమిక కాలుష్య కారకాలు వాతావరణంలోనికి ప్రవేశించి వాతావరణంలోని మూలకాలతో చర్య జరపడం వల్ల ఏర్పడిన పదార్థాలను ద్వితీయ కాలుష్య కారకాలు అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

SCERT AP 8th Class Biology Study Material Pdf 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2 Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 3rd Lesson Questions and Answers సూక్ష్మజీవుల ప్రపంచం 2

8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2 Textbook Questions and Answers

ప్రశ్న 1.
కవితకు తీవ్రమైన జబ్బు చేస్తే డాక్టరు దగ్గరకు వెళ్ళింది. డాక్టర్ 5 రోజులకు సూక్ష్మజీవ నాశకాలు (Antibiotics) వాడమని మందులు రాశాడు. మూడు రోజులు వాడిన తరువాత జబ్బు నయం అయింది. ఆమె యాంటిబయాటిక్ మందులు వాడటం మానివేసింది. ఆమె చేసింది సరైనదేనా ? కాదా ? ఎందుకు ? కారణాలు రాయండి.
జవాబు:

  • కవిత చేసింది సరైంది కాదు.
  • ఎందుకంటే డాక్టరు ఆమె జబ్బు నయం అయ్యేందుకు అవసరమైన మోతాదు ఐదు రోజులకు సూక్ష్మజీవ నాశకాలు వాడమని అన్నారు.
  • కానీ జబ్బు మూడవ రోజు తగ్గిందని ఆమె మందులు మానింది.
  • పైకి జబ్బు తగ్గినట్లుగా వున్న, శరీరం లోపల ఇంకా ఆ వ్యాధికారక సూక్ష్మజీవులు వుంటాయి.
  • అవి పూర్తిగా నిర్మూలించబడకుండా మందులు మానివేస్తే జబ్బు తిరగబెడుతుంది.
  • ఒకవేళ మందులు మానివేయాలి అంటే అది డాక్టరు సలహా పై జరగాలి తప్ప మనంతట మనం నిర్ణయించుకోవటం మంచిది కాదు.
  • ఉదా : పచ్చ కామెర్లు తగ్గినా, దీని వ్యాధికారక క్రిమి 6 నెలల వరకు పాక్షికంగా మన శరీరంలోనే వుంటుంది. అందుకే డాక్టరు ఇచ్చిన మోతాదు తప్పక వాడాలి.

ప్రశ్న 2.
టీకాలు మన శరీరంలో ఏ విధంగా పనిచేస్తాయి ?
జవాబు:
టీకాలు లేదా వ్యాక్సిన్లు మన శరీరంలో వ్యాధి రాకముందే ప్రవేశించి, రోగకారక క్రిమిని నశింపచేయటానికి తగిన రోగ నిరోధక శక్తిని కలిగిస్తాయి. ఉదా : ‘పోలియో చుక్కలు’. ఈ మందు చిన్నపిల్లలకు ఇచ్చినప్పుడు ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తరువాత పోలియో వైరస్ శరీరంలోకి ప్రవేశించినా అది పోలియోను కలుగచేయలేదు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 3.
పాశ్చరైజేషన్ అంటే ఏమిటి ? అది ఎందుకు ఉపయోగపడుతుంది ?
జవాబు:

  • “లూయీపాశ్చర్” వైన్ చెడిపోవటానికి సూక్ష్మజీవులు కారణం అని గుర్తించాడు.
  • వైన్ ను వేడి చేయటం ద్వారా సూక్ష్మజీవులను చంపి, ఎక్కువ కాలం వైన్ ను నిల్వ చేయవచ్చని నిరూపించాడు. ఈ విధానాన్ని ‘పాశ్చరైజేషన్’ అంటారు.
  • ఇది పాలను పెరుగుగా మార్చటానికి, ద్రాక్ష రసాన్ని పులియబెట్టి వైన్ గా మార్చటానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 4.
మలేరియా వ్యాధిని నిర్మూలించటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు:
1. ‘మలేరియా’ ఇది జ్వర రూపంలో వచ్చే వ్యాధి.
2. తీవ్రమైన చలితో కూడిన జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసం దీని లక్షణాలు.
3. ఇది దోమల వల్ల వచ్చే వ్యాధి. కాబట్టి దోమల నివారణకు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎ) పరిసరాలలో మురుగు గుంటలు, కాలువలు లేకుండా చేయాలి.
బి) ఒకవేళ వున్నా ఆ మురికినీటిపై నూనె చుక్కలు వేస్తే అది నూనె తెట్టును ఏర్పరుస్తుంది. దీంతో ఆ నీటిలోవున్న లార్వాలు చనిపోతాయి.
సి) దోమ తెరలను వాడాలి.
డి) దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, తలుపులకు తెరలను పెట్టాలి.
ఇ) ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా వుంచుకోవటం ముఖ్యమైన విషయం.

ప్రశ్న 5.
వ్యాక్సిన్ తీసుకోవటానికి, యాంటిబయాటిక్ తీసుకోవడానికి సరైన సమయం ఏది ? ఎందుకు ?
జవాబు:

  • వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందును ‘వ్యాక్సిన్’ అంటారు.
  • వ్యాధి వచ్చిన తరువాత అది తగ్గటానికి తీసుకునే మందులే యాంటిబయాటిక్స్.
  • కాబట్టి చిన్న వయస్సులో పెద్దలు, డాక్టర్ల సూచనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవాలి.
  • ఉదా : 1) ధనుర్వాతం, మశూచి మొ॥ రాకుండా చిన్నపిల్లలకు చిన్నప్పుడే టీకాలు వేస్తారు.
    2) పచ్చ కామెర్లు రాకుండా 10-15 సం॥ పిల్లలలో, పెద్దలకు కూడా Hepatitis – B వ్యాక్సిన్ ఇస్తారు.
  • ఇక యాంటిబయాటిక ను జబ్బు లక్షణాలు కనిపించిన తరువాత డాక్టరు నిర్ణయించిన మోతాదు ప్రకారం మాత్రమే మందులను వేసుకోవాలి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 6.
వ్యాక్సిను, యాంటిబయాటిక్ తేడాలు ఏమిటి?
జవాబు:

వ్యాక్సిన్ యాంటిబయాటిక్
1) చైతన్య రహిత సూక్ష్మజీవులను శరీరంలోనికి ఎక్కించే ప్రక్రియను వాక్సిన్ అంటారు. 1) సూక్ష్మజీవులను చంపే రసాయన పదార్థాలను సూక్ష్మజీవ నాశకాలు లేదా యాంటిబయాటిక్స్ అంటారు.
2) వ్యాధినిరోధక వ్యవస్థను పెంచుతుంది. 2) వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడినపుడు యాంటిబయాటిక్స్ వాడతారు.
3) ప్రతిరక్షకాలు తయారవుతాయి. 3) ప్రతిరక్షకాలు తయారుకావు.
4) దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది. 4) ప్రభావం తాత్కాలికంగా ఉంటుంది.
5) వ్యాధి రాకుండానే వాక్సిన్ ఇస్తారు. 5) వ్యాధి వచ్చిన తరువాత యాంటిబయాటిక్స్ వాడతారు.
6) వ్యాక్సిన్స్ వ్యాధి రాకుండా ఉండటానికి తోడ్పడతాయి. 6) యాంటిబయాటిక్స్ వ్యాధిని తగ్గించటానికి తోడ్పడతాయి.

ప్రశ్న 7.
‘పెన్సిలిన్ ఆవిష్కరణ ప్రపంచాన్ని మరణాల నుండి రక్షించింది’ దీనిని వివరించండి.
జవాబు:

  • ‘పెన్సిలిన్’ అంటే యాంటిబయాటిక్ మందు.
  • దీనిని సూక్ష్మజీవ నాశకం అని కూడా అంటారు.
  • దీనిని డా॥ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కనిపెట్టాడు.
  • గాయపడిన సైనికులు సూక్ష్మజీవుల బారినపడి మరణిస్తుంటే, వీటిపై ప్రయోగాలు చేసి ఈ మందును కనిపెట్టాడు.
  • ఎందరో సైనికులను వ్యాధుల నుండి కాపాడాడు.
  • తరువాత కాలంలో ఇది మరెన్నో కోట్ల మందిని మరణం నుంచి, వ్యాధుల నుంచి కాపాడింది.
  • అందుకే పెన్సిలిన్ ఆవిష్కరణ ప్రపంచాన్ని మరణాల నుంచి రక్షించింది.

ప్రశ్న 8.
ప్రతిరక్షకాలు అంటే ఏమిటి ? ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి ? ఎలా మనకు సహాయపడతాయి ?
జవాబు:

  • వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి నుండి మనల్ని రక్షించేందుకు మన శరీరం కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది.
  • వీటినే ప్రతిరక్షకాలు అంటారు.
  • ఇవి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులతో పోరాటం చేస్తాయి.
  • ఇవి వ్యాధికారక క్రిమి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎక్కువ ఉత్పత్తి అవుతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 9.
రాజీ తన పక్కింటి వారితో “మురుగునీరు నిల్వ ఉంటే వ్యాధులు ప్రబలుతాయి” అని చెప్పింది. ఈ సమయంలో ఆమె వ్యాధుల గురించి ఏమేమి వివరాలు చెప్పి ఉంటుందో ఊహించి రాయండి.
జవాబు:

  • మురుగునీరు నిల్వ ఉంటే దానిలో దోమలు, వాటి లార్వాలు పెరుగుతాయి.
  • వాటి ద్వారా వ్యాధులు ప్రబలుతాయి.
  • ఉదాహరణకు ‘మలేరియా’ జ్వరం దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • టైఫాయిడ్ కూడా క్యూలెక్స్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.
  • మలేరియా చలితో వచ్చే జ్వరం. కానీ టైఫాయిడ్ తక్కువ జ్వరంతో చాలా రోజులు బాధపెడు.
  • ఈ రెండు వ్యాధులకు మురుగునీరు ఒక రిజర్వాయర్ లాంటిది. దీనిలో వీటి లార్వాలు పెరిగి వ్యాధి వ్యాప్తికి కారణమవుతాయి.
  • ఇవి రెండు కాకుండా పోలియో, కలరా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడు వాపు వ్యాధి లాంటి వ్యాధులన్నింటికీ దోమలు వాహకాలు.
  • మురుగునీరు దోమలకు ఆవాసం. కాబట్టి మురుగునీరు నిల్వ ఉంటే వ్యాధులు ప్రబలుతాయి అని రాజీ చెప్పిన విషయం సరైనదే.

ప్రశ్న 10.
మూడు గిన్నెలు తీసుకుని A, B, C గా గుర్తించండి. వాటిలో గోరువెచ్చని పాలు, వేడి పాలు, చల్లని పాలు వరుసగా పోయండి. మూడింటిలో ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున పెరుగు తోడు వేయండి. కదపకుండా 5-6 గంటల సేపు ఉంచండి. తరువాత మూతలు తీసి పాలలో వచ్చిన మార్పులు గమనించండి.
1. గిన్నెలో పాలు పెరుగుగా మారాయి ?
2. ఏ రెండు గిన్నెలలో పాలు పెరుగుగా మారలేదు ?
జవాబు:

  • గోరువెచ్చని పాలు వున్న ‘A’ గిన్నెలో పెరుగు తయారయింది.
  • ‘B’ గిన్నెలో వేడి పాలు వున్నాయి. అంత ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద లాక్టోబాసిల్లస్’ బాక్టీరియా చనిపోతుంది. కాబట్టి కిణ్వనం జరపలేదు. అందుకే పెరుగు తయారవ్వలేదు. పాలు అడలి పోయినట్లు అయిపోతాయి.
  • ‘C’ గిన్నెలో చల్లని పాలు ఉన్నాయి. బాక్టీరియాకు అవసరమైన ఉష్ణోగ్రత కన్నా తక్కువ పాలలో వుంది. కాబట్టి బాక్టీరియా ఎదుగుదల అతి తక్కువ కాబట్టి పెరుగు తయారవ్వలేదు సరికదా పాలు విరిగిపోతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 11.
మైక్రోబయాలజీకి సంబంధించిన విషయాలు కనుగొన్న శాస్త్రవేత్తల గురించి సమాచారాన్ని సేకరించండి. ఈ ఆవిష్కరణలు మానవాళికి ఎలా ఉపయోగపడతాయో సూచించే చార్టును రూపొందించి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:

వ.సం. శాస్త్రవేత్త పేరు కనుగొన్న అంశం
1. ఆంథోనివాన్ ల్యూవెన్ హాక్ బాక్టీరియా
2. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్
3. డా॥ యల్లాప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్
4. డా॥ జోసన్ సాక్
డా॥ ఆల్బర్ట్ సాచిన్ పోలియో
పోలియో వ్యాక్సిన్
(చుక్కల మందు)
5. ఎడ్వర్డ్ జెన్నర్ మశూచికి టీకా మందు
6. లూయీ పాశ్చర్ కుక్క కాటుకి టీకా పాశ్చరైజేషన్
7. డా॥ రోనాల్డ్ రాస్ మలేరియా దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పాడు.

ప్రశ్న 12.
మైక్రోబయాలజీ (సూక్ష్మజీవుల శాస్త్రం) లో ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తల ఫోటోలతో ఆల్బమ్ తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 1

ప్రశ్న 13.
మీ దగ్గరలో వున్న పాల డైరీని లేదా గ్రంథాలయాన్ని సందర్శించండి. పాశ్చరైజేషన్ జరిగే విధానాన్ని వివరించే ప్రాజెక్టు తయారుచేయండి.
జవాబు:
పాశ్చరైజేషన్ : నిర్వచనం : ఆహార పదార్థాలను వేడి చేయటం ద్వారా సూక్ష్మజీవులను తొలగించి వాటిని ఎక్కువ సమయం నిల్వ చేయటాన్ని పాశ్చరైజేషన్ అంటారు. దీనిని లూయీపాశ్చర్ కనిపెట్టారు.

విధానం : పాలను నిల్వ చేయటం : 1. మొదట పాలను 70°C వరకు 30 సెకన్ల పాటు వేడి చేస్తారు. 2. తరువాత పాలను చల్లార్చి నిల్వ చేస్తారు.

వైన్ ను నిల్వ చేయటం : 1. మొదట వైన్ ను వేడి చేసి తరువాత చల్లబరుస్తారు. 2. ఆపై దానిని నిల్వచేస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 14.
మీ గ్రామంలోని పశువుల ఆసుపత్రిని సందర్శించి అక్కడి డాక్టర్ ని అడిగి పశువులు, గొర్రెలు మరియు మేకలలో వచ్చే జబ్బుల జాబితా తయారుచేయండి.
జవాబు:

జబ్బులు
1. పశువులు జబ్బులు గాలికుంటు వ్యాధి, నోటి వ్యాధులు, సెప్టిసీమియ
2. గొర్రెలు ఆంధ్రాక్స్
3. మేకలు ఆంధ్రాక్స్

ప్రశ్న 15.
“సూక్ష్మజీవులు లేకపోతే భూమి చెత్తాచెదారం, జంతువుల మృత కళేబరాలతో నిండిపోతుంది” అని సమీర్ వాళ్ళ నాన్నతో అన్నాడు. అతనితో నీవు ఏకీభవిస్తావా ? ఎందుకు ?
జవాబు:

  • సమీర్ తో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే సూక్ష్మజీవులు కొన్ని ఉపయోగకరమైనవి. మరికొన్ని అపాయకరమైనవి.
  • అపాయకరమైన సూక్ష్మజీవులు వ్యాధులు కలుగచేస్తాయి. ఆహారం తదితరాలను పాడుచేస్తాయి.
  • కానీ ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఇంటిలోను, పరిశ్రమలలోను, పరిసరాలలోని పర్యావరణాన్ని శుద్ధి చేయటానికి ఉపయోగపడతాయి.
  • భూమిపై నున్న చెత్తను కుళ్ళింపచేయటానికి సూక్ష్మజీవులే కారణం.
  • తద్వారా ఆ చెత్తను భూమి మృత్తికలో కలసి పోయేలా చేస్తాయి.
  • జంతువుల మృత కళేబరాలు కుళ్ళి భూమిలో (మృత్తికలో) కలసిపోవటానికి కూడా ఈ సూక్ష్మజీవులే కారణం.
  • ఇవే కనుక లేకపోతే భూమి అంతా చెత్తచెదారం జంతువుల మృత కళేబరాలతో నిండిపోతుంది.

ప్రశ్న 16.
ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి వ్యాధికి టీకా కనుగొనే క్రమంలో కౌపాక్స్ సోకిన వ్యక్తి బొబ్బల నుండి ద్రవం తీసి 8 సంవత్సరాల బాలుడికి ఎక్కించాడు. తరువాత ఆ బాలునికి మశూచి రాదని ప్రయోగ పూర్వకంగా నిరూపించాడు. ఎడ్వర్డ్ జెన్నర్ ధైర్యంతో కూడిన నిశిత పరిశీలనలను ఎలా అభినందిస్తావు ?
జవాబు:

  • ఎడ్వర్డ్ జెన్నర ను ముందుగా అతని ధైర్యానికి అభినందించాలి.
  • అలాగే తన ప్రయోగాలు, పరికల్పనలపై ఆయనకున్న నమ్మకాన్ని మనం అభినందించాలి.
  • శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు, పరికల్పనలు చేస్తుంటారు.
  • జెన్నర్ లాంటి డాక్టర్ల ప్రయోగాలు ముందు జంతువుల పై, తరువాత అనుమతితో మనుషులపై చేస్తున్నప్పుడు ఎంతో ఉద్విగ్నత కలుగుతుంది.
  • 8 సం॥ బాలుడిపై ప్రయోగం కోసం అతను ఆ పిల్లాడి తల్లిదండ్రులను ఎలా ఒప్పించగలగాడో ? ఆ రోజుల్లో అదొక అద్భుతం. వారు ఒప్పుకుని జెన్నర్ విజయంలో భాగస్వాములయ్యారు. అందుకు వారు అభినందనీయులు.
  • కౌపాక్స్, చికెన్ పాక్స్ వచ్చిన ఇద్దరు వేరు వేరు రోగులను నిశితంగా పరిశీలించి, వాటి కారణాల కోసం ఎంతో ఉత్తమమైన పరికల్పనలు చేసిన జెన్నర్ నిశిత పరిశీలన ఈనాటి డాక్టర్లకు కావలసిన ముఖ్య లక్షణం. అందుకు డా॥ జెన్నర ను నేను ఎంతో అభినందిస్తాను.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

ప్రశ్న 17.
‘చికిత్స కంటే నివారణే మేలు’ దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:

  • ‘చికిత్స’ అంటే జబ్బు వచ్చిన తర్వాత మనం తీసుకునే వైద్యం.
  • ‘నివారణ’ అంటే ఆ జబ్బు రాకుండా తీసుకునే ‘ముందు జాగ్రత్త’ కాబట్టి నివారణకే మనం ప్రాధాన్యత నివ్వాలి.
  • ప్రతి వ్యాధికి ఈ రోజున నివారణా పద్ధతులు వున్నాయి.
  • వ్యాధి బారిన పడి బాధపడే కంటే నివారణోపాయాలు తెలుసుకుని వ్యాక్సిన్లు, జాగ్రత్తలు పాటించి మనల్ని మనం ఆరోగ్యవంతులుగా ఉంచుకోవటం మంచిది అని నా అభిప్రాయం.

ప్రశ్న 18.
“చాక్లెట్స్, ఐస్ క్రీములు తిన్న తరువాత నోరు బాగా పుక్కిలించాలి” అని లత తన సోదరుడు రాజేష్ తో చెప్పింది. లత చెప్పింది నిజమేనా ? ఎందుకు ?
జవాబు:

  • లత రాజేష్ తో చెప్పింది నిజమే.
  • కారణం ఏమిటంటే – చాక్లెట్, ఐస్ క్రీమ్ లు తిన్నప్పుడు అవి దంతాల మధ్యలో, చిగుళ్ళలో ఇరుక్కుపోతాయి.
  • నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవటం ద్వారా సూక్ష్మజీవులు చేరకుండా చూసుకోవచ్చు.
  • చాక్లెట్, ఐస్ క్రీమ్ లో చక్కెర శాతం ఎక్కువ మరియు రెండూ అతి మెత్తని ఆహార పదార్థాలు.
  • వీటిని తిన్నప్పుడు నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవటం తప్పనిసరి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 2 InText Questions and Answers

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
లాక్టోబాసిల్లస్ బాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుందని నీవు ఎలా చెప్పగలవు?
జవాబు:

  • పెరుగులో లాక్టోబాసిల్లస్ బాక్టీరియా ఉంటుంది.
  • ఈ పెరుగు గోరువెచ్చని పాలలో కలిసినప్పుడు ఈ బాక్టీరియా పాలలో పెరిగి పాలను పెరుగుగా మారుస్తుంది.
  • ఈ బాక్టీరియా లేకపోతే పాలు విరిగిపోతాయి తప్ప పెరుగు రాదు.

కృత్యం – 2

ప్రశ్న 2.
ఇడ్లీ, దోసెల పిండి ఉదయానికల్లా పొంగుతుంది ? ఎందువల్ల ?
జవాబు:

  • ఇడ్లీ, దోసెల పిండిలలో మినపపప్పు, బియ్యం, (ఉప్పుడు బియ్యపు రవ్వ) వేసి కలిపి అలా వుంచుతారు.
  • గాలిలో బాక్టీరియా వుంటుంది కదా ! ఆ బాక్టీరియాలో ‘ఈస్ట్’ వుంటుంది.
  • ఇది ఇడ్లీ, దోసెల పిండి పై చర్య (కిణ్వనం) జరిపి CO2 ను తయారుచేస్తుంది.
  • ఇది పిండితో కలసి ఆ పిండి పరిమాణం ఎక్కువయ్యేలా చేస్తుంది.
  • తద్వారా ఉదయానికల్లా ఇడ్లీ, దోసెల పిండి పొంగుతుంది.

కృత్యం – 3

ప్రశ్న 3.
సూక్ష్మజీవుల వాణిజ్యపరమైన ఉపయోగాలు.
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 2
కృత్యం : రెండు చిన్న గిన్నెలు లేదా బీకర్లు తీసుకోవలెను. రెండింటిలో సగం వరకు నీరు పోయవలెను. వాటికి 5 నుండి 10 చెంచాల చక్కెర కలపవలెను. ఒకదానికి 2 నుండి 3 చెంచాల ఈస్టును కలపవలెను. రెండు గిన్నెలపై మూతలు పెట్టి వెచ్చని ప్రదేశంలో ఉంచవలెను. 3 లేదా 4 గంటల తరువాత మూతలు తీసి వాసన చూడవలెను.

గమనించినది : ఈస్టు కలిపిన గిన్నె నుండి ఆల్కహాలు వాసన వచ్చింది. ఈస్టు కలపని గిన్నె నుండి ఎటువంటి వాసన లేదు.

కారణము : చక్కెరను ఈస్టులు ఆల్కహాలుగా మార్చుతాయి. కాబట్టి ఈస్టు కలిపిన చక్కెర నుండి ‘ఆల్కహాలు’ వాసన వస్తుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

కృత్యం – 4

ప్రశ్న 4.
మీ దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కార్యకర్తను లేదా డాక్టర్‌ను కలవండి. వివిధ వ్యాధుల రాకుండా ఏ వయస్సులో ఏ టీకాలు ఇస్తారో తెలుసుకోండి. మీరు సేకరించిన సమాచారాన్ని పట్టిక తయారుచేసి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:

టీకా నిరోధక వ్యాధి వయస్సు
బిసిజి క్షయ పుట్టినప్పుడు, 10 సం॥లకు
డిటిపి డిప్తీరియా
కోరింతదగ్గు
ధనుర్వాతము
6వ వారం, 10వ వారం,
14వ వారం , 18వ నెల
హెపాటిటిస్ – బి హెపాటిటిస్ – బి పుట్టినప్పుడు, 6వ వారం, 14వ వారం
ఒపివి పోలియో పుట్టినప్పుడు, 6వ వారం, 10వ వారం, 14వ వారం, 5వ సంవత్సరంలో బూస్టర్ డోస్
ఎంఎంఆర్ తడపర, గవదబిళ్ళలు, రూబెల్లా 9వ నెల, 15వ నెలలో బూస్టర్ డోస్
పిసివి న్యూమోనియా 6వ వారం, 10వ వారం, 14వ వారం, 15వ నెలలో బూస్టర్ డోస్
టైఫాయిడ్ టైఫాయిడ్ 2వ సంవత్సరం, 5వ సంవత్సరంలో బూస్టర్ డోస్
వరిసెల్లా ఆటలమ్మ మొదటి సంవత్సరం

కృత్యం – 5

ప్రశ్న 5.
నేల సారాన్ని సూక్ష్మజీవులు పెంచుతాయి. అని ఎలా చెప్పగలరు ?
జవాబు:

  • గాలిలో 78% నత్రజని వుంది.
  • మొక్కలు పోషకాలు తయారుచేయటానికి నత్రజని అవసరం.
  • కానీ మొక్కలు నేరుగా గాలిలో వున్న నత్రజనిని ఉపయోగించుకోలేవు.
  • దీనికి ‘రైజోబియం’ అనే బాక్టీరియా గాలిలో నత్రజనిని నైట్రేట్లుగా మార్చి భూసారాన్ని పెంచుతుంది.
  • రైజోబియం, నాస్టాక్, అనబినా, అజటోబాక్టర్ వంటి సూక్ష్మజీవులు గాలిలో నత్రజనిని, నత్రితా సమ్మేళనాలుగా మార్చి నేలకు పోషక పదార్థాలు అందచేస్తాయి.
  • చిక్కుడు జాతి మొక్కల వేర్లలో ‘వేరు బొడిపెలు’ వుంటాయి. వాటిలో ‘రైజోబియం’ బాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది.
  • అందుకే రైతులు వీటి వేళ్ళను భూమిలోనే వుంచి దున్నుతాయి. అందువల్ల భూసారం పెరుగుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2

కృత్యం – 6

ప్రశ్న 6.
కంపోస్టు గుంట :
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 3
మీ పాఠశాల బడితోటలో ఒక మూలన లేదా మీ ఇంటిలో గల ఖాళీ స్థలములో రెండు గుంటలు తవ్వండి లేదా 2 ఖాళీ కుండలు తీసుకోండి. వీటిని సగం వరకు మట్టితో నింపండి. దీనిలో రాలిన ఆకులు, వృథా అయిన కూరగాయలు, కాగితం ముక్కలు, చెత్తాచెదారంతో నింపండి. రెండవ దానిలో వాడి పారేసిన ప్లాస్టిక్ సంచులు, వస్తువులను పాలిథీన్ సంచులను, గాజు ముక్కలతో నింపండి. ఇప్పుడు రెండు కుండలను లేదా గుంతలను మట్టితో కప్పండి. వాటిపై నీటిని చల్లండి. ఈ విధంగా ప్రతిరోజు నీరు చల్లండి. మూడు, నాలుగు వారాల తర్వాత గుంతల కుండలపై మట్టిని తొలగించండి.

గమనించినది : మొదటి కుండలోని పదార్థాలు కుళ్ళాయి. దీనిలో వేసిన ఆకులు, కాగితం ముక్కలు, కూరగాయలు మొదలైనవి నేలలో కలసిపోయే పదార్థాలు. ఇవి సూక్ష్మజీవులచే విచ్ఛిన్నం కాబడతాయి. రెండవ కుండలోని మార్పుచెందని లేదా కుళ్ళని పదార్థాల వలన నేల స్వభావం మారుతుంది. నేల ఆరోగ్యం క్షీణించి, నేల కాలుష్యానికి దారి తీస్తుంది.

కృత్యం – 7

ప్రశ్న 7.
మీకు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా డాక్టరును సందర్శించి, సూక్ష్మజీవుల వలన వచ్చే వివిధ రకాల వ్యాధులను గురించి అడిగి తెలుసుకోండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 2 4

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

SCERT AP 8th Class Biology Study Material Pdf 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 1 Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 3rd Lesson Questions and Answers సూక్ష్మజీవుల ప్రపంచం 1

8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 1 Textbook Questions and Answers

ప్రశ్న 1.
ఏ జీవి సజీవులకు, నిర్జీవులకు మధ్య. అనుసంధానం అనుకుంటున్నారు ? ఎందుకు ?
జవాబు:

  • సజీవులకు, నిర్జీవులకు మధ్య అనుసంధానంగా వైరస్లు వున్నాయని నేను అనుకుంటున్నాను.
  • ఎందుకంటే సజీవ కణంలోకి ప్రవేశిస్తేనే వైరస్లు ప్రత్యుత్పత్తి జరుపుకుంటూ క్షోభ్యతను ప్రదర్శిస్తాయి.
  • కణం బయట వున్నప్పుడు ఇవి నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి.
  • ఈ విషయాన్ని బట్టి సజీవులకు, నిర్జీవులకు మధ్య వైరస్లు వారధిగా అనుసంధానం చేశాయి అని అనుకుంటున్నాను.

ప్రశ్న 2.
సూక్ష్మజీవులు వలన కలిగే వ్యాధుల గురించి రాయండి.
జవాబు:

  • కంటికి కనబడకుండా వుండే అతి చిన్న జీవులను సూక్ష్మజీవులు అంటారు.
  • ఇవి బాక్టీరియా, వైరస్, శైవలాలు శిలీంధ్రాలు.
  • బాక్టీరియా వల్ల టైఫాయిడ్, క్షయ, కుష్టు వంటి వ్యాధులు వస్తాయి.
  • వైరస్ల వల్ల పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్ వంటి వ్యాధులు వస్తాయి.
  • శైవలాలు ఎక్కువగా నిల్వ వాటిలో వుంటాయి. కాబట్టి వీటి వల్ల దురదలు వస్తాయి.
  • శిలీంధ్రాలు మన చర్మం పై వుంటూ, చర్మ వ్యాధులైన గజ్జి, తామర వంటి వాటిని కలుగచేస్తాయి.

ప్రశ్న 3.
కుంట నీటిలో ఏయే రకమైన సూక్ష్మజీవులు ఉంటాయి ?
జవాబు:

  • కుంట నీరు అంటే ఎక్కువ కాలం నిల్వ ఉన్న నీరు.
  • అందువల్ల దీనిలో శైవలాలు, బాక్టీరియా, ప్రోటోజోవా వర్గానికి చెందిన ఏక కణజీవులు ఉంటాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 4.
సూక్ష్మజీవులు మనకు ఉపకారులా ? అపకారులా ? వివరించండి.
జవాబు:
కొన్ని సూక్ష్మజీవులు మనకు అపకారులుగాను, మరికొన్ని సూక్ష్మజీవులు మనకు ఉపకారులుగాను ఉంటాయి.
ఉపకారులైన సూక్ష్మజీవులకు ఉదాహరణలు :

  • లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియా పాలను, పెరుగుగా మార్చుతుంది.
  • కిణ్వణప్రక్రియలో ఈస్ట్ ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను పెద్ద మొత్తంలో ఆల్కహాలు, వైన్, బీరు, ఎసిటిక్ ఆమ్లాల తయారీలో ఉపయోగిస్తారు.
  • శిలీంధ్రాల నుండి సూక్ష్మజీవి నాశకాలు (antibiotics) ను తయారు చేస్తారు.

అపకారులైన సూక్ష్మజీవులకు ఉదాహరణ :

  • టైఫాయిడ్, క్షయ, కుష్టు, డయోరియా లాంటి జబ్బులు బాక్టీరియా వలన కలుగుతాయి.
  • మలేరియా, అమీబియాసిస్ లాంటి వ్యాధులు ప్రోటోజోవాల వల్ల కలుగుతాయి.
  • శిలీంధ్రాలు, బాక్టీరియా, మైక్రో ఆర్రోపోడాల వల్ల కొన్ని రకాల చర్మవ్యాధులు కలుగుతాయి.

ప్రశ్న 5.
మజ్జిగ కలిపినప్పుడు ఏ రకమైన పాలు పెరుగుగా మారతాయి ? పరికల్పన చేయండి.
అ) చల్లని పాలు
ఆ) వేడి పాలు
ఇ) గోరువెచ్చని పాలు
జవాబు:

  • మజ్జిగ కలిపినపుడు గోరువెచ్చని పాలు పెరుగుగా మారతాయి.
  • లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియా వలన పాలు పెరుగుగా మారతాయి.
  • లాక్టోబాసిల్లస్ పెరుగుదలకు కొంచెం అధికంగా ఉష్ణోగ్రత అవసరం.
  • కావున లాక్టోబాసిల్లస్ గోరు వెచ్చని పాలలో వేగంగా పెరిగి, పెరుగు తయారవుతుంది.
  • తక్కువ ఉష్ణోగ్రతలో కానీ, అధిక ఉష్ణోగ్రతలో కానీ బాక్టీరియా పెరుగుదల సరిగా ఉండదు.
  • కావున చల్లని, వేడిపాలలో కలిపిన మజ్జిగ వలన పెరుగు ఏర్పడలేదు.

ప్రశ్న 6.
మానవ కార్యకలాపాల వల్ల సూక్ష్మజీవులకు హాని కలుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఏమవుతుంది ?
జవాబు:
మానవ కార్యకలాపాల వల్ల సూక్ష్మజీవులకు హాని కలుగుతుంది. ఈ హాని వలన అపాయకరమైన మరియు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి.

ప్రశ్న 7.
మీరు లాక్టోబాసిల్లస్ బాక్టీరియాను ప్రయోగశాలలో పరిశీలించినపుడు అనుసరించిన విధానాన్ని వివరించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 1
ఒకటి లేదా రెండు మజ్జిగ చుక్కలు స్లెడ్ పై తీసుకోవాలి.

  • సైడు 3-4 సెకన్ల పాటు వేడి చేయాలి.
  • తరువాత దీనిపై క్రిస్టల్ వైలెట్ ద్రావణాన్ని 2 లేదా 3 చుక్కలు వేయాలి.
  • ఇది వర్ణదము కాబట్టి బాక్టీరియాను రంజనం చేసి చూపుతుంది.
  • ఇలా చేసిన తర్వాత 30-60 సెకన్ల వరకూ స్లెడ్ ను కదపకుండా వుంచాలి.
  • తరువాత నీటిలో సైడ్ ను జాగ్రత్తగా, పదార్థం కొట్టుకుపోకుండా కడగాలి.
  • ఇప్పుడు స్లెడ్ ను సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలిస్తే కింది పటంలో చూపినట్లుగా లాక్టోబాసిల్లస్ బాక్టీరియా కనపడుతుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 8.
మీ ఉపాధ్యాయుని సహాయంతో మీ దగ్గరలోని బేకరీని సందర్శించి బ్రెడ్, కేక్ తయారుచేసే పద్ధతిని తెలుసుకొని నివేదిక రాయండి.
జవాబు:
బ్రెడ్ : కావలసినవి : మైదా: 1[latex]\frac {1}{2}[/latex] కప్పు; బేకింగ్ పౌడర్ : [latex]\frac {1}{2}[/latex] టీ స్పూన్; బేకింగ్ సోడా : 1 టీ స్పూను; నూనె : [latex]\frac {3}{4}[/latex] కప్పు; గ్రుడ్లు : 2; పంచదార: 1[latex]\frac {1}{4}[/latex] కప్పు; వెనీలా ఎసెన్స్ : టీ స్పూను.

తయారీ : ఓవెన్‌ను 180 డిగ్రీలకు వేడిచేయాలి. బ్రెడ్ పాన్ కి కాస్త వెన్న రాసి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి స్పూనుతో కలపాలి. మరో గిన్నెలో గ్రుడ్ల సొన వేసి గిలకొట్టాక పంచదార, నూనె వేసి కలిసేలా గిలకొట్టాలి. వెనీలా ఎసెన్స్ వేసి మృదువుగా అయ్యే వరకూ గిలకొట్టాక మైదా మిశ్రమం వేసి నెమ్మదిగా కలపాలి. మరీ వేగంగా కలిపితే బ్రెడ్ గట్టిగా వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఓవెన్లో ఉంచి సుమారు గంట పాటు బేక్ చేసి, తీసి చల్లారాక కోయాలి.

క్యారెట్ కేక్ : మైదా: 2 కప్పులు, దాల్చిన చెక్కపొడి : 1[latex]\frac {1}{2}[/latex] టీ స్పూన్లు: బేకింగ్ పౌడర్ : 1[latex]\frac {1}{2}[/latex] టీ స్పూన్లు; ఉప్పు : 1[latex]\frac {1}{2}[/latex] టీ స్పూను క్యారెట్ తురుము : 2[latex]\frac {1}{2}[/latex] కప్పులు; గ్రుడ్లు : 4; పంచదార : 1[latex]\frac {1}{2}[/latex] కప్పులు; వెనీలా ఎక్స్ ట్రాక్ట్ : 2 టీ స్పూన్లు; నూనె : కప్పు.

తయారీ : మైదాలో దాల్చిన చెక్కపొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచాలి. విడిగా ఓ గిన్నెలో కోడిగ్రుడ్లు వేసి రెండు నిమిషాలు గిలకొట్టాలి. తర్వాత పంచదార వేసి మరో ఐదు నిమిషాలు బీట్ చేయాలి. ఇప్పుడు వెనీలా ఎక్స్ ట్రాక్ట్ వేసి మరో నిమిషం గిలకొట్టాలి. నెమ్మదిగా నూనె పోస్తూ గిలకొడుతుండాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ, తెడ్డు లాంటి గరిటెతో కలపాలి. చివరగా క్యారెట్ తురుము వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి వెన్నరాసిన రెండు కేకు గిన్నెలో వేసి ముందుగానే 180 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర వేడి చేసిన ఓవెన్లో 30 నిమిషాల పాటు బేక్ చేయాలి. చల్లారాక ముక్కలుగా కోయాలి.

ప్రశ్న 9.
మట్టితో గానీ, థర్మోకోల్ తో గానీ ఏదేని సూక్ష్మజీవి నమూనా తయారుచేయండి. దాని లక్షణాలను వివరిస్తూ నివేదిక రాయండి.
జవాబు:
HIV వైరస్:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 2

  • దీని సమాచారం మా సైన్స్ ల్యాబ్ నుండే సేకరించాను.
  • ఇది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్.
  • ఇది మానవుని తెల్లరక్త కణాలు. అంటే లింఫోసైట్లలోనే జీవించగలుగుతుంది.
  • AIDS వ్యా ధిని కలుగచేస్తుంది.
  • ఇది ‘ఐకోసా హెడ్రల్’ రూపంలో వుంటుంది.
  • దీనిలో ఎంజైములు, RNA వుంటాయి.
  • పై పొర గరుకుగా వుంటుంది. లోపలి పొర నున్నగా వుంటుంది.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 10.
మీ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ లో వున్న సూక్ష్మజీవుల పర్మినెంట్ స్లెలు పరిశీలించండి. వాటి పటాలు గీయండి.
జవాబు:
మా పాఠశాల సైన్స్ ల్యాబ్ లో ఈ కింద పేర్కొన్న సూక్ష్మజీవుల స్లెలు వున్నాయి.
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 3

ప్రశ్న 11.
భోజనం చేసేముందు చేతులను సబ్బుతో శుభ్రంగా ఎందుకు కడుక్కోవాలి ?
జవాబు:

  • మనం రోజూ చేతులతో అనేక పనులు చేస్తాం. అనేక వస్తువులను తాకుతాం.
  • ఆ పనుల వలన, తాకిన వస్తువుల వలన చేతులకు మురికి అంటుకుంటుంది. ఆ మురికి ద్వారా అనేర రోగకారక క్రిములు చేతులకు అంటుకుంటాయి.
  • ఆ చేతులతో భోజనం చేయుటవలన మనము అనేక రోగాల బారిన పడతాం.
  • అందువలన భోజనం చేసేముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

8th Class Biology 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 1 InText Questions and Answers

పాఠ్యాంశములోని ప్రశ్నలు

ప్రశ్న 1.
సూక్ష్మజీవుల సమూహాలు గురించి రాయండి.
జవాబు:
సూక్ష్మజీవులను 5 సమూహాలుగా విభజిస్తారు. అవి –

  1. బాక్టీరియా
  2. శైవలాలు
  3. శిలీంధ్రాలు
  4. ప్రోటోజోవన్స్ మరియు
  5. సూక్ష్మ ఆర్రోపోడ్స్

2. బాక్టీరియా ఎటువంటి ఆవాసాలలో జీవించగలదు ?
జవాబు:

  • బాక్టీరియాను మజ్జిగ లేదా పెరుగులోను, నాలుకపై ఉండే పాచి (నోరు శుభ్రం చేయకముందు) లోను, నేలలోను, చెట్ల కాండంపైన, చర్మంమీద, చంకలోను ఇంకా అనేక ప్రదేశాలలో చూడవచ్చు.
  • కానీ వీటిని సాధారణ సూక్ష్మదర్శినిలో చూడలేం.
  • మన చర్మం పైన కూడా కొన్ని రకాల బాక్టీరియాలు పెరుగుతాయి. వీటిలో కొన్ని మనకు రోగాలు కలుగజేస్తాయి.
  • కొన్ని ఇతర బాక్టీరియాలతో సహజీవనం చేస్తాయి.
  • మన శరీరం లోపల కూడా రకరకాల బాక్టీరియాలున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఉండే బాక్టీరియాలు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి.
  • బాక్టీరియాలు ఉండని చోటేలేదని చెప్పవచ్చు. నేలలో, నీటిలో, గాలిలో లక్షల సంఖ్యలో ఉన్నాయి.
  • ఇవి అతి తక్కువ, అతి ఎక్కువ ఉష్ణోగ్రతలలో కూడా జీవించగలుగుతాయి.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 3.
సూక్ష్మ శైవలాల ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:
సూక్ష్మశైవలాలు (మైక్రో ఆల్గే) జరిపే కిరణజన్య సంయోగక్రియ భూమి మీద జీవులకు చాలా ముఖ్యం. వాతావరణంలోని ప్రాణవాయువులో సగభాగం ఇవే ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 4.
వైరస్లు గురించి రాయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 8

  • వైరస్లు చాలా ఆసక్తిని రేకెత్తించే సూక్ష్మజీవులు.
  • ఇవి సజీవ కణము బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి.
  • కానీ బాక్టీరియా, వృక్షకణాలు, జంతు కణాల లాంటి అతిథేయి కణాలలో ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు సజీవులుగా ప్రవర్తిస్తాయి.
  • వీటిని శక్తివంతమైన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపులలో మాత్రమే చూడగలం.
  • పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్ మొదలైన వ్యాధులన్నీ వైరస్ల వలననే కలుగుతాయి.

ప్రశ్న 5.
సూక్ష్మ ఆర్రోపోడ్ ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:

  • నేల సారాన్ని పెంచడానికి కొన్నిరకాల మైక్రో ఆర్రోపోడ్ జీవులు చాలా అవసరం.
  • ఇవి జీవ పదార్ధాన్ని కుళ్లిపోయేలా చేస్తాయి.
  • సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి.

ప్రశ్న 6.
ప్రోటోజోవనను పరిశీలించే విధానం రాయండి.
జవాబు:

  • ప్రోటోజోవాలను వర్తనం చేయడానికి ఎండుగడ్డిని నీటిలో నానబెట్టాలి.
  • 3-4 రోజుల తరువాత గడ్డితో సహా నీటిని సేకరించాలి.
  • గడ్డితో సహా సేకరించిన నీటి నుండి ఒక చుక్క నీటిని స్లెడ్ పై తీసుకుని కవర్ స్లిప్ తో కప్పాలి.
  • దానిని సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.
  • అనేక ఏకకణ ప్రోటోజోవనను గుర్తించవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

ప్రశ్న 7.
బాక్టీరియాను రంజనం చేసే విధానాన్ని క్లుప్తంగా వివరింపుము. (లేదా) మీ ప్రయోగశాలలో మీరు బాక్టీరియాను పరిశీలించారు కదా ! అయిన కింది వాటికి జవాబులిమ్ము. ఎ) ఈ ప్రయోగం చేయడానికి కావలసిన పరికరాలు ఏవి? బి) ప్రయోగ విధానం ఏమిటి ?
జవాబు:
ఎ) అగార్ మాధ్యమం, సైడ్లు, క్రిస్టల్ వైలెట్ రంజకం, సూక్ష్మదర్శిని, బున్ సెన్ బర్నర్.
బి) 1. బాక్టీరియాలు కలిగిన మాధ్యమాన్ని స్లెడ్ పై వేసి, మరొక స్లె తో రుద్ది సమంగా చేయాలి.
2. అలా చేసిన తరువాత కొద్దిగా వేడి చేయాలి. 3. తరువాత ఒక చుక్క ‘క్రిస్టల్ వైలెట్’ వేసి 30 నుండి 60 సెకన్లు వేడి చేయాలి.
4. కొద్ది సేపటి తరువాత నీరు పోసి కడగాలి తడి ఆరిన తరువాత స్లెడ్ ను సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

ప్రశ్న 8.
శైవలాలు ఆకుపచ్చగా వుండటానికి కారణం ఏమిటి ?
జవాబు:

  • నిల్వ వున్న నీటిలో శైవలాలు ఎక్కువగా పెరుగుతాయి.
  • వీటి పెరుగుదల వల్ల ఆ నీటికి పచ్చదనం వస్తుంది.
  • వీటి కణాలలో ‘హరితరేణువులు’ వుంటాయి. ఇవి ‘కిరణజన్య సంయోగక్రియ’ జరిపి ఆహారాన్ని తయారుచేసి కణానికి అందిస్తాయి.
  • అందువల్ల శైవలాలు వున్న ప్రదేశం ఆకుపచ్చని చెట్టు లాగా కనబడుతుంది.

ప్రశ్న 9.
‘పరాన్న జీవులు’ అనగానేమి ?
జవాబు:
కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవుల మీద ఆధారపడి జీవిస్తాయి. ఇలాంటి వాటిని ‘పరాన్న జీవులు’ అంటారు.

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
నీటిలోని సూక్ష్మజీవులను పరిశీలించే విధానం తెలపండి.
జవాబు:

  • మీ పరిసరాలలో ఉన్న నీటి కుంట / మురికి కుంట నుండి కొంత నీటిని సేకరించండి.
  • కుంటలోని నీరు ఆకుపచ్చని చెట్టులా ఉండేలా చూసుకోండి.
  • సేకరించిన నీటి నుండి 1-2 చుక్కల నీటిని స్లెడ్ పై వేసి సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి.
  • కదులుతున్న రకరకాల ప్రోటోజోవన్స్ కనిపిస్తాయి.
  • వీటితోపాటు ఆకుపచ్చగా ఉండే శైవలాలను చూడవచ్చు.
  • మరికొన్ని నీటి లార్వాలను గమనించవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 4

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

కృత్యం – 2

ప్రశ్న 2.
కుళ్ళిన కూరగాయలు, నల్లబ్రెడ్, చెడిపోయిన కొబ్బరిలో ఎలాంటి సూక్ష్మజీవులు వుంటాయి ?
జవాబు:

  • కుళ్ళిన కూరగాయలు, చెడిన నల్లని బ్రెడ్, కొబ్బరిలను సేకరించాలి.
  • తరువాత కొద్ది పదార్థాన్ని సూదితో సేకరించి స్లెడ్ పైన ఉంచండి.
  • దానిపై చుక్క నీరు వేసి స్లెడను కవర్ స్లితో కప్పాలి.
  • తరువాత స్లెడ్ ను సూక్ష్మదర్శినిలో పరిశీలించగా అది ‘రైజోఫస్’ అనే శిలీంధ్రంగా గుర్తించాను.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 5

కృత్యం – 3

ప్రశ్న 3.
ఒకటి లేదా రెండు చుక్కలు మజ్జిగ తీసుకొని స్లెడ్ పైన పరచండి. సైడ్ ను 3-4 సెకన్లు పాటు వేడి చేయండి. దాని పైన కొన్ని చుక్కలు “క్రిస్టల్ వైలెట్” ద్రావణం వేయాలి. 30-60 సెకన్ల పాటూ కదపకుండా ఉంచాలి. తరువాత నీటితో సైడ్ ను పదార్థం కొట్టుకు పోకుండా నెమ్మదిగా కడగాలి. దీనిని సంయుక్త సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి. మీరు పరిశీలించిన దాని పటం గీయండి. నీవు గీచిన పటాన్ని పటంతో పోల్చి చూడండి.
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 6

కృత్యం – 4

ప్రశ్న 4.
శైవలాలను పరిశీలించే విధానం రాయండి. (లేదా) నీటి కొలనులో తేలియాడే నాచుమొక్కల, మైక్రోస్కోప్, సైడులు, కవర్ స్లిన్లు, వర్ణదాలను ఇవ్వబడినవి. వీటితో ప్రయోగశాలలో మీరు ఏం చేయగలరో నివేదిక రాయండి.
జవాబు:

  • కుంటలలో నిలువ ఉన్న నీరు ఆకుపచ్చగా ఉండడాన్ని మనం చూస్తూంటాం.
  • నీటిలో పెరిగే శైవలాల వల్ల నీటికి పచ్చదనం వస్తుంది.
  • స్పెరోగైరా, ఖారా లాంటి శైవలాలు కంటితో చూడవచ్చు.
  • నీటిలో ఉండే చాలా శైవలాలను కంటితో చూడలేం. కేవలం సూక్ష్మదర్శిని సాయంతో మాత్రమే చూడగలం.
  • నీటి కుంటలోని నీటిని ఆకుపచ్చని చెట్టుతో సహా సేకరించండి.
  • సేకరించిన నీటి నమూనా నుండి సన్నని దారపు పోగుల్లాంటి నిర్మాణాలు లేదా వాటి ముక్కలను స్లెడ్ పైన తీసుకోవాలి.
  • కవర్‌ స్లిప్ తో కప్పి, సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.
  • ఆకుపచ్చని తంతువులు కణాలతో సహా కనిపిస్తాయి.
  • పత్రహరితం కలిగిన ఈ జీవులను శైవలాలు అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

కృత్యం – 5

ప్రశ్న 5.
గడ్డితో సహా సేకరించిన నీటి నుండి ఒక చుక్క నీటిని స్లెడ్ పై తీసుకుని కవర్ స్లిప్ తో కప్పాలి. దానిని సూక్ష్మదర్శినితో పరిశీలించాలి. మీరు పరిశీలించిన దాని పటాలు గీయండి. గీచిన పటాలను పటంతో పోల్చండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1 7

కృత్యం – 6

ప్రశ్న 6.
నేలలోని సూక్ష్మజీవులను పరిశీలించే విధానం రాయండి.
జవాబు:
నేలలోని సూక్ష్మజీవులను పరిశీలించే విధానం :

  • పొలం నుండి సేకరించిన మట్టిని ఒక బీకరు లేదా గ్లాసులో వేసి నీరు పోయండి. బాగా కలపండి.
  • తరువాత మట్టికణాలు బీకరు అడుగున పేరుకునే వరకు ఆగండి.
  • దాని నుండి ఒక నీటి చుక్కను డ్రాపి తీసుకుని స్లెడ్ పైన వేయండి.
  • సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి.
  • అనేక సూక్ష్మజీవులు కదులుతూ స్లెడ్ మీద కనిపిస్తాయి.
  • వీటిలో బాక్టీరియాను సులువుగా గుర్తించవచ్చు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

SCERT AP 8th Class Biology Study Material Pdf 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Biology 11th Lesson Questions and Answers మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

8th Class Biology 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం

ప్రశ్న 1.
మీరు గత సంవత్సరం ఎన్నిసార్లు అస్వస్థతకు లోనైనారు ? మీరు ఏ ఏ వ్యాధులతో బాధపడ్డారు ?
(ఎ) పై వ్యాధులను నివారించడానికి మీరు రోజువారీగా ఏదైనా అలవాటును మార్చుకోగలరా ఆలోచించి రాయండి.
(బి) పై వ్యాధులు రాకుండా నివారించడానికి మీ పరిసరాలలో ఎటువంటి మార్పు తీసుకొని రావాలనుకుంటున్నారు ?
జవాబు:
నేను గత సంవత్సరం చాలాసార్లు అస్వస్థతకు లోనై విరేచనాలు, టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డాను.
(ఎ) ఆ వ్యాధులను నివారించడానికి నేను రోజూ ఒక గుడ్డు, ఆకుకూరలు తినుటకు అలవాటుపడ్డాను. అంతేకాక కాచి చల్లార్చిన నీటిని తాగుతున్నాను.
(బి) ఆ వ్యాధులు రాకుండా నివారించడానికి మా పరిసరాలలో ఈ కింది మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నాను.
అవి :

  1. పరిసరాలు శుభ్రంగా ఉంచుట.
  2. ఆహార పదార్థాలపై ఎల్లప్పుడూ మూతలు ఉంచుట.
  3. వ్యర్థ పదార్థాలను చెత్తబుట్టలో వేయుట.
  4. రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేయుట.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 2.
డాక్టర్/నర్స్ / ఆరోగ్య కార్యకర్తలు అస్వస్థతతో ఉన్న రోగులతో ఎక్కువగా గడుపుతుంటారు. అయినా వారు అస్వస్థతకు ” గురికారు ఎందుకు ? ఆలోచించి రాయండి.
జవాబు:
డాక్టర్ / నర్స్ / ఆరోగ్య కార్యకర్తలు అస్వస్థతతో ఉన్న రోగులతో ఎక్కువగా గడుపుతుంటారు. అయినా అస్వస్థతకు గురికారు. ఎందుకంటే వారు ఆరోగ్య నియమాలు చక్కగా పాటిస్తారు. దీనివలన వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.

డాక్టర్ / నర్స్ / ఆరోగ్య కార్యకర్తలకు వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో తెలుసు కాబట్టి వారు కచ్చితంగా పరిశుభ్రత నియమాలు పాటిస్తారు. అంతేకాక అంటువ్యాధులకు చికిత్స చేసేటప్పుడు సరైన ఆరోగ్య రక్షణ సూత్రాలు పాటిస్తారు. పోషక ఆహారం ఎక్కువగా తీసుకుంటారు.

ప్రశ్న 3.
సాంక్రమిక (అంటువ్యాధులు), అసాంక్రమిక వ్యాధులకు మధ్య గల భేదాలను రాయండి.
జవాబు:

సాంక్రమిక వ్యాధులు అసాంక్రమిక వ్యాధులు
1. సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు అంటారు. 1. శరీర అంతర్భాగాలలో మార్పు వలన వచ్చే వ్యాధులను అసాంక్రమిక వ్యాధులు అంటారు.
2. ఈ వ్యాధులు గుర్తించటం తేలిక. 2. ఈ వ్యాధులు గుర్తించటం అంత తేలిక కాదు
3. శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి పై ఈ వ్యాధులు ఆధారపడును. 3. తీసుకొనే ఆహారం, ఒత్తిడి మొదలైన అంశాలు ప్రభావంపై ఆధారపడును.
4. మలేరియా, టైఫాయిడ్, గవదబిళ్ళలు మొదలైన వ్యాధులు. 4. అధిక రక్తపీడనం, స్థూలకాయత్వం, గుండెపోటు మొదలైన వ్యాధులు.

ప్రశ్న 4.
స్వల్పకాలిక వ్యాధులు ఎందుకు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి ?
జవాబు:
స్వల్పకాలిక వ్యాధులకు తరచు గురి అవుతూ ఉన్నప్పుడు, స్వల్పకాలిక వ్యాధులను సరిగా గుర్తించలేనప్పుడు, స్వల్పకాలిక వ్యాధులను నిర్లక్ష్యం చేసినపుడు, స్వల్పకాలికంగా ఉన్నప్పుడు సరిగా చికిత్స చేయకపోయినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి. ఉదా : ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 5.
ఒక బాలుడికి నెలక్రితం మశూచి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. అతను మశూచి వచ్చిన పిల్లలతో కలసి ఉంటున్నాడు. అతనికి మశూచి మరలా వస్తుందా ! రాదా ! ఎందుకు ?
జవాబు:
ఒక బాలుడికి నెలక్రితం మశూచి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. అతను మశూచి వచ్చిన పిల్లలతో ‘కలిసి ఉన్నా అతనికి మశూచి మరలా రాదు. ఎందుకు అంటే మన శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి వ్యాధి జనక జీవితో మొదటగా ప్రవేశించినప్పుడు ప్రత్యేకంగా పోరాడే శక్తిని కలిగి ఉంటుంది.

అది మొదటిగా వ్యాధి జనక క్రిములను గుర్తిస్తుంది. వాటిపై ప్రతిస్పందించి, జీవితాంతం వాటిని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటుంది. రెండవసారి అదే వ్యాధి జనక జీవి లేదా దానికి సంబంధించిన మరొక వ్యాధి జనక జీవి శరీరంలో ప్రవేశించినప్పుడు మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి చాలా బలంగా పోరాడి మొదటిసారి కంటే తొందరగా వ్యాధి జనక జీవులను శరీరం నుంచి తొలగిస్తుంది.

ప్రశ్న 6.
వ్యాధికి సంబంధించి సత్వర కారకాలు, దోహదపడే కారకాలు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
ఏదైనా వ్యాధిని ఒక సూక్ష్మజీవి కలుగచేయును. అది ఆ వ్యాధి కలుగజేయుటకు కారణం కాబట్టి దానిని సత్వర కారకం అంటారు. ఆ సూక్ష్మజీవి ఆ వ్యక్తి శరీరంలో వ్యాధి పెంచుటకు కొన్ని కారకాలు అనగా అతనికి ఉన్న ఇతర శారీరక సమస్యలు కారణం అవుతాయి. వీటిని వ్యాధి దోహద కారకాలు అంటారు.

ఉదా : ఒక వ్యక్తికి శరీరంలో వ్యాధి జనక జీవుల వలన అతనికి పుండ్లు వచ్చినాయి. కానీ అతనికి చక్కెర వ్యాధి ఉంది. అప్పుడు పుండ్లు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. పుండ్లు రావడానికి కారణమైన వ్యాధి జనకజీవులు సత్వర కారకాలు అయితే, చక్కెర వ్యాధి పుండ్లు పెరుగుటకు దోహద కారకాలు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 7.
ఆరోగ్య కార్యకర్తను అడిగి వ్యాధి వ్యాప్తి గురించి తెలుసుకొనుటకు ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
1. వ్యాధి వ్యాప్తి ఎన్ని రకాలుగా జరుగును ?
AP Board 8th Class Biology Solutions Chapter 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 1
2. గజ్జి అనేది ప్రత్యక్ష తాకిడి వలన వ్యాపించును. అవును / కాదు
3. కలరా వ్యాధిని ఈగలు వ్యాప్తి చేస్తాయి. అవును / కాదు
4. గాలి ద్వారా కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందును. అవును / కాదు
5. నీటి ద్వారా కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందును. అవును / కాదు
6. వ్యా ధి వ్యాప్తి తెలుసుకొంటే నివారణ తేలిక. అవును / కాదు.

ప్రశ్న 8.
లీష్మేనియా, ట్రిపానోజోమా బొమ్మలు గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 2

ప్రశ్న 9.
రాము మశూచి వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతరులకు వ్యాధి సోకకుండా ఉండటానికి రాముకు నీవిచ్చే సలహాలు ఏమిటి ?
జవాబు:
రాము మశూచి వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతరులకు ఆ వ్యాధి సోకకుండా ఉండటానికి రాముకు నేను ఇచ్చే సలహాలు :
1. ఇతరులకు రామును ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరంగా ఉంచుతాను. కారణం ఆరు అడుగుల లోపు ముఖాముఖిగా ఉంటే ఈ వ్యాధి వ్యాపించును.
2. శరీరం నుంచి విడుదల అయ్యే ద్రవాలు ఇతరులపై పడకుండా జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తాను.
3. అతను ఉపయోగించిన వస్తువులను, బట్టలను, మంచాన్ని ఇతరులతో కలవకుండా జాగ్రత్తగా ఉంచాలి.
4. మొదటి వారం రోజులు ఎక్కువగా వ్యాపించును కాబట్టి. అతనిని చాలా దూరంగా ఉంచాలి.
గమనిక : భారతదేశంలో ఉన్న రాము మశూచి వ్యాధితో బాధపడడు. కాబట్టి అతనికి నేను ఇచ్చే సలహాలు ఏమి ఉండవు. కారణం ప్రపంచం నుంచి ఈ వ్యాధి ఎప్పుడో సంపూర్ణంగా నిర్మూలించారు.

ప్రశ్న 10.
వ్యాధులను నిరోధించడంలో టీకాల పాత్రను ఎలా ప్రశంసిస్తావు ?
జవాబు:
వ్యాధులను నిరోధించడంలో టీకాల పాత్ర చాలా ఉంది. టీకాల వలన భారతదేశం నుండి మశూచి వ్యాధి పూర్తిగా నిర్మూలించాము. అదే విధంగా పిల్లలలో మరో భయంకరమైన వ్యాధి అయిన పోలియో వ్యాధి పూర్తిగా నిర్మూలించుటకు చర్యలు జరుగుతున్నాయి.

టీకాల వలన మాతా-శిశు రక్షణ జరుగుతున్నది. ఇటువంటి టీకాలను కనిపెట్టిన శాస్త్రవేత్త, జీవశాస్త్రం సాధించిన అభివృద్ధిని చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. దీని గురించి ‘టీకాల డే’ అని ఒక రోజు నేను సెలబ్రేట్ చేసి జీవశాస్త్రమునకు కృతజ్ఞత తెలుపుకొంటాను.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

ప్రశ్న 11.
మీ ప్రాంతంలో సాధారణంగా ఉండే వ్యాధులను తెలుసుకోవడానికి సర్వే నిర్వహించండి. ఈ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలను తెలుసుకుని మీ గ్రామపంచాయతీ / మున్సిపాలిటి వారికి వ్యాధులను నివారించటానికి మీరు ఏ సూచనలు చేస్తారు?
జవాబు:
మా ప్రాంతంలో సాధారణంగా ఉండే వ్యాధులను తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాను. సర్వేలో ఎక్కువ వచ్చే వ్యాధులు డయేరియా, మలేరియా, డెంగ్యూ.

ఈ వ్యాధులు నివారించటానికి మా మున్సిపాలిటీకి ఇచ్చే సూచనలు :

  1. రక్షిత మంచినీటి సరఫరా చేయాలి.
  2. ఆరోగ్య కార్యకర్తల ద్వారా వ్యాధులు వచ్చే కాలం గురించి ముందుగా వివరించాలి.
  3. ఆ వ్యాధులు రావడానికి గల కారణాలు వివరించాలి.
  4. కాచి చల్లార్చిన నీటిని త్రాగమని మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలి.
  5. కలుషిత ఆహార పదార్థాలు తినవద్దని ప్రజలకు చెప్పాలి.
  6. చెత్తాచెదారాలను రోడ్డుపై వేయకుండా జాగ్రత్తగా వారు తీసుకువెళ్ళే బండిలో వేయాలని, దాని వలన కలుగు లాభాలు ముందుగా ప్రజలకు తెలియచేయాలి.
  7. దోమలు పెరగకుండా ఉండుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాలి.
  8. దోమకాటు నుండి కాపాడుకొనుటకు దోమతెరలను ఉపయోగించమని తెలియచేయాలి.
  9. వ్యాధి వచ్చిన వెంటనే చికిత్స చేయుటకు వీలుగా ఆసుపత్రిలో సిబ్బంది మరియు మందులు ఏర్పాటుచేయాలి.
  10. పరిసరాలు శుభ్రంగా ఉంచాలి.
    గమనిక : గ్రామపంచాయతి అయితే ఆ పేరు రాయాలి.

8th Class Biology 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? InText Questions and Answers

కృత్యములు

1. పరిశుభ్రమైన త్రాగే మంచినీటి సరఫరా కొరకు మీ ప్రాంతంలో (గ్రామ పంచాయతీ పరిధిలో కాని / పురపాలక సంఘాలు, కార్పొరేషన్ కాని) కల్పించబడిన సౌకర్యాలను తెలుసుకోండి.
జవాబు:
పరిశుభ్రమైన. తాగే మంచినీటి సరఫరా కొరకు మా ప్రాంతంలో గ్రామ పంచాయతీ పరిధిలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి వాటిని శుద్ధి చేసి రక్షిత మంచినీటిని పంపుల ద్వారా అన్ని ఇళ్లకు పంపులైన్ కనెక్షన్ల ద్వారా పంపిస్తారు. ఇంకా పంపు కనెక్షన్లు తీసుకోని వారి కొరకు గ్రామ పంచాయతి వీధి పంపులు ఏర్పాటుచేసింది.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

2. మీ ప్రాంతంలోని ప్రజలందరికీ ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా ? ఎందుకు లేవో చర్చించండి.
జవాబు:
మా ప్రాంతంలోని ప్రజలందరికి ఈ సౌకర్యాలు అందుబాటులో లేవు. కారణాలు :
1. ప్రజలకు రక్షిత మంచినీటి పై సరైన అవగాహన లేకపోవటం.
2. కొత్తగా ఏర్పడిన ఇళ్లకు ప్రభుత్వం వారు వెంటనే పంపులైన్ కనెక్షన్ ఇవ్వకపోవటం. ప్రజలు ఇంకా నదులు, చెరువులపై మంచినీటి కోసం ఆధారపడి ఉండటం వలన.

3. (a) మీ పరిసరాలలో ఏర్పడే ఘనరూప వ్యర్థ పదార్థాలను మీ గ్రామపంచాయతి / మున్సిపాలిటీవారు ఎలా నిర్వహిస్తారో, తెలుసుకోండి.
జవాబు:
మా గ్రామ పంచాయతివారు మా పరిసరాలలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను సేకరించుటకు కొంతమంది ఉద్యోగులను ఏర్పాటుచేసుకున్నారు. వారు ప్రతిరోజూ బండిలో ఘనరూప వ్యర్థ పదార్థాలను ఇంటికి వచ్చి తీసుకువెళ్తారు. రోడ్లపై చెత్త – కుండీలను ఏర్పాటుచేశారు.

(b) వారు తీసుకొనే చర్యలు సరిపోతాయా ?
జవాబు:
వారు తీసుకొనే చర్యలు సరిపోవు.

(c) వాటిని మెరుగుపరచటానికి మీరిచ్చే సూచనలేవి ?
జవాబు:
1. వాటిని మెరుగుపరచటానికి ప్రతిరోజూ ఇళ్లకు రెండుసార్లు వచ్చి చెత్తను తీసుకువెళ్లే ఏర్పాటుచేయాలి.
2. ప్రతిరోజూ చెత్త కుండీలలోని చెత్త తీసివేయాలి.
3. ఘనరూపంలో ఉన్న పొడి, తడి చెత్తను వేరు వేరుగా సేకరించే ఏర్పాటుచేయాలి.

(d) ఒక వారంలో ఏర్పడే ఘనరూప చెత్తను తగ్గించడానికి మీ కుటుంబ సభ్యులు ఎటువంటి కింది చర్యలు తీసుకుంటారు?
జవాబు:
ఒక వారంలో ఏర్పడే ఘనరూప చెత్తను తగ్గించడానికి మా కుటుంబ సభ్యులు ఈ కింది చర్యలు తీసుకుంటారు.

  1. పాలిథీన్ కవర్ల వాడకం తగ్గిస్తారు.
  2. కూరగాయలు, వాటి తొక్కులు, మినప పొట్టు మొ||నవి దగ్గరలో ఉన్న పశువులకు వేస్తారు.
  3. ఆహార పదార్థాలు ఎక్కువ వృథా చేయరు.
  4. పునర్వినియోగించే పదార్థాలను ప్రోత్సహిస్తారు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

4. ఐదుమంది చొప్పున జట్లుగా ఏర్పడండి. మీకు తెలిసిన వ్యాధుల జాబితా రాయండి. ఏ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో జట్లలో చర్చించి రాయండి.
జవాబు:
AP Board 8th Class Biology Solutions Chapter 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 3

5. మీ చుట్టుప్రక్కల ఉన్న కొన్ని కుటుంబాలను సర్వే చేసి ఈ కింది విషయాలను కనుక్కోండి.

(a) గత మూడు నెలల్లో ఎంతమంది స్వల్పకాలిక వ్యాధులకు లోనయ్యారు ?
జవాబు:
6 నుంచి 10 మంది.

(b) అదే కాలంలో ఎంతమంది దీర్ఘకాలిక వ్యాధికి గురయ్యారు ?
జవాబు:
ఒకరిద్దరు.

(c) మొత్తంగా ఎంతమంది ఈ వ్యాధులకు గురైనారు ?
జవాబు:
7 నుంచి 12 మంది వరకు

(d) aవ ప్రశ్న మరియు 6వ ప్రశ్న యొక్క జవాబులు ఒకేలా ఉన్నాయా ?
జవాబు:
లేవు.

(e) bవ ప్రశ్న మరియు Cవ ప్రశ్న యొక్క జవాబులు ఏ విధంగా వేరుగా ఉన్నాయి ?
జవాబు:
b ప్రశ్నకు జవాబు దీర్ఘకాలిక వ్యాధికి గురి అయిన వారి సంఖ్యను తెలియచేయును. c ప్రశ్నకు జవాబు స్వల్ప మరియు దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారి సంఖ్యను తెలియచేయును.

(f) జవాబులు వేరు వేరుగా ఎందుకున్నాయి ? ఈ విధమైన వ్యాధులు సాధారణ మానవునిపై ఎటువంటి ప్రభావం చూపుతాయి?
జవాబు:
కారణం ఇవ ప్రశ్న స్వల్పకాలిక వ్యాధులు, bవ ప్రశ్న దీర్ఘకాలిక వ్యాధులు. స్వల్పకాలిక వ్యాధుల వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినదు. తిరిగి కోలుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

6.

(a) మీ తరగతిలో ఎంతమంది జలుబు / దగ్గు / జ్వరంతో బాధపడుతున్నారో తెలుసుకోండి.
జవాబు:
20 నుంచి 30 మంది

(b) ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు.?
జవాబు:
3 నుంచి 4 రోజులు

(c) యాంటీబయోటిక్స్ ఎంతమంది తీసుకుంటున్నారు ? (మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి.)
జవాబు:
ఒక 20 మంది.

(d) యాంటీబయోటిక్స్ తీసుకొన్న తరువాత కూడా ఎన్ని రోజులు అస్వస్థులుగా ఉన్నారు ?
జవాబు:
2 నుంచి 3 రోజులు.

(e) యాంటీబయోటిక్స్ తీసుకోని వారు ఎన్ని రోజులు జలుబుతో బాధపడ్డారు ?
జవాబు:
4 నుంచి 7 రోజులు.

(f) రెండు గ్రూక్స్ మధ్య తేడా ఏమిటి ?
జవాబు:
రెండు గ్రూప్ ల మధ్య తేడా లేదు.

(g) తేడా ఉంటే ఎందుకు ? లేకపోతే ఎందుకో చెప్పండి.
జవాబు:
జలుబు అనేది వైరసకు సంబంధించిన వ్యాధి. వైరస్ వ్యాధులకు యాంటీబయోటిక్స్ వేసుకున్నప్పటికీ అవి వ్యాధి. తీవ్రతను కాని, వ్యాధి వ్యవధిని కాని తగ్గించవు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

7. మీ పరిసరాలలో ఆర్థికంగా బాగా ఉన్న పది కుటుంబాలు మరియు ఆర్థికంగా వెనుకబడిన పది కుటుంబాలపై సర్వే నిర్వహించండి.
జవాబు:
ప్రతి కుటుంబంలో 5 సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉండేలా చూడండి. ఈ పిల్లల ఎత్తును కొలవండి. వయస్సుకు తగిన ఎత్తును సూచించే గ్రాఫ్ గీయండి.
AP Board 8th Class Biology Solutions Chapter 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది 4

(a) రెండు గ్రూపులలో ఏమైనా తేడా ఉందా ? ఉంటే ఎందుకుంది ?
జవాబు:
రెండు గ్రూపులలో తేడా ఉంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో పిల్లలు వయస్సుకు తగిన ఎత్తు లేరు. కారణం వారికి పోషకాహార లోపం, వ్యాధులు ఎక్కువగా రావటం, పరిశుభ్రత లోపం మొదలైనవి.

(b) తేడాలు ఏమీ లేవా ? దీనిని బట్టి ఆర్థికంగా బాగా ఉన్నవాళ్లకి, బీదవాళ్లకి ఆరోగ్యంలో వ్యత్యాసం లేదనుకుంటున్నారా?
జవాబు:
ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళకి, బీదవాళ్లకి ఆరోగ్యంలో వ్యత్యాసం పోషకాహార లోపం వలన ఉంటుంది.

8. పిచ్చి కుక్క లేదా ఇతర వ్యాధిగ్రస్థ జంతువులు కాటేసినప్పుడు ‘ర్యాబిస్’ వైరస్ వ్యాప్తి చెందుతుంది. జంతువులకు, మానవులకు యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్ మందు అందుబాటులో ఉంది. మీ పరిసరాలలో ‘ర్యాబిస్’ వ్యాధిని నివారించడానికి గ్రామ పంచాయతి / మున్సిపాలిటీ వారు తీసుకున్న చర్యలు మరియు కార్యాచరణ ప్రణాళిక ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ చర్యలు సరిపోతాయా ? సరిపోకపోతే మెరుగుపరచే చర్యలకు మీరిచ్చే సూచనలేమిటి ?
జవాబు:
మా పరిసరాలలో ర్యాబిస్ వ్యాధిని నివారించడానికి మున్సిపాలిటీవారు తీసుకున్న చర్యలు మరియు కార్యాచరణ ప్రణాళిక.

  1. ఏ కుక్క కరిచినా ర్యాబిస్ వ్యాధి టీకాను వెంటనే తీసుకోమని ప్రచారం చేయుట.
  2. ర్యాబిస్ వ్యాధి వ్యాక్సిన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంచుట.
  3. వీధి కుక్కల జనాభాను తగ్గించుట.
  4. కుక్కలకు ముందుగా ఇంజక్షన్లు చేయుట. పైన చెప్పిన చర్యలు సరిపోవు.

మెరుగుపరుచుటకు సూచనలు :

  1. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయుట.
  2. వీధి కుక్కలు అన్నింటికీ టీకాలు వేయించుట.
  3. పిచ్చి వచ్చిన కుక్కలను వెంటనే ప్రత్యేకమైన ప్రదేశాలలో ఉంచి మిగతా వాటికి వ్యాధి రాకుండా చూచుట.
  4. వ్యాధి వచ్చిన కుక్కలను దూరంగా ఉంచి చికిత్స చేయుట.
  5. వ్యాధితో చనిపోయిన కుక్కలను జాగ్రత్తగా ఎవరూ వెళ్లని ప్రదేశాలలో పాతి పెట్టుట.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

పాఠ్యాంశములోని ప్రశ్నలు

1. మీ గ్రామపంచాయితీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ గోడల మీద రాసిన ఆరోగ్య సూత్రాలు తెలపండి. (పేజీ.నెం. 177)
జవాబు:

  1. కాచి చల్లార్చిన నీటిని త్రాగండి.
  2. ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా గిన్నెలపైన మూతలు పెట్టండి.
  3. దోమకాటు నుండి కాపాడుకోవడానికి దోమతెరలను ఉపయోగించండి.
  4. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి.
  5. చుట్టు ప్రక్కల నీరు నిల్వ ఉండకుండా చూడండి.
  6. వండే ముందు కూరగాయలను శుభ్రంగా కడగండి.
  7. ఆరుబయట మలవిసర్జన చేయకండి. టాయిలెట్లు ఉపయోగించండి.
  8. వేడిగా ఉన్న ఆహారం మాత్రమే తినండి.
  9. భోజనం మరియు టాయిలెట్‌కు ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి.

2. ఆరోగ్య అలవాట్లు, జాగ్రత్తల సూచనల వలన మనకేమి తెలుస్తుంది ? (పేజీ.నెం. 177)
జవాబు:
ఆరోగ్య అలవాట్లు, జాగ్రత్తల సూచనల వలన మనం ఆరోగ్య నియమాలు, జాగ్రత్తలు పాటించాలని తెలుస్తుంది.

3. ఈ సూచనలు పాటించని వాళ్లకు ఏమవుతుంది ? (పేజీ.నెం. 177)
జవాబు:
అనారోగ్యం కలుగును.

4. మనకు దోమలు ఏ కాలంలో ఎక్కువగా కనబడతాయి ? మనపై అవి ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి ? (పేజీ.నెం. 177)
జవాబు:
మనకు దోమలు ఎక్కువగా వర్షాకాలం, శీతాకాలంలో కనబడును. అవి మనపై చాలా రకాల వ్యాధులు కలుగచేయును.
ఉదా : మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ, ఫైలేరియా.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

5. కాచి చల్లార్చిన నీరు త్రాగడం వలన, ఈగలు ఆహార పదార్థాల మీద వాలకుండా చూడటం, దోమకాటు బారిన పడకుండా నివారించగలిగితే మనము ఆరోగ్యంగా ఉంటాం. అసలు ఆరోగ్యం అంటే ఏమిటి ? మనమెందుకు అనారోగ్యం పాలవుతాం? (పేజీ.నెం. 177)
జవాబు:
శారీరకంగా, మానసికంగా, సామాజికంగా బాగా పనిచేయడమే ఆరోగ్యం అంటారు. మనమెందుకు అనారోగ్యం పాలవుతామంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవటం వలన, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవటం వలన, ఆరోగ్య నియమాలు పాటించకపోవటం వలన, వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన, ఒత్తిడి, మానసిక ఆందోళనల వలన.

6. మంచి ఆరోగ్యానికి కావల్సిన పరిస్థితులు, వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన పరిస్థితులు ఒకే రకంగా సమాధానాలు . ఉంటాయా ? వేరు వేరుగా ఉంటాయా ? ఎందుకు ? (పేజీ.నెం. 179)
జవాబు:
మంచి ఆరోగ్యానికి కావల్సిన పరిస్థితులు, వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన పరిస్థితులు వేరు వేరుగా ఉంటాయి. కారణం ఆరోగ్యం, వ్యాధి రహితం వేరు వేరు కాబట్టి.

ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు సమాజం గురించి, ప్రజల గురించి కూడా మాట్లాడతాం. వ్యాధి గురించి మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా బాధపడే వ్యక్తులను గురించి మాత్రమే మాట్లాడతాం.

7. వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన రెండు పరిస్థితులను వివరించండి. (పేజీ.నెం. 179)
జవాబు:
వ్యాధి రహితంగా ఉండటానికి కావల్సిన రెండు పరిస్థితులు :
1. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం : దీని వలన ఎటువంటి వ్యాధి జనక జీవులు పరిసరాలలో పెరగవు. అందువలన అందరూ వ్యాధి రహితంగా ఉంటారు.
2. వ్యాధిని సరిగా గుర్తించుట : వ్యాధిని సరిగా గుర్తించుట వలన సరైన చికిత్స చేసి వ్యాధి రహితంగా చేయవచ్చు మరియు టీకాలు వేసి వ్యాధిని నివారించవచ్చు.

8. అస్వస్థతకు గురైన వ్యక్తి నుండి అన్ని రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయా ? ఇలా వ్యాప్తి చెందని వ్యాధులేమైనా ఉన్నాయా ? అవి ఏమిటి ? (పేజీ.నెం. 181)
జవాబు:
అస్వస్థతకు గురైన వ్యక్తి నుండి అన్ని రకాలుగా వ్యాధులు వ్యాప్తి చెందవు. అస్వస్థతకు గురైన వ్యక్తి నుండి వ్యాప్తి చెందని వ్యాధులు ఉన్నాయి. అవి అసాంక్రమిక వ్యాధులు.
ఉదా : బి.పి., డయాబెటిస్, గుండెపోటు.

9. అస్వస్థతకు గురైన వ్యక్తిని తాకకున్నా కూడా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి ? (పేజీ.నెం. 181)
జవాబు:
అస్వస్థతకు గురైన వ్యక్తిని తాకకున్నా కూడా వ్యాప్తి చెందే వ్యాధులు : కలరా, టైఫాయిడ్, ధనుర్వాతం, క్షయ, మలేరియా.

10. సాంక్రమిక జీవుల నుండి వ్యాప్తి చెందని వ్యాధులు ఏవి ? (పేజీ.నెం. 181)
జవాబు:
సాంక్రమిక జీవుల నుండి వ్యాప్తి చెందని వ్యాధులు అసాంక్రమిక వ్యాధులు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

11. నీకు అస్వస్థతగా అనిపించి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలనుకునే ఏవైనా-3 కారణాలు తెలపండి. నీవు తెలిపిన మూడు కారణాలలో ఏదో ఒక లక్షణం మాత్రమే నీలో కన్పిస్తే నీవు డాక్టరు వద్దకు వెళ్లాలనుకుంటావా ? ఎందుకు ? (పేజీ.నెం. 182)
జవాబు:
నాకు అస్వస్థతగా అనిపించి డాక్టరు దగ్గరకు వెళ్ళాలనుకునే 3 కారణాలు : (1) జలుబు (2) దగ్గు (3) జ్వరం వీటిలో ఏ ఒక్క కారణం కనిపించినా డాక్టరు వద్దకు వెళ్తాను. ఎందుకంటే – మందుల్ని మన ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే స్వల్పకాలిక వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి.

12. ఈ క్రింది వానిలో ఏ సందర్భం నీ ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముంది ?
1. కామెర్ల వ్యాధి సోకిన సందర్భంగా
2. నీ తలలో పేలు ఎక్కువగా ఉన్నప్పుడు
3. నీ ముఖంపై మచ్చలు ఏర్పడినపుడు (పేజీ.నెం.184)
జవాబు:
కామెర్ల వ్యాధి సోకిన సందర్భంగా ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముంది. ఈ వ్యాధిలో కాలేయం దెబ్బతినుట వలన జీర్ణశక్తి మందగించి, రోగి నీరసపడతాడు. కాలేయ, జీర్ణ వ్యవస్థలు పునరుద్ధరించబడటానికి సమయం పడుతుంది. ఒక్కొక్క మార్పు ఇది ప్రాణాంతకంగా కూడ పరిణమించవచ్చు.

13. వ్యాధి ఎలా వ్యాప్తి చెందును ? (పేజీ.నెం. 184)
జవాబు:
వ్యాధి జనక జీవులు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందును. అవి :

  1. ప్రత్యక్ష తాకిడి
  2. గాలి ద్వారా
  3. నీరు, ఆహారం ద్వారా
  4. జంతువుల ద్వారా

14. వాహకాలు అనగానేమి ? (పేజీ.నెం. 184)
జవాబు:
వ్యాధి జనక జీవులు ఉన్నప్పటికి వ్యాధికి గురికాని జీవులను వాహకాలు అంటారు. వ్యాధులను ఒకరి నుండి మరొకరి
వ్యాప్తి చేయు జీవులు.

15. వ్యాధులను నివారించే విధానాల గురించి వ్రాయుము. (పేజీ.నెం. 184)
జవాబు:
వ్యాధులను నివారించే విధానాలు రెండు.
1. సర్వసాధారణమైనది
2. ప్రతి వ్యాధికి ప్రత్యేకమైనది.
సాధారణ నివారణ సూత్రాన్ని పాటించి వ్యాధి వ్యాప్తిని నిరోధించడం సర్వసాధారణమైన అంశం.

దానికి ఈ కింది నియమాలు పాటించాలి.

  1. గాలి వలన వ్యాప్తి చెందే వ్యాధి జనకాల వ్యాప్తిని నిరోధించడానికి ఎక్కువ జనాభా లేని ప్రదేశాలలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశాలలో నివసించే ఏర్పాటు చేయటం.
  2. నీటి ద్వారా వ్యాధులను నివారించుటకు రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు.
  3. పరిశుభ్రమైన వాతావరణం కల్పించినట్లయితే వ్యాధి వాహకాల నుండి విముక్తి.
  4. వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుకొనుట. ప్రత్యేకమైన నివారణ పద్ధతిలో వ్యాధి జనక జీవులతో పోరాడే వ్యాధి నిరోధక లక్షణాన్ని కలిగి ఉండటమే.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

16. మనం అస్వస్టులుగా ఉన్నప్పుడు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఎందుకు తీసుకుంటారు ? (పేజీ.నెం. 189)
జవాబు:
వ్యాధి నిరోధక శక్తి పెరుగుటకు.

17. వివిధ పద్ధతుల ద్వారా వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతుంది ? (పేజీ.నెం. 189)
జవాబు:
వ్యాధి జనక జీవులు వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందును. అవి :

  1. ప్రత్యక్ష తాకిడి
  2. గాలి ద్వారా
  3. నీరు, ఆహారం ద్వారా
  4. జంతువుల ద్వారా

18. సాంక్రమిక వ్యాధులు ప్రబలకుండా మీ పాఠశాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ? (పేజీ.నెం. 189)
జవాబు:

  1. వ్యాధులు వచ్చిన పిల్లలను ఇంటివద్ద ఉండిపో అని చెబుతారు.
  2. తరగతి గదిలోకి గాలి, వెలుతురు వచ్చే ఏర్పాటు చేస్తారు.
  3. ఆరోగ్య నియమాల గురించి వివరిస్తారు.
  4. టీకాలు వేయించుకోమని చెబుతారు.
  5. పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచటం.
  6. బోరింగ్ వద్ద నీరు నిల్వకుండా చూడటం.
  7. పరిసరాలలో మొక్కలు పెంచటం.
  8. ఆహార వ్యర్థాలను కంపోస్ట్ పిట్ కు చేర్చటం.
  9. కాగితాలు, కాయల వ్యర్థాలను కుళ్లబెట్టి మట్టిలో కలపడం ద్వారా పాఠశాలలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడతాం.

19. అసంక్రామ్యత అంటే ఏమిటి ? (పేజీ.నెం. 189)
జవాబు:
ఒక వ్యక్తి ఒక వ్యాధికి పలుసార్లు గురి అయినప్పుడు ఆ వ్యాధిని ఎదురుకొనే శక్తి అతనికి వస్తుంది. దీనిని అసంక్రామ్యత అంటారు.

AP Board 8th Class Biology Solutions Chapter 11 మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?

20. మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిరోధకత కార్యక్రమాలేవి ? మీ ప్రాంతంలో తరుచు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలేవి ? (పేజీ.నెం. 189)
జవాబు:
మా థమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిరోధకతకు ఈ కింది కార్యక్రమాలు ఉన్నాయి.

  1. పోషకాహారం యొక్క ఆవశ్యకతను తెలియచేయుట
  2. చిన్న చిన్న వ్యాధులకు చికిత్స
  3. రక్షిత మంచినీటి ఆవశ్యకత
  4. పరిసరాల శుభ్రత గురించి తెలియచేయుట
  5. వ్యాధి రాకుండా తల్లి పిల్లలకు టీకాలు వేయుట.
  6. ఏ కాలంలో ఏ వ్యాధులు వస్తాయో వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు తెలియచేయుట.
    మా ప్రాంతంలో తరుచూ ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు డయేరియా, మలేరియా, డెంగ్యూ మొదలైనవి.

21. ఈ పాఠం మీద వ్యాఖ్యానం రాయడానికి పై ప్రశ్నల గురించి మీ తరగతిలో చర్చించండి. మీ నోటు పుస్తకంలో వ్యాసంగా రాయండి. (పేజీ.నెం. 189)
జవాబు:
ఒక వ్యక్తి శారీరకంగాను, మానసికంగా, సామాజికంగా బాగా ఉంటే దానిని ఆరోగ్యం అంటారు. వ్యాధి జనక జీవులు శరీరంలోనికి ప్రవేశించటం వలన శరీర జీవక్రియలు సరిగా జరగవు. దీనిని వ్యాధి అంటాము. ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధి రహిత స్థితికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వ్యాధిని కలుగచేయు కారకాలను వ్యాధి కారకాలు అంటారు. అవి సజీవ కారకాలు, నిర్జీవ కారకాలు.

వ్యాధులు రెండు రకాలుగా ఉంటాయి. అవి తీసుకొనే సమయాన్ని బట్టి (1) స్వల్పకాలిక వ్యాధులు (2) దీర్ఘకాలిక వ్యాధులు. స్వల్పకాలిక వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే అవి దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశం ఉంది. , వ్యాధి కలిగే విధానాన్ని బట్టి వ్యాధులు రెండు రకాలు. సాంక్రమిక వ్యాధులు, అసాంక్రమిక వ్యాధులు.

ముఖ్యంగా మానవునిలో వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, కొన్ని క్రిమికీటకాలు వ్యాధి జనకాలుగా, వాహకాలుగా గుర్తించారు. వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుటను వ్యాధి వ్యాప్తి అంటారు. వ్యాధి వ్యాప్తి .

  1. గాలి ద్వారా
  2. నీరు, ఆహారం ద్వారా
  3. ప్రత్యక్ష తాకిడి ద్వారా
  4. జంతువుల ద్వారా జరుగును.

వ్యాధులను నయం చేసే సూత్రాలు అమలు చేయాలి. అవసరమైన యాంటీబయోటిక్స్, ఇతర మందులు వాడాలి. వ్యాధి వచ్చిన తరువాత మందులు వాడటం కంటే నివారించుట మంచిది. వ్యాధి నివారణకు ఈ కింది నియమాలు పాటించాలి.

  1. ఇంట్లోకి, పాఠశాలలోకి గాలి, వెలుతురు ఉండే విధంగా చేయుట.
  2. రక్షిత మంచి నీటిని తాగుట.
  3. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొనుట
  4. పోషకాహారం తీసుకొనుట
  5. వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండటం
  6. సాంక్రమిక వ్యాధులు వచ్చిన పిల్లలను ఇంటి దగ్గర ఉంచుట
  7. పిల్లలకు టీకాలు ఇప్పించుట.
  8. వ్యాధి నిరోధక శక్తి అవసరం గురించి చెప్పుట

AP Board 8th Class Biology Study Material Guide Solutions Pdf Download State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 8th Class Biology Study Material Guide Pdf free download, 8th Class Biology Textbook Solutions in English Medium and Telugu Medium are part of AP Board 8th Class Textbook Solutions.

Students can also go through AP Board 8th Class Biology Notes to understand and remember the concepts easily. Students can also read AP 8th Class Biology Important Questions for exam preparation.

AP State Syllabus 8th Class Biology Guide Study Material Pdf Free Download

AP 8th Class Biology Study Material Pdf Download Andhra Pradesh | AP 8th Class Biology Textbook Pdf Download

AP 8th Class Biology Study Material Pdf Download English Medium

AP 8th Class Biology Textbook Questions and Answers Telugu Medium Pdf

AP TS 8th Class Biology Study Material Pdf | 8th Class Biology Guide Pdf | Telangana SCERT Class 8 Biology Solutions