AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.2

SCERT AP 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.2 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 8th Class Maths Solutions 1st Lesson అకరణీయ సంఖ్యలు Exercise 1.2

ప్రశ్న 1.
కింది అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై చూపుము.
(i) \(\frac {9}{7}\)
(ii) –\(\frac {7}{5}\)
సాధన.
(i) \(\frac {9}{7}\)
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.2 1

(ii) –\(\frac {7}{5}\)
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.2 2

ప్రశ్న 2.
\(-\frac{2}{13}, \frac{5}{13}, \frac{-9}{13}\) లను ఒకే సంఖ్యారేఖపై సూచించండి.
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.2 3

ప్రశ్న 3.
\(\frac {5}{6}\) కంటే చిన్నవయిన ఐదు అకరణీయ సంఖ్యలను వ్రాయండి.
సాధన.
\(\frac {5}{6}\) కంటే చిన్నవైన అకరణీయ సంఖ్యలు
\(\left\{\frac{4}{6}, \frac{3}{6}, \frac{2}{6}, \frac{1}{6}, \frac{0}{6}, \frac{-1}{6}, \frac{-2}{6}, \ldots \ldots\right\}\)

ప్రశ్న 4.
-1 మరియు 2 ల మధ్య గల 12 అకరణీయ సంఖ్యలను కనుగొనండి.
సాధన.
-1 = \(\frac {-12}{12}\) మరియు 2 = \(\frac{2 \times 12}{12}\) = \(\frac {24}{12}\)
∴ -1 మరియు 2ల మధ్య గల అకరణీయ సంఖ్యలు
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.2 4
నుండి ఏవేని 12 అకరణీయ సంఖ్యలు తీసుకొన వచ్చును.

ప్రశ్న 5.
\(\frac {2}{3}\) మరియు \(\frac {3}{4}\) ల మధ్య ఒక అకరణీయ సంఖ్యను కనుగొనుము.
(సూచన : ఇచ్చిన అకరణీయ సంఖ్యలను సజాతి భిన్నాలుగా మార్చండి.)
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.2 5

ప్రశ్న 6.
\(\frac {-3}{4}\) మరియు \(\frac {5}{6}\) ల మధ్య పది అకరణీయ సంఖ్యలు కనుగొనండి.
సాధన.
\(\frac {-3}{4}\) మరియు \(\frac {5}{6}\)
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.2 6
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.2 7
\(\frac {-9}{12}\), \(\frac {10}{12}\) ల మధ్య ఏవైనా 10 అకరణీయ సంఖ్యలు ఎన్నుకోవచ్చును.

AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1

SCERT AP 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 8th Class Maths Solutions 1st Lesson అకరణీయ సంఖ్యలు Exercise 1.1

ప్రశ్న 1.
కింది ఉదాహరణలలో ఉన్న ధర్మాలను గుర్తించి వ్రాయండి.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 1
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 2

ప్రశ్న 2.
కింది వాటికి సంకలన మరియు గుణకార విలోమాలు వ్రాయండి.
(i) \(\frac {-3}{5}\)
(ii) 1
(iii) 0
(iv) \(\frac {7}{9}\)
(v) -1
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 3

AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1

ప్రశ్న 3.
కింది ఖాళీలను పూరించండి.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 4
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 5
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 6

ప్రశ్న 4.
\(\frac {2}{11}\) ను \(\frac {-5}{14}\) యొక్క గుణకార విలోమంతో గుణించండి.
సాధన. \(\frac {-5}{14}\) యొక్క గుణకార విలోమం = 14
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 7
∴ \(\frac{2}{11} \times\left(\frac{-14}{5}\right)=\frac{-28}{55}\)

ప్రశ్న 5.
\(\frac{2}{5} \times\left[5 \times \frac{7}{6}\right]+\frac{1}{3} \times\left(3 \times \frac{4}{11}\right)\) యొక్క గణనలో ఏయే ధర్మాలను ఉపయోగిస్తాము ?
సాధన.
\(\frac{2}{5} \times\left[5 \times \frac{7}{6}\right]+\frac{1}{3} \times\left(3 \times \frac{4}{11}\right)\) యొక్క గణనలో
గుణకార సహచర ధర్మం
గుణకార విలోమం
గుణకార తత్సమాంశం
సంకలన సంవృతం అనే ధర్మాలను ఉపయోగిస్తాము.

AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1

ప్రశ్న 6.
కింది సమానత్వాన్ని సరిచూడండి.
\(\left(\frac{5}{4}+\frac{-1}{2}\right)+\frac{-3}{2}=\frac{5}{4}+\left(\frac{-1}{2}+\frac{-3}{2}\right)\)
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 8

ప్రశ్న 7.
\(\frac{3}{5}+\frac{7}{3}+\left(\frac{-2}{5}\right)+\left(\frac{-2}{3}\right)\) విలువను పదాల అమరికను మార్చి సూక్ష్మీకరించండి.
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 9

ప్రశ్న 8.
కింది వాటిని వ్యవకలనం చేయండి.
(i) \(\frac {1}{3}\) నుండి \(\frac {3}{4}\)
(ii) 2 నుండి \(\frac {-32}{13}\)
(iii) \(\frac {-4}{7}\) నుండి -7
సాధన.
(i) \(\frac {1}{3}\) నుండి \(\frac {3}{4}\)
\(\frac{1}{3}-\frac{3}{4}=\frac{4-9}{12}=\frac{-5}{12}\)

(ii) 2 నుండి \(\frac {-32}{13}\)
2 – \(\frac {-32}{13}\)
= 2 + \(\frac {32}{13}\)
= \(\frac{26+32}{13}\)
= \(\frac {58}{13}\)

(iii) \(\frac {-4}{7}\) నుండి -7
\(\frac {-4}{7}\) – (-7)
= \(\frac {-4}{7}\) + 7
= \(\frac{-4+49}{7}\)
= \(\frac {45}{7}\)

AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1

ప్రశ్న 9.
\(\frac {-5}{8}\) కు ఎంత కలిపిన \(\frac {-3}{2}\) వచ్చును ?
సాధన.
\(\left(\frac{-5}{8}\right)+x=\left(\frac{-3}{2}\right)\)
⇒ x = \(-\frac{3}{2}+\frac{5}{8}=\frac{-3 \times 4+5}{8}\)
= \(\frac{-12+5}{8}\)
x= \(\frac {-7}{8}\)
= \(\frac {45}{7}\)
∴ \(\frac {-5}{8}\) నకు (\(\frac {-7}{8}\)) కలిపిన \(\frac {-3}{2}\) వచ్చును.

ప్రశ్న 10.
రెండు అకరణీయ సంఖ్యల మొత్తం 8. వాటిలో ఒక సంఖ్య \(\frac {-5}{6}\) అయితే రెండవ సంఖ్య ఎంత ?
సాధన.
రెండవ సంఖ్య = x అనుకొనుము.
x + (\(\frac {-5}{6}\)) = 8 ⇒ x = 8 + \(\frac {5}{6}\)
= \(\frac{48+5}{6}\)
x = \(\frac {53}{6}\)

ప్రశ్న 11.
వ్యవకలనం దృష్ట్యా అకరణీయ సంఖ్యలు సహచర ధర్మాన్ని పాటిస్తాయా ? ఒక ఉదాహరణతో వివరించండి.
సాధన.
\(\frac{1}{2}, \frac{3}{4}, \frac{-5}{4}\) ఏవైనా 3 అకరణీయ సంఖ్యలు.
వ్యవకలన సహచర ధర్మం
⇒ a – (b – c) = (a – b) – c ను పాటిస్తుందో లేదో చూద్దాం.
AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1 10
∴ L.H.S ≠ R.H.S
వ్యవకలనం దృష్ట్యా అకరణీయ సంఖ్యలు సహచర ధర్మాన్ని పాటించవు.
∴ a – (b – c) ≠ (a – b) – c

ప్రశ్న 12.
– (-x) = x ను కింది విలువలకు సరిచూడండి.
(i) x = \(\frac {2}{15}\)
(ii) x = \(\frac {-13}{17}\)
సాధన.
(i) x = \(\frac {2}{15}\)
⇒ -(-x) = -(\(\frac {-2}{15}\)) = \(\frac {2}{15}\) [∵ (-) × (-) = +]

(ii) x = \(\frac {-13}{17}\)
-(-x) = \(-\left[-\left(\frac{-13}{17}\right)\right]=-\left[\frac{13}{7}\right]=\frac{-13}{7}\) [∵ (-) × (+) = -]
∴ పై రెండు ఉదాహరణల నుండి ‘x’ విలువ ఏదైనప్పటికీ – (-x) = x అగును.

AP Board 8th Class Maths Solutions Chapter 1 అకరణీయ సంఖ్యలు Ex 1.1

ప్రశ్న 13.
కింది వానికి జవాబులు వ్రాయండి.
i) సంకలన తత్సమాంశం కలిగి వుండని సమితి ఏది ?
సాధన.
సంకలన తత్సమాంశం (0) కలిగి ఉండని సమితి N.
సహసంఖ్యా సమితిలో “సున్న” (0) ఉండదు.

ii) గుణకార విలోమం లేని అకరణీయ సంఖ్య ఏది ?
సాధన.
గుణకార విలోమం లేని అకరణీయ సంఖ్య ‘0’.
[∵ \(\frac {1}{0}\) ను నిర్వచించలేము కనుక]

iii) ఋణ అకరణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం ?
సాధన.
ఋణ అకరణీయ సంఖ్య యొక్క గుణకార విలోమం
ఒక ఋణ అకరణీయ సంఖ్య అవుతుంది.
∵ \(\frac{-2}{5} \times\left(\frac{-5}{2}\right)=1\)

AP Board 8th Class Maths Solutions Chapter 15 సంఖ్యలతో ఆడుకుందాం Ex 15.1

AP SCERT 8th Class Maths Textbook Solutions Chapter 15 సంఖ్యలతో ఆడుకుందాం Ex 15.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 8th Class Maths Solutions 15th Lesson సంఖ్యలతో ఆడుకుందాం Exercise 15.1

ప్రశ్న 1.
భాజనీయతా సూత్రములుపయోగించి, క్రింది పట్టికలో ఇవ్వబడిన అంకెలు 2, 5, 10 తో నిశ్శేషముగా భాగింపబడిన అవును అని, భాగింపబడని కాదు అని వ్రాయండి.
AP Board 8th Class Maths Solutions Chapter 15 సంఖ్యలతో ఆడుకుందాం Ex 15.1 1
సాధన.
AP Board 8th Class Maths Solutions Chapter 15 సంఖ్యలతో ఆడుకుందాం Ex 15.1 2

AP Board 8th Class Maths Solutions Chapter 15 సంఖ్యలతో ఆడుకుందాం Ex 15.1

ప్రశ్న 2.
భాజనీయతా నియమము ద్వారా క్రింది సంఖ్యలలో ఏవి ‘2’ తో భాగింపబడునో తెలపండి.
(a) 2144
(b) 1258
(c) 4336
(d) 633
(e) 1352
సాధన.
ఒక సంఖ్య ‘2’ చే భాగింపబడవలెనన్న దాని ఒకట్ల స్థానంలోని అంకె 0, 2, 4, 6, 8 అయి ఉండవలెను,
(a) 2144
(b) 1252
(c) 433
(d) 1352 లు “2 చే భాగింపబడును.

ప్రశ్న 3.
భాజనీయతా నియమము ద్వారా కింది సంఖ్యలలో ఏవి ‘5″ తో భాగింపబడునో తెలపండి.
(a) 438750
(b) 179015
(c) 125
(d) 639210
(e) 17852
సాధన.
ఒక సంఖ్య 5’చే భాగింపబడవలెనన్న దాని ఒకట్ల స్థానంలోని అంతె 0 లేదా 5 అయి ఉండవలెను.
(a) 438750
(b) 179015
(c) 125
(d) 639210 లు ‘5’చే భాగింపబడును.

AP Board 8th Class Maths Solutions Chapter 15 సంఖ్యలతో ఆడుకుందాం Ex 15.1

ప్రశ్న 4.
భాజనీయతా నియమము ద్వారా కింది సంఖ్యలలో ఏవి ’10’ తో భాగింపబడునో తెలపంది.
(a) 54450
(b) 10800
(c) 7138965
(d) 7016930
(e) 10101010
సాధన.
ఒక సంఖ్య ’10’చే భాగింపబడవలెనన్న దాని ఒకట్ల స్థానంలోని అంకె 0 (సున్నా) అయి ఉండవలెను.
(a) 54450
(b) 1080
(d) 7016930
(e) 10101010 లు ’10 చే భాగింపబడును.

ప్రశ్న 5.
కింది సంఖ్యలకు కారణాంకాల సంఖ్యను కనుగొనండి.
(a) 18 (b) 24 (c) 45 (d) 90 (e) 105
సాధన.

సంఖ్య దాని యొక్క కారణాంకాలు కారణాంకాల సంఖ్య
(a) 18
(b) 24
(c) 45
(d) 90
(e) 105
1, 2, 3, 6, 9, 18
1, 2, 3, 4, 6, 8, 12, 24
1, 3, 5, 9, 15, 45
1, 2, 3, 5, 9, 10, 18, 30, 45, 90
1, 3, 5, 7, 15, 21, 35, 105
6
8
6
10
8

ప్రశ్న6.
2, 5 మరియు 10తో భాగింపబడే ఏవైనా 5 సంఖ్యలను తెలపండి.
సాధన.
2, 5 మరియు 10తో భాగింపబడే సంఖ్యలు 10, 20, 30, 40, 50 ……..

AP Board 8th Class Maths Solutions Chapter 15 సంఖ్యలతో ఆడుకుందాం Ex 15.1

ప్రశ్న 7.
34A అను సంఖ్య ‘2’తో నిశ్శేషముగా భాగింపబడును. 5తో భాగింపబడిన శేషము ‘1’ అయిన ‘A’ విలువ కనుగొనుము.
సాధన.
34A, 2చే భాగింపబడిన శేషం 0 కావలెనన్న (A = (0, 2, 4, 6, 8 కావలెను)
∴ 340, 342, 344, 346, 348 లలో 5చే భాగించగా శేషం ‘1’ వచ్చు సంఖ్య 346
∴ 346 → \(\frac {6}{5}\) (R = 1)
∴ కావలసిన A విలువ 6.

AP Board 8th Class Study Material Textbook Solutions Guide State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 8th Class Textbook Solutions and Study Material Pdf in English Medium and Telugu Medium are part of AP Board Solutions.

AP State Syllabus 8th Class Textbook Solutions Study Material Guide Pdf Free Download

AP Board 8th Class Telugu Study Material Textbook Solutions Guide State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 8th Class Telugu Textbook Solutions and Study Material Pdf are part of AP Board 8th Class Textbook Solutions.

Students can also read AP Board 8th Class Telugu Important Questions for exam preparation.

AP State Syllabus 8th Class Telugu Textbook Solutions Study Material Guide Pdf Free Download

AP Board 8th Class Hindi Study Material Textbook Solutions Guide State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 8th Class Hindi Textbook Solutions and Study Material Pdf are part of AP Board 8th Class Textbook Solutions.

AP State Syllabus 8th Class Hindi Textbook Solutions Study Material Guide Pdf Free Download

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 11భూదానం.

AP State Syllabus 8th Class Telugu Important Questions 11th Lesson భూదానం

8th Class Telugu 11th Lesson భూదానం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది పరిచిత గద్యాంశాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2018-19)

వినోభాభావే పవనార్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర సాగించారు. అప్పటికి సుమారు 35 వేల ఎకరాల భూమి దాన రూపంలో లభించింది. భారతీయ సంస్కృతి విశేషాలతో విలసిల్లిన ఈ భూ ఖండంలో శాంతియుతంగా సాగిన ఈ ఉద్యమానికి ప్రజల సహకారం పూర్తిగా లభించింది. భారతీయ సంస్కృతి విశేషాలతో విలసిల్లిన ఈ భూ ఖండంలో శాంతియుతంగా సాగిన ఈ ఉద్యమానికి ప్రజలు సహకారం పూర్తిగా లభించింది. దేశంలో మొత్తం 30 కోట్ల ఎకరాల భూమి ఉన్నది. ఆ మొత్తంలో 6వ భాగం ఇమ్మని కోరాను. భారతదేశంలో గల ఒక్కొక్క కుటుంబంలో సగటున ఐదు
మంది చొప్పున ఉన్నారు. ఆ కుటుంబంలో మరొకణ్ణి చేర్చుకోమని చెప్పాను. సామాన్య బీద ప్రజానీకమే ఆరో వ్యక్తి.
ప్రశ్నలు :
1. ఆరో వ్యక్తి అంటే ఎవరు?
జవాబు:
సామాన్య బీద ప్రజానీకం (పేదవాడు)

2. దేశంలో మొత్తం ఎంత భూమి ఉన్నది?
జవాబు:
30 కోట్ల ఎకరాల భూమి

3. వినోభాభావే ఎక్కడ నుండి ఎక్కడికి పాద యాత్ర సాగించారు?
జవాబు:
పవనార్ నుంచి ఢిల్లీ వరకు

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ఒక్కొక్క కుటుంబంలో సగటున ఎంత మంది ఉన్నారు?

ఆ) కింది అపరిచిత గద్యం చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

“జీవావరణం మీద పర్యావరణం మీద మనుష్యులు ఇంత కక్ష కట్టారెందుకో ? ఇలా ఉన్న చెట్లన్నింటినీ నరికేసుకుంటూ పోతే, చివరికి మనిషికి మిగిలేదేమిటి ? అయినా ఇప్పటికే అనుభవిస్తున్నారు కదా ! గ్రీన్ హౌజ్ ఎఫెక్టునీ………. ఆమ్ల దర్పాలనీ. ఆధునిక కాలుష్యకారక సమస్యలన్నింటికీ చెట్లు నరికివేతే కారణమని, ఈ మానవమేధావులే తేల్చి చెబుతారు. మళ్ళీ ఉన్న చెట్లన్నింటినీ నరికి భవనాలూ, నగరాలూ నిర్మిస్తారు. వాళ్ళ అభివృద్ధి ఎటు పోతోందో వాళ్ళకే అర్థం కావడం లేదు.
ప్రశ్నలు :
1. కాలుష్యానికి కారణం ఏమిటి?
జవాబు:
కాలుష్యానికి కారణం చెట్లు నరికివేత.

2. మానవులు చెప్పేదే చేస్తున్నారా?
జవాబు:
లేదు. మనుషులు జీవావరణ, పర్యావరణాలపై కక్ష కట్టారు.

3. మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేస్తోందా?
జవాబు:
మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేయడం లేదు.

4. చెట్లు లేకపోతే ఏమౌతుంది?
జవాబు:
చెట్లు లేకపోతే 1) గ్రీన్ హౌజ్ ఎఫెక్టు 2) ఆమ్ల దర్పాలు కలుగుతాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

2. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావించబడిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రకరకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువులు, గ్రీన్‌హౌస్ వాయువులు ఎక్కువవుతున్నాయి. వీటి వలన తీవ్రమయిన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15 మించి 35 శాతం జంతువులు నశించిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నలు:
1. వాతావరణ కాలుష్యానికి కారణమయిన వాయువేది?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు

2. జంతువులు ఎందుకు నశించిపోతాయి?
జవాబు:
వాతావరణ కాలుష్యం వలన

3. మానవులు ఉపయోగించే వాహనాలలో కాలుష్యం కలిగించనిదేది?
జవాబు:
సైకిలు

4. వాతావరణ కాలుష్య నివారణకు ఏం చేయాలి?
జవాబు:
చెట్లను ఎక్కువగా పెంచాలి

3. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అప్పటికి 200 సంవత్సరాల నుంచి ఆంగ్లేయుల కారణంగాను, అంతకు ముందు ఏడెనిమిది వందల ఏళ్ళ నుంచి తురుష్కుల కారణంగాను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బానిసత్వంలో మగ్గుతున్న భారత జాతి దైన్యస్థితి నుంచి మేల్కొని 1857లో వీరోచితంగా ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని సాగించింది. కానీ ఆ చైతన్యాన్ని సైనికుల తిరుగుబాటు అంటూ తక్కువగా అంచనా వేసి, ఆంగ్ల ప్రభుత్వం అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకుని భారతదేశాన్ని పాలించడం మొదలు పెట్టింది.
ప్రశ్నలు :
1. సుమారు ఏ సంవత్సరములో ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశించారు?
జవాబు:
క్రీ.శ. 1600లో

2. తురుష్కులు భారతదేశాన్ని పాలించడం ఎప్పుడు మొదలుపెట్టారు?
జవాబు:
సుమారు క్రీ.శ 800లు లేక 900 సంవత్సరాల నుండి

3. సైనికుల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
జవాబు:
క్రీ.శ. 1857

4. భారతదేశం ఆంగ్లేయుల పాలనలో పూర్తిగా ఎప్పటి నుంచి వెళ్ళింది?
జవాబు:
1857

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

4. కింది గద్యాన్ని చదివి, దిగువనిచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

“విద్యారణ్యుల వారి ఆశీర్వాదంతో సంగమ వంశరాజులు విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1335లో స్థాపించారు. వీరు కళలను పోషిస్తూ, కవులను ఆదరిస్తూ, ఆశ్రితులకు అగ్రహారాలు ఇస్తూ క్రీ.శ 1485 దాకా పాలించారు. ఈ వంశంలోని కడపటి రాజులు అతి దుర్భలు అవినీతిపరులుగా మారినందువల్ల వీరి కొలువులోనే ఉన్న దండనాయకుడు సాళువ నరసింహరాయలు సామ్రాజ్యాన్ని సంరక్షించడానికి క్రీ.శ. 1485లో అధికారాన్ని హస్తగతం చేసుకొని వజ్ర సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు తాళ్ళపాక అన్నమయ్యగారిని సత్కరించి సంకీర్తనలను ప్రోత్సహించాడు. పిల్లలమట్టి పినవీరయ్యను పోషించి కృతి పుచ్చుకున్నాడు.
ప్రశ్నలు :
1. సంగమరాజులు ఎవరి ప్రోత్సాహంతో ఎప్పుడు, ఏ రాజ్యం స్థాపించారు?
జవాబు:
సంగమరాజులు విద్యారణ్య స్వామి ప్రోత్సాహంతో 1335లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.

2. సాళువ నరసింహరాయలు ఎవరు? ఎప్పుడు అతడు విజయనగర సామ్రాజ్య పాలకుడయ్యాడు?
జవాబు:
సాళువ నరసింహరాయలు సంగమ వంశరాజుల దండనాయకుడు. ఇతడు 1485లో విజయనగర పాలకుడయ్యాడు.

3. పిల్లలమట్టి పినవీరయ్యను పోషించిన ప్రభువు ఎవరు?
జవాబు:
పిల్లలమర్రి పినవీరయ్యను సాళువ నరసింహ రాయలు పోషించాడు.

4. సంకీర్తనాచార్యుడు అన్నమయ్యకు ఏ రాజు ప్రోత్సాహం లభించింది?
జవాబు:
అన్నమయ్యకు సాళువ నరసింహరాయల ప్రోత్సాహం లభించింది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వినోబా పాదయాత్ర చేద్దామని ఎందుకు అనుకున్నారు?
జవాబు:
వినోబాభావే శివరాంపల్లిలో జరుగబోయే సర్వోదయ సమ్మేళనానికి పాదయాత్ర ద్వారా వెళ్ళాలనుకున్నారు. అక్కడికి రైల్లో వెళ్తే ఒక రాత్రి ప్రయాణం చేస్తే సరిపోతుంది. కాని అందమైన ప్రకృతిని, ప్రజలను దగ్గరగా చూడలేం. కాని పాదయాత్ర చేస్తే ఆయా పల్లెల్లోని సహజ పరిస్థితులను, ప్రజలు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ విధంగా ఆలోచించి వినోబాభావే పాదయాత్ర చేయాలని సంకల్పించారు.

ప్రశ్న 2.
రైలు యాత్ర, విమాన యాత్ర కంటే పాదయాత్ర మంచిదని వినోబా భావించారు కదా ! దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
రైలులోగాని, విమానంలోగాని ప్రయాణం చేస్తే ఆ తక్కువ సమయంలో గమ్యస్థానాలను చేరుకోవచ్చు. కాని మార్గమధ్యంలో ఉన్న సుందర ప్రదేశాలను, ప్రజల వేషభాషలను, ఆచారవ్యవహారాలను చక్కగా తెలుసుకొనే అవకాశం ఉండదు. ప్రజలకు సన్నిహితంగా కలసి మాట్లాడే అవకాశం కలుగదు. పాదయాత్ర చేసినట్లైతే ప్రకృతి అందాలను తనివితీరా ప్రజల ఇబ్బందులను తెలుసుకొనవచ్చు. సహాయ సహకారాలను ప్రజలకు అందించవచ్చు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి?
జవాబు:
మాన్యులు దానం చేయాలి. దానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని –

  • స్వార్థభావన తొలగిపోతుంది. విశాలభావన కలుగుతుంది.
  • సమాజంలో సమున్నత గౌరవ మర్యాదలు కలుగుతాయి.
  • అనాథలను, అభాగ్యులను ఆదుకునే అవకాశం కలుగుతుంది.
  • మానవసేవే మాధవసేవ అనే సమున్నత భావన కలుగుతుంది.
  • నా అనే భావన తొలగి ‘మన’ అనే భావం కలుగుతుంది.
  • అవినీతి, ఆశ్రిత పక్షపాతం మొదలైన దుర్గుణాలకు దూరంగా ఉండవచ్చు.
  • అంతులేని పుణ్యాన్ని సంపాదించుకొనే అవకాశం కలుగుతుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

ప్రశ్న 2.
నేటి సమాజానికి దాతృత్వం గల వ్యక్తుల ఆవశ్యకతను తెలుపండి.
జవాబు:
సమాజానికి నేడు విశిష్ట వ్యక్తుల సేవల అవసరం చాలా ఉంది. అన్ని రంగాలలో అవినీతి పేరుకుపోయింది. స్వార్థం పెచ్చుమీరిపోయింది. స్వార్థంతో ప్రగతి శూన్యమయింది. భేదభావాలు రాజ్యమేలుతున్నాయి. అన్యాయాలు, అక్రమాలు పెచ్చుమీరిపోయాయి.

దేశభక్తి, అనన్యమైన మాతృభూమి సేవ చేయగల యువత అవసరం ఉన్నది. నీతి, అవినీతి మధ్య సంఘర్షణ పెరిగిపోయింది. స్వామి వివేకానంద విశాల భారతదేశం కావాలంటే “ఇనుపకండలు, ఉక్కునరాలు కలిగిన యువత కావాలి. కార్మికులు, కర్షకులు, దేశభక్తి కలిగిన ప్రజలు నిర్మాణం కావాలి. త్యాగం, దానం మొదలైన లక్షణాలు గల మనుషులు కావాలి. సమాజానికి అర్పణ చేసే మంచి మనుషులు కావాలి. జాతీయాదర్శాలుగా దానం శోభిల్లాలి. రామరాజ్యం నిర్మాణం కావాలంటే దానగుణం గల (మనుషుల) వ్యక్తుల అవసరం ఎంతో ఉన్నది.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
వినోబా భూదానోద్యమం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

అమలాపురం,
x x x x x x x x

ప్రియమైన మిత్రుడు రవికి,

నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది. మన దేశంలో జన్మించిన మహనీయమూర్తుల్లో వినోబా ప్రముఖులు. ఈయన చేపట్టిన భూదానోద్యమం దేశంలో ఒక సంచలనం కలిగించింది. ఎంతోమంది నిరాశ్రయులకు ఆశ్రయం కలిగింది. ఎంతోమంది భూస్వాములు తమ భూములను ప్రజలకు స్వచ్ఛందంగా అందించారు. ఈ మహనీయుని స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలిచింది. ఈయనను ఆదర్శంగా తీసుకొని మనము కూడా తోటివారికి సహాయం చేద్దాం. దీనిపై నీ అభిప్రాయాన్ని తెలుపుతూ జాబు ఇవ్వగలవు. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
xxxxxxxxxx

చిరునామా:
పి. రవి,
8వ తరగతి,
వివేకానంద ఉన్నత పాఠశాల,
అజిత్ సింగ్ నగర్,
విజయవాడ, కృష్ణాజిల్లా.

ప్రశ్న 2.
దానం ఆవశ్యకతను తెలుపుతూ కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:
దానం చేయి – తోడ్పాటు అందించు
దానం చేయి – పేదరికాన్ని తొలగించు
స్వార్థం మానుకొని తోడ్పాటునందించు
సంపదలను పరహితం కోసం వెచ్చించు
పేదలను ఆదుకోవాలి. మమతను చాటాలి.
మానవత్వాన్ని చాటు – మహనీయునిగా జీవించు.
దానం చేయడంలోనే మాధవత్వం
ధర్మాన్ని ఆచరించండి. అదే మిమ్ములను రక్షిస్తుంది.

8th Class Telugu 11th Lesson భూదానం 1 Mark Bits

1. వారంతా వేగంగా నడవాలనుకున్నారు. (పదాన్ని విడదీయండి) (SA. I – 2018-19)
ఎ) వా + రంతా
బి) వార + 0త
సి) వారం + తొ
డి) వారు + అంత
జవాబు:
డి) వారు + అంత

2. మా గ్రామ రైతులు వ్యవసాయం చేయగా వారి పిల్లలు తమ వ్యవసాయంతో వ్యాపారాలు చేస్తున్నారు. (నానార్థాలు గుర్తించండి) S.A.I – 2017-18)
ఎ) సేద్యం, ప్రయత్నం
బి) ఉద్యోగం, విహారం
సి) వ్యాపారం, వేడుక
డి) నష్టపరచడం, నష్టపోవడం
జవాబు:
ఎ) సేద్యం, ప్రయత్నం

3. అశ్వం వేగంగా పరిగెత్తుతుంది. (అర్థం గుర్తించండి) (S.A. II – 2016-17)
ఎ) సింహం
బి) చిరుత పులి
సి) బట్టె
డి) గుఱ్ఱం
జవాబు:
డి) గుఱ్ఱం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

4. నా పుస్తకాన్ని జాగ్రత్తగా చూసుకో ! (సమాసాన్ని గుర్తించండి) (S.A. II – 2016-17)
ఎ) షష్ఠీ తత్పురుషం
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) ద్వితీయా తత్పురుషం
డి) చతుర్థి తత్పురుషం
జవాబు:
ఎ) షష్ఠీ తత్పురుషం

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

5. యశం పొందాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) యత్నం
బి) కీర్తి
సి) గొప్ప
డి) దారి
జవాబు:
బి) కీర్తి

6. రాష్ట్రం కళలకు ఆటపట్టు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) దాపు
ఓ) గుట్టుగ
సి) హీనం
డి) నిలయం
జవాబు:
డి) నిలయం

7. తార్కాణంగా నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సానుకూలత
బి) ఉదాహరణ
సి) సమన్వయం
డి) సాంద్రత
జవాబు:
బి) ఉదాహరణ

8. ధనాన్ని ఆర్జన చేయాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సముదాయం
బి) విక్రయం
సి) క్రమణం
డి) సంపాదన
జవాబు:
డి) సంపాదన

9. గాంధీ ఘనకార్యం చేశాడు – గీత గీసిన పదానికి అర్ధం గుర్తించండి.
ఎ) గొప్పపని
బి) చిన్నపని
సి) మధ్యపని
డి) అధమ పని
జవాబు:
ఎ) గొప్పపని

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

10. కంటికెదురు అని అర్థాన్ని తెలియజేసే పదం గుర్తించండి.
ఎ) ప్రత్యక్షం
బి) పరోక్షం
సి) అపరోక్షం
డి) అంతర్నిహితం
జవాబు:
ఎ) ప్రత్యక్షం

11. పొలంలో బీజం నాటాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వృక్షం
బి) విత్తనం
సి) చీర
డి) చినుగు
జవాబు:
బి) విత్తనం

12. పండుగకు విరాళం ఇచ్చాను – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ధనం
బి) విత్తం
సి) చందా
డి) ధాన్యం
జవాబు:
సి) చందా

పర్యాయపదాలు :

13. గ్రంథం చదవాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పుస్తకం, పొత్తం
బి) పురుషం, పైరు
సి) కావ్యం, ధ్వని
డి) శబ్దం, ధ్వని
జవాబు:
ఎ) పుస్తకం, పొత్తం

14. తోవ బాగుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఎద, హృదయం
బి) దారి, మార్గం
సి) పథం, ఆలోచన
డి) అంతరంగం, ఆరాధన
జవాబు:
బి) దారి, మార్గం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

15. చదువు అవసరం ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వితరణం, విరాళం
బి) ఆవశ్యకత, అక్కఱ
సి) దాపు, గుట్టు
డి) ధనం, విత్తం
జవాబు:
బి) ఆవశ్యకత, అక్కఱ

16. వ్యవసాయం చేయాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) కృషి, సేద్యం
బి) ప్రయత్నం, పరిశోధన
సి) పరిమితి, దున్ను
డి) కేదారం, కూలంకష
జవాబు:
ఎ) కృషి, సేద్యం

17. నిర్ణయం చేయాలి – గీత గీసిన పదానికి ప్యూయపదాలు గుర్తించాలి.
ఎ) ప్రగతి, పురోగతి
బి) అనునయం, అనుకరణ
సి) నిశ్చయం, సిద్ధాంతం
డి) రాద్దాంతం, పరిశీలన
జవాబు:
సి) నిశ్చయం, సిద్ధాంతం

18. ప్రయోజనం కలిగి ఉండాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పరిశోధన, ప్రగతి
బి) లాభం, ఉపయోగం
సి) సాధన, సాధికారత
డి) అనునయం, పరిశీలన
జవాబు:
బి) లాభం, ఉపయోగం

19. గుహంలో ఉండాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించాలి.
ఎ) అవసరం, ఆవరణ
బి) గేహం, సదనం
సి) సదనం, నిర్ణయం
డి) గుండె, గురుతు
జవాబు:
బి) గేహం, సదనం

ప్రకృతి – వికృతులు

20. రాత్రి పడింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) రాయితిరి
బి) రాతిరి
సి) రాతెరి
డి) రాతిరి
జవాబు:
బి) రాతిరి

21. దమం అనుసరించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) దోమం
బి) ధర్మం
సి) థెమ్మం
డి) దైవం
జవాబు:
బి) ధర్మం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

22. శాసం చదవాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) చట్టం
బి) శాసనం
సి) శాసె
డి) శస్త్రం
జవాబు:
ఎ) చట్టం

23. సంతోషంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సంబరం
బి) సహచరం
సి) వేడుక
డి) సంతసం
జవాబు:
డి) సంతసం

24. పయనం అయ్యారా? – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) ప్రొయాణం
బి) ప్రయాణం
సి) ప్రమోదం
డి) ట్రయాణం
జవాబు:
బి) ప్రయాణం

25. బాస నేర్వాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) బస
బి) భాష
సి) బోస
డి) బైస
జవాబు:
బి) భాష

26. కార్యం పూర్తి కావాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) కఠోరం
బి) కఠినం
సి) కర్ణం
డి) కర్ణం
జవాబు:
సి) కర్ణం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

27. జతనం చేయాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) యత్నము
బి) యాతర
సి) బాతనం
డి) జేతనం
జవాబు:
ఎ) యత్నము

నానార్థాలు:

28. వ్యవసాయం చేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కృషి, ప్రయత్నం
బి) పరిశోధన, కానుక
సి) కరుణ, దయ
డి) వ్యయం, దాపు
జవాబు:
ఎ) కృషి. ప్రయత్నం

29. వర్మం కురిసింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వాన, సంవత్సరం
బి) వాయువు, మబ్బు
సి) వారిధి, జలధి
డి) ప్రగతి, అరుణ
జవాబు:
ఎ) వాన, సంవత్సరం

30. మిత్రుడు వచ్చాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జలధి, వారిధి
బి) సూర్యుడు, స్నేహితుడు
సి) వైరి, విరోధి
డి) పగతుడు, ఆత్నీయుడు
జవాబు:
బి) సూర్యుడు, స్నేహితుడు

31. కరంతో పనిచేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కంది, కంచు
బి) చేయి, తొండము
సి) కర్ణం, నాశిక
డి) శీర్షం, శిరం
జవాబు:
బి) చేయి, తొండము

32. గుణం పెరగాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చాలు, కులం
బి) వర్ణం, వంశం
సి) మార్గం, గోపురం
డి) స్వభావం, అల్లెత్రాడు
జవాబు:
డి) స్వభావం, అల్లెత్రాడు

వ్యాకరణాంశాలు

సంధులు :

33. గుణసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) సూర్యాస్తమయం
బి) సర్వోదయం
సి) మనోహరం
డి) తపోధనుడు
జవాబు:
బి) సర్వోదయం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

34. ఊహాతీతంగా ఉంది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) గుణసంధి
సి) యణాదేశ సంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

35. తేవాలని ఉంది – గీత గీసిన పదాన్ని విడదీయడం గుర్తించండి.
ఎ) తేవాల + అని
బి) తేవాలి + అని
సి) తేవ + అని
డి) తేవాలే + అని
జవాబు:
బి) తేవాలి + అని

36. మరొకటి ఉండాలి – గీత గీసిన పదాన్ని విడదీయడం గుర్తించండి.
ఎ) మర + ఒకటి
బి) మరె + ఒకటి
సి) మంచి + ఒకటి
డి) మరి + ఒకటి
జవాబు:
డి) మరి + ఒకటి

37. కష్టార్జితం ఉత్తమం – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) కష్ట + యార్జితం
బి) కష్టి + ఆర్జితం
సి) కష్ట + ఆర్జితం
డి) కష్ట + ఆర్జితం
జవాబు:
సి) కష్ట + ఆర్జితం

38. ఏ, ఓ, అర్ – అనే వాటిని గుర్తించండి.
ఎ) గుణాలు
బి) వృద్దులు
సి) సరళాలు
డి) స్థిరాలు
జవాబు:
ఎ) గుణాలు

39. వృద్ధి సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) వసుధేక
బి) వసుధైక
సి) వసుధోక
డి) వసుధాక
జవాబు:
బి) వసుధైక

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

40. శంకరాచార్యులు మహాగురువు – గీత గీసిన పదం సంధి?
ఎ) శంకరి + ఆచార్యులు
బి) శంకరా + ఆచార్యులు
సి) శంకరో + ఆచార్యులు
డి) శంకర + ఆచార్యులు
జవాబు:
డి) శంకర + ఆచార్యులు

సమాసాలు :

41. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన సమాసం గుర్తించండి.
ఎ) ద్వంద్వ సమాసం
బి) బహువ్రీహి సమాసం
సి) సప్తమీ తత్పురుష
డి) ద్విగు సమాసం
జవాబు:
డి) ద్విగు సమాసం

42. పల్లె యందలి ప్రజలు దీనికి సమాసపదం గుర్తించండి.
ఎ) ప్రథమా తత్పురుష
బి) సప్తమీ తత్పురుష
సి) తృతీయా తత్పురుష
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
బి) సప్తమీ తత్పురుష

43. వందలాదిగా వచ్చారు – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) గుణసంధి
సి) యణాదేశ సంధి
డి) అత్వసంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

44. కష్టార్జితం – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) కష్టమునకు ఆర్జితం
బి) కష్టమునందు ఆర్జితం
సి) కష్టము కొరకు ఆర్జితం
డి) కష్టము చేత ఆర్జితం
జవాబు:
డి) కష్టము చేత ఆర్జితం

గణ విభజన :

45. న గణానికి గణాలు ఏవి?
ఎ) UUI
బి) III
సి) UUU
డి) IIU
జవాబు:
బి) III

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

46. IUU – ఇది ఏ గణం?
ఎ) య గణం
బి) త గణం
సి) ర గణం
డి) స గణం
జవాబు:
ఎ) య గణం

47. అత్యంత – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UUI
బి) UIU
సి) TUU
డి) IIU
జవాబు:
ఎ) UUI

48. IUI – ఇది ఏ గణము?
ఎ) య గణం
బి) జ గణం
సి) స గణం
డి) న గణం
జవాబు:
బి) జ గణం

వాక్యారకాలు :

49. బాలునిచే పనిచేయబడింది – ఇది ఏ వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) నిశ్చయార్థక వాక్యం
డి) నిర్ణయాత్మక వాక్యం
జవాబు:
ఎ) కర్మణి వాక్యం

50. భూదానం తప్పక చేయాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) భూదానం విధిగా చేయకూడదు
బి) భూదానం తప్పక చేయకూడదు
సి) భూదానం తప్పక చేయలేకపోవచ్చు
డి) భూదానం కొంత చేయాలి
జవాబు:
బి) భూదానం తప్పక చేయకూడదు

51. నేను తప్పక వస్తాను – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధార్థక వాక్యం
బి) నిశ్చయాత్మక వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) ఆత్మార్థక వాక్యం
జవాబు:
బి) నిశ్చయాత్మక వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

52. శత్రర్థకం – అనగా
ఎ) వర్తమాన అసమాపక క్రియ
బి) భూతకాలిక అసమాపక క్రియ
సి) భవిష్యత్కాలక అసమాపక క్రియ
డి) విధ్యర్థక అసమాపక క్రియ
జవాబు:
ఎ) వర్తమాన అసమాపక క్రియ

53. బస్సు వచ్చింది గాని చుట్టాలు రాలేదు – ఇది ఏరకమైన వాక్యం?
ఎ) కరరి వాక్యం
బి) సంయుక వాక్యం
సి) సామాన్య వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
ఎ) కరరి వాక్యం

54. మీరు ఇంటికి వెళ్ళవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) అనుమత్యర్థక వాక్యం
సి) నిర్ణయాత్మక వాక్యం
డి) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
బి) అనుమత్యర్థక వాక్యం

55. మీరు ఎక్కడ ఉన్నారు? – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిశ్చయార్థక వాక్యం
బి) నిర్ణయాత్మక వాక్యం
సి) ప్రశ్నార్థక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
సి) ప్రశ్నార్థక వాక్యం

56. పాలు తెల్లగా ఉంటాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) ఆత్మార్థక వాక్యం
జవాబు:
ఎ) తద్ధర్మార్థక వాక్యం

57. దయతో అనుగ్రహించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) శత్రర్థక వాక్యం
బి) ప్రార్ధనార్ధక వాక్యం
సి) ఆత్మార్థక వాక్యం
డి) చేదర్థక వాక్యం
జవాబు:
బి) ప్రార్ధనార్ధక వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

58. అందరు వెళ్ళాలి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధార్థక వాక్యం
బి) విధ్యర్థక వాక్యం
సి) అప్యర్థక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
బి) విధ్యర్థక వాక్యం

అలంకారాలు :

59. కమలాక్షునర్చించు కరములు కరములు – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) వృత్త్యనుప్రాస
బి) ఉపమ
సి) లాటానుప్రాస
డి) యమకం
జవాబు:
సి) లాటానుప్రాస

60. ఉపమానోపమేయాలకు పోలిక చెప్పడం – ఇది ఏ అలంకారం?
ఎ) ఉపమ
బి) రూపక
సి) అతిశయోక్తి
డి) అర్థాంతరన్యాస
జవాబు:
ఎ) ఉపమ

61. మీకు వంద వందనాలు – ఇది ఏ అలంకారం?
ఎ) అంత్యానుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) యమకం
డి) వృత్త్యనుప్రాస
జవాబు:
బి) ఛేకానుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

62. నీ కరుణాకటాక్ష వీక్షణములకు నిరీక్షిస్తున్నాను – ఇది ఏ అలంకారం?
ఎ) వృత్త్యనుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) రూపకం
జవాబు:
ఎ) వృత్త్యనుప్రాస

సొంత వాక్యాలు :

63. పాదయాత్ర : రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తారు.

64. సంస్కృతి : భారతీయ సంస్కృతి సమున్నతమైనది.

65. దర్శనం : భగవంతుని దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.

66. కల్పవృక్షం : ఉపాధ్యాయుడు విద్యార్థులపట్ల కల్పవృక్షం వంటివాడు.

67. ఆకాంక్ష : దేశసేవ చేయాలనే ఆకాంక్ష ఉండాలి.

68. సాక్షాత్కారం : భక్తునికి భగవంతుని దివ్య సాక్షాత్కారం కలిగింది.

69. ప్రత్యేకత : మా అమ్మగారి వంటకాలు దేనికవే ప్రత్యేకతగా ఉంటాయి.

70. ఊహాతీతం : నాకు మొదటి ర్యాంకు వచ్చినపుడు ఊహాతీతమైన ఆనందం కల్గింది.

71. హత్తుకోవడం : మా గురువుల పాఠాలు మా మనస్సులకు బాగా హత్తుకున్నాయి.

72. లోటుపాట్లు : కార్యక్రమంలో లోటుపాట్లు జరగకుండా చూడాలి.

73. నిండు హృదయం : దానం చేసేటప్పుడు నిండు హృదయంతో సంతోషంగా దానం చేయాలి.

74. కష్టార్జితం : కష్టార్జితంతో జీవించడంలో ఆనందం ఉంది.

75. అసాధారణము : దేశంలో అవినీతి అసాధారణంగా పెరిగింది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం.

AP State Syllabus 8th Class Telugu Important Questions 9th Lesson సందేశం

8th Class Telugu 9th Lesson సందేశం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అపరిచిత గద్యం చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

పరశురాముడు దుష్టులైన క్షత్రియులను చంపుటకు పుట్టినవాడు. అతని చేతిలో ఎందరో రాజులు మరణించారు. ఒక్క శ్రీరాముడు మాత్రమే అతనిని ఓడించాడు. అప్పటి నుండి యుద్దాలు మానేసి, మహేంద్రపర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. అటువంటివాడు గంగ కోరిక పై భీష్మునికి యుద్ధవిద్యలు నేర్పాడు. భీష్ముడు పరశురాముని శిష్యుడు కనుక గురువు ఆజ్ఞాపించిన కార్యమును శిరసావహించి తీరతాడని అంబ నమ్మింది. ఏదో విధంగా పరశురాముని అనుగ్రహం సంపాదించి, భీష్ముని సాధించవచ్చని ఊహించింది.
ప్రశ్నలు :
1. గురు, శిష్యులెవరు?
జవాబు:
పరశురాముడు, భీష్ముడు.

2. ఎవరి ఆజ్ఞను శిరసావహించాలి?
జవాబు:
గురువు యొక్క ఆజ్ఞను.

3. రాజులు ఎందుకు మరణించారు?
జవాబు:
దుష్టత్వము వలన.

4. పరశురాముడిని శ్రీరాముడు ఎందుకు ఓడించగలిగాడు?
జవాబు:
శ్రీరామునిలో దుష్టత్వము లేకపోవటం వలన.

2. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ప్రపంచంలో మొట్టమొదట విడుదల చేయబడిన తపాళాబిళ్ళ అతికించే రకం కాదు. అది రెండు అణాల ఖరీదు కలిగిన కాపర్ టికెట్. ఈస్టిండియా కంపెనీ అధికారానికి లోబడిన వందమైళ్ళ లోపు చిరునామాకు దాని ద్వారా ఒక కవరును పంపవచ్చును. ఆ కవరును డాక్ రన్నర్ తీసుకువెడతాడు. ఈ కాపర్ టోకెన్ ప్రప్రథమంగా 1774 మార్చి 31వ తేదీన పాట్నాలో విడుదల చేయబడింది. 1852లో సింధు ప్రావిన్స్ కమిషనర్ సర్ బార్టీల్ ఫైర్ ఆసియాలో మొట్టమొదట తపాలాబిళ్ళను తీసుకువచ్చాడు. అందులో ఈస్టిండియా కంపెనీ ముద్ర ఉండేది. దానిని సింధు లోపల ఉత్తరాలు పంపడానికి ఉపయోగించేవారు. దీనిని సింధ్ డాక్ అనేవారు.
ప్రశ్నలు :
1. డాక్ రన్నర్ అంటే ఎవరు?
జవాబు:
తపాలా బంట్రోతు

2. సింధు ప్రావిన్స్ ఎవరి పరిపాలనలో ఉంది?
జవాబు:
ఈస్టిండియా కంపెనీ.

3. అణా అంటే ఎన్ని పైసలు?
జవాబు:
ఆరు పైసలు.

4. సింధ్ డాక్ అంటే ఏమిటి?
జవాబు:
సింధు ప్రావిన్స్ లోని కాపర్ టికెట్.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

3. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

అక్టోబర్ 16వ తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నాము. నిజానికి ఆహారధాన్యాల కొరత లేకపోయినా ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ప్రజలు తిండి లేక చనిపోవటం దారుణసత్యం. దీనికి కారణాలు అనేకం. అందులో ఆహార పదార్థాలను వృథా చేయటం. మనం ఆహారాన్ని వృథా చేస్తున్నామంటే అది అందవలసిన వారికి అందకుండా అడ్డపడుతున్నామన్నమాట. ఇలా వృథా అవుతున్న ఆహారంలో సగానికి సగం మామూలుగా పిల్లలు తినే కంచాలలోనే వృథా అవుతున్నది. తల్లిదండ్రులే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. పిల్లలు ఇష్టపడే ఆరోగ్యకరమైన, పుష్టికరమైన ఆహారాన్ని వారికి ఇవ్వాలి. వారు దాన్ని వృథా చేయకుండా తినేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత.
ప్రశ్నలు :
1. పిల్లల పట్ల ఎవరు బాధ్యతగా ఉండాలి?
జవాబు:
తల్లిదండ్రులు.

2. ప్రపంచ ఆహారదినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం?
జవాబు:
అక్టోబరు 16వ తేదీ.

3. సరిపడ ఆహారమున్నా కొందరికి ఎందుకు తిండిలేదు?
జవాబు:
కొంతమంది ఆహారాన్ని వృథా చేయడం వలన.

4. మనం వృథా చేసేవాటిలో ఇంకొకటి ఏమిటి?
జవాబు:
నీరు

4. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఈ పురాతనమైన ఏడు ప్రపంచ అద్భుతాలలో ప్రధానమైనవి ఈజిప్టులోని పిరమిడ్లు. మిగిలిన ఆరు అద్భుతాలు కాలగర్భంలో కలిసిపోయాయి. లేదా శిథిలావస్థను చేరుకున్నాయి. విలక్షణమయిన ఆకారంతో భూమ్యాకర్షణ శక్తికి తట్టుకుని నిలబడడం వలన పిరమిడ్లు ఈనాటికీ నిలిచి ఉన్నాయి. పిరమిడ్ ఆకారంలో ఇళ్ళు నిర్మించడానికి ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించలేదు. అయినా కలపతో, గాజుతో చేసిన పిరమిడ్ ప్రతిరూపాలు ఫ్యూరియోలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. భవిష్యత్ లో సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటీ క్విటీస్ ఆఫ్ ఈజిప్ట్ సంస్థ అనుమతి పొందకుండా వీటి రెప్లికాలు తయారుచేయడానికి వీలుకాదు.
ప్రశ్నలు:
1. ప్రపంచంలోని వింతలెన్ని?
జవాబు:
ఏడు

2. కాలగర్భంలో కలిసిపోవడమంటే ఏమిటి?
జవాబు:
నశించిపోవడం.

3. “శిథిలావస్థ” – దీనిలో ఏ సంధి ఉంది?
జవాబు:
సవర్ణదీర్ఘ సంధి

4. ఎవరి అనుమతితో పిరమిడ్ ఆకారం తయారుచేయాలి?
జవాబు:
సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటీక్విటీస్ ఆఫ్ ఈజిప్టు

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

5. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావించిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రకరకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువులు, గ్రీన్‌హౌజ్ వాయువులు ఎక్కువవుతున్నాయి. వీటి వలన తీవ్రమయిన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15 మించి 35 శాతం జంతువులు నశించిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నలు :
1. వాతావరణ కాలుష్యానికి కారణమయిన వాయువేది?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు

2. జంతువులు ఎందుకు నశించిపోతాయి?
జవాబు:
వాతావరణ కాలుష్యం వలన

3. మానవులు ఉపయోగించే వాహనాలలో కాలుష్యం కలిగించనిదేది?
జవాబు:
సైకిలు

4. వాతావరణ కాలుష్య నివారణకు ఏం చేయాలి?
జవాబు:
చెట్లను ఎక్కువగా పెంచాలి.

6. కింది అపరిచిత గద్యం చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (S.A. III – 2016-17)

ప్రతి జీవికి ఆహారం అవసరం. అందుకే “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అన్నారు. అన్నం దొరకని వారికి ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు అన్నం విలువ ఏమిటో తెలుస్తుంది. చాలా మంది అన్నాన్ని వృథాగా పడేస్తుంటారు. అలా పడేసే ముందు వారు అన్నం దొరకక అల్లాడిపోయే పేదవారి గురించి ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది.
ప్రశ్నలు:
1. పూర్వులు అన్నాన్ని దేని స్వరూపంగా భావించారు?
జవాబు:
అన్నం పరబ్రహ్మ స్వరూపం.

2. అన్నం విలువ ఎప్పుడు తెలుస్తుంది?
జవాబు:
ఆకలితో ఉన్నప్పుడు

3. అన్నం వృథాగా పడేసే ముందు ఎవరి గురించి ఆలోచించాలి?
జవాబు:
అన్నం దొరకని పేదవారిని గురించి

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ప్రతి జీవికి అవసరమైనదేది?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సంపాదకీయ వ్యాసం ప్రక్రియను వివరించండి.
జవాబు:
ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో సంపాదకీయ వ్యాసం ముఖ్యమైనది. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యానురూపంగా పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగేరచన సంపాదకీయ వ్యాసం. దీన్ని పత్రికా సంపాదకులు గానీ, ప్రత్యేక వ్యాసకర్తలు గానీ రాస్తూ ఉంటారు. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకునేటట్లు, ఆలోచించేటట్లు చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ వర్తిస్తుంటాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 2.
‘సంస్కరణ’ – పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
సంస్కరణ’ పాఠ్యభాగ రచయిత ‘నండూరి రామమోహనరావు’గారి రచనా విశేషాలు రాయండి. (S.A. II – 2017-18)
జవాబు:
‘సంస్కరణ’ అనే పాఠ్యభాగ రచయిత శ్రీ నండూరి రామమోహనరావుగారు. తెలుగు పాత్రికేయులలో సుప్రసిద్ధులైన నండూరి రామమోహనరావు (1927 – 2011) కృష్ణాజిల్లా విస్సన్నపేటలో జన్మించారు. జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితాజ్యోతి మొదలైన పత్రికల్లో సంపాదకులుగా పనిచేసారు. విశ్వరూపం, నరావతారం, విశ్వదర్శనం వీరి ప్రముఖ రచనలు. నండూరి వారి సంపాదకీయ వ్యాసాలు అయిన “అనుపల్లవి”, ‘చిరంజీవులు”, “నండూరి రామమోహనరావు వ్యాఖ్యావళి” పేరిట సంకలనాలుగా వచ్చాయి. పిల్లలకోసం కొన్ని ఇంగ్లీషు నవలలను తెలుగులో రాశారు. “చిలకచెప్పిన రహస్యం”, “మయూరకన్య” పిల్లల నవలలు, “హరివిల్లు” పేరిట పిల్లలగేయాలు వ్రాశారు.

తెలుగు విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేటు ఇచ్చి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ పాత్రికేయుడు అవార్డుతో సత్కరించింది.

ప్రశ్న 3.
సమాజంలో దురాచారాలపట్ల ప్రజల్లో ఏహ్యభావం కల్పించడం ద్వారా, వాటిని నిర్మూలించవచ్చని నండూరి వారన్నారు కదా ! దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
మద్యం తాగడం, మత్తు పదార్థాలు సేవించడం, పటేలో అర్ధనగ్ననృత్యాలు వంటి దురాచారాల పట్ల వ్యతిరేక ప్రచారం ద్వారా, ఆ దురాచారాల వల్ల నష్టపోయిన వారి కథల ప్రచారం ద్వారా, అప్పటి వారి రూపాల ఫొటోలను వారికి చూపడం ద్వారా, వారికి ఆ దురాచారాల పట్ల ఏహ్యభావం కల్పించాలి.

వరకట్నం తీసికోవడం అంటే, తమ సంతానాన్ని సంతలో పశువుల్లా అమ్మడమే అని, వారికి తెలియజెప్పాలి. కట్నం తీసికొన్న మగవాడు సంతలో అమ్మబడ్డ పశువు అని అతడికి తెలియజెప్పాలి. కట్నం పుచ్చుకున్న వాడిని పెళ్ళాడిన స్త్రీ, పశువును పెళ్ళాడినట్లే అని కన్యలకు చెప్పాలి.

ఈ విధంగా దురాచారాలపట్ల ఏహ్యభావం కల్పిస్తే క్రమంగా ఆ దురాచారం రూపుమాసిపోతుంది అన్నమాట సత్యం. క్లబ్బులో సగం బట్టలతో నాట్యం చేసిన తన ఫొటోను చూసిన ఆడది తిరిగి ఎన్నడూ, ఆ పని చేయదు. ఆ దుస్తుల్లో తన భార్య ఫొటోను చూసిన భర్త ఇంక ఎప్పుడూ భార్యను పట్లకు పంపడు. కాబట్టి నండూరి వారి మాట సమర్థింపదగినది.

ఆ) కింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘సంస్కరణ’ పాఠ్యభాగ సారాంశం రాయండి.
జవాబు:
సమాజంలో ఎన్నో సాంఘిక దురాచారాలు ఉన్నాయి. వాటిలో బాల్యవివాహాలు, వరకట్నం, మద్యపానం మొదలైన వాటిని ప్రముఖంగా చెప్పవచ్చు. బాల్యవివాహాలను నిర్మూలించడానికి శారదా చట్టం వంటిది వచ్చింది. అయినా ఎంతోమంది సంఘసంస్కర్తల ప్రయత్నాల మూలంగా బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయి. ఈనాడు ‘వరకట్నం’ అనే సాంఘిక దురాచారం పెనుభూతంలా మారింది.

ఒకప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి నందినీ శతపథి స్త్రీల అభ్యున్నతికి అవరోధాలుగా విద్యావిహీనత, వరకట్నం అనే ఈ రెండూ ప్రధానమని చెప్పారు. జనాభాలో నూటికి 70 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ప్రజలు కూడా వరకట్న నిర్మూలనకు సిద్ధంగా లేరని తెలుస్తున్నది. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం అనేది సంఘంలో గౌరవానికి చిహ్నంగా మారింది.

ఈనాడు వివాహాలు కూడా ఆర్భాటంగా జరుగుతున్నాయి. వివాహాల్లో వృథా వ్యయం అవుతున్నది. ఈ దురాచారాలకు శాసనాల అవసరం ఉంది. అయినా అంతకంటే ముఖ్యంగా ఈ దురాచారాలపట్ల ప్రజల్లో ఏహ్యభావం కలిగించాలి. యువతీయువకులు కూడా దురాచారాలను ఎదిరించాలి. అప్పుడే దురాచారాల నిర్మూలన జరుగుతుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 2.
సమాజంలో దురాచారాలపట్ల ప్రజల్లో అసహ్యభావం కలిగించడం ద్వారా వాటిని నిర్మూలించవచ్చని నండూరివారు అన్నారు కదా! దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
నండూరి రామమోహనరావు గారు ‘సంస్కరణ’ అనే పాఠ్యభాగాన్ని రచించారు. ఈ పాఠంలో కవి సంఘ సంస్కరణాభిలాషను, దాని ఆవశ్యకతను లోకానికి చాటి చెప్పాడు. ప్రస్తుత సమాజంలో సంఘ దురాచారాల పట్ల ప్రజల్లో ఏహ్యభావం కలిగించడం ద్వారా వాటిని నిర్మూలించవచ్చని తెలియజేశారు. ఈ విషయం అక్షరాల సత్యం.

కేవలం చట్టాలు చేసినంత మాత్రాన సాంఘిక దురాచారాలను నిర్మూలించలేము. వరకట్నం లాంటి దురాచారాల నిర్మూలకు ఎన్నో చట్టాలు వచ్చాయి. అయినా ప్రజల్లో మార్పు రాలేదు. బాల్యవివాహాల నిర్మూలనకు శారదా చట్టం వచ్చింది. అంతమాత్రాన బాల్యవివాహాలు ఆగడం లేదు. సంఘసంస్కర్తలు అలుపెరగని ఎన్నో ఉద్యమాలు చేశారు. అయినా ఆశించినంత ఫలితం రాలేదు. కాని చివరకు ప్రజల్లో ఇప్పుడిప్పుడే మూఢనమ్మకాల మీద, దురాచారాల మీద ఏహ్యభావం కలుగుతుంది. ఇది మరింతగా పెరగాలి. అప్పుడే సంఘ దురాచారాలు పూర్తిగా తొలిగిపోతాయి. ప్రజల జీవితాల్లో చైతన్యం కలుగుతుంది.

ఆధునిక కాలంలో వరకట్నం తీవ్రంగా వేధిస్తున్న ఒక సంఘ దురాచారం. ఎన్నో కాపురాలు దీని మూలంగా కూలిపోతున్నాయి. చట్టాలు ఎన్నో వచ్చాయి. అయినా ప్రజల్లో ఇప్పటికీ మార్పు రాలేదు. ఇప్పటికైనా రావాలి. స్త్రీ విద్యపై కూడా ఇంకా ప్రజల్లో దురభిప్రాయం ఉంది. అది కూడా తొలగిపోవాలి. సమభావన కలగాలి. ప్రజల్లో సాంఘిక దురాచారాల పట్ల ఏహ్యభావం కలిగినప్పుడే సమాజానికి మేలు కలుగుతుంది.

ఇ) క్రింది అంశం గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
‘సంఘ సంస్కర్త’ ను గూర్చి వివరిస్తూ చెల్లికి లేఖ :
జవాబు:

నర్సాపురం,
x x x x x x x x

ప్రియమైన చెల్లెలు సుజాతకు,

ఆశీస్సులు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. నేను ముఖ్యంగా ఈ లేఖలో గొప్ప సంఘ సంస్కర్తయగు కందుకూరి వీరేశలింగం పంతులుగారిని గూర్చి నీకు తెలియజేయ తలచాను.

వీరేశలింగం పంతులుగారు కవిగా సంపాదించిన కీర్తి కంటె సంఘసంస్కర్తగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఆయన బాల్య వివాహాలను నిరసించారు. వితంతు వివాహాలను, స్త్రీ విద్యను ప్రోత్సహించారు. హితకారిణి సమాజాన్ని స్థాపించి దాని ద్వారా అనాథ స్త్రీ ఉద్ధరణకు పాటుపడ్డారు. సంఘంలోని అనేక దురాచారాలను, మూఢాచారాలను ఖండించారు. అందుకే కందుకూ 3 వీరేశలింగం పంతులుగారు తెలుగుజాతి గర్వించతగ్గ గొప్ప సంఘసంస్కర్త అని నా అభిప్రాయం.

ఇట్లు,
మీ సోదరుడు,
x x x x x

చిరునామా :
పి. సుజాత, 8వ తరగతి,
ఎస్. ఆర్. హైస్కూలు,
గూడూరు, నెల్లూరు జిల్లా.

ప్రశ్న 2.
సంఘసంస్కరణ ఆవశ్యకతను, సంఘ దురాచారాలను నిర్మూలించాలని కోరుతూ కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:
అంటరానితనం వద్దు. మానవత్వమే ముద్దు.
మూఢాచారాలను దూరం చేయి. ప్రగతి సాధించు.
కులం కన్న గుణం మిన్న.
కులమతాలు వద్దు. ఆత్మీయతే ముద్దు.
మూఢనమ్మకాలపై అలుపెరగని పోరాటం చేయాలి.
స్త్రీలను గౌరవించు – ఆదర్శంగా జీవించు.
స్త్రీల ప్రగతే – దేశానికి గౌరవం.
బహుజన హితాయ – బహుజన సుఖాయ.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 3.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంగా మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

కరపత్రం

“ధైర్యే సాహసే లక్ష్మీ”

మహిళామణులారా! ‘పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం, పైపైకి’ అన్న శ్రీశ్రీ మాట మరచిపోకండి. ఈనాడు మనపట్ల సంఘం ఎంతో వివక్షత చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందని తెలిస్తే, తల్లిదండ్రులు విలవిల లాడుతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు.

తండ్రి ఆస్తిలో స్త్రీలకు మగవారితో సమాన వాటాలు ఇవ్వడం లేదు. పేపరు తిరగవేస్తే, స్త్రీల మానభంగాల వార్తలు, టి.వి. పెడితే స్త్రీలకు జరిగిన అన్యాయాలు, అత్తవారింట స్త్రీల కష్టాలు, వరకట్నాల చావులు కనబడతాయి. వినబడతాయి. పసిపిల్లల నుండి పండు ముదుసళ్ళు వరకు అత్యాచారాలకు గురి అవుతున్నారు.

స్త్రీలంతా కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేసే మగవారి చెంపలు పగుల కొట్టాలి. నిర్భయంగా పోలీసు వారికి రిపో , చెయ్యాలి. మీరు పొరపాటున అన్యాయానికి గురి అయితే, సిగ్గుతో చితికిపోవద్దు. ధైర్యంగా నిలవండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి. బాగా చదవండి. ఉద్యోగాలు చేయండి. మనం ఈ దురాచారాల్ని ఖండిద్దాం.

అన్యాయం జరిగిన తోటి స్త్రీలకు, మనం అండగా నిలవాలి. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని, ఆనందించే రోజు రావాలి. అందుకు మనమంతా చేయి చేయి కలిపి పోరాడుదాం. ఝాన్సీ లక్ష్మీబాయిలా, సరోజినీ దేవిలా, దుర్గాబాయమ్మలా తలలెత్తి నిల గాం. ధైర్యమే మనకు శ్రీరామరక్ష.

ఇట్లు,
వనితా సంఘం.

ప్రశ్న 4.
వరకట్న సమస్యపై పదివాక్యాల్లో వ్యాసం రాయండి.
(లేదా)
నేటికీ వరకట్న మరణాల గురించి ప్రసార మాధ్యమాల్లో ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ దురాచారాన్ని గురించి వ్యాసం రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
వరునికిచ్చు కట్నం వరకట్నం. దాని వల్ల సమాజంలో ఏర్పడే సమస్యని వరకట్న సమస్య అంటారు. వరకట్నం కేవలం ఆడపిల్ల తల్లిదండ్రులకే కాదు కుటుంబం మొత్తానికి కూడా అదొక దుర్భర సమస్యగా తయారైంది. అసలు కట్నం అంటే కానుక. పెళ్ళి సందర్భంగా ఇచ్చే కానుక క్రమక్రమంగా కట్నమైంది. పూర్వకాలంలో కన్యాశుల్కం ఉండేది. డబ్బు ఇచ్చి కన్యల్ని కొనుక్కొనేవాళ్ళు. ఆధునిక కాలంలో దాని స్థానంలో వరకట్నం వచ్చింది. ఇప్పుడు పెళ్ళి సమయంలో పెళ్ళికూతురు తల్లిదండ్రులు పెళ్ళికొడుక్కి ఇచ్చే ధనం లేదా సంపదని వరకట్నం అంటున్నారు. కొందరు డబ్బు కట్నంగా ఇస్తే మరికొందరు భూములు ఇస్తారు.

వరకట్నం తీసుకోవడం గానీ, ఇవ్వడం గానీ నేరమని చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని పాటిస్తున్నదెవరు ? చట్టాన్ని కాపాడవలసిన అధికారులే వరకట్నం ఇస్తున్నారు – తీసుకుంటున్నారు. కంచే చేను మేస్తోంది ! వరకట్నం ఇవ్వనని ఎవరైనా శపథం చేస్తే అమ్మాయికి పెళ్ళికాని పరిస్థితి కూడా ఏర్పడుతోంది ! ఆశ్చర్యం ఏమిటంటే అమ్మాయికి కట్నం ఇవ్వలేక నానా బాధలు పడ్డవారే, అబ్బాయి పెళ్ళి దగ్గరికి వచ్చేటప్పటికి కట్నం ఇవ్వాలని పట్టుబడతారు.

వరకట్న నిర్మూలనం సాధ్యమవ్వాలంటే ముందుగా పెద్దలలో మార్పురావాలి. . శాఖాంతర, కులాంతర, ప్రేమ వివాహాలను ప్రోత్సహించాలి. యువతీయువకులు ఆదర్శాలతో ఈ వరకట్నమనే దురాచారాన్ని రూపుమాపాలి. అమ్మాయికి ఇవ్వటం, అబ్బాయికి తీసుకోవటం రెండూ అక్రమమేనన్న ఆలోచన కలగాలి. కట్నం అనేది బానిసవ్యాపారమన్న ప్రచారం సాగాలి. రేడియోలు, టీ.వీ.లు, సాహిత్యం ద్వారా వరకట్న దురాచారం గురించి ప్రజలకి తెలియజెయ్యాలి. వరకట్న నిషేధ చట్టాన్ని ప్రజలు అమలుపరచాలి. అప్పుడే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుంది లేదా ‘తంటా’ అవుతుంది !

ప్రశ్న 5.
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారిని గౌరవించాలని తెలుపుతూ, ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:
స్త్రీలపై అత్యాచారాలను అరికట్టండి’

సోదరులారా!
మీకు ఒక విన్నపం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం . పేపరు తెరిస్తే, టివి పెడితే, ఎక్కడో ఒకచోట మన కన్నతల్లులకు, మనకు పాలిచ్చి పెంచిన స్త్రీమూర్తులకు అవమానం జరిగిందని వార్త చూస్తాం. మనం మానవులం. రాక్షసులం కాదు.

పసిపాపలపై అత్యాచారాలు, వృద్ధ స్త్రీలపై అత్యాచారాలు, తోడి విద్యార్థినులపై, పొరుగున ఉన్న ఇల్లాలిపై అత్యాచారాలు. వెంటనే అత్యాచారాలను అరికట్టండి.

దేవతలవంటి స్త్రీలపై అత్యాచారం చేయడం రాక్షసత్వం. స్త్రీలందరూ నీకు కన్నతల్లుల వంటివారు, అక్కచెల్లెళ్ళ వంటి వారు. స్త్రీలను గౌరవించాలి, పూజించాలి.

నిర్భయ చట్టం వచ్చింది. జాగ్రత్త. స్త్రీలను అగౌరవపరిస్తే నడిరోడ్డుపైననే మిమ్మల్ని కాల్చి చంపుతారు. చట్టం పదును ఎక్కింది.

జాగ్రత్త. స్త్రీమూర్తులను పవిత్రభావంతో చూడండి. వారిని గౌరవించండి. వారికి సాయపడండి. అన్యాయం మీ కంట పడితే ఉగ్రనరసింహునిలా విజృంభించండి.

మీరు తోటి స్త్రీలను గౌరవిస్తే, దుర్గాదేవికి లక్ష కుంకుమపూజ చేసినట్లే. లలితాసహస్రం పారాయణం చేసినట్లే. గుర్తుంచుకోండి. స్త్రీలు భారత భాగ్య కల్పలతలు.

ఇట్లు,
x x x x

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 6.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

లేఖ

రాజమండ్రి,
x x x x x x x x

ప్రియ మిత్రుడు అఖిలేశ్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ లేఖలో తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ రాస్తున్నాను.

స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. వారికి అపచారం చేసేవారు ధ్వంసమైపోతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానం జరుగకుండా చూడాలి. తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
రాజేష్,

చిరునామా :
పి. అఖిలేష్,
8వ తరగతి, యం.వి.ఆర్. హైస్కూలు,
కుప్పం, చిత్తూరు జిల్లా.

8th Class Telugu 10th Lesson సంస్కరణ 1 Mark Bits

1. చైత్రశుద్ధనవమినాడు సీతారాములపరిణయం జరుగును. (పర్యాయపదాలు గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) పుట్టినరోజు, జన్మదినం
బి) సంబరం, సంతోషం
సి) పుంసవనం, సీమంతం
డి) పెళ్లి, కళ్యాణం
జవాబు:
డి) పెళ్లి, కళ్యాణం

2. విద్దె లేని వాడు వింత పశువు (ప్రకృతి గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) విధి
బి) విదియ
సి) విదె
డి) విద్య
జవాబు:
డి) విద్య

3. నిజమే ! నాకీ సంగతి తెలీదు. (సంధిని గుర్తించండి.) (S.A.III – 2016-17)
ఎ) అకారసంధి
బి) ఉకారసంధి
సి) యడాగమసంధి
డి) ఇకార సంధి
బి) విదియ
జవాబు:
బి) ఉకారసంధి

భాషాంశాలు – పదజులం

అర్థాలు:

4. సంఘనిర్మూలన ఆవశ్యకత ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనాదరం
బి) అవసరం
సి) అవకాశం
డి) అనంతం
జవాబు:
బి) అవసరం

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

5. అధర్మాన్ని నిర్మూలన చేయాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ప్రగతి
బి) తిరోగతి
సి) తొలగించడం
డి) ఏవగించడం
జవాబు:
సి) తొలగించడం

6. అభ్యున్నతి సాధించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ప్రగతి
బి) సాధికారత
సి) నేర్పరి
డి) గుర్తించు
జవాబు:
ఎ) ప్రగతి

7. దురాచారం తొలగాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సదాచారం
బి) చెడు ఆచారం
సి) గొప్పదైన
డి) కనబరచు
జవాబు:
బి) చెడు ఆచారం

8. చైతన్యం రావాలి – గీత గీసిన పదానికి అర్థం పదాలు రాయండి.
ఎ) కదలిక
బి) మదలిక
సి) అవరోధం
డి) సాధికారత
జవాబు:
ఎ) కదలిక

9. విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వినోదం
బి) ఆనందం
సి) విషాదం
డి) విచారం
జవాబు:
బి) ఆనందం

10. ప్రగతి ప్రస్ఫుటించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తెల్లారు
బి) అవసరము
సి) కనబరచు
డి) అసహ్యించు
జవాబు:
సి) కనబరచు

11. ఇతరులను అసహ్యించుకోరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పెద్ద భూతం
బి) అక్కడక్కడ
సి) తొలగించు
డి) ఏవగించుకొను
జవాబు:
డి) ఏవగించుకొను

12. ధనం సంపాదించాలి – గీత గీసిన పదానికి అర్థాలు గుర్తించండి.
ఎ) సంపద, సాగరం
బి) విత్తం, ద్రవ్యం
సి) జలధి, హలం
డి) దండనం, దాపరికం
జవాబు:
బి) విత్తం, ద్రవ్యం

పర్యాయపదాలు :

13. స్త్రీ ప్రగతి సాధించాలి – గీత గీసిన పదానికి పర్యాయ గుర్తించండి.
ఎ) మహిళ, జామాత
బి) ద్రవ్యం, పైకం
సి) మహిళ, వనిత
డి) చట్టం, ఉత్తరువు
జవాబు:
సి) మహిళ, వనిత

14. ఇనుడు ప్రకాశించాడు- గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) ప్రభాకరుడు, చందురుడు
బి) జాబిల్లి, అంతరంగం
సి) శాసనం, ధనము
డి) సూర్యుడు, రవి
జవాబు:
డి) సూర్యుడు, రవి

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

15. కార్యం ఘనంగా ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఢంక, దాపు
బి) గొప్ప, శ్రేష్ఠం
సి) ఆనందం, శ్రేష్ఠం
డి) గోప్ప, ఘనసారం
జవాబు:
సి) ఆనందం, శ్రేష్ఠం

16. కృషి చేయాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సేద్యం, సాగరం
బి) ప్రయత్నం, పరిశ్రమ
సి) గొప్ప, దాపరికం
డి) అసహ్యం, వ్యవసాయదారుడు
జవాబు:
బి) ప్రయత్నం, పరిశ్రమ

17. హర్షం పొందాలి – గీత గీసిన పదానికి సమానార్థకాలు గుర్తించండి.
ఎ) హారం, మనోహరం
బి) ఆనందం, సంతోషం
సి) సంతసం, సంతాపం
డి) సాగరం, జలధి
జవాబు:
బి) ఆనందం, సంతోషం

18. శాసనం తిరుగులేనిది-గీత గీసిన పదానికి సమానార్థకాలు గుర్తించండి.
ఎ) ఉత్తరువు, ఉత్తమం
బి) చట్టం, ఉత్తరువు
సి) అవేశం, ఆక్రందన
డి) అనువు, అరమరిక
జవాబు:
బి) చట్టం, ఉత్తరువు

19. స్త్రీ గౌరవనీయురాలు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) ఇంతి
బి) సింది
సి) శీరి
డి) గిరి
జవాబు:
ఎ) ఇంతి

20. దూరం ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) దేరం
బి) దవ్వు
సి) దాపు
డి) దాగరం
జవాబు:
బి) దవ్వు

21. నిక్కం పలకాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) నిజం
బి) నైజం
సి) నాగరం
డి) నైరాశ్యం
జవాబు:
ఎ) నిజం

22. విషయం తెలియాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) వివేకం
బి) విసయం
సి) విసురం
డి) విసెరం
జవాబు:
బి) విసయం

23. గౌరవం చూపాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) గారవం
బి) గార్దభం
సి) శాస్త్రం
డి) గేరవం
జవాబు:
ఎ) గారవం

24. రూపం మనోహరం – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) రూపు
బి) రోపు
సి) రేసు
డి) వైపు
జవాబు:
ఎ) రూపు

25. అందరు నిద్య చదవాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) వద్దె
బి) వెద్దె
సి) వొద్దె
డి) విద్దె
జవాబు:
డి) విద్దె

26. అచ్చెరువు పొందాము – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) ఆశ్చర్యం
బి) అక్కరువు
సి) ఆదరువు
డి) ఆవాసం
జవాబు:
ఎ) ఆశ్చర్యం

27. మంతిరి వచ్చాడు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) మంత్రి
బి) మంతెరి
సి) మబెరి
డి) మంచరి
జవాబు:
ఎ) మంత్రి

28. వివాహం జరిగింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) వేసహం
బి) వియ్యము
సి) వివాహం
డి) విసహం
జవాబు:
బి) వియ్యము

29. కృషి అవసరం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) సేద్యం, ప్రయత్నం
బి) సేద్యం, సాగరం
సి) పరిశ్రమ, పరిశీలన
డి) ప్రగతి, చైతన్యం
జవాబు:
ఎ) సేద్యం, ప్రయత్నం

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

30. జగతిన ప్రజలు వర్ధిల్లాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జాతి, వందనం
బి) సంతానం, జనం
సి) జాగృతి, అభ్యున్నతి
డి) శీలన, శిబిరం
జవాబు:
బి) సంతానం, జనం

31. చైతన్యం వెల్లివిరియాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చిరాకు, విరోగతి
బి) అధోగతి, అభ్యున్నతి
సి) ప్రాణం, తెలివి
డి) తపన, తామరసం
జవాబు:
సి) ప్రాణం, తెలివి

32. కళ్యాణం జరిగింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పరిశీలన, ప్రగతి
బి) పెండ్లి, బంగారం
సి) అక్షతలు, ఆకాశం
డి) అనంతం, అంతరంగం
జవాబు:
బి) పెండ్లి, బంగారం

33. ఘనం కురిసింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ఘనసారం, శబ్దం
బి) గొప్ప, మేఘం
సి) శరీరం, తనువు
డి) పుట్టుట, ప్రగతి
జవాబు:
బి) గొప్ప, మేఘం

34. సత్యం జయించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) నిజం, పూజ్యము
బి) నైజం, గుణం
సి) తపన, తాత్సారం
డి) పూజ్యం, పుణ్యము
జవాబు:
ఎ) నిజం, పూజ్యము

వ్యుత్పత్యర్థాలు :

35. నీటిని ధరించునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) జలధి
బి) కాసారం
సి) క్షీరం
డి) దాస్యం
జవాబు:
ఎ) జలధి

36. సత్పురుషులయందు పుట్టినది – అనే వ్యుత్పత్తి గల ఏది?
ఎ) అసహ్యం
బి) కులం
సి) దుఃఖం
డి) సత్యం
జవాబు:
డి) సత్యం

37. సమస్త ప్రాణులయందు సమభావన కలవాడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
ఎ) మిత్రుడు
బి) వైరి
సి) పగతుడు
డి) కృతజ్ఞుడు
జవాబు:
ఎ) మిత్రుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

38. శాసనం పాటించాలి – గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) అందరికి ఆమోదయోగ్యమైంది
బి) దీని చేత రక్షింపబడును
సి) దాని చేత కొనబడును
డి) అందరి చేత పొందబడును
జవాబు:
బి) దీని చేత రక్షింపబడును

వ్యాకరణాంశాలు

సంధులు :

39. కింది వానిలో బహుళ సంధిని గుర్తించండి.
ఎ) అత్వసంధి
బి) గుణసంధి
సి) వృద్ధి సంధి
డి) విసర్గ సంధి
జవాబు:
ఎ) అత్వసంధి

40. చేసినంత పని – గీత గీసిన పదాన్ని విడదీసి, గుర్తించండి.
ఎ) చేసిన + ఎంత
బి) చేసిన + అంత
సి) చేసినా + యంత
డి) చేసినే + యంత
జవాబు:
బి) చేసిన + అంత

41. కారణమని – ఇది ఏ సంధికి ఉదాహరణయో గుర్తించండి.
ఎ) ఉత్వసంధి
బి) గుణసంధి
సి) యణాదేశ సంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
ఎ) ఉత్వసంధి

42. వ్యతిరేకాభిప్రాయం – ఇది ఏ సంధికి ఉదాహరణ?
ఎ) వృద్ధి సంధి
బి) త్రికసంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) అత్వసంధి పదం
జవాబు:
సి) సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

43. సరిగదా – దీన్ని విడదీసిన పదం గుర్తించండి.
ఎ) సరి + కదా
బి) సరి + గదా
సి) సరి + అదా
డి) సరే + కదా
జవాబు:
ఎ) సరి + కదా

44. క్రింది వానిలో వికల్ప సంధిని గుర్తించండి.
ఎ) అత్వసంధి
బి) గసడదవాదేశ సంధి
సి) ఇత్వసంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి

45. వివాహాలు – దీనిని విడదీస్తే
ఎ) వివాహా + ఆలు
బి) వివాహము + లు
సి) వివ + అహములు
డి) వివాహ + ములు
జవాబు:
బి) వివాహము + లు

46. కింది వానిలో యణాదేశ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) అత్తమ్మ
బి) ఏమిచ్చెను
సి) అభ్యున్నతి
డి) సరాగాలు
జవాబు:
సి) అభ్యున్నతి

సమాసాలు :

47. ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) తత్పురుష
బి) బహుజొహి
సి) అవ్యయీభావం
డి) కర్మధారయం
జవాబు:
ఎ) తత్పురుష

48. విద్యాహీనత – ఈ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) విద్యకు హీనత
బి) విద్యయందు హీనత
సి) విద్యచేత హీనత
డి) విద్య కొరకు హీనత
జవాబు:
డి) విద్య కొరకు హీనత

49. కింది వానిలో తృతీయా తత్పురుషకు ఉదాహరణ
ఎ) శక్తిహీనత
బి) ఆరోగ్య భయం
సి) గురుదక్షిణ
డి) పతిభిక్ష
జవాబు:
ఎ) శక్తిహీనత

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

50. వరుని కొరకు కట్నం-దీన్ని సమాసపదంగా గుర్తించండి.
ఎ) వరకట్నం
బి) పరకట్నం
సి) అనువరకటనం
డి) ప్రతికట్నం
జవాబు:
ఎ) వరకట్నం

51. విద్యావ్యాప్తి – ఇది ఏ సమాసం?
ఎ) విద్య చేత వ్యాప్తి
బి) విద్య వలన వ్యాప్తి
సి) విద్య యొక్క వ్యాప్తి
డి) విద్యను వ్యాప్తి
జవాబు:
సి) విద్య యొక్క వ్యాప్తి

52. అసత్యం – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) సత్యమే అగుపించునది
బి) సత్యము కానిది
సి) ధర్మము కానిది
డి) సత్యముతో కూడినది
జవాబు:
బి) సత్యము కానిది

53. పూర్వకాలము – ఇది ఏ సమాసం?
ఎ) షష్ఠీ తత్పురుష
బి) పంచమీ తత్పురుష
సి) అవ్యయీభావం
డి) ప్రథమా తత్పురుష
జవాబు:
డి) ప్రథమా తత్పురుష

వాక్యాలు :

54. అంటరానితనం వద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధాక వాక్యం
బి) అష్యర్థక వాక్యం
సి) ముక్తపదగ్రస్తం
డి) నిదర్శనాలంకారం
జవాబు:
ఎ) నిషేధాక వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

55. రమ అల్లరి చేస్తూ ఆడుతున్నది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) భావార్థకం
బి) తుమున్నర్థకం
సి) అప్యర్థకం
డి) శత్రర్థకం
జవాబు:
డి) శత్రర్థకం

56. రామకృష్ణ పరమహంస, వివేకానందులు గురుశిష్యులు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధార్థక వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) అభ్యర్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) సంయుక్త వాక్యం

57. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) నిశ్చయాత్మక వాక్యం
జవాబు:
ఎ) హేత్వర్థక వాక్యం

58. మీరు ఆటలు ఆడవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుమత్యర్థకం
బి) అభ్యర్థకం
సి) హేత్వర్థకం
డి) నిషేధాకం
జవాబు:
ఎ) అనుమత్యర్థకం

59. జగతి వర్ధిల్లాలి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) సంయుక్త
బి) ఆశీర్వచనార్థకం
సి) అప్యర్థకం
డి) హేత్వర్ధకం
జవాబు:
ఎ) సంయుక్త

60. వర్తమానకాల అసమాపక క్రియను గుర్తించండి.
ఎ) శత్రర్థకం
బి) ఆశ్చర్యార్థకం
సి) క్వార్థకం
డి) అప్యర్థకం
జవాబు:
ఎ) శత్రర్థకం

గణవిభజన:

61. IUI – ఇది ఏ గణము?
ఎ) జ గణం
బి) త గణం
సి) మ గణం
డి) స గణం
జవాబు:
ఎ) జ గణం

62. జలజా – ఇది ఏ గణము?
ఎ) భ గణం
బి) స గణం
సి) న గణం
డి) మ గణం
జవాబు:
బి) స గణం

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

63. IIUI – ఇది ఏ గణము?
ఎ) స న
బి) న గ
సి) న ల
డి) స ల
జవాబు:
డి) స ల

అలంకారాలు :

64. అర్థభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉండునట్లుగా ఒక పదం వెంటవెంటనే రావడం
ఎ) లాటానుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) ఉపమ
జవాబు:
ఎ) లాటానుప్రాస

65. కింది వానిలో పొసగని అలంకారం గుర్తించండి. రకమైన వాక్యం?
ఎ) రూపక
బి) యమకం
సి) అతిశయోక్తి
డి) ఉత్ప్రేక్ష
జవాబు:
బి) యమకం

66. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పే అలంకారం ఏది?
ఎ) రూపక
బి) అతిశయోక్తి
సి) ముక్తపదగ్రస్తం
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) రూపక

67. ఉత్ప్రేక్ష – అనగా
ఎ) ఊహ
బి) ఆశ
సి) పల్లవి
డి) పోలిక
జవాబు:
ఎ) ఊహ

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

68. మానవా ! నీ ప్రయత్నం మానవా ! – ఇది ఏ అలంకారం?
ఎ) యమకం
బి) ముక్తపదగ్రస్తం
సి) లాటానుప్రాస
డి) ఉపమ
జవాబు:
బి) ముక్తపదగ్రస్తం

సొంతవాక్యాలు :

69. అవరోధాలు : కార్యసాధనలో అవరోధాలు తొలగించుకోవాలి.

70. ఆశ్చర్యం : ఇంద్రజాల ప్రదర్శన నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.

71. నిరాడంబరం : మహాత్ములు ఎంతో నిరాడంబరంగా జీవిస్తారు.

72. ఆవశ్యకత : సంఘసంస్కరణల ఆవశ్యకత ఎంతో ఉంది.

73. దురాచారం : సమాజంలో దురాచారాలను నిర్మూలించాలి.

74. ప్రతిష్ఠ : భారతదేశ సమున్నత ప్రతిష్ఠ విశ్వవ్యాప్తం అయింది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం.

AP State Syllabus 8th Class Telugu Important Questions 9th Lesson సందేశం

8th Class Telugu 9th Lesson సందేశం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది చుక్క గుర్తు గల పద్యాలకు భావాలను రాయండి.

1) చం. పరమ తపోనివేశనము బంగరుపంటలకు న్నివాస మ
బ్బురమగుశాంతిచంద్రికల భూమి ప్రపంచచరిత్రలోన బం
ధురతరకీర్తిగొన్న భరతోర్వర నాజనయిత్రియంచు పా
డర! శిరమెత్తరా! విజయఢంకను గొట్టుమురా! సహోదరా!

భావం :
ఓ సోదరా ! మనదేశం, తపోభూమి. ఇది బంగారు పంటలకు నిలయం. శాంతి వెన్నెలలు కురిసే పుణ్యభూమి. ప్రపంచంలో మనోహరమైన కీర్తిని పొందిన ఈ భరతభూమి, నా తల్లి అని గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతూ, విజయఢంకాను మ్రోగిస్తూ నీ దేశం గురించి కీర్తించు.

2) ఉ. జాతి శిరస్సు నెత్తికొని క్ష్మాతలవీధిని గౌరవాన హుం
దాతన మొప్పగాఁ దిరిగినన్ గలుగున్ గడుకీర్తి భారత
క్ష్మాతలి కట్టి భాగ్యమును గల్గగ శాంతి సముద్ధరింప లే
రా! తరుణమ్మిదే మరలరాదు సుమీ! గతకాల మెన్నడున్

భావం :
భారత జాతి తల ఎత్తుకొని ప్రపంచ వీధిలో సగౌరవంగా, హుందాగా తిరిగినప్పుడే, గొప్ప కీరి కలుగుతుంది. మనదేశానికి అటువంటి సౌభాగ్యం కలిగే విధంగా, శాంతిని పెంపొందించడానికి, ఇదే సరైన సమయము. అందుకు సిద్ధంకండి. ఎందు కంటే, పోయిన కాలం తిరిగి రాదు కదా !

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

3) శా. ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్
ఈ గోదావరి సింధు నర్మదలు నీ యీదేశ సౌభాగ్య ధా
న్యాగారాలకు పట్టుగొమ్మలు నఖండంబైన నీ ధారుణీ
భాగ్యమ్మీ సకల ప్రపంచమునకున్ స్వామిత్వముం బూనెడిన్

భావం :
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, సింధు నర్మద అనే జీవనదులు, ఈ దేశ సౌభాగ్యమైన ధాన్యాగారాలకు ముఖ్యమైన ఆధారం. అఖండమైన సౌభాగ్య సంపదలు గలిగిన ఈ దేశం, ప్రపంచానికే ఆధిపత్యం వహిస్తుంది.

ఆ) కింది అపరిచిత పద్యాలను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. మొదలు జూచినఁ గడు గొప్ప పిదపఁ గుఱుచ,
యాదిఁ గొంచెము తర్వాత నధిక మగుచుఁ
దనరు, దిన పూర్వ పరభాగ జనితమైన
ఛాయపోలిక గుజన సజ్జనుల మైత్రి
ప్రశ్నలు :
1. కుజనుల మైత్రి ఎటువంటిది?
జవాబు:
కుజనుల మైత్రి ఉదయకాలపు నీడవలె మొదట ఎక్కువగా ఉండి తరువాత తగ్గిపోతూ ఉంటుంది.

2. సజ్జనుల మైత్రి ఎటువంటిది?
జవాబు:
సజ్జనుల మైత్రి సాయంకాలపు నీడవలె మొదట తక్కువగా ఉండి తరువాత పెరుగుతూ ఉంటుంది.

3. కుజన, సజ్జనుల మైత్రిని కవి దేనితో పోల్చి చెప్పాడు?
జవాబు:
కవి కుజనుల మైత్రిని ఉదయకాలపు నీడతోను, సజ్జనుల మైత్రిని సాయంకాలపు నీడతోను పోల్చి చెప్పాడు.

4. ఈ పద్యం వల్ల మనకు ఏం తెలుస్తోంది?
జవాబు:
ఈ పదం వల్ల మనకు సజ్జనుల మైత్రి మంచిదని తెలుస్తోంది.

2. అఘము వలన మరల్చు, హితార్థ కలితుఁ
జేయుఁ గోష్యంబు దాచుఁ, బోషించుగుణము,
విడువ డాపన్ను, లేవడివేళ నిచ్చు,
మిత్రు డీలక్షణమ్ముల మెలగుచుండు

ప్రశ్నలు :
1. మిత్రుడు దేని నుండి మరలిస్తాడు?
జవాబు:
మిత్రుడు పాపం నుండి మరలిస్తాడు.

2. మిత్రుడు ఎట్టివారిని విడిచిపెట్టడు?
జవాబు:
మిత్రుడు ఆపదలో నున్నవారిని విడిచి పెట్టడు.

3. మిత్రుడు పోషించేది ఏది?
జవాబు:
మిత్రుడు సద్గుణాన్ని పోషిస్తాడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘మిత్ర లక్షణం’.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

3. తివిరి యిసుమునఁ దైలంబుఁ దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చుఁ
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
ప్రశ్నలు :
1. ఎవరి మనసు రంజింపచేయలేము?
జవాబు:
మూర్ఖుని మనసు రంజింపచేయలేము.

2. ఇసుక నుండి ఏమి తీయవచ్చును?
జవాబు:
ఇసుక నుండి తైలము తీయవచ్చు.

3. మృగతృష్ణలో ఏమి త్రాగవచ్చు?
జవాబు:
మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “మూర్ఖుని స్వభావం”.

4. కమలములు నీటఁ బాసినఁ
కమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!
ప్రశ్నలు :
1. కమలములు నీటిని విడిచిపెట్టి బయటికి వస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
కమలములు నీటిని విడిచి పెట్టి బయటికి వస్తే సూర్యరశ్మి సోకి వాడిపోతాయి.

2. ఎప్పుడు మిత్రులు శత్రువులౌతారు?
జవాబు:
తమ తమ స్థానాలను విడిచిపెడితే మిత్రులు శత్రువు లౌతారు.

3. తామరలకు మిత్రుడెవరు?
జవాబు:
తామరలకు మిత్రుడు సూర్యుడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘స్థానబలం’.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

5. ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగినదానిని
మఱువ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్
ప్రశ్నలు :
1. ఎవరి చరిత్ర తెలుసుకోవాలి?
జవాబు:
జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి.

2. ధర్మాన్ని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి?
జవాబు:
ధర్మాన్ని సజ్జనుల సమావేశం నుంచి తెలుసుకోవాలి.

3. దేనిని అనుష్ఠించాలి?
జవాబు:
ధర్మాన్ని అనుష్ఠించాలి.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యా నికి శీర్షిక ‘నీతిబోధ’.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘సందేశం’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
దేశం కోసం “సందేశం” ఇచ్చిన పాఠ్య రచయిత గురించి రాయండి. (S.A. II – 2018-19)
జవాబు:
‘సందేశం’ పాఠ్యభాగ : వయిత జ్ఞానానందకవి. ఈయన పూర్తి పేరు సురగాలి తిమోతి జ్ఞానానందకవి. బొబ్బిలి తాలూకా పెద పెంకి గ్రామంలో జన్మించారు. తెలుగు పండితులుగా పని చేశారు. ప్రాథమిక విద్యార్థి దశలోనే ఆశువుగా సీస పద్యాలు చెబుతూ ‘దీనబంధు శతకాన్ని’ రాశారు. ఆమ్రపాలి, పాంచజన్యం, క్రీస్తు శతకం, నాజీవిత గాథ, కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు, పర్జన్యం, గోల్కొండ మొ||లగు వీరి రచనలు. 1975లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డును పొందారు. రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించారు.

ప్రశ్న 2.
భారతమాత గొప్పదనాన్ని వివరించండి.
జవాబు:
మనది విశాలమైన భారతదేశం. ఇది హిమాలయాలకు పుట్టినిల్లు. ఇలాంటి భారతదేశంలో ప్రజలందరూ విశాల దృక్పథంతో మెలగాలి. మన మతాలు, భాషలు వేరైనప్పటికీ మనమంతా భారతీయులం. మన భారతదేశం ఎంతో సుందరమైనది. ఎదుటివారిపై పగ, కోపం విడనాడి ప్రేమ, స్నేహభావాలతో జీవించాలి. బుద్ధుడు, గాంధీ చేసిన బోధనలు మనకు శాంతిని చేకూరుస్తాయి.

ప్రేమ అనే జెండాను చేతపట్టుకొని ఐకమత్యంతో పయనిద్దాం. త్యాగమనే శక్తిని ఆయుధంగా చేసుకొని శత్రువుల నెదిరిద్దాం. కూలీలు, రైతులు, మేధావులు కలిసిమెలిసి పనిచేసినపుడే పల్లెలు, పట్నాలు అభివృద్ధి చెందుతాయి. మనమంతా కలిసి అనారోగ్యం, అవిద్య, అసమానతలను తొలగించటానికి పాటుపడాలి. ప్రజాస్వామ్యం కాపాడుకుంటూ సామ్యవాదం సాధించుకోవాలి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

ప్రశ్న 3.
మనదేశం ఒకప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి మధ్య తేడాను చర్చించండి.
జవాబు:
ఒకప్పుడు మన దేశం స్వతంత్ర రాజుల అధికారంలో ఉండేది. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. కేవలం వర్షాధారంగా పంటలు పండించేవారు. బ్రిటిష్ వారు దేశాన్ని తమ అధికారంలోకి తెచ్చుకున్నప్పుడు, వారు కొన్ని సదుపాయాలు చేశారు. కాని దేశం బానిసత్వం అనుభవించింది. విద్యా, ఆరోగ్య సదుపాయాలు విస్తరించలేదు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశం పంచవర్ష ప్రణాళికల ద్వారా ఎంతో అభివృద్ధి చెందింది. విద్యా, ఆరోగ్య, రవాణా వసతులు పెరిగాయి. దేశంలో పేదరికం తగ్గింది. పల్లెల్లో సహితం విద్యా సదుపాయాలు, రోడ్లు, పాడి పంటలు పెరిగాయి. పరిశ్రమలు పెరిగాయి. రోదసీ విజ్ఞానరంగంలో మనం ప్రపంచంలోనే ఉన్నత స్థితిలో ఉన్నాం.

కానీ దేశంలో నాయకుల్లోనూ, ప్రజల్లోనూ అవినీతి, లంచగొండితనం పెరిగిపోయాయి. మోసాలు, అక్రమాలు, అన్యాయాలు అధికమయ్యాయి. ధరలు చుక్కలనంటుతున్నాయి. దేశసంపద కేవలం కొంతమంది గుప్పెటలో బందీ అయ్యింది. దేశం అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం లేదు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
‘సందేశం’ పాఠం ద్వారా నీవేమి గ్రహించావో తెలుపుము.
జవాబు:
జ్ఞానానంద కవి ‘సందేశం’ అనే పాఠ్యభాగాన్ని రచించాడు. ఈ పాఠ్యభాగం ద్వారా మన భారతదేశము యొక్క గొప్పతనాన్ని, సంస్కృతీ వైభవాన్ని చక్కగా తెలియజేశాడు. ప్రపంచమంతా భారతదేశాన్ని గౌరవిస్తుంది. భారతీయులంతా శాంతిని కోరుతారు. అన్ని మతాలవారు అన్యోన్యంగా ఉంటారు. పరమత సహనాన్ని పాటిస్తారు.

భారతదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కులమత హింసలు లేవు. నానాటికీ పెరిగిపోతున్న దౌర్జన్యాలు తొలగిపోవాలి. లంచగొండితనాన్ని నిర్మూలించాలి. ప్రతినిధులు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి. ఆనాడే భారతదేశ సమైక్యత వర్ధిల్లుతుంది.

మనదేశంలో గంగ, కృష్ణా, గోదావరి వంటి మహానదులు ప్రవహిస్తున్నాయి. దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. మహాత్ముల నీతి మార్గంతో పునీతమైన పుణ్యభూమి మనది. ఈ అహింసా సిద్ధాంతాన్ని అందరూ పాటించాలి. దేశ సమగ్రతకు అందరూ కృషి చేయాలి.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
భారతమాత తన ఆత్మకథను ఎలా చెప్పుకుందో ఊహించి రాయండి.
జవాబు:
నేను భారతమాతను. నేను సిరిసంపదలు, పాడి పంటలు గలదానను. నా నేలపైననే, వేద వేదాంగాలు, రామాయణం వెలిశాయి. వ్యాసాది ఋషులు ఇక్కడే పుట్టారు. నాపై పెద్ద అరణ్యాలు ఏర్పడ్డాయి. ఉపనిషత్తులు నా నేలపైననే పుట్టాయి.

నన్ను పాలించిన రాజుల పరాక్రమ చరిత్రలు, నా ప్రజల బానిసత్వం వల్ల అంతరించాయి. నా ప్రజలు కిన్నెర మీటుతూ రాగాన్ని ఆలపిస్తూ నా భావిభాగ్యాన్ని గూర్చి పాడాలి. నవరసాలతో తేట తెలుగు పదాలతో వీనుల విందుగా కవితలు చెప్పిన కవులు నా నేలపై పుట్టారు. నన్ను కాపాడిన వీరులను గూర్చి గానం చేయాలి. నాపై పాండవేయులు చేసిన యుద్ధాన్ని గూర్చి పాడుకోవాలి. నన్ను పాలించిన కాకతీయుల యుద్ధనైపుణ్యాన్ని కీర్తించాలి. తుంగభద్రా తీరాన నన్ను పాలించిన తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి.

ప్రశ్న 2.
మనదేశంలాగే మనం పుట్టిన ఊరు కన్నతల్లి వంటిది. మీ ఊరిని గురించి పొగుడుతూ ఒక గేయం రాయండి.
జవాబు:
మా ఊరు గురించి గేయం

“సిరులు పొంగిన సీమరాయది
పాడిపంటల భాగ్యసీమది
కన్నతల్లిర “కడియమూ”
“జామతోటలు జాజిపూవులు
వంగతోటలు పండ్ల తరువులు
మల్లెపూవులు మొల్ల తోటలు
నిండియున్నవి దండిగా”
“గలగలలతో కాల్వ జలములు
గాలి కూగే కలమ సస్యము
విందు చేసే ప్రేమ పాటలు
కలసి యుండెడి కడియమూ”
కూరగాయలు కోరినన్నియు
పాడిపంటలు వలసినంతయు
వర్త కమ్మున భాగ్యసంపద
మరపురానిది “మా పురం”.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

ప్రశ్న 3.
మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
మహాత్మాగాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. కానీ భారత ప్రజలు ఆత్మీయంగా ‘బాపూజీ’ అని పిలిచేవారు. ‘మహాత్మా’ అని గౌరవించేవారు. భారతజాతి మహాత్మాగాంధీని ‘జాతిపిత’ గా గౌరవించి కృతజ్ఞత ప్రకటించుకుంది.

గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడున్న భారతీయుల దాస్య వృత్తిని చూసి చలించిపోయాడు. ఆంగ్లేయుల ప్రవర్తన సహించలేక ఎదురుతిరిగాడు. ఎన్నో కష్టాలకు లోనయ్యాడు.

స్వదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ భారతీయుల బానిస బ్రతుకుల్ని చూసి సహించలేకపోయాడు. భారతమాత పరాయి పాలకుల సంకెళ్ళలో బందీగా ఉన్నందుకు గాంధీ తల్లడిల్లాడు. ఆంగ్లేయులపై స్వాతంత్ర్య సమరం ప్రకటించాడు. శాంతి, సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సమరం చేపట్టాడు. స్వరాజ్య ఉద్యమానికి కాంగ్రెసు సంఘం స్థాపించాడు.

ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, ఖద్దరు ఉద్యమాలను చేపట్టి ఆంగ్లేయులను గుక్క తిప్పుకోనీకుండా గడగడలాడించాడు. సత్యాగ్రహం, నిరాహారదీక్షల ద్వారా భారత జాతిని జాగృతం చేసి ఆంగ్లేయుల గుండెలు దద్దరిల్లజేశాడు.

అనేక జాతులు, కులాలు, మతాలు, భాషలు గల దేశ ప్రజల్ని ఒకే తాటి మీద నడిపించి, సమైక్యంగా పోరాటం సాగించాడు. గాంధీ నడిపించిన ఉద్యమం వల్ల 1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. దుడ్డు కర్ర, అంగవస్త్రం, కిర్రు చెప్పులు గల గాంధీ ప్రపంచ దేశాలచేత జేజేలు అందుకున్నాడు.

8th Class Telugu 9th Lesson సందేశం 1 Mark Bits

1. నీ తనువు నిండా దేశభక్తి ఉండాలి. (అర్ధాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) శరీరము
బి) అవయవము
సి) శరము
డి) మనసు
జవాబు:
ఎ) శరీరము

2. దేశ గౌరవమును పెంపొందించాలి (వికృతి గుర్తించండి.) (S.A.II – 2018-19)
ఎ) గౌవరము
బి) గవరం
సి) గారవము
డి) గౌవరం
జవాబు:
సి) గారవము

3. నా యీ దేశ సౌభాగ్య సంపద లీ విశ్వమునందు నెలకొల్పుదున్ (ఏ విభక్తి) (S.A.II – 2018-19)
ఎ) తృతీయ
బి) చతుర్థి
సి) సప్తమీ
డి) షష్టీ
జవాబు:
సి) సప్తమీ

4. భారతదేశం సకల సంపదలకు నిలయము (గురు లఘువులు గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) UII
బి) UIU
సి) IIU
డి) III
జవాబు:
డి) III

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

5. గాంధీజీ శాంతికి మారుపేరు. ఉగ్రవాదులు దేనికి మారుపేరు? (వ్యతిరేకపదం రాయండి) (S.A.II – 2017-18)
ఎ) ప్రేమ
బి) అశాంతి
సి) సహనం
డి) ఆప్యాయత
జవాబు:
బి) అశాంతి

6. వనముల్ – ఈ పదంలో ఉన్న గణం ఏది? (S.A.III – 2016-17)
ఎ) న గణం
బి) స గణం
సి) య గణం
డి) మ గణం
జవాబు:
బి) స గణం

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

1. కేతనం ఎగరాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) జెండా
బి) బాబిల్లి
సి) జాతర
డి) రథం
జవాబు:
ఎ) జెండా

2. వసుధ పై శాంతి నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ధిషణ
బి) వారిధి
సి) వారంగి
డి) భూమి
జవాబు:
డి) భూమి

3. శిరంపై కేశాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) యశం,ఖ్యాతి
బి) విరించి, వివరణ
సి) ఖ్యాతి, ఖననం
డి) కిరీటం, కరుణ
జవాబు:
బి) విరించి, వివరణ

4. నవ్వ జీవనం కావాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనురాగం
బి) కొత్త
సి) పాత
డి) మధురం
జవాబు:
బి) కొత్త

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

5. మంచి తరుణంలో రావాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సమయంలో
బి) సాధనలో
సి) యోధలో
డి) పోరాటంలో
జవాబు:
ఎ) సమయంలో

6. భగవంతుడు నిఖిలం అంతా ఉన్నాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సంగరం
బి) సమస్తం
సి) సంజాతం
డి) సముద్భూతం
జవాబు:
బి) సమస్తం

7. జనయిత్రి ఉన్నది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆడపడుచు
బి) తల్లి
సి) చెల్లి
డి) అక్క
జవాబు:
బి) తల్లి

పర్యాయపదాలు :

8. కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) అధరం
బి) తల
సి) నాశిక
డి) జిహ్వ
జవాబు:
ఎ) అధరం

9. కాను పాలించాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) కీరితి, కిరీటి
బి) ధ్వజం, కేతనం
సి) భూమి, అవని
డి) ధాత్రి, జనని
జవాబు:
సి) భూమి, అవని

10. సౌభాగ్యం వృద్ధి చెందాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) కిరీటం,మకుటం
బి) సమృద్ధి, వైభవం
సి) విశదం, వైభవం
డి) జనని, ధరణి
జవాబు:
బి) సమృద్ధి, వైభవం

11. కేతనం ఎగరాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఝరి, స్యందనం
బి) పతాకం, జెండా
సి) కీలు, కెరటం
డి) జలధి, వారిధి
జవాబు:
బి) పతాకం, జెండా

12. జనయిత్రి – దీనికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వారుణి, వసుధ
బి) తల్లి, మాత
సి) అవని, వసుధ
డి) జనక, జామాత
జవాబు:
బి) తల్లి, మాత

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

13. ప్రగతి సాధించాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) పురోగతి, అభివృద్ధి
బి) జనని, జామాత
సి) పరిశీలన, పరిశోధన
డి) ఆరాటం, చైతన్యం
జవాబు:
ఎ) పురోగతి, అభివృద్ధి

ప్రకృతి – వికృతులు :

14. భృంగారం ధర పెరిగింది – గీత గీసిన పదానికి వికృతి పూరించండి.
ఎ) బండారం
బి) బంగారం
సి) శృంగారం
డి) భంగారం
జవాబు:
బి) బంగారం

15. విసయం తెలిసింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) వివరం
బి) వివేసం
సి) విషయం
డి) విశయం
జవాబు:
బి) వివేసం

16. సహజంగా ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సాజం
బి) సామ్యం
సి) సాధారణం
డి) సాధేయం
జవాబు:
ఎ) సాజం

17. గృహంలో ఉన్నారు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) గేహం
బి) గోహం
సి) గహం
డి) గోహము
జవాబు:
ఎ) గేహం

18. అచ్చెరువు పొందాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) ఆదరువు
బి) ఆశ్చర్యం
సి) అక్కరువు
డి) ఆచరువు
జవాబు:
బి) ఆశ్చర్యం

19. ఎదలో ఏమున్నది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం పదం గుర్తించండి.
ఎ) జలధి
బి) అగ్రణి
సి) హవం
డి) ఆరుణి
జవాబు:
సి) హవం

20. కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) కృతి
బి) కీరితి
సి) కేరితి
డి) కారితి
జవాబు:
బి) కీరితి

21. యజ్ఞము చేయాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) జైనము
బి) జన్నము
సి) జెన్నము
డి) జొన్నము
జవాబు:
బి) జన్నము

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

22. రూపు మనోహరం – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) రూపం
బి) రోగం
సి) రౌపం
డి) రైపం
జవాబు:
ఎ) రూపం

నానార్థాలు :

23. తనువును రక్షించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పుట్టుక, ప్రగతి
బి) నాడి, నాగరం
సి) ప్రజ, సంతానం
డి) శరీరం, పన్నము
జవాబు:
డి) శరీరం, పన్నము

24. నాడులు ఉన్నాయి – గీత గీసిన పదానికి నానార్థాలు పదం ఏది?
ఎ) నాశికలు, కర్ణములు
బి) నరములు, ఈనెలు
సి) ఈటెలు, ఈగలు
డి) ఆక్షితలు, మనుషులు
జవాబు:
బి) నరములు, ఈనెలు

25. ప్రజ వర్ధిల్లాలి – గీత గీసిన పదానికి నానార్థాలు ఏది?
ఎ) సంతానం, జనము
బి) జనని, జామాత
సి) జనక, జయం
డి) జనిత, వసుధ
జవాబు:
ఎ) సంతానం, జనము

వ్యుత్పత్త్యర్థాలు :

26. భారమును ఓర్చునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదాన్ని గుర్తించండి.
ఎ) వారిదం
బి) క్ష్మా
సి) జలధి
డి) వారుణి
జవాబు:
బి) క్ష్మా

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

27. వసుధ – దీనికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) ఐశ్వర్యం ఇచ్చునది
బి) జనులను కాపాడునది
సి) ధనమును ధరించునది
డి) విశ్వాన్ని పొందునది
జవాబు:
సి) ధనమును ధరించునది

28. ముందుండి నడిపించేవాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల గుర్తించండి.
ఎ) హేయం
బి) హారం
సి) అరుణ
డి) హృదయం
జవాబు:
బి) హారం

వ్యాకరణాంశాలు

సంధులు :

39. గుణసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) ప్రత్యయం
బి) సహోదర
సి) మనోరధం
డి) తపోధనుడు
జవాబు:
బి) సహోదర

40. పట్టుగొమ్మ – ఇది ఏ సంధి?
ఎ) విసర్గ సంధి
బి) గసడదవాదేశ సంధి
సి) త్రికసంధి
డి) గుణసంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి

41. కింది వానిలో యడాగమ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) కన్నయది
బి) ఆత్మానందం
సి) పంచకావ్యం
డి) నవ్యోదయం
జవాబు:
ఎ) కన్నయది

42. శివమెత్తరా – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) ఉత్వసంధి
సి) అత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
బి) ఉత్వసంధి

43. మొలకెతు – దీనిని విడదీయడం గుర్తించండి.
ఎ) మెలక + ఎత్తు
బి) మొలకి + ఎత్తు
సి) మొలకు + ఎత్తు
డి) మొలక + ఎత్తు
జవాబు:
డి) మొలక + ఎత్తు

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

44. నీయాదేశము – ఇది ఏ సంధి?
ఎ) ఉత్వసంధి
బి) యడాగమ సంధి
సి) త్రికసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) యడాగమ సంధి

45. కింది వానిలో వికల్ప సంధి ఏది?
ఎ) ఉత్వసంధి
బి) గుణసంధి
సి) ఇత్వసంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) ఇంద్ర గణం

46. కింది వానిలో పొసగని సంధి ఏది?
ఎ) గుణసంధి
బి) అత్వసంధి
సి) ఇత్వసంధి
డి) త్రికసంధి
జవాబు:
ఎ) గుణసంధి

సమాసాలు :

47. ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) రూపక సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహు బ్రీహి సమాసం
డి) కర్మధారాయ సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం

48. దేశభక్తి ఉండాలి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) దేశమును భక్తి
బి) దేశము నందు భక్తి
సి) దేశమునకు భక్తి
డి) దేశము చేత భక్తి
జవాబు:
బి) దేశము నందు భక్తి

49. దేశ సమగ్రత పాటించాలి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం ఏది?
ఎ) దేశము చేత సమగ్రత
బి) దేశము వలన సమగ్రత
సి) దేశము తెలుపు సమగ్రత
డి) దేశమందు సమగ్రత
జవాబు:
బి) దేశము వలన సమగ్రత

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

50. అన్యపదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) బహువ్రీహి
బి) ద్వంద్వ
సి) కర్మధారయ
డి) తత్పురుష
జవాబు:
ఎ) బహువ్రీహి

51. వంచకుల యొక్క ఆవశి – దీనికి సమాస పదం ఏది?
ఎ) వంచకావశి
బి) వచికశ్రేణి
సి) వంచికాశ్రేణి
డి) అగ్రవంచక
జవాబు:
ఎ) వంచకావశి

52. అన్నదమ్ములు – ఇది ఏ సమాసం?
ఎ) ద్వంద్వ సమాసం
బి) కర్మధారయ సమాసం
సి) ద్విగు సమాసం
డి) రూపక సమాసం
జవాబు:
ఎ) ద్వంద్వ సమాసం

గణవిభజన:

53. న, జ, భ, జ, జ, జ, ర – ఇవి ఏ పద్య గణాలు (S.A. III – 2015-16)
ఎ) ఆటవెలది
బి) చంపకమాల
సి) ఉత్పలమాల
డి) మత్తేభం
జవాబు:
బి) చంపకమాల

54. IIIU – ఇది ఏ గణము?
ఎ) సూర్య గణం
బి) న గణం
సి) ఇంద్ర గణం
డి) హ గణం
జవాబు:
సి) ఇంద్ర గణం

55. రాతరు – ఇది ఏ గణము?
ఎ) త గణం
బి) భ గణం
సి) య గణం
డి) న గణం
జవాబు:
బి) భ గణం

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

56. ఉత్పలమాలలో పాదానికి అక్షరాలు గుర్తించండి.
ఎ) 20
బి) 23
సి) 24
డి) 21
జవాబు:
ఎ) 20

వాక్యాలు :

57. రవి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) తుమున్నర్థక వాక్యం
సి) సందేహార్థక వాక్యం
డి) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
సి) సందేహార్థక వాక్యం

58. నీవు ఇంటికి వెళ్ళు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిశ్చయాత్మక వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
సి) విధ్యర్థక వాక్యం

59. మీరు భోజనం చేయవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుమత్యర్థక వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) వ్యతిరేకార్థక వాక్యం
జవాబు:
ఎ) అనుమత్యర్థక వాక్యం

60. వంట చేసి వెళ్ళాను – గీత గీసిన పదం ఏ క్రియా పదం?
ఎ) క్వార్ధకం
బి) చేదర్థకం
సి) శత్రర్థకం
డి) ఆత్మార్థకం
జవాబు:
ఎ) క్వార్ధకం

61. వారు నడుస్తూ వెళ్తున్నారు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ఆత్మార్థక వాక్యం
బి) శత్రర్థక వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
బి) శత్రర్థక వాక్యం

62. వాల్మీకి చేత రామాయణం రచింపబడింది – ఇది ఏ రకమైన వాక్యం? (S.A.III – 2015-16)
ఎ) కర్తరి వాక్యం
బి) సామాన్య వాక్యం
సి) హేత్వర్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
డి) కర్మణి వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

63. వర్షాలు కురవడం వల్ల చెరువులు నిండాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) భావార్థక వాక్యం
సి) తుమున్నర్ధక వాక్యం
డి) కర్తరి వాక్యం
జవాబు:
ఎ) హేత్వర్థక వాక్యం

64. వాడు వస్తాడో? రాడో? – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిశ్చయార్థక వాక్యం
బి) ఆత్మార్థక వాక్యం
సి) సంక్లిష్ట వాక్యం
డి) సంయుక్త వాక్యం
జవాబు:
సి) సంక్లిష్ట వాక్యం

అలంకారాలు :

65. ఇందు వదన కుంద రదన మంద గమన మధుర వచన ఇది ఏ అలంకారం?
ఎ) వృత్త్యనుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) యమకం
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
ఎ) వృత్త్యనుప్రాస

66. కింది వానిలో పొసగని సంధిని గుర్తించండి.
ఎ) ఉపమ
బి) యమకం
సి) లాటానుప్రాస
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) ఉపమ

67. బింబ ప్రతిబింబ భావం గల అలంకారం గుర్తించండి.
ఎ) దృష్టాంతం
బి) ఉత్ప్రేక్ష
సి) అతిశయోక్తి
డి) లాటానుప్రాస
జవాబు:
ఎ) దృష్టాంతం

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

68. మానవా ! నీ ప్రయత్నం మానవా ! – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) యమకం
బి) వృత్త్యనుప్రాన్
సి) లాటానుప్రాస
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) యమకం

సొంతవాక్యాలు :

29. కేతనము : అర్జునుని కేతనంపై కపీశ్వరుడుంటాడు.

30. నిఖిలం : నిఖిలమంతా దైవం నిండియున్నాడు.

31. అభ్యుదయం : ప్రజలు అభ్యుదయ మార్గంలో పయనించాలి.

32. సౌభాగ్యం : దేశ సౌభాగ్యం వర్ధిల్లాలి.

33. చంద్రిక : చంద్రుని చంద్రికలు ఆహ్లాదం కలిగిస్తాయి.

34. వసుధ : వసుధపై ప్రజలంతా సుఖంగా జీవించాలి.

35. వర్థిల్లు : జగతిపై శాంతి వర్థిల్లునట్లుగా కృషి చేయాలి.

36. ఉద్ధరించు : పేదలను ఉద్ధరించు కార్యక్రమాలు చేయాలి.

37. ధాన్యాగారం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధాన్యాగారంగా కీర్తి పొందింది.

38. నిలబెట్టుట : వంశ ప్రతిష్ఠలను అందరు నిలబెట్టాలి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం.

AP State Syllabus 8th Class Telugu Important Questions 8th Lesson జీవన భాష్యం

8th Class Telugu 8th Lesson జీవన భాష్యం Important Questions and Answers

I. అనగాహన – ప్రతిస్పందన

అ) కింది ఆసరిచిత గద్యాలు చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. కింది గద్యభాగాన్ని చదవండి. కింద ఇచ్చిన నాలుగు వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి, బ్రాకెట్లలో రాయండి.

అంతరించిపోతున్న తెలుగు భాషా సంస్కృతులకు పునరుజ్జీవనం కల్పించుటకై రంగంలోకి దిగిన కందుకూరి పూర్తి సంఘసంస్కరణ దృక్పథంతో పనిచేశారు. ఒకే రంగాన్ని ఎంచుకోకుండా, సంఘంలో అపసవ్యంగా సాగుతున్న పలు అంశాలవైపు దృష్టిని సారించాడాయన. ప్రధానంగా స్త్రీల అభ్యున్నతిని కాంక్షించిన మహామనీషిగా వాళ్ళ చైతన్యం కోసం అనేక రచనలు చేశారు. చంద్రమతి చరిత్ర, సత్యవతి చరిత్ర వంటివి అందులో కొన్ని. వారి బ్రహ్మవివాహం నాటకం, పెద్దయ్య గారి పెళ్ళి పేరుతో, వ్యవహార ధర్మబోధిని, ప్లీడర్ నాటకం పేరుతోనూ, ప్రసిద్ధి పొందాయి.
వాక్యాలు :
1. కందుకూరి పూర్తి పేరు వీరేశలింగం పంతులు. (✓)
2. చంద్రమతి చరిత్ర కందుకూరి రాసిన గొప్ప నాటకం. (✗)
3. సంఘంలోని సవ్యమైన అంశాలపై దృష్టి సారించాడాయన. (✗)
4. కందుకూరి గొప్ప సంఘసంస్కర్త. (✓)

2. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ప్రపంచంలో మొట్టమొదట విడుదల చేయబడిన తపాలాబిళ్ళ అతికించే రకం కాదు. అది రెండు అణాల ఖరీదు కలిగిన కాపర్ టికెట్. ఈస్టిండియా కంపెనీ అధికారానికి లోబడిన వందమైళ్ళ లోపు చిరునామాకు దాని ద్వారా ఒక కవరును పంపవచ్చును. ఆ కవరును డాక్ రన్నర్ తీసుకువెడతాడు. ఈ కాపర్ టోకెన్ ప్రప్రథమంగా 1774 మార్చి 31వ తేదీన పాట్నాలో విడుదల చేయబడింది. 1852లో సింధు ప్రావిన్స్ కమిషనర్ సర్ బార్టిల్ ఫెర్ ఆసియాలో మొట్టమొదట తపాలా బిళ్ళను తీసుకువచ్చాడు. అందులో ఈస్టిండియా కంపెనీ ముద్ర ఉండేది. దానిని సింధు లోపల ఉత్తరాలు పంపడానికి ఉపయోగించేవారు. దీనిని సిండే డాక్ అనేవారు.
ప్రశ్నలు:
1. డాక్ రన్నర్ అంటే ఎవరు?
జవాబు:
తపాలా బంట్రోతు.

2. సింధు ప్రావిన్స్ ఎవరి పరిపాలనలో ఉంది?
జవాబు:
ఈస్టిండియా కంపెనీ.

3. అణా అంటే ఎన్ని పైసలు?
జవాబు:
ఆరు పైసలు.

4. సిండే డాక్ అంటే ఏమిటి?
జవాబు:
సింధు ప్రావిన్స్ లోని కాపర్ టికెట్.

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

3. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అప్పటికి 200 సంవత్సరాల నుంచి ఆంగ్లేయుల కారణంగాను, అంతకు ముందు ఏడెనిమిది వందల ఏళ్ళ నుంచి తురుష్కుల కారణంగాను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బానిసత్వంలో మగ్గుతున్న భారత జాతి దైన్యస్థితి నుంచి మేల్కొని 1857లో వీరోచితంగా ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని సాగించింది. కానీ ఆ చైతన్యాన్ని సైనికుల తిరుగుబాటు అంటూ తక్కువగా అంచనా వేసి, ఆంగ్ల ప్రభుత్వం అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకుని భారతదేశాన్ని పాలించడం మొదలు పెట్టింది.
ప్రశ్నలు :
1. సుమారు ఏ సంవత్సరములో ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశించారు?
జవాబు:
క్రీ.శ. 1600లో

2. తురుష్కులు భారతదేశాన్ని పాలించడం ఎప్పుడు మొదలు పెట్టారు?
జవాబు:
సుమారు క్రీ.శ 800లు లేక 900 సంవత్సరాల నుండి

3. సైనికుల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
జవాబు:
క్రీ.శ. 1857

4. భారతదేశం ఆంగ్లేయుల పాలనలోకి పూర్తిగా ఎప్పటి నుంచి వెళ్ళింది?
జవాబు:
1857

4. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఉప్పు సత్యాగ్రహంలో లక్ష్మీబాయమ్మ స్త్రీలకు నాయకురాలిగా ఉండి, ‘దేవరంపాడు’ శిబిరానికి ప్రాతినిధ్యం వహించేది. ఈ శిబిరం బాగా పనిచేసిందని ప్రశంసలు పొందింది. వివిధ గ్రామాల నుండి వందలమంది సత్యాగ్రహులు ఈ శిబిరానికి వచ్చేవారు. వారిని పోలీసులు అరెస్టు చేసేవారు. అయినా స్త్రీలు భయపడక ధైర్యంగా వారి నెదుర్కొన్నారు. మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయినా లక్ష్మీబాయమ్మ నాయకత్వంలోని స్త్రీలు జంకలేదు. సత్యాగ్రహం మానలేదు.

శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులోను, దుర్గాబాయమ్మ చెన్నపూరిలోను, రుక్మిణమ్మ వేదారణ్యంలోనూ మరికొందరు స్త్రీలు భిన్న ప్రాంతాలలోనూ చూపిన సాహసోత్సాహములు, ఆంధ్రుల ప్రతిష్ఠను విస్తరింపజేశాయి అని ఆంధ్రపత్రిక 1932లో వీరిని ప్రశంసించింది.
ప్రశ్నలు :
1. లక్ష్మీబాయమ్మ ఉప్పు సత్యాగ్రహంలో ఏ శిబిరానికి నాయకత్వం వహించింది.
జవాబు:
లక్ష్మీబాయమ్మ ‘దేవరంపాడు’ శిబిరానికి నాయకత్వం వహించింది.

2. సత్యాగ్రహులు శిబిరానికి ఎక్కడ నుండి వచ్చేవారు?
జవాబు:
సత్యాగ్రహులు వివిధ గ్రామాల నుండి శిబిరానికి వచ్చేవారు.

3. ఎన్నిసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు?
జవాబు:
మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు.

4. గుంటూరు ఉప్పు సత్యాగ్రహానికి నాయకురాలు ఎవరు?
జవాబు:
శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులో నాయకత్వం వహించింది.

5. ఈ కింది గేయం చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది.
వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.
ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది.
ప్రశ్నలు :
1. మబ్బుకు మనసు కరగడం ద్వారా ఏ ఫలితం వస్తుంది?
జవాబు:
వర్షమై భూమి మీద కురుస్తుంది.

2. దారి ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
భయపడకుండా, నిరుత్సాహ పడకుండా ముందడుగు వేసే స్ఫూర్తి నలుగురికి దారి అవుతుంది.

3. ఈ గేయం రచయిత ఎవరు?
జవాబు:
సి. నారాయణరెడ్డి గారు.

4. పై గేయం చదివి ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘ఎడారి దిబ్బలు’ అంటే ఏమిటి?

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

6. కింది పరిచిత గేయం చదవండి. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి.

ఎవరికి వారే గీపెడితే ఆశించిన గమ్యం దొరకదోయ్,
సమైక్య సంఘర్షణలో ఉన్నది సంఘం చేసిన సంతకం,
ఆలయాలలో కొలిచే ప్రతిమలు ఆత్మ సంతృప్తికే ‘సినారే’
దయకురిసే మనుషుల్లో ఉన్నది దైవం చేసిన సంతకం
ప్రశ్నలు :
1. ‘సమైక్యతతోనే ‘సంఘం వర్ధిల్లుతుంది’ అనే భావం ఏ పాదంలో ఉంది?
జవాబు:
2వ పాదం

2. ‘దయకురిసే మనుషుల్లో ఉన్నది దైవం చేసిన సంతకం’ అనే మాట ద్వారా కవి మనుషులకు ఏమి సందేశం ఇస్తున్నాడు?
జవాబు:
తోటి మనిషికి సేవచేసే దయలోనే దైవం ఉన్నాడు.

3. ‘ప్రతిమలు’ అనే మాటకు అర్థం ఏమిటి?
జవాబు:
బొమ్మలు

4. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
గేయంలోని మొదటి పాదంలోని అర్థం ఏమిటి?

7. ఈ క్రింది పరిచిత గేయాన్ని చదవండి. అడిగిన విధంగా సమాధానాలు రాయండి.

మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది.
వంకలు డొంకలు కలవనీ జడిపించకు నేస్తం !
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.
ప్రశ్నలు :
1. మబ్బులు కురవాలంటే ఏం జరగాలి?
జవాబు:
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే కురుస్తాయి.

2. మనసుకు మబ్బు ముసరడం అంటే ఏమిటి?
జవాబు:
మనసుకు మబ్బు ముసరడం అంటే ఆందోళన, చింత, బాధ, దిగులు కమ్ముకోవడం.

3. ఈ పై గేయం ఆధారంగా రెండు ప్రశ్నలు తయారుచేయండి.
జవాబు:
1) ‘జంకని’ అంటే ఏమిటి?
2) ‘నేస్తం’ పర్యాయపదాలు రాయండి.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘జీవన భాష్యం’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
జవాబు:
ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి 1931లో కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామంలో పుట్టారు. వీరు ప్రముఖ ఆధునిక కవి, వక్త, పరిశోధకులు, బహుభాషావేత్త, ప్రయోగశీలి.

నాగార్జునసాగరం, కర్పూరవసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంభర, ప్రపంచ పదులు మొదలైన నలభైకి పైగా కావ్యాలు, అద్భుతమైన సినిమాపాటలు రాసారు. ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు’ అన్న వీరి సిద్ధాంత గ్రంథము ఎన్నో ముద్రణలను పొందింది. వీరి ‘విశ్వంభర’ కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన ‘జ్ఞానపీఠ అవార్డు’ లభించింది. భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ బిరుదుతో గౌరవించింది. ‘చమత్కారం’ – వీరి కలానికీ, గళానికీ, ఉన్న ప్రత్యేకత.

ప్రశ్న 2.
‘గజల్’ ప్రక్రియను వివరించండి.
జవాబు:
ఉర్దూ సాహిత్య ప్రక్రియ ‘గజల్’. దీంట్లో ఒకే విషయాన్ని చెప్పాలనే నిర్బంధం ఉండదు. గజల్ లోని భావం ఏ చరణానికి ఆ చరణం విడిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండు చరణాలు కలిసి ఒకే భావాన్ని వ్యక్తపరుస్తాయి. గజల్ పల్లవిని ఉర్దూలో ‘మత్తా’ అని, చివరి చరణాన్ని “మక్తా” అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. చివరి చరణంలో కవి నామముద్ర ఉంటుంది. దీన్ని “తఖల్లస్” అంటారు. సరసభావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ గజల్ జీవగుణాలు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

ప్రశ్న 3.
మన పేరు శాశ్వతంగా నిలవాలంటే ఏం చేయాలి?
జవాబు:
మన పేరు శాశ్వతంగా నిలవాలంటే చెరగని త్యాగం చేయాలి. మనం చేసిన త్యాగకృత్యం, ఎప్పటికీ మరచిపోలేనిదిగా ఉండాలి. అంతటి త్యాగము చేసిన వారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం ఏదో బిరుదులు ఇస్తున్నారని, ఆ బిరుదులు మనకు ఉన్నాయి కదా అని అనుకుంటే లాభం లేదనీ, ఆ బిరుదుల వల్ల, సన్మానాల వల్ల వచ్చే పేరు చిరకాలం నిలవదనీ కవి గుర్తుచేశారు. ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని గొప్ప త్యాగం చేసిన త్యాగమూర్తుల పేరు, చిరస్థాయిగా నిలిచి ఉంటుందని కవి తెలిపాడు.

ప్రశ్న 4.
“ఎంత ఎత్తుకు ఎదిగినా ఉంటుంది పరీక్ష” అనే వాక్యం ద్వారా కవి మనకు ఇచ్చిన సందేశం ఏమిటి?
జవాబు:
మనకు ఎంత సామర్థ్యం ఉన్నా, అధికారం, సంపదలు ఉన్నా, మనం ఎన్నో విజయాలు సాధించినా, ఇంక మనకు ఏ కష్టాలూ, బాధలూ రావని ధీమాగా ఉండరాదని కవి సందేశం ఇచ్చారు. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యలను తీసుకువస్తుందో, పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరని కవి సూచించాడు. విధి శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే అని కవి తెలియజెప్పారు. కవి తాను చెప్పిన మాటకు దృష్టాంతంగా హిమాలయ పర్వతాన్ని గూర్చి గుర్తుచేశాడు. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి, నదిగా ప్రవహించవలసి వస్తోంది. అలాగే ఎంతటి మనిషి అయినా, విధి పరీక్షిస్తే నీరు కారిపోవలసిందే అని కవి తెలిపాడు.

ప్రశ్న 5.
“ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు “సినారె” ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు?
జవాబు:
బీడు పడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని, ఏ ప్రయత్నాలూ చేయకుండా నిరాశకు లోనుకావద్దని, కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయని సినారె సందేశమిచ్చారు.

ఎడారి దిబ్బల వ్యవసాయంలాగే కొన్ని పనులు చేయడానికి మనం ముందుకురాము. దానివల్ల ప్రయోజనం ఉండదని ముందే తీర్మానించుకుంటాము. అది సరిగాదనీ, నీకు లభ్యమైన వస్తువును ఉపయోగంలో పెట్టుకోడానికి ప్రయత్నించాలని, అలా ప్రయత్నిస్తే ఎడారి చేలల్లో పంటలు పండినట్లు తప్పక ఫలితం ఉంటుందని నారాయణరెడ్డి గారి అభిప్రాయం. నీ వంతు ప్రయత్నం నీవు చేయాలనే కర్తవ్యాన్ని గుర్తుచేయడం ఈ వాక్యం యొక్క సందేశం.

ప్రశ్న 6.
ఈ గజల్ లో మీకు బాగా నచ్చిన చరణాలు ఏవి? ఎందుకు నచ్చాయో సమర్థిస్తూ వివరణ ఇవ్వండి.
జవాబు:
ఈ గజల్ లో నాకు “మనిషీ మృగము ఒకటనీ ………. ఒక ఊరవుతుంది” అనే చరణాలు బాగా నచ్చాయి. ఎందుకంటే ఈ చరణాలలో నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించటమే ఉత్తమ సాంఘిక జీవనం అనే అర్థం ఉంది.

“ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష” అన్న చరణం కూడా నచ్చింది. తాను గొప్పవాడిని అయ్యానని, ఇంక తనకు ఎదురే లేదని, తనకు ఎంతో సంపద, సామర్థ్యం ఉందని ధీమాగా ఉండరాదనీ, ఏదో సమస్య వస్తూనే ఉంటుందనీ దాని భావం. ఇది గొప్ప జీవిత సత్యం. అలాగే “చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది” అన్న చరణం గొప్ప సందేశాన్ని ఇస్తోంది. ఎన్నటికీ మరచిపోలేని గొప్ప త్యాగకార్యం చేస్తే ఆ వ్యక్తి పేరు శాశ్వతంగా నిలుస్తుందని దీని అర్థం. ఇది గొప్ప జీవనసత్యం. అందువల్ల పై చరణాలు నాకు నచ్చాయి.

ఆ) కింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది’ అని ‘సి.నా.రె’ ఎందుకు అని ఉంటారు?
జవాబు:
‘మనిషి’ భగవంతుని సృష్టిలో ఒకే రకం జీవి. అయినా నేడు సంఘంలో మనుష్యులు కులమత భేదాలతో, వర్గవైషమ్యాలతో విడిపోతున్నారు. అందువల్ల సమాజాభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. మత వైషమ్యాల వల్ల దేశాలూ, రాష్ట్రాలూ నాశనం అవుతున్నాయి. ప్రాంతీయ భేదాల వల్ల కలతలూ, కార్పణ్యాలూ పెరిగిపోతున్నాయి. అలాగాక గ్రామంలోని పదుగురూ అంటే పదిమందీ కలసి ఉంటే, అది చక్కని గ్రామం అవుతుంది. గ్రామంలోని ప్రజలంతా కలసి ఉంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది. గ్రామంలోని పదిమందీ అంటే ఉన్నవాళ్ళంతా కులమత భేదాలు లేకుండా కలిసి, గ్రామాభివృద్ధికి కృషిచేస్తే అది చక్కని “ఊరు’ అవుతుంది. ఆదర్శ గ్రామం అవుతుందని భావం. ఆ గ్రామానికి కావలసిన సదుపాయాలు అన్నీ సమకూరుతాయి. ప్రభుత్వం కూడా ఆ గ్రామానికి కావలసిన ధన సహాయం చేస్తుంది. గ్రామ ప్రజల్లో సహకారం, ఐకమత్యం అవసరం అని చెప్పడానికే ‘సి.నా.రె’ ఈ వాక్యాన్ని రాశారు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

ప్రశ్న 2.
‘జీవన భాష్యం’ గజల్ సారాంశం మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మబ్బులకు దయ కలిగితే నీరుగా మారి వర్షం వస్తుంది. మనస్సు పై దిగులు మబ్బులు కమ్మితే దుఃఖం వస్తుంది. వంకలూ, డొంకలూ ఉన్నాయని జంకకుండా ముందడుగు వేస్తే అదే పదిమందీ నడిచే దారిగా మారుతుంది. ఎడారి ఇసుకదిబ్బలు దున్నినా ఫలితం ఉండదని అనుకోకుండా, సేద్యం చేస్తే పంట పండుతుంది. మనిషి, జంతువు అని తేడాలు పెట్టుకోడం వ్యర్థం. పదిమంది మనుషులు కలిస్తే అది మంచి గ్రామం అవుతుంది.

ఎంత ఎత్తుకు ఎదిగినా పరీక్ష ఉంటుంది. హిమాలయం ఎత్తులో ఉన్నా వేడికి అది కరిగి నీరవుతోంది కదా ! బిరుదులు, సన్మానాలు పొందాము అనుకున్నా పేరు నిలువదు. గొప్ప త్యాగం చేస్తేనే పేరు నిలుస్తుంది.

ప్రశ్న 3.
ఏదైనా ఒక లక్ష్యసాధనలో విజయమూ కలగవచ్చు ! అపజయమూ కలగవచ్చు ! అందుకు గల కారణాలు ఊహించి రాయండి.
జవాబు:
మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలని కార్యసాధనకు దిగితే, అందుకు దైవం అనుకూలిస్తే, విజయం సాధించగలం. మనము చక్కని ప్రణాళికతో పని ప్రారంభిస్తే అందుకు పై అధికారులూ, తోటివారూ, ప్రక్కవారూ సహకరిస్తే మన లక్ష్యం నెరవేరుతుంది. మనం ప్రణాళిక లేకుండా పనికి దిగినా, పక్కవారు సాయం చేయకపోయినా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనం లక్ష్యమును సాధింపలేము. మనం మన శక్తికి తగిన లక్ష్యాన్ని ఎన్నుకుంటే తప్పక విజయం సాధిస్తాము. నేల విడిచి సాము చేస్తే కార్యాన్ని సాధించలేము.

మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థి ఐ.ఎ.ఎస్లో ఉత్తీర్ణత పొందగలడు. అత్తెసరు మార్కులవారు ఆ లక్ష్యాన్ని చేరలేరు. కార్యసాధనకు మంచి పట్టుదల, దీక్ష, నిరంతర కృషి కావాలి. అటువంటి వారు విజయాన్ని సాధిస్తారు. కృషి ఉంటే, మనిషి ‘ఋషి’ అవుతాడు. కృషి లేకుండా కేవలం పగటి కలలు కనడం వల్ల, కార్య లక్ష్యసాధన కాదు.

ప్రశ్న 4.
“చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది” అంటే త్యాగం చేసేవారి, మంచిపనులు చేసే వారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి మంచిపనులు చేయాలి?
జవాబు:
త్యాగం చేసేవారి, మంచి పనులు చేసేవారి పేర్లు మాత్రమే చరిత్రలో వెలుగుతాయని కవి ప్రబోధించాడు. మనం స్వార్థాన్ని విడిచి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. చేసే పనుల్లో చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలి. తనకు మేలు కలిగే పనులను చేయడంకంటే తోటివారికి ఎక్కువ మేలు కలిగే పనులను చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనాథలైన, అన్నార్తులైన, నిరాశ్రయులైన ప్రజలను ఆదుకోవాలి. వికలాంగుల సంక్షేమంకోసం నిరంతరం కృషి చేయాలి. వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలి. గ్రామంలో పచ్చని చెట్లను నాటాలి. మూగజీవాల సంరక్షణకు చర్యలను చేపట్టాలి. ప్రమాదాల్లో గాయపడినవారిని ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యసహాయం అందేవిధంగా కృషి చేయాలి. ఈ విధంగా మనమంతా ప్రజల హితం కోసం నిస్వార్థంగా సేవలను అందించాలి. ఇటువంటి పనుల వల్లనే మన పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

ప్రశ్న 5.
రైతు గొప్పదనాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి. (S.A. I – 2018-19)
జవాబు:
కష్టజీవి రైతు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులు పంటలు పండిస్తేనే మనం అన్నం తినగల్గుతాం. రైతు అంటే ‘పంటకాపు’ అని నిఘంటు అర్థం. అంటే పంటను రక్షించేవాడు. వ్యవసాయదారుడు, కృషీవలుడు అనే పర్యాయ పదాలున్నాయి.

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకునూ పండించే వ్యక్తి రైతు. పంటలు పండించే వారినే కాక మామిడి, కొబ్బరి, ద్రాక్ష తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తుంటారు. ఇంకా ఇతరుల భూమిని అద్దెకు తీసుకొని సాగు చేస్తుంటారు. వారిని కౌలు రైతులు అంటారు. పొలం పనుల్లో భాగంగా తాను పనిలో పెట్టుకొనే ఉద్యోగులను రైతు కూలీలు అంటారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకకు తగ్గకుండా మొండి ధైర్యంతో రైతులు సేద్యం కొనసాగిస్తున్నారు. వారు విరక్తిలో కాడి పడేస్తే మనకు అన్నం దొరకదు. రైతు సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అని మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వాలు రైతును బిచ్చగాళ్ళను చేస్తున్నాయి. రాష్ట్రంలో రైతాంగం దయనీయ దుస్థితిలో ఉన్నారు. సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకొని, దేశాన్ని స్వయం పోషకంగా నిలబెట్టాలన్న ఆలోచన, అందుకు తగ్గ వ్యూహం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. మన రాష్ట్రాలలో సగటున రోజుకు 30 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.

ఏ రైతూ కన్నీరు పెట్టనప్పుడే భూమాత సంతోషిస్తుంది. రెక్కాడితే కాని డొక్కాడని ఎందరో రైతులున్నారు. వారందరికి ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయాలి. గిట్టుబాటు ధరలు ప్రకటించాలి. ప్రభుత్వమే రైతు వద్ద పంటను కొనుగోలు చేయాలి. దళారీ వ్యవస్థను తొలగించాలి. అప్పుడే రైతులు సంతోషంగా ఉంటారు.

ఇ) క్రింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
“జీవన భాష్యం” గజల్ లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
జవాబు:

  1. మంచు కరిగితే నీరవుతుంది.
  2. మంచి నడక నడిస్తే అది దారవుతుంది.
  3. వర్మం కురిస్తే పంట పైరవుతుంది.
  4. మంచి వ్యక్తులు కూడితే ఊరవుతుంది.
  5. నదులు పారితే అది ఏరవుతుంది.
  6. త్యాగధనులుంటే అది పేరవుతుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

ప్రశ్న 2.
ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకొంటున్నారో ప్రశ్నలు రాయండి.
జవాబు:

  1. మీ రచనలలో మీకు బాగా నచ్చిన కావ్యం ఏది?
  2. ‘ప్రపంచ పదులు’ దీన్ని మీరు ఎలా సృష్టించారు?
  3. మీ సినీగేయాలలో మీకు నచ్చిన గేయం ఏది?
  4. మిమ్ములను కవిత్వం వైపు నడిపించినది ఎవరు?
  5. మీ రచనలకు ప్రేరణనందించిన అంశాలు ఏవి?
  6. మధ్యతరగతి మందహాసంలోని ప్రధానమైన అంశం ఏమిటి?
  7. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలకు, మీరిచ్చే సందేశం ఏమిటి?
  8. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుండి ఎలా బయటపడగలుగుతారు?
  9. నేటి యువ రచయితలకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
  10. ప్రస్తుతం మీరు ఎందుకు సినిమా పాటలు రాయడంలేదు?

ప్రశ్న 3.
డా॥ సి. నారాయణరెడ్డిగారిని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

లేఖ

ధర్మవరం,
x x x x x

ప్రియమైన మిత్రుడు అవినాష్ కు,

నీ మిత్రుడు వ్రాయునది నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన తెలుగు సాహిత్య కవులలో డా|| సి. నారాయణరెడ్డిగారు సుప్రసిద్ధులు. వీరి శైలి మధురంగాను, సృజనాత్మకంగాను ఉంటుంది. వీరు రచించిన ‘విశ్వంభర’ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. వీరు రచించిన సినీ గీతాలు ఈనాటికి ఆపాత మధురంగా ఉన్నాయి. వీరి పరిశోధనాత్మక గ్రంథం ప్రశస్తి పొంది, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. వీరి గజల్స్ తెలుగు ప్రాంతంలో ఉర్రూతగించాయి. అందుకే నాకు నారాయణరెడ్డిగారు అంటే చాలా ఇష్టం .

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x

చిరునామా :
పి. అవినాష్, 8వ తరగతి,
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,
దుగ్గిరాల, వయా తెనాలి, గుంటూరు జిల్లా.

8th Class Telugu 8th Lesson జీవన భాష్యం 1 Mark Bits

1. ఏ సిరులు పొందని సంతృప్తి ఏమిటో (వ్యతిరేకపదం రాయండి) (S.A. II – 2018-19)
ఎ) అసంతోసం
బి) అసమ్మోహం
సి) అసంతృప్తి
డి) అతృప్తి
జవాబు:
సి) అసంతృప్తి

2. పరీక్షలు బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. (S.A. II – 2018-19)
ఎ) శత్రర్థకం
బి) సంయుక్తం
సి) సంక్లిష్ట
డి) చేదర్థకం
జవాబు:
డి) చేదర్థకం

3. సరైన సమయంలో వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. (ఏ వాక్యమో గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) క్త్వార్థకం
బి) శత్రర్థకం
సి) సంశయార్థకం
డి) చేదర్థకం
జవాబు:
డి) చేదర్థకం

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

4. శత్రర్థక వాక్యమును గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) రాజు ఆటలు ఆడి ఇంటికి వచ్చాడు.
బి) రమ వంట చేస్తూ పుస్తకం చదువుతోంది.
సి) రవి రేపు సినిమాకు వెళతాడు.
డి) సత్య బాగా చదివితే వాళ్ళ నాన్నకు పేరు వస్తుంది.
జవాబు:
బి) రమ వంట చేస్తూ పుస్తకం చదువుతోంది.

5. రవి ఎన్నో గ్రంథాలు చదివాడు. వాటిలో తాటియాకు పొత్తములు కూడా ఉన్నాయి. (సమానార్థక పదాన్ని గుర్తించండి.) (S.A.III – 2016-17)
ఎ) తల
బి) మస్తకం
సి) పుస్తకం
డి) దేవాలయం
జవాబు:
సి) పుస్తకం

6. బాగా చదివితే బాగుపడతాం (గీత గీసిన పదం ఆధారంగా ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) క్వార్థకం
బి) శత్రర్థకం
సి) చేదర్థకం
డి) నిరర్థకం
జవాబు:
సి) చేదర్థకం

7. “ఆయన మాట కఠినం ; మనసు వెన్న” వాక్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) ఉపమాలంకారం
బి) అతిశయోక్తి అలంకారం
సి) రూపకాలంకారం
డి) ఉత్ప్రేక్షాలంకారం
జవాబు:
సి) రూపకాలంకారం

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

8. పదుగురు వెళ్ళారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనేకులు
బి) తక్కువమంది
సి) అల్పులు
డి) నీచులు
జవాబు:
ఎ) అనేకులు

9. మంచి నేస్తం ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వైరి
బి) విరోధి
సి) స్నేహితుడు
డి) సైనికుడు
జవాబు:
సి) స్నేహితుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

10. ఏరు ప్రవహించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంబుధి
బి) నది
సి) సముద్రం
డి) క్షీరం
జవాబు:
బి) నది

11. మబ్బు కమ్మింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) కంచుకం
బి) కెరటం
సి) మేఘం
డి) కవటం
జవాబు:
సి) మేఘం

12. విన్నాడు జంకకూడదు – గీత గీసిన పదానికి అర్థం ఏది?
ఎ) మాట్లాడకూడదు
బి) భయపడకూడదు
సి) వినకూడదు
డి) వ్రాయకూడదు
జవాబు:
బి) భయపడకూడదు

13. వ్యర్ధంగా పిలువరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనవసరం
బి) అనంతం
సి) ఆకారం
డి) చెరగని
జవాబు:
ఎ) అనవసరం

14. గిరిపై తరులు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం ఏది?
ఎ) కోరిక
బి) పర్వతం
సి) ఝరి
డి) కొన
జవాబు:
బి) పర్వతం

15. శిరస్సు ప్రధానమైంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తల
బి) నాలుక
సి) కర్ణం
డి) చరణం
జవాబు:
ఎ) తల

పర్యాయపదాలు :

16. మనసు నిర్మలం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) హృదయం, చిత్తం
బి) చీర, చేలం
సి) చీరం, గరుకు
డి) హృదయం, హేయం
జవాబు:
ఎ) హృదయం, చిత్తం

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

17. నీరు ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) జలం, వారి
బి) క్షీరం, వారి
సి) వాయువు, వర్షం
డి) పయోధరం, పయోధి
జవాబు:
ఎ) జలం, వారి

18. దారిలో వెళ్ళాలి – గీత గీసిన పదానికి పర్యాపదాలు గుర్తించండి.
ఎ) దారం, సూత్రం
బి) విల్లు, ధనువు
సి) పథం, మార్గం
డి) అంతరంగం, ఆకాశం
జవాబు:
సి) పథం, మార్గం

19. మృగం ఎక్కడుంది? – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏది?
ఎ) మెకం, ఆహారం
బి) జంతువు, పసరము
సి) పరిహారం, పరివృత్తి
డి) జనిత, జాగృతి
జవాబు:
బి) జంతువు, పసరము

20. కళ్యాణం జరిగింది? – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పెండ్లి, పరిణయం
బి) తరచు, తమరు
సి) కేలు, కీడు
డి) కార్ముకం, కారుణ్యం
జవాబు:
ఎ) పెండ్లి, పరిణయం

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

21. మంచి గుణం ఉండాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) స్వభావం, గొనము
బి) గోరు, గున్న
సి) చిన్న, చిగురు
డి) చివర, అంతిమం
జవాబు:
ఎ) స్వభావం, గొనము

ప్రకృతి – వికృతులు :

22. మనుష్యుడు ఉన్నాడు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) గరమ
బి) మనిషి
సి) మనసు
డి) మరమ
జవాబు:
బి) మనిషి

23. చాగం చేయాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) త్యేగ్యం
బి) త్యాగం
సి) త్యేగం
డి) త్యోగం
జవాబు:
బి) త్యాగం

24. శిరము నందు వెంట్రుకలు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సిరము
బి) శీరం
సి) సీసం
డి) కీరం
జవాబు:
ఎ) సిరము

25. గీములో ఉన్నాను – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) గేము
బి) గృహం
సి) గోము
డి) గృము
జవాబు:
బి) గృహం

26. సింహం ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) శింహం
బి) సీరు
సి) సీమ
డి) సింగం
జవాబు:
డి) సింగం

27. సంతోషంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సంబరం
బి) సంగరం
సి) సంతసం
డి) సంగోరం
జవాబు:
సి) సంతసం

28. కార్యం చేయాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) కారము
బి) కర్ణం
సి) కారిజం
డి) కేరియం
జవాబు:
బి) కర్ణం

నానార్థాలు :

29. కాలం చెల్లాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) మరణం, సమయం
బి) చావు, చాకిరి
సి) సమయం, సాన
డి) కాలం, కాలయాపన
జవాబు:
ఎ) మరణం, సమయం

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

30. కరంతో పనిచేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చేయి, తొండము
బి) దానము, దాపరికం
సి) దశ, దిశ
డి) ఆహారం, ఓగిరం
జవాబు:
ఎ) చేయి, తొండము

31. హరి రక్షకుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) శృగాలం, శృంగె
బి) విష్ణువు, కోతి
సి) బ్రహ్మ, ఇంద్రుడు
డి) కోతి, కృప
జవాబు:
బి) విష్ణువు, కోతి

వ్యుత్పత్త్యర్థాలు :

32. విశ్వాన్ని ధరించునది-అనే వ్యుత్పత్తి గల పదం
ఎ) ధరణి
బి) విశ్వము
సి) వారుణి
డి) వారిధి
జవాబు:
ఎ) ధరణి

33. ఆకాశంలో ఎగిరేది-అనే వ్యుత్పత్తి గల పదం
ఎ) ప్రసూనం
బి) పక్షి
సి) ప్రసూతి
డి) ప్రసన్నం
జవాబు:
బి) పక్షి

34. అమృతం – దీనికి వ్యుత్పత్తి ఏది?
ఎ) మరణాన్ని ఇచ్చేది
బి) చావును కలిగించేది
సి) అమృతమయం అయినది
డి) మరణము పొందింపనిది
జవాబు:
డి) మరణము పొందింపనిది

35. దినాన్ని కలుగజేయువాడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
ఎ) నళినీ బాంధవుడు
బి) దినకరుడు
సి) రజనీకరుడు
డి) మిత్రుడు
జవాబు:
బి) దినకరుడు

వ్యాకరణాంశాలు

సంధులు :

36. నీరందుతుంది కదా ! – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) ఉత్వసంధి
బి) ఇత్వసంధి
సి) అత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
ఎ) ఉత్వసంధి

37. బాల్యమంతా – ఇది ఏ సంధి?
ఎ) ఇత్వసంధి
బి) అత్వసంధి
సి) ఉత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
బి) అత్వసంధి

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

38. ఫలమేమి ఉంది – దీనిని విడదీయండి.
ఎ) ఫలమో + ఏమి
బి) ఫలము + ఏమి
సి) ఫలము + ఏమి
డి) ఫలమే + ఏమి
జవాబు:
బి) ఫలము + ఏమి

39. దారవుతుంది – దీనిని విడదీయండి.
ఎ) దార + అవుతుంది
బి) దారి + అవుతుంది
సి) దారె + అవుతుంది
డి) దారవు + తుంది
జవాబు:
బి) దారి + అవుతుంది

40. బాలికోన్నత పాఠశాల – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) విసర్గ సంధి
బి) ఉత్వసంధి
సి) శ్చుత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
డి) గుణసంధి

41. విలువేమి ఉంది – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) విలువె + ఏమి
బి) విలువ + ఏమి
సి) విలువు + ఏమి
డి) విలువి + ఏమి
జవాబు:
బి) విలువ + ఏమి

42. అక్కడక్కడ ఉంది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) టుగాగమ సంధి
బి) ద్విరుక్తటకారాదేశ సంధి
సి) ఆమ్రేడిత సంధి
డి) జశ్త్వసంధి
జవాబు:
సి) ఆమ్రేడిత సంధి

43. దేవాలయంలో భక్తులు ఉన్నారు – గీత గీసిన పదం వాక్యం?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) ఉత్వసంధి
సి) అత్వసంధి
డి) యణాదేశ సంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

సమాసాలు:

44. ఎడారిదిబ్బలు ఉన్నాయి-గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) కర్మధారయం
బి) సప్తమీ తత్పురుష
సి) చతుర్డీ తత్పురుష
డి) అవ్యయీభావ
జవాబు:
బి) సప్తమీ తత్పురుష

45. కన్నీరు వచ్చింది – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) కంటి యొక్క నీరు
బి) కన్ను వలన నీరు
సి) కన్ను చేత నీరు
డి) కన్నును నీరు
జవాబు:
ఎ) కంటి యొక్క నీరు

46. హిమగిరి శిఖరం ఉన్నతం – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) అవ్యయీభావం
బి) కర్మధారయం
సి) షష్ఠీ తత్పురుష
డి) బహువ్రీహి
జవాబు:
సి) షష్ఠీ తత్పురుష

47. చెరగని త్యాగం – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) చెరగని దైన త్యాగం
బి) చెరిగి యొక్క త్యాగం
సి) చెరిగిన యందు త్యాగం
డి) త్యాగం చెరిగింది
జవాబు:
ఎ) చెరగని దైన త్యాగం

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

48. నఞ్ తత్పురుషకు ఉదాహరణ గుర్తించండి.
ఎ) కారుచీకటి
బి) అసత్యం
సి) కార్మికలోకం
డి) విద్యాధికుడు
జవాబు:
బి) అసత్యం

49. దొంగభయం – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) దొంగ వలన భయం
బి) దొంగ యందు భయం
సి) దొంగచేత భయం
డి) దొంగకు భయం
జవాబు:
ఎ) దొంగ వలన భయం

వాక్యాలు :

50. అల్లరి చేస్తే దండన తప్పదు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) చేదర్థక వాక్యం
సి) అప్యర్థకవాక్యం
డి) భావార్థక వాక్యం
జవాబు:
బి) చేదర్థక వాక్యం

51. నాచే పని చేయబడింది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్తరి వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
డి) కర్మణి వాక్యం

52. నడుస్తూ తింటున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అప్యర్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) శత్రర్థక వాక్యం
జవాబు:
బి) కర్మణి వాక్యం

53. రామలక్ష్మణులు అన్నదమ్ములు – ఇది ఏ రకమైన ఏ సంధి?
ఎ) ఆశ్చర్యార్థక వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) సంక్లిష్ట వాక్యం
డి) తుమున్నర్థక వాక్యం
జవాబు:
ఎ) ఆశ్చర్యార్థక వాక్యం

54. పాలు తెల్లగా ఉంటాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్
జవాబు:
డి) తద్ధర్మార్థక వాక్

55. మీరు బాగా చదవండి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) మీరు బాగా చదవద్దు
బి) మీరు బాగా చదివి తీరాలి
సి) మీరు బాగా చదవలేకపోవచ్చు
డి) మీరు కొద్దిగా చదవాలి
జవాబు:
ఎ) మీరు బాగా చదవద్దు

56. మీరు ఆటలు ఆడవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ఆశ్చర్యార్థక వాక్యం
బి) అనుమత్యర్థకం
సి) భావార్థకం
డి) తుమున్నర్థకం
జవాబు:
బి) అనుమత్యర్థకం

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

57. ఆహా ! ఎంత బాగుందో ! – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ప్రేరణార్థక వాక్యం
బి) ఆశ్చర్యార్థక వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) కర్తరి వాక్యం
జవాబు:
బి) ఆశ్చర్యార్థక వాక్యం

గణ విభజన :

58. మైత్రేయి – ఇది ఏ గణం?
ఎ) త గణం
బి) జ గణం
సి) య గణం
డి) భ గణం
జవాబు:
ఎ) త గణం

59. మర్యాద – ఇందులోని గణాలు ఏవి?
ఎ) III
బి) UUI
సి) UUU
డి) IIU
జవాబు:
బి) UUI

60. UIU – ఇది ఏ గణం?
ఎ) భ గణం
బి) స గణం
సి) త గణం
డి) ర గణం
జవాబు:
డి) ర గణం

61. III – ఇది ఏ గణం?
ఎ) మ గణం
బి) స గణం
సి) న గణం
డి) య గణం యం
జవాబు:
సి) న గణం

అలంకారాలు :

62. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పే అలంకారం ఏది?
ఎ) ముక్తపదగ్రస్తం
బి) రూపకం
సి) అతిశయోక్తి
డి) అర్థాంతరన్యాస
జవాబు:
బి) రూపకం

63. క్రింది వానిలో అర్థాలంకారం ఏది?
ఎ) శ్లేష
బి) ముక్తపదగ్రస్తం
సి) అనన్వయం
డి) దృష్టాంతం
జవాబు:
ఎ) శ్లేష

64. సీతముఖం చంద్రునివలె మనోహరంగా ఉంది – ఇందులోని అలంకారం ఏది?
ఎ) అర్థాంతరన్యాస
బి) ఉపమ
సి) రూపక
డి) అతిశయోక్తి
జవాబు:
బి) ఉపమ

65. జర్రి మర్రి తొర్రలో దూరింది – ఇందులోని అలంకారం గుర్తించండి.
ఎ) వృత్త్యనుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) వృత్త్యనుప్రాస

66. ఈ రాజు సాక్షాత్తు ఈశ్వరుడే – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) రూపక
బి) అతిశయోక్తి
సి) అర్థాంతరన్యాస
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
ఎ) రూపక

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

67. రాజుకు కువలయానందకరుడు – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) ఉపమ
బి) శ్లేష
సి) అర్థాంతరన్యాస
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
డి) ముక్తపదగ్రస్తం

సొంతవాక్యాలు :

68. నేస్తం : మంచి నేస్తం వల్ల ఉపయోగాలు ఉంటాయి.

69. చెరగని : పొట్టిశ్రీరాములుగారి ఆత్మార్పణ తెలుగుజాతిపై చెరగని ముద్ర వేసింది.

70. హిమగిరి : హిమగిరి అందాలు ఆకట్టుకుంటాయి.

71. వ్యాప్తి : దేశ సంస్కృతీ వ్యాప్తికి కృషి చేయాలి.

72. త్యాగం : మహనీయుల త్యాగం వల్ల స్వాతంత్ర్యం వచ్చింది.

73. కన్నీరు : దుఃఖంతో కన్నీరు వస్తుంది.

74. ముసరడం : నీలిమేఘాలు ఆకాశమంతటా ముసురుకున్నాయి.

75. ఎడారి దిబ్బలు : ఎడారి దిబ్బలపై కూడా కష్టపడితే పంటలు పండించవచ్చు.

76. జంకని అడుగులు : గుండె బలం కలవాడు జంకని అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు.

77. చెరగని త్యాగం : పరోపకార పరాయణులు చెరగని త్యాగ గుణం కలవారుగా ఉంటారు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు.

AP State Syllabus 8th Class Telugu Important Questions 7th Lesson హరిశ్చంద్రుడు

8th Class Telugu 7th Lesson హరిశ్చంద్రుడు Important Questions and Answers

I. అవగాహన- ప్రతిస్పందన

అ) కింది అపరిచిత పద్యాలను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.

కలహపడునింట నిలువదు
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములులేక సమ్మతి
మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ !
ప్రశ్నలు :
1. కలహపడే ఇంట్లో ఏం నిలువదు?
జవాబు:
కలహపడే ఇంట్లో లక్ష్మి (సంపద) నిలువదు.

2. కలకాలం ఎలా మెలగాలి?
జవాబు:
కలకాలం ఏ విధమైన కలహాలు లేకుండా మెలగాలి.

3. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది?
జవాబు:
ఈ పద్యం కుమారిని సంబోధిస్తూ అంటే ఆడ పిల్లలను సంబోధిస్తూ చెప్పబడింది.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘కలహం – నష్టం’.

2. కింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.

తనిసిరే వేల్పు లుదధి రత్నముల చేత?
వెఱచిరే ఘోర కాకోల విషము చేత?
విడిచిరే యత్న మమృతంబు వోడుముదనుక?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.
ప్రశ్నలు :
1. ఉదధి రత్నముల చేత తృప్తి చెందని వారెవరు?
జవాబు:
వేల్పులు, ఉదధి రత్నములచేత తృప్తి చెందలేరు.

2. నిపుణమతులు ఎటువంటివారు?
జవాబు:
నిపుణమతులు తాము అనుకున్న కార్యం నెరవేరే వరకు తమ ప్రయత్నాన్ని వదలరు.

3. వేల్పులు దేన్ని చూసి భయపడలేదు?
జవాబు:
వేల్పులు ఘోర కాకోల విషాన్ని చూసి భయపడలేదు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “నిపుణమతుల పట్టుదల”.

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

3. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.

విద్యచే భూషితుండయి వెలయుచున్నఁ
దొడరి వర్జింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబయిన పన్నగము భయంకరము గాదె.
ప్రశ్నలు :
1. చదువుకున్నప్పటికీ విడువదగినవాడు ఎవరు?
జవాబు:
దుర్జనుడు చదువుకున్నప్పటికీ విడువదగినవాడు.

2. ఎటువంటి పాము భయంకరమైనది?
జవాబు:
తలపై మణులచేత అలంకరింపబడినా పాము భయంకరమైనది.

3. ఈ పద్యంలోని దుర్జనుడు దేనితో పోల్చబడ్డాడు?
జవాబు:
ఈ పద్యంలో దుర్జనుడు, పాముతో పోల్చబడ్డాడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జనుడితో స్నేహం పనికి రాదు.’

4. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.

రాజు చేతి కత్తి రక్తంబు వర్ణించు
సుకవి చేతి కలము సుధలు కురియు
ఆత డేల గలుగు యావత్ప్రపంచంబు
నీత డేల గలుగు ఇహము పరము
ప్రశ్నలు:
1. రాజు చేతి కత్తి దేన్ని వర్షిస్తుంది?
జవాబు:
రాజు చేతి కత్తి రక్తాన్ని వర్షిస్తుంది.

2. సుధలు కురిపించునది ఏది?
జవాబు:
సుకవి చేతి కలము, సుధలు కురిపిస్తుంది.

3. యావత్ప్రపంచాన్ని పరిపాలించగలిగింది ఎవరు?
జవాబు:
రాజు యావత్ప్రపంచాన్ని పరిపాలించగలడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి. –
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘రాజు – సుకవి’.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘హరిశ్చంద్రుడు’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
ద్విపదకు జీవంపోసిన గౌరన 15వ శతాబ్దికి చెందినవాడు. ఆయన కవిత్వం నిండా అచ్చతెలుగు పలుకుబళ్ళు జాలువారుతుంటాయి. హరిశ్చంద్రుడు అనే పాఠం రాసిన ఆయన గురించి రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
‘హరిశ్చంద్రుడు’ పాఠ్యాంశ రచయిత గౌరన. ఈయన 15వ శతాబ్దికి చెందినవాడు. వీరు హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్ర రచించాడు. సంస్కృతంలో లక్షణ దీపిక అనే గ్రంథాన్ని రచించారు. ఈయనకు ‘సరస సాహిత్య విచక్షణుడు’ అనే బిరుదు ఉంది. ఈయన శైలి మనోహరమైనది. సామెతలు, జాతీయాలతో కవిత్వం అందరిని అలరిస్తుంది. అచ్చతెలుగు పలుకుబడులు కవిత్వం నిండా పుష్కలంగా ఉంటాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

ప్రశ్న 2.
‘ద్విపద’ ప్రక్రియను వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ద్విపద ఒకటి. ఇందులో రెండు పాదాలు ఉంటాయి. ప్రతిపాదంలోను నాలుగు గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోను మూడు ఇంద్రగణాలు, ఒక సూర్య గణం ఉంటుంది. 1-4 గణాల మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతి కుదరనప్పుడు ప్రాసయతి వేయవచ్చు. ప్రాస నియమం లేని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు.

ప్రశ్న 3.
హరిశ్చంద్రుని పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
పురాణ పురుషుల్లో హరిశ్చంద్రుడు ప్రసిద్ధుడు. ఈయన షట్చక్రవర్తులలో గొప్పవాడు. ఆడినమాట తప్పని స్వభావం కలవాడు. సత్యం కోసం ఎన్నో కష్టాలను అనుభవించాడు. రాజ్యాన్ని, సంపదను కోల్పోయాడు. అయినా తాను నమ్మిన సత్యమునకే కట్టుబడి ఉన్నాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
హరిశ్చంద్రుడు పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
“బ్రహ్మ రాత మారవచ్చు ….. తూర్పున సూర్యుడు అస్తమించవచ్చు కానీ హరిశ్చంద్రుడు మాట తప్పడు” అని తెలిపే హరిశ్చంద్రుని కథను రాయండి. (S.A. II – 2017-18)
జవాబు:
సాటిలేని విజ్ఞానఖనియైన వశిష్ఠుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు. ఓ దేవేంద్రా ! ఈ ప్రపంచంలో మహా పరాక్రమవంతుడు హరిశ్చంద్రుడు. ఇతడు పదహారు రకాల దానాలు చేస్తూ ఆనందిస్తాడు. వినయమే అలంకారంగా కలవాడు. వివేకమే సంపదగా కలవాడు. మంచి కీర్తి వైభవాలు కలవాడు. ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. మేఘంలా గంభీరమైనవాడు. దయకు సముద్రుని వంటివాడు. పుణ్యాత్ముడు.

పండితులచే ప్రశంసలు పొందువాడు. సర్వశాస్త్రాలసారం తెలిసినవాడు. గర్వించిన శత్రురాజులనే ఏనుగుల పాలిట సింహం వంటివాడు. షట్చక్రవర్తులలో ఒకడు. నీతిమంతమైన పాలన చేసేవాడు. సత్యం తప్పనివాడు. మహాజ్ఞాని. సత్యవాక్పరిపాలకుడు.

సూర్యవంశస్థుడయిన త్రిశంకుని కుమారుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. సూర్యవంశమనే పాలసముద్రానికి చంద్రుని వంటివాడు. ఆడినమాట తప్పనివాడు. దేవేంద్రా ! రెండువేల నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతను సత్యస్వరూపుడు. అతని ఆలోచనలు కరుణతో నిండి ఉంటాయి. హరిశ్చంద్రుడు ధర్మతత్పరుడు. ఆయన ప్రియంగా మాట్లాడతాడు. అబద్ధమనేది ఆయనకు తెలియదు.

ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు ? బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున ఆస్తమించినా, మేరుపర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలక్రిందులైనా, సముద్రాలు ఇంకిపోయినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రమహారాజు మాత్రం ఆడిన మాట తప్పడు.

ప్రశ్న 2.
సత్యాన్ని పలుకడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
మానవులు ఎన్నో ఉత్తమ గుణాలను అలవరచుకోవాలి. వాటిలో సత్యమును మాట్లాడడం మంచిది. సత్యమును మాట్లాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని :

  • ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది.
  • నైతిక విలువలు సమున్నతంగా వృద్ధి చెందుతాయి.
  • సమాజంలో ధర్మతత్పరతకు అవకాశం కలుగుతుంది.
  • సమాజంలో ఉన్నతమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి.
  • మరణించినా శాశ్వతమైన కీర్తిని పొందుతాడు.
  • అందరికి ఆదర్శంగా నిలిచే అవకాశం కలుగుతుంది.
  • సమాజంలో మంచి గుణాలు చిరస్థాయిగా నిలుస్తాయి.

ఈ విధంగా సత్యాన్ని పలకడం వల్ల మానవులకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
నీకు నచ్చిన పురాణ పురుషుని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

శ్రీశైలం,
x x x x x

ప్రియమైన మిత్రురాలు విజయలక్ష్మికి,

నీ మిత్రురాలు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది మన పురాణ పురుషుల్లో నాకు ఎంతోమంది నచ్చారు. వారిలో హరిశ్చంద్రుడు ముఖ్యుడు. ఆయన సత్యానికి కట్టుబడి ఉన్నాడు. కార్యానికి రాజ్యాన్ని, సంపదను కోల్పోయాడు. అయినా సత్యవాక్య పరిపాలనకు కట్టుబడి ఉన్నాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు. అందుకే నాకు హరిశ్చంద్రుడు అంటే ఇష్టం. నీకు నచ్చిన పురాణ పురుషుని గురించి వివరంగా నాకు తెలియజేయి.

ఇట్లు,
నీ ప్రియ మిత్రురాలు,
x x x x x x x x.

చిరునామా :
పి.విజయలక్ష్మి,
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల,
మార్కాపురం,
ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
హరిశ్చంద్రుడు పాఠ్యభాగం ఆధారంగా కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  • సత్యం పలకండి. ఆదర్శవంతంగా జీవించండి.
  • సత్యమే జయిస్తుంది.
  • సత్యం మీరని ధర్మమే నిలబడుతుంది.
  • సత్యమే ధర్మం. సత్యమే తపస్సు.
  • భారతీయ అంతరాత్మ సత్యమే.
  • నిజం నిలకడమీద నిలుస్తుంది.
  • నిజం నిప్పులాంటిది.
  • నిజం దేవుడెరుగు. నీరు పల్లమెరుగు.
  • నిజం నిప్పులాంటిది. అది కాల్చక మానదు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

ప్రశ్న 3.
సత్యహరిశ్చంద్రుని గురించి తెలుసుకున్నారు కదా ! అతని గుణాలు తెలుసుకున్నారు కదా! తల్లిదండ్రులు, అట్లే ఉపాధ్యాయులు చెప్పే మంచి నీతి వాక్యాలను రాయండి.
జవాబు:
పిల్లలకు తల్లి చెప్పే మంచి బుద్ధులు :

  1. తోడి పిల్లలతో దెబ్బలాడవద్దు
  2. పక్క పిల్లలతో స్నేహంగా ఉండు
  3. బట్టలు మాపుకోకు
  4. పుస్తకాలు జాగ్రత్తగా చూసుకో
  5. ఉపాధ్యాయులు చెప్పేది విని శ్రద్దగా రాసుకో
  6. అసత్యం చూట్లాడకు
  7. మధ్యాహ్నం భోజనం చెయ్యి
  8. చెడ్డవారితో స్నేహం చెయ్యకు – మొదలయినవి.

ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులు :

  1. ఏ రోజు పాఠం ఆ రోజే చదువు
  2. ఇంటిపని శ్రద్ధగా పూర్తిచెయ్యి
  3. చదువుపై శ్రద్ధ పెట్టు
  4. ఆటలు ఆడుకో
  5. వ్యాయామానికై శ్రద్ధ పెట్టు
  6. తల్లిదండ్రులను, గురువులను గౌరవించు
  7. అసత్యం మాట్లాడకు
  8. తోటి బాలబాలికలను అన్నాచెల్లెళ్ళవలె, ప్రేమగా గౌరవించు – మొదలయినవి.

ప్రశ్న 4.
మీకు పద్యాలు తెలుసు కదా ! ఈ పాఠం ద్వారా ద్విపదను కూడా తెలుసుకున్నారు కదా ! ఇతర పద్యాలకూ, ద్విపదకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని వివరించి మీకు నచ్చినదాన్ని ప్రశంసిస్తూ రాయండి.
జవాబు:
‘ద్విపద’ పద్యంలో రెండే, పాదాలుంటాయి. పాదానికి నాలుగు గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ మూడేసి ఇంద్రగణాలు, ఒక సూర్య గణం ఉంటాయి. మూడవ గణం మొదటి అక్షరానికి యతి ఉంటుంది. ప్రాస నియమం ఉండాలి. ప్రాస నియమంలేని ద్విపదను ‘మంజరీ ద్విపద’ అంటారు.

‘ద్విపద’ పద్యం అచ్చమైన తెలుగు ఛందస్సు. దీనిని తెలుగులో రాసిన మొదటి దేశీయకవి ‘పాల్కురికి సోమనాథుడు’. ఈయన ద్విపదలో బసవపురాణాన్ని రాశాడు.

తెలుగులో ఇతర ఛందస్సులైన వృత్త పద్యాలలో ఒక విధమైన అందమైన నడక ఉంది. అవి చదవడానికి వినసొంపుగా ఉంటాయి. ఇక ‘సీస’ పద్యాల్లో ఒక విధమైన “తూగు” ఉంది. ఉయ్యాలలో ఊగుతున్నట్లు ఉంటుంది. ఏ ఛందస్సు అందం దానిదే. మనోహరమైన “ద్విపద” కూడా మన తెలుగు వారి ఛందస్సు. ఈ ఛందస్సుల్లో మహాకవియైన గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం రాశాడు. ద్విపద దేశీయ ఛందస్సు. వృత్తములు సంస్కృత ఛందస్సులు.

8th Class Telugu 7th Lesson హరిశ్చంద్రుడు 1 Mark Bits

1. భానుడు ప్రపంచానికి వెలుగునిస్తున్నాడు. ఆదిత్యుడు జగానికి మిత్రుడు. (సమానార్ధక పదాన్ని గుర్తించండి) (S.A.I – 2018-19)
ఎ) ఇందుడు
బి) సోముడు
సి) ఆదిత్యుడు
డి) రేరాజు
జవాబు:
సి) ఆదిత్యుడు

2. ఈ క్రిందివానిలో క్వార్థక వాక్యము గుర్తించండి. (S.A.II – 2018-19)
ఎ) హరిశ్చంద్రుడు సత్యమాడి స్వర్గమునకు వెళ్లాడు
బి) హరిశ్చంద్రుడు సత్యమాడుచున్నాడు స్వర్గానికి
సి) హరిశ్చంద్రుడు సత్యమాడితే స్వర్గానికి వెళతాడు
డి) హరిశ్చంద్రుడు సత్యముతో స్వర్గానికి వెళ్లాలి.
జవాబు:
ఎ) హరిశ్చంద్రుడు సత్యమాడి స్వర్గమునకు వెళ్లాడు

3. దేవతల రాజు సురేంద్రుడు ఐరావతంపై ఊరేగాడు. (అర్థాన్ని గుర్తించండి) (S.A.II – 2017-18)
ఎ) ఇంద్రుడు
బి) అగ్నిదేవుడు
సి) వాయుదేవుడు
డి) వరుణుడు
జవాబు:
ఎ) ఇంద్రుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

4. నాకు అడవిలో కంఠీరవాన్ని చూస్తే భయం. కానీ మా గోడమీద వాలే కంఠీరవాన్ని మాత్రం ప్రేమగా నిమురుతాను. (నానార్థాలు గుర్తించండి.) (S.A.III – 2016-17)
ఎ) పులి – కాకి
బి) ఏనుగు – దున్న
సి) సింహం – పావురం
డి) జిరాఫీ – కోకిల
జవాబు:
సి) సింహం – పావురం

5. భానుడు ప్రపంచానికి వెలుగును, వేడిని ఇస్తున్నాడు. (S.A.III – 2015-16)
ఎ) సూర్యుడు
బి) చంద్రుడు
సి) ఇంద్రుడు
డి) ధర్ముడు వెళ్లడానికి
జవాబు:
ఎ) సూర్యుడు

6. చంద్రశేఖర్ ఎప్పుడూ చిటపటలాడు తుంటాడు. (S.A.III. 2015-16)
ఎ) నవ్వుతుంటాడు
బి) కోపపడుతుంటాడు
సి) మెల్లగా నడుస్తుంటాడు
డి) పరిగెత్తుతుంటాడు
జవాబు:
బి) కోపపడుతుంటాడు

7. వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. ఆమె కడవతో వడివడి అడుగులతో గడపదాటింది. (S.A.III – 2015-16)
ఎ) లాటానుప్రాస
బి) యమకం
సి) ఛేకానుప్రాస
డి) వృత్త్యనుప్రాస
జవాబు:
డి) వృత్త్యనుప్రాస

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

8. దురితం దూరం చేసుకోవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) దుష్టం
బి) పాపం
సి) పుణ్యం
డి) దుర్మతి
జవాబు:
బి) పాపం

9. బుధులు గౌరవనీయులు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంతరంగాలు
బి) మూర్ఖులు
సి) పండితులు
డి) పామరులు
జవాబు:
సి) పండితులు

10. రిపువును దూరంగా ఉంచాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) మిత్రుడు
బి) గురువు
సి) విశ్వము
డి) శత్రువు
జవాబు:
డి) శత్రువు

11. శరధిలో జలం ఉంటుంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) కొలను
బి) ఝరి
సి) సముద్రం
డి) బావి
జవాబు:
సి) సముద్రం

12. నిత్యం సత్యం పలకాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అప్పుడు
బి) ఎల్లప్పుడు
సి) కొంత
డి) ఎప్పుడు
జవాబు:
బి) ఎల్లప్పుడు

13. తనువును రక్షించుకోవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) శరీరం
బి) జిహ్వ
సి) నాశిక
డి) కర్ణం
జవాబు:
ఎ) శరీరం

14. మదిలో మంచి ఉండాలి – గీత గీసిన పదానికి అర్ధం గుర్తించండి.
ఎ) మనసు
బి) నాలుక
సి) శరీరం
డి) తనువు
జవాబు:
ఎ) మనసు

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

15. ఎల్లప్పుడు బొంకు పలుకరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వాస్తవికం
బి) అబద్ధం
సి) నృతం
డి) నుతం
జవాబు:
బి) అబద్ధం

16. పయోనిధిలో రత్నాలు ఉంటాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఉదకం
బి) క్షీరం
సి) సముద్రం
డి) వారి
జవాబు:
సి) సముద్రం

17. ఆయన విజ్ఞానానికి నిధి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) నిలయం
బి) కొలను
సి) కోవెల
డి) మందారం
జవాబు:
ఎ) నిలయం

పర్యాయపదాలు :

18. రాజు పరిపాలించాడు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) ఉమాపతి, గురుపతి
బి) నృపతి, పృథ్వీపతి
సి) నరపతి, అసురపతి
డి) వంద్యుడు, పశుపతి
జవాబు:
బి) నృపతి, పృథ్వీపతి

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

19. నందనుడు కార్యసమరుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) కుమారుడు, సుతుడు
బి) విశ్వము, జగము
సి) జలము, పుత్రిక
డి) చామంత, చాగరిత
జవాబు:
ఎ) కుమారుడు, సుతుడు

20. వారిధిలో రత్నములు ఉండును – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సముద్రం, జలధి
బి) వారి, మధుజ
సి) వారిజం, వారుణి
డి) పయోధరం, అవనిధి
జవాబు:
ఎ) సముద్రం, జలధి

21. కంఠీరవం గుహలో ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) కుక్కురం, పంచాస్యం
బి) సింహం, కేసరి
సి) పుండరీకం, శృగాలం
డి) ఖరం, శునకం
జవాబు:
బి) సింహం, కేసరి

22. బొంకు పలుకరాదు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) బాష్పం, అనృతం
బి) శ్రుతం, వాచం
సి) అబద్ధం, అసత్యం
డి) నృతం, వాగ్మి
జవాబు:
సి) అబద్ధం, అసత్యం

23. మిన్ను విరిగి పడింది – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) ఆకాశం, నింగి
బి) నభం, నాకం
సి) గగనం, నగం
డి) నగరం, ప్రాంతం
జవాబు:
ఎ) ఆకాశం, నింగి

24. ఘనము వర్షించు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) రవం, ధరణి
బి) మేఘము, పయోధరం
సి) గిరి, నఖము
డి) నభం, ధర
జవాబు:
బి) మేఘము, పయోధరం

25. గిరి పై నదులు ఉన్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) గిరిజ, గిరిక
బి) కొండ, అది
సి) అచలం, ఆధారం
డి) అధరం, జలధరం
జవాబు:
బి) కొండ, అది

ప్రకృతి – వికృతులు

26. విద్య నేర్పాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) విద్దె
బి) విద్యా
సి) వేద్య
డి) విత్తు
జవాబు:
ఎ) విద్దె

27. మానవులకు గరువము పనికిరాదు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) అహంకారం
బి) దుర్మతి
సి) గర్వము
డి) గెర్వము
జవాబు:
సి) గర్వము

28. అబ్బురం చూపాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) అంతరంగం
బి) అద్భుతం
సి) ఆశ్చర్యం
డి) ఆహార్యం
జవాబు:
బి) అద్భుతం

29. విజ్ఞానం అర్పించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) విరుదం
బి) విజానం
సి) విజ్ఞానం
డి) విన్నానం
జవాబు:
డి) విన్నానం

30. సత్యం పలకాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) శిత్తు
బి) సత్తు
సి) సత్తె
డి) సిత్త
జవాబు:
బి) సత్తు

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

31. గుణము పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) గోరము
బి) గొనము
సి) గునము
డి) గొరము
జవాబు:
బి) గొనము

32. చట్టం తెలియాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) సస్త్రం
బి) శాస్త్రం
సి) శేస్త్రం
డి) శస్త్రం
జవాబు:
బి) శాస్త్రం

నానార్థాలు :

33. రాజు కువలయానందకరుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చంద్రుడు, ప్రభువు
బి) సింహం, కేసరి
సి) కెరటం, వీచిక
డి) చంద్రుడు, బుధుడు
జవాబు:
ఎ) చంద్రుడు, ప్రభువు

34. అందరు ధర్మం ఆచరించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పుణ్యం, న్యాయం
బి) తనువు, తరుణి
సి) తాపసి, ధరణి
డి) వసుధ, పుణ్యం
జవాబు:
ఎ) పుణ్యం, న్యాయం

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

35. గుణం పొందాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) రోదరం, గుణము
బి) గురువు, గోపురం
సి) స్వభావం, వింటినారి
డి) జలజం, జలధరం
జవాబు:
సి) స్వభావం, వింటినారి

36. బుధుడు వంద్యుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పండితుడు, బుధగ్రహం
బి) ఒకయతి, మూర్యుడు
సి) పండితుడు, పచనుడు
డి) పరవశుడు, పండితుడు
జవాబు:
ఎ) పండితుడు, బుధగ్రహం

37. పాకం రుచిగా ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జలధి, గారె
బి) వంట, కావ్యపాకం
సి) తంట, తరుణి
డి) తాపసం, పార్థుడు
జవాబు:
ఎ) జలధి, గారె

వ్యుత్పత్తర్థాలు :

38. వారిజం సుమనోహరం – గీత గీసిన పదానికి వుత్పత్తి ఏది?
ఎ) నీటి నుండి పుట్టినది
బి) క్షీరము నండి పుట్టినది
సి) పయోధరం నుండి పుట్టినది
డి) వాసన నుంచి పుట్టినది
జవాబు:
ఎ) నీటి నుండి పుట్టినది

39. శరములకు నిలయమైనది – అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) ధరణి
బి) శరధి
సి) క్షీరధి
డి) అవని
జవాబు:
బి) శరధి

40. రంజింపచేయువాడు అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) నాకము
బి) సూత్రధారుడు
సి) రాజు
డి) నారదుడు
జవాబు:
సి) రాజు

41. పద్మము నుండి పుట్టినవాడు – ఈ వ్యుత్పత్తికి తగిన పదం ఏది?
ఎ) వారిధం
బి) పయోధరం
సి) క్షీరోనిది
డి) వారిజగర్భుడు
జవాబు:
డి) వారిజగర్భుడు

42. భాస్కరుడు – ఈ పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) కాంతిని కలుగజేయువాడు
బి) చీకటిని కలుగజేయువాడు
సి) అంతరంగం చూచువాడు
డి) అవనిని దర్శించువాడు
జవాబు:
ఎ) కాంతిని కలుగజేయువాడు

వ్యాకరణాంశాలు

సంధులు :

43. తలపెల్ల – ఈ పదాన్ని విడదీసి గుర్తించండి.
ఎ) తలపో + ఎల్ల
బి) తలపె + ఎల్ల
సి) తలప + యెల్ల
డి) తలపు + ఎల్ల
జవాబు:
బి) తలపె + ఎల్ల

44. గుణసంధిలో ఏకాదేశంగా వచ్చేవి
ఎ) గ, జ, డ, ద, లు
బి) ఏ, ఓ, అర్
సి) ఐ, ఔ
డి) య, వ, ర, ల
జవాబు:
బి) ఏ, ఓ, అర్

45. గసడదవాదేశ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) తల్లిదండ్రులు
బి) శీతోష్ణములు
సి) ఎత్తుపల్లాలు
డి) మృదుమధురములు
జవాబు:
ఎ) తల్లిదండ్రులు

46. విద్యాధికుడు వర్ధిల్లాలి – గీత గీసిన పదాన్ని విడదీసి గుర్తించండి.
ఎ) విద్ది + ధికుడు
బి) విద్యా + అధికుడు
సి) విద్యే + అధికుడు
డి) విద్య + ఆధికుడు
జవాబు:
బి) విద్యా + అధికుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

47. క్రింది వానిలో సరళములు గుర్తించండి.
ఎ) గ, జ, డ, ద, బ
బి) పర్గ, స, ల
సి) క, చ, ట, త, ప
డి) జ్ఞ, ఇ, న, ణ, మ
జవాబు:
ఎ) గ, జ, డ, ద, బ

48. క్రింది వానిలో వికల్ప సంధిని గుర్తించండి.
ఎ) వృద్ధి సంధి
బి) గుణసంధి
సి) ఉత్వసంధి
డి) ఇత్వతసంధి
జవాబు:
డి) ఇత్వతసంధి

49. క్రింది వానిలో ఇత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) వానికైన
బి) ముందడుగు
సి) అత్తమ్మ
డి) అమ్మహిమ
జవాబు:
ఎ) వానికైన

50. తనువెల్ల రక్షించి – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) పడ్వాది సంధి
బి) ఉత్వ సంధి
సి) అత్వ సంధి
డి) రుగాగమ సంధి
జవాబు:
బి) ఉత్వ సంధి

51. కింది వానిలో గుణసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) వంటాముదం
బి) దేవేంద్ర
సి) దివిజాగ్రజుడు
డి) ముందడుగు
జవాబు:
సి) దివిజాగ్రజుడు

52. శాస్త్రార్థం – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) విసర్గ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) సవర్ణదీర్ఘ సంధి

సమాసాలు :

53. మహాభాగ్యం – ఈ పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
ఎ) గొప్ప యొక్క భాగ్యం
బి) గొప్పదైన భాగ్యం
సి) భాగ్యము యొక్క గొప్ప
డి) భాగ్యము నందలి గొప్పదనం
జవాబు:
బి) గొప్పదైన భాగ్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

54. సప్తమీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) విచార కోవిదుడు
బి) సత్మీర్తి
సి) వారిజగర్భుడు
డి) శాస్త్రార్ధము
జవాబు:
ఎ) విచార కోవిదుడు

55. వినయభూషితుడు – ఈ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) వినయమునందు భూషితుడు
బి) వినయము కొరకు భూషితుడు
సి) వినయము చేత భూషితుడు
డి) వినయము వలన భూషితుడు
జవాబు:
సి) వినయము చేత భూషితుడు

56. విద్యాసంపన్నుడు – ఇది ఏ సమాసము?
ఎ) కర్మధారయం
బి) ద్వంద్వ
సి) తృతీయా తత్పురుషం
డి) బహువ్రీహి
జవాబు:
సి) తృతీయా తత్పురుషం

57. వారిజగర్భుడు – ఇది ఏ సమాసమో గుర్తించండి.
ఎ) ద్విగువు
బి) బహువ్రీహి
సి) కర్మధారయం
డి) ద్వంద్వ
జవాబు:
బి) బహువ్రీహి

58. ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) తత్పురుష
బి) ద్వంద్వ
సి) బహుబ్లిహి
డి) ద్విగువు
జవాబు:
ఎ) తత్పురుష

59. విజ్ఞానమునకు నిధి – ఈ పదానికి సమాసపదం గుర్తించండి.
ఎ) ప్రతి విజ్ఞానం
బి) విజ్ఞాన నిధి
సి) నిధి విజ్ఞానం
డి) అవిజ్ఞాన నిధి
జవాబు:
బి) విజ్ఞాన నిధి

60. రిపుగణము- ఈ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) రిపువు అనెడి గణము
బి) రిపువు చేత గణము
సి) రిపువు నందలి గణము
డి) రిపువు వలన గణము
జవాబు:
ఎ) రిపువు అనెడి గణము

61. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన సమాసం గుర్తించండి.
ఎ) ద్విగువు
బి) రూపకం
సి) అవ్యయీభావం
డి) తత్పురుష
జవాబు:
ఎ) ద్విగువు

62. సత్కీర్తి – ఇది ఏ సమాసం?
ఎ) అవ్యయీభావ సమాసం
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) బహున్రీహి సమాసం
డి) ద్వంద్వ సమాసం
జవాబు:
బి) విశేషణ పూర్వపద కర్మధారయం

గణవిభజన:

63. ద్విపదలో ఎన్ని పాదాలు ఉంటాయి?
ఎ) రెండు
బి) మూడు
సి) నాలుగు
డి) ఆరు
జవాబు:
డి) ఆరు

64. ద్విపదలో పాదానికి గల గణాలు ఎన్ని?
ఎ) 3
బి) 4
సి) 8
డి) 6
జవాబు:
బి) 4

65. ద్విపదలో పాదానికి గణాలు ఏవి?
ఎ) మూడు సూర్య గణాలు, రెండు ఇంద్ర గణాలు
బి) నాలుగు ఇంద్ర గణాలు
సి) మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం
డి) నాలుగు సూర్య గణాలు
జవాబు:
సి) మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం

66. గర్విత – ఈ పదానికి గణాలు గుర్తించండి.
ఎ) UII
బి) IUU
సి) UIU
డి) III
జవాబు:
బి) IUU

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

67. IIIU – ఇది ఏ గణం?
ఎ) జ గణం
బి) ఇంద్ర గణం
సి) సూర్య గణం
డి) భ గణం
జవాబు:
సి) సూర్య గణం

వాక్యాలు :

68. రామలక్ష్మణులు అన్నదమ్ములు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) సంక్లిష్ట వాక్యం
జవాబు:
సి) సంయుక్త వాక్యం

69. చదివితే ర్యాంకు వస్తుంది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అవర్ధక వాక్యం
బి) తద్ధర్మార్థక వాక్యం
సి) చేదర్థక వాక్యం
డి) శత్రర్థక వాక్యం
జవాబు:
సి) చేదర్థక వాక్యం

70. భూతకాల అసమాపక క్రియను ఏమంటారు?
ఎ) అప్యర్థకం
బి) తద్ధర్మార్థకం
సి) శత్రర్థకం
డి) క్వార్థం
జవాబు:
డి) క్వార్థం

71. హరిశ్చంద్రునిచేత సత్యం పలుకబడింది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ధాత్వర్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) కర్మణి వాక్యం

72. ఊరికి వెళ్ళవద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుమత్యర్థక వాక్యం
బి) ఆశీర్వార్ధకం
సి) విధ్యర్థక వాక్యం
డి) నిషేధార్థక వాక్యం
జవాబు:
డి) నిషేధార్థక వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

73. నీరు పల్లంగా ప్రవహించును – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) నిశ్చయాత్మక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
డి) తద్ధర్మార్థక వాక్యం

అలంకారాలు :

74. చిటపట చినుకులు టపటప పడెను – ఇందులోని అలంకారం ఏది?
ఎ) వృత్త్యనుప్రాస
బి) లాటానుప్రాస
సి) యమకం
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
బి) లాటానుప్రాస

75. నీకు వంద వందనాలు – ఇది ఏ అలంకారం?
ఎ) వృత్త్యనుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) లాటానుప్రాస
డి) యమకం
జవాబు:
బి) ఛేకానుప్రాస

76. అర్థ భేదంతో కూడిన హల్లుల జంట వెంటవెంటనే ప్రయోగింపబడితే – అది ఏ అలంకారం?
ఎ) ఛేకానుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) ఛేకానుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

77. నగజ గజముపై వెళ్ళింది – ఇందులోని అలంకారం ఏది?
ఎ) ముక్తపదగ్రస్తం
బి) ఛేకానుప్రాస
సి) యమకం
డి) అంత్యానుప్రాస
జవాబు:
బి) ఛేకానుప్రాస

సొంతవాక్యాలు :

78. మిన్నంటు : నిత్యావసర వస్తువుల ధరలు మిన్నంటాయి.

79. ఉన్నతుడు : మహానీయుడు ఉన్నతుడిగా జీవిస్తాడు.

80. దురితం : పుణ్యకార్యాలతో దురితం దూరం అవుతుంది.

81. గుణములు : మానవులు మంచి గుణములను అలవరచుకోవాలి.

82. పరాక్రమం : యుద్ధంలో పరాక్రమం చూపాలి.

విశేషాంశాలు

1. వజ్రాయుధము : ఇది ఇంద్రుని ఆయుధం. మిక్కిలి శక్తివంతమైంది.

2. వారిజగర్భుడు : 1. తామరపూవు జన్మస్థానము (పుట్టు నెలవు) గా కలవాడు – బ్రహ్మ
2. తామరపూవు గర్భము నందు కలవాడు – విష్ణువు వారిజగర్భుడు – కమలగర్భుడు – వనజగర్భుడు – పద్మగర్భుడు – తమ్మిచూలి – పర్యాయపదములు.

3. వారిజాప్తుడు : తామర పూలకు చుట్టము – సూర్యుడు
వారిజాప్తుడు – కమలాప్తుడు – తామరసాప్తుడు – పద్మ బాంధవుడు – తమ్మి చుట్టము – పర్యాయపదములు.

4. షట్చక్రవర్తులు : ఆరుగురు చక్రవర్తులు.
1. హరిశ్చంద్రుడు 2. నలుడు 3. పురుకుత్సుడు 4. పురూరవుడు, 5. సగరుడు, 6. కార్తవీర్యార్జునుడు.

5. సప్తమహర్షులు : ఏడుగురు మహర్షులు.
1. వశిష్ఠుడు 2. అత్రి 3. గౌతముడు 4. కశ్యపుడు 5. భరద్వాజుడు 6. జమదగ్ని 7. విశ్వామిత్రుడు.

6. సప్తసముద్రములు : ఏడు సముద్రాలు
1. లవణ, 2. ఇక్షు, 3. సురా, 4. సద్వి, 5. దధి, 6. క్షీర, 7. జల.

7. షోడశ మహాదానములు : (పదహారు గొప్పదానములు)
1. గోదానము 2. భూదానము 3. తిలదానము 4. హిరణ్యదానము 5. రత్నదానము 6. విద్యాదానము 7. కన్యాదానము 8. దాసీదానము 9. శయ్యాదానము 10. గృహదానము 11. అగ్రహారదానము 12. రథదానము 13. గజదానము 14. అశ్వదానము 15. ఛాగ (మేక) దానము 16. మహిష (దున్నపోతు) దానము

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో.

AP State Syllabus 8th Class Telugu Important Questions 6th Lesson ప్రకృతి ఒడిలో

8th Class Telugu 6th Lesson ప్రకృతి ఒడిలో Important Questions and Answers

I. అవగాహన-ప్రతిస్పందన

అ) కింది అపరిచిత గద్యాలకు అడిగిన విధంగా జవాబులు ఇవ్వండి.

1. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

నిరుద్యోగ సమస్య నిజమునకు నిరక్షరాస్యుల వలన నేర్పడినది కాదు. విద్యావంతుల విషయముననే ఇది తీరని | సమస్యగా పరిణమించినది. ఈ విద్యావంతులు కుర్చీలలో కూర్చుండి గుమాస్తా పని చేయుటకే కుతూహలపడుచున్నారు. చదివిన చదువు కూడ అందుకే ఉపకరించుచున్నది. కావున మన విద్యావిధానము కొంత మారవలయును. విద్యావంతులు వృత్తి విద్యల నభ్యసించుట మేలు. ప్రభుత్వమువారి ప్రోత్సాహముతో వారు కుటీర పరిశ్రమలను నెలకొల్పుటయే ఈ సమస్యకు తగిన పరిష్కారము. వృత్తి విద్యల నభ్యసించినవారికి ప్రభుత్వమువారి తోడ్పాటు తప్పక లభించి తీరును.
ప్రశ్నలు :
1. నిరుద్యోగ సమస్య ఎవరి వలన ఏర్పడినది?
2. చదివిన చదువు ఎందుకుపయోగపడుచున్నది?
3. నేటి విద్యావిధానములో ఎట్టి మార్పు రావలెను?
4. ప్రభుత్వమువారు ఎవరికి తోడ్పడుచున్నారు?

2. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

పరిణయవేళ పుట్టినింటి వారు ధూతాంబకు వెలలేని రత్నాలహారమును బహుకరించిరి. దానిని ఆమె వ్రతదానమను నెపమున మైత్రేయునకిచ్చెను. తన భర్తకే దానిని ఆతడిచ్చుననియు, పోయిన సువర్ణభాండమునకు బదులు దానికంటే పదిమడుంగులు ఎక్కువ వెలగల తన రత్నాలహారమును తన భర్త వసంత సేనకు పంపుననియు ధూతాంబ తలచెను. తాను స్వయముగనే తన భర్తకిచ్చుచో అది స్త్రీ ధనమని యెంచి అతడు గ్రహించకపోవచ్చును. కావున ఆమె మైత్రేయుని ద్వారా దానిని పంపుటకు ఉపాయమును పన్నెను.

సుగుణవతియగు ధూతాంబ యొక్క పవిత్రాశయము నెరింగిన మైత్రేయు డాహారమును తీసికొనిపోయి చారుదత్తునకిచ్చెను. అనుకూలవతియగు భార్య వల్ల భర్త యొక్క కీర్తి ప్రతిష్ఠలు అభివృద్ధి నొందునని పల్కి అతడు తనకు స్త్రీ విమునకు ఆశపడవలసిన దుర్గతి పట్టెనని మిక్కిలి సిగ్గుచెందెను.
ప్రశ్నలు :
1. ధూతాంబ ఎవరికేమి ఇచ్చెను?
2. ధూతాంబ భర్త పేరేమి?
3. తన భర్త దేనికి బదులు ఏమి ఇచ్చునని ధూతాంబ తలచెను?
4. తాను స్వయముగా ఇచ్చుటకు ధూతాంబ ఏల సంశయించెను?

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

3. కింది పేరా ఆధారంగా కింది వాక్యములు సరైనవో కాదో (✓), (✗) గుర్తుల ద్వారా గుర్తించండి.

ఆ ముందుగా వ్యక్తి బాగుపడవలెను. ఆ వెనుక సంఘము బాగుండును. ముందుగా సంఘమును సంస్కరించవలెననుట వెట్టిమాట. మాటలో, చేతలో, తుదకు భావనలో సంస్కారముట్టిపడవలెను. అట్టి వ్యక్తులు పెక్కుమంది ఉన్నచో తనంతట తానే సంఘము ఉద్ధరింపబడును. వ్యక్తిని, తుదకు జాతిని తీర్చిదిద్దుకునే ఈ సంస్కారములు వాని ప్రణాళికను గమనించినచో తన పొట్టకు శ్రీరామరక్ష అనురీతిలో ఉండక వ్యక్తి శ్రేయస్సు, సమాజ కళ్యాణము పరస్పరము ముడివడియున్నవని విడివిడిగా లేవని తెలియచేయును. ఉదాహరణకు ప్రతి గృహస్థు విధిగా చేయవలసిన పంచమహాయజ్ఞములను చూడుడు. దేవయజ్ఞము నందు దేవతలను, ఋషి యజ్ఞమునందు ఋషులను, వారందించిన విజ్ఞానమును, పితృ యజ్ఞము నందు పితృదేవతలను కొలుచుచున్నాడు కదా! భూత యజ్ఞము నందు కుక్కలకు, కాకులకు బలివేయుచున్నాడు కదా! పొరుగువానిని ప్రేమింపమని ఇతర మతములన్నచో, పొరుగు ప్రాణిని కూడా ప్రేమింపమని ఈ సనాతన ధర్మము చాటుచున్నది. తనకుతాను వండుకొని తినువాడు కేవలము పాపమునే తినుచున్నాడని వేదము భాషించుట లేదా? ఇట్టి సూత్రములు సంస్కారములతో ముడివడియున్నవి.
ప్రశ్నలు :
1. వ్యక్తి బాగుపడినప్పుడే సంఘము బాగుపడుతుంది. (✓)
2. మాటలు, చేతలు, భావనలతో సంస్కారముట్టిపడదు. (✗)
3. ప్రతిగృహస్థు విధిగా పంచమహాయజ్ఞములను చేయవలెను. (✓)
4. పొరుగు వానిని ప్రేమించమని, పొరుగు ప్రాణిని ద్వేషించమని సనాతన ధర్మము చెప్పుచున్నది. (✗)

4. కింది పేరా చదివి, ఖాళీలు పూరించండి.

వ్యవసాయ భూముల్ని ఎలా ఉపయోగించుకుంటామో, జీవనోపాధి కోసం బీడు భూముల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవచ్చు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలూ ఉన్నాయి. గుజరాత్ లో అముల్ ప్రయోగం మన రాష్ట్రంలోనూ చేయవచ్చు. వృత్తికులాల వాళ్ళు అనేక మంది పరిస్థితులను బట్టి వృత్తులు మార్చుకుంటారు. చిత్రమేమంటే పేదవాళ్ళు ఎప్పుడూ విద్యా, వైద్య సౌకర్యాల గురించి అడగరు. భూములు లీజుకు ఇస్తే పెత్తందారులకు, దళారులకు, కుల పెద్దలకూ లాభం వస్తుంది. ఈ విషయంలో పేదలను చైతన్యపరచవలసిన ప్రభుత్వాలు కూడా చురుకైన పాత్ర నిర్వహించకపోవడం దురదృష్టకరం!
ఖాళీలు :
1. బీడు భూములంటే ……………
2. జీవనోపాధి కోసం రైతులు ఆధారపడేది ………..
3. విద్యా, వైద్య సౌకర్యాల గురించి అడగని వాళ్ళు ……………….
4. దళారులు చేసేపని ………..
జవాబులు:
1. పంటలు పండని భూములు
2. వ్యవసాయంపై
3. పేదవాళ్ళు
4. భూములను లీజుకు తీసుకోవడం

5. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

20వ శతాబ్దపు తొలి రోజులలో కుటుంబ నియంత్రణను బూతు మాట క్రింద జమకట్టేవారు. అటువంటి సమయంలో నర్స్ గా పనిచేసే మార్గరేట్ సాంగర్ అనేక కష్టాలకోర్చి కుటుంబనియంత్రణను గూర్చి ప్రచారం చేశారు. 1914లో “ఉమన్ రెబల్” అన్న వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఆమె యూరప్ కు వలసవెళ్ళి 1916లో తిరిగి వచ్చి అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలు పెట్టారు. పోలీసులు ఆమె ప్రారంభించిన ఆస్పత్రి పై దాడి చేశారు. అయినా ఆమె చలించకుండా 1923లో కుటుంబ నియంత్రణ పరిశోధనాశాలను నెలకొల్పారు.
ప్రశ్నలు :
1. కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్
2. ఏ సంవత్సరంలో, ఏ వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు?
3. మార్గరేట్ సాంగర్ ఎప్పుడు, ఎక్కడికి వలస వెళ్ళినది?
4. 1923లో సాంగర్ దేనిని నెలకొల్పినది?

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

6. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

బ్రౌనును ఒక వ్యక్తిగా గాక, పెద్ద సాహిత్య సంస్థగా భావించడం అవసరం. యుగసంధిలో నిలిచిన ఈ వ్యక్తి అనేకానేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించి, అవి ఎక్కడున్నాసరే, ఎంత ధనవ్యయమైనా సరే, లెక్క పెట్టకుండా, తన ఉద్యోగుల ద్వారా సంపాదించాడు. కొందరు పండితులను సమీకరించి, వారికి జీతభత్యాలిచ్చి, శుప్రతులు వ్రాయించి, కొన్నిటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు. ‘విశ్వదాభిరామ వినురవేమ’ పద్యం తెలియని తెలుగువాడు లేడు. అయితే ఈ పద్యాలను మొదట తెలుగువాళ్ళకు పరిచయం చేసినది విదేశీయుడైన బ్రౌను. బ్రౌను పేరు స్మరించగానే మనకు ముందు స్ఫురించేది బ్రౌనుకు నిఘంటువు. ఈ కృషి 1832లో ఆరంభించబడి, 1853లో పూర్తి అయి ప్రథమ ముద్రణ అయింది. ఈ కృషిలో బ్రౌనుకు ఏనుగుల వీరాస్వామి సహాయం పొందాడు. వీరాస్వామి రచించిన కాశీయాత్ర | గురించిన పుస్తకం చారిత్రక దృష్ట్యా విలువైనది.
ప్రశ్నలు:
1. తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఎట్లా పరిగణించడం భావ్యం?
2. బ్రౌను సంపాదించిన పుస్తకాలను ఏమంటారు?
3. పండితులతో బ్రౌను చేయించిన పనులేమిటి?
4. నిఘంటువు ప్రథమ ముద్రణ ఎప్పుడు వచ్చింది?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“ప్రకృతి ఒడిలో” అనే పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
జవాబు:
‘ప్రకృతి ఒడిలో’ అనే పాఠ్యభాగ రచయిత కొడవటిగంటి కుటుంబరావు. ఈయన 1909 – 1980 మధ్యకాలంలో జీవించారు. వీరు ప్రముఖ కథారచయిత, గల్పికలను ఎన్నో రాశారు. వారి కథలో సహజత్వం గోచరిస్తుంది. వీరి రచనల్లో చదువు, అద్దెకొంప, షావుకారు సుబ్బయ్య మొదలైనవి ప్రసిద్ధి చెందాయి. వీరి రచన సరళంగాను, మనోహరంగాను ఉంటుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

ప్రశ్న 2.
శాస్త్రజ్ఞులకూ (శాస్త్రవేత్తలకూ), శాస్త్రజ్ఞానానికి గల సంబంధాన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటనకూ వెనుక ఒక భౌతిక కారణం ఉంటుందనీ, దాన్ని తెలుసుకోడానికి వీలు అవుతుందనీ శాస్త్రజ్ఞుడు నమ్ముతాడు. శాస్త్రజ్ఞుడు రుజువయ్యే అవకాశం ఉంటే ప్రతి సిద్ధాంతాన్ని పరిశోధిస్తాడు. శాస్త్రజ్ఞులు సత్యాన్వేషణకూ, విషయజ్ఞానానికి ప్రయత్నిస్తారు. శాస్త్రజ్ఞానం వల్ల మనకు ప్రకృతి రహస్యాలు తెలుస్తాయి. శాస్త్రజ్ఞుని శాస్త్రజ్ఞానం వల్ల, మన లౌకిక జీవితాలు పై అంతస్తుకు చేరతాయి.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
ప్రకృతి అందాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
ప్రకృతి ఎంతో అందమైనది. ప్రకృతి భూమాతకు ఎన్నో అందాలను తెచ్చి పెడుతుంది. ప్రకృతిలో రకరకాల చెట్లు ఉంటాయి. కొన్ని పూలమొక్కలు, కొన్ని ఔషధపు మొక్కలు ఉంటాయి. అట్లే ఎన్నో రకాల పక్షులు సంచరిస్తాయి. అవన్నీ తమ అందాలతో కనువిందు చేస్తాయి. కోయిలల కిలకిలారావాలు మనసున్న మనుషులను అలరిస్తాయి. కొన్ని రకాల పక్షులు పంటలను రక్షిస్తాయి. కొన్ని ప్రాణులు పర్యావరణాన్ని రక్షిస్తాయి. నదులు జీవకోటికి జీవనాధారం. నదులు అందరికీ నీటిని అందిస్తాయి. వాటిని మనం కలుషితం కాకుండా చెయ్యాలి.

ప్రకృతిలో లభించే కొన్ని వస్తువులను మానవుడు తన స్వార్థం కోసం వినియోగించుకుంటున్నాడు. అడవులను నరికివేస్తున్నాడు. పక్షులను వేటాడుతున్నాడు. ఇది మంచిది కాదు. మనమంతా పర్యావరణాన్ని రక్షించాలి. ఇది మన కర్తవ్యం.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
నీవు చూసిన ఒక ప్రకృతి దృశ్యాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విజయనగరం,
x x x x x

ప్రియమైన మిత్రుడు నరసింహారావుకు,

నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది నేను ఇటీవల కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రానికి వెళ్ళాను. గిద్దలూరు దాటిన తరువాత నల్లమల అడవి వస్తుంది. అంతా లోయలు, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పచ్చని చెట్లు అలరించాయి. లోయలు కనువిందు చేశాయి. మధ్యలో సొరంగమార్గం మరువలేనిది. పక్షుల కిలకిలారావాలు అలౌకిక ఆనందాన్ని పొందేలా చేశాయి. నీవు కూడా చూచిన ఒక ప్రకృతి దృశ్యాన్ని వివరిస్తూ లేఖ రాయి.. పెద్దలకు నమస్కారాలు తెలుపుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x x x

చిరునామా :
జి. నరసింహారావు,
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
వినుకొండ, ప్రకాశం జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

8th Class Telugu 6th Lesson ప్రకృతి ఒడిలో 1 Mark Bits

1. ప్రథమా విభక్తి మీది ప్రత్యయాలకు కచటతపలు పరమైతే వాటి స్థానంలో గసడదవలు ఆదేశంగా వస్తాయి. (ఇది ఏ సంధి సూత్రం) (S.A. III – 2016-17)
ఎ) సరళాదేశసంధి
బి) ద్రుతప్రకృతికసంధి
సి) గసడదవాదేశసంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
సి) గసడదవాదేశసంధి

2. జయ ఇంటికి వెళ్లింది. విజయ బడికి వెళ్లింది. (పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి.) (S.A. III – 2016-17)
ఎ) జయ, విజయ ఇంటికి వెళ్లారు.
బి) జయ ఇంటికి, విజయ బడికి వెళ్లారు.
సి) విజయ, జయ బడికి వెళ్లారు.
డి) జయ, విజయలు ఇళ్లకు వెళ్లారు.
జవాబు:
బి) జయ ఇంటికి, విజయ బడికి వెళ్లారు.

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

3. అభినందన తెలపాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పొగడ్త
బి) అగడ్త
సి) అంజన
డి) విషయం
జవాబు:
ఎ) పొగడ్త

4. ఇంటి ఆకృతి బాగుంది – గీత గీసిన పదానికి అరం గుర్తించండి.
ఎ) ఆకారం
బి) వికారం
సి) సకారం
డి) యకారం
జవాబు:
ఎ) ఆకారం

5. మనుష్యుల మధ్య సామ్యం ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆకృతి
బి) పోలిక
సి) చూపు
డి) తెలివి
జవాబు:
బి) పోలిక

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

6. రుజువు కావాలి – గీత గీసిన పదానికి అర్థం పదాలు గుర్తించండి.
ఎ) నిదర్శనం
బి) ఆకాంక్ష
సి) ఆకారం
డి) సంప్రదాయం
జవాబు:
ఎ) నిదర్శనం

7. పాలు పేరుకొనుట జరిగింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వారిధి, భూరుహం
బి) గగనం, నాశం
సి) నభం, నాకం
డి) నింగి, నభం
జవాబు:
డి) నింగి, నభం

8. పసిగట్టుట జరిగింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) గుర్తించడం
బి) పరిశీలించడం
సి) ఆదరించడం
డి) తిరస్కరించడం
జవాబు:
బి) పరిశీలించడం

9. విధిగా రావాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆకృతిగా
బి) తప్పనిసరిగా
సి) అప్పుడప్పుడు
డి) అనుకూలంగా
జవాబు:
బి) తప్పనిసరిగా

10. సాధనం అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఉపకారం
బి) ఉపకరణం
సి) ఉపన్యాసం
డి) ఉపయోగం
జవాబు:
బి) ఉపకరణం

పర్యాయపదాలు :

11. కన్ను జ్ఞానేంద్రియం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) పక్షి, నయనం
బి) చక్షువు, నయనం
సి) నాశిక, నయనం
డి) అక్షి, కుక్షి
జవాబు:
బి) చక్షువు, నయనం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

12. నీరు ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) జలం, వారి
బి) జారి, క్షీరం
సి) దుగ్ధం, దధి
డి) ఘృతం, క్షీరం
జవాబు:
ఎ) జలం, వారి

13. సముద్రం భీకరం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) క్షీరం, ధరణి
బి) జలధి, అవని
సి) అంబుధి, అంబరం
డి) సాగరం, జలధి
జవాబు:
డి) సాగరం, జలధి

14. తరంగం ఉరికింది – గీత గీసిన పదానికి పర్యాయ గుర్తించండి.
ఎ) అల, వీచిక
బి) అంతరంగం, అవని
సి) దానం, దారి
డి) పధం, తపన
జవాబు:
ఎ) అల, వీచిక

15. ఆకాశం నిర్మలంగా ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వాసన చూచుట
బి) చీల్చుట
సి) నానబెట్టుట
డి) గడ్డకట్టుట
జవాబు:
డి) గడ్డకట్టుట

16. గాలి వీచింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) తరువు, తరుణి
బి) వాయువు, పవనం
సి) నాశిక, అనంతం
డి) ఆకారం, ఆకృతి
జవాబు:
బి) వాయువు, పవనం

ప్రకృతి – వికృతులు :

17. ఆశ్చర్యం పొందాను – అనే పదానికి వికృతి పదం ఏది?
ఎ) అచ్చెరువు
బి) ఆకారం
సి) ఆచెరం
డి) అచ్చెరం
జవాబు:
బి) ఆకారం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

18. బుద్ధి ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) బుద్ధి
బి) బిద్దు
సి) బౌద్ధ
డి) బౌద్ధ
జవాబు:
ఎ) బుద్ధి

19. ఆకసంలో రవి ఉన్నాడు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) అనంతం
బి) అబ్బురం
సి) ఆకాశం
డి) ఆకారం
జవాబు:
సి) ఆకాశం

20. చట్టం గౌరవించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) శర్మ
బి) శాస్త్రం
సి) శాసనం
డి) శాస్త్రి
జవాబు:
బి) శాస్త్రం

21. ధర్మం ఆచరించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం
ఎ) దమ్మం
బి) దరమ
సి) గరమ
డి) మరద
జవాబు:
ఎ) దమ్మం

నానార్థాలు :

22. మిత్రుడు ప్రకాశించాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) సూర్యుడు, స్నేహితుడు
బి) వైరి, విరోధి
సి) పగతుడు, చిరంజీవి
డి) చినుకు, చింత
జవాబు:
ఎ) సూర్యుడు, స్నేహితుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

23. వర్షం వచ్చింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వాన, సంవత్సరం
బి) వాకిలి, వారుణి
సి) వారుణం, వారిధి
డి) కల్పం, కాంతం
జవాబు:
ఎ) వాన, సంవత్సరం

24. చరణం బాగుంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పాదం, పద్యపాదం
బి) వేదభావం, విరించి
సి) అనంతం, అనం
డి) విస్మయం, విరామం
జవాబు:
ఎ) పాదం, పద్యపాదం

25. ధర్మం పాటించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పుణ్యం, న్యాయం
బి) అధర్మం, అపకారి
సి) నృతం, అనృతం
డి) విదతి, వింజారం
జవాబు:
ఎ) పుణ్యం, న్యాయం

26. కరంతో పని చెయ్యాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చేయి, తొండము
బి) కిరణము, కాంతి
సి) కలవ, కానుగ
డి) విధి, విధానం
జవాబు:
ఎ) చేయి, తొండము

27. కాలం చెల్లాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కానుగ, కాటుక
బి) సమయం, మరణం
సి) మంచు, హిమం
డి) హేమం, కాంతి
జవాబు:
బి) సమయం, మరణం

28. దేవుడే దిక్కు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) దిశ, శరణు
బి) ధర, ధరణి
సి) దాన, విరిగి
డి) నిశ, నిద్ర
జవాబు:
ఎ) దిశ, శరణు

వ్యుత్పత్తర్థాలు :

29. పర్వత రాజు కుమార్తె – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) పార్వతి
బి) ఊర్వశి
సి) జలధి
డి) వైదేహి
జవాబు:
ఎ) పార్వతి

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

30. నీటిని ధరించునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) వాసవి
బి) కాసారం
సి) వారిధి
డి) కౌముది
జవాబు:
సి) వారిధి

31. భూజము – అనే పదానికి వ్యుత్పత్తి ఏది?
ఎ) ఆకృతి లేనిది
బి) అనంతమైనది
సి) భూమి నుండి పుట్టినది
డి) భూమిలో దొరికినది
జవాబు:
సి) భూమి నుండి పుట్టినది

32. ఉర్వి – అనే పదానికి వ్యుత్పత్తి ఏది?
ఎ) మధురమైది
బి) ఫలవంతమైనది
సి) విశాలమైనది
డి) ఆకృతిలేనిది
జవాబు:
సి) విశాలమైనది

33. అగ్ని – అనే పదానికి వ్యుత్పత్తి ఏది?
ఎ) మండెడి స్వభావం కలది
బి) మంచుతో కూడినది
సి) మారాము చేయునది
డి) ఆకలి తీర్చునది
జవాబు:
ఎ) మండెడి స్వభావం కలది

వ్యాకరణాంశాలు

సంధులు:

34. అత్తటి – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) అత్వసంధి
సి) ఉత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
ఎ) త్రికసంధి

35. సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) రాజర్షి
బి) జ్ఞానాభివృద్ధి
సి) జ్ఞానోదయం
డి) ప్రాప్రోదయం
జవాబు:
బి) జ్ఞానాభివృద్ధి

36. అప్పుడప్పుడు – ఇది ఏ సంధి?
ఎ) ఆమ్రేడిత సంధి
బి) త్రికసంధి
సి) అత్వసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
బి) త్రికసంధి

37. ద్విరుక్తము యొక్క పరరూపం గుర్తించండి.
ఎ) ఆమ్రేడితం
బి) త్రికం
సి) శబ్దపల్లవం
డి) సాధువు
జవాబు:
ఎ) ఆమ్రేడితం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

38. ఉష్ణోగ్రత పెరిగింది – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) అత్వసంధి
సి) యణాదేశ సంధి
డి) గుణసంధి
జవాబు:
డి) గుణసంధి

39. విద్యుచ్ఛక్తి – ఇది ఏ సంధి?
ఎ) అత్వసంధి
బి) శ్చుత్వసంధి
సి) షుత్వసంధి
డి) టుగాగమ సంధి
జవాబు:
బి) శ్చుత్వసంధి

40. ప్రత్యామ్నాయం – దీనిని విడదీయండి.
ఎ) ప్రతో + ఆమ్నాయం
బి) ప్రతి + ఆమ్నాయం
సి) ప్రతె + ఆమ్నాయం
డి) ప్రత + ఆమ్నాయం
జవాబు:
బి) ప్రతి + ఆమ్నాయం

41. విద్యార్జన – ఇది ఏ సంధి?
ఎ) ఇత్వసంధి
బి) సవర్ణదీర్ఘ సంధి
సి) గుణసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) సవర్ణదీర్ఘ సంధి

సమాసాలు :

42. కళాదృష్టి – దీనికి విగ్రహవాక్యం ఏది?
ఎ) కళ యందు దృష్టి
బి) కళ చేత దృష్టి
సి) కళ కొరకు దృష్టి
డి) కళ వలన దృష్టి
జవాబు:
ఎ) కళ యందు దృష్టి

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

43. ప్రార్థనా సమావేశం – దీనికి విగ్రహవాక్యం ఏది?
ఎ) ప్రార్ధన కొరకు సమావేశం
బి) ప్రార్ధన యందు సమావేశం
సి) ప్రార్థన చేత సమావేశం
డి) ప్రార్ధనతో సమావేశం
జవాబు:
ఎ) ప్రార్ధన కొరకు సమావేశం

44. షష్ఠీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) గ్రామగతుడు
బి) ప్రకృతి ధర్మం
సి) విద్యాహీనుడు
డి) కళాతృష్ణ
జవాబు:
బి) ప్రకృతి ధర్మం

45. ద్విగు సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) మంచిమాట
బి) వంద సంవత్సరాలు
సి) సాగరసంగమం
డి) కళారాధన
జవాబు:
బి) వంద సంవత్సరాలు

46. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన సమాసం
ఎ) ద్విగు సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) అవ్యయీభావ సమాసం
డి) తత్పురుష సమాసం
జవాబు:
ఎ) ద్విగు సమాసం

47. సంసార సాగరం – ఇది ఏ సమాసం?
ఎ) రూపక సమాసం
బి) అవ్యయీభావ సమాసం
సి) కర్మధారయ సమాసం
డి) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
ఎ) రూపక సమాసం

గణ విభజన:

48. IUI- ఇది ఏ గణము?
ఎ) జ గణం
బి) త గణం
సి) స గణం
డి) య గణం
జవాబు:
ఎ) జ గణం

49. త గణం – దీనికి గణాలు ఏవి?
ఎ) IUI
బి) UUU
సి) UUI
డి) UII
జవాబు:
సి) UUI

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

50. సూర్య గణాలు ఎన్ని?
ఎ) నాలుగు
బి) రెండు
సి) ఆరు
డి) ఎనిమిది
జవాబు:
బి) రెండు

51. IIUI- ఇది ఏ గణము?
ఎ) నగము
బి) సలము
సి) నలము
డి) యలము
జవాబు:
బి) సలము

52. అవ్విధం – ఇది ఏ గణము?
ఎ) IUI
బి) UIU
సి) III
డి) IIU
జవాబు:
బి) UIU

వాక్యాలు :

53. దయతో అనుమతించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) పాక్షికార్థక వాక్యం
డి) తమున్నర్థక వాక్యం
జవాబు:
సి) పాక్షికార్థక వాక్యం

54. రవి పాఠం చదువగలడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్తరి వాక్యం
బి) హేత్వర్థక వాక్యం
సి) సామర్థార్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
సి) సామర్థార్థక వాక్యం

55. తప్పక పాఠం వింటాను – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుకరణ వాక్యం
బి) నిశ్చయార్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) నిశ్చయార్థక వాక్యం

56. అందరు వెళ్ళండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కరణి వాక్యం
బి) కరరి వాక్యం
సి) ఆత్మార్థక వాక్యం
డి) విధ్యర్థక వాక్యం
జవాబు:
డి) విధ్యర్థక వాక్యం

అలంకారాలు :

57. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పండి.
ఎ) ఛేకానుప్రాసాలంకారం
బి) రూపకాలంకారం
సి) యమకాలంకారం
డి) వృత్త్యనుప్రాసాలంకారం
జవాబు:
బి) రూపకాలంకారం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

58. ఈ రాజు సాక్షాత్తు శంకరుడే – ఇందులోని అలంకారం గుర్తించండి.
ఎ) అనన్వయ
బి) రూపక
సి) అతిశయోక్తి
డి) అర్థాంతరన్యాస
జవాబు:
బి) రూపక

సొంతవాక్యాలు :

59. అభినందనలు : పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం వల్ల నాకు అభినందనలు అందాయి.

60. పసిగట్టు : పాములు మనిషి జాడను పసిగడతాయి.

61. వైపరీత్యము : సముద్ర తీరాన ఉన్నవారికి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ.

62. ప్రకంపన : ఈ మధ్య చైనాలో భూ ప్రకంపనలు తరచుగా వస్తున్నాయి.

63. ప్రతిపాదించు : మా గురువులు ప్రతిపాదించిన విషయాల్ని మేము తప్పక అంగీకరిస్తాము.

64. హడావిడిగా : నేను ఈ రోజు బడికి హడావిడిగా వచ్చాను.

65. రుజువు చేయు : శాస్త్రజ్ఞులు విషయాన్ని రుజువు చేసి చూపిస్తారు.

66. అంచనా వేయు : నా మిత్రునికి రాబోయే విషయాల్ని అంచనావేయు శక్తి ఉంది.

67. నిరూపించు : శాస్త్రజ్ఞులు విషయాన్ని నిరూపిస్తారు.

విశేషాంశాలు

1. ప్రకృతి వైపరీత్యాలు అంటే : ప్రకృతిలో ఏర్పడే విపరీత పరిస్థితులు భూకంపము, సునామీ, వరదలు, తుపానులు మొదలైనవి.

2. విశ్లేషణ శక్తి అంటే : విషయాన్ని విభజించి పరిశీలించే శక్తి.

3. శాస్త్ర దృష్టి అంటే : ప్రతి సంఘటనకూ వెనుక ఉన్న భౌతిక కారణాన్ని పరిశోధించి తెలిసికొనే దృష్టి.

4. కళాదృష్టి అంటే : సౌందర్య రసాస్వాదన దృష్టి.

5. భ్రమలు అంటే : లేనిదానిని ఉన్నట్లుగా భ్రాంతి చెందే దృష్టి.

6. ఇంద్రియ జ్ఞానం అంటే : మన ఇంద్రియాలు గ్రహించే జ్ఞానం.

7. జ్ఞానమంటే : సమాచారాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం కాదు. జ్ఞానం అంటే ఆ జ్ఞానం కల్గించిన విచక్షణాశక్తితో గ్రహించడం.