AP Board 8th Class English Solutions Chapter 1C A Letter to a Friend

AP State Syllabus AP Board 8th Class English Textbook Solutions Chapter 1C A Letter to a Friend Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class English Solutions Chapter 1C A Letter to a Friend

8th Class English Chapter 1C A Letter to a Friend Textbook Questions and Answers

Comprehension

Answer the following questions.

Question 1.
How did Suresh and Ramesh spend their time?
Answer:
Suresh and Ramesh enjoyed their childhood days in Manikonda village. Every day they played gilli-danda, hide and seek and kabaddi in their garden. They played in the moonlight. They enjoyed listening to the tales told by their grandpa. Thus they spent their time joyfully.

AP Board 8th Class English Solutions Chapter 1C A Letter to a Friend

Question 2.
Why did Ramesh’s family move to the city?
Answer:
Ramesh’s family moved to the city as both Ramesh and his wife got jobs in the city (Hyderabad). They got jobs in software companies.

Question 3.
What change did you observe in Ramesh?
Answer:
Ramesh enjoyed his childhood days along with his friend Suresh in Manikonda village. There were so many unforgettable, joyous occasions in their childhood. They leisurely spent their time enjoying the beauty of the nature. But now he is not happy in city. He is annoyed at his busy city life. He is the man of disgust. Ramesh’s family members hardly find time to sit together. They have forgotten their family. They work like machines. They have missed the joy of the family, their company and many things in the busy life.

Question 4.
Do you think Ramesh is happy in the city? Why?
Answer:
No. I don’t think Ramesh is happy in the city. He thinks that his city life is very disgusting. Both Ramesh and his wife work at software companies. They don’t find any time to sit together. They are always busy. They work with computers, think like computers and live like computers. They have forgotten their family. Ramesh recalls all the joyous occasions he had during his childhood. He thinks that he has missed his relatives, the joy of the family, their company and many things in his busy life. He thinks that their flat is their world, just like a well for a frog.

AP Board 8th Class English Solutions Chapter 1C A Letter to a Friend

Question 5.
What made Ramesh write to Suresh?
Answer:
As Ramesh had a meeting in his office, he didn’t meet his friend Suresh during his visit to Hyderabad the previous week. So, he wrote a letter apologizing for his not meeting Suresh.

Proect work

Observe any five families in your neighbourhood and draw your conclusions, ad¬vantages and disadvantages of living in a joint/nuclear family.
Answer:
I observed five families living in our neighbourhood. All the families are nuclear ones that consist of a man, his wife and their children.
In the present society the concept of the joint family system has been gradually breaking up. In its place a new system of nuclear family has aroused. I think both types of families have their own merits and demerits. The joint family system is a feature of agricultural societies. Collective living, collective planning and collective share in family wealth are the traditional features of the joint family. We can see the division of labour in a joint family. The joint family preserves the traditions, customs and values and passes them down to the next generations. With the passage of time, the joint family system has disintegrated, giving rise to the nuclear family system.
The nuclear family consists of a man, his wife and their children. Job opportunities available in the cities become the main cause of the disintegration of the joint family system. For a number of reasons, a joint family system doesn’t exist in the cities. There is a lack of living space in the cities. It is difficult to accommodate all the members of a joint family in a single house in the city. The cost of living is very high in the cities. The increasing individualistic and independent attitudes of grown up children give rise to the nuclear family system. Now, we see advantages and disadvantages of living in both the families.

Advantages of living in a ‘joint family’

  1. Joint family helps the younger ones to develop social virtues like co-operation, sympathy, sacrifice, affection, selfless service, obedience and broad minded nature.
  2. Each member of a joint family is given work according to his or her capacity. Hence, we find division of labour in a joint family.
  3. There is more affection and love among family members.
  4. Joint family affords ample leisure to its members.
  5. Joint family acts as an agency of social control.
  6. In the joint family the children the employed, the sick, the aged and the handicapped are well taken care of.
  7. We find sharing of sorrowness in a joint family.

Disadvantages of living in a ‘joint family’

  1. There is no privacy.
  2. There is no financial independence.
  3. There is a chance for disharmony due to generation gap.
  4. There may be chances for conflict between males and females and the young and the old due to diverse temperaments.

AP Board 8th Class English Solutions Chapter 1C A Letter to a Friend

Advantages of living in a ‘nuclear family’

  1. Nuclear family provides more privacy.
  2. The members of a nuclear family have financial independence and stability.
  3. The members of a nuclear family have more freedom.
  4. The members of a nuclear family find no stress and discomfort.

Disadvantages of living in a ‘nuclear family’

  1. If both the parents are employees, they find no time to care for the children.
  2. The members of a nuclear family feel insecure.
  3. There may be extra expenses in a nuclear family.
  4. The members of a nuclear family lose the support and experience of the elders.
  5. There is no sharing of sorrows.

A Letter to a Friend Summary in English

Ramesh wrote this letter to his friend Suresh apologizing for his not meeting him during his visit to Hyderabad the previous week. Ramesh is a computer programmer at Microsoft, Hyderabad and his wife is a System Analyst at Dell, Hyderabad. He is annoyed at his busy city life. Both Ramesh and his wife work with computers, think like computers and live like computers. Their child always plays computer games never caring for anyone. Ramesh is very unhappy in the city. He recalled the memorable days of his childhood in his letter. Ramesh and Suresh enjoyed their childhood days in Manikonda village. They played together in their garden in the moonlight. Theirs was a big family. Their grandpa used to tell them tales. They played gill-danda, hide and seek and kabaddi. They went for swimming every Sunday. Ramesh remembered how their Padmanabhaiah Sir appreciated them when they got the first prize in District Science Fair. Their picnic to Koil Sagar and their tour of Srisailam were memorable. Ramesh couldn’t forget the roaring of the Krishna River at the dam. They enjoyed the festivals such as Dasara, Deepavali, etc. along with their uncle and aunt. Ramesh thought of his grandparents, uncles, aunts, brothers, sisters …. sometimes. He thought that they missed them all. They missed the joy of the family, their company and many things in their busy life. At present they are living in this unreal world. They have lost their real life.

AP Board 8th Class English Solutions Chapter 1C A Letter to a Friend

A Letter to a Friend Glossary

faded (adj): pale

hardly (adv): almost never

disgusting (adj): extremely unpleasant

appreciated: understand the worth of

company (n): the fact of being with somebody else and not alone

affection (n): a feeling of liking for a person

AP Board 8th Class Social Studies Study Material Guide Solutions Pdf Download State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 8th Class Social Studies Study Material Guide Pdf free download, 8th Class Social Textbook Solutions in English Medium and Telugu Medium are part of AP Board 8th Class Textbook Solutions.

Students can also go through AP Board 8th Class Social Notes to understand and remember the concepts easily. Students can also read AP 8th Class Social Important Questions for exam preparation.

AP State Syllabus 8th Class Social Studies Guide Study Material Pdf Free Download

AP 8th Class Social Study Material Pdf Download English Medium

8th Class Social Study Material Pdf Theme I Diversity on the Earth

8th Class Social Studies Study Material Theme II Production, Exchange and Livelihoods

AP 8th Class Social Study Material Pdf English Medium Theme III Political Systems and Governance

AP Board Solutions Class 8 Social Theme IV Social Organisation and Inequities

AP Board 8th Class Social Solutions Theme V Religion and Society

Social Study Material for 8th Class Theme VI Culture and Communication

AP 8th Class Social Textbook Solutions Telugu Medium Pdf

8th Class Social Guide Pdf Download Theme 1 భూమి – వైవిధ్యం

Social Guide 8th Class Theme 2 ఉత్పత్తి, వినిమయం – జీవనాధారం

8th Class Social Studies Lessons Theme 3 రాజకీయ వ్యవస్థలు – పరిపాలన

AP 8th Class Social Textbook Pdf Theme 4 సామాజిక వ్యవస్థీకరణ – అసమానతలు

8th Class Social Textbook State Syllabus Theme 5 మతం – సమాజం

8th Class Social Textbook Pdf Andhra Pradesh Theme 6 సంస్కృతి – సమాచారం

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

SCERT AP 8th Class Social Study Material Pdf 17th Lesson పేదరికం – అవగాహన Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 17th Lesson పేదరికం – అవగాహన

8th Class Social Studies 17th Lesson పేదరికం – అవగాహన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తీవ్రమైన ఆకలిగా పేదరికం అన్న నేపథ్యంలో కింద వాక్యాలలో సరైనవి ఏవి? (AS1)
అ) రోజుకి ఒకసారే ఆహారం తీసుకోవటం
ఆ) అవసరమైనన్ని కాలరీల కంటే తక్కువ ఉన్న ఆహారం తీసుకోవటం
ఇ) నాగలితో దున్నే వ్యక్తికీ, వరికోత యంత్రం నడిపే వ్యక్తికీ ఒకే మోతాదులో కాలరీలు ఉన్న ఆహారం అవసరం.
ఈ) దుకాణదారుడు కంటే పొలం దున్నే వ్యక్తికి ఎక్కువ కాలరీలు కావాలి.
ఉ) ఆకలితో ఉన్న కారణంగా వ్యక్తి రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
జవాబు:
సరియైనవి
అ) రోజుకి ఒకసారే ఆహారం తీసుకోవటం
ఆ) అవసరమైన కాలరీల కంటే తక్కువ ఉన్న ఆహారం తీసుకోవటం
ఈ)దుకాణదారుడి కంటే పొలం దున్నే వ్యక్తికి ఎక్కువ కాలరీలు కావాలి.
ఉ) ఆకలితో ఉన్న కారణంగా వ్యక్తి రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

ప్రశ్న 2.
ఈ అధ్యాయంలో పేదరికానికి పేర్కొన్న ప్రధాన కారణాలను గుర్తించండి. (AS1)
జవాబు:
‘పేదరికానికి ప్రధాన కారణం క్రమం తప్పకుండా పని దొరకపోవటంగా ఈ అధ్యాయంలో పేర్కొనబడింది.

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 3.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి పథకాలలోని ప్రధానమైన అంశాలు ఏమిటి? పేదరికంలోని ఏ అంశాలను అవి పరిష్కరించటానికి పూనుకుంటున్నాయి? చౌకధరల దుకాణాలు ఎందుకు అవసరం? (AS4)
(లేదా)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది? వివరించండి.
జవాబు:
ప్రధానమైన అంశాలు :
1) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం :
ఈ ఉపాధి హామీ చట్టం ప్రకారం నైపుణ్యం అవసరంలేని శారీరక శ్రమ చేయటానికి సిద్ధంగా ఉండి, పని అడిగిన పెద్దవాళ్ల (18 సం||లు నిండిన)కు ప్రభుత్వం పని కల్పించాలి. ఈ విధంగా ప్రతి గ్రామీణ కుటుంబం ఒక సంవత్సర కాలంలో కనీసం వంద రోజులపాటు ఉపాధి పొందవచ్చు. ఈ పనికి కనీస కూలీకి తక్కువ కాకుండా కూలీ చెల్లించాలి.

  • నీటి నిల్వ, సంరక్షణ
  • కరవుకు తట్టుకునే పనులు (అడవుల వృద్ధి, చెట్ల పెంపకం)
  • షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యాలు కల్పించటం
  • చెరువుల పూడికతీతతో సహా సంప్రదాయ నీటి మడుగుల పునరుద్ధరణ

ii) ప్రజా పంపిణీ వ్యవస్థ :
చౌక ధరల దుకాణాల ద్వారా ఆహారధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయటాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (Public Distribution System (PDS)) అంటారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పట్టణ, పల్లె ప్రజలందరికీ ఆహార ధాన్యాలను చేర్చటంలో ఇది కీలకపాత్ర వహించింది. దీని పనితీరులో కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఈ దుకాణాలను సమయానికి, లేదా క్రమం తప్పకుండా తెరవరు. ఎవరూ కొనగూడదన్న ఉద్దేశంతో ఆహార ధాన్యాలను కలీ చేసే సందర్భాలు ఉన్నాయి. ప్రజలకి కాకుండా ఇతర దుకాణాలకు సరుకులు అమ్మే చౌకధరల దుకాణాదారులు ఉన్నారు. దీంతో పేద ప్రజలతో సహా చాలామందికి ఆహారధాన్యాలు అందవు. భారతదేశంలోని పేదరాష్ట్రాలు, పేద ప్రాంతాలలో సాధారణంగా వీటి పనితీరు ఆశించిన మేరకు లేదు.

  • ఉపాధిని కల్పించడం, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సరసమైన ధరలలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడటం అనే అంశాలను పరిష్కరించడానికి పూనుకున్నాయి.
  • నిత్యావసర సరుకుల ధరలు ఎక్కువగా ఉంటే ఉపాధి, ఆదాయాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి మౌలిక అవసరాలను ప్రభుత్వం చౌకగా అందిస్తుంది. వీటికోసం చౌకధరల దుకాణాలు అవసరం.

ప్రశ్న 4.
ఉపాధి లేని ప్రజలకే భూమి, పశువులు, దుకాణాలు వంటి ఆస్తులు సాధారణంగా ఉండవు. ఎందుకు? (AS1)
జవాబు:
ఉపాధిలేని వారికి సంపాదన ఉండదు. వారి నిత్యావసర ఖర్చులకే డబ్బులు సరిపోవు. యింక మిగులు సొమ్ములకు అవకాశం ఉండదు. పొదుపు చేయలేనివారు ఆస్తులను సమకూర్చుకోలేరు. కాబట్టి వీరికి సాధారణంగా ఆస్తులు ఉండవు.

ప్రశ్న 5.
పేజి నెం. 202 లో “జీవించే హక్కు కోసం పోరాటం” శీర్షికలోని మొదటి రెండు పేరాలు చదివి వ్యాఖ్యానించండి. (AS2)

ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కొత్త విధానంపై ఎంతో చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అయిదు మందిలో నలుగురు అవసరమైన కనీస కాలరీల కంటే తక్కువ ఇచ్చే ఆహారం తీసుకుంటున్నారని మనకు తెలుసు. 2004 జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పది కుటుంబాలలో మూడు కుటుంబాలకు కూడా అంత్యోదయ, BPL కార్డులు లేవు. అంటే అంతకుముందు ప్రజా పంపిణీ వ్యవస్థ వల్ల ప్రయోజనం పొందిన వాళ్లు ఇప్పుడు పొందటం లేదు. భూమిలేని కూలీల కుటుంబాలలో చాలా వాటికి BPL కార్డులు లేవు. ఇందుకు విరుద్ధంగా కొన్ని సంపన్న కుటుంబాలకు BPL కార్డులు ఉన్నాయన్న వార్తలొచ్చాయి.

ఈ కొత్త ప్రజా పంపిణీ వ్యవస్థ విధానంలో ఇతర వైరుధ్యాలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం వద్ద రైతుల దగ్గర నుంచి కొన్న) ఆహారధాన్యాలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఈ ఆహారధాన్యాలను ఎలుకలు తినేసిన, కుళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. చౌకధరల దుకాణాలు సరసమైన ధరలకు ఆహారధాన్యాలను BPL, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉన్న వాళ్ళకే అమ్ముతారు. కాబట్టి అక్కడ కూడా ఆహారధాన్యాలు నిల్వ ఉండిపోతాయి. ఇంకోవైపున అందరి ఆకలి తీర్చలేకపోతున్నామనే భావన కూడా ఉంది.
జవాబు:
జీవించే హక్కు అనేది ప్రజలు ఇంకా ఓ హక్కుగా భావించటంలేదు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం “ఆహార భద్రత బిల్లు”ను పార్లమెంటులో ఆమోదించడం, ఇవి చట్టం కావడంతో ప్రజలు ఈ దిశగా ఇప్పుడిప్పుడే ఆలోచించడం ప్రారంభించారు.

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 6.
మీ గ్రామంలో PDS పథకం నిర్వహణపై జిల్లా కలెక్టర్ కు ఒక లేఖ రాయండి. (AS6)
జవాబు:

జిల్లా కలెక్టర్
కరీంనగర్ వారికి
కరీంనగర్ జిల్లా, కొత్తపల్లికి
చెందిన 8వ తరగతి విద్యార్థి నమస్కరించి వ్రాయులేఖ.అయ్యా!
మా ప్రాంతంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయుచున్న నిత్యావసరాలు కొలతలలో తేడాలు వస్తున్నాయి. నెలలో రెండు, మూడు రోజులు మాత్రం దీనిని తెరిచి ఉంచుతున్నారు. దీనితో బీదవారు సరకులను తీసుకోలేకపోతున్నారు. కావున, మీరు ఈ అంశాలను దర్యాప్తు చేసి న్యాయం చేయగలరు.

మీ
విధేయురాలు,
పి. కామాక్షమ్మ,
D/O సుందరరావు,
కొత్తపల్లి,
కరీంనగర్.

8th Class Social Studies 17th Lesson పేదరికం – అవగాహన InText Questions and Answers

8th Class Social Textbook Page No.193

ప్రశ్న 1.
చంద్రయ్య, రామాచారి జీవితాలలో పోలికలను చర్చించండి.
జవాబు:

  1. చంద్రయ్య, రామాచారి ఇరువురూ పేదవారు.
  2. ఇరువురూ ఆకలితో అలమటించేవారే.
  3. ఇరువురి భార్యలు పనిరీత్యా వేరే వేరే ఊళ్ళల్లో ఉంటున్నారు.
  4. ఇరువురికీ ఒంట్లో ఆరోగ్యం తగ్గిపోయింది.
  5. ఇద్దరూ వయస్సుకి మించి ముసలివారుగా కనిపించేవారు.

ప్రశ్న 2.
రామాచారి జీవనోపాధి గ్రామంలోని వ్యవసాయంతో ఏ విధంగా ముడిపడి ఉంది?
జవాబు:
కొన్ని సంవత్సరాల క్రితం వరకు రామాచారి వద్ద పని చేయించుకోటానికి 40 మంది దాకా వచ్చేవాళ్లు. వాళ్ళల్లో ఎక్కువమంది రైతులు. అతడు చేసిన పనులకు రైతులు ధాన్యం రూపంలో చెల్లించేవాళ్లు. ఒక్కొక్కళ్లు సంవత్సరానికి 70 కిలోల ధాన్యం ఇచ్చేవాళ్లు. అలా వచ్చిన 2800 కిలోల ధాన్యంలో కుటుంబానికి కావలసినంత ఉంచుకుని, మిగిలినది. మార్కెట్టులో అమ్మేవాడు. 70 కిలోల ధాన్యం 375 రూపాయలకు అమ్మేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ విధంగా కుటుంబానికి సరిపడా బియ్యంతోపాటు సంవత్సరానికి 8000 రూపాయలు పొందేవాడు. దీనితోనే కుటుంబాన్ని గుట్టుగా నడుపుకొచ్చేవాడు.

ఈ విధంగా రామాచారి జీవనోపాధి గ్రామంలోని వ్యవసాయంతో ముడిపడి ఉంది.

ప్రశ్న 3.
రామాచారి కుటుంబం కష్టాలు ఎదుర్కోటానికి కారణం :
అ) రామాచారి సరైన ప్రయత్నాలు చేయకపోవటం, తగిన అవగాహన లేకపోవటం, లేక
ఆ) గ్రామంలో జీవనోపాధుల పరిస్థితి.
జవాబు:
గ్రామంలో జీవనోపాధుల పరిస్థితి.

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 4.
రామాచారి కుటుంబానికి రోజూ రెండు పూటలా భోజనం లభించాలంటే ఏం చేయాలి? ఆలోచించండి.
జవాబు:
రామాచారి కూడా భార్యతో పాటు పట్టణానికి వలస వెళ్ళి కూలీనాలీ చేయాలి. అపుడే అతని కుటుంబానికి రెండు పూటలా భోజనం లభిస్తుంది.

ప్రశ్న 5.
రామాచారి గ్రామంలోని రైతులకు మధ్య మార్పిడి/లావాదేవీని ఎలా వర్ణిస్తావు?
జవాబు:
రామాచారి పనికీ, గ్రామంలోని రైతులకు మధ్య మార్పిడి/లావాదేవీని నేను ఈ విధంగా వర్ణిస్తాను. “ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు”.

ప్రశ్న 6.
సాధారణంగా సంవత్సరానికి రామాచారి తన కుటుంబ అవసరాలకు ఎన్ని కిలోల ధాన్యం ఉంచుకునేవాడు?
జవాబు:
రామాచారి సాధారణంగా, సంవత్సరానికి దాదాపు 1300 కిలోల ధాన్యాన్ని ఉంచుకొనేవాడు.

ప్రశ్న 7.
(ఆహార ధాన్యాలు కాకుండా) కుటుంబ ఖర్చులకు సంవత్సరానికి 8000 రూపాయలు సరిపోతాయా?
జవాబు:
సం||రానికి రూ॥ 8000/-లు అంటే సుమారు నెలకు 667/-లు ఇవి కచ్చితంగా వారికి సరిపోవు.

ప్రశ్న 8.
ప్రక్క పట్టణ దృశ్యంలో జీవన విధానాలలో తేడా గురించి చర్చించండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన 1
తేడాలు

భవంతులలోని వారు డేరాలలోని వారు
1. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. 1. వీరు దుర్భరమైన జీవితాన్ని గడుపుతారు.
2. వారు ధనికులు. 2. వీరు కటిక పేదవారు.
3. వీరికి చక్కటి సౌకర్యాలు ఉంటాయి. 3. వీరికి కనీస సౌకర్యాలు కూడా ఉండవు.

8th Class Social Textbook Page No.194

ప్రశ్న 9.
దేశంలో అత్యంత సంపన్నులైన 25% ప్రజలు సగటున రోజుకి ఎన్ని కాలరీలను తీసుకుంటున్నారు?
జవాబు:
దేశంలో అత్యంత సంపన్నులైన 25% ప్రజలు సగటున రోజుకు 2521 కి॥ కాలరీలను తీసుకుంటున్నారు.

ప్రశ్న 10.
దేశంలో అత్యంత పేదలైన 25% ప్రజలు రోజూ తీసుకోవాల్సిన కాలరీల కంటే సగటున వాళ్లు తీసుకుంటున్న కాలరీలు ఎంత శాతం తక్కువ?
జవాబు:
దేశంలో అత్యంత పేదలైన 25% ప్రజలు రోజూ తీసుకోవలసిన కాలరీల కంటే సగటున 23% కాలరీలు తక్కువ తీసుకుంటున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 11.
పేద ప్రజలు చాలా తక్కువ కాలరీలు తీసుకోవానికి గల కారణాలు ఏవి?
జవాబు:
పేద ప్రజల కొనుగోలు శక్తి తక్కువ. ఎక్కువ కాలరీలు ఉన్న ఖరీదైన పదార్థాలు కొనలేరు, తినలేరు, తిని పని చేయలేరు. కాబట్టి కడుపు నిండే ఆహార పదార్థాలు మాత్రమే తినగలుగుతారు.
ఉదా :
అన్నం, పచ్చడి లేదా అన్నం, కూర లేదా అన్నం, సాంబారు. కాబట్టి వారు చాలా తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు.

8th Class Social Textbook Page No.196

ప్రశ్న 12.
వ్యక్తి ఆర్ధిక స్థాయికీ, వాళ్ళ పోషకాహార స్థాయికీ మధ్య ఏమైనా సంబంధం కనబడుతోందా?
జవాబు:
కనబడుతోంది. వ్యక్తి ఆర్ధిక స్థాయి బాగుంటే పోషకాహార స్థాయి బాగుంటుంది. వ్యక్తి ఆర్థిక స్థాయి తక్కువగా ఉంటే పోషకాహార స్థాయి తక్కువగా ఉంటుంది.

8th Class Social Textbook Page No.197

ప్రశ్న 13.
కృత్యం :

పెద్దవాళ్లు పోషకాహారలోపానికి గురైనదీ, లేనిదీ తెలుసుకోవాలంటే పోషకాహార శాస్త్రజ్ఞులు చెప్పే శరీర పదార్థ సూచిక (Body Mass Index) లెక్కకట్టాలి. దీనిని లెక్కకట్టడం తేలిక. వ్యక్తి బరువు ఎంతో కిలోల్లో తీసుకోండి. ఆ వ్యక్తి ఎత్తును మీటర్లలో తీసుకోండి. బరువును ఎత్తు వర్గంతో భాగించాలి. ఫలితంగా వచ్చిన సంఖ్య 18.5 కంటే తక్కువ ఉంటే ఆ వ్యక్తి పోషకాహార లోపానికి గురైనట్టు. శరీర పదార్థ సూచిక 25 కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తిది ఊబకాయం అన్నట్లు. ఈ నియమం ఎదుగుతున్న పిల్లలకు వర్తించదని గుర్తుంచుకోండి. భిన్న ఆర్థిక నేపథ్యాలకు చెందిన (ఉదాహరణకు శ్రామికులు, పనివాళ్లు, వ్యాపారస్తులు) ముగ్గురు పెద్దవాళ్ల బరువు, ఎత్తు ప్రతి ఒక్క విద్యార్థి సేకరించండి. అందరు విద్యార్థులు తెచ్చిన వివరాలను ఒకరు పట్టికలో పొందుపరచండి. శరీర పదార్థ సూచిక (BMI) లెక్కకట్టండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన 3

8th Class Social Textbook Page No.199

ప్రశ్న 14.
‘నగదు బదిలీ పథకం’ ప్రజా పంపిణీ పథకానికి సరైన ప్రత్యామ్నాయమని మీరు భావిస్తున్నారా?
జవాబు:
‘నగదు బదిలీ పథకం’ ప్రజాపంపిణీ పథకానికి సరైన ప్రత్యామ్నాయం కాదు అని నా భావన.

కారణం :
PDSల ద్వారా ప్రభుత్వం పేదలకు కిలో రూ|| 1/- కి బియ్యం అందిస్తోంది. దానిపై ప్రభుత్వం యిచ్చే సబ్సిడీ రూ|| 19/- లు. ఈ మొత్తం రూ|| 20/- లు ప్రభుత్వం నగదు బదిలీ పథకం క్రింద లదారులకు పంపిణీ చేస్తోంది. వీటితో వారు బయట దుకాణాలలో బియ్యం కొనుక్కుని తినాలి. కానీ బియ్యం రేట్లు పెరిగి రూ|| 40/- లు, రూ॥ 50/- లు అయినపుడు వారికి ఈ ధరకి బియ్యం దొరకవు. అప్పుడు వారికి ఆహార భద్రత కొరవడుతుంది.

కాబట్టి ఇది సరైన ప్రత్యామ్నాయం కాదు.

8th Class Social Textbook Page No.201

ప్రశ్న 15.
కొత్త విధానం వల్ల పేదవాళ్లకు మేలు జరుగుతుందా? మీ సమాధానానికి కారణాలు యివ్వండి.
జవాబు:
ఈ కొత్త విధానం వల్ల పేదవాళ్ళకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని మోసం చేసి తెల్లకార్డులు సంపాదించిన వారందరి నుండి అవి వెనుకకు తీసుకోబడతాయి. కేవలం పేదవారికి, అట్టడుగువారికి మాత్రమే ఈ దుకాణాల ద్వారా సరుకులు అందుతాయి.

ప్రశ్న 16.
ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడానికి మరికొన్ని సూచనలు చేయండి.
జవాబు:
కొన్ని సూచనలు:

  1. నిజమైన లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగాలి.
  2. BPL వారితోపాటు మధ్యతరగతి వర్గాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.
  3. ఈ దుకాణాలలో దొరికే సరుకులను సరియైన తూకంతో యివ్వాలి.
  4. ఈ దుకాణాలకు నాణ్యమైన సరుకును సరఫరా చేయాలి.
  5. డీలర్ల ఎంపిక సక్రమమైన పద్ధతులలో జరగాలి.

8th Class Social Textbook Page No.202

ప్రశ్న 17.
రేషను దుకాణాలను చౌకధరల దుకాణాలని కూడా అంటారు. ఎందుకో తెలుసా?
జవాబు:
రేషను దుకాణాలలో దొరికే సరుకులన్నీ బయట మార్కెట్టు ధరకన్నా తక్కువ ధరకే దొరుకుతాయి. కాబట్టి వీటిని చౌకధరల దుకాణాలని కూడా అంటారు.

ప్రాజెక్టు

మీ ప్రాంతంలోని చౌకధరల దుకాణాన్ని సందర్శించి ఈ దిగువ విషయాలు తెలుసుకోండి.

ప్రశ్న 1.
చౌకధరల దుకాణం ఎప్పుడు తెరిచి ఉంటుంది?
జవాబు:
చౌకధరల దుకాణం రోజూ ఉదయం 8 నుండి 12 వరకు, సాయంత్రం 4 నుండి 8 వరకు తెరచి ఉంటుంది.

ప్రశ్న 2.
చౌక ధరల దుకాణంలో ఏ సరుకులు అమ్ముతున్నారు?
జవాబు:
చౌక ధరల దుకాణంలో బియ్యం, గోధుమలు, పంచదార, చింతపండు, కందిపప్పు, పామాయిల్ మొ||నవి అమ్ముతున్నారు.

ప్రశ్న 3.
రకరకాల కార్డులు ఉన్న విధానం మీకు కనపడిందా?
జవాబు:
అవును. తెలుపు, గులాబి రంగుల కార్డులు నాకు కనబడ్డాయి.

ప్రశ్న 4.
(పేదరికంలోని కుటుంబాలకు) చౌక ధరల దుకాణాలలో బియ్యం, పంచదారల ధరలను కిరాణా దుకాణాలలో ధరలతో పోల్చండి. (కిరాణా దుకాణంలో సాధారణ రకం బియ్యం ధర అడగండి.)
జవాబు:
చౌకధరల దుకాణంలో ధరలు కిరాణా దుకాణంలో ధరలు
AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన 4

ప్రశ్న 5.
AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన 5
చిత్రం చూశారు కదా! మీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు గురించి మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
మా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై అభిప్రాయం.

మా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం చక్కగా నిర్వహిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో తయారైన వేడి వేడి వంటకాలను వడ్డిస్తున్నారు. మా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో రుచికరమైన ఆహారాన్ని తయారుచేయిస్తారు. భోజనానికి ముందు, తరువాత మేం చేతులు, నోటిని శుభ్రంగా కడుగుకుంటాం. ప్రభుత్వం నిర్దేశించిన ‘మెనూ’ ప్రకారం రోజుకోరకమైన వంటకాలు తయారు చేస్తారు. అయితే భోజనశాల ప్రత్యేకంగా లేకపోవడంతో ఆరుబయట తినవలసి వస్తోంది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

SCERT AP 8th Class Social Study Material Pdf 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

8th Class Social Studies 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
అ) అన్ని నృత్య రూపాలు భక్తిలో భాగంగా రూపుదిద్దుకున్నాయి.
ఆ) చారిత్రాత్మకంగా కళాకారులను పెద్ద పెద్ద జమిందారులు పోషించారు.
ఇ) ప్రజలను చైతన్యపరచటానికి బుర్రకథను ఉపయోగించుకున్నారు.
ఈ) ప్రస్తుతం భరతనాట్యాన్ని ప్రధానంగా నట్టువనార్లు నేర్పుతున్నారు.
జవాబు:
సరియైనవి
అ) అన్ని వృత్య రూపాలు భక్తిలో భాగంగా రూపుదిద్దుకున్నాయి.
ఆ) చారిత్రాత్మకంగా కళాకారులను పెద్ద పెద్ద జమిందారులు పోషించారు.
ఇ) ప్రజలను చైతన్యపరచటానికి బుర్రకథను ఉపయోగించుకున్నారు.
ఈ) ప్రస్తుతం భరతనాట్యాన్ని ప్రధానంగా నట్టువనార్లు నేర్పుతున్నారు.

ప్రశ్న 2.
గత 50 సం||రాలలో జానపద కళాకారుల జీవితాల్లో వచ్చిన మార్పులను చర్చించండి. (AS1)
జవాబు:
సినిమాలు, టెలివిజన్ వంటి ఆధునిక సమాచార, వినోద రూపాలు అందుబాటులోకి రావటంతో సంప్రదాయ ప్రదర్శన కళలకు ప్రజల ఆదరణ తగ్గిపోతూ ఉంది. అంతేకాకుండా గతంలోమాదిరి గ్రామ పెద్దలు, భూస్వాములు ఈ కళాకారులకు పోషకులుగా ఉండటం లేదు. ఈ కారణంగా జానపద కళలు క్షీణించిపోతున్నాయి. కళాకారులు జీవనోపాధి సమస్యను ఎదుర్కొంటున్నారు. వీళ్లు సంచార కళాకారులు కావటం వల్ల వాళ్ళ పిల్లలు ఆధునిక పాఠశాలల్లో చదువుకునే అవకాశం లేదు. ఇక వాళ్ళకు మిగిలింది నైపుణ్యంలేని కూలిపని చేయటమే.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయటానికి ఈ కళారూపాలను ఎంచుకోవటం ద్వారా ప్రభుత్వం కొంతమేరకు సహాయపడుతోంది. పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు, ఆడపిల్లల చదువులు, కుటుంబ నియంత్రణ, పర్యావరణం వంటి అంశాలపై అనేక సంప్రదాయ బృందాలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇటువంటి ప్రదర్శనలలో చెప్పాల్సిన అంశాన్ని ఈ ప్రదర్శనలకు ప్రాయోజకులైన ప్రభుత్వమే అందచేస్తుంది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 3.
జానపద కళలు క్షీణతకు గురి అవుతున్నాయా? దీనివల్ల మన సంస్కృతికి ఎటువంటి నష్టం జరుగుతుంది? (AS4)
జవాబు:
జానపద కళలు క్షీణతకు గురి అవుతున్నాయి. దీనివల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వాన్ని కోల్పోతాయి. తరువాత తరాల వారికి వీటి గురించి తెలియకుండా పోతుంది. సాంస్కృతిక వారసత్వం ఒక దేశం యొక్క ఉనికిని నిలబెడుతుంది. అది లేకపోతే దాని ఉనికే ఉండదు.

ప్రశ్న 4.
ఆధునిక జీవితంలోని కొత్త అవసరాలకు అనుగుణంగా జానపద కళలను మలిచి వాటిని పునరుద్ధరించటం సాధ్యమవుతుందా? (AS4)
జవాబు:
సాధ్యమవదనే చెప్పాల్సి వస్తుంది. నేటి జీవనం చాలా వేగంగా ఉన్నది. టీవీలు, కంప్యూటర్లు మొదలైన వాటికి ఇంట్లో కూర్చుని చూడటానికి అలవాటు పడ్డవారు ఈ జానపద కళలను ఖర్చు పెట్టి చూస్తారా అన్నది అనుమానస్పదమే. విద్యుత్తు, ఫ్యానులు వచ్చాక విసనకర్ర అవసరం తగ్గిపోయింది. పవర్ కట్ వచ్చాక మళ్ళీ విసనకర్రలు అందరిళ్ళల్లో కనబడుతున్నాయి. అటువంటి పరిస్థితులు ఏమన్నా ఏర్పడితే తప్ప వీటికి మళ్ళీ పూర్వపు వైభవాన్ని తేలేము.

ప్రశ్న 5.
సదిర్ నాటినుంచి భరతనాట్యంలో చోటుచేసుకున్న ముఖ్యమైన మార్పులు ఏమిటి? (AS1)
జవాబు:

  1. సదిర్ నాటి తమిళనాట ఉన్న నృత్య సాంప్రదాయం.
  2. దీనిని ఆరాధనలలో భాగంగా దేవదాసీలు దేవాలయాలలో ప్రదర్శించేవారు.
  3. నట్టువనార్లు వీరికి నాట్యం నేర్పి, ప్రక్కవాయిద్యకారులుగా ఉండి అనేక రకాలుగా సహకరించేవారు.
  4. బ్రిటిషు వారి ప్రభావంతో చదువుకున్న భారతీయులు దీనిని చిన్న చూపు చూడసాగారు.
  5. తరువాత దేవదాసీ విధానం సామాజిక దురాచారంగా మారి నిషేధించబడి, అంతమైపోయింది.
  6. ఆ విధంగా 20వ శతాబ్దం ప్రారంభంనాటికి ఈ సాంప్రదాయ నృత్య రూపం అంతరించి పోయింది.
  7. లాయరు, స్వాతంత్ర్య పోరాట యోధుడు అయిన ఇ కృష్ణ అయ్యర్, రుక్మిణీదేవి ఈ నాట్యానికి పూర్వవైభవం తీసుకుని వచ్చారు.
  8. దేవదాసీల కుటుంబాలవారైన, తంజావూరుకు చెందిన సుబ్బరామన్ నలుగురు కుమారులు ముత్తుస్వామి దీక్షితార్ గారి సంగీతంతో కలిపి దీనిని సదిర్ నుండి భరత నాట్యంగా మార్చారు.

ప్రశ్న 6.
కింద పేర్కొన్న వాళ్ళలో దేవదానీ వ్యవస్థను సమర్థించినవాళ్లు, వ్యతిరేకించినవాళ్లు, అందులో సంస్కరణలు చేయాలన్న వాళ్లు ఎవరు? (AS1)
బాల సరస్వతి, రుక్మిణీ దేవి, వీరేశలింగం, భాగ్యరెడ్డి వర్మ, కృష్ణ అయ్యర్, బెంగుళూర్ నాగరత్నమ్మ.
జవాబు:
సమర్థించినవాళ్లు : బాల సరస్వతి , బెంగుళూరు నాగరత్నమ్మ.
వ్యతిరేకించినవాళ్లు. : వీరేశలింగం, భాగ్యరెడ్డి వర్మ
సంస్కరణలు చేయాలన్న వాళ్లు : రుక్మిణీదేవి, కృష్ణ అయ్యర్

ప్రశ్న 7.
తమ కళ ద్వారా జీవనోపాధి పొందటం కళాకారులకు ఎప్పుడూ కట్టుగా ఉండేది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? (AS1)
జవాబు:

  1. ప్రస్తుతం కళాకారులు జీవనోపాధి సమస్యను ఎదుర్కొంటున్నారు.
  2. వీళ్ళు సంచార కళాకారులు కావటం వల్ల వాళ్ళ పిల్లలు ఆధునిక పాఠశాలల్లో చదువుకునే అవకాశం లేదు.
  3. చివరకు వారు వారికి అలవాటులేని పనిమీద ఆధారపడి బ్రతుకుతున్నారు.

వారికి ప్రభుత్వం మద్దతును కల్పించాలి.

  1. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి ఈ కళారూపాలను ఎంచుకోవడం ద్వారా కొంత సహాయం చేయవచ్చు.
  2. ప్రస్తుతం టెక్నాలజీకి అలవాటు పడిన ప్రజలు ఈ కళల గురించి తెలియని వారు చాలామంది ఉన్నారు. అందుకోసం పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఆడపిల్లల చదువులు, కుటుంబ నియంత్రణ, పర్యావరణం వంటి అనేక అంశాలపై ప్రభుత్వం ప్రకటనలను ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకటనలను ప్రభుత్వం ఈ కళారూపాల ద్వారా టెలివిజన్లలో ఇప్పించడం ద్వారా ప్రభుత్వం వారికి ఉపాధిని కల్పించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం ఏవైనా మీటింగులు, బహిరంగ సభల సమయంలో ఈ కళాకారుల ద్వారా స్టేజిషోలు ఇప్పించడం వలన వారికి కొంతమేలు జరుగుతుంది. వారికి నిరుద్యోగ భృతిని కల్పించవచ్చు. అంతరించిపోతున్న కళలను కాపాడవచ్చు. తోలుబొమ్మలాట, బుర్రకథ ఒగ్గునృత్యం ఇలాంటి వాటి ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాలల్లో నెలకు ఒకసారి ఈ కళా ప్రదర్శనలను నిర్వహించడం వలన వారికి ఉపాధిని కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 8.
జానపద కళలను పునరుద్ధరించడానికి కళాక్షేత్ర వంటి సంస్థలు దోహదం చేయగలవా? (AS6)
జవాబు:
చేయగలవు. కాని యివి డబ్బున్నవారికి, ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ఈ కళను అందివ్వగలవు. కాని యదార్థ వారసులకు మాత్రం అందివ్వలేవు. ఈ విధంగా కళాక్షేత్రం వంటి సంస్థలు మిశ్రమ ఫలితాలు యివ్వగలవు.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 9.
మీ ప్రాంతంలోని కళాకారులను కలిసి, వారు ప్రదర్శించే నాటకాలు, కళారూపాలతో పట్టిక తయారుచేయండి. (AS3)
జవాబు:

నాటకాలు, కళారూపాలు అంశం
పక్షి వలస పక్షుల జీవనం
అంతం – అంతం – అంతం (నాటిక) ఎయిడ్స్ పై అవగాహన
ఫోర్త్ మంకీ (నాటిక) ఉగ్రవాదంపై అవగాహన
తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపం
బుర్రకథ ప్రాచీన కళారూపం
చికాగో అడ్రస్ (నాటిక) స్వామి వివేకానంద పరిచయం

8th Class Social Studies 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు InText Questions and Answers

8th Class Social Textbook Page No.227

ప్రశ్న 1.
ప్రదర్శన కళల ఫోటోలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాటిలో ఎన్నింటిని మీరు గుర్తించగలుగుతారు? ఫోటోల కింద వాటి పేర్లు రాయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు 2

ప్రశ్న 2.
వీటిలో ఏదైనా మీ ఊళ్లో ప్రదర్శింపబడటం చూశారా? మీ అనుభవాన్ని తరగతిలో పంచుకోండి.
జవాబు:
ఒకసారి శ్రీరామనవమికి మా ఊరి పందిట్లో భారతి అనే ఒక స్త్రీ భారత నాట్యాన్ని ప్రదర్శించారు. అది చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్నది. ఆమె ముఖకవళికలు, అలంకరణ నాకు ఎంతో నచ్చాయి.

ప్రశ్న 3.
ప్రత్యేక సందర్భాలలో కుటుంబ సభ్యులు పాడేపాటలు, చేసే నాట్యాల గురించి మీ తల్లిదండ్రులతో, తాత, అవ్వలతో మాట్లాడి తెలుసుకోండి. సందర్భం, నమూనా పాటలతో ఒక జాబితా తయారు చేయండి. ఇటీవల కాలంలో ఈ ప్రదర్శనల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి? మీరు తెలుసుకున్న విషయాలు తరగతిలో మిగిలిన విద్యార్థులతో పంచుకోండి?
జవాబు:

సందర్భం నమూనా పాట
1. సంక్రాంతి, గొబ్బిళ్ళు 1. కొలను దోపరికి గొబ్బియల్లో యదుకుల సామికి గొబ్బియల్లో
2. బతుకమ్మ పండుగకు 1. బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలు ఆనటి కాలన ఉయ్యాలు
2. కలవారి కోడలు కలికి సుందరి కడుగు చుంది పప్పు – కడవలో పోసి వచ్చిరి వారన్నలు – వనములుదాటి
3. అట్లతద్దె, ఉండ్రాళ్ళ తద్దె ఒప్పులగుప్ప, ఒయ్యారిభామ సన్నబియ్యం – చాయపప్పు అట్లతద్దె ఆరట్లోయ్ ముద్దుపప్పు మూడట్లోయ్
4. హారతి పాటలు గైకొనవే హారతీ – గౌరీ పాహి అమ్మనాదుమనవి ఆలకించవమ్మా ఆ అర్ధనారీశ్వరి, అభయము నీయవే
5. దీపావళి 1. అమ్మా ! సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
2. దుబ్బు, దుబ్బు, దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి
6. దసరా దాండియా నృత్యం
7. భోగిమంటలు మంటచుట్టూ చప్పట్లు కొడుతూ నాట్యం , పాట ‘గోగులపూచే, గోగులుకాచే ఓ లచ్చా గుమ్మాడి పుత్తడి వెలుగులు చక్కగా విరిసే ఓ లచ్చా గుమ్మాడి.”

ఇటీవల కాలంలో చాలామంది వీటిని మోటుగా భావించి ఆచరించటం లేదు. కాని యింకా యివి మన రాష్ట్రంలో సజీవంగానే ఉన్నాయని చెప్పవచ్చును.

8th Class Social Textbook Page No.229

ప్రశ్న 4.
ఊరూరూ తిరిగే కళాకారులు ప్రదర్శించేవాటిని మీరు ఏమైనా చూశారా? వాళ్లు ఎవరు, ఏం చేశారు, ప్రేక్షకులు వాళ్లపట్ల ఎలా వ్యవహరించారు వంటి వివరాలను తోటి విద్యార్థులతో పంచుకోండి.
జవాబు:
మా ఊరిలో శివరాత్రికి కళ్యాణం చేసి తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుపుతారు. అందులో భాగంగా రామాయణంలో ‘లంకా దహనం’ ను తోలుబొమ్మలాటలో ప్రదర్శించారు. హనుమంతుడు ఎగురు తున్నట్లు, లంకను తగులబెట్టినట్లు, రావణుడి పదితలకాయలు, చెట్టుకింద సీతమ్మ తల్లి, ఎంత బాగా చూపించారో?

ప్రేక్షకులు అంతా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఆనందించారు. తోలు బొమ్మలను ఆడించినవారు ఒక గుంపుగా మా ఊరికొచ్చారు. 2 రోజులున్నారు. 7 గురు పెద్దవాళ్ళు 3 గురు పిల్లలు వచ్చారు. మా ఊరి వాళ్ళు వాళ్ళని ఆదరంగా చూశారు. కొందరు బియ్యం, పప్పులు, కూరగాయలు, కొందరు పాత బట్టలు, కొందరు డబ్బులు ఇచ్చారు. తరువాత వాళ్ళు మా పొరుగురుకు వెళ్ళారని మా అమ్మ చెప్పింది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 5.
అటువంటి కళాకారులు దగ్గరలో నివసిస్తూ ఉంటే వాళ్ళని కలుసుకొని వాళ్ల కళలు, జీవితాల గురించి తెలుసుకోండి.
జవాబు:
మా యింటి దగ్గర గంగాధరం గారి కుటుంబం నివసిస్తోంది. వాళ్ళయింట్లో గంగాధరం గారు, ఆయన కొడుకు బావమరిది ముగ్గురు బుర్రకథలు చెపుతారు. చుట్టుపక్కల ఊర్లలో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రభుత్వం వారు వీరిని పిలిపిస్తారు. దీని మీద వీరికొచ్చే ఆదాయం వీరికి సరిపోదు. అందుకని సంవత్సరం పొడుగునా వ్యవసాయ కూలీలుగా పని చేస్తారు. మధ్యలో కార్యక్రమాలున్నప్పుడు వాటికి వెళతారు. వీరు వీరగాథలు, అక్షరాస్యతమీద, కుటుంబ నియంత్రణ మీద బుర్రకథలు చెబుతారు.

8th Class Social Textbook Page No.233

ప్రశ్న 6.
జాతీయ ఉద్యమకాలంలో కళాకారుల పరిస్థితులలో, వాళ్ళు ఇచ్చే ప్రదర్శనలలోని అంశాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి?
జవాబు:
జాతీయ ఉద్యమం తరువాత స్వాతంత్ర్య భారతంలో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ కళలను ఆదరించేవారు కరువయ్యారు. రాజులు, జమీందారులు లేకపోవటం మూలనా వీరు అనాథలయ్యారు. ప్రజలకు అనేక రకాలైన వినోదాలు అందుబాటులోకి రావడం మూలంగా వీరి ప్రదర్శనలకి గిరాకీ తగ్గింది.

బుర్రకథ :
వీరు జాతీయోద్యమ కాలంలో అనేక వీరగాథలు, బ్రిటిషువారి అకృత్యాలు కంటికి కనబడేలా తెలియ చేసేవారు. కాని నేడు యివి ప్రభుత్వ ఆదరణలో అక్షరాస్యత, ఎయిడ్స్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

తోలు బొమ్మలాట :
వీరు పురాణ గాథలను ఎంచుకుని ప్రదర్శించేవారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా కళాకారులలోను, కళా ప్రదర్శనలలోను అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు 1

ప్రశ్న 7.
టీ.వీ, సినిమాలు ప్రధాన వినోద సాధనాలుగా మారుతున్న పరిస్థితుల్లో సంప్రదాయ జానపద కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందా? కారణాలు పేర్కొనండి.
జవాబు:
అవసరం ఉంది. మన పూర్వీకుల నుండి సంస్కృత, సంప్రదాయాలు మనకు వారసత్వంగా వచ్చాయి. ముఖ్యంగా జానపద కళల రూపంలో, అనేక వినోద సాధనాలు మన జీవితాల్లోకి వచ్చిన నేపథ్యంలో మనం వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జానపద కళలు, మన జాతికి గర్వకారణాలు కాబట్టి వానిని కూడా కాపాడుకోవాలి.

ప్రశ్న 8.
జాతీయవాదులు, కమ్యూనిస్టులు జానపద కళలను పునరుద్ధరించడానికి ఎందుకు ప్రయత్నించారు?
జవాబు:
జాతీయవాదం, సామ్యవాదం వంటి కథలను ఇతివృత్తాలను వారు చేపట్టడం వల్ల వారిని బ్రిటిషు వారు, నిజాం ప్రభువులు వేధించారు. పరదేశ కళలను వ్యతిరేకించి స్వదేశీ కళలను పునరుద్ధరించే ఉద్దేశ్యంతో జాతీయవాదులు కమ్యూనిస్టులు వీటిని ప్రోత్సహించారు.

8th Class Social Textbook Page No.234

ప్రశ్న 9.
దేవదాసీ వ్యవస్థను వ్యతిరేకించేవాళ్లు, సమర్థించేవాళ్ల మధ్య చర్చ జరుగుతోందని ఊహించుకోండి. ఇరువర్గాలు చేసే . వాదనలను పేర్కొనంది. ఈ చర్యతో ఒక చిన్న రూపకం తయారు చేయండి.
జవాబు:
రామప్ప పంతులు :
అయ్యో ! యిదేం వింత? తగుదునమ్మా అని ఈ వీరేశలింగం పంతులు గారు అన్ని విషయాల్లో చేసుకుంటున్నారు? ఏమండోయ్ గిరీశంగారు ! ఇది మహాచెడ్డ కాలం సుమండీ! లేకపోతే శుభప్రదంగా భగవంతునికి దాస్యం చేయడానికి జీవితాన్ని అంకితం చేస్తుంటే దాన్ని అమానుషం అంటారేంటండి? మీరైనా చెప్పండి ! యిలా ఈ దేవదాసీ విధానాన్ని ఆపడం పాపం కదండీ!

గిరీశం : ఏమండోయ్ రామప్ప పంతులుగారు ! నేను కూడా యాంటి-నాచ్చిలో ఉన్నానండోయ్ అది సరేగాని అదే పుణ్యమైతే మరి అందరి ఆడపిల్లల్ని పంపరేంటంట. యిది ఒక కులం వాళ్ళని, వాళ్ళ బలహీనతని భగవంతుడి పేరు చెప్పి ఉపయోగించుకోవడం అని మా అభిప్రాయం.

రామప్ప పంతులు :
అయితే మధురవాణి సంగతేంటంట? ఆమెనయితే నీవు …..

మధురవాణి : హ్పప్పు………. ఏం పంతులు బావగారు ! మధ్యలో నా పేరెత్తు తున్నారు. ఏంటి సంగతి. గిరీశం గారితో మళ్ళీ ఏవైనా గొడవలాంటిది.

రామప్ప పంతులు :
అబ్బెబ్బై … అహహ…. లేదు, లేదు మధురవాణి గిరీశం గారు యాంటి- నాచ్చి అంటుంటేనూ.

మధురవాణి : అవునండి ! గిరీశం బావగారు ఈ మధ్య మారిపోయారు. దేవదాసి విధానం మంచిది కాదని, దాని రద్దు చేయాలని, ప్రభుత్వానికి అర్టీలు కూడా పంపించారు. నిజంగానే దాని మూలంగా చాలామంది ఆడవాళ్ళు అజ్ఞాతంగా ఏడుస్తున్నారు. కాబట్టి నేను కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాను. మీ సంగతేమిటి?

రామప్ప పంతులు : అది నిజమే అనుకో. కానీ ……..

గిరీశం : డామిట్ ! కథ మళ్ళీ మొదటికే వచ్చింది. కానీ లేదు గీనీ లేదు. మళ్ళీ కనిష్టీబు గారిని పిలవమందురా?

రామప్ప పంతులు : హాహా బలే వాడివోయ్ గిరీశం నేనేదో ఆలోచిస్తూ కానీ అన్నాను. ఇంతమంది స్త్రీలు బాధపడితే నేను మాత్రం ఎలా సహిస్తాను. రేపటి నుంచి నేను కూడా మీతోపాటు యాంటి-నాచ్చి లోనే….

మధురవాణి : మంచిది బావగారు ఇకనుంచైనా ఇతరుల మేలుకోరి బతకండి.

రామప్ప పంతులు : అదే మరి … ఇక నుంచి నన్ను బావగారు అనకు మధురవాణి.

మధురవాణి : సరే సరే …
జై కందుకూరి – జైజై కందుకూరి

8th Class Social Textbook Page No.235

ప్రశ్న 10.
దేవదాసీ జీవితం గడపటం ఇష్టం లేని ఆ కుటుంబంలో పుట్టిన అమ్మాయి కష్టాలు ఊహించుకోండి. ఆమె తన మిత్రురాలికి తన వ్యధను వ్యక్తపరుస్తూ ఉత్తరం రాసినట్టు ఊహించుకుని ఆ ఉత్తరం మీరు రాయండి.
జవాబు:
ప్రియమైన మీనాక్షి,

ఎలా ఉన్నావు? ఇక్కడ నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. ఇంతవరకు నువ్వు నాకు తోడున్నావు. యిపుడేమో ఈ కష్ట సమయంలో వేరే ఊరు వెళ్ళిపోయావు. అందుకే ఉత్తరం ద్వారా నా బాధ నీకు తెలియపరుస్తాను.

నీకు తెలుసుగా చిన్నప్పటి నుండి నాకు చదువంటే ఎంతో యిష్టమని. ఈ మధ్య నేను చదువుకో కూడదని అమ్మా, నాన్న చాలాసార్లు అంటుండడం విన్నాను. కానీ కారణం యిపుడు తెలిసింది. నన్ను దేవదాసిని చేస్తారట. మా యిలవేల్పు అయిన ఎల్లమ్మ తల్లి ! కి నన్ను యిచ్చేస్తారుట. మా సాంప్రదాయాన్ని అనుసరించి నేను నృత్యం నేర్చుకుని దేవాలయంలో గజ్జ కట్టాలిట. నేను పెళ్ళి చేసుకోకూడదట. నన్ను ఎవరు కోరుకుంటే వారితోనే ఆ రోజు జీవితం గడపాలిట. నాకు బిడ్డలు పుడితే వారు కూడా యిలా గడపాల్సిందేట. ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసా మీనా ! నీకు తెలుసుగా నాకు ఇద్దరు చెల్లెళ్లు. అన్నలు, తమ్ములు లేరు. మేం అందరం పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే మా అమ్మా, నాన్నలను ఎవరు చూస్తారు. అందుకని పెళ్ళి చేయకుండా ఇలాచేస్తే వారి ముసలితనంలో వాళ్ళని నేను ఆదుకుంటానని వారి ఆశ.

నేను చదువుకుని ఉద్యోగం చేసి సంపాదించి చూస్తానని చెప్పినా వాళ్ళు వినటం లేదు. వచ్చే నెల మొదటి గురువారం ఉదయం ముహూర్తం పెట్టారు.

మీనా నాకు యిది యిష్టం లేదు. మీ మావయ్య పోలీసుగా పనిచేస్తున్నారుగా ! నాకు సాయం చేయవూ ! ప్లీజ్ ! ఆయన్ని తీసుకుని వచ్చి మా వాళ్లకి చెప్పి భయపెట్టవూ ! లేకుంటే నువ్వు సరేనని ఉత్తరం రాయి. బస్సెక్కి నీ దగ్గరకు వచ్చేస్తా, ఏదైనా హాస్టలులో ఉండి చదువుకుంటాను. ప్లీజ్ నాకు సహాయం చేయవూ !
ఇట్లు కన్నీళ్ళతో,
నీ నేస్తం,
అరుంధతి.

8th Class Social Textbook Page No.236

ప్రశ్న 11.
ఈ నాట్యాన్ని గౌరవ ప్రదమైనదిగా చేయటానికి అందులో ఎటువంటి మార్పులు చేసి ఉంటారు?
జవాబు:
ఈ నాట్యాన్ని గౌరవ ప్రదమైనదిగా చేయటానికి చేసిన మార్పులు :

  1. ఈ నాట్యాన్ని మొదటిగా మార్చినవారు తంజావూరుకు చెందిన నట్టువనార్ సుబ్బరామన్ కుమారులు నలుగురు. వీరు ముత్తుస్వామి దీక్షితర్ వారి సహకారంతో సాదిరను భరతనాట్యంగా మార్చారు.
  2. ఇది విద్యాధికులు, బ్రాహ్మణులచే కూడా నేర్వబడింది.
  3. దీని ప్రదర్శనలో ఉన్న అసభ్యకరమైన అంశాలన్నింటినీ మార్పు చేసి ఉంటారు.
  4. దీనిని ముఖ్యంగా భక్తి పూరితంగా ప్రదర్శించి ఉంటారు.
  5. దేవదాసీలు పూర్వం వలే వ్యభిచారంతో సంబంధం లేకుండా కళాకారులుగా నాట్యాన్ని ప్రదర్శించి ఉంటారు.
  6. మహిళలకు బదులు పురుషులు ఎక్కువ దీనిని నేర్చుకుంటారు.
  7. మ్యూజిక్ అకాడమీ వేదిక మీద చోటు దొరకటం దీనికి మరింత గౌరవాన్ని ఆపాదించింది.

AP Board 8th Class Social Solutions Chapter 21 ఆధునిక కాలంలో కళలు – కళాకారులు

ప్రశ్న 12.
ఈ నాట్యాన్ని పునరుద్ధరించడానికి ఇతర కులాలవాళ్లు దాన్ని హస్తగతం చేసుకోవటం ఎందుకు ముఖ్యమయ్యింది?
జవాబు:

  1. ఈ నాట్యం దేవదాసీలది.
  2. ఇది కొంత అసభ్యతతో కూడుకున్నది.
  3. తరువాత కాలంలో దేవదాసీ వ్యవస్థతోపాటు నాట్యం కూడా దురాచారంగా చూడబడింది.
  4. అందువల్ల దేవదాసీ నిషేధంతో ఈ కళ కూడా తుడిచిపెట్టుకుపోయింది.

ఈ వ్యతిరేక పరిణామాలన్నీ పక్కన పెట్టి నాట్యాన్ని కళగా చూడటానికి, ప్రదర్శించడానికి, అందరి ఒప్పుకోలు పొందడానికి ఇతర కులాలవాళ్ళు దాన్ని హస్తగతం చేసుకోవటం ముఖ్యమైంది.

ప్రశ్న 13.
ఒక వైపున సంప్రదాయంగా ఈ నాట్యం చేస్తున్న వాళ్లని దాంట్లో కొనసాగనివ్వలేదు. ఇంకోవైపున దానిని గౌరవప్రదంగా మార్చటానికి ఇతర కులాల వాళ్లు దానిని చేజిక్కించుకున్నారు. ఈ మార్పులలో ఏదైనా అన్యాయం జరిగిందా?
జవాబు:
నిజం చెప్పాలంటే భారతదేశంలో దేవదాసీ వ్యవస్థను నిర్మూలించినా అది ఇంకా అనధికారికంగా కొనసాగుతూనే ఉంది.

ప్రభుత్వం ఈ సంప్రదాయంలోని చెడుని నిషేధించి కళను కొనసాగించేలా వారిని ప్రోత్సహిస్తే బాగుండేది. కాని యిపుడు వ్యవస్థ మారలేదు, వారికున్న కళావారసత్వం మాత్రం దూరమయ్యింది. మరి ఈ మార్పులలో అన్యాయమే జరిగిందని చెప్పవచ్చు.

8th Class Social Textbook Page No.237

ప్రశ్న 14.
నట్టువనార్ల ప్రత్యేక పాత్ర ఏమిటి? వాళ్ల పాత్రను నాట్యం చేసే వాళ్లే చేపడితే భరతనాట్యం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది?
జవాబు:
నట్టువనార్లు దేవదాసీలకు పుట్టిన మగ సంతానంవారే తరవాతి తరం దేవదాసీలకు గురువులయ్యే వారు. వీరు తరతరాలుగా తమ సాంప్రదాయాలను కాపాడుకుంటే వచ్చారు. పునరుద్ధరణ సమయంలో ఇతర కులాల నుండి వచ్చిన వాళ్ళకు కూడా దేవదాసీలు, నట్టువనార్లే శిక్షణ నిచ్చారు. నట్టువనార్లు తమ శిక్షణ కార్యకలాపాలను మళ్ళీ ప్రారంభించగలిగారు. వీరి గ్రామాల పేర్లతో ప్రఖ్యాతి గాంచిన వైవిధ్య భరిత నాట్యరీతులు గుర్తింపు పొందాయి.

కాని ప్రస్తుత కాలంలో ఈ కళారూపానికి నట్టువనార్లు కాక నాట్యం చేసే వాళ్ళే సంరక్షకులుగా మారారు. దీనివలన నాట్య నాణ్యత బోధన దెబ్బ తింటోంది. నట్టువనార్ల వారసత్వం దెబ్బ తింటోంది. అంతేకాక నాట్యంలో అనేక కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. చేసుకుంటున్నాయి. ఇది నాణ్యతను ప్రాచీనతను దెబ్బ తీస్తోంది.

ప్రశ్న 15.
కళాక్షేత్ర వంటి ఆధునిక సంస్థలను ఏర్పాటు చేయటం వల్ల కళపైన, కళాకారులపైన ఎటువంటి ప్రభావం పడింది?
జవాబు:
కళాక్షేత్ర వంటి ఆధునిక సంస్థలను ఏర్పాటు చేయడం వలన కళకున్న అభ్యంతరాలన్నీ తొలగిపోయి అది జనాధారణ పొందింది. ఇది కళాకారులను, వాద్యకారులను ఆకర్షించింది. నాట్యం వినోదం స్థాయినుండి విద్య స్థాయికి ఎదిగింది.

కళాకారులు దీనికి ఆకర్షితులయ్యారు. కులంతో సంబంధం లేకుండా కళాభిరుచి ఉన్నవారందరూ అనేక ప్రదర్శనలు యిచ్చి కళకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. అంతేకాక తిరిగి వీరు శిక్షకులుగా మారి దీనిని, ముందుతరాలకు తీసుకుని వెళ్ళుచున్నారు.

ప్రశ్న 16.
భరతనాట్యానికి వచ్చిన విపరీత ప్రజాదరణ దానికి ఎలా తోడ్పడింది? ఏ కొత్త సమస్యలకు కారణమయ్యింది?
జవాబు:
తోడ్పాటు :
ఈ కళా రూపానికి నట్టువనార్లు కాకుండా నాట్యం చేసేవాళ్లు సంరక్షకులుగా మారారు. పునరుద్ధరణ కాలంలో నాట్యంలో శిక్షణనిచ్చిన నట్టువనార్లే ఆ వారసత్వానికి చెందిన ఆఖరి తరం. నాట్యం నేర్చుకోవాలని చాలామంది కోరుకుంటూ ఉండటం వల్ల శిక్షణ కేవలం నట్టువనార్లకు పరిమితం కాలేదు. కళాక్షేత్ర వంటి సంస్థలలో శిక్షకులుగా శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన నాట్యకారులు ముందుతరాలకు దీనిని నేర్పిస్తున్నారు. అంతేకాదు చాలామంది విద్యార్థులు నాట్యకారుల నుంచి వ్యక్తిగతంగా కూడా దీనిని నేర్చుకుంటున్నారు. ప్రదర్శనలలో నట్టువనార్లు పోషించిన పాత్రను ప్రత్యేక శిక్షణ పొందిన సంగీత వాయిద్యకారులు. నాట్యకారులు తీసుకున్నారు.

సమస్యలు :
భరతనాట్య ప్రదర్శనలో ఖర్చులు తగ్గించడానికి చాలామంది రికార్డు చేసిన సంగీతాన్ని ఉపయోగించాల్సి వస్తోంది. ప్రదర్శనల ద్వారా నేడు నాట్యకారులు జీవనోపాధిని సాధారణంగా పొందలేరు. కొన్ని మినహాయింపులు తప్పించి భరతనాట్యం ఈనాడు కుటుంబ మద్దతు ఉన్నవారికి రెండవ ఉపాధిగానే ఉంది. కొంతమంది మాత్రమే ఈ నాట్యం నేర్చుకోటానికి, నాట్యకారులుగా ఎదగటానికి తమ జీవితమంతా అంకితం చేయగలుగుతున్నారు. డబ్బులు సంపాదించటానికి నాట్యకారులు తమ వృత్తి జీవిత తొలి సంవత్సరాలలోనే దీనిని ఇతరులకు నేర్పటం మొదలు పెడుతున్నారు. ఇది వారి నాట్య నాణ్యతనే కాకుండా వారి బోధనను కూడా ప్రభావితం చేస్తుంది.

నట్టువనార్లు లేకుండా మరింతమంది నాట్యకారులు బోధకులుగా మారటంతో తరతరాలుగా సంప్రదాయంగా నాట్యరూపాన్ని కాపాడుతూ వచ్చిన వారసత్వానికి తెరపడింది. కొంతమంది శిక్షకుల చేతిలో కాకుండా అనేకమంది నాట్యకారులు భరతనాట్యాన్ని బోధించటం వల్ల దీంట్లో కొత్త కొత్త మార్పులు వచ్చే అవకాశాలు పెరిగాయి.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

SCERT AP 8th Class Social Study Material Pdf 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు

8th Class Social Studies 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
శాసనసభలో చట్టాలు చేసేటప్పుడు దానిపై వివిధ దృష్టి కోణాల నుంచి ఎంతో చర్చ జరుగుతుంది. 1950లలో భూసంస్కరణల చట్టంపై వివిధ అభిప్రాయాలు ఏమై ఉంటాయి ? ఏ దృష్టి కోణం బలంగా ఉండి ఉంటుంది? (AS1)
జవాబు:
వివిధ అభిప్రాయాలు :

  1. జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలి.
  2. నష్టపరిహారంగా వీరికి ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించాలి.
  3. పేదలకు భూమిని పంచాలి.
  4. కౌలుదార్లను స్వంతదారులుగా మార్చాలి.
  5. వెట్టి / బేగారను రూపుమాపాలి.
  6. అటవీ, బంజరు భూములపై నియంత్రణ సాధించి పేదలకు పంచాలి.
  7. శిస్తు వసూలు అధికారం ప్రభుత్వానికి ఉండాలి.
  8. భూస్వామ్య దోపిడీ నుండి సామాన్య రైతులను రక్షించాలి.

బలమైన దృష్టికోణం :
గ్రామీణ పేదరిక నిర్మూలన అనే దృష్టి కోణం బలీయంగా ఉండి ఉంటుంది.

ప్రశ్న 2.
1970లలో భూ పరిమితి చట్టాలు చేసినప్పుడు ఎటువంటి అభిప్రాయాలు ఉండి ఉంటాయి? (AS1)
జవాబు:

  1. దేశంలోని సంపద ఒక చోటే కేంద్రీకృతమై ఉంది.
  2. చాలామంది రైతులు చిన్నచిన్న కమతాలను కలిగియున్నారు.
  3. దళితులు భూమిలేని వారై ఉన్నారు.
  4. పశువుల కొట్టాలు, భవనాలు మొదలైనవన్నీ భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి.
  5. జమీందారులు భూస్వాములుగానూ, భూస్వాములు పారిశ్రామికవేత్తలుగానూ మారారు.
  6. ఈ అవకతవకలన్నింటినీ సరిచేయాలనే భావన ఉండి ఉంటుంది.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 3.
ఈ సంస్కరణల వల్ల రైతాంగ మహిళలు ఏమైనా లబ్ది పొందారా ? కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
రైతాంగ మహిళలు కొంతవరకు లబ్ధి పొందారని చెప్పవచ్చు.

కారణాలు:

  1. కొంతమంది మిగులు భూములను భార్యల, కూతుళ్ళ, కోడళ్ళ పేరు మీదకు బదిలీ చేసి వారిని ఆస్తిదారులను చేశారు.
  2. ఉత్తుత్తి విడాకులు ఇచ్చుకుని భార్యాభర్తలు రెండు కుటుంబాలుగా మారిపోయారు. ఈ రకంగా కూడా మహిళలు ఆస్తి పరులయ్యారు.
  3. మహిళలు కూడా తమ భర్తలతో పాటు యజమానుల పొలాలలో పనిచేసేవారు. ఈ చట్టాల వలన స్వంత పొలాలలో పని, వాటిపై అజమాయిషీ చేయగలుగుతున్నారు.

ప్రశ్న 4.
అన్ని వర్గాల రైతాంగానికి పెట్టి ఎందుకు సమస్యగా ఉంది? భూస్వాములు తమ భూములను సాగుచేయడానికి ప్రస్తుతం ఏం చేస్తూ ఉండి ఉంటారు? (AS6)
జవాబు:
‘వెట్టి’ మానవత్వానికి మాయని మచ్చ వంటిది. దీనికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు జరిగాయి. కాబట్టి ఇది అన్ని రకాల రైతాంగానికి ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం పూర్వకాలం నాటి భూస్వాములు లేరు. ఉన్నవారు పాలేర్లను, కూలీలను నియమించుకుని భూములను సాగు చేస్తున్నారు.

ప్రశ్న 5.
మీరు ఒక కౌలుదారు. భూ సంస్కరణ చట్టాల వల్ల మీకు భూమి లభించింది. అప్పుడు మీ అనుభవాలను గురించి వ్రాయండి. (AS4)
జవాబు:
“నాకు ఈ చట్టం వలన 4 ఎకరాలు భూమి లభించింది. దీనికోసం నేను కొద్ది మొత్తం చెల్లించాను. ఇప్పటి వరకు నేను, నా భార్యా, పిల్లలు అందరూ మా దొరగారి పొలంలో పని చేయాల్సి వచ్చేది. కానీ నేటి నుండి ఈ పొలానికి నేనే యజమానిని. నా కుటుంబం అంతా ఈ పొలంలోనే చెమటోడ్చి, శ్రమించి పండిస్తాము. మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాము. స్వేచ్ఛా వాయువులు మమ్మల్ని పరవశింపచేస్తున్నాయి.”

ప్రశ్న 6.
భూసంస్కరణల చట్టం సమయంలో మీరు ఒక భూస్వామి అని ఊహించుకోండి. అప్పుడు మీ భావాలు, చర్యలు ఎలా ఉంటాయో రాయండి. (AS4)
జవాబు:
“అయ్యో ! ఈనాడు ఎంత దుర్దినం. నా 4000 ఎకరాల భూమిని కోల్పోవలసివచ్చింది. నేటి వరకు నా యిల్లు ధాన్యం తోటి నౌకర్లు, చాకర్లు, వెట్టివారితోటి కళకళలాడుతూ ఉండేది. ఇవ్వాళ ఎన్నో అబద్దాలాడి కేవలం 150 ఎకరాలు . మిగుల్చుకోగలిగాను. నా దేశానికి స్వాతంత్ర్యం రావడం ఆనందమే అయినా, నేను మాత్రం చాలా నష్టపోయాను. అధికారమూ, ఆస్తులు లేకుండా మేమెలా జీవించాలి?”

ప్రశ్న 7.
రైతులు ఇష్టం వచ్చినప్పుడు తొలగించగల కౌలుదార్లకు భూసంస్కరణల వల్ల వాస్తవానికి నష్టం జరిగిందని చాలామంది అభిప్రాయపడతారు. దీనితో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలు తెల్పండి. (AS1)
జవాబు:
ఇది కొంతవరకు ఏకీభవించదగ్గ విషయమే. కారణాలు:

  1. ప్రభుత్వం చెల్లించమని నిర్ణయించిన వెలను చెల్లించి కొంతమంది కౌలుదారులు భూయజమానులయ్యారు.
  2. చట్టబద్ద గుర్తింపు లేని వారు ఎటువంటి ప్రయోజనం పొందలేదు.
  3. జమీందారులు ‘ఖుదా కాస్తే’ను అడ్డం పెట్టుకుని, చాలావరకు భూమిని సొంత సాగులోనే చూపించారు.
  4. కౌలుదార్లను పెద్ద ఎత్తున తొలగించి భూమిని జమీందారులు తమ సొంత సాగులోనికి తెచ్చుకున్నారు.

ప్రశ్న 8.
ప్రభుత్వం సమర్థవంతమైన చట్టాలు చేసినా భూ పరిమితి చట్టాన్ని సమర్థంగా ఎందుకు అమలు చేయలేకపోతుంది? (AS1)
జవాబు:
ప్రభుత్వం సమర్ధవంతమైన చట్టాలు చేసినా, భూస్వాముల పన్నాగాల వల్ల, ప్రభుత్వానికి అంతగా రాజకీయ నిబద్ధత లేనందువల్ల ఈ చట్టం సరిగా అమలు కాలేదు.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 9.
భూదాన ఉద్యమస్ఫూర్తి “భూస్వామ్యాన్ని అంతం చేయడం”లో, “దున్నేవానికే భూమి ఇవ్వటం”లో ఎందుకు విఫలమైంది? (AS1)
జవాబు:
ఈ ఉద్యమంలో భూస్వాములు తమంతట తామే భూములను దానంగా ఇవ్వాలి. అంతటి ఔదార్యం అందరికీ ఉండదు. ఇచ్చినవారు కూడా బంజరు, బీడు భూముల్నే ఇచ్చారు కానీ, సారవంతమైన వాటిని ఇవ్వలేదు. సారవంతమైనవి ఎక్కువ భూస్వాముల దగ్గరే ఉండటం మూలాన ఇది భూస్వామ్యాన్ని అంతం చేయలేకపోయింది. దున్నేవానికి భూమి ఇవ్వలేక పోయింది.

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పటంలో (నల్గొండ) యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి గ్రామాన్ని గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు 1

ప్రశ్న 11.
“స్వాతంత్ర్యం వచ్చే నాటికి గ్రామీణ పేదరికం” అనే శీర్షిక కింద మొదటి పేరా చదివి ఈ కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (AS2)

స్వాతంత్ర్యం వచ్చేనాటికి భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో కడు పేదరికం ఒకటి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరీ ఎక్కువ. గ్రామీణ జనాభాలో సగానికంటే ఎక్కువ మంది (65 శాతం), అంటే 18:6 కోట్ల జనాభా తీవ్ర పేదరికంలో ఉందని అంచనా. వాళ్లకు భూమి వంటి వనరులు ఏవీ అందుబాటులో లేవు, కనీస ఉపాధి పొందటానికి ఉపయోగపడే చదువు లేదు. వాస్తవానికి ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. చాలా తక్కువ కూలీ దొరికే వ్యవసాయ పని మాత్రమే వాళ్లకు దొరికేది. వ్యవసాయదారుల్లో అధిక శాతానికి ఎటువంటి సొంత భూమిలేదు. వాళ్లలో కొంతమంది భూస్వాములకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసేవారు. భూస్వాముల పొలాల్లో వీళ్లు కూలీ లేకుండా పని చేయాల్సి వచ్చేది. కరవు కాటకాలు, రోగాలు తరచు సంభవిస్తూ వినాశనాన్ని సృష్టించేవి. ఆకలి ఎప్పుడూ వాళ్లని వెంటాడుతూనే ఉండేది.
ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడ్డాయా? ఎలా?
జవాబు:
ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పవచ్చు. వీరు వ్యవసాయ పనులకే కాక ఇతర పనులకు కూడా వెళుతున్నారు.
ఉదా :
పారిశ్రామిక పనులు, రోడ్డు పనులు, అనేక రకాలైన చేతివృత్తులు మొదలైనవి. వీరు ప్రస్తుతం విద్యను కూడా అభ్యసిస్తున్నారు. నేడు వ్యవసాయ కూలీలకు మంచి డిమాండు ఉన్నది. కాబట్టి వీరి పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పవచ్చును.

8th Class Social Studies 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు InText Questions and Answers

8th Class Social Textbook Page No.185

ప్రశ్న 1.
“దున్నేవానికి భూమి” అన్న నినాదంతో కౌలుదారులకు భూమి లభిస్తుంది. మరి కూలికి పనిచేసే వ్యవసాయ కూలీల . పరిస్థితి ఏమిటి?
జవాబు:
కౌలుదార్ల పరిస్థితి కొంత బాగవుతుంది. కాని వ్యవసాయ కూలీల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు ఉంటుంది. వారి పరిస్థితి నేటికీ అలాగే ఉందని మనం భావించవచ్చు.

ప్రశ్న 2.
గ్రామీణ పేదలకు ఆదాయం వచ్చే ఉపాధి కల్పించడానికి ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయని నీవు భావిస్తున్నారా?
జవాబు:
నేటికాలంలో అయితే అనేక మార్గాలున్నాయి. కానీ నాటి కాలంలో ఉపాధి మార్గాలు తక్కువగానే ఉన్నాయి. బ్రిటిషు వారు మనదేశంలో వృత్తి, ఉపాధుల మీద దెబ్బకొట్టారు. ఉన్న కొన్ని అవకాశాలు కూడా చేయిజారి పోయాయి. కాబట్టి ఇంక వేరే ఏ మార్గాలు లేవని నేను భావిస్తున్నాను.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 3.
మీ ప్రాంతంలో నలుగురు వ్యక్తులున్న ఒక కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపటానికి ఎన్ని ఎకరాల భూమి ఉంటే సరిపోతుంది?
జవాబు:
మా ప్రాంతంలో నలుగురు వ్యక్తులున్న ఒక కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపడానికి 8 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి, 30 ఎకరాలు నీటి వసతి లేని భూమి ఉంటే సరిపోతుంది.

8th Class Social Textbook Page No.186

ప్రశ్న 4.
భూ సంస్కరణ చట్టాలు భూస్వాములకు సహాయం చేయటానికి ప్రయత్నించాయని కొంతమంది అంటారు. మీరు వాళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
నేను వారితో ఏకీభవిస్తాను. జమీందారులకు నష్టపరిహారం చెల్లించడం, ఖుద్ కాస్త లకు వారినే యజమానులుగా కొనసాగించడం మొదలైనవి ఈ వాదనను బలపరుస్తున్నాయి.

ప్రశ్న 5.
భూ సంస్కరణ చట్టాలు భూమినీ, అధికారాన్ని సంపన్న కౌలు రైతులకు మాత్రమే బదిలీ చేయటానికి ప్రయత్నించాయని కొంతమంది అంటారు. మీరు వాళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. నేను వారితో ఏకీభవిస్తాను.

ప్రభుత్వం కౌలుదారులకు భూమిని ఇవ్వడానికి కొంత మొత్తాన్ని వెలగా నిర్ణయించింది. ఇది చెల్లించిన వారు మాత్రమే వీరు తాము సాగుచేసే భూమిని పొందగలిగారు. చెల్లించలేని పేదవారు కూలీలుగానే మిగిలిపోయారు.

ప్రశ్న 6.
వివిధ గ్రామీణ వర్గాల ప్రయోజనాల మధ్య సమతౌల్యం సాధించటానికి అంతర్గత ఘర్షణలు తగ్గించే ఉద్దేశంతో ఈ చట్టాలు ప్రయత్నించాయని మరికొంతమంది అభిప్రాయం. మీరు వాళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. ఏకీభవిస్తాను.

ఈ చట్టాల వల్ల జమీందారులు భూస్వాములు గానూ, కొంతమంది కౌలుదారులు స్వంతదారులుగాను కొంతమంది పేదలు బంజరు భూముల యజమానులుగాను మారారు. దీనివల్ల ఘర్షణలు కొంతవరకు తగ్గాయని చెప్పవచ్చు.

ప్రశ్న 7.
ఈ చట్టాల వల్ల ఎవరు ఎక్కువ లాభపడ్డారు? ఎవరు అస్సలు లాభపడలేదు ? భూస్వాములు చాలా నష్టపోయారని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
ఈ చట్టాల వలన జమీందారులు ఎక్కువ లాభపడ్డారు. కారణం

  1. వీరికి ఆదాయం పోయినా, అంతకు 20, 30 రెట్లు నష్టపరిహార రూపంలో లభించింది.
  2. ఖుదా కాలు కూడా వీరి ఆధీనంలోనే ఉన్నాయి.
  3. చట్టంలోని లొసుగులను ఉపయోగించి ఎక్కువ భూములను నియంత్రణలోనికి తెచ్చుకున్నారు.
    ఈ చట్టాల వల్ల అస్సలు లాభపడని వారు పేద వ్యవసాయ కూలీలు.

కారణం :
వీరు గుర్తింపు లేక వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోయారు.

8th Class Social Textbook Page No.189

ప్రశ్న 8.
వివిధ సంస్కరణల వల్ల తెలంగాణలో ఏ వర్గాల రైతాంగం లబ్ధి పొందింది? ఏ రకంగా లబ్ధి పొందింది?
జవాబు:
వివిధ సంస్కరణల వల్ల తెలంగాణలో భూస్వామ్య, ఆధిపత్య కులాల రైతాంగం లబ్ది పొందింది.

  1. జాగీర్దారీ రద్దు వల్ల ఈ జాగీర్లలో భూమిని సాగు చేస్తున్న ఆధిపత్య కులాలకు ఈ భూముల మీద పట్టాలు లభించాయి.
  2. జాగీర్దార్లు నష్టపరిహారంగా కొట్లు సంపాదించారు.
  3. పెద్ద పెద్ద భవనాలు, పశువుల కొట్టాలు, వ్యవసాయ పరికరాలు భూస్వాముల ఆధీనంలోనే ఉన్నాయి.
  4. వేలాది ఎకరాలు ఖుద్ కాఫ్ కింద ఉండిపోయాయి.
    ఈ రకంగా భూస్వామ్య వ్యవస్థ లబ్ధి పొందిందని చెప్పవచ్చు.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 9.
భూమిలేని వృత్తి కులాలవారికి ఈ సంస్కరణల వల్ల ఏ మేరకు ప్రయోజనం కలిగింది?
జవాబు:
ఈ సంస్కరణల వలన వీరికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు.

ప్రశ్న 10.
భూస్వాములు ఎంత నష్టపోయారు? తమ ప్రయోజనాలను ఎంతవరకు కాపాడుకోగలిగారు?
జవాబు:
భూస్వాములు ఏమీ నష్టపోలేదని చెప్పవచ్చును. అనేక చట్టాలను సరిగా అమలుచేయలేదు. వీటి అమలులో జాప్యం వల్ల భూస్వాములు వీటిని తమ ప్రయోజనానికి వాడుకున్నారు. కౌలుదారీ చట్టాలలోని లొసుగులను ఆధారంగా చేసుకుని జమీందారులు కౌలుదారుల నుంచి భూములను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. జమీందారీల రద్దు తరువాత వాళ్లు ఆ భూములన్నీ తమవేనంటూ పెద్ద పెద్ద భూస్వాములుగా మిగిలారు. ఈ భూములను పరిశ్రమలు నెలకొల్పటానికి మళ్లించారు. ఉదాహరణకు చల్లపల్లి జమీందారు పంచదార కర్మాగారం కింద 2650 ఎకరాలు చూపించాడు. కాలక్రమంలో వీళ్లు ఆంధ్రలో పారిశ్రామికవేత్తలుగా మారారు. తెలంగాణలో వీళ్లు 21వ శతాబ్దంలో సైతం తమ పెత్తనాన్ని కొనసాగించారు.

ప్రశ్న 11.
కింది పట్టికను గమనించి ఖాళీలను పూరింపుము.
AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు 2

పట్టికను చదవటం :
1955-56కు సంబంధించిన గణాంకాలను జాగ్రత్తగా చదవండి. భూ సంస్కరణల తరవాత 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న సన్నకారు రైతులు 58 శాతంగా ఉన్నారు. రైతుల సంఖ్యలో సగం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ల కింద 20 శాతం కంటే తక్కువ సాగుభూమి ఉంది. ఇంకొకవైపున 10 శాతంగా ఉన్న పెద్ద రైతులు, భూస్వాముల కింద మొత్తం సాగుభూమిలో 38 శాతం ఉంది.

భూ సంస్కరణలు అమలు జరిపిన తరువాత 1970 దశకంలో చాలా మార్పులు వచ్చాయి. సన్నకారు రైతులు 58% నుండి 83% వరకు పెరిగారు. చిన్న రైతులు 32% నుండి 16% కు తగ్గారు. కాని వారు గతం కంటే కొంచెం ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు. పెద్ద రైతులు 10% నుండి 1% కు తగ్గారు. వారి ఆధీనంలోని భూమి కూడా 38% నుండి 6% కి తగ్గింది.

8th Class Social Textbook Page No.190

ప్రశ్న 12.
ఈ చట్టాన్ని 1950లలోనే అమలు చేసి ఉండాల్సిందని చాలామంది భావిస్తారు. అయితే దీనివల్ల చాలా వ్యతిరేకత వచ్చి ఉండేదని కొంతమంది అభిప్రాయం. ఈ రెండు అభిప్రాయాల గురించి తరగతిలో చర్చించండి. మీరు దేనితో ఏకీభవిస్తారు?
జవాబు:
1950లో అమలుచేయటం నిజంగానే కష్ట సాధ్యం అయ్యేది. ఒకేసారిగా అందరి నుండి అంతంత భూమిని తీసుకున్నట్లయితే స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలోనే దేశ అంతర్గత పరిస్థితి అస్తవ్యస్తమయ్యేది. దీనివల్ల వ్యతిరేకత కూడా వచ్చి ఉండేది. కాని నాడు ‘ఉక్కు మనిషి’ అని పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి నాయకులున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యలను త్వరలోనే అధిగమించగలిగేది. కాబట్టి అప్పుడు అమలుచేసి ఉండాల్సిందని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 13.
భూ పరిమితి చట్టం ఆంధ్రప్రదేశ్ లోనూ, పశ్చిమ బెంగాల్ లోనూ అమలు అయిన విధానాన్ని పోల్చండి. చట్టాన్ని సమర్ధవంతంగా ఎలా అమలు చేయాలో చర్చించండి.
జవాబు:
భూ పరిమితి చట్టం ఆంధ్రప్రదేశ్ లో చాలా అధ్వాన్నంగా అమలు అయిందని చెప్పవచ్చు. అనేకమంది భూస్వాములు అధికారుల ముందు తప్పుడు ప్రకటనలు చేసి, అదనపు భూమిని వెల్లడి చేయలేదు. చట్టం వస్తుందని ముందుగానే తెలిసిన అనేకమంది భూస్వాములు తమ భూములను దగ్గర బంధువులు, స్నేహితులు, జీతగాళ్ళ పేరు మీద కూడా బదిలీ చేశారు. భార్యాభర్తలను వేరువేరు కుటుంబాలుగా చూపించటానికి కోర్టుల ద్వారా ఉత్తుత్తి విడాకులు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చట్టం ప్రకారం అదనపు భూమి ఉన్న రైతులు కూడా తమ భూములను కాపాడుకుని మిగులు భూమిని చూపించలేదు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మిగులు భూమిలో చాలా వరకు సాగుకు పనికిరానిదిగా ఉంది. భూపరిమితి చట్టాలను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్ ఒకటి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కృతనిశ్చయంతో వ్యవహరించి సన్నకారు రైతులు, భూమిలేని పేదలను సమీకరించి భూ పరిమితి చట్టాలు అమలు అయ్యేలా చూసింది. ఇది సరిగా అమలు కావాలంటే రాజకీయ నాయకులకు, అధికారులకు, ప్రజానీకానికీ కూడా నిబద్ధత ఉండాలి.

ప్రశ్న 14.
భూ పరిమితి చట్ట అవసరం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
1950 నుండి ఎన్ని రకాల చట్టాలు చేసినా అవి భారతదేశంలోని భూమి యాజమాన్య పరిస్థితులను మార్చలేకపోయాయి. జమీందారులను భూస్వాములు గాను, భూస్వాములు పెద్ద రైతులు గాను మారారు తప్ప సామాన్య ప్రజానీకానికి, పేదవారికి ఒరిగినదేమీ లేదు. భూమి అంతా కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోయింది. అందువలన భూ పరిమితి చట్టం అవసరం ఏర్పడింది.

ప్రాజెక్టు

అయిదుగురు విద్యార్ధుల చొప్పున బృందాలుగా ఏర్పడి, మీ ప్రాంతంలోని కొంతమంది పెద్దలతో భూ సంస్కరణల అమలులో వాళ్ల అనుభవాల గురించి అడగండి. ఈ పాఠంలో పేర్కొన్న అంశాలు మీ ఊల్లో కూడా జరిగాయేమో తెలుసుకోండి. దీనిపై ఒక నివేదిక తయారుచేసి తరగతిలో చర్చించండి.
జవాబు:

నివేదిక

మా ప్రాంతంలో దాదాపు 15 మంది పెద్దలను మేము అనుభవాలు అడిగి తెలుసుకున్నాము. ఈ భూ సంస్కరణల అమలులో కొద్దిమంది. బికారులు అయిపోయారట. కొద్దిమంది తప్పించుకున్నారట. రాత్రికి రాత్రి చట్టం గురించి తెలిసిన వారు ఆస్తిని బంధువులు, పాలేర్లు అందరి పేర్ల మీద మార్చి తమ భూములను కాపాడుకున్నారు. విషయం తెలియని వారు వారి భూమిని, ఆస్తిని పోగొట్టుకున్నారని వాపోయారు. మొత్తం మీద ఇది కొంతమందికి ఉపశమనాన్ని, కొంతమందికి దుఃఖాన్ని మిగిల్చింది.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

SCERT AP 8th Class Social Study Material Pdf 20th Lesson లౌకికత్వం – అవగాహన Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 20th Lesson లౌకికత్వం – అవగాహన

8th Class Social Studies 20th Lesson లౌకికత్వం – అవగాహన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ పరిసర ప్రాంతాలలో వివిధ మత ఆచారాల జాబితా తయారుచేయండి – రకరకాల ప్రార్థనలు, దేవుడిని కొలిచే విధానాలు, పవిత్ర స్థలాలు, భక్తి పాటలు, సంగీతం మొదలైనవి. మత ఆచరణ స్వేచ్ఛను ఇది సూచిస్తోందా? (AS3)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన 1

ప్రశ్న 2.
మా మతం శిశుహత్యలను అనుమతిస్తుంది అని ఒక మత ప్రజలు అంటే ప్రభుత్వం అందులో జోక్యం చేసుకుంటుందా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
చేసుకుంటుంది అని కచ్చితంగా చెప్పవచ్చు.
కారణాలు :

  1. భారతదేశ లౌకికవిధానం మతాలలో జోక్యం చేసుకుంటుంది.
  2. ఈ జోక్యం రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉంటుంది.

ప్రశ్న 3.
ఒకే మతంలో భిన్న దృక్పథాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను సేకరించండి. (AS1)
జవాబు:
మనం దీనికి ఉదాహరణగా బౌద్ధమతంను తీసుకుందాము.

బుద్ధుని బోధనలను అనుసరించేవారిని బౌద్ధులు అని అంటాము. వీరు ఆచరించే విధానాలను బౌద్ధమతం అని చెప్పుకుంటాము. అయితే దీనిలో 3 రకాల దృక్పథాలు ఉన్నాయి.

  1. తేరవాదం
  2. మహాయానం
  3. వజ్రయానం

1) తేరవాదం :
తేరవాదులు ఎవరికి వారే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని నమ్ముతారు.

2) మహాయానం :
వీరు ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నిస్తూనే ఇతరులకు కూడా ఆ స్థాయి రావడానికి సహాయం చేయాలని భావిస్తారు.

3) వజ్రయానం :
ఇతరులకు సహాయం చేయటమేకాక వారిని ఆ స్థాయికి తేవడానికి తగిన శక్తిని కలిగి ఉండాలని భావిస్తారు.

ఈ విధంగా ఒకే మతంలో విభిన్న దృక్పథాలు ఉంటాయి.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 4.
భారత రాజ్యం మతానికి దూరంగా ఉంటుంది. మతంలో జోక్యం చేసుకుంటుంది. ఈ భావన గందరగోళం సృష్టించవచ్చు. ఈ అధ్యాయంలో ఇచ్చిన ఉదాహరణలతో పాటు మీకు అనుభవంలోకి వచ్చిన / తెలిసిన ఇతర ఉదాహరణలతో దీనిని మరోసారి చర్చించండి. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగం లౌకిక విధానాన్ని అవలంబిస్తూనే మత విధానాలలో జోక్యం చేసుకుంటుంది. ఈ జోక్యం రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉంటుంది.
ఉదా :

  1. హిందూమతంలోని ‘అంటరానితనాన్ని’ నిషేధించింది.
  2. భారతదేశ ముస్లిం మహిళలు వారి మతధర్మం ప్రకారం విడాకులు పొందినా, భారతదేశంలో కోర్టుకు వెళ్ళినట్లయితే వారికి భరణం ఇవ్వాల్సిందిగా నిర్దేశించినది. (షాబానోకేసు)
  3. శిశు విద్యా మందిరం, ఆర్.సి.యం పాఠశాలలు, ఉర్దూ పాఠశాలలు మొదలగునవి మతపరమైన విద్యాలయాలు అయినా వాటికి ప్రభుత్వం ఆర్ధిక మద్దతు అందిస్తుంది.
  4. అదే విధంగా వారసత్వంలో సమాన ఆస్తిహక్కును కాపాడటానికి ప్రజల మత ఆధారిత పౌర చట్టాలలో రాజ్యం జోక్యం చేసుకోవలసిరావచ్చు.
  5. మన ప్రభుత్వం తరఫున ఒంటిమిట్ట రాములవారి కళ్యాణానికి ప్రభుత్వ లాంఛనాలతో ముత్యాలు, పట్టువస్త్రాలు మొదలైనవి పంపుతారు. వీటిని ముఖ్యమంత్రి లేదా ఒక మంత్రిస్థాయిలోని వారు తీసుకుని వెళతారు.
  6. రంజాన్ మాసంలో ప్రభుత్వ శాఖలలో పనిచేసే ముస్లింలకు నమాజుకు ప్రభుత్వం సమయం కేటాయిస్తూ పనివేళలు మారుస్తుంది.

ఈ విధంగా మన రాజ్యాంగం లౌకికంగానే ఉంటూ మతపరమైన విషయాలలో జోక్యం చేసుకుంటుంది.

ప్రశ్న 5.
లౌకికవాదం అంటే ఏమిటి ? అన్న భాగం చదివి దానిపై వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:

  1. ప్రభుత్వంలో మతవరమైన జోక్యం లేకపోవడాన్ని లౌకికవాదం అంటారు.
  2. భారతదేశం లౌకికంగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది.
  3. అందుచే అది మతానికి దూరంగా ఉంటుంది.
  4. ఆధిపత్య నివారణకు, జోక్యం చేసుకోకుండా ఉండటం అన్న విధానాన్ని అనుసరిస్తుంది.
  5. అవసరమైతే భారత రాజ్యం మతంలో జోక్యం చేసుకుంటుంది.

8th Class Social Studies 20th Lesson లౌకికత్వం – అవగాహన InText Questions and Answers

8th Class Social Textbook Page No.223

ప్రశ్న 1.
ఈ అధ్యాయానికి పైన ఉన్న పరిచయాన్ని మరొకసారి చదవండి. ఈ సమస్యకు ప్రతీకార చర్య సరైనది ఎందుకు కాదు? వివిధ బృందాలు ఈ పద్ధతిని అనుసరిస్తే ఏమవుతుంది?
జవాబు:
పై పేరాను చదివిన తర్వాత ప్రతీకార చర్య సరైనది కాదు. ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామిక, లౌకికవాద దేశం. సంస్కృతి, సాంప్రదాయాలకు, మత సామరస్యానికి ప్రతీక. అలా చేయడం వలన మత విద్వేషాలు పెరుగుతాయి. అధికులు ఎక్కువగా ఉన్న మతవాదులు, అల్పజన మతంపై దాడులు చేస్తే మత స్వేచ్ఛకు భంగం కలిగి, భారతదేశం లాంటి శాంతి కాముక దేశ ఆదర్శవాదం దెబ్బతింటుంది.

8th Class Social Textbook Page No.224

ప్రశ్న 2.
ఒకే మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చా ? తరగతిలో చర్చించండి.
జవాబు:
ఒకే మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చు. ప్రపంచంలో చాలా మతాలలో భిన్న దృక్పథాలు ఉన్నవే ఉన్నాయి.
ఉదా :
వీటినన్నింటిని పరిశీలించినట్లయితే అన్ని ముఖ్యమైన మతాలలో భిన్న దృక్పథాలు ఉన్నాయని తెలుస్తోంది.

8th Class Social Textbook Page No.225

ప్రశ్న 3.
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే భారత లౌకికవాదం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే ప్రభుత్వాలు మతంతో ఏమాత్రం జోక్యం చేసుకోవు. కానీ భారత లౌకిక విధానం మతాలతో జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా ఇది ఇతర ప్రజాస్వామిక దేశాలతో భిన్నమైనది.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

8th Class Social Textbook Page No.226

ప్రశ్న 4.
ఇటీవల కాలంలో భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా, రాజ్యాంగంలోని లౌకిక ఆదర్శాలు ఉల్లంఘింపబడిన ఘటనలు విన్నారా? మతం కారణంగా వ్యక్తులు వేధింపబడి, చంపబడిన ఘటనలు విన్నారా?
జవాబు:
ఇటీవల కాలంలో అంటే 11 సంవత్సరాల క్రితం 2002 లో ఇటువంటి ఘటనలు జరిగాయని మా పెద్దలు చెప్పుకోగా విన్నాము.

ఫిబ్రవరి 22వ తేదీ, 2002 ….

కొంతమంది రామభక్తులు అయోధ్య వెళ్ళి తిరిగి వస్తున్నారు. గుజరాత్ లో ‘గోద్రా’ రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే వీరి భోగీలపై ఒక ముస్లింల గుంపు దాడిచేసి కంపార్టుమెంటును తగులబెట్టారు.

ఇందులో 58 మంది హిందువులు ఉన్నారు. వీరిలో 25 మంది స్త్రీలు, 15 మంది పిల్లలు ఉన్నారు. వీరందరూ మరణించారు. ఇది ముందే ప్లాన్ చేయబడినదని తరువాత జరిగిన విచారణలు తెలియచేశాయి.

దీని కారణంగా హిందూ – ముస్లింల మధ్య అనేక మతపరమైన అల్లర్లు జరిగాయి. వీటి మూలంగా 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చనిపోగా ఎంతోమంది ఇళ్ళనూ, ఆస్తులనూ కోల్పోయారు.

అయితే ఈ సంఘటనలో చెప్పుకోదగిన విశేషమేమిటంటే రాజ్యాంగంలోని ఆదర్శాలను గౌరవించాల్సిన మునిసిపల్ కౌన్సిలర్, మునిసిపల్ ప్రెసిడెంట్ ఇరువురూ కూడా ఈ గుంపు మధ్యలో ఉండి ఈ మారణకాండను నడిపించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఈ సంగతి విని మేము చాలా బాధపడ్డాము. ఇది మనదేశ లౌకికత్వానికి మాయని మచ్చ.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

SCERT AP 8th Class Social Study Material Pdf 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

8th Class Social Studies 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
“పాశ్చాత్య విద్య, క్రైస్తవ మత ప్రచారాలు భారతదేశంలోని సామాజిక మత సంస్కరణ ఉద్యమాన్ని ప్రభావితం చేశాయి” – దీనితో నీవు ఏకీభవిస్తావా? ఎందుకు? (AS2)
జవాబు:
ఏకీభవిస్తున్నాను ఎందుకనగా :
యూరోపియన్ కంపెనీలతో పాటు అనేకమంది క్రైస్తవ మత ప్రచారకులు భారతదేశంలో క్రైస్తవ మతాన్ని బోధించటానికి వచ్చారు. అప్పటి స్థానిక మత ఆచరణలను, నమ్మకాలను వాళ్లు తీవ్రంగా విమర్శించి క్రైస్తవ మతం పుచ్చుకోమని ప్రజలకు బోధించసాగారు. అదే సమయంలో వాళ్లు అనేక విద్యాసంస్థలు, ఆసుపత్రులు నెలకొల్పారు. పేదలకు, అవసరమున్న ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో దాతృత్వపనులు చేపట్టారు. ఇది ప్రజలలో కొత్త ఆలోచనలు రేకెత్తడానికి దోహదపడింది.

అనతి కాలంలోనే ఈ మత ప్రచారకులకూ, హిందూ, ఇస్లాం మతనాయకులకూ మధ్య తమతమ మత భావనలను సమర్థించుకునే చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల వల్ల ప్రజలకు ఎదుటివాళ్ల ఆలోచనలు తెలియటమే కాకుండా తమ తమ మతాలలోని మౌలిక సూత్రాలను తరచి చూసేలా చేసింది. అనేక యూరోపియన్ పండితులు భారతదేశ ప్రాచీన సాహిత్యాన్ని చదివి, అనువదించి, పుస్తకాలుగా ప్రచురించారు. ప్రాచ్య దేశాల పుస్తకాలు చదివారు. పురాతన సంస్కృత, తమిళ, తెలుగు, పర్షియన్, అరబిక్ పుస్తకాలు ఐరోపా భాషలలోకి అనువదించడంతో దేశ సంపన్న, వైవిధ్యభరిత సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ గుర్తించారు. వారి మతాలలోని తమ భావనలను కొత్తగా వ్యాఖ్యానించడానికి వీలు కలిగింది.

ప్రశ్న 2.
సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రాముఖ్యత ఏమిటి? (AS1)
జవాబు:
యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎన్నో వార్తాపత్రికలు, ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి. అనేక భారతీయ భాషలలో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దీని ఫలితంగా చాలా తక్కువ ధరకు పుస్తకాలు అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. ఈ వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రజలలో చర్చలకు, వాదోపవాదాలకు దోహదపడ్డాయి. పత్రికలు, పుస్తకాలు అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రముఖ పాత్ర వహించింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 3.
అనేక దేవుళ్లను ఆరాధించటం, విగ్రహారాధన, సంక్లిష్ట సంప్రదాయాలు వంటి వాటిని మాన్పించటానికి మత సంస్కరణలు ప్రయత్నించాయి. ఈ సంస్కరణలను ప్రజలు ఆమోదించారా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS2)
జవాబు:
అనేక దేవుళ్ళు, దేవతలను, గుడిలో విగ్రహాలను ఆరాధించటం, బ్రాహ్మణ పూజారులను పూజించటం, బలులు ఇవ్వటం, హిందూమతంలోని మౌడ్యం, మూఢాచారాలను వదలి పెట్టడానికి మతసంస్కరణ ఉద్యమాలు ప్రయత్నించి ఫలితాలు సాధించాయి. సనాతన, సాంప్రదాయ ఆచారాలు, పద్ధతులు వదలి పెట్టడానికి ప్రజలు ఒప్పుకోలేదు సరికదా అనేక దాడులకు దిగారు. ముస్లింలలో కూడా సంస్కరణలకు అంగీకరించక, సనాతన మతాచారాలు కొనసాగించారు. ఆధునిక విజ్ఞానం, తత్వశాస్త్రాలను బోధించే ఆంగ్ల విద్యను సైతం మౌఖ్యాలు తిరస్కరించారు.

కాని తదనంతర కాలంలో చర్చోపచర్చలు ఒకరి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నాక, యూరోపియన్ సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళలపట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం, ఆంగ్లవిద్య ఆవశ్యకతను తెలుసుకున్న ప్రజలు మార్పును అంగీకరించి తమ జీవితంలో కొత్త కోణం ఆలోచించారు.

ప్రశ్న 4.
రమాబాయి వంటి వ్యక్తులు వితంతువుల పరిస్థితిపై ప్రత్యేక కృషి ఎందుకు చేశారు? (AS1)
జవాబు:
రమాబాయి, సావిత్రీబాయి ఫూలే వంటి వ్యక్తులు మహిళలకు ప్రత్యేకించి వితంతువులకు సహాయపడటానికి జీవితాలను అంకితం చేసారు. వితంతు మహిళలపై సమాజం చాలా చిన్న చూపు చూసింది. సమాజంలో అపశకునంగా, దుశ్శకునంగా భావించి, బయట తిరగనిచ్చేవారు కాదు. తెల్లచీర కట్టి, గుండు చేయించి, పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు సుమంగళులైన ఇతర మహిళలు వెళ్ళే కార్యక్రమాలకు వెళ్ళకూడదు. భర్త చనిపోవడమే ఆమె దురదృష్టం. ఆమె నుదుట మీద అనేక కష్టాలు ఉన్నాయి, ఇంకా ఈ కట్టుబాట్లు పేరుతో వితంతువులను హింసించడం సామాజిక దుశ్చర్యగా రమాబాయి వంటి సంస్కర్తలు ప్రతిఘటించారు. ఆత్మస్టెర్యం పెంచి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు సమాజం మెచ్చేటట్లు వితంతువులు బ్రతికేందుకుగాను వృత్తి విద్యలు, స్వయం ఉపాధి పథకాలు అందించారు. వితంతువులు విద్యావంతులైతే మార్పు వస్తుందని భావించి, బొంబాయి లాంటి పట్టణాలలో “శారదాసదన్” వంటి పాఠశాలలు, ఆశ్రమాలు ఏర్పరిచి, ఆత్మ విశ్వాసం పెంచేటట్లు కృషి చేసారు.

ప్రశ్న 5.
భారతదేశంలో, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తగా రాజా రాంమోహన్ రాయ్ పాత్ర వివరించండి. (AS1)
జవాబు:
భారతదేశంలో, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తగా రాజా రాంమోహన్ రాయ్ పాత్ర :

  1. రాజారాంమోహన్ రాయ్ బెంగాల్ లో 1772లో జన్మించాడు.
  2. అనేక మత సిద్ధాంతాలను చదివాడు. అన్నింటిలోని సారం ఒకటేనని గ్రహించాడు.
  3. ఇతరుల మతాలను విమర్శించవద్దన్నాడు.
  4. హేతు బద్ధంగా ఉన్న, ప్రయోజనకరమైన మత భావనలను అంగీకరించమన్నాడు.
  5. అనేక రచనలు చేసి ప్రజల్లో తన భావజాలాన్ని నింపాడు.
  6. ‘బ్రహ్మసమాజం’ను స్థాపించాడు.
  7. ‘సతి’ ని నిర్మూలించడానికి తోడ్పడ్డాడు.
  8. స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డాడు.

ప్రశ్న 6.
ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించటంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? (AS1)
జవాబు:

  1. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్’ ముస్లింలకు, బ్రిటిషు వారికి మధ్య నున్న శత్రుత్వం అంతం కావాలని భావించాడు.
  2. ప్రగతి సాధనకు ముస్లింలు ప్రభుత్వంలో పాల్గొంటూ, ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద వాటా పొందాలని భావించాడు.
  3. ఆధునిక విద్య ద్వారా మాత్రమే ఇది సాధ్యమని భావించారు. అందుకే ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 7.
‘అంటరాని’ కులాలను మిగిలిన వాటితో సమానంగా చేయటానికి వివిధ నాయకులు వివిధ పద్ధతులను అనుసరించారు. ఫూలే, భాగ్యరెడ్డి వర్మ, నారాయణ గురు, అంబేద్కర్, గాంధీజీ వంటి నాయకులు సూచించిన చర్యల జాబితాను తయారు చేయండి. (AS3)
జవాబు:
అనాదిగా సమాజంలో అట్టడుగు వర్గాలైన శ్రామిక ప్రజలను శూద్రులుగా, అంటరాని వాళ్ళుగా చూపేవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు వంటి వాళ్ళు, వీళ్ళను దేవాలయములోనికి ప్రవేశం కల్పించలేదు. అందరిలా నీళ్ళు తోడుకోవడానికి, చదవటం, రాయటం నేర్చుకోనిచ్చే వాళ్ళు కాదు. మత గ్రంథాలను చదవనివ్వలేదు. గ్రామాలలో రెండు గ్లాసుల పద్ధతి అమలయ్యేది. ఉన్నత కులాలకు ! సేవ చేయటమే వీళ్ళ పనని భావించారు. ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా జ్యోతిబాపూలే, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్, గాంధీజీ, నారాయణగురు వంటివారు పోరాడారు. వీళ్ళకై జీవితాలను అంకితం చేసారు.

జ్యోతిబాపూలే :
ఉన్నతులమని భావించే బ్రాహ్మణులు వంటి వారి వాదనను ఖండించాడు. శూద్రులు (శ్రామిక కులాలు), అతిశూద్రులు (అంటరానివాళ్ళు) కలసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాడు. సత్యం, సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయటానికి “సత్యశోధక సమాజ్” అన్న సంస్థను స్థాపించాడు. అంటరాని వాళ్ళుగా భావించే మహర్, మాంగ్ కులాలకు చెందిన వాళ్ళకొరకు పాఠశాలను స్థాపించి, తాను తన భార్య సావిత్రి పూలే కృషి చేసారు.

డా||బి. ఆర్. అంబేద్కర్ :
బాల్యంలోనే తానే స్వయంగా కుల వ్యవస్థను సంస్కరించడానికి నడుము కట్టాడు. 1927లో దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కొరకు, ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి నీళ్ళు ఉపయోగించుకొనే హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాడు. “భారతదేశ రాజకీయ భవిష్యత్తు” సమావేశంలో సైతం దళితుల హక్కుల కొరకు కృషి చేసి, దళితులకు రిజర్వేషన్లు సాధించాడు. దళితుల సంక్షేమానికి “ఇండిపెండెంట్ లేబర్ పార్టీని” స్థాపించాడు. రాజ్యాంగ రచనలో, కూడా అంటరానితనాన్ని రూపు మాపడానికి అనేక అధికరణలు పొందుపరిచారు.

మహాత్మాగాంధీ :
మహాత్మాగాంధీ అంటరానితనం నిర్మూలన కొరకు విశేషంగా కృషి చేసారు. అంటరాని కులాల వాళ్ళకు గాంధీజీ ‘హరిజనులు’ అని నామకరణం చేసాడు. అంటే “దేవుడి ప్రజలు” అని పేరు పెట్టాడు. దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వంటి వాటిల్లో ప్రవేశ హక్కులు, సమాన హక్కులు కల్పించాలని ఆశించాడు.

నారాయణగురు :
మనుషులందరిదీ “ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణగురు. ఈయన కులవివక్షతను పాటించని దేవాలయాలను స్థాపించాడు. బ్రాహ్మణపూజారులు లేని పూజా విధానాన్ని అనుసరించాడు. “గుడులు కట్టటం కంటే బాలలకు బడులు కట్టటం ఎంతో ముఖ్యమని చెప్పాడు.

భాగ్యరెడ్డి వర్మ :
దళితుల సంక్షేమం, హక్కుల కొరకు విశేషంగా కృషి చేసినవాడు భాగ్యరెడ్డి వర్మ. దళితులే ఈ ప్రాంత , మూలవాసులని, ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు దళితులను అణచివేసారని చెప్పాడు. కాబట్టి దళితులు “ఆది ఆంధ్రులు” అని పిలుచుకోవాలని చెప్పాడు. దళితులలో చైతన్యం నింపడానికి, 1906లో “జగన్ మిత్రమండలి భాగ్యరెడ్డి, ప్రారంభించాడు. దళిత బాలికలను దేవదాసీలు లేదా జోగినులుగా మార్చడాన్ని వ్యతిరేకించాడు.

ప్రశ్న 8.
ఈనాటికి కూడా కులం ఎందుకు వివాదాస్పద విషయంగా ఉంది? వలస పాలనలో కులానికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన ఉద్యమం ఏది? (AS4)
జవాబు:
‘కులం’ అనేది వాస్తవానికి వ్యక్తిగతమయిన ఆచారం. ఇది వారి వారి ఆచార, వ్యవహారాల వరకు పాటించుకోవాలి. అంతేకాక ఎవరి కులం వారికే గొప్పగా అనిపిస్తుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన కుటుంబ కార్యక్రమాల్లో ‘కులం’ అనేది ఇప్పటికే పునాదిగా నిలబడి ఉంది. దీన్ని దాటడానికి అగ్ర వర్ణాలుగా పిలువబడేవాళ్ళు, నిమ్న కులాలుగా పిలువబడే వాళ్ళు, ఎవరు కూడా ఒప్పుకోరు. అయితే ఈ ‘కులాన్ని’ సంఘపరమైన విషయాలలోకి తేవడం మూలంగా ఇది వివాదాస్పద విషయంగా ఉంటోంది.
ఉదా :
ఇరువురు వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వస్తే అది రెండు కులాల మధ్య వివాదం తెచ్చి పెడుతోంది.

వలస పాలనలో కులానికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన ఉద్యమంగా ‘సత్యశోధక్ సమాజ్’ జరిపిన ఉద్యమం ముఖ్యమైన ఉద్యమంగా చెప్పుకోవచ్చు.

ప్రశ్న 9.
ఆలయ ప్రవేశ ఉద్యమం ద్వారా అంబేద్కర్ ఏమి సాధించదలుచుకున్నాడు? (AS1)
జవాబు:
ఆలయ ప్రవేశ ఉద్యమం ద్వారా అంబేద్కరు మానవులందరూ భగవంతుడి దగ్గర ఒక్కటేనని, భగవంతుడిపై అందరికీ సమాన హక్కులుంటాయని చెప్పదలచుకున్నాడు.

ప్రశ్న 10.
భారత సమాజంలోని సామాజిక మూఢాచారాలు లేకుండా చేయటంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా దోహదపడ్డాయి? ఈనాడు ఎటువంటి సామాజిక మూఢాచారాలు ఉన్నాయి? వీటిని ఎదుర్కోటానికి ఎటువంటి సంఘ సంస్కరణలు చేపట్టాలి? (AS4)
జవాబు:
భారత సమాజంలో పూర్వకాలం నుండి కూడా అనేక సామాజిక మూఢాచారలు కులవివక్ష, మతోన్మాదం, స్త్రీలపట్ల వివక్షత బాల్యవివాహాలు, సతీసహగమనం, పరదాపద్ధతి, వితంతు స్త్రీల జీవనం వంటి సామాజిక మూఢాచారలు ఉండేవి. అయితే రాజారామ్మోహన్ రాయ్ సనాతన ఆచారాలను తిరస్కరించడమే కాకుండా “సతీ” సతీసహగమనం లాంటి సాంఘిక దురాచారాలను దూరం చేసాడు. బ్రహ్మసమాజం ద్వారా విరివిగా కృషి చేసి, ప్రజలలో చైతన్యం తేవడానికి కంకణం కట్టుకున్నాడు. దయానంద సరస్వతి ఆర్యసమాజం ద్వారా అనేక దేవుళ్ళు, దేవతలను గుడిలో, విగ్రహారాధన, కుల వ్యవస్థను ఖండించాడు “సత్యార్థ ప్రకాష్” గ్రంథం ద్వారా ప్రజలను మేల్కొలిపాడు. ముస్లిం సమాజంలోని సనాతన మత దురాచారాలను రూపు మాపడానికి, ఆంగ్ల విద్య ద్వారా సంస్కరణ చేయాలని, పరదా పద్దతి వంటి దురాచారాలను దూరం చేయడానికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ “విజ్ఞాన శాస్త్ర సంఘం” ద్వారా కృషి చేసాడు. జ్యోతిబాపూలే, నారాయణగురు, కందుకూరి, రమాబాయి సరస్వతి వంటి సంస్కర్తలు అనేక ఉద్యమాలు ద్వారా కులవివక్ష, బాల్యవివాహాల నిషేదం, వితంతు పునర్వివాహం, వంటి వాటిని అణచడానికి కృషి చేసాడు.

ఈనాటికి కూడా మతోన్మాదం, కులవివక్ష స్త్రీలపై దాడులు, బాలికలకు విద్య లేకపోవడం వంటి సామాజిక నేరాలు మనం గమనించవచ్చు. వీటిని దూరం చేయడానికి ప్రజలలో మార్పు రావాలి. విద్యావంతులు కావాలి. చైతన్యవంతులు కావాలి. చట్టాలు, హక్కులు, న్యాయస్థానాలను గౌరవించాలి. స్త్రీలకు సమాన హోదా, కల్పించి, ప్రోత్సహించాలి. కులవివక్షతను రూపు మాపడానికి విద్యార్థి దశనుండే సమగ్రత భావాలు పెంపొందించాలి. అన్ని మతాల సారం ఒక్కటేనని వివరించి జాతీయ సమగ్రతను పెంచాలి.

ప్రశ్న 11.
బాలికల విద్య ప్రాధాన్యతను తెలిపే ఒక కరపత్రం తయారుచేయండి. (AS6)
జవాబు:
కరపత్రం
ఈనాడు సమాజంలో బాలురుతో పాటుగా బాలికలకు విద్య తక్కువగా అందిస్తున్నారు. కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు పేరిట బాలికల విద్యను మధ్యలో మాన్పిస్తున్నారు. బయటకు తిరగనీయకుండా, పంపకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. కాని ఇటీవల కాలంలో తల్లిదండ్రులలో కూడా మార్పు కన్పిస్తుంది. బాలురతో పాటుగా బాలికలను కూడా ప్రోత్సహిస్తూ విద్యను అందిస్తున్నారు.

బాల్యవివాహాలు, కులవివక్షతను పగడ్బందీగా అమలు చేస్తున్నారు. అక్కడక్కడ కులవివక్షత కన్పిస్తుంటే ప్రజలలో చైతన్యం కొరకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపట్ల చట్టాలు కఠినంగా శిక్షిస్తున్నాయి. ‘యువతీయువకులలో సామాజిక అవగాహన కొరకు కృషిచేస్తున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 12.
సంఘ సంస్కర్తల్లో నీకు నచ్చిన గుణాలు ఏవి? అవి ఎందుకు నచ్చాయి? (AS6)
జవాబు:
సంఘ సంస్కర్తలలో నాకు నచ్చిన గుణాలు – కారణాలు :

  1. సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేస్తారు. దీనివలన చాలాకాలంగా దురాచారాలతో వెనుకబడిన మనం ముందంజ వేయగలం.
  2. దురాచారాలను రూపుమాపే దిశగా ప్రజలను చైతన్యవంతులను చేస్తారు. తద్వారా ఈ అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతుంది.
  3. వీటిలో భాగంగా వీరు అనేక సంస్థలను నెలకొల్పుతారు. ఉదా : బాలికల విద్య కొరకు పోరాటం జరిగినపుడు బాలికలకు ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పారు.
  4. అవసరమైతే సనాతనవాదులనెదురొడ్డి పోరాడుతారు.
  5. ఉద్యమం ప్రారంభంలో సమాజం వెలివేసినంత పనిచేసినా, ధైర్యంగా ముందుకు సాగుతారు.
  6. నవసమాజాన్ని నిర్మిస్తారు.

8th Class Social Studies 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు InText Questions and Answers

8th Class Social Textbook Page No.213

ప్రశ్న 1.
రాంమోహన్ రాయ్, స్వామి వివేకానందల దృక్పథాలలో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. వీరిరువురూ హిందూ ధర్మశాస్త్రాలను చదివారు.
  2. అన్ని మతాలలోని సారం ఒకటేనని విశ్వసించారు.
  3. వీరిరువురూ సమాజ సేవకు ప్రాధాన్యతనిస్తూ, దీనజనుల ఉద్ధరణకు, సంఘసేవకు ప్రాధాన్యత నిచ్చారు.

తేడాలు :

రామ్మోహన్ రాయ్ స్వామి వివేకానందుడు
అన్ని మతాలు ఒకటేనని నమ్మాడు. హిందూమతం అన్ని మతాల కంటే గొప్పదన్నాడు.
బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. రామకృష్ణ మిషను స్థాపించాడు.
ఒకే ఒక్క దేవుడు అనే నమ్మకాన్ని కలిగి ఉండమన్నాడు. మూఢాచారాలు వదలి మత ధర్మాన్ని పాటించమన్నాడు.

ప్రశ్న 2.
యూరోపియన్ సంస్కృతి, క్రైస్తవ మతం వల్ల తొలితరం సంస్కర్తలు ఏవిధంగా ప్రభావితులయ్యారు?
జవాబు:

  1. ఆంగ్ల సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళల పట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం వంటి వాటితో వీరు ప్రభావితులయ్యారు. అందువలన వీరు బాల్య వివాహాల నిషేధం, వితంతు పునర్వివాహాల ప్రోత్సాహం మొదలైన వాటిని అమలులోకి తెచ్చారు.
  2. వీరి మత బోధనలచే ప్రభావితులైన వారు ఏకేశ్వరోపాసనను ప్రబోధించారు.
  3. వీరు ఆంగ్ల విద్యను అభ్యసించారు. ఈ భాషతో అనేక గ్రంథాలను చదివి జ్ఞానార్జన చేశారు. అలా అందరూ అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆంగ్ల విద్యను, పాఠశాలలను ప్రోత్సహించారు.

ఈ విధంగా తొలితరం సంస్కర్తలు అనేక విషయాలలో యూరోపియన్ సంస్కృతి, క్రైస్తవ మతం వల్ల ప్రభావితులయ్యారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 3.
రాంమోహన్ రాయ్, స్వామి వివేకానంద, దయానందల మత దృక్పథాలలో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. వీరు ముగ్గురూ హిందూ ధర్మశాస్త్రాలను విశ్వసించారు.
  2. ఇతర మతాలలోని మంచిని స్వీకరించి ఆచరించాలని చెప్పారు. ‘
  3. ముగ్గురూ సమాజసేవను ఆదర్శంగా తీసుకున్నారు.

తేడాలు :

దయానందుడు రాంమోహన్ రాయ్ వివేకానందుడు
1) సనాతన సాంప్రదాయాలతో కూడిన హిందూ మతాన్ని తిరస్కరించాడు. 1) అన్ని మతాలు ఒకటేనని భావించాడు. 1) హిందూమతం అన్ని మతాలలోకి గొప్పదని విశ్వసించాడు.
2) ఆర్యసమాజాన్ని స్థాపించాడు. 2) బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. 2) రామకృష్ణ మిషను స్థాపించాడు.
3) అన్ని మతాలను తప్పు మతాలుగా తిరస్కరించి వేదాల ఆధారిత హిందూ మతంలోకి తిరిగి రావాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. 3) ఒకే ఒక్క దేవుడు అనే నమ్మకాన్ని కలిగి ఉండమని చెప్పాడు. 3) మౌఢ్యాన్ని, మూఢాచారాల్ని వదిలి పెట్టి హిందు మత ధర్మాన్ని పాటించాలని చెప్పాడు.

ప్రశ్న 4.
ఈ కొత్త భావాల వ్యాప్తిలో ముద్రణ ఏ విధంగా ఉపయోగపడింది?
జవాబు:
యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎన్నో వార్తాపత్రికలు, ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి. అనేక భారతీయ భాషలలో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దీని ఫలితంగా చాలా తక్కువ ధరకు పుస్తకాలు అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. ఈ వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రజలలో చర్చలకు, వాదోపవాదాలకు దోహదపడ్డాయి. పత్రికలు, పుస్తకాలు అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా కొత్త భావాల వ్యాప్తిలో ముద్రణ ఉపయోగపడింది.

ప్రశ్న 5.
మీరు DAV పాఠశాల, గురుకుల పాఠశాల, ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తే దేనిని ఎంచుకుంటారు? కారణాలు తెల్పండి.
జవాబు:
నేను ప్రభుత్వం నడిపే పాఠశాలలను ఎంచుకుంటాను.
కారణాలు:

  1. ఇక్కడ లౌకిక దృక్పథంతో బోధన జరుగుతుంది.
  2. అందరు విద్యార్థుల్నీ సమాన దృష్టితో చూస్తారు.

8th Class Social Textbook Page No.214

ప్రశ్న 6.
1857 తరువాత ముస్లింలు – బ్రిటిష్ మధ్య శత్రుత్వం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
సంస్కరణవాద హిందువులు సనాతన వాదులతో ఘర్షణపడాల్సి వచ్చినట్లే సంస్కరణవాద ముస్లింలు కూడా వారి సనాతన మతాచారాలతో తలపడాల్సి వచ్చింది. 1857 తిరుగుబాటు అణచివేత ముస్లింలు, ఆంగ్లేయుల మధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది. ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆధునిక విజ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రాలను బోధించే ఇంగ్లీషు విద్యను చాలామంది మౌల్వీలు తిరస్కరించారు.

ప్రశ్న 7.
DAV పాఠశాలలు, MAO కళాశాల మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా?
జవాబు:

DAV పాఠశాల MAO కళాశాల
1) దీనిని స్వామి దయానంద్ అనుచరులు స్థాపించారు. 1) దీనిని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు.
2) దీని ద్వారా ఆంగ్ల బోధనతో పాటు హిందూమతాన్ని, దాని సంస్కృతిని పునరుద్ధరించాలని భావించారు. 2) ఇది ఇస్లామిక్ వాతావరణంలో ఇంగ్లీషు, విజ్ఞాన శాస్త్రాలను బోధించటానికి ప్రయత్నించింది.
3) చివరలో ఇది వేదమతాన్ని మాత్రమే బోధించేలా మారింది. హరిద్వార్‌లో గురుకుల కాంగ్రి విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. 3) ఇది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 8.
తమ సంస్కరణ’ భావాలను సమర్ధించుకోవటానికి సంస్కర్తలందరూ తమ తమ ప్రాచీన మత గ్రంథాలను కొత్త కోణంలో చూడటానికి ప్రయత్నించారన్న విషయాన్ని మీరు గమనించి ఉంటారు. ప్రముఖ సంస్కర్తల ఉదాహరణలను చూసి దీనిని వాళ్లు ఎలా చేశారో తెలుసుకోండి.
జవాబు:
1) రాజారాంమోహన్ రాయ్ :
ఇతడు హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సూఫి వంటి అనేక మత సిద్ధాంతాలను చదివాడు. అనేక పుస్తకాలు చదవటం వల్ల అతడికి దేవుడు ఒక్కడే అన్న నమ్మకం కలిగింది. విగ్రహారాధన, బలులు ఇవ్వటం సరికాదని ఇతడికి అనిపించింది. అన్ని ప్రముఖ మతాలు ఒకే నమ్మకాలు కలిగి ఉన్నాయని, ఇతరుల మతాలను . విమర్శించటం సరికాదని అతడు భావించాడు. హేతుబద్దంగా ఉన్నప్పుడు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మత భావనలను అంగీకరించాలని కూడా అతడు భావించాడు. పూజారుల అధికారాన్ని తిరస్కరించి తమ మతంలోని మూల గ్రంథాలను చదవమని ప్రజలను అతడు కోరాడు. ముద్రణలోని కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధిక సంఖ్యలో ప్రజలకు చేరటానికి అతడు తన భావాలను పత్రికల్లో, పుస్తకాలుగా ప్రచురించాడు.

2) స్వామి వివేకానంద :
హిందూమతం ఇతర మతాలకంటే గొప్పదని వివేకానంద భావించాడు. ఇతడు ఉపనిషత్తుల – బోధనలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఇవి అనువాదం అయ్యి, పెద్ద సంఖ్యలో ముద్రింపబడ్డాయి.

3) స్వామి దయానంద సరస్వతి :
అతడు వేదాలను చదివి నిజమైన మతం వాటిల్లోనే ఉందని సమ్మాడు. ఆ తరవాత హిందూ మతంలోకి వచ్చి చేరిన అనేక దేవుళ్ళను, దేవతలను, గుడిలో విగ్రహాల ఆరాధనను, బ్రాహ్మణ పూజారులను, కుల వ్యవస్థను అతడు తిరస్కరించాడు. సాధారణ పూజా విధానాలతో, వేద మంత్రాలతో ఒక్కడే దేవుడిని పూజించాలని అతడు ప్రచారం చేశాడు. మిగిలిన అన్ని మతాలను అతడు తప్పు మతాలుగా తిరస్కరించి, ఇతర మతాలకు మారిన హిందువులను షేధాల ఆధారంగా ఉన్న హిందూమతంలోకి తిరిగి రావాలని భావించాడు.

ప్రశ్న 9.
భక్తి ఉద్యమంలో భాగంకాని మత భావనలను సంస్కర్తలు ప్రచారం చేశారా?
జవాబు:
లేదు. సంస్కర్తలు అందరూ భక్తి ఉద్యమంలోని మత భావనలనే ఎక్కువగా ప్రచారం చేశారు.

8th Class Social Textbook Page No.215

ప్రశ్న 10.
సంఘసంస్కరణ కోసం ప్రభుత్వం చట్టాలు చేయటం ఎందుకు ముఖ్యమైంది?
జవాబు:
19వ శతాబ్దం ఆరంభం నాటికి బ్రిటిష్ అధికారులలో చాలామంది కూడా భారతీయ సంప్రదాయాలను, ఆచారాలను, విమర్శించసాగారు. రాజా రామ్మోహన్‌రాయ్ వాదాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆలకించారు. ఆవిధంగా 1829లో ‘సతి’ ని నిషేధించారు. వితంతు పునర్వివాహా చట్టాన్ని 1855లో చేసారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ అనేక చట్టాలు అవసరమని భావించారు.

ప్రశ్న 11.
వితంతు పునర్వివాహాన్ని సమర్ధించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళ మధ్య సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
1856 సం॥రం – మొదటి వితంతు పునర్వివాహం జరిగిన సందర్భం – ఊరు కలకత్తా.

శ్రీకాంత్ ఛటర్జీ :
వాహ్వా ! ఈ రోజు ఈ దేశ చరిత్రలో లిఖించదగ్గ రోజు. భారతదేశంలో మహిళల కష్టాలు కడతేరిన రోజు. ఆ భగవంతుని కృప వీరిపై సదా వర్పించుగాక.

ముఖేశ్ బందోపాధ్యాయ :
ఎంత నీచంగా మాట్లాడుతున్నావు శ్రీకాంత్ బాబూ ! ఇది మనని పరలోకంలో శిక్షలనుభవించేలా చేస్తుంది. విధవకు మళ్ళీ పెళ్ళి ! ఆమె వివాహం ద్వారా ఒక ఇంటికి గృహిణిగా వెళ్ళి అక్కడ వంశవృద్ధికి తోడ్పడుతుంది. అలాంటిది మరోసారి మరో ఇంటికా ! అయ్యో ! భగవంతుడా రక్షించు నా దేశాన్నీ, దేశవాసులనూ.

రాజ్యలక్ష్మి:
ఇది నిజంగా సుదినం శ్రీకాంత్ బాబూ ! మా ఆడవారికి చిన్నవయసులో వృద్దులతో వివాహం, వారి మరణంతో వీరు విధవలై, జీవితాంతం అత్త వారిళ్ళలో ఉచితంగా ఊడిగం చేయటం మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇది మంచి ఆరంభం. ఆ భగవంతునికి శతకోటి కృతజ్ఞతలు.

8th Class Social Textbook Page No.217

ప్రశ్న 12.
బాలుర మాదిరిగా బాలికల చదువులకు ఈనాడు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నారా? లేక బాలికలు వివక్షతకు, ‘గురవుతున్నారా?
జవాబు:
ఈనాడు బాలుర మాదిరిగా బాలికల చదువుకు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వాస్తవానికి చాలా పాఠశాలల్లో, కళాశాలల్లో బాలికల నమోదే ఎక్కువగా ఉంటోంది అని చెప్పవచ్చు. కానీ ఎక్కడో కొన్ని కుటుంబాల్లో మాత్రం బాలికలు వివక్షకు గురి అవుతున్నారని చెప్పవచ్చు. అంతేకాక కొన్ని వెనుకబడిన రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి కనబడుతోంది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 13.
చదువుకోటానికి బాలురు ఎదుర్కోనే ఏ కష్టాలను బాలికలు ఎదుర్కొంటున్నారు?
జవాబు:

  1. బాలికలు సాధారణంగా ఉన్నత విద్యను తక్కువగా అందుకుంటున్నారు.
  2. బాలురు చదువుకోసం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నారు. కానీ బాలికలకు అన్నిచోట్లకి అనుమతి దొరకటం లేదు.
  3. కొన్ని కోర్సులలో బాలికలకు అవకాశం ఉండటం లేదు.

ప్రశ్న 14.
వితంతువుల పట్ల వ్యవహరించే తీరు ఈనాడు ఎంతవరకు మారింది?
జవాబు:
వితంతువుల పట్ల ఈనాడు సమాజ దృక్పథం మారింది అని స్పష్టంగా చెప్పవచ్చును. నేటి సమాజంలో చాలావరకు – వీరిని అందరు ఇతర మహిళల లాగానే గుర్తిస్తున్నారు. వీరికి పెద్దలే మరలా వివాహాలు చేస్తున్నారు. చేసుకోవటానికి పురుషులు కూడా వారంతటవారే ముందుకు వస్తున్నారు. కొన్ని మతపరమైన ఆచారాలలో తప్ప వీరిని అన్నింటా ఇతరులతో సమానంగానే గౌరవిస్తున్నారు.

ప్రశ్న 15.
ఈనాటికీ దళిత బాలికలు, ముస్లిం బాలికలు చదువుకోటానికి ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నారా?
జవాబు:
దళిత బాలికలు ఎక్కడో ఒకటి, రెండు చోట్ల ఇతర సమాజం నుండి సమస్యలు ఎదుర్కొంటున్నారని అప్పుడప్పుడు వార్తా పత్రికలలో వార్తలు వింటున్నాం. వీరు కూడా అందరితోపాటు సమానంగానే తరగతి గదుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ముస్లిం బాలికలకు కూడా ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి. వీరు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చదువుకుంటున్నారు.

8th Class Social Textbook Page No.218

ప్రశ్న 16.
అంటరాని ప్రజలు అసలు చదువులేకుండా ఉండడం కంటే ఇది మెరుగని కొంతమంది భావించారు. మీరు వీళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. నేను వాళ్ళతో ఏకీభవిస్తాను. జ్యోతిబా పూలే, అంబేద్కర్లు అటువంటి కష్టనష్టాల కోర్చి విద్యనభ్యసించారు కాబట్టే వారు భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగారు. లేకుంటే ఇప్పటికీ అదే పరిస్థితి ఉండి ఉండేది.

8th Class Social Textbook Page No.219

ప్రశ్న 17.
ఈనాటికీ జ్యోతిబా పూలే భావాలు అవసరమని మీరు భావిస్తున్నారా?
జవాబు:
అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నాటి నుండి నిమ్నకులాల అభివృద్ధి కొరకు మన ప్రభుత్వాలు ‘రిజర్వేషన్లు’ అన్నిటా అమలు చేస్తున్నాయి. ఈ కులాల వారందరూ మిగతా అన్ని కులాల వారితో సమానంగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయంగా ఎదుగుతున్నారు. కాబట్టి ఆ భావాలు అవసరం లేదని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 18.
నిమ్నకులాల విద్యార్థులకు ఆ కులాల ఉపాధ్యాయులే చదువు చెప్పాలని అతడు ఎందుకు అన్నాడు?
జవాబు:
శూద్రులు, అతిశూద్రులు కుల వివక్షతకు గురై పాఠశాలల్లో, కళాశాలల్లో అనేక అవమానాలకు గురౌతున్నారని అంతే కాకుండా అగ్రవర్ణాలకు చెందిన ఉపాధ్యాయులు, నిమ్నకులాల విద్యార్థులకు చదువు చెప్పకుండా వెలివేసే విధానంలో చదువు నేర్పిస్తున్నారని, కులవ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ అతడు దీనికి వ్యతిరేకంగా గులాంగిరి వంటి పుస్తకాలతో పాటు నిమ్నకులాల పిల్లలకోసం నిమ్న కులాల టీచర్లే చదువు చెప్పాలని తలంచాడు. దీని ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మ స్టైర్యం పెరుగుతుందని భావించాడు.

ప్రశ్న 19.
నారాయణ గురు, జ్యోతిబా పూలేల కృషిని పోల్చండి. వాళ్ళ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:

  1. ఇరువురూ కులవ్యవస్థను ఖండించారు.
  2. ఇరువురూ అనేక పాఠశాలలను స్థాపించారు.
  3. ఇరువురూ బ్రాహ్మణాధిక్యతను తోసిరాజన్నారు.

తేడాలు :

నారాయణ గురు జ్యోతిబా పూలే
1) ఈయన ఒక మత గురువు. 1) ఈయన ఒక సంఘసంస్కర్త.
2) కుల వివక్షత లేని దేవాలయాలను స్థాపించి, బ్రాహ్మణ పూజారులు లేని సామాన్య పూజా విధానాన్ని ప్రోత్సహించాడు. 2) నిమ్న కులాల వారికి ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించాలని పిలుపునిచ్చాడు. వీటిలో నిమ్న కులాల ఉపాధ్యాయులే బోధించాలని చెప్పాడు.
3) కుల వివక్షతను ఖండించాడు. అన్ని రకాల కుల వివక్షతలకు స్వస్తి చెప్పాలని చెప్పారు. 3) నిమ్న కులాలవారు బ్రాహ్మలు లేకుండా పెళ్ళిళ్ళు, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాడు.

8th Class Social Textbook Page No.220

ప్రశ్న 20
కులవ్యవస్థకు సంబంధించి బుద్ధుని బోధనలను గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:
బుద్ధుడు సర్వమానవ సమానత్వాన్ని చాటాడు. కుల,మత భేదాలను వ్యతిరేకించాడు. అందరినీ కలిసి ఉండమని బోధించాడు. తన పంథాను అనుసరించిన వారందరినీ సమానంగా చూశాడు.

ప్రశ్న 21.
ఆంధ్ర ప్రాంతంలో దళితులు మూలవాసులు అన్న భావన దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఏవిధంగా దోహదపడింది?
జవాబు:
ఆంధ్ర ప్రాంతంలో దళితులు మూలవాసులు అన్న భావన దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిందనే చెప్పాలి. దళితులే ఈ ప్రాంతపు మూలవాసులనీ, ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు దళితులను బలంతో అణచివేసారని చెబుతారు. జనాదరణ పొందిన కళలను ఉపయోగించుకుని దళితులలో చైతన్యం కలిగించడానికి 1906లో ‘జగన్‌మిత్ర మండలి’ని
భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించి ఆత్మస్టైర్యం పెంచారు. దళితులకు ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా కూడా వాళ్ళలో చైతన్యం వెల్లివిరిసింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 22.
స్వతంత్ర భారతదేశంలో మహిళలందరికీ ఓటుహక్కు లభించిందా?
జవాబు:
సహాయ నిరాకరణ సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసిందిగా మహిళలను గాంధీజీ ఆశించి, ప్రోత్సహించారు. ఉప్పుసత్యాగ్రహం, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం, రైతాంగ ఉద్యమం వంటి వాటిలో మహిళలు పాల్గొని విజయవంతం చేయడం వల్ల స్వతంత్ర భారతదేశంలో మహిళలందరికు ఓటుహక్కు లభించింది.

ప్రశ్న 23.
స్వాతంత్ర్య పోరాటంలోని ముఖ్యమైన మహిళా నాయకుల గురించి తెలుసుకోండి – కల్పనాదత్, అరుణ అసఫ్ అలీ, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయ మొదలగువారు.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 1
1) కల్పనాదత్ :
ఈమెను తరువాత కాలంలో కల్పనాజోషి అని పిలిచేవారు. ఈమె చిటగాంగ్ రిపబ్లికన్ ఆర్మీలో సభ్యురాలు. పేరొందిన చిటగాంగ్ ఆయుధాల దోపిడీ కేసులో ఈమె కూడా పాల్గొన్నారు. తరువాత ఈమె కమ్యూనిస్టు పార్టీలో చేరారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 2
2) అరుణా అసఫ్ అలీ :
ఈమె క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కాలంలో అరుణ గొవాలియా మైదానంలో భారత జాతీయ జెండాను ఎగురవేసి యువతి గుండెల్లో స్ఫూర్తిని నింపారు. ఆమె ఈ కింది అవార్డులను పొందారు.
లెనిన్ ప్రైజ్ ఫర్ పీస్ – 1975
జవహర్లాల్ నెహ్రూ అవార్డు – 1991
భారతరత్న – 1998

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 3
3) కెప్టెన్ లక్ష్మీ సెహగల్ :
ఈమె 1943లో నేతాజీని సింగపూర్ లో కలిసే వరకు డాక్టరు వృత్తిలో కొనసాగారు. నేతాజీతో కలిసి మహిళా రెజిమెంట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. వెంటనే ‘ఝాన్సీరాణి రెజిమెంట్’ను స్థాపించి కెప్టెన్‌గా మారారు. 1945 మేలో బ్రిటిషు వారు ఆమెను అరెస్టు చేశారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 4
4) సరోజినీనాయుడు :
భారత జాతీయ కాంగ్రెస్ కు ద్వితీయ మహిళాధ్యక్షురాలు. ఆమెను నైటింగేలు ఆఫ్ ఇండియా అని పిలిచారు. ఆమె బెంగాలు విభజన కాలంలో ఉద్యమంలో చేరారు. అనేక కవితలు రాశారు. ఈమె జన్మదినాన్ని భారతదేశంలో మహిళా దినోత్సవంగా జరుపుతారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 5
5) కమలాదేవి ఛటోపాధ్యాయ :
ఈమె స్వాతంత్ర్య పోరాటంలో 1923లో సహాయ నిరాకరణోద్యమంలో చేరారు. భారతదేశంలో మొట్టమొదట అరెస్ట్ అయిన మహిళ.

8th Class Social Textbook Page No.221

ప్రశ్న 24.
దళితుల పట్ల తమ దృక్పథంలో గాంధీజీ, అంబేద్కర్ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:

  1. ఇరువురూ దళితుల కోసం పాటుపడ్డారు.
  2. ఇరువురూ కాంగ్రెస్ వాదులే.

తేడాలు :

గాంధీజీ అంబేద్కర్
1) ఈయన అగ్రవర్ణస్తుడై దళితుల కోసం పోరాడారు. 1) ఈయన దళితుడిగా దళితుల కోసం పోరాడారు.
2) ఈయన దళిత అభ్యర్థులకు ఎన్నికలలో సీట్లు రిజర్వు చేయించారు. 2) ఈయన దళితులకు, దళితులే వేరుగా ఓట్లు వేయాలని భావించారు.
3) ఈయన కాంగ్రెసులో ఉండే వారికోసం పనిచేశారు. ఈ పోరాటాన్ని కాంగ్రెస్ లో భాగంగా చేశారు. 3) ఈయన దళితుల కోసం ఇండిఫెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు.
4) ఈయన చివరి వరకు హిందూ మతంలోనే ఉండి దళితుల కోసం పోరాడారు. 4) ఈయన హిందూమతాన్ని విశ్వసించలేక చివరలో బౌద్ధ మతానికి మారారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 25.
ఈనాడు దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలల్లో దళితులకు సమాన హక్కులు ఉన్నాయా? వాళ్లు ఇప్పటికీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి?
జవాబు:
నేడు దేవాలయాల్లోకి అందరికీ ప్రవేశం లభ్యమే. నీటి వనరులు, పాఠశాలల్లో చెప్పుకోవాలంటే దళితులకు సమానహక్కులే కాక, రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. అంటే అందరితో పాటు సమానంగా అన్ని ప్రభుత్వం వీరికి అందిస్తోంది. అంతేకాక కొన్ని వీరి కొరకు రిజర్వు చేసి అవి వారికి మాత్రమే అందిస్తుంది. వీరు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు ఏమీ లేవనే చెప్పవచ్చు.

పట నైపుణ్యాలు

ప్రశ్న 26.
ఈ క్రింది బొమ్మలలో మత సంస్శలు సంఘ సంస్కర్తలను గుర్తించి, మీ ఉపాధ్యాయుల సహకారంతో వారి పేర్లు వ్రాయుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 6

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

SCERT AP 8th Class Social Study Material Pdf 24th Lesson విపత్తులు – నిర్వహణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 24th Lesson విపత్తులు – నిర్వహణ

8th Class Social Studies 24th Lesson విపత్తులు – నిర్వహణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో సంభవించిన లేదా టీవీలో చూసిన ప్రకృతి వైపరీత్యాలను, జరిగిన నష్టాన్ని చెప్పండి. నష్టాన్ని తగ్గించాలంటే ఏ ఏ చర్యలు చేపట్టాలో తెల్పండి. (AS4)
జవాబు:
ఇటీవల మా ప్రాంతంలో విపరీతమైన వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. మా ఇళ్ళు, పొలాలు అన్నీ నీట మునిగాయి. మా ప్రాంతంలో 8 మంది వరద ఉధృతికి నీట మునిగి కొట్టుకుపోయారు. చేలు మునగటం వలన వరి పంట మొత్తం నాశనమయ్యింది. పశువులు మేతలేక, నీట మునిగి మరణించాయి.

కృష్ణానదికి అడ్డుకట్ట వేసి నీటిని మళ్ళిస్తే ఈ వరదను అరికట్టవచ్చు. లోతట్టు ప్రాంతాల వారిని వర్షం ఉధృతంగా ఉన్నప్పుడే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. దాతలను ప్రోత్సహించి వారికి ఉచిత ఆహార, వైద్య సదుపాయాలు కల్పించాలి. ఈ విధంగా చేయటం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చు.

ప్రశ్న 2.
వైపరీత్యాలను ఎలా నివారించవచ్చు? ఎలా ఎదుర్కోవచ్చు? (AS1)
జవాబు:
సృష్టిలో మనిషి తప్ప మిగతా ప్రాణులన్నీ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయి. మనిషి మాత్రం ప్రకృతిని తనకు అనుగుణంగా మలుచుకుంటున్నాడు. ఇలాకాక మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. అంతేకాక మడచెట్ల పెంపకం, భద్రమైన ప్రదేశాలలోకి గ్రామాలను మార్చటం, తుపానులను, భూకంపాలను తట్టుకునే విధంగా భవన నిర్మాణాలను ప్రోత్సహించడం మొదలైన వాటితో నష్టాలను నివారించవచ్చు.

వైపరీత్య బృందాలను ఏర్పాటు చేసి శిక్షణనివ్వటం, షెల్టర్లు, దిబ్బలు ఏర్పాటు చేయడం మొదలైన వాటితో వీటిని ఎదుర్కోవచ్చు.

ప్రశ్న 3.
వైపరీత్యాలకు సంబంధించి పెద్దవాళ్ల అనుభవాలు, వాటిని ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకుని వాటి గురించి రాయండి. (AS3)
జవాబు:
ఒకసారి హైదరాబాదులో భూకంపం వచ్చిందట. వేసవికాలం రాత్రిపూట అందరూ ఆరు బయట పడుకుని ఉండగా వచ్చిందట. ముందు మా బామ్మగారు ఏదో కుక్క మంచాన్ని కదుపుతోంది అనుకున్నారట. ఈలోగా చుట్టు ప్రక్కల వాళ్లు ‘భూకంపం’ అని కేకలు వేయడం వినిపించిందట. అంతే అందరూ ఒక్క ఉదుటున లేచి వీధిలోకి పరిగెత్తారట. చూస్తుండగానే రోడ్డు చివర ఒక ఎత్తైన భవనం కూలిపోయిందట. ఇళ్ళల్లోని సామానులన్నీ క్రిందపడిపోయాయట. చాలామంది ఇళ్ళ గోడలు పగుళ్లు వచ్చాయట. ఆ రాత్రి నుంచి తెల్లారే వరకు 5, 6 సార్లు భూమి కంపించిందట. మా వాళ్ళు అలాగే రోడ్ల మీద కూర్చుని ఉన్నారట కానీ ఇళ్ళల్లోకి వెళ్ళలేదట. తెల్లారాక భయం లేదని నమ్మకం కలిగాక ఇళ్ళలోకి వెళ్లి పని పాటలు మొదలు పెట్టారట.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 4.
ప్రజలు విపత్తులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను సూచించండి. (AS4)
జవాబు:
ప్రకృతి విపత్తులను ముందే ఊహించి కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

  1. సులువుగా తప్పించుకునే మార్గం ముందే ఆలోచించి ఉంచుకోవాలి.
  2. అవసరమైన సామగ్రిని ఒక బ్యాగులో సర్దుకుని ఉంచుకోవాలి.
  3. నీటికి సంబంధించిన విపత్తు అయితే ఎత్తైన ప్రాంతాలకు ముందే చేరుకోవాలి.
  4. నిల్వ చేసుకునే ఆహార పదార్థాలను సేకరించి ఉంచుకోవాలి.
  5. అత్యవసరమైన మందులను దగ్గరుంచుకోవాలి.
  6. ఇతరులకు అవకాశమున్నంతమేర సాయం చేయాలి.

ప్రశ్న 5.
కరవు ప్రభావాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
కరవు ప్రభావం :
కరవు ప్రభావం మెల్లగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

  1. భూగర్భజల నీటిమట్టం పడిపోవటం, తాగునీటి కొరత.
  2. పంటల విస్తీర్ణం తగ్గటం.
  3. వ్యవసాయం కుంటు పడటంతో వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవటం.
  4. వ్యవసాయ, అనుబంధ రంగాలలోని ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం.
  5. ఆహారధాన్యాల కొరత.
  6. పశుగ్రాస కొరత.
  7. పశువులు చనిపోవటం.
  8. పోషకాహార లోపం, ప్రత్యేకించి చిన్న పిల్లల్లో
  9. అతిసారం, విరేచనాలు, కలరా వంటి రోగాలు, అనారోగ్యం విస్తరించటం, ఆకలికి గురికావటం వల్ల కంటి చూపులో లోపం ఏర్పడటం.
  10. నగలు, ఆస్తులు వంటివి తప్పనిసరయ్యి తాకట్టు పెట్టటం లేదా అమ్మటం.
  11. పని కోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లటం.

ప్రశ్న 6.
నీటి వృథా జరిగే సందర్భాలను పేర్కొని, దాని నివారణకు మార్గాలను సూచించండి. (AS6)
జవాబు:
నీరు వృథా జరిగే సందర్భాలు దాని నివారణకు మార్గాలు :

  1. పట్టణ, గ్రామ ప్రాంతాలలోని మంచినీటి కుళాయిలకు హెడ్లు సరిగ్గా లేకపోవడం- దీనిని ఎప్పటికప్పుడు సరిచేయాలి.
  2. టూత్ బ్రష్, షేవింగ్ చేయునపుడు కొలాయిని వృథాగా వదలరాదు.
  3. మంచినీటి పైపుల లీకేజీని నివారించాలి.
  4. కాలువల ద్వారా పంటపొలాలకు నీటిని అవసరం మేరకు వదలాలి.
  5. నీటికొరత సమయాలలో గృహ అవసరాల కొరకు పరిమితంగా నీరు వాడాలి.
  6. బిందు సేద్యం వంటి వ్యవసాయ పద్ధతులు ఉపయోగించాలి.
  7. వర్షపు నీరు వృథాకాకుండా చెరువులకు మళ్ళించాలి.
  8. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గొయ్యి త్రవ్వి వర్షపునీటి భూమిలో ఇంకేటట్లు చూడాలి.

ప్రశ్న 7.
ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన చిత్రాలతో ఆల్బమ్ తయారు చేయండి. (AS3)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 1

8th Class Social Studies 24th Lesson విపత్తులు – నిర్వహణ InText Questions and Answers

8th Class Social Textbook Page No.254

ప్రశ్న 1.
విపత్తులలో రకాలు ఏవి? వాటిని వివరించండి.
జవాబు:
విపత్తులలో రకాలు :
విపత్తులు ఏర్పడటానికి గల కారణాలను బట్టి, అది సంభవించే వేగాన్ని బట్టి వీటిని అనేక రకాలుగా విభజించవచ్చు.
1. సంభవించే వేగాన్ని బట్టి నిదానంగా వచ్చే, వేగంగా వచ్చే విపత్తులని రెండుగా విభజించవచ్చు.

ఎ) నిదానంగా సంభవించే విపత్తులు :
అనేక రోజులు, నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాలపాటు సంభవించే కరువు, పర్యావరణ క్షీణత, పురుగుల తాకిడి, కాటకం వంటివి నిదానంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.

బి) వేగంగా సంభవించే విపత్తులు :
తృటి కాలంలో సంభవించే విపత్తు విభ్రాంతికి గురి చేస్తుంది. ఇటువంటి విపత్తుల ప్రభావం కొద్ది కాలం ఉండవచ్చు. లేదా ఎక్కువ రోజులు ఉండవచ్చు. భూకంపాలు, తుపాను, ఆకస్మిక వరదలు, అగ్ని పర్వతాలు బద్దలవటం వంటివి వేగంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.

2. కారణాలను బట్టి ప్రకృతి, సహజ, మానవ నిర్మిత విపత్తులని రెండు రకాలుగా విభజించవచ్చు.
ఎ) ప్రకృతి విపత్తులు :
ప్రకృతి సహజ కారణాల వల్ల ఇటువంటి విపత్తులు ఏర్పడి మానవ, భౌతిక, ఆర్ధిక, పర్యావరణ నష్టాలకు దారితీస్తాయి. ప్రకృతి విపత్తులలో రకాలు :
అ) భూకంపాలు
ఆ) తుపానులు
ఇ) వరదలు
ఈ) కరవు
ఉ) సునామీ
ఊ) కొండ చరియలు విరిగి పడటం
ఋ) అగ్నిపర్వతాలు, మొ||నవి

బి) మానవ నిర్మిత విపత్తులు :
మానవ కారణంగా సంభవించే విపత్తుల వల్ల సాధారణ జీవితం అస్తవ్యస్తమవుతుంది. ప్రాణ, ఆస్తి, ఆర్థిక, పర్యావరణ నష్టం కలుగుతుంది. వీటికి గురయ్యే ప్రజలు ఈ సమస్యలను ఎదుర్కోగల స్థితిలో ఉండరు. 1984 భోపాల్ గ్యాస్ విషాదం, 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమాహాలులో అగ్ని ప్రమాదం, 2002లో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పటం, 2003లో కుంభకోణం (తమిళనాడు)లో పాఠశాలలో అగ్ని ప్రమాదం, 2008లో జైపూర్‌లో వరుస పేలుళ్లు వంటివి దీనికి ఉదాహరణలు.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 2.
విపత్తుల యాజమాన్యం అంటే ఏమిటి?
జవాబు:
విపత్తులపై / అత్యవసర పరిస్థితులపై నియంత్రణ సాధించటం, విపత్తుల ప్రభావాన్ని నివారించటానికి, తగ్గించటానికి, లేదా వాటి నుంచి కోలుకోవటానికి దోహదం చేసే విధానాలను అందించే దానిని విపత్తుల యాజమాన్యం అంటారు. ఈ కార్యక్రమాలు సంసిద్ధతకు, తీవ్రతను తగ్గించటానికి, అత్యవసర స్పందనకు, సహాయానికి, కోలుకోటానికి (పునర్నిర్మాణం, పునరావాసం) సంబంధించినవి కావచ్చు.

8th Class Social Textbook Page No.256

ప్రశ్న 3.
సునామీలు అంటే ఏమిటో మీకు తెలుసా? అవి ఎలా ఏర్పడతాయి? వాటిని ముందుగా ఎలా ఊహించవచ్చు? రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో నివసిస్తున్నట్లయితే సునామీ సంభవించినపుడు మిమ్మల్ని ఎలా రక్షించుకుంటారు?
జవాబు:
జపాన్ భాషలో ‘సు’ అంటే రేవు’, ‘నామె’ అంటే ‘అలలు’ అని అర్థం. ఈ రెండూ కలిసి ‘సునామీ’ అన్న పదం ఏర్పడింది. సముద్రంలోని భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలటం, లేదా కొండచరియలు విరిగి పడటం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీరప్రాంతాలను అతలాకుతలం చేయటాన్ని ‘సునామీ’ అంటారు. దగ్గరలోని భూకంపాల వల్ల ఉత్పన్నమైన సునామీ అలలు కొద్ది నిమిషాలలోనే తీరాన్ని తాకుతాయి. ఈ అలలు తక్కువలోతు నీటిని చేరినప్పుడు చాలా అడుగుల ఎత్తు, అరుదుగా పదుల అడుగుల ఎత్తు పైకెగసి తీరప్రాంతాన్ని విధ్వంసకర శక్తితో తాకుతాయి. ఒక పెద్ద భూకంపం తరువాత సునామీ ముప్పు చాలా గంటలపాటు ఉండవచ్చు.

ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సునామీలను పసికట్టవచ్చు. సునామీలు వచ్చినపుడు వాతావరణశాఖ హెచ్చరికల ద్వారా తెలుసుకుని, ముందే సురక్షిత ప్రాంతాలకు చేరుకుని మమ్మల్ని మేము రక్షించుకుంటాము.

ప్రశ్న 4.
సునామీ ముందు ఏం చేయాలి?
జవాబు:

  1. సునామీ ముప్పుకి గురయ్యే ప్రాంతంలో మీ ఇల్లు, బడి, పని ప్రదేశం, తరచు సందర్శించే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి.
  2. సునామీ సంభవించినప్పుడు మీరు ఉండటానికి అవకాశం ఉన్న ఇల్లు, బడి, పని ప్రదేశం, ఇతర ప్రదేశాల నుంచి తప్పించుకునే మార్గం గురించి ముందే తెలుసుకుని ఉండాలి.
  3. తప్పించుకునే మార్గాల ద్వారా క్షేమంగా ఉండే ప్రాంతాలను చేరుకోటాన్ని సాధన చేస్తూ ఉండాలి.
  4. అత్యవసర పరిస్థితుల్లో ఉంచుకోవలసిన సామగ్రితో సిద్ధంగా ఉండాలి.
  5. సునామీ గురించి మీ కుటుంబంతో చర్చిస్తూ ఉండాలి.

ప్రశ్న 5.
సునామీ గురించి రాయండి.
జవాబు:

  1. సునామీలో అనేక అలలు ఉంటాయి. మొదటి అల అన్నిటికంటే పెద్దది కాకపోవచ్చు. మొదటి అల తరవాత అనేక గంటలపాటు పెద్ద అలలు తాకే ప్రమాదముంటుంది.
  2. మైదాన ప్రాంతంలో సునామీ మనిషికంటే వేగంగా, అంటే గంటకి 50 కి.మీ. వేగంతో పయనించగలదు.
  3. సునామీ పగలు కానీ, రాత్రి కానీ ఏ సమయంలోనైనా సంభవించవచ్చు.

ప్రశ్న 6.
సునామీ పై మరింత సమాచారం, చిత్రాలు సేకరించండి. తరగతి గదిలో చర్చించండి. సమాచారంను నోటీస్ బోర్డులో ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 3
విద్యార్థులు స్వయంగా చర్చ నిర్వహించి, సమాచారంను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.

  1. తేదీ : 00.58.83 26.12.2004.
  2. మాగ్నిట్యూడ్ : 9.1 – 9.3 mw
  3. లోతు : 30 km (19 mi)
  4. భూకంప నాభి : 3.316°N-95.854°E
  5. రకం : సముద్రంలో
  6. దేశాలు లేదా ప్రాంతాలు : ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా, థాయ్ లాండ్, మాల్దీవులు, ఆఫ్రికా తూ|| తీరం (సోమాలియా)
  7. మరణాలు : 230,210 – 280,000

8th Class Social Textbook Page No.259

ప్రశ్న 7.
కరవు గురించి మీకు తెలిసింది రాయండి.
జవాబు:
కరువు అన్నది వర్మపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్వం. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని అనావృష్టి (Meteorological drought) అంటారు. ఒక సంవత్సరంలో వర్షం సాధారణంగానే ఉండవచ్చు. కానీ రెండు వానల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండి వర్షాధార పంటలు దెబ్బతినవచ్చు. దీనిని వ్యవసాయ కరువు (Agricultural drought) అంటారు. కాబట్టి ఎంత వర్షం అన్నదే కాకుండా, ఎప్పుడెప్పుడు పడిందన్నది కూడా ముఖ్యమవుతుంది.

అధిక లేదా తక్కువ వర్షపాతం అన్నది (70-100 సంవత్సరాల) సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి ఈ విధంగా చెబుతారు.
అధిక + సగటు వర్షపాతం కంటే 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ.
సాధారణ + సగటు వర్షపాతం కంటే 19 శాతం ఎక్కువ నుంచి 19 శాతం తక్కువ వరకు.
తక్కువ – సగటు వర్షపాతం కంటే 20 శాతం నుంచి 59 శాతం తక్కువ వరకు,
బాగా తక్కువ – సగటు వర్షపాతం కంటే 60 శాతం కంటే తక్కువ.

కొన్ని ప్రాంతాలు అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటిని ‘కరవు పీడిత’ ప్రాంతాలు అంటారు.

8th Class Social Textbook Page No.260

ప్రశ్న 8.
వాటర్ షెడ్ అభివృద్ధి పథకం అంటే ఏమిటి? దీని ఉద్దేశ్యమేమి?
జవాబు:
కరవు ప్రభావాలను తగ్గించటానికి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలలో సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకాలను (IWMP) అమలు చేస్తోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రజలలో నైపుణ్యాలను పెంపొందించి ప్రకృతి వనరులను సమర్థంగా ఉపయోగించుకునేలా చేయటం, సామర్థ్యాన్ని బట్టి నేలను ఉపయోగించుకోవటం ద్వారా నేల, నీటి వనరులను బాగా వినియోగించుకోవచ్చు. వాటి దురుపయోగాన్ని అరికట్టవచ్చు. వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టే ముఖ్యమైన పనులు పొలాల్లో వాననీటి సంరక్షణ, అడవుల పెంపకం, తక్కువ నీళ్లు అవసరమయ్యే చెట్లు / పంటలను ప్రోత్సహించటం, ప్రత్యామ్నాయ జీవనోపాధులు మొదలైనవి.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 9.
కరవును ఎదుర్కోవటం ఎలా?
జవాబు:
ఒక్కసారిగా సంభవించే ప్రమాదం మాదిరి కాకుండా కరువు మెల్లగా సంభవిస్తుంది కాబట్టి మనం దానికి సంసిద్ధతగా ఉండటానికి, ప్రతిస్పందించటానికి, దాని ప్రభావాన్ని తగ్గించటానికి తగినంత సమయం ఉంటుంది. పర్యవేక్షణ, ముందుగా జారీచేసే హెచ్చరికలవల్ల అన్నిస్థాయిల్లో నిర్ణయాత్మక బాధ్యతలు ఉన్నవాళ్లు సకాలంలో స్పందించవచ్చు. కరవుకు గురయ్యే ప్రాంతాల్లో నీటి సంరక్షణా విధానాలు వంటి అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పించాలి.

ప్రశ్న 10.
వర్షపు నీటిని పట్టణ ప్రాంతాలలో ఎలా నిల్వ చేయాలి?
జవాబు:
వర్షపు నీటి నిల్వ :
పట్టణ ప్రాంతాల్లో ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటినంతా జాగ్రత్తగా నిలువ చేయాలి. ఈ వాన నీటినంతా ఇంకుడు గుంతలలోకి మళ్లించటం అన్నింటికంటే తేలికైన పని. ప్రత్యేకించి కట్టిన ట్యాంకులు, సంపు (sump)ల లోకి వాన నీటిని మళ్లించి రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తేలికైన వడపోత విధానాలతో తాగటానికి అత్యంత శుద్ధమైన నీటిని పొందవచ్చు.

8th Class Social Textbook Page No.261

ప్రశ్న 11.
మీరు నీటిని ఆదా చేసేవారా, వృథా చేసేవారా?
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 2
మీరు వాడుతున్న నీటిని పట్టికలో నింపి మొత్తం కూడండి, మీరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోండి.
– 200 లీటర్ల కంటే తక్కువ – పర్యావరణ హీరో
– 201 – 400 లీటర్లు – నీటి పొదుపరి
– 401 – 600 లీటర్లు – నీటి ఖర్చుదారు
– 600 లీటర్ల కంటే ఎక్కువ – నీటి విలన్
జవాబు:
నేను పర్యావరణ హీరో స్థానంలో ఉన్నాను.

ప్రశ్న 12.
ఆ వైపరీత్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు?
జవాబు:
స్థానిక ప్రభుత్వం వారు చాలా వరకు వరద ముప్పున్న ప్రాంతాల ప్రజలను ఊళ్ళోని పాఠశాలలకు, కమ్యూనిటీహాలుకు తరలించారు. వారికి ఆహార పొట్లాలు, త్రాగునీరు అందించారు. కొందరు తమ దుప్పట్లు, కట్టుకోవడానికి వస్త్రాలు అవీ దానంగా యిచ్చారు. ఈ విధంగా వైపరీత్యాన్ని ఎదుర్కొన్నారు.

ప్రశ్న 13.
మీ ప్రాంతంలో ఏదైనా వైపరీత్యాన్ని చూశారా? వివరించండి.
జవాబు:
మా ఇంటి దగ్గర ‘స్పాంజి డస్టర్లు’ తయారుచేసే చిన్న కంపెనీ ఒకటున్నది. అనుకోకుండా ఒక రోజు సాయంత్రం అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. పనిచేసేవారు జాగ్రత్తపడే లోపలే లోపలున్న ‘స్పాంజి’ మొత్తం కాలిపోయింది. పనివారికి కూడా ఒళ్ళు కాలి గాయాలయ్యాయి. దాదాపు రూ. 3,50,000 నష్టం వాటిల్లిందని దాని యాజమానులు చెప్పగా విన్నాము.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 14.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
సునామీల గురించి ముందుగా పసిగట్టడం :

సునామీకి కారణమయ్యే భూకంపాల గురించి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దాదాపు వెనువెంటనే హెచ్చరికలు జారీచేయవచ్చు. సునామీ కేంద్రం నుంచి తీరం ఎంత దూరం అన్నదాన్ని బట్టి హెచ్చరిక ఎంత ముందుగా చేయవచ్చన్నది ఆధారపడి ఉంటుంది. హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

తీరప్రాంత అలల కొలతల పరికరాలు సునామీలను తీరం దగ్గరగా గుర్తించగలవు కానీ సముద్రంలోపల ఇవి ఉపయోగపడవు. సముద్రం లోపలి కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లు సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి. సునామీ మీటర్లు సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
1. సునామీకి కారణం ఏమిటి?
జవాబు:
భూకంపం.

2. హెచ్చరికలు ఎలా సాధ్యం?
జవాబు:
ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సాధ్యం

3. హెచ్చరికలో ఏమి చెబుతారు?
జవాబు:
హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

4. సునామీ డిటెక్టర్లు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి.

5. సునామీ మీటర్లు ఏం చేస్తాయి?
జవాబు:
సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.

ప్రశ్న 15.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.

టీచర్లు, విద్యార్థులు ఒక ప్రాంత జనాభాలో సమగ్రభాగం. విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్లకు ముఖ్యమయిన పాత్ర ఉంది. తల్లిదండ్రులు, ఇతర ప్రజలలో అవగాహన కల్పించటంలో విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించవచ్చు. ఈ విషయంలో విద్యార్థులకు మార్గదర్శనం చేయటం ఉపాధ్యాయుల గురుతరమైన బాధ్యత.
1. టీచర్లు, విద్యార్థులు ఎవరు?
జవాబు:
వీరు ఒక ప్రాంత జనాభాలో సమభాగం.

2. దేనిలో వీరికి ముఖ్య మైన పాత్ర ఉంది?
జవాబు:
విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్ళకు ముఖ్యమైన పాత్ర ఉంది.

3. విద్యార్థులు ఎవరికి అవగాహన కల్పిస్తారు?
జవాబు:
తల్లిదండ్రులకు, ఇతర ప్రజలకు.

4. విద్యార్థులకు ఎవరు మార్గదర్శనం చేస్తారు.
జవాబు:
ఉపాధ్యాయులు.

ప్రశ్న 16.
‘వాటర్ షెడ్ అభివృద్ధి’ పేరాను చదివి, రెండు ప్రశ్నలను తయారు చేయుము.
జవాబు:

  1. IWMP ని ఎవరు అమలు చేస్తున్నారు?
  2. ఏవేనీ రెండు ప్రత్యామ్నాయ జీవనోపాధుల పేర్లు రాయండి.

పట నైపుణ్యాలు

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 4
ప్రశ్న 17.
సునామీ ఏయే ప్రాంతాలను తాకింది?
జవాబు:
అలప్పుజా, కొల్లం, కన్యాకుమారి, కడలూర్, నాగపట్నం, చైన్నై, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతం మరియు అండమాన్ నికోబార్ దీవులు.

ప్రశ్న 18.
ఇవి ఏ తీరంలో ఉన్నాయి?
జవాబు:
ఎక్కువ ప్రదేశాలు తూర్పు తీరంలో, కొన్ని దక్షిణ తీరంలోనూ ఉన్నాయి.

ప్రశ్న 19.
కరవు అంటే ఏమిటి?
జవాబు:
కరవు అన్నది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి విపత్తు. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని వాతావరణ కరవు అంటారు.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 20.
ప్రకృతి విపత్తులలో రకాలేవి?
జవాబు:

  1. భూకంపాలు
  2. తుపానులు
  3. వరదలు
  4. కరవు
  5. సునామి
  6. కొండచరియలు విరిగిపడటం
  7. అగ్నిపర్వతాలు
    బ్రద్దలవటం మొదలైనవి.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

SCERT AP 8th Class Social Study Material Pdf 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం

8th Class Social Studies 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి : (AS1)
1. తమ పాలనలో ఉన్న దేశాల మధ్య పోటీలు నిర్వహించటానికి క్రికెట్ ను వలస పాలకులు ప్రోత్సహించారు.
2. పాశ్చాత్యీకరణ చెందటానికి ప్రజలు ఈ ఆటను నేర్చుకోసాగారు.
3. భారతీయ గ్రామస్తులు క్రికెట్ ఆడేవాళ్లు.
4. మంచి నడవడిక అలవాటు చేయటానికి ఈ ఆటను పాఠశాలల్లో ప్రవేశపెట్టారు.
జవాబు:
2. ఈ ఆటను అభిమానించి ప్రజలు నేర్చుకోసాగారు.
3. ఇంగ్లాండు గ్రామస్థులు క్రికెట్టు ఆడేవాళ్లు.

ప్రశ్న 2.
క్రికెట్టు, ఇతర ఆటలపై గాంధీజీ దృక్పథం గురించి కొన్ని వాక్యాలు రాయండి. (AS1)
జవాబు:
శరీరం, మనసు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని మహాత్మాగాంధి నమ్మాడు. అయితే క్రికెట్, హాకీ వంటి ఆటలు బ్రిటిషు వాళ్ల ద్వారా భారతదేశంలోకి దిగుమతి చేసుకోబడి సంప్రదాయ ఆటలను కనుమరుగు చేస్తున్నాయని అతడు తరచు విమర్శించేవాడు. ఇది వలస పాలిత మనస్తత్వాన్ని చూపిస్తోంది. చేనులో పనిచేయడం ద్వారా పొందే వ్యాయామంతో పోలిస్తే ఈ ఆటల వల్ల విద్యాప్రయోజనం చాలా తక్కువ.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 3.
కింది వాటిని కుషంగా వివరించండి. (AS2)
• భారతదేశంలో క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయటంలో పార్శీలు మొదటివాళ్లు.
• ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి దుబాయికి మారటంలోని ప్రాముఖ్యత.
జవాబు:
భారతీయ క్రికెట్ అంటే భారతీయులు ఆడిన క్రికెట్టు బొంబాయిలో పుట్టింది. ఈ ఆటను మొదట చేపట్టిన వాళ్లు తక్కువ సంఖ్యలో ఉన్న పార్శీలు. తమ వ్యాపారాల వల్ల బ్రిటిషువాళ్లతో మొదట పరిచయం అయింది పార్శీ సమాజానికి, మొదట పాశ్చాత్యీకరణ చెందింది వీళ్లే. భారతదేశ మొదటి క్రికెట్టు క్లబ్బును వీళ్లు 1848లో బొంబాయిలో స్థాపించారు, దాని పేరు ఓరియంటల్ క్రికెట్ క్లబ్. పార్శీ వ్యాపారస్తులైన టాటాలు, వాడియాలు పార్శీ క్రికెట్ క్లబ్బులకు నిధులు సమకూర్చారు, వాటికి ప్రాయోజకులుగా ఉన్నారు. అయితే భారతదేశంలోని శ్వేతజాతీయ కులీనులు ఈ ఆటలో ఆసక్తి కనబరుస్తున్న పార్శీలకు ఏ విధంగానూ సహాయపడలేదు. వాస్తవానికి తెల్లజాతివాళ్లకే పరిమితమైన బాంబే – జింఖానాలో పార్కింగ్ ప్రదేశం వినియోగించుకోవటంలో పార్శీ క్రికెటర్లతో తెల్లజాతి వాళ్లు గొడవపడ్డారు.

వలస పాలకులు శ్వేత జాతీయుల పట్ల పక్షపాతం వహిస్తారని నిర్ధారణ కావటంతో క్రికెట్టు ఆడటానికి పార్శీలు తమ సొంత జింఖానా ఏర్పాటు చేసుకున్నారు. పార్శీలకు, జాతి వివక్షత ప్రదర్శించిన బాంబే జింఖానాకు మధ్య వైరుధ్యంలో భారతీయ తొలి క్రికెట్టు ఆటగాళ్లకు తీయని విజయం లభించింది. 1885లో భారత జాతీయ కాంగ్రెసు ఏర్పడిన నాలుగు సంవత్సరాలకు అంటే 1889లో క్రికెట్టులో బాంబే జింఖానాని ఒక పార్శీ బృందం ఓడించింది.

సిడ్నీలో జరిగే మ్యాచులు నేడు సూరత్ లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఈ చిన్న వాస్తవం క్రికెట్ అధిపత్యంలోని సమీకరణలను మార్చివేసింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించిపోవటంతో మొదలైన ప్రక్రియ ప్రపంచీకరణతో దాని తార్కిక ముగింపుకి చేరుకుంది. క్రికెట్ ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నందువల్ల, క్రికెట్‌కు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్నందువల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి పన్నులు లేని దుబాయికి మారటం ఈ మార్పును సంకేతంగా సూచిస్తోంది.

ప్రశ్న 4.
ఏదైనా ఒక స్థానిక ఆట చరిత్ర తెలుసుకోండి. మీ తల్లిదండ్రులను, తాతా, అవ్వలను వాళ్ల బాల్యంలో ఈ ఆటను ఎలా ఆడేవాల్లో అడగండి. ఇప్పుడు కూడా ఆ ఆటను అలాగే ఆడుతున్నారా? మార్పులకు కారణమైన చారిత్రక శక్తులు ఏమై ఉంటాయో ఆలోచించండి. (AS3)
జవాబు:
‘కబడ్డీ’ అంటే ‘కూత’ అని అర్థం. ఇది కౌరవులు, పాండవుల కాలం నాటి నుండి మన దేశంలో ఉన్నది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ‘చిక్ చిక్’ అని, కొన్ని ప్రాంతాల్లో ‘చెడుగుడు’ అని అంటారు. మా ప్రాంతంలో దీనిని ‘కబడ్డీ – కబడ్డీ! అంటారు. ఇది రెండు జట్ల మధ్య జరిగే పోటీ. జట్టుకు 12 మంది సభ్యులుంటారు. కాని జట్టుకు 7 మంది మాత్రమే ఆటలో పాల్గొంటారు.

ఈ ఆటలో కొన్ని నియమాలు :

  1. నిర్ణీత కాలవ్యవధిలో ఆడే ఆట.
    15 నిమిషాలు – 5 నిమిషాలు విశ్రాంతి – 15 నిమిషాలు.
  2. ‘అవుట్’ అయిన వాళ్లు బరి నుండి బయటకు వెళ్ళాలి.
  3. ‘పాయింట్’ వచ్చినపుడు లోపలికి రావాలి.
  4. ‘7 గురు’ అవుట్ అయితే ‘లోనా’ అంటారు.
  5. ‘లోనా’కి అదనంగా 2 పాయింట్లు వస్తాయి.

దీని యొక్క నియమాలు ‘కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ వారు రూపొందిస్తారు. రాష్ట్రస్థాయిలో కూడా ఈ సంస్థ ఉన్నది.

ఈ ఆట అనేక మార్పులకు, చేర్పులకు లోనయింది. ఇటీవలి కాలంలో ‘బోనస్ లైన్ పాయింట్’ ను ఇవ్వడం మొదలు పెట్టారు. అంటే 6 లేదా 7 గురు క్రీడాకారులు బరిలో ఉండగా వారి బోనస్ లైన్ ను తాకి వచ్చిన వారికి ఒక పాయింట్ అదనంగా వస్తుంది. అయితే ఆటలో కూత మాత్రం ఆపరాదు.

ప్రశ్న 5.
సాంకేతిక విజ్ఞానంలో, ప్రత్యేకించి టెలివిజన్ సాంకేతిక విజ్ఞానంలో మార్పులు ప్రస్తుత క్రికెట్ ను ఏ రకంగా ప్రభావితం చేసాయి? (AS4)
జవాబు:
రంగు రంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర రక్షణలో పరిమితులు, దీప కాంతులలో క్రికెట్టు వంటివి పాకర్ అనంతర ఆటలో ప్రామాణికంగా మారాయి. అన్నిటికీమించి క్రికెట్టును సొమ్ము చేసుకోగల ఆటగా, పెద్ద ఎత్తున ఆదాయాలు సమకూర్చే ఆటగా పాకర్ దానికి గుర్తింపు తెచ్చాడు. టెలివిజన్ కంపెనీలకు ప్రసార హక్కులు అమ్ముకోవటం ద్వారా క్రికెట్టు బోర్డులు విపరీతంగా డబ్బును సంపాదించాయి. టీ.వీకి అతుక్కుపోయిన క్రికెట్టు అభిమానులకు వాణిజ్య ప్రకటనలు జారీ చేయటానికి వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేయసాగాయి. టెలివిజన్లో నిరంతర ప్రసారాల వల్ల క్రికెట్టు ఆటగాళ్లు హీరోలైపోయారు. క్రికెట్టు బోర్డు వీళ్లకి చెల్లించే మొత్తం గణనీయంగా పెరిగింది. అంతేకాదు టైర్ల నుంచి శీతల పానీయాల వరకు వివిధ వస్తువులకు వాణిజ్య ప్రకటనలలో పాల్గొనటం ద్వారా క్రికెట్టు ఆటగాళ్లు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించసాగారు. టెలివిజన్ ప్రసారాలు క్రికెట్ ఆటను మార్చివేశాయి. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలో సైతం ప్రసారం చేయటం ద్వారా క్రికెట్ ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. క్రికెట్ ఆడే వాళ్ల సామాజిక నేపథ్యాన్ని కూడా విస్తరింపచేసింది. పెద్ద పట్టణాల్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచు చూసే అవకాశం లేని పిల్లలు ఇప్పుడు తమ అభిమాన క్రీడాకారులను అనుకరించి, ఆట నేర్చుకోగలిగారు. ఉపగ్రహ టెలివిజన్ సాంకేతిక విజ్ఞానం వల్ల, బహుళజాతి టెలివిజన్ కంపెనీల వల్ల, క్రికెట్ కి అంతర్జాతీయ మార్కెట్టు ఏర్పడింది.

ఈ రకంగా టెలివిజన్ సాంకేతిక విజ్ఞానంలో మార్పులు ప్రస్తుత క్రికెట్ ను ప్రభావితం చేసాయి.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 6.
క్రికెట్టు వాణిజ్య క్రీడగా మారటం వల్ల సంభవించిన పరిణామాలపై ఒక కరపత్రం తయారు చేయండి. (AS6)
జవాబు:
కరపత్రం

సిడ్నీలో జరిగే మ్యాచులు నేడు సూరత్ లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఈ చిన్న వాస్తవం క్రికెట్ అధిపత్యంలోని సమీకరణలను మార్చివేసింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించిపోవటంతో మొదలైన ప్రక్రియ ప్రపంచీకరణతో దాని తార్కిక ముగింపుకి చేరుకుంది. క్రికెట్టు ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నందువల్ల, క్రికెట్ కు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్నందువల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి పన్నులు లేని దుబాయికి మారటం ఈ మార్పును సంకేతంగా సూచిస్తోంది.

పాత ఆంగ్ల-ఆస్ట్రేలియా, అక్షం నుంచి క్రికెట్టు కేంద్రం మారిందనటానికి మరొక ముఖ్య సంకేతంగా చెప్పవచ్చు: క్రికెట్ పద్ధతుల్లో వినూత్న ప్రయోగాలు ఉపఖండ దేశాలైన భారత, పాకిస్తాన్, శ్రీలంక వంటి క్రికెట్లు దేశాల నుంచి వచ్చాయి. బౌలింగ్ లో రెండు గొప్ప పరిణామాలకు పాకిస్తాన్ బీజం వేసింది : ‘దూస్‌రా’, ‘రివర్స్ స్వింగ్’. ఈ రెండు నైపుణ్యాలు కూడా ఉపఖండంలోని స్థితులకు అనుగుణంగా రూపొందాయి. బరువైన ఆధునిక బ్యాటులతో దుందుడుకు ఆటగాళ్ళు ‘ఫింగర్ స్పిన్’కి చరమగీతం పాడుతున్న పరిస్థితుల్లో ‘దూరా’ ముందుకొచ్చింది. నిర్మలమైన ఆకాశం కింధ, వికెట్టుపడని దుమ్ము పరిస్థితులలో బంతిని కదిలించటానికి ‘రివర్స్ స్వింగ్’ వచ్చింది. మొదట్లో ఈ రెండు పద్ధతులను బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుమానంతో చూశాయి. క్రికెట్టు నియమాలను అక్రమంగా మారుస్తున్నారని ఇవి ఆరోపించాయి. బ్రిటిషు, ఆస్ట్రేలియాలోని ఆట పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే క్రికెట్లు నియమాలను రూపొందించటం సాధ్యం కాదని కాలక్రమంలో రుజువయ్యింది, ప్రపంచవ్యాప్తంగా బౌలర్లు అందరూ ఉపయోగించే పద్ధతిగా ఇవి మారాయి.

నూటయాభై సంవత్సరాల క్రితం భారతదేశంలో మొదటి క్రికెట్టు ఆటగాళ్లిన పార్టీలు ఆడటానికి ఖాళీ ప్రదేశం కోసం పోరాడవలసి వచ్చింది. ఈనాడు ప్రపంచమార్కెటు ఫలితంగా భారతీయ ఆటగాళ్లకు అత్యధికంగా డబ్బులు చెల్లిస్తున్నారు, అత్యధిక ప్రజాదరణ కూడా వీళ్లకే ఉంది. ప్రపంచమంతా వీళ్లకి వేదికగా మారింది. ఎన్నో చిన్న చిన్న మార్పుల కారణంగా ఈ చారిత్రక మార్పులు సంభవించాయి. సరదా కోసం ఆడే పెద్దమనుషుల స్థానాన్ని, వృత్తిగా డబ్బు కోసం ఆడే క్రీడాకారులు తీసుకున్నారు. ప్రజాదరణలో టెస్టు మ్యాచ్ స్థానాన్ని ఒక రోజు మ్యాచు ఆక్రమించాయి. సాంకేతిక విజ్ఞానంలో, ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మారుతున్న కాలంతో మారటమే వ్యాపార చరిత్ర అవుతుంది.

ప్రశ్న 7.
ప్రపంచ పటంలో క్రికెట్ ఆడే ఐదు దేశాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 1

8th Class Social Studies 23rd Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు InText Questions and Answers

8th Class Social Textbook Page No.246

ప్రశ్న 1.
మీకు ఆటలు ఆడటం అంటే ఇష్టమా?
జవాబు:
అవును

– ఏ ఆటలు ఆడతారు?
జవాబు:
ఖో ఖో, వాలీబాల్, బాడ్మింటన్

– ఏ ఆట అంటే మీకు ఎక్కువ ఇష్టం?
జవాబు:
బాడ్మింటన్

– కేవలం ఆడపిల్లలు లేదా కేవలం మగపిల్లలు ఆడే ఆటలు పేర్కొనండి.
జవాబు:
కేవలం ఆడపిల్లలు ఆడే ఆట : తొక్కుడు బిళ్ళ
కేవలం మగపిల్లలు ఆడే ఆట : గోళీలు.

– కొన్ని ఆటలను కేవలం పల్లెల్లోనే ఆడతారా?
జవాబు:
అవును. ఉదా : చెడుగుడు

– కొన్ని ఆటలను కేవలం బాగా డబ్బు ఉన్న వాళ్లే ఆడతారా?
జవాబు:
అవును. ఉదా : గోల్ఫ్

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 2.
మీరు ఎందుకు ఆడతారు?
కింద ఇచ్చిన కారణంతో మీరు అంగీకరిస్తే (✓) టిక్కు పెట్టండి. అంగీకరించకపోతే (✗) గుర్తు పెట్టండి. మీకు అదనంగా తోచిన కారణాలను జాబితాకు చేర్చండి.

ఆటలు ఆడటం తేలిక.
ఆటలు ఆడటం సరదాగా ఉంటుంది.
తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు మెచ్చుకుంటారు.
ఆటలు సవాళ్లను విసురుతాయి.
ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
సచిన్, సానియా వంటి అభిమాన క్రీడాకారులను అనుకరించే అవకాశం.
చదువుల కంటే ఆటలు తేలిక.
టెలివిజన్లో కనపడతాం.
ఆటలలో రాత పరీక్షలు, ఇతర పరీక్షలు ఉండవు.
అంతర్జాతీయ పోటీలలో పతకాలు పొందవచ్చు.
దేశానికి ఖ్యాతి తీసుకురావటానికి
పేరు, డబ్బు, ఖ్యాతి గడించటానికి

ప్రశ్న 3.
తరగతిలోని విద్యార్థులందరి అభిప్రాయలను క్రోడీకరించి ఏ కారణాన్ని వారు ముఖ్యమైనదిగా భావిస్తున్నారో తెలుసుకోండి.
జవాబు:
మా తరగతిలో అందరూ ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.

ప్రశ్న 4.
వెండీస్ అన్న పేరు గల ఒక దేశం ఏదీ లేదన్న విషయం గుర్తించారా? బాగా వేగంగా పరిగెత్తే క్రీడాకారుడు ఏ. దీవులలో ఏ దీవి నుంచి వచ్చాడో గుర్తించండి.
జవాబు:
వెస్టండీస్ అనేవి కరేబియన్ దీవులు. ఇవి ఈ పేరు మీద 1958 నుండి 1962 వరకు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఇవి కొన్ని సార్వభౌమ దీవులుగాను, కొన్ని సెయింట్ కిట్స్, నివీలో భాగాలుగానూ, యు.కే. మీద ఆధారపడి కొన్ని, – డచ్ ఆధారితాలుగా కొన్ని, యు.యస్. మీద ఆధారపడి ఒకటి ఉన్నాయి. కాబట్టి ఈ పేరుమీద ఏ దేశం లేదు.

ఈ దీవులలో బాగా వేగంగా పరిగెత్తే క్రీడాకారుడు ‘ఉసియన్ బోల్ట్’ జమైకా దీవుల నుండి వచ్చాడు.

8th Class Social Textbook Page No.249

ప్రశ్న 5.
క్రికెట్టుకీ, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించటానికీ మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
క్రికెట్టు ఇంగ్లాండులో పుట్టింది, పెరిగింది. ఇది ఇంగ్లాండు వలస దేశాలలో రాణించింది. మార్పులు, చేర్పులు అన్నీ వీరి స్థాయిలోనే జరుగుతాయి. కాబట్టి క్రికెట్టుని ప్రోత్సహించడం అంటే పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడమే. ఇదే వాటి మధ్యనున్న సంబంధం.

ప్రశ్న 6.
ఇక్కడ ఆటలు ఆడటానికి వివిధ క్రీడా పరికరాలు ఉన్నాయి. మీకు స్థానికంగా దొరికే వాటితో పోలిస్తే వీటి నాణ్యత తేడాగా ఉందని మీరు గమనించి ఉంటారు. డబ్బుకోసం వృత్తి క్రీడాకారులు ఉపయోగించే ఈ పరికరాలను సరదా కోసం ఆదుకునే పిల్లలు కొనగలుగుతారా?
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 2
జవాబు:
ఇవి చాలా ఖరీదైన ఆట వస్తువులు. వీటిని మామూలు స్థాయివారు కొనలేరు. సరదా కోసం ఆడేవారు అసలే కొనలేరు. వృత్తి క్రీడాకారులు డబ్బు సంపాదిస్తారు, అదీగాక వీరిని పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి. కాబట్టి కొనగలుగుతారు.

8th Class Social Textbook Page No.250

ప్రశ్న 7.
టెస్టు క్రికెట్టు ప్రాముఖ్యత అంతరించటం వల్ల సంభవించిన మార్పుల జాబితా తయారు చేయండి.
జవాబు:

  1. 1970వ దశకంలో క్రికెట్ మారుతున్న ప్రపంచానికి అనువుగా మారటం మొదలెట్టింది.
  2. టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యత తగ్గి ఒకరోజు అంతర్జాతీయ పోటీ మొదలయ్యింది. ఇది జనాదరణ పొందింది.
  3. రెండు సంవత్సరాలు పాకర్ ‘సర్కస్’ అద్భుతంగా నిర్వహించబడింది.
  4. రంగు రంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర రక్షణలో పరిమితులు, దీపకాంతులలో క్రికెట్టు మొదలగునవి ప్రామాణికంగా మారాయి.
  5. క్రికెట్టు సొమ్ము చేసుకోగల ఆటగా మారింది.
  6. క్రికెట్టు బోర్డులు విపరీతంగా డబ్బును సంపాదించాయి.
  7. వాణిజ్య ప్రకటనలకు వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేసాయి.
  8. క్రికెట్ ఆటగాళ్ళు హీరోలైపోయారు. వీరు అనేక మార్గాలలో ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు.
  9. టెలివిజన్ ప్రసారాలు క్రికెట్టు ఆటను మార్చేశాయి. పల్లెల్లో సైతం ప్రేక్షకులు పెరిగారు.
  10. పట్టణాల్లో పిల్లలు తమ అభిమాన ఆటగాళ్ళ .ఆటను అనుకరించి, ఆట నేర్చుకుంటున్నారు.
  11. క్రికెట్టుకు అంతర్జాతీయ మార్కెట్టు ఏర్పడింది.

8th Class Social Textbook Page No.251

ప్రశ్న 8.
క్రికెట్టు గురించి కొంచెం సేపు ఆలోచించిన తరవాత వినాయక్ ఇంగ్లీషులోనే ఉన్న పదాలను కొన్నింటిని రాశాడు – ‘బౌండరీ’, ‘ఓవరు’, ‘వికెట్’. వీటికి తెలుగు పదాలు ఎందుకు లేవో అతడికి వివరించండి.
జవాబు:
క్రికెట్ అచ్చంగా ఇంగ్లీషు దేశంలో పుట్టింది. కాబట్టి దానికి సంబంధించిన పదాలన్నీ ఆ భాషలోనే ఉన్నాయి. వాటికి తెలుగు అనువాదాలు చేయటం కుదరదు. అందువలన అవి తెలుగులో లేవు.
ఉదా :
‘కబడ్డీ’ని అన్ని భాషలలో మనం కబడ్డీ అనే అంటాము. అనువాదం చేయలేము.

పట నైపుణ్యాలు

ప్రశ్న 11.
మీ అట్లా లో క్రికెట్ ఆడే దేశాలను గుర్తించండి. /Page No.247)

ప్రశ్న 12.
ప్రపంచ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్ఎండీస్.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 3

ప్రశ్న 13.
క్రీడలను, వాటిని ప్రోత్సహించే వారిని ప్రశంసించండి.
జవాబు:
క్రీడలు మానసిక వికాసంతోపాటు శారీరకాభివృద్ధిని పెంపొందిస్తాయి. పాఠశాల స్థాయి నుండే పిల్లల్లోని క్రీడాసక్తిని, అభిరుచిని గుర్తించి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుంది. ప్రభుత్వం వ్యవస్థాపరంగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అధ్వర్యంలో క్రీడాశాఖ దేశంలో క్రీడారంగం అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పాఠశాల స్థాయి నుండే ప్రతిభావంతులైన బాలబాలికలను గుర్తించి క్రీడామండలుల ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పరుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడలతోపాటు స్థానిక క్రీడాంశాలు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తూ విజేతలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రీడలు, క్రీడల పట్ల అభిరుచిని పెంపొందించడంతోపాటు అంతర్జాతీయంగా సాంస్కృతిక వికాసానికి, అవగాహనకు తోడ్పడి విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయి. భిన్న సంస్కృతులు కలిగిన మన దేశానికి జాతీయ సమైక్యతను పెంపొందించడానికి క్రీడలు ఇతోధికంగా దోహదం చేస్తున్నాయి.

ప్రశ్న 14.
భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్బును పార్నీలు ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు?
జవాబు:
భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్బును పార్శీలు 1848లో బొంబాయిలో స్థాపించారు.

ప్రశ్న 15.
రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిన పోటీ?
జవాబు:
రంజీ ట్రోఫీ క్రికెట్ కు సంబంధించిన పోటీ.

ప్రశ్న 16.
భారతదేశానికి టెస్ట్వ్య లో అవకాశం ఎప్పటిదాకా రాలేదు?
జవాబు:
భారతదేశానికి టెస్ట్ మ్యాచ్ లో అవకాశం 1952 దాకా రాలేదు.

ప్రశ్న 17.
ఏ దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది.
జవాబు:
1970 దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది?

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 18.
1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో ఏ దేశానిది పైచేయి?
జవాబు:
1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో భారత్ దే పైచేయి.

ప్రాజెకు

ఏదైనా ఒక క్రీడ గురించి సమాచారాన్ని సేకరించి, ఆ క్రీడా చరిత్రను నివేదిక రూపంలో రాయండి.
జవాబు:
కబడ్డీ :
మన భారతదేశానికి చెందిన ఒక సాంప్రదాయ క్రీడ – కబడ్డీ. ఈ కబడ్డీ మొదట దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఆవిర్భవించింది. ఒక గ్రూపు వాళ్ళు వేటాడుతుంటే మిగతావారు వారిని కాపాడుకోవడం అనే దాని నుండి ఆవిర్భవించింది.

మనదేశానికి చెందిన ప్రాచీన క్రీడ ఇది. ఈ క్రీడను వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.
బంగ్లాదేశ్ లో – హుదుదు అని
మాల్దీవులలో – బైబాల అని
ఆంధ్రప్రదేశ్ లో – చెడుగుడు అని
తమిళనాడులో – సడుగుడు అని
మహారాష్ట్రలో – హుటుటు అని. ప్రాంతీయ పేర్లతో పిలుస్తారు.

ఇది భారతదేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పంజాబు రాష్ట్రాలకు రాష్ట్ర క్రీడగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ 1936లో జరిగిన బెర్లిన్ ఒలంపిక్స్ లో ఈ ఆటకు అంతర్జాతీయ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

1938లో కలకత్తాలో జరిగిన భారతదేశ జాతీయ క్రీడలలో దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

1950లో All India కబడ్డీ ఫెడరేషన్ అనే దానిని స్థాపించి ఈ క్రీడకు నియమ నిబంధనలను రూపొందించడం జరిగింది.

ప్రస్తుతం స్త్రీల కబడ్డీ పోటీలు కూడా జరుగుతున్నాయి. భారతదేశంలో ప్రో కబడ్డీ పేరిట ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాల ‘జట్ల మధ్య పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడను ఆసియా క్రీడలలో కూడా చేర్చడం జరిగింది.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

SCERT AP 8th Class Social Study Material Pdf 18th Lesson హక్కులు – అభివృద్ధి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 18th Lesson హక్కులు – అభివృద్ధి

8th Class Social Studies 18th Lesson హక్కులు – అభివృద్ధి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిదిద్దండి. (AS1)
అ) ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించాలి.
ఆ) పథకాల అమలును కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించేలా ప్రజలు చూడాలి.
ఇ) సమాచార అధికారులు ఇష్టం వచ్చినంత కాలం సమాచారాన్ని వెల్లడి చేయకుండా ఉండవచ్చు.
ఈ) వివిధ పత్రాలు చూడటం ద్వారా కార్యక్రమాలు అవినీతి లేకుండా జరుగుతున్నాయని గుర్తించవచ్చు.
జవాబు:
ఆ) పథకాల అమలును ప్రజా ప్రతినిధులు, ప్రజలు కూడా పర్యవేక్షించాలి.
ఇ) అడిగిన సమాచారాన్ని అధికారులు నిర్దేశిత సమయంలో వెల్లడి చేయాలి.

ప్రశ్న 2.
“అవినీతిని ఎదుర్కోవడానికి సమాచారం అవసరం” శీర్షిక కింద గల పేరా చదివి దిగువ ప్రశ్నకు జవాబివ్వండి. (AS2)

ప్రభుత్వ వ్యవస్థ చాలా పెద్దది, సంక్లిష్టమయినది. విధానాలు, పథకాలు సక్రమంగా అమలు అయ్యేలా చూడటం చాలా కష్టం. పేదల ప్రయోజనాల కోసం, పేదరికం నిర్మూలన కోసం రూపొందించిన కార్యక్రమాలు సాధరణంగా వాళ్లకు చేరవు, నిధులు మళ్లింపబడతాయి. దీనికి ప్రధాన కారణం అవినీతి. ప్రభుత్వ కార్యక్రమాల గురించి, అవి అమలు అయ్యే తీరు గురించి ప్రజలకు సరైన సమాచారం లేకపోవటం అవినీతి ప్రబలటానికి ఒక ప్రధాన కారణమవుతోంది.
మీ ప్రాంతంలోని ఒక ప్రభుత్వ కార్యక్రమం అమలు తీరును పరిశీలించి నివేదికను తయారుచేయండి.
జవాబు:
మా ప్రాంతంలో ప్రభుత్వం వారు వికలాంగులకు, వృద్ధులకు ఫించన్లు ఇస్తున్నారు. ప్రతినెలకు వృద్ధులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500లు ఇస్తారు. ఈ నిధులు 2, 3 నెలలకు ఒకసారి విడుదల అవుతాయి. వీటిని స్థానిక సంస్థల ద్వారా వీరికి అందచేస్తారు.

అయితే వీటిని బట్వాడా చేయటానికి ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అందరినీ అక్కడికి రమ్మని చెబుతారు. దాదాపు ఒక్కో ప్రదేశంలో 400, 500 మంది వరకు 2, 3 రోజులు బట్వాడా జరుగుతుంది. పాపం వృద్ధులు, వికలాంగులు అంతంత సేపు ఎండలో, వానలో వరుసలో ఉండాల్సి వస్తుంది. ఒక్క రోజు సాయంత్రం వరకూ ఉన్నా వారికి రావాల్సిన సొమ్ము అందదు. మరలా మరుసటి రోజు రావాల్సి వస్తుంది. ఇదంతా చూడటానికి మాకు ఎంతో ఇబ్బందిగా, బాధగా అనిపించింది. ప్రభుత్వం ఆలోచించి వీరి లాంటి వారికి సొమ్మును నేరుగా ఇంటికే అందచేయవచ్చుగా అనిపించింది. ఇలాంటి విషయాలలో అధికారులు, నాయకులు మానవీయ కోణంలో ఆలోచించాలని మా ప్రార్థన.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 3.
సమాచార హక్కు చట్టం (స.హ.చ) ద్వారా సాధించిన విజయాలను వార్తాపత్రికల నుండి సేకరించి మీ తరగతిలో చెప్పండి. (AS3)
జవాబు:
వార్త – 1, న్యూఢిల్లీ :
హర్యానాకు చెందిన 70 సం||ల వృద్ధురాలు లక్ష్మి సింగ్ తన కుమారుడు అనూప్ సింగ్ ను ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకుంది. అనూప్ సింగ్ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. అతను మరణించిన తరువాత అతని భార్యకు ఫించను ఇచ్చారు. కాని ఆమె కొద్ది సం||ల తరువాత ద్వితీయ వివాహం చేసుకుంది. లక్ష్మి దిక్కులేనిదయింది. అప్పుడు ఆమె స.హ. చట్టం ద్వారా పిటీషను పెట్టుకోగా ప్రభుత్వం వారు ఫించను మార్చి ఆమెకు ఇచ్చారు.

వార్త -2:
క్షేత్రమణి భువనేశ్వర్ లో ఒక చిన్న స్థలం కొనుక్కుంది. అమ్మకందారు, ఆమె రిజిష్ట్రార్ ఆఫీసులో రిజిష్టరు చేసుకున్నారు. కాని అక్కడి గుమాస్తా 1½ సం||రం అయినా ఆమెకు డాక్యుమెంట్లు ఇవ్వలేదు. దానితో స.హ. చట్టం ఆఫీసును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఇచ్చిన కొద్ది సేపటికే ఆమె కాగితాలు ఆమెకు తెచ్చి ఇచ్చాడు ఆ గుమాస్తా.

వార్త -3:
లక్నోలో నివసిస్తున్న ఆషియానా 13 సం||ల బాలిక. మే 2005లో ఆమె ఆరుగురుచే సామూహిక అత్యాచారానికి గురి అయింది. అయితే అందులో ప్రథమ నిందితుడు తాను మైనరనని సాక్ష్యాలు చూపించి జువెనైల్ కోర్టుకు కేసును మరల్చాడు.

ఆషియానా తండ్రి స.హ. చట్టం ద్వారా అతని డ్రైవింగ్ లైసెన్సును, తుపాకీ లైసెన్సును పొందిన వివరాలను సేకరించి వాటిని కోర్టుకు సమర్పించాడు. అప్పుడు కోర్టు అతనిని ‘ఆ సంఘటన జరిగినప్పుడు అతను మేజరే’ అని తేల్చింది.

వార్త – 4:
‘నాకాబందీ’ సమయంలో మోటారు వాహనాలలో కూర్చుని కనబడకుండా కొంతమంది తప్పించుకుంటున్నారని స.హ. చట్టం ద్వారా అప్పీలు చేయటం మూలంగా ప్రభుత్వం ఈ క్రింది రూలు విధించింది.

మోటారు కార్ల అద్దాలకు డార్క్ ఫిల్ములుగానీ, ఏ ఇతరాలు కానీ అంటించరాదు. ఇది 4.5.2012 నుండి అమలులోనికి వచ్చింది.

ప్రశ్న 4.
విద్యాహక్కు చట్టం బాలలకు వరం వంటిది. వివరించండి: (AS1)
జవాబు:
6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ ఉచిత విద్యకు హక్కు ఉందనీ విద్యాహక్కు చట్టం తెలియచేస్తుంది. పిల్లల పరిసర ప్రాంతాలలో తగినన్ని పాఠశాలలు నిర్మించటం, సరైన అర్హతలున్న టీచర్లను నియమించటం, అవసరమైన సౌకర్యాలన్నింటినీ కల్పించటం వంటి పనులను ప్రభుత్వం చేయాలి. విద్య పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలని, చదువు పిల్లలను కేంద్రంగా చేసుకుని కృత్యాల ద్వారా, పరిశోధన, ఆవిష్కరణ పద్ధతుల ద్వారా సాగాలని చట్టం చెబుతోంది. పిల్లలు మాతృభాషలో చదువు నేర్చుకోవాలని, వాళ్ళు భయం, ఆందోళనలు లేకుండా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచాలని కూడా చట్టం చెబుతోంది.

పరిసర ప్రాంతాలలో పాఠశాలలు అందుబాటులో లేకపోయినా, పాఠశాలల్లో బోధనకు తగినంతమంది టీచర్లు లేకపోయినా, బోధన – అభ్యసన పరికరాలు తగినన్ని అందుబాటులో లేకపోయినా, పిల్లలను కొట్టినా, భయభ్రాంతుల్ని చేసినా అటువంటి సందర్భాలలో అధికారులపై పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఫిర్యాదు చేయవచ్చు.

కాబట్టి ఇది బాలలకు వరం.

ప్రశ్న 5.
మీకు ఇంకా ఏమైనా హక్కులు అవసరమని భావిస్తున్నారా? అవి ఏమిటి? ఎందుకు? (AS4)
జవాబు:
ఈ పాఠం చదివిన తరువాత ఈ హక్కులు బాధ్యతతో కూడినవి అని అర్ధం చేసుకున్నాను. నాకు ఏమి కావాలో అన్నీ నా దేశం చూసుకుంటోంది. కాబట్టి నాకు కొత్త హక్కులు అవసరం లేదు. ఉన్న హక్కులను పొందటానికి, కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను.

ప్రశ్న 6.
సమాచార హక్కు చట్టం ప్రకారం మీ పాఠశాల గురించి ప్రధానోపాధ్యాయుడిని ఏ సమాచారం అడుగుతారు? (AS4)
జవాబు:
సమాచార చట్టం హక్కు ప్రకారం పాఠశాల గూర్చి ప్రధానోపాధ్యాయునికి అడిగే సమాచారం.

  1. పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం యిచ్చిన నిధులెంత?
  2. ఆ నిధులను దేనికొరకు ఖర్చు చేసారు?
  3. పాఠశాల మరమ్మతులు, నిర్మాణం కోసం నిధులు వచ్చాయా? వస్తే ఎంత వచ్చాయి? వేటికొరకు ఎంత ఖర్చు చేస్తారు?
  4. బడిపిల్లలందరికీ పాఠ్యపుస్తకాలు ఉచితంగా సరఫరా చేసారా?

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 7.
అవినీతిని ఎదుర్కోవడానికి సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుందని ఎలా చెప్పగలవు? (AS6)
జవాబు:
అవినీతిని ఎదుర్కొనడంలో సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుంది. ఈ చట్టం ద్వారా ఎటువంటి సమాచారాన్నైనా పొందే హక్కు ప్రజలకు లభించింది. దీంతో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేసిన పథకాలు, ఖర్చు, లబ్దిదారుల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయిలో వాస్తవంగా అమలుజరిగిన దానితో పోల్చడం ద్వారా అవినీతి జరిగితే తెలుసుకొని పోరాడవచ్చు.

8th Class Social Studies 18th Lesson హక్కులు – అభివృద్ధి InText Questions and Answers

8th Class Social Textbook Page No.204

ప్రశ్న 1.
పేజి నెం. 204 లో ఉన్న ఉదాహరణలోని పవన్, అతడి తల్లి గౌరవప్రదమైన జీవనం గడుపుతున్నారా?
జవాబు:
ఎవరైనా సరే చట్ట, ధర్మ విరుద్ధమైన పనులు చేయకుండా జీవనం సాగిస్తే అది గౌరవప్రదమైన జీవనమే అవుతుంది. పవన్ తల్లి వేరొకరింట్లో కష్టపడి పనిచేయటం గౌరవకరమే. కానీ పవన్ గుడి దగ్గర అడుక్కోవడం మాత్రం సరియైనది కాదు అని నా భావన.

ప్రశ్న 2.
దేని ద్వారా వాళ్లకి గౌరవప్రదమైన జీవనం దొరుకుతుంది?
జవాబు:
కష్టించి పనిచేసి జీవనం గడపటం ద్వారా మాత్రమే వారికి గౌరవప్రదమైన జీవనం దొరుకుతుంది.

ప్రశ్న 3.
తమకు కావలసింది చేసే స్వేచ్ఛ పవన్‌కు కానీ, అతడి తల్లికి కానీ ఉందా?
జవాబు:
ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా, అధికారులైనా పనిలో స్వతంత్రంగా వ్యవహరించరాదు, వ్యవహరించలేరు. అలాగే వీరు కూడా పని వ్యవహారంలో యజమానిని అనుసరించి పోవాలి. స్వంత విషయాలలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించ వచ్చు.
ఉదా :
పవన్ తల్లి ఇష్టం లేకపోతే వారింట పని మానేయవచ్చు. వేరే చోట చేరవచ్చు.

ప్రశ్న 4.
పవన్, అతడి తల్లి ఈ విధమైన జీవితం గడపటానికి ఎవరు కారణం? వాళ్ల పరిస్థితికి వాళ్లనే నిందించాలా?
జవాబు:
వీరి పరిస్థితికి తరతరాలుగా వస్తున్న వ్యవస్థ కారణం అని చెప్పాలి. సమాజంలో ధనికులు ఇంకా ధనికులుగాను, పేదవారు కటిక పేదవారుగానూ మారతారు. వీరు కూడా అంతే. భారతదేశంలో ‘కర్మ’ అని ఎవరికి వారే నిందించుకోవడం అలవాటు. అలాగే వారినే నిందించుకోవాలి లేదా వ్యవస్థ తీరును నిందించాలి.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 5.
గౌరవప్రదమైన, స్వేచ్ఛతో కూడిన జీవితం పవన్, అతడి తల్లి జీవించగలిగేలా చూడాల్సిన బాధ్యత ఎవరిది?
జవాబు:
గౌరవప్రదమైన, స్వేచ్ఛతో కూడిన జీవితం పవన్, అతడి తల్లి జీవించగలిగేలా చూడాల్సిన బాధ్యత సమాజానిది, ప్రభుత్వానిది.

8th Class Social Textbook Page No.206

ప్రశ్న 6.
ఒక రోడ్డు లేదా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని గుత్తేదారులు ఎలా నిర్వహిస్తున్నారో చర్చించండి.
జవాబు:
ఏదైన ఒక రోడ్డు లేదా ఇల్లు నిర్మించాలంటే ప్రభుత్వ సంస్థలు లేదా పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థలు ముందు గుత్తేదారుల నుండి టెండర్లు స్వీకరిస్తారు. టెండర్లలో ఆ కట్టడాన్ని వారు కోరిన విధంగా నిర్మించడానికి ఎవరు అతితక్కువ ధరని ‘కోట్’ చేస్తారో వారికి మాత్రమే కాంట్రాక్టు ఇస్తారు. పని మొదలు పెట్టిన తరువాత గుత్తేదారులు నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేయాలి. ఏ సిమెంటు వాడారు? సిమెంటు, ఇసుక ఏ నిష్పత్తిలో కలిపారు, ఇటుక మందం ఎంత, కొలతలు మొదలైనవి అన్నింటిని ఒక పుస్తకంలో నమోదు చేసి ఉంచుతారు. ఎంతమంది కూలీలు ఎన్ని రోజులు పని చేశారు? వారి కూలిరేట్లు ఎంత? ఎంత చెల్లించారు? మొదలైనవన్నీ దీంట్లో నమోదు చేసి ఉంటాయి. నిర్మాణం తాలూకు యజమాని (ప్రభుత్వం / ప్రైవేటు సంస్థ) వీటిని చూసి, నాణ్యతను పరీక్షించి, వీరికి వాయిదాలలో సొమ్ము చెల్లిస్తారు. ప్రభుత్వం వారయితే సంబంధించిన ఇంజనీరుతో పర్యవేక్షింపచేస్తారు.

ప్రశ్న 7.
ఈ సమాచారాన్ని సరిచూడటం ద్వారా, జవాబుదారీతనాన్ని ఎలా పెంచవచ్చు?
జవాబు:
ఈ సమాచారాన్ని సరిచూడటం ద్వారా పనిచేసేవారికి, దానిని పర్యవేక్షించేవారికి కూడా కొంత భయం, తప్పనిసరి నిజాయితీ అలవడతాయి. దాని మూలంగా జవాబుదారీతనం పెరుగుతుంది.

8th Class Social Textbook Page No.208

ప్రశ్న 8.
గత సంవత్సర కాలంలో మీ ఉపాధ్యాయులకు విద్యాశాఖనుంచి వచ్చిన ఆదేశాలు, నివేదికలు, సలహాలు, లాగ్ పుస్తకాల వంటి వాటి జాబితా తయారుచేయండి. విద్యాశాఖకు అందచేయటానికి పాఠశాల ఎటువంటి రికార్డులు నిర్వహిస్తుంది? మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రికార్డులు ఎలా నిర్వహిస్తారు?
జవాబు:
విద్యాశాఖ నుండి ఆదేశాలు, నివేదికలు, సలహాల జాబితా :

  1. బడి ఈడు బాలబాలికలు పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  2. డ్రాపవుట్సును తిరిగి పాఠశాలకు రప్పించాలి.
  3. విద్యార్థులందరికీ ఉచిత యూనిఫాం, టెక్స్ట్ పుస్తకాలు అందచేయాలి.
  4. పదవ తరగతి విద్యార్ధులకు అదనపు తరగతులు నిర్వహించాలి.
  5. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలుచేయాలి.
  6. విద్యార్థులకు కంటిచూపు పరీక్షలు నిర్వహించి, తగు వైద్యం అందించాలి.
  7. విద్యార్థులకు Deworming మాత్రలు వేయాలి.
  8. విద్యార్థుల హాజరు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  9. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి.

పాఠశాల నిర్వహించే రికార్డులు :

  1. అడ్మిషను రిజిస్టరు
  2. టి.సీ.ల పుస్తకం
  3. హాజరు పట్టీలు
  4. మధ్యాహ్న భోజన వివరాల రిజిస్టరు.
  5. జీతాల రిజిస్టరు, బిల్లులు
  6. విజిటర్సు రిజిస్టరు
  7. మార్కుల రిజిస్టరు మొదలైనవి

మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రికార్డులు :
1. బియ్యం రిజిస్టరు
2. తేదీ
AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి 1
3. రోజువారీ మెనూ పుస్తకం
4. నెలవారీ లెక్కల రిజిస్టరు మొ||నవి.

ప్రశ్న 9.
రాష్ట్ర సమాచార కమిషన్ సందర్భంలో ‘స్వతంత్ర’ అన్న పదం ఎందుకు కీలకమైంది?
జవాబు:
రాష్ట్ర సమాచార కమిషన్ పాలనా యంత్రాంగానికో, కార్యనిర్వాహక వర్గానికి అనుబంధమైతే అది అవినీతిని ప్రశ్నించలేదు, అరికట్టలేదు. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించలేదు. కాబట్టి అది ‘స్వతంత్రం’గానే వ్యవహరించాలి, ఉండాలి. – అందువలన ‘స్వతంత్ర’ అన్న పదం కీలకమైంది.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 10.
ఆరోగ్యశాఖలో, సమాచార అధికారిని అడగటానికి ప్రశ్నల జాబితా తయారుచేయండి.
జవాబు:

  1. విపత్కర సమయాలలో రోగులను ఆదుకోవటానికి అంబులెన్స్ లు ఎన్ని ఉన్నాయి?
  2. ప్రాంతీయ ఆసుపత్రులలో సౌకర్యాలు ఏమి ఉన్నాయి?
  3. గ్రామీణ ప్రాంతాలలో వైద్యులు కొనసాగటానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారు?
  4. ‘పిచ్చి కుక్కలు వంటివి కరిచినప్పుడు ఉపయోగించాల్సిన మందులు అన్ని చోట్లా ఉన్నాయా?
  5. ‘ఆరోగ్యశ్రీ’లో ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించే సొమ్మును ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణకు ఎందుకు ఉపయోగించడం లేదు?

8th Class Social Textbook Page No.210

ప్రశ్న 11.
మీ బడి ఈ ప్రామాణికాలకనుగుణంగా ఉందా?
జవాబు:
అవును. మా బడి ఈ ప్రామాణికాలకు అనుగుణంగానే ఉన్నది.

  1. మా పాఠశాలలో సరైన అర్హతలున్న టీచర్లు ఉన్నారు.
  2. అవసరమైన సౌకర్యాలున్నాయి.
  3. పారాలు ల్యాబ్ లో, LCD రూములలో బోధించబడుతున్నాయి.
  4. మేము పాఠశాలలో బాధ్యతతో కూడిన స్వేచ్ఛను అనుభవిస్తాము.
  5. మా ఉపాధ్యాయులు మమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు.

ప్రశ్న 12.
అవసరమైతే మీ బడి పనితీరుపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలుసుకోంది.
జవాబు:
అవసరమైతే బడి తీరుపై జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారికి, రాష్ట్రస్థాయిలో డైరెక్టరు, పాఠశాల విద్యకు ఫిర్యాదు చేయాలి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

SCERT AP 8th Class Social Study Material Pdf 22st Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు

8th Class Social Studies 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సినిమాలకు, నాటకాలకు ఉన్న మూడు తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:

సినిమాలు నాటకాలు
1. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. 1. తక్కువ ఖర్చుతో కూడుకున్నవి.
2. ఒకేసారి అనేక చోట్ల ప్రదర్శించబడతాయి. 2. ఒక్కసారీ ఒక్కచోట మాత్రమే ప్రదర్శించగలుగుతారు.
3. అనేక ప్రాంతాలలో చిత్రీకరిస్తారు. 3. ఒక్క స్టేజీపైనే అన్నీ చూపించటానికి ప్రయత్నిస్తారు.

ప్రశ్న 2.
మీ తెలుగు పాఠ్యపుస్తకంలోని ఏదైనా కథను లేదా పాటను చిన్న సినిమాగా తీయవచ్చా? దీని ఆధారంగా సినిమా తీయటానికి ఎవరెవరు అవసరమో జాబితా తయారుచేయండి. (AS1)
జవాబు:
తీయవచ్చును. దీనికి నిర్మాత, దర్శకుడు, ఎడిటరు, కెమెరామెన్, నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు, గాయకులు, మ్యూజీషియన్లు ఇంకా ఇతర పనివారు కావాలి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 3.
“సమాజాన్ని మార్చటానికి సినిమా ఒక బలమైన ఆయుధం,” అని కొంతమంది వాదిస్తారు, “సినిమా ప్రభావం చెడుగా ఉంటుంది,” అని మరికొంతమంది అంటారు. మీరు ఎవరితో ఏకీభవిస్తారు? ఎందుకు? (AS4)
జవాబు:
“సమాజాన్ని మంచిగా కాని, చెడుగా కాని మార్చటానికి సినిమా ఒక బలమైన ఆయుధం” – అని నేను భావిస్తాను. అంటే మార్పు ఎటువంటిదైనాకాని, సినిమాకు ఆ శక్తి ఉన్నది.

కారణం :
సినిమా ఒక విలువైన మాధ్యమం. వినోదం కోసం వీటిని చూసినా కొన్ని విషయాలు మనసుకు హత్తుకుంటాయి. చిన్న చిన్న విషయాలే మనుషుల ప్రవర్తనను మారుస్తుంటాయి.

ఉదా :

  1. ‘పోకిరి’ సినిమా చూసిన తరువాత మగ పిల్లలందరూ రెండు షర్టులు ధరించడం మొదలు పెట్టారు.
  2. పూర్వం కొన్ని సినిమాలలో హీరోకు కాన్సర్ వ్యాధి రావటం, రక్తం కక్కుకుని మరణించటం తరుచుగా జరిగేవి. కాని “గీతాంజలి’ అనే సినిమాలో కాన్సరు వచ్చిన హీరో తనలాంటి మరో రకం వ్యాధిగ్రస్తురాలిని ప్రేమిస్తాడు. తరువాత కాన్సరు వ్యాధితో హీరో మరణించిన సినిమాలు రాలేదు. అంటే ప్రేక్షకులు వాటిని ఆశించలేదు అని అర్ధం.

ఈ విధంగా సినిమా నిజంగా ఒక బలమైన ఆయుధం అని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
ముందుకాలం సినిమాల్లోని అంశాలు ఏమిటి? మీరు చూసిన సినిమాలు, గతంలోని సినిమాలలోని అంశాలకు తేడాలు, పోలికలు ఏమిటి? (AS1)
జవాబు:
ముందుకాలం నాటి సినిమాలు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలుగా ఉండేవి. కొన్ని సమాజానికి సందేశాత్మకంగా ఉండే చిత్రాలు ఉండేవి. మరికొన్ని పౌరాణికాలు ఉండేవి. నేను చూసిన సినిమాలు, గతంలోని సినిమాలలోని అంశాలకు పోలికలు.

  1. రెండు ఎక్కువగా కుటుంబ ప్రధాన చిత్రాలు.
  2. రెంటిలోనూ పౌరాణికాలు ఉన్నాయి.
  3. రెంటిలోనూ మంచి నటీనట వర్గం ఉంది.

తేడాలు :

నేను చూసిన సినిమాలు గతంలోని సినిమాలు
1. ఇవి ఎక్కువ పాటల ప్రధానమైనవి. 1. ఇవి ఎక్కువ ఫైటింగున్నవి.
2. ఇవి ఎక్కువ బడ్జెట్ చిత్రాలు.   2. ఇవి తక్కువ బడ్జెట్ చిత్రాలు.
3. ఇవి ప్రేమ ప్రధానమైనవి. 3. ఇవి విలువలు ప్రధానమైనవి.
4. ఇవి కొంచెం అభ్యంతరకరంగా ఉంటున్నాయి. 4. ఇవి అందరిచే ఆమోద యోగ్యాలు.
5. హాస్యం అపహాస్యం అవుతోంది. 5. హాస్యం సున్నితంగా ఉండేది.

ప్రశ్న 5.
స్వాతంత్ర్యోద్యమంలో దినపత్రికలు ప్రధాన పాత్ర ఎలా పోషించాయి? (AS6)
జవాబు:
సాంస్కృతిక చైతన్యం, జాతీయోద్యమంలో దిన పత్రికల పాత్ర :
బ్రిటీషు పాలనలో సంఘ సంస్కర్తలు సమాజంలో మార్పుల కోసం ఉద్యమించారు. హిందూమతంలో సంస్కరణలు, ‘సతి’ని నిషేధించటం, విధవా పునర్ వివాహాన్ని ప్రోత్సహించటం వంటివి ముఖ్యమైన సంస్కరణలు. ఈ సంస్కర్తలతో ప్రేరణ పొంది దేశ వివిధ ప్రాంతాల నుంచి పలు పత్రికలు ప్రచురితం కాసాగాయి.

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన అనేకమంది నాయకులు పత్రికా సంపాదకులు. ‘అమృత్ బజార్ పత్రిక’ (1868లో మొదలయ్యింది) సంపాదకుడు శిశిర కుమార్ ఘోష్, ‘బెంగాలీ’ (1833లో మొదలు) సంపాదకుడు సురేంద్రనాథ్ బెనర్జీ, ‘ది హిందూ’ (1878లో మొదలు) సంపాదకుడు జి. సుబ్రహ్మణ్యం అయ్యర్, ‘కేసరి’ (1881లో మొదలు) సంపాదకుడు బాలగంగాధర తిలక్ ఇందులో చెప్పుకోదగిన వాళ్లు. ఈ పత్రికల సంపాదకులు తమ భావాలను, దృక్పథాలను ఈ పత్రికల ద్వారా ప్రచారం చేసేవారు. భారతీయులలో జాతీయతా భావాన్ని పెంపొందించటంలో వార్తా పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయి. ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వంలో కృష్ణా పత్రిక నిర్వహించబడింది.

మహాత్మా గాంధీ 1918లో ‘యంగ్ ఇండియా’ అనే పత్రిక బాధ్యత చేపట్టాడు. ఆ తరువాత గుజరాతీలో ‘నవజీవన్’ అనే పత్రికను స్థాపించాడు. మహాదేవ్ దేశాయి సంపాదకత్వంలోని ‘హరిజన్’ అనే పత్రికకు విరివిగా వ్యాసాలు రాసేవాడు. ఇలా గాంధీగారు పత్రికలకు బాగా విస్తృతంగా రాసేవాడు.

ఈ విధంగా స్వాతంత్ర్యోద్యమంలో దినపత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 6.
తాజా అంశాలను తెలియచేసే వార్తలను దినపత్రికల నుంచి సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి. (AS1)
జవాబు:
తాజా అంశం: నేడు ఎంసెట్ ఫలితాలు

సాయంత్రం 4.30 గంటలకు విడుదలు

ఈనాడు-హైదరాబాద్ : ఎంసెట్-2013 ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వీటిని విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్జ్ విశ్వవిద్యాలయ ఆవరణలో జరగనుంది. ఫలితాల్లో మార్కులతో సహా ర్యాంకులను కూడా ప్రకటిస్తామని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణారావు మంగళవారం వెల్లడించారు. ఫలితాలు విడుదలైన వెంటనే వాటిని విద్యార్థుల సెల్ ఫోన్ నంబర్లకు తెలియజేసే ఏర్పాట్లు కూడా చేశారు. ఫలితాలు వెల్లడించే వెబ్ సైట్లు : Www.eenadu.net, apeamcet.org, educationandhra.com, vidyavision.com, manabadi.com, schools9.com, nettlinxresults.net, iitjeefoum.com, aksharam.in., resumedropbox.com etc.
ఈ ఉదాహరణ ప్రకారం తాజా వార్తలను సేకరించండి.

8th Class Social Studies 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు InText Questions and Answers

8th Class Social Textbook Page No.239

ప్రశ్న 1.
మీ తల్లిదండ్రులను వారి బాల్యంలోని నాటకాల గురించి అడిగి తెలుసుకోండి.
జవాబు:
మా తల్లిదండ్రుల కాలంలో భువన విజయం, చింతామణి, కన్యాశుల్కం, రక్త కన్నీరు మొదలైన నాటకాలు బాగావేసేవారు.

ప్రశ్న 2.
కాలక్రమంలో నాటకాలలో ఎటువంటి మార్పులు వచ్చాయి?
జవాబు:
పూర్వకాలం నాటకాలు ఎక్కువగా పౌరాణికాలు ఉండేవి. నేడు సాంఘిక నాటకాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆనాటి వేదిక అలంకరణ నేడు ఆధునికంగా మారింది. నాడు నటుల గాత్రానికి చాలా విలువనిచ్చేవారు. నేడు వారు గట్టిగా మాట్లాడలేకపోయినా, మైకు వారికి సహకరిస్తున్నాయి. నాడు ఉన్న ఆదరణ నేడు లేదనే చెప్పవచ్చు.

8th Class Social Textbook Page No.240

ప్రశ్న 3.
నాటక ప్రదర్శనకు, సినిమాకు మధ్య తేడాలు ఏమిటి? పోలికలు, తేడాలతో ఒక పట్టిక తయారు చేయండి.
జవాబు:

పోలికలు :

  1. రెండూ వినోద మాధ్యమాలే.
  2. రెంటిలోనూ నటులే నటిస్తారు.
  3. రెండూ ప్రజాదరణ పొందాయి.

తేడాలు :

నాటకాలు :
ఇవి వేదికపై సజీవంగా ప్రదర్శించబడతాయి. ప్రదర్శన సమయంలో తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. నటులు తమ స్వరాన్ని, ముఖ కవళికల్ని, ప్రేక్షకులు గ్రహించేలా అభినయించాలి. నటులు కొన్ని నెలలు ఈ నాటకాలని రిహార్సల్ చేయాల్సి ఉంటుంది. వీటిలో నటించడానికి నటీనటులకు ఆడిషన్ టెస్టులు కేవలం రెండు వారాలలో పూర్తి అవుతాయి.

సినిమాలు :
ఇవి రికార్డు చేయబడినవి. చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంది. సినిమా తీసేముందు కేవలం కొన్ని నిమిషాలు మాత్రం రిహార్సల్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని చిత్రీకరించడానికి నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. ఆడిషన్ టెస్టు నెలలు పడతాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 4.
నాటకాల నుండి సినిమాలకు మారటం వల్ల కళాకారులు జీవనోపాధి పొందే అవకాశాలలో ఎటువంటి మార్పులు వచ్చాయో మీ టీచరు సహాయంతో చర్చించండి.
జవాబు:
నాటకాలకు ఎక్కువగా మంచి వాక్కు ఉన్నవాళ్ళను నటులుగా ఆదరించేవారు. వీరు సినిమాలకు మారటం వలన వీరి హావభావ ప్రదర్శన, శారీరకమైన అందచందాలు కూడా పరిగణనలోనికి వచ్చాయి. సినిమాల్లో అవకాశాల కోసం రంగస్థల కళాకారులు స్టూడియోల చుట్టూ తిరగటం ప్రారంభించారు. అదృష్టంతోనో, అండదండలతోనో ఈ రంగంలో రాణించినవారు మంచి జీవనోపాధిని, ఆదాయాన్ని పొందారు. లేనివారు కొంతమంది బికారులైన ఉదాహరణలు కూడా ఉన్నాయి.

ప్రశ్న 5.
అయిదు నిమిషాలపాటు ఎటువంటి మాటలు లేకుండా మూకాభినయం చేయండి. ఒక అయిదు నిమిషాల నాటకం వేయండి. ఈ రెండింటిలో నటనలో సౌలభ్యం, ఎంచుకోగల అంశాలు, ప్రేక్షకులకు అర్థం కావటం వంటి విషయాలను పోల్చండి. Page No.240
జవాబు:
విద్యార్థులు ఎవరికి వారుగా మూకాభినయం చేయండి. గ్రూపులవారీగా నాటకాలు వేయండి.
పోల్చుట

అంశాలు మూకాభినయం నాటకం
1. నటనలో సౌలభ్యం ఇది నటించడం కష్టం. ప్రయత్నిస్తే తేలిక.
2. ఎంచుకోగల అంశాలు చిన్న, చిన్న అంశాలు, సామాజికమైనవి ఎంచుకోవాలి. సామాజికమైన విషయాలు, పౌరాణిక , అంశాలు, హాస్యభరితమైనవి ఎంచుకోవాలి.
3. ప్రేక్షకులకు అర్ధం కావటం ప్రేక్షకులు మొదలైన కొద్ది సేపటికి అర్థం చేసుకోగలుగుతారు. డైలాగ్ చెప్పిన తరువాత అర్థం అవుతుంది.

8th Class Social Textbook Page No.241

ప్రశ్న 6.
మీ ఊళ్లో, పట్టణంలో గల వినోద సాధనాల జాబితా తయారుచేయండి. వాటి జనాదరణను ఎలా అంచనా వేస్తారు? కాలక్రమంలో వాటిలో వస్తున్న మార్పులు ఏమిటి?
జవాబు:
మా ఊళ్ళో సినిమా హాళ్ళు, కళాక్షేత్రం మరియు రాజీవ్ గాంధీ పార్కు ఉన్నాయి. వీటిలో సినిమాహాళ్ళు సినిమాలు బాగుంటే లాంటివి ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. కళాక్షేత్రంలో మంచి మంచి నాటకాలు, నృత్యాలు మొదలైనవి ఉంటాయి. వాటికి హాలు సగం, సగానికి పైన నిండుతుంది. రాజీవ్ గాంధీ పార్కుకు ఆదివారాలు, శెలవు దినాలు, వేసవి సాయంకాలాలు జనులు ఎక్కువగా వస్తారు.

ఈ మధ్యకాలంలో వీటన్నిటి కన్నా టీవీలకు, క్రికెట్ మ్యాచ్ లకు ఎక్కువ ఆదరణ పెరిగింది. పెద్దవాళ్ళు, ఆడపిల్లలు టీవీల ముందు, మగపిల్లలు క్రికెట్ మ్యాచ్ ల్లోనూ లీనమై ఉంటున్నారు.

8th Class Social Textbook Page No.242

ప్రశ్న 7.
జాతీయోద్యమానికి సంబంధించి తీసిన మరో రెండు సినిమాలు చెప్పండి.
జవాబు:
భగత్ సింగ్, మంగళ్ పాండే.

ప్రశ్న 8.
తెలుగు సినిమాలలోని దేశభక్తి గీతాలను సేకరించండి.
జవాబు:
1. “భారతయువతా కదలిరా ||
నవయువ భారత విధాయకా.
“భారతయువతా కదలిరా ||”

2. “మేరీ దేశ్ కీ ధరతీ
సోనా ఉగలే ఉగలే హిరీమోతీ ||

3. “నా జన్మభూమి ఎంత అందమైన దేశము.
నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము.”

4. “పుణ్యభూమి నా దేశం నమోనమామి
ధన్యభూమి నా దేశం సదాస్మరామి”

8th Class Social Textbook Page No.243

ప్రశ్న 9.
రెండు బృందాలుగా ఏర్పడి అభిమాన సంఘాల వల్ల ప్రయోజనాలు, సమస్యల గురించి చర్చించండి.
జవాబు:
ప్రయోజనాలు : అభిమాన సంఘాలు వారి అభిమాన హీరోలు, హీరోయిన్లను ఆకాశానికెత్తుతాయి. వారికి ఉచితంగా అడ్వర్టయిజ్ మెంటు ఇస్తారు. సినిమా 100 రోజులు ఆడటానికి విశ్వప్రయత్నం చేస్తారు. అంతేకాక వారు సంఘపరంగా సేవాకార్యక్రమాలను చేపడతారు.
ఉదా :
రక్తదాన శిబిరాలు, ఐ క్యాంపులు మొదలగునవి.

సమస్యలు :
విపరీతమైన అభిమానం వలన సంఘాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇది తీవ్రమైతే అనారోగ్యకరమైన పోటీ అవుతుంది. ఒకోసారి, వీరు సినిమా గురించి అబద్దపు అభిప్రాయాలను వెలిబుచ్చుతారు. ఇవి సినీ అభిమానులను నిరాశపరుస్తాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 10.
మీరు ఇటీవల చూసిన సినిమాలోని కథ, సన్నివేశాలు మీబోటి పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతాయో విశ్లేషించండి. Page No.243)
జవాబు:
నేను ఇటీవల ‘బాషా’ సినిమా చూశాను. ఈ సినిమాలో హీరో ఒక పోలీసు ఆఫీసరు. కానీ అతను అండర్ కవర్ లో ఉంటాడు. ఇందులో సన్నివేశాలు ఒక పోలీసు ఆఫీసరు యిలా ఉంటారా అనిపించేటట్లు ఉన్నాయి. ఇవి మా బోటి పిల్లలకు పోలీసులపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయి.

కేవలం ‘బాషా’ మాత్రమే కాదు. అన్ని సినిమాలు యిదే రీతిగా ఎవరినో ఒకరిని కించపరిచే విధంగా ఉంటున్నాయి.

ప్రశ్న 11.
గత నెలలో వివిధ విద్యార్థులు చూసిన సినిమాల జాబితా తయారు చేయండి. వీటిల్లో హింసను బట్టి 0-5 మార్కులు వేయండి. ఏ మాత్రం హింసలేని సినిమాలకు 5 మార్కులు, ఏహ్యత పుట్టించే తీవ్ర హింస ఉన్న సినిమాలకు 0 మార్కులు వేయాలి.
జవాబు:
ఉదా : 1. శతమానం భవతి – 5
2. గౌతమీపుత్ర శాతకర్ణి – 3
3. ఖైదీ నెంబర్ – 150 – 3
4. …………………..
5. …………………..
6. …………………..

8th Class Social Textbook Page No.244

ప్రశ్న 12.
మీ ప్రాంతంలో దొరికే వివిధ రకాల దిన పత్రికలను తరగతికి తీసుకురండి. ఎన్ని పత్రికలు ఉన్నాయో అన్ని బృందాలుగా ఏర్పడండి. వార్తలు, విశేషాలు ఎలా పొందుపరిచారో (ఏ పేజీలో ఏముంది) విశ్లేషించండి.
జవాబు:
మా గ్రామంలోకి ఈనాడు, సాక్షి అనే రెండు పత్రికలు వస్తాయి. –

మా తరగతిలోని వారందరమూ 2 బృందాలుగా ఏర్పడ్డాము.

ఈనాడు బృందం :
దేశానికి సంబంధించిన ముఖ్య వార్త. తరువాత పేజీల వార్తలు సంక్షిప్తంగా మొదటి పేజీలో, సంపాదకీయం. 4 పేజీలకు వసుంధర అనే పేరుతో స్త్రీలకు సంబంధించిన విషయాలు. ఆటలకు ఒక పేజీ, బిజినెస్ గురించి, అన్ని ప్రకటనలు, సినిమాల గురించి వెండితెర గురించి, టీ.వీ గురించి వివరాలు.

జిల్లా పేపర్ :
దీనిలో జిల్లాకు సంబంధించిన అన్ని రకాల వార్తలు ఉంటాయి.

సాక్షి బృందం : సాక్షి పేపర్ 14 పేజీలు + జిల్లా పేపర్…

మొదటి పేజీలోనే దాదాపుగా ఆ రోజుకు ముఖ్యమైన వార్త అది దేశవ్యాప్తమైనది అవుతుంది. తరువాత పేజీల్లో వచ్చే ముఖ్య వార్తల్ని మొదటి పేజీలో చిన్న చిన్న వ్యాఖ్యలతో ఇచ్చి పేజీ నెంబరు ఇస్తారు. అది ఒక ఉపయోగం. తరువాత ఆ వార్తల్ని వివరంగా ఇస్తారు. టెండర్ల గురించి ప్రకటనలు. ఇక తరువాత ఫ్యామిలీ అనే పేరుతో 4 పేజీల పేపర్ ఉంటుంది. దానిలో ఒక గొప్ప వ్యక్తితో (ఏ రంగమైన) పరిచయం లేదా ఏదైనా మంచిపని చేసేవాళ్ళతో పరిచయం. పిల్లలకు కథలు, అన్నీ అంటే సోషల్ సైన్స్ మొ|| వాటిలో పిల్లలకు తెలియని విషయాలు, భక్తికి సంబంధించిన సందేశాలు, సినిమా కబుర్లు ఉంటాయి.

ఉద్యోగ అవకాశాలు, ఇంకా సంక్షిప్త వార్తలు, బిజినెస్ కు ఒక పేజీ, సెన్సెక్స్. తరువాత ఆటలకు ఒక పేజీ, చివరలో మిగిలిన అన్ని వార్తలు చాలాసార్లు ఫోటోలతో సహా జిల్లా పేపర్ లో మొదటి ముఖ్యవార్త, టెండర్, క్రైమ్, వెండితెర (సినిమా) – బుల్లితెర (ఆరోజు ప్రసారాలు) తరువాత మూడు పేజీల్లో స్థానిక వార్తలు, క్లాసిఫైడ్ (ప్రకటనలు) తరువాత విద్య (ఎంసెట్, బి.ఎడ్ మొ||) తరువాత స్థానిక వార్తలు 2 పేజీల్లో ఉంటాయి.

ప్రశ్న 13.
పైన పేర్కొన్న దిన పత్రికల సంచికలను వరుసగా వారం రోజులపాటు సేకరించండి. పై బృందాలలో ఒక్కొక్క పత్రికలో ఏ ఏరోజున ఏ ప్రత్యేక అంశాలు ప్రచురితమౌతాయో తెలుసుకోండి. ఆ వివరాలను తరగతి గదిలో పంఛుకోండి. దినపత్రికలలో ఇటువంటి అంశాలు ఎందుకు ప్రచురిస్తున్నారో కారణాలను పేర్కొనండి.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

SCERT AP 8th Class Social Study Material Pdf 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు

8th Class Social Studies 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
జవాబు:
అ) ఒక ప్రదేశం సముద్రానికి దగ్గరగా ఉంటే, భూమధ్యరేఖ నుంచి ఎంత దూరంలో ఉంది అన్నదానితో సంబంధం లేకుండా ఎప్పుడూ చల్లగా ఉంటుంది.
జవాబు:
(ఒప్పు)

ఆ) భూమి నుంచి పైకి వెళుతున్న కొద్దీ సూర్యుడికి దగ్గరగా వెళతారు కాబట్టి బాగా వేడిగా ఉంటుంది. (తప్పు)
భూమి నుంచి పైకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గి చల్లగా ఉంటుంది.
జవాబు:
(ఒప్పు)

ఇ) సూర్యుడు ముందుగా గాలిని వేడిచేసి, తరవాత భూమిని వేడి చేస్తాడు. (తప్పు)
సూర్యుడు ముందుగా భూమిని, తద్వారా గాలిని వేడి చేస్తాడు.
జవాబు:
(ఒప్పు)

ఈ )భూగోళం వేడెక్కటానికి ప్రాణవాయువు (ఆక్సిజన్)తో సంబంధం ఉంది. (తప్పు)
భూగోళం వేడెక్కడానికి కార్బన్-డై-ఆక్సైడ్ తో సంబంధం ఉంది.
జవాబు:
(ఒప్పు)

ప్రశ్న 2.
పట్టిక 2లో అత్యధిక ఉష్ణోగ్రతకు, పట్టిక 1లో అతి తక్కువ ఉష్ణోగ్రతకు ఎంత తేడా ఉంది? (AS3)
జవాబు:
పట్టిక 2లో అత్యధిక ఉష్ణోగ్రత = 33°C
పట్టిక 1లో అతి తక్కువ ఉష్ణోగ్రత = 17°C
ఈ రెండింటి మధ్య తేడా = 16°C

ప్రశ్న 3.
డిసెంబరు 6న ఉదయం 10 గంటలకు మాస్కోలో ఉష్ణోగ్రత – 8°C అనుకుందాం. ఇరవై నాలుగు గంటల తరవాత ఉష్ణోగ్రత 12°C ఎక్కువ ఉంది. డిసెంబరు 7న ఉదయం 10 గంటలకు అక్కడ ఉష్ణోగ్రత ఎంత? (AS5)
జవాబు:
డిసెంబరు 7న ఉదయం 10 గంటలకు అక్కడ ఉష్ణోగ్రత 4°C గా ఉంటుంది.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

ప్రశ్న 4.
ఢిల్లీ, ముంబయి మైదాన ప్రాంతంలో ఉన్నాయి, సముద్ర మట్టం నుంచి వాటి ఎత్తు 300 మీటర్ల లోపు ఉంటుంది. వాటి నెలసరి సగటు ఉష్ణోగ్రతలలో అంత తేడా ఎందుకు ఉంది? ఈ రెండు నగరాలలో ఏ నెలల్లో సగటు ఉష్ణోగ్రతలు దాదాపు ఒకటిగా ఉంటాయి? వాటికి కారణాలు వివరించండి. (AS1)
జవాబు:
ముంబయి సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితిని, ఢిల్లీ ఖండాంతర్గత శీతోష్ణస్థితిని కలిగి ఉంది. ముంబయి సముద్రతీర ప్రాంతంలో ఉండటం మూలంగా సంవత్సరం పొడుగునా ఒకే రకమైన శీతోష్ణస్థితిని కలిగి ఉంది. ఢిల్లీ సముద్రానికి దూరంగా ఉండటం మూలంగా ఇక్కడి ఉష్ణోగ్రతలో అత్యధిక హెచ్చు తగ్గులున్నాయి. ఈ రెండు ప్రాంతాల ఉష్ణోగ్రతలు ఆగస్టు, సెప్టెంబరు నెలలలో కొంచెం దగ్గరగా ఉన్నాయి.

ప్రశ్న 5.
జోధ్ పూర్ (రాజస్థాన్)లో నెలసరి సగటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు కింద పట్టికలో ఉన్నాయి. వాటితో రేఖాచిత్ర పటం (గ్రాఫ్) గీయండి. సంవత్సరంలో చాలా వేడిగా, చాలా చలిగా ఉండే నెలలు ఏవి?
జోధ్ పూర్ లో నెలసరి సగటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు (AS3).
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 1
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 2
a) ఏప్రియల్, మే మరియు జూన్ నెలలు వేడిగా ఉంటుంది.
b) డిసెంబరు, జనవరి మరియు ఫిబ్రవరి నెల చలిగా ఉంటుంది.

ప్రశ్న 6.
ఎ, బి, సి అనే మూడు ప్రదేశాల సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కింద పట్టికలో ఉన్నాయి. వాటి రేఖా చిత్రపటం (గ్రాఫ్) తయారు చేయండి. పట్టిక, రేఖా చిత్రపటాలు చూసి ఆ ప్రదేశాల గురించి మీరు ఏమి ఊహిస్తారు. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 3
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 4
A&C ప్రాంతాలు వేడి ప్రాంతాలు
B శీతల ప్రాంతము

ప్రశ్న 7.
జనవరిలో సిమ్లా, తిరువనంతపురం సగటు ఉష్ణోగ్రతలలో తేడాలకు మూడు కారణాలను ఇవ్వండి. అట్లాస్ చూడండి. (AS3)
జవాబు:
1. తిరువనంతపురం సముద్రతీర ప్రాంతం.
2. సిమ్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్నది.
3. తిరువనంతపురం భూమధ్యరేఖకు దగ్గరగాను, సిమ్లాకు దూరంగానూ ఉన్నాయి.

ప్రశ్న 8.
భోపాల్, ఢిల్లీ, ముంబయి, సిమ్లాలలో ఏ రెండు ప్రదేశాలు ఒకే రకమైన ఉష్ణోగ్రత తీరును కలిగి ఉంటాయి. ఈ రెండు ప్రదేశాల మధ్య పోలికలకు కారణాలు వివరించండి. (AS1)
జవాబు:
భోపాల్, ఢిల్లీలలో ఉష్ణోగ్రతలు ఒకే తీరును కలిగి ఉంటాయి. ఈ రెండు ప్రాంతాలు సముద్రానికి దూరంగా ఉండటమే దీనికి కారణము.

ప్రశ్న 9.
కింద ఉన్న రేఖా చిత్రపటం (గ్రాఫ్) చూసి కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 5
అ) జులైలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత ఎంత?
ఆ) డిసెంబరు నెలలో సాధారణంగా ఎంత వేడిగా ఉంటుంది?
ఇ) జూన్ నెలలో సాధారణంగా ఎంత చలిగా ఉంటుంది?
ఈ) పగటి, రాత్రి ఉష్ణోగ్రతలలో తేడా మే నెలలో ఎక్కువగా ఉంటుందా లేక ఆగస్టులోనా?
ఉ) వేసవి నెలలు ఏవి?
జవాబు:
అ) 28°C
ఆ) 26°C
ఇ) 20°C
ఈ) మే నెలలో
ఉ) మార్చి, ఏప్రిల్, మే నెలలు

ప్రశ్న 10.
నితిన్ థర్మల్ విద్యుత్తు మంచిదని అంటున్నాడు. కాని పద్మజ సౌర విద్యుత్తు మంచిదని అంటున్నది. వీరిలో ఎవరిని సమర్ధిస్తారు? ఎందుకు?
జవాబు:
నేను పద్మజను సమర్థిస్తాను. కారణం :
సౌరశక్తి, ధర్మల్ శక్తి కంటే మెరుగైనది. ఎందుకంటే సౌరశక్తి పరిశుభ్రమైనది. నిరంతరం లభ్యమయ్యేది. అంతేకాక ఇది పునరావృతమయ్యే సహజ వనరు. ఎంతవాడినా తరగని వనరు. మన శరీరానికి కావలసిన విటమిన్-డి ని కూడా ఇది అందిస్తుంది.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

ప్రశ్న 11.
పేజి నెం. 27లోని ‘ఎత్తు – ఉష్ణోగ్రత’ అంశాన్ని చదివి వ్యాఖ్యానించంది.
మండు వేసవిలో మైదాన ప్రాంతాలలోని కొంతమంది ఎండల నుంచి తప్పించుకోటానికి ఊటీ, సిమ్లా వంటి పర్వత ప్రాంత ప్రదేశాలకు వెళుతుంటారు. ఎత్తుగా ఉండే పర్వతాలలో వేసవి నెలల్లో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. పర్వతాలలో ఎత్తైన ప్రాంతాలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎత్తు ప్రదేశాలకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి.

ప్రతినెలలోనూ ఢిల్లీలో కంటే సిమ్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని స్పష్టమవుతుంది.

సముద్ర మట్టం నుంచి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో ఉంది. అదే సిమ్లా 2200 మీటర్ల ఎత్తులో ఉంది. సాధారణంగా సముద్ర మట్టం నుంచి ప్రతి వెయ్యి మీటర్ల పైకి వెళితే ఉష్ణోగ్రతలు 6°C మేర తగ్గుతాయి. ఎత్తైన కొండలు, పర్వతాలలో తక్కువ ఉష్ణోగ్రతల వల్ల అక్కడ పెరిగే చెట్లు, మొక్కలలో కూడా తేడా ఉంటుంది.
జవాబు:
సముద్ర మట్టం నుండి ప్రతి 1000 మీటర్లు ఎత్తుకు పోయిన కొలది 6°C ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి సిమ్లా, డార్జిలింగ్, హార్సిలీ హిల్స్, ఊటీ వంటి ప్రాంతాలలో వేసవిలో కూడా చల్లగా ఉండి వేసవి విడిది కేంద్రాలుగా ప్రసిద్ధి పొందాయి.

8th Class Social Studies 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు InText Questions and Answers

8th Class Social Textbook Page No.18

ప్రశ్న 1.
మీరు నివసించే ప్రాంతం కంటే భిన్నమైన వాతావరణం ఉండే ప్రదేశానికి ఎప్పుడైనా వెళ్లారా ? తరగతి గదిలో వివరించండి.
జవాబు:
నేను విజయవాడ నివసిస్తాను. ఇక్కడి వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. క్రిందటి వేసవి సెలవులలో నేను ఊటీ వెళ్ళాను. అది నీలగిరి కొండల పై, ఎత్తైన ప్రదేశంలో ఉన్నది. చాలా చల్లగా ఉంది. మేము రామగుండం నుండి కోయంబత్తూరు వెళ్ళి అక్కడి నుండి ఊటీకి చేరుకున్నాము. దీనిని కొండలలో రాణి అని అంటారు. అందమైన జలపాతాలు అక్కడి ప్రకృతి వరాలు. మేము అక్కడ హారేస్ కోర్సు ఎదురుగా ఉండే హోటల్ లో బస చేశాము. బొటానికల్ గార్డెన్స్, లేక్, దొడబెట్ట, లవ్ డేల్ మొదలైన ప్రదేశాలన్నీ సందర్శించాము. మండు వేసవిలో అక్కడ స్వెట్టర్లు వేసుకుని తిరగటం నాకు ఆశర్యంగాను, అద్భుతంగాను అనిపించింది. ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళాలని కూడా అనిపించింది.

ప్రశ్న 2.
భూమి మీద వేడిమికి సూర్యుడు కారణమని మీకు తెలుసు. అయితే ఈ వేడిమి ఉదయం నుంచి సాయంత్రానికి, కాలాలను బట్టి, ప్రదేశాలను బట్టి మారటానికి కారణం ఏమిటి? ఇక్కడ ఉష్ణోగ్రతలలో కొన్ని తేడాలను ఇచ్చాం . వీటికి కారణాలను ఊహించి, తరగతి గదిలో చర్చించిన తరవాత ముందుకు వెళ్ళండి.
1. ఉదయం పూట చల్లగానూ, మధ్యాహ్నం వేడిగానూ ఉంటుంది.
2. వేసవిలో వేడిగానూ, శీతాకాలంలో చలిగానూ ఉంటుంది.
3. కొండలపై చల్లగానూ, మైదాన ప్రాంతంలో వేడిగానూ ఉంటుంది.
4. భూమధ్యరేఖా ప్రాంతంలో వేడిగానూ, ధృవప్రాంతంలో చలిగానూ ఉంటుంది. Page No. 18)
జవాబు:
భూమి మీద ఉష్ణోగ్రతలో మార్పులకు అనేక కారణాలున్నాయి. అవి :

  1. అక్షాంశము
  2. ఎత్తు
  3. సముద్రం నుండి దూరము
  4. సముద్ర తరంగాలు
  5. పర్వతాలు
  6. గాలులు మొ||నవి.

1. కారణం :
ఉదయం పూట భూభ్రమణం కారణంగా సూర్యకిరణాలు ఏటవాలుగాను, మధ్యాహ్నం పూట నిట్టనిలువుగా పడతాయి. అందువలన ఉదయం పూట చల్లగాను, మధ్యాహ్నం వేడిగాను ఉంటుంది.

2. కారణం :
వేసవిలో కిరణాలు భూమి మీద లంబంగా ప్రసరిస్తాయి. చలికాలంలో ఏటవాలుగా ప్రసరిస్తాయి. ఇది భూపరిభ్రమణం కారణంగా జరుగుతుంది.

3. కారణం :
సముద్రతీరం నుండి ఎత్తుకు పోయే కొలదీ ప్రతి 1000 మీ||లకు 6°C ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందువలన మైదానాలలో కంటే కొండలపై చల్లగా ఉంటుంది.

4. కారణం :
భూమధ్యరేఖా ప్రాంతంలో సూర్యకిరణాలు నిట్టనిలువుగా (90°C) పడతాయి. ధృవాలవైపు ఏటవాలుగా పడతాయి. ఇది భూమి యొక్క ఆకృతి మూలంగా జరుగుతుంది.

8th Class Social Textbook Page No.19

ప్రశ్న 3.
సౌరవికిరణం (రేడియేషన్), సూర్యపుటం (ఇన్సోలేషన్) మధ్య తేడాలను పేర్కొనండి.
జవాబు:
1. సౌరవికిరణం : సూర్యుడు విడుదల చేసే శక్తిని సౌర వికిరణం అని అంటారు.
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 6
2. సూర్యపుటం : సూర్యుడు విడుదల చేసే దాని నుండి భూమి ఉపరితలం గ్రహించే శక్తిని సూర్యపుటం అని అంటారు.

ప్రశ్న 4.
పొగ, ధూళితో వాతావరణం మరింత కలుషితమైతే ఏమవుతుంది?
జవాబు:
సౌరశక్తిలోని కొంత భాగాన్ని వాతావరణంలోని పొగ, ధూళి పరావర్తనం చేస్తాయి లేదా గ్రహిస్తాయి. ఇవి ఎక్కువై సౌరశక్తిని ఎక్కువ పరావర్తనం చేస్తే భూమి మీద వేడి ఉండదు. ఇవి ఎక్కువై సౌరశక్తిని ఎక్కువ గ్రహిస్తే భూమి మీద వేడిమి పెరుగుతుంది. ఈ రెండింటి వల్ల కూడా భూమి మీద జీవం ప్రమాదంలో పడుతుంది.

8th Class Social Textbook Page No.20

ప్రశ్న 5.
సూర్యకిరణాలు ఎక్కడ ఎక్కువ ఏటవాలుగా పడతాయి – జపాన్లోనా, ఉత్తర ధృవం వద్దా?
జవాబు:
సూర్యకిరణాలు ఉత్తర ధృవం వద్ద ఎక్కువ ఏటవాలుగా పడతాయి.

ప్రశ్న 6.
సూర్యకిరణాల సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది – ఆంధ్రప్రదేశ్ లోనా, రాజస్థాన్లోనా?
జవాబు:
సూర్యకిరణాల సాంద్రత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది.

ప్రశ్న 7.
భూమి గుండ్రంగా కాకుండా బల్లపరుపుగా ఉంటే జపాన్ ఎక్కువ వేడి ఎక్కుతుందా, భూమధ్యరేఖా ప్రాంతమా? లేక రెండూ సమంగా వేడి ఎక్కుతాయా?
జవాబు:
రెండూ సమానంగా వేడెక్కుతాయి.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

ప్రశ్న 8.
గ్లోబును చూసి ఏ దేశాలు ఎక్కువ వేడిగా ఉంటాయో, ఏ దేశాలు చల్లగా ఉంటాయో చెప్పండి.
జవాబు:
వేడి దేశాలు : ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, తైవాన్, బర్మా, ఇండియా, సూడాన్, అరేబియా, జింబాబ్వే, చిలీ, బ్రెజిల్, గ్వాటియాలా మొదలగునవి. చల్లని దేశాలు : ఉత్తర అమెరికా, ఐర్లాండ్, స్కాండినేవియా, రష్యా మొదలగునవి.

8th Class Social Textbook Page No.21

ప్రశ్న 9.
భూమి, సముద్రం వేడెక్కడంలో తేడా ఎందుకు ఉంది?
జవాబు:
భూమి, నీటితో పోలిస్తే మంచి ఉష్ణవాహకం. కాబట్టి సముద్రం కన్నా భూమి త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది.

8th Class Social Textbook Page No.23

ప్రశ్న 10.
వేర్వేరు ఉష్ణోగ్రతలు తెలుసుకోడానికి ఈ కింద పేర్కొన్న, వాటి ఉష్ణోగ్రతలు కొలవండి. కొలవటానికి ముందు వాటి ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో ఊహించి అంచనా వేయండి.
జవాబు:

వస్తువు ఉష్ణోగ్రత
అంచనా కొలత
బక్కెటులో నీళ్ళు 25°C 35°C
ఐసుగడ్డ 0°C 0°C
గ్లాసులోని చల్లటి నీళ్లు 15°C 10°C
స్నానానికి పెట్టుకున్న వేడినీళ్లు 70°C 76°C

ప్రశ్న 11.
10°C నుంచి 110°C వరకు కొలవగల ఉష్ణమాపకం ఉపయోగించటం మంచిది. ఇటువంటి ఉష్ణమాపకం ఉపయోగించి మరుగుతున్న నీళ్ళు, వేడిగా ఉన్న టీ ఉష్ణోగ్రతలను కొలవండి.
జవాబు:
మరుగుతున్న నీళ్ళు = 100°C; వేడిగా ఉన్న టీ = 95°C

ప్రశ్న 12.
రాబోయే వారం రోజులపాటు ప్రతిరోజూ ఒకే ప్రదేశం, ఒకే సమయంలో వాతావరణ ఉష్ణోగ్రతలు తీసుకోండి. (ఇందుకు నీడలో వుండే ప్రాంతాన్ని ఎన్నుకోండి). ప్రతిరోజూ ఉష్ణోగ్రత కొలవటానికి ముందు దానిని ఊహించి అంచనా వేయండి. – వీటిని ఒక పుస్తకంలో నమోదు చేయండి.
జవాబు:
ప్రదేశం : బెంగళూరు
సమయం : 12 గంటలు
నెల : జనవరి

తేదీ వాతావరణ ఉష్ణోగ్రతలు
అంచనా కొలత
18.1.19 28°C 29°C
19.1.19 27°C 30°C
20.1.19 29°C 30°C
21.1.19 29°C 30°C
22.1.19 28°C 30°C
23.1.19 27°C 30°C
24.1.19 28°C 30°C

1) ఇలా వారం రోజులపాటు వేర్వేరు నెలల్లో ఉష్ణోగ్రతలు నమోదు చేయండి.
జవాబు:
ఈ విధంగా నేను వేర్వేరు నెలలలో 5 వారాల పాటు ఉష్ణోగ్రతలు నమోదు చేశాను.

2) మీరు నమోదు చేసిన వారం రోజుల ఉష్ణోగ్రతల సగటును కనుక్కోండి.
జవాబు:

  1. జనవరి 3వ వారం – 29°C
  2. మార్చి 2వ వారం – 32°C
  3. జులై 1వ వారం – 28°C
  4. అక్టోబరు 2వ వారం – 28°C
  5. డిసెంబరు 4వ వారం – 28°C

3) వివిధ వారాల ఉష్ణోగ్రతలలో తేడాల గురించి చర్చించండి.
జవాబు:
ఈ ఉష్ణోగ్రతల గురించి తరగతి గదిలో చర్చించిన తరువాత బెంగళూరు శీతోష్ణస్థితి సాధారణ శీతోష్ణస్థితి అని, అధిక ఉష్ణోగ్రతలు లేవు అని నిర్ధారించినాము.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

8th Class Social Textbook Page No.24

ప్రశ్న 13.
ఈ సంఖ్యారేఖపై గుర్తించిన ధన, ఋణ సంఖ్యలను గమనించండి. వీటి ఆధారంగా దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 7
1. ఏ ఉష్ణోగ్రత ఎక్కువ : 5°C లేక – 5°C?
జవాబు:
– 5°C

2. ఈ రెండు ఉష్ణోగ్రతలలో దేని దగ్గర మనకు ఎక్కువ చలిగా అనిపిస్తుంది?
జవాబు:
5°C

3. – 5°C నుండి 5°C వరకు ఎన్ని డిగ్రీల తేడా ఉంది?
జవాబు:
10°C (5° – (-59) = 5 + 5 = 10°C]

4. కింద పేర్కొన్న ఉష్ణోగ్రతలను క్లుప్తంగా రాయండి.
సున్నాకి దిగువన 88°C, నీరు గడ్డ కట్టుకోవటానికి 38°C ఎగువన, నీరు గడ్డకట్టుకోటానికి 32°C దిగువన.
జవాబు:
– 88°C, 38°C, – 32°C

5. ఈ రోజున మీ తరగతి గదిలో ఉష్ణోగ్రతని కొలిచారా? సున్నాకి దిగువున 88°C అంటే మీరు కొలిచిన ఉష్ణోగ్రత కంటే ఎంత తక్కువ?
జవాబు:
తరగతి గది ఉష్ణోగ్రత 28°C. నేను కొలిచిన ఉష్ణోగ్రత కంటే 116°C తక్కువ.

6. మనిషి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37°C ఉంటుంది. ఉష్ణోగ్రత 50°C ఉంటే మనిషి సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎంత ఎక్కువ ఉన్నట్టు?
జవాబు:
13°C

7. ఉష్ణోగ్రత – 5°C ఉంటే మనిషి సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎంత తక్కువ ఉన్నట్టు?
జవాబు:
42°C

8. ఈ ఉష్ణోగ్రతలను ఎక్కువ నుంచి తక్కువకు క్రమంలో రాయండి.
12°C, – 16°C, 29°C, 0°C, – 4°C.
జవాబు:
29°C, 12°C, 0°C, – 4°C, – 16°C

9. పైన ఇచ్చిన ఉష్ణోగ్రతలలో దేని దగ్గర అన్నిటికంటే ఎక్కువ వేడిగా ఉంటుంది?
జవాబు:
29°C వద్ద

10. పైన ఇచ్చిన ఉష్ణోగ్రతలలో దేని దగ్గర అన్నిటికంటే ఎక్కువ చలిగా ఉంటుంది?
జవాబు:
– 16°C వద్ద

8th Class Social Textbook Page No.25

ప్రశ్న 14.
గ్రాఫ్ – 1 (అనంతపురం నెలసరి సగటు ఉష్ణోగ్రతలు)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 8
పట్టిక-1లోని వివరాలను ఉపయోగించుకుని అదే గ్రాలోనే అనంతపురం నెలవారీగా సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతల రేఖను గీయండి. మొదటి రెండు నెలలకు చేసిన గ్రాఫ్ పైన ఉంది.
పట్టిక-1 : అనంతపురం నెలసరి సగటు ఉష్ణోగ్రతలు
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 9
నెల కనిష్ఠం నెల గరిష్ఠ కనిష్ఠ జనవరి 30 17 జులై 24 ఫిబ్రవరి 33 1 9 ఆగసు 33 మార్చి 3722 సెప్టెంబరులో ఏప్రిల్ 39 అక్టోబరు 32 39 26 నవంబరు 30 జూన్ 35 డిసెంబరు
ఇచ్చిన గ్రాఫ్, పట్టిక -1 పరిశీలించి అనంతపురముకు సంబంధించి కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
1. అనంతపురంలో నవంబరులో ఎంత చలిగా ఉంటుంది?
జవాబు:
చలి తక్కువుగా ఉంటుంది. 20°C

2. అనంతపురంలో ఏ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది?
జవాబు:
మే నెల

3. సంవత్సరంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత, అతి తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతకి మధ్య తేడా ఎంత?
జవాబు:
సంవత్సరంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత = 39°C
సంవత్సరంలో అతి తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రత = 17°C
తేడా = 39° – 17°C = 22°C.

4. అనంతపురంలో బాగా వేడిగా ఉండే మూడు నెలలు ఏవి?
జవాబు:
మార్చి, ఏప్రిల్, మే.

5. బాగా చలిగా ఉండే మూడు నెలలు ఏవి?
జవాబు:
డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి.

6. జూన్ నుండి డిసెంబరు వరకు అనంతపురంలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత కూడా తగ్గుతూ ఉందా?
జవాబు:
తగ్గుతూ ఉంది.

7. మే నెలలో గరిష్ట, కనిష్ఠ సగటు ఉష్ణోగ్రతలలో తేడా ఎంత?
జవాబు:
39° – 26° = 13°C

8. ఆగస్టు నెలలో గరిష్ఠ, కనిష్ట సగటు ఉష్ణోగ్రతలలో తేడా ఎంత?
జవాబు:
33 – 24° = 9°C

9. పై రెండు ప్రశ్నలకు మీ సమాధానాల ఆధారంగా గరిష, కనిష్ట సగటు ఉష్ణోగ్రతల తేడా అనంతపురంలో వేసవిలో ఎక్కువగా ఉందా లేక వానాకాలంలో ఎక్కువగా ఉందా?
జవాబు:
రెండింటి మధ్య వేసవిలో ఎక్కువగా ఉంది.

8th Class Social Textbook Page No.26

ప్రశ్న 15.
పట్టిక-2 : (విశాఖపట్టణం నెలసరి సగటు ఉష్ణోగ్రత)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 10
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 11
గరిష్ఠ°C – కనిష్ఠ నెల గరిష్ఠ కనిష్ఠ నెల జనవరి ఫిబ్రవరి ఆగస్టు 10006 మార్చి సెప్టె బరు అక్టోబరు ఏప్రిల్ 25 32 33 నవంబరు జూన్ 30 2 4 డిసెంబరు 32 21
జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జులై ఆగ సెప్టె అక్టో నవ డిసె

పై గ్రాలో విశాఖపట్టణం సగటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలను గుర్తించారు.
1. విశాఖలో ఏ నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉంది? అది ఎంత?
జవాబు:
జనవరి నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఉంది. అది 19°C.

2. విశాఖలో చాలా వేడిగా ఉండే నెల ఏది? ఆ నెలలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
ఏప్రిల్, మే, నవంబరు నెలలు చాలా వేడిగా ఉంటాయి. 33 °C.

8th Class Social Textbook Page No.27

ప్రశ్న 16.
గ్రాఫ్-3 (ఢిల్లీ నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 12
అనంతపురం, విశాఖల ఉష్ణోగ్రతలను పోల్చి కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
1. జనవరిలో ఏ ప్రదేశంలో ఎక్కువ చలిగా ఉంటుంది?
జవాబు:
అనంతపురం

2. జూన్లో ఏ ప్రదేశంలో ఎక్కువ వేడిగా ఉంటుంది?
జవాబు:
విశాఖపట్టణం

3. ఏ ప్రదేశంలో సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రత ఇంచుమించు ఒకే రకంగా ఉంటుంది?
జవాబు:
విశాఖపట్టణం

8th Class Social Textbook Page No.27, 28

ప్రశ్న 17.
గ్రాఫ్-4 (సిమ్లా నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 13
1. ఉష్ణోగ్రత ఇలా ఉండటానికి గల ఇతర కారణాలను ఊహించండి.
జవాబు:
ఉష్ణోగ్రతా విలోమానికి మరే కారణము ఊహించలేము.

2. విలోమనం జరిగితే ఏమవుతుంది?
జవాబు:
విలోమనం జరిగితే భూమికి దగ్గరగా ఉష్ణోగ్రత తగ్గుతుంది.

3. ఢిల్లీ కంటే సిమ్లా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది?
జవాబు:
ఢిల్లీ కంటే సిమ్లా 1900 మీ. ఎత్తులో ఉంది.

4. సముద్ర మట్టం నుంచి రెండు ప్రదేశాల ఎత్తులో గల తేడాల ఆధారంగా ఆ రెండింటి ఉష్ణోగ్రతలలో ఎంత తేడా ఉంటుందో లెక్కకట్టండి.
జవాబు:
సుమారుగా 12°C

5. సిమ్లాలో ఏ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది? అది ఎంత?
జవాబు:
మే నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. 22°C.

6. ఢిల్లీలో ఏ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది? అది ఎంత?
జవాబు:
మే నెలలో ఎక్కువగా ఉంటుంది. 40°C.

7. సెప్టెంబరులో సిమ్లాలో సగటు ఉష్ణోగ్రత ……. °C కాగా ఢిల్లీలో …… °C.
జవాబు:
17°C-34°C

8. ఏది ఎక్కువ చలిగా ఉంటుంది. జనవరిలో ఢిల్లీనా లేక జులైలో సిమ్లానా?
జవాబు:
ఢిల్లీలో జనవరిలో చలిగా ఉంటుంది.

AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు

8th Class Social Textbook Page No.29

ప్రశ్న 18.
గ్రాఫ్-5 (సింగపూర్, షాంఘై, బ్లాడివోస్టాల నెలవారీ సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు)
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 14
1. రేఖా చిత్రపటంలో ఇచ్చిన మూడు ప్రదేశాలలో భూమధ్యరేఖకు దగ్గరగా ఏది ఉంది?
జవాబు:
సింగపూర్

2. ఆ ప్రదేశంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
27°C

3. అక్కడ శీతాకాలంలో కంటే వేసవికాలంలో సాధారణంగా చాలా వేడిగా ఉంటుందా?
జవాబు:
లేదు, కొంచెం వేడిగా ఉంటుంది.

4. సింగపూర్ లో చలికాలంలో ఉన్నంత వేడిగా ఫ్లాడివోస్టా లో వేసవిలో ఉంటుందా?
జవాబు:
లేదు. రెండింటి మధ్యలో తేడా ఉన్నది.

5. జులైలో సాధారణంగా సింగపూర్ లో ఎక్కువ వేడిగా ఉంటుందా, లేక షాంఘైలోనా?
జవాబు:
రెండింటి మధ్యలో కొద్దిపాటి తేడా ఉన్నది. సింగపూర్ లో వేడిగా ఉంటుంది.

6. రేఖాచిత్ర పటంలో చూపించిన మూడు ప్రదేశాలలో తీవ్ర ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదైనాయి?
జవాబు:
బ్లాడివోస్టోక్ లో

7. షాంఘైలో అత్యంత వేడిగా ఉండే నెల ఏది?
జవాబు:
జులై, ఆగష్టు నెలలు

8. అక్కడ సగటు వార్షిక ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
15.3°C

9. ఈ ప్రదేశంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉన్న నెల ఏది?
జవాబు:
జనవరి, ఫిబ్రవరి

ప్రశ్న 19.
అట్లాస్ లోని పటాల ద్వారా ఈ ప్రదేశాల అక్షాంశాలు, జనవరిలో సగటు ఉష్ణోగ్రతలు తెలుసుకోండి. మొదటిది నింపి ఉంది. Page No.29,30

ప్రదేశం అక్షాంశం ఉష్ణోగ్రత (జనవరిలో)
ఆంధ్రప్రదేశ్, విజయవాడ 16.59 ఉ. అ. 22°C – 25°C మధ్య
ఆగ్రా, ఉత్తరప్రదేశ్ 27.18 ఉ. అ. 22.3°C-8°C
మధురై, తమిళనాడు 9.93 ఉ. అ. 30°C-20°C
నాగపూర్, మహారాష్ట్ర 21, 14 ఉ. అ. 28°C – 12°C

ఈ పటం ప్రకారం భారతదేశంలో జనవరిలో 30°C సగటు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉన్న ప్రదేశాలు ఏవీ లేవు. (ఇది సగటు అన్న విషయం గుర్తుంచుకోండి. కొన్ని ప్రదేశాలలో, జనవరిలో 30°C కంటే వేడెక్కే రోజులు కొన్ని ఉండే ఉంటాయి. )
1. పటం చూసి (జనవరిలో) సాధారణంగా సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఏవో చెప్పండి.
జవాబు:
మధురై, నాగపూర్.

2. ఈ ప్రదేశాలకు ఉత్తరంగా వెళితే జనవరిలో సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా?
జవాబు:
తక్కువగా ఉంటుంది.

8th Class Social Textbook Page No.30

ప్రశ్న 20.
ఉత్తరాన ఉన్న పట్టణాలలో పగటికాలం, దక్షిణాది పట్టణాల కన్న, ఎక్కువా? తక్కువా? ఎందుకు?
జవాబు:
ఉత్తర భారతదేశంలో ఉన్న పట్టణాలలో పగటి కాలం దక్షిణాది పట్టణాల కన్నా తక్కువ. ఉత్తర భారతదేశం – దక్షిణ భారతదేశం కంటే భూమధ్యరేఖకు దూరంగా ఉండుటయే యిందులకు కారణం.

ప్రశ్న 21.
పై సమాధానం ఆధారంగా శీతాకాలంలో భారతదేశంలో దక్షిణాదికంటే ఉత్తరాన ఎందుకు చల్లగా ఉంటుందో కారణం చెప్పగలవా?
జవాబు:
శీతాకాలంలో ఉత్తర భారతదేశం పగటి కాలం కంటే రాత్రి కాలం ఎక్కువ. అందుచే ఉత్తర భారతదేశంలో దక్షిణాది కంటే చలి ఎక్కువ.

పట నైపుణ్యా లు

8th Class Social Textbook Page No.28

ప్రశ్న 22.
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 15
పై చిత్రంలో సింగపూర్, షాంఘై, బ్లాడివోస్టాళ్లను గుర్తించంది.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 16

ప్రశ్న 23.
ప్రపంచ పటములో ఈ క్రింది వాటిని గుర్తించుము.
1. భూమధ్యరేఖ 2. ధృవాలు 3. రష్యా 4. ఆస్ట్రేలియా
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 17

ప్రశ్న 24.
AP Board 8th Class Social Solutions Chapter 2 సూర్యుడు - శక్తి వనరు 18
పై పటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
1. భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న రేఖ ఏది?
జవాబు:
మకరరేఖ.

2. ఈ పటం ఏ ప్రక్షేపణకు చెందినది?
జవాబు:
రాబిన్సన్ ప్రక్షేపణకు చెందినది.

3. భూమధ్యరేఖకు ఆనుకుని ఉన్న ఖండాలేవి?
జవాబు:
దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా.