SCERT AP 8th Class Social Study Material Pdf 13th Lesson భారత రాజ్యాంగం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 13th Lesson భారత రాజ్యాంగం

8th Class Social Studies 13th Lesson భారత రాజ్యాంగం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
‘దమన పురాన్ని’ పూజారులు, మంత్రులు రూపొందించిన నియమాల ఆధారంగా ఒక రాజు పరిపాలిస్తున్నాడు. అతడు తన రాజ్యాన్ని పదహారు ప్రాంతాలుగా చేసి ఒక్కొక్క ప్రాంతానికి తన అధికారులను పరిపాలకులుగా నియమించాడు. ఇది ప్రజాస్వామిక దేశం అని చెప్పవచ్చా? ఇది రాజ్యాంగబద్ద దేశమా? మీ సమాధానాలకు కారణాలు ఇవ్వండి. (AS1)
జవాబు:
ఇది ప్రజాస్వామిక దేశం అని, రాజ్యాంగబద్ద దేశం అని చెప్పలేను.
కారణాలు:

  1. రాజు వంశపారంపర్యంగా పాలకుడు అయ్యాడు.
  2. పూజారులు, మంత్రులు ఎన్నుకొనబడినవారు కాదు.
  3. పాలకులుగా ఉన్న అధికారులు రాజుచే నియమించబడ్డవారు.

ప్రశ్న 2.
దిగువ ఉన్న వాక్యా లలో సరైనది ఏది? (AS1)
అ) ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధాన్ని రాజ్యాంగం నిర్ణయిస్తుంది.
ఆ) ప్రజాస్వామిక ప్రభుత్వాలకు సాధారణంగా ఒక రాజ్యాంగం ఉంటుంది.
ఇ) భారతదేశం వంటి వైవిధ్యతతో కూడుకున్న దేశానికి రాజ్యాంగం తయారుచేయటం తేలిక కాదు.
ఈ) పైవన్నీ
జవాబు:
పైవన్నీ

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 3.
కింది నాయకులను రాజ్యాంగాన్ని రూపొందించటంలో వారి పాత్రతో జతపరచంది. (AS1)

Group – ‘A’ Group – ‘B’
1) మోతీలాల్ నెహ్రూ A) రాజ్యాంగసభ అధ్యక్షులు
2) బి. ఆర్. అంబేద్కర్ B) రాజ్యాంగ సభ సభ్యులు
3) రాజేంద్ర ప్రసాద్ C) డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్
4) సరోజినీ నాయుడు D) 1928లో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారుచేశారు

జవాబు:
1) D 2) C 3 A 4) B

ప్రశ్న 4.
నెహ్రూ ఉపన్యాసం నుంచి పొందుపరిచిన భాగాన్ని మరొకసారి చదివి ఈ దిగువ వాటికి సమాధానాలివ్వండి. (AS2)
అ) రాజ్యాంగ నిర్మాతలు ఏ ప్రతిజ్ఞ పూనాలని అతడు కోరాడు?
ఆ) “ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తుడవాలని మనతరం మహానాయకుడు కలగన్నాడు”. అతడు ఎవరి గురించి చెబుతున్నాడు?
జవాబు:
అ) రాజ్యాంగ నిర్మాతలు నిరంతరం శ్రమిస్తామని ప్రతిజ్ఞ పూనాలని అతడు కోరాడు.
ఆ) అతడు గాంధీజీ గురించి చెబుతున్నాడు.

ప్రశ్న 5.
ఇక్కడ రాజ్యాంగంలోని కొన్ని మార్గదర్శక విలువలు, వాటి అర్థాలు ఉన్నాయి. వాటిని జతపరచండి. (AS1)

Group – ‘A’ Group – ‘B’
1) సర్వసత్తాక A) ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యతనివ్వదు.
2) గణతంత్ర B) నిర్ణయాలు తీసుకునే అంతిమ అధికారం ప్రజలకు ఉంటుంది.
3) సౌభ్రాతృత్వం C) దేశాధినేత ఎన్నికైన వ్యక్తి
4) లౌకిక D) ప్రజలు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మాదిరి మెలగాలి.

జవాబు:
1) B 2) C 3) D 4) A

ప్రశ్న 6.
భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచిన ముఖ్యమైన భావనలు ఏవి? (AS1)
జవాబు:
భారత రాజ్యాంగ ప్రవేశికలో న్యాయం, లౌకికతత్వం, గణతంత్రం, సామ్యవాదం, స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ముఖ్యమైన భావనలున్నాయి.

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 7.
‘చట్టం ముందు ప్రజలందరూ సమానమే’ దీనిని ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
“చట్టం ముందు ప్రజలందరూ సమానులే” – భారత రాజ్యాంగ ముఖ్యాంశాలలో ఇది ఒకటి. కుల, మత, ప్రాంత, లింగ, అక్షరాస్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా 18 సం||లు దాటిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 8.
కింది వాటిల్లో సరైన వాక్యాలను గుర్తించండి. (AS1)
జవాబు:
అ) శాసనసభల అధికారాలను రాజ్యాంగం నిర్వచిస్తుంది. ( ఒప్పు)
ఆ) ఎట్టి పరిస్థితులలోనూ రాజ్యాంగాన్ని మార్చటానికి లేదు. (తప్పు)
ఇ) పీఠికలో ఉన్న ఆదర్శాలు వ్యవస్థల నిర్మాణంలో వ్యక్తమవుతున్నాయి. (ఒప్పు)
ఈ) దేశం మొత్తానికి సంబంధించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వస్థాయిలో చేస్తారు. (తప్పు)

ప్రశ్న 9.
సమన్యాయం ఏయే సందర్భాలలో కనబడుతుంది? ఉదాహరణలతో తెలపండి. (AS6)
జవాబు:
సమన్యాయం కనిపించే సందర్భాలు :

  1. పబ్లిక్ ట్రాన్స్పర్టులో ఎవరైనా ప్రయాణించవచ్చు.
  2. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఎవరైనా ప్రవేశం పొందవచ్చు.
  3. రహదారులు, పార్కులు వంటివాటిని ఎవరైనా ఉపయోగించవచ్చు.

8th Class Social Studies 13th Lesson భారత రాజ్యాంగం InText Questions and Answers

8th Class Social Textbook Page No.150

ప్రశ్న 1.
దేశానికి అయిదు లక్ష్యాలు రూపొందించమని మిమ్మల్ని, మీ సహచర విద్యార్థిని అడిగారు అనుకోండి. అవి ఏమై ఉంటాయి? వీటిని నిర్ణయించే ప్రక్రియ ఏది ? వాటిని చేరుకోవడానికి మీరేం చేస్తావు ? తరగతిలో మీ టీచరు సహాయంతో చర్చించండి.
జవాబు:

  1. అందరికీ విద్య
  2. అందరికీ ఆరోగ్యం
  3. ఆర్థికాభివృద్ధి
  4. శాంతి, సహజీవనం
  5. అహింస, అందరికీ అవకాశాలు

వాటిని చేరుకోవటానికి నేను ఈ విధంగా చేస్తాను :

ఈ లక్ష్యాల పట్ల అధికారులకు, పాలకులకు అవగాహన కల్పిస్తాను. ప్రజలకు శాంతి, అహింస, సహజీవనం పట్ల నమ్మకం కలిగిస్తాను. అందరూ వాటికి చేరుకునేలా సమాజంలో మార్పును తెస్తాను.

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 2.
స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులు భారతదేశం రాజులు, రాణులతో పాలించబడాలని ఎందుకు కోరుకోలేదు? చర్చించండి.
జవాబు:
రాజులు, రాణులు అందరూ రాచరిక, నియంతృత్వ పద్ధతిలో పాలన చేశారు. భారతదేశంను అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి పాలించారు. విదేశీ దండయాత్రలను ఎదుర్కోలేకపోయారు.

స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులు జాతీయవాదులు. వీరు అఖండ భారతాన్ని గూర్చి కలలుగన్నారు. ప్రజాస్వామ్య పద్ధతులలో పాలనను కోరుకున్నారు. ఈ కాబట్టి వీరు రాజులు, రాణుల పాలనను కోరుకోలేదు.

8th Class Social Textbook Page No.151

ప్రశ్న 3.
స్వాతంత్ర్యం వచ్చిన నాటికి మన దేశంలో ఉన్న అసమానతలు, వివక్షతలలో కొన్నింటిని పేర్కొనండి. /Page No. 151)
జవాబు:
అసమానతలు :

  1. ఆర్థిక అసమానతలు
  2. సాంఘిక అసమానతలు

వివక్షతలు :

  1. జాతి వివక్షత
  2. లింగ వివక్షత

ప్రశ్న 4.
ఇక్కడ జతలుగా కొన్ని వాక్యాలు ఉన్నాయి. కొన్నింటిలో తప్పుడు సమాచారం ఉంది. వాటిని సరిచేయండి.
అ) నమూనా రాజ్యాంగ ప్రతిని రాశారు – మోతీలాల్ నెహ్రూ.
ఆ) నిరక్షరాస్యులు ఓటు చేయకూడదని నాయకులు అంగీకరించారు – సార్వజనీన వయోజన ఓటుహక్కు.
ఇ) రాష్ట్రాల శాసన సభలు – వలస పాలన చట్టాలను కొన్నింటిని రాజ్యాంగం తీసుకుంది.
ఈ) దేశ విభజన – చాలామంది చంపబడ్డారు. కాందిశీకులు చేయబడ్డారు.
ఉ) మహిళలకు ఓటు లేకుండా చేయటం – భారతదేశంలో సామాజిక సంస్కరణలకు కట్టుబడి ఉండటం.
జవాబు:
అ) నమూనా రాజ్యాంగ ప్రతిని మోతీలాల్, మరో 8 మంది భారత జాతీయ కాంగ్రెసుకు చెందినవారు కలిసి రాశారు.
ఆ) సార్వజనీన వయోజన ఓటుహక్కు అంటే లింగ, కుల, మత, జాతి, సంపద భేదం లేకుండా వయోజనులందరికీ ఓటు వేసే హక్కు
ఇ) రాష్ట్రాల శాసన సభలు – వలస పాలన చట్టాలను కొన్నింటిని రాజ్యాంగం తీసుకుంది.
ఈ) దేశ విభజన – చాలామంది చంపబడ్డారు, కాందిశీకులు చేయబడ్డారు.
ఉ) మహిళలకు ఓటు కల్పించడం – భారతదేశంలో సామాజిక సంస్కరణలకు కట్టుబడి ఉండటం.

ప్రశ్న 5.
స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఉన్న మీ తాత, అవ్వల నుంచి కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వృద్ధుల నుంచి కానీ అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో, సమాజ భవిష్యత్తు గురించి వాళ్లు ఏమి భావించారో తెలుసుకోండి.
జవాబు:
ఈ విషయం గురించి నేను మా ముత్తాతని అడిగి తెలుసుకున్నాను. ఆయన భావనని ఆయన నాకు పాట రూపంలో పాడి వినిపించారు.

“ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖ పడాలి నందనందనా || ఉందిలే ||

గాంధీ మహాత్ముడు కలగన్న రోజు
నెహ్రూ మహాత్ముడు మురిసిన రోజు || ఉందిలే ||

ఆ రోజెంతో దూరం లేదోరన్నయో
అదుగో చూడు ముందే వుంది రన్నయో ! ఉందిలే ||

పాడి పంటలు పండిన రోజు
మనిషి మనిషిగా బతికినరోజు || ఉందిలే ||

8th Class Social Textbook Page No.152

ప్రశ్న 6.
మన రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఏవేవి ఆలోచనలను, స్ఫూర్తిని ఇచ్చాయి?
జవాబు:
ముందుగా భారతదేశంలో వివిధ రకాల ప్రజలు మెరుగైన ప్రపంచాన్ని కోరుతూ చేసిన పోరాటాలు రాజ్యాంగ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చాయి. ఈ ప్రజలందరి కలలు నిజంచేసే భారతదేశాన్ని నిర్మించటం తమ పవిత్ర కర్తవ్యంగా భావించారు. మహాత్మాగాంధీ, ఇతర జాతీయ నాయకుల ఆలోచనలతో వాళ్లు ప్రభావితమయ్యారు.

రెండవది, ఫ్రెంచి విప్లవం ఆదర్శాలతో, బ్రిటన్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో, అమెరికాలో హక్కుల చట్టంతో . మన నాయకులలో అనేకమంది ప్రేరణ పొందారు. రష్యా, చైనాలలో సోషలిస్టు విప్లవం భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక సమానతలతో రూపుదిద్దేలా స్ఫూర్తినిచ్చింది. మన రాజ్యాంగాన్ని రూపొందించటంలో ఈ అంశాలన్నీ ప్రభావితం చేశాయి.

మూడవది, బ్రిటిషు వాళ్లు కూడా భారతదేశంలో ప్రజాస్వామిక పాలనకు కొన్ని సంస్థలను ప్రవేశపెట్టారు. అయితే ఎన్నికలలో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే ఓటు చేయగలిగేవాళ్లు. బ్రిటిషు వాళ్లు చాలా బలహీన శాసన సభలను ప్రవేశపెట్టారు. రాష్ట్రాల శాసనసభలకు, మంత్రివర్గాలకు బ్రిటిషు ఇండియా అంతటా 1937లో ఎన్నికలు జరిగాయి. ఇవి పూర్తిగా ప్రజాస్వామిక ప్రభుత్వాలు కావు. అయితే ఈ శాసనసభలలో పొందిన అనుభవం దేశం తన సొంత శాసనసభలను నెలకొల్పటంలో సహాయపడింది. ఈ కారణం వల్లనే వలస చట్టాల నుంచి అనేక విధానాలను, సంస్థాగత వివరాలను భారత రాజ్యాంగం తనకు అనువుగా మలుచుకుంది.

8th Class Social Textbook Page No.153

ప్రశ్న 7.
రాజ్యాంగ సభకు సభ్యులను నామినేట్ చేయటానికి రాజులను ఎందుకు అనుమతించారు?
జవాబు:
ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను గమనించి రాజ్యాంగం రాయడానికి, అన్ని ప్రాంతాల వారి ఉద్దేశాలను సమన్వయం చేయడానికి వీలుగా రాజులను అనుమతించారు.

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 8.
మహిళా సభ్యులు చాలా తక్కువగా ఎందుకు ఉన్నారు? మహిళా సభ్యులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటే బాగుండేదా?
జవాబు:
నాడు మహిళలు, విద్యాధికులు, రాజకీయాలలో ఉన్నవారు చాలా తక్కువ. కాబట్టి మహిళా సభ్యులు తక్కువగా ఉన్నారు. దీంట్లో మహిళా సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉండి ఉంటే, మహిళలు ఈనాటికీ 33% రిజర్వేషన్ల కోసం పోరాడాల్సిన అవసరం వచ్చేది కాదు.

8th Class Social Textbook Page No.154

ప్రశ్న 9.
ఉద్దేశాల తీర్మానంలోని ఏ మార్గదర్శక సూత్రం అన్నిటికంటే ముఖ్యమైనది? దానికి మీ కారణాలను ఇవ్వండి. దీనిపై ఇతర విద్యార్థులకు వేరే అభిప్రాయాలు ఉన్నాయా?
జవాబు:
‘మానవాళి అంతట సంక్షేమం’ అనే మార్గదర్శక సూత్రం అన్నిటికంటే ముఖ్యమైనది.

కారణాలు :
“మానవాళి సంక్షేమమే పృథ్వి సంక్షేమము”. ఇది బాగుంటే ప్రపంచశాంతి మొదలైనవి బాగుంటాయి.
దీనిపట్ల ఇతర విద్యార్ధులకు వేరే అభిప్రాయాలు లేవు.

8th Class Social Textbook Page No.155

ప్రశ్న 10.
భారత ప్రజలు రెండు ఉద్దేశాలు సాధిస్తామని నిర్ణయించారు (తీర్మానించారు) ఈ రెండూ ఏమిటి?
జవాబు:

  1. దేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయడం.
  2. ప్రజాస్వామ్యాన్ని అవలంబించడం.

ప్రశ్న 11.
ఈ ఉద్దేశాలు నెరవేరటానికి వాళ్లు ఏం చేశారు?
జవాబు:
ఈ ఉద్దేశాలు నెరవేరటానికి వారు పాలనను రాజ్యాంగం ద్వారా సాగించారు. రాజ్యాంగాన్ని ప్రతినిధుల ద్వారా రాసి, చట్టంగా చేశారు.

ప్రశ్న 12.
ఈ మూడింటిలో ఉన్న ఒకే భావనను గుర్తించండి. (జి నెం. 154, 155 లో ఉన్న మహాత్మాగాంధీ, డా||బి.ఆర్.అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ చెప్పిన మాటలు చదవండి)
జవాబు:
సమానత్వ భావన మూడింటిలోనూ ఉన్నది.

ప్రశ్న 13.
ఈ ఒకే భావాన్ని ముగ్గురు వేర్వేరుగా, ఏ విధంగా వ్యక్తపరిచారు?
జవాబు:
మహాత్మాగాంధీ : “ఉన్నతవర్గ, పేదవర్గ ప్రజలు లేని భారతదేశం కోసం”
దా॥ బి.ఆర్. అంబేద్కర్ : “సామాజిక, ఆర్థిక జీవితాలలో సమానత్వాన్ని ఎంతకాలం తిరస్కరించాలి?
జవహర్లాల్ నెహ్రూ : “అవకాశాలలో అసమానతలను అంతం చేయడం”.

ఇలా ఒకే భావాన్ని ముగ్గురూ వేర్వేరుగా వ్యక్తపరిచారు.

8th Class Social Textbook Page No.157

ప్రశ్న 14.
ఎన్నికైన పార్లమెంటు చట్టాలను ఎందుకు చేయాలి ? విద్యావంతులైన న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎందుకు చేయకూడదు?
జవాబు:
మన రాజ్యాంగం మనకు పార్లమెంటరీ, ప్రభుత్వ విధానాన్ని ఇచ్చింది. పార్లమెంటులో మనకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఉంటారు. వీరు చేసే చట్టాలు ప్రజల అవసరాలను అనుసరించి ఉంటాయి. వాటిని న్యాయశాఖ సమీక్షిస్తుంది.

విద్యావంతులైన న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయపరమైన నియమ నిబంధనలు చేయగలరు. కానీ, చట్టాలు కాదు. వారు చేసే వాటికి ప్రజల మద్దతు ఉండదు. కాబట్టి వారు చట్టాలు చేయరాదు.

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 15.
ప్రధానమంత్రి, మంత్రివర్గం తమ నిర్ణయాలకు పార్లమెంటు ఆమోదాన్ని ఎందుకు పొందాలి? పార్లమెంటు సభ్యులు అడిగే ప్రశ్నలకు వాళ్లు సమాధానాలు ఎందుకు చెప్పాలి? కేవలం రాష్ట్రపతికే జవాబుదారీగా ఉంటే మెరుగ్గా ఉంటుందా?
జవాబు:
ప్రధానమంత్రి, మంత్రివర్గం పార్లమెంటుకి జవాబుదారీగా ఉంటాయి. పార్లమెంటు సభ్యులు ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. కాబట్టి వారికి సమాధానాలు చెప్పాలి.

కేవలం రాష్ట్రపతికే జవాబుదారీగా ఉంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. కాబట్టి ప్రధానమంత్రి, మంత్రివర్గం తమ నిర్ణయాలకు పార్లమెంటు ఆమోదాన్ని పొందాలి.

8th Class Social Textbook Page No.158

ప్రశ్న 16.
కొన్ని దేశాలలో భిన్నమైన వ్యవస్థ ఉంది. మొత్తం దేశానికీ, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కటే చట్టాలు చేస్తుంది. ఇటువంటి విధానం భారతదేశానికి అనువైనదని భావిస్తున్నారా? తరగతిలో చర్చించండి.
జవాబు:
భారతదేశం అనేక భిన్నత్వాలున్న దేశం. అతి పెద్దది. ఇలాంటి కేంద్రీకృత ప్రభుత్వ విధానాలు ఇంత పెద్ద దేశానికి సరిపడవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్కృతి, ఆచారం ఉంటాయి. వాటి నన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని కేంద్రప్రభుత్వం చట్టాలు చేయలేదు. చేసినా అవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండవు. కాబట్టి ఇటువంటి విధానం భారతదేశానికి అనువుగా ఉండదు.

ప్రశ్న 17.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు స్వతంత్రంగా న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఎందుకు ఉండాలో చర్చించండి.
జవాబు:
రాజ్యాంగాన్ని సంరక్షించడానికి న్యాయస్థానాలు, న్యాయమూర్తులు స్వతంత్రంగా ఉండాలి. లేదంటే వారి మీద ఒత్తిడి తీసుకువచ్చి న్యాయాన్ని పక్కత్రోవ పట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు స్వతంత్రంగా న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఉండాలి.

ప్రశ్న 18.
ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో ఎందుకు ఉండాలి?
జవాబు:
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో ఉండాలి.

ప్రశ్న 19.
రాజ్యాంగ పీఠికలో ఉపయోగించిన పదాలలో కల, హామీలలో ఏ అంశాలను గుర్తించారు? వాటి మధ్య సంబంధాన్ని సూచిస్తూ ఒక పటం తయారుచేయండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం 1

ప్రశ్న 20.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయుము.

వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొంది. మనం నమ్మిన మౌలిక సూత్రాలను, దేశాన్ని పరిపాలించే విధానాలను, ఒక చోట పొందుపరచాలనుకున్నారు. వీటిని ‘భారత రాజ్యాంగం’ అనే పుస్తకంలో పొందుపరిచారు.

రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి – చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి. ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, పౌరుల పాత్ర ఏమిటి, వాళ్ల హక్కులు ఏమిటి వంటి నియమాలను కలిగి ఉంటుంది. అన్నిటికీ మించి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి.
అ) ఎవరి పాలన నుండి భారతదేశం విముక్తి పొందింది?
జవాబు:
వలస పాలన నుండి భారతదేశం విముక్తి పొందింది.

ఆ) మనం, నమ్మిన సిద్ధాంతాల్ని దేంట్లో పొందుపరిచారు?
జవాబు:
భారత రాజ్యాంగం అనే పుస్తకంలో పొందుపరిచారు.

ఇ) రాజ్యాంగం ఏమి కలిగి ఉంటుందో రెండు రాయండి.
జవాబు:
రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి – చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి మొదలైన నియమాలను కలిగి ఉంటుంది.

ఈ) దేశం దేనికి కృషి చేయాలి?
జవాబు:
రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి.

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 21.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.

రాజ్యాంగ నిర్మాతల చిత్రాలలో ఒకరి చిత్రం లేకపోవటం మీలో కొందరు గమనించి ఉంటారు మహాత్మాగాంధీ. అతడు రాజ్యాంగసభలో సభ్యుడు కాదు. అయితే అతడి దృక్పథాన్ని అనుసరించిన సభ్యులు అనేకమంది ఉన్నారు. 1931లో ‘యంగ్ ఇండియా’ అన్న పత్రికలో రాస్తూ రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీ పేర్కొన్నాడు.

భారతదేశాన్ని అన్నిరకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను. అత్యంత పేదలు ఇది తమ దేశమనీ, దాని నిర్మాణంలో తమకూ పాత్ర ఉందని భావించే భారతదేశం కోసం, ఉన్నతవర్గ, నిమ్నవర్గ ప్రజలు లేని భారతదేశం కోసం. అన్ని మతాల వాళ్లు, జాతుల వాళ్లు సామరస్యంతో ఉండే భారతదేశం కోసం నేను కృషి చేస్తాను. ఇటువంటి భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తుమందులు అనే శాపం ఉండవు. మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉంటాయి. ఇంతకంటే తక్కువ దానితో నేను సంతృప్తి పడను. – మహాత్మా గాంధీ
అ) రాజ్యాంగ నిర్మాతలలో ఎవరి చిత్రం లేదు?
జవాబు:
మహాత్మాగాంధీ చిత్రం

ఆ) ఈ కల దేంట్లో రాయబడినది?
జవాబు:
1931లో ‘యంగ్ ఇండియా’ పత్రికలో రాయబడింది.

ఇ) ఇది ఎవరి కల?
జవాబు:
ఇది మహాత్మాగాంధీ కల.

ఈ) ఈ కలలో భవిష్యత్తులో ఏమి ఉండవు?
జవాబు:
భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తుమందులు అనే శాపం ఉండవు.

ఉ) మహిళలకూ …………………….. హక్కులు ఉంటాయి.
జవాబు:
మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉంటాయి.

పట నైపుణ్యాలు

ప్రశ్న 22.
మీకివ్వబడిన ప్రపంచపటం నందు ఈ కింది వాటిని గుర్తించండి.
1) ఇండియా
2) దక్షిణాఫ్రికా
3) అమెరికా సంయుక్త రాష్ట్రాలు
AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం 2 AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం 3
జవాబు:
ఈ చిత్రం జనవరి 26 నాటి గణతంత్ర దినోత్సవ వేడుకలలో జరిగిన కవాతు. ఇందు ఎన్.సి.సి విద్యార్థులు ఉన్నారు. వీరు స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ ఎండలో కవాతు చేస్తున్నారు. వీరందరి ముఖాలలో చక్కటి ఆత్మస్టెర్యం కనబడుతూ ఉంది. దేనికైనా ఎదురుతిరిగి నిలబడతాం అనే తెగువ కనబడుతోంది.

ప్రశ్న 23.
భారత ప్రజలు రెండు ఉద్దేశాలు సాధిస్తామని నిర్ణయించారు. ఈ రెండూ ఏమిటి?
జవాబు:

  1. దేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయడం.
  2. ప్రజాస్వామ్యాన్ని అవలంబించడం.

ప్రశ్న 24.
అ) రాజ్యాంగ నిర్మాతలు ఏ ప్రతిజ్ఞ పూనాలని నెహ్రూ కోరారు?
ఆ) “ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తుడవాలని మనతరం మహానాయకుడు కలగన్నాడు”. ఆయన ఎవరి గురించి చెబుతున్నారు?
జవాబు:
అ) రాజ్యాంగ నిర్మాతలు నిరంతరం శ్రమిస్తామని ప్రతిజ్ఞ పూనాలని ఆయన కోరారు.
ఆ) ఆయన గాంధీజీ గురించి చెబుతున్నారు

AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం

ప్రశ్న 25.
రాజ్యాంగం ఏమి కలిగి ఉంటుందో రెండు రాయండి.
జవాబు:
రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి – చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి మొదలైన నియమాలను కలిగి ఉంటుంది.

ప్రశ్న 26.
దేశం దేనికి కృషి చేయాలి?
జవాబు:
రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి.

ప్రశ్న 27.
రాజ్యాంగ సభకు సభ్యులను నామినేట్ చేయడానికి రాజులను ఎందుకు అనుమతించారు?
జవాబు:
ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను గమనించి రాజ్యాంగం రాయడానికి, అన్ని ప్రాంతాల వారి ఉద్దేశాలను సమన్వయం చేయడానికి వీలుగా రాజులను అనుమతించారు.

ప్రశ్న 28.
మహిళా సభ్యులు చాలా తక్కువగా ఎందుకున్నారు?
జవాబు:
నాడు మహిళలు, విద్యాధికులు, రాజకీయాలలో ఉన్నవారు చాలా తక్కువ. కాబట్టి మహిళా సభ్యులు తక్కువగా ఉన్నారు.

ప్రశ్న 29.
ఉద్దేశాల తీర్మానంలోని ఏ మార్గదర్శక సూత్రం అన్నిటికంటే ముఖ్యమైనది?
జవాబు:
‘మానవాళి అంతట సంక్షేమం’ అనే మార్గదర్శక సూత్రం అన్నిటికంటే ముఖ్యమైనది.

ప్రశ్న 30.
ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో ఎందుకుండాలి?
జవాబు:
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో ఉండాలి.

ప్రాజెక్టు

అమెరికా, భారతదేశం, దక్షిణాఫ్రికా దేశాల రాజ్యాంగాల పీఠికలను పోల్చండి.
అ) ఈ మూడు దేశాల పీఠికలో ఉన్న ఆదర్శాల జాబితా తయారుచేయండి.
ఆ) వీటి మధ్య కనీసం ఒక ప్రధానమైన తేడాను గుర్తించండి.
ఇ) ఈ మూడింటిలో గతాన్ని ఏది ప్రస్తావిస్తుంది?
ఈ) వీటిలో ఏది దేవుడిని ప్రస్తావించదు?
జవాబు: అ)
AP Board 8th Class Social Solutions Chapter 13 భారత రాజ్యాంగం 4

ఆ) తేడా : భారతదేశ రాజ్యాంగం ఇవ్వబడిన తేదీ ఇందులో రాయబడి ఉంది. మిగతా రెంటిలో తేదీ లేదు.
ఇ) దక్షిణ ఆఫ్రికా రాజ్యాంగ పీఠిక గతాన్ని ప్రస్తావిస్తుంది.
ఈ) భారత రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం దేవుడిని ప్రస్తావించవు.