AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ.

AP State Syllabus 8th Class Telugu Important Questions 5th Lesson ప్రతిజ్ఞ

8th Class Telugu 5th Lesson ప్రతిజ్ఞ Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అపరిచిత పద్యాలు చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. మేడిపండు జూడ మేలిమై యుండును
పొట్టవిప్పిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగుర
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు :
1. పిరికివాడు దేనితో పోల్చబడినాడు?
జవాబు:
పిరికివాడు మేడిపండుతో పోల్చబడినాడు.

2. మేడిపండు పైకి ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
మేడిపండు పైకి చక్కగా ఉంటుంది.

3. మేడిపండు లోపల ఎలా ఉంటుంది?
జవాబు:
మేడిపండు లోపల పురుగులతో కూడి ఉంటుంది.

4. ఈ పద్యం వల్ల తెలిసిందేమిటి?
జవాబు:
ఈ పద్యంవల్ల పిరికివాని స్వభావం తెలుస్తోంది.

2. ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కీయదా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
1. తేనెటీగ తేనెను ఎవరికి ఇస్తున్నది?
జవాబు:
తేనెటీగ తేనెను తెరువరికి (బాటసారికి) ఇస్తున్నది.

2. తాను తినక, కూడబెట్టువారి నేమందురు?
జవాబు:
తాను తినక, కూడబెట్టువారిని పిసినారి అంటారు.

3. పై పద్యము నందలి భావమేమి?
జవాబు:
కూడబెట్టిన ధనం సద్వినియోగం చేయకపోతే వృథా అవుతుంది.

4. కూడబెట్టిన ధనము ఎట్లు సద్వినియోగమగును?
జవాబు:
కూడబెట్టిన ధనం దానం చేసినా లేదా తాను అనుభవించినా సద్వినియోగం అవుతుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

3. అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
1. అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది?
జవాబు:
అంటూ ఉంటే రాగం అతిశయిల్లుతుంది.

2. తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
జవాబు:
తింటూ ఉంటే వేపాకు తీయనవుతుంది.

3. సాధనతో సమకూరేవి ఏవి?
జవాబు:
సాధనతో పనులు సమకూరుతాయి.

4. ఈ పద్యానికి మకుటం ఏది?
జవాబు:
‘విశ్వదాభిరామ వినురవేమ’ అనేది ఈ పద్యానికి మకుటం.

4. మేరు నగము వంటి ధీరత కలిగియు
పరమశివుడు తనదు పదములంట
ఇంచుకంత చంచలించె పర్వతరాజు
దేవదేవుడన్న భావనమున.
ప్రశ్నలు:
1. పర్వతరాజు ఎటువంటి ధీరత గలవాడు?
జవాబు:
పర్వతరాజు మేరు నగము వంటి ధీరత గలవాడు.

2. పర్వతరాజు పాదాలకు నమస్కరించ వచ్చినదెవరు?
జవాబు:
పర్వతరాజు పాదాలకు నమస్కరించ వచ్చినది పరమ శివుడు.

3. ఇంచుకంత చలించినది ఎవరు?
జవాబు:
ఇంచుకంత చలించినది పర్వతరాజు.

4. పర్వతరాజు శివుని ఎట్లా భావించాడు?
జవాబు:
పర్వతరాజు శివుని దేవదేవుడుగా భావించాడు.

5. ఆత్మ శుద్ధి లేని ఆచారమదియేల?
భాండ శుద్ధి లేని పాకమేల?
చిత్త శుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
1. పాకమునకు దేని శుద్ధి అవసరం?
జవాబు:
పాకమునకు భాండశుద్ధి అవసరం.

2. చిత్తశుద్ధి లేకుండా దేనిని చేయకూడదు?
జవాబు:
చిత్తశుద్ధి లేకుండా శివపూజలు (దైవపూజలు) చేయకూడదు.

3. ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘శుద్ధి’ (నిర్మలత్వం) అని పెట్టవచ్చు.

4. ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు?
జవాబు:
ఈ పద్యాన్ని రాసిన కవి వేమన.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

6. మఱవవలెఁ గీడు నెన్నఁడు
మఱవంగా రాదు మేలు మర్యాదలలోఁ
దిరుగవలె సర్వజనములం
దరిఁప్రేమన్ మెలగవలయుఁ దరుణి కుమారీ !
ప్రశ్నలు :
1. దేనిని మరచిపోవాలి?
జవాబు:
కీడును మరచిపోవాలి.

2. దేనిని మరువరాదు?
జవాబు:
మేలును మరువరాదు.

3. అందరి ఎడల ఎట్లా మెలగాలి?
జవాబు:
అందరి యెడల మర్యాదలతోను, ప్రేమతోను మెలగాలి.

4. ఈ పద్యం ఏ శతకం లోనిది?
జవాబు:
ఈ పద్యం ‘కుమారీ శతకం’ లోనిది.

7. ఈ కింది పరిచిత గేయాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనే లేదని
కష్టజీవులకు, కర్మవీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తి వాక్యములు సంధానిస్తూ,
స్వర్ణ వాద్యములు సంరావిస్తూ,
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్.
ప్రశ్నలు:
1. భావివేదములు, జీవనాదములు దేనినుండి పుడతాయి?
జవాబు:
బాధచే పీడింపబడిన జీవితం.

2. భక్తి, ముక్తి, రక్తి వంటి పదాలు వాక్యం చివర ఉంటే దానిని ‘అంత్యప్రాస’ అంటారు. అటువంటి మూడు పదాలు పై గేయంలో ఉన్నాయి వెతికి రాయండి.
జవాబు:
నిర్దేశిస్తూ, సంధానిస్తూ, సంరావిస్తూ.

3. ఏ సౌందర్యం గొప్పదని కవి ఉద్దేశం?
జవాబు:
శ్రమైక జీవన సౌందర్యం

4. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై మాటలు ఎవరివి ?

8. ఈ కింది గేయం చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనే లేదని
కష్ట జీవులకు కర్మ వీరులకు
నిత్య మంగళం నిర్దేశిస్తూ
స్వస్తి వాక్యములు సంధా నిస్తూ
స్వర్ణ వాద్యములు సంరాలిస్తూ
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
ప్రశ్నలు
1. కవి ఎవరికి మంగళం నిర్దేశించారు?
జవాబు:
కష్టజీవులకు, కర్మవీరులకు

2. దేనికి సమానమైనది లేదని చెప్పినారు?
జవాబు:
శ్రమైక జీవన సౌందర్యానికి

3. ఈ గేయం రచయిత ఎవరు?
జవాబు:
శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ.శ్రీ)

4. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
‘సంరావిస్తూ’ అనగానేమి?

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

9. కింది అపరిచిత గేయం చదవండి. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి. (S.A.III-2016-17)
అడవిలేక అవని లేదు – చెట్టులేక చెలిమి లేదు
మొక్క మానై ఎదగకుంటే – జీవకోటికి బతుకు లేదు
చెట్టు చేమను రక్షించుకుంటూ – బతుకుదీపం కాపాడుకుంటూ
తోడుగుందామా అడవికి ఊపిరౌదామా – తోడుగుందామా అడవికి ఊతమౌదామా
ప్రశ్నలు
1. అవని అంటే అర్థం ఏమిటి?
జవాబు:
భూమి

2. జీవకోటి బతకాలంటే ఏమేమి కావాలి?
జవాబు:
చెట్లు, ఆహారం

3. చెట్లను రక్షించడం వల్ల ప్రయోజనాలు ఏవి?
జవాబు:
గాలి, ఆహారం దొరుకుతాయి.

4. పై గేయం ఆధారంగా ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘మాను’ అంటే ఏమిటి?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘ప్రతిజ్ఞ’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి. (S.A. I – 2019-2017)
జవాబు:
‘ప్రతిజ్ఞ’ పాఠ్యభాగ రచయిత శ్రీశ్రీ. ఈయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. వీరు 1910వ సంవత్సరంలో విశాఖపట్టణంలో జన్మించారు. తన పద్దెనిమిదవ సంవత్సరంలోనే ‘ప్రభవ’ కావ్యాన్ని రచించాడు. వీరి రచనల్లో ‘మహాప్రస్థానం’ మిక్కిలి ప్రసిద్ధి చెందింది. వీరు ఎన్నో నాటకాలు, రేడియో నాటికలు, నవలలు రచించారు. వీరి ఆత్మకథ పేరు ‘అనంతం’. కార్మికకర్షక లోకానికి ప్రతీకగా ఈ మహాకవి నిలిచారు. అభ్యుదయ కవిత్వానికి నాంది పలికారు.

ప్రశ్న 2.
శ్రీశ్రీ గారి అభ్యుదయ దృక్పథాన్ని వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీశ్రీ గారికి సమున్నతమైన స్థానం ఉంది. కార్మికకర్షక జీవితాలను, వారి బాధలను కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు. అభ్యుదయ కవిత్వానికి వారధిగా నిలిచారు. కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదని నినదించారు. అక్షరాలను ఆయుధాలుగా చేసుకున్నారు. పదునైన వాగ్భాణాలను సమాజంపై సంధించారు. ప్రజాకవిగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. భావి కవులకు మార్గదర్శకంగా నిలిచారు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
ఈ కవిత మీకు ఎందుకు నచ్చిందో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
ఈ కవితలో శ్రీశ్రీగారు కార్మికులను, కర్షకులను నాయకులుగా చూపుతూ రాయటం నాకు చాలా నచ్చింది. బాగా ఆలోచించి చూస్తే కర్షకులు, కార్మికులూ ప్రపంచ సౌభాగ్యం కోసం, ఎంత కష్టపడుతున్నారో, ఎంతగా చెమటను చిందిస్తున్నారో, ఎంతగా త్యాగం చేస్తున్నారో మనకు అర్థం అవుతుంది.

రైతులు పంటలు పండించకపోతే, మనకు తిండి దొరికేది కాదు అని అనుకున్నప్పుడు, రైతులు గొప్ప త్యాగమూర్తులనీ, నిజంగానే వారి చెమటకు విలువ కట్టలేమని అనిపిస్తుంది.

అలాగే కార్మికులు తాము కష్టించి మనకు కావలసిన వస్తువులను తయారుచేసి ఇస్తున్నారు. వారి కళ్ళల్లోని అగ్నికీ, కన్నీటికీ విలువ కట్టలేమని శ్రీశ్రీ చెప్పిన మాట, ఎంతో సత్యమనిపించింది. అందుకే ఈ కవిత నచ్చింది. తాను రాసిన కవితను శ్రీశ్రీ కార్మికలోకపు కళ్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి అంకితమివ్వడం నాకు నచ్చింది.

ఈ కవితలోని అంత్యప్రాసలూ, అనుప్రాసలూ గేయరచనకు ఎంతో అందాన్ని ఇస్తున్నాయి.

గేయంలోని కవి ఆవేశం, ఆయనకు కర్షక కార్మికులపై గల అనురాగం ఎంతో నచ్చింది. తన నవ్య కవిత్వానికి వృత్తి పనివారల చిహ్నాలే భావం, భాగ్యం, ప్రణవం అని చెప్పిన మాట, కవిగారి కార్మిక ప్రేమకు నిదర్శనం. ఈ గేయంలోని మాత్రాఛందస్సు, ఎంతో అందంగా చెవులకు ఇంపుగా, పాడుకోవడానికి వీలుగా ఉంది.

ఇ) కింది సృజనాత్మకత ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నీకు నచ్చిన కవిని గురించి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుడివాడ,
x x x x x

ప్రియమిత్రుడు రామారావు,
నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. ముఖ్యముగా వ్రాయునది. మన తెలుగు సాహిత్యంలో ఎందరో మహాకవులు ఉన్నారు. వారిలో శ్రీశ్రీ గారు. ప్రముఖులు. ఈయన ప్రజాకవి గాను, అభ్యుదయ కవిత్వానికి పితామహుడిగా గుర్తింపు పొందారు. కార్మిక కర్షక లోకానికి స్ఫూర్తిదాతగా నిలిచాడు. ప్రజల సమస్యలను తన సమస్యలనుగా? తీసుకొని రచనలు చేశారు. వీరు రచించిన మహాప్రస్థానం విశేషఖ్యాతిని పొందింది. వీరి శైలి మధురంగా ఉంటుంది అందుకే నాకు శ్రీ శ్రీ గారంటే చాలా ఇష్టం. నీకు నచ్చిన కవిని గూర్చి నాకు తెలియజేయి. పెద్దలందరికీ నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x x x x

చిరునామా :
పి. రామారావు,
8వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల,
నందిగామ,
కృష్ణాజిల్ల.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

ప్రశ్న 2.
శ్రీశ్రీ గారి కవిత్వాన్ని ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
“ఏ దేశ చరిత్ర చూచినా – ఏమున్నది గర్వకారణం !
నరజాతి చరిత్ర సమస్తం – పరపీడన పరాయణత్వం”

అని కొత్తగా గళమెత్తి సంచలనం రేకెత్తించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అనే రెండక్షరాలు తెలుగు కవిత్వంలో విప్లవం సృష్టించాయి. కలం పేరు శ్రీశ్రీ కాగా, అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. “అనితరసాధ్యం నా మార్గం” అని చాటిన ప్రకవి శ్రీశ్రీ భావకవిత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తర్వాత విప్లవ కవిత్వోద్యమానికి స్ఫూర్తినిచ్చాడు.

కాని శ్రీశ్రీ ప్రపంచాన్ని పరిశీలించిన కొద్దీ, పుస్తక పఠనం ఎక్కువైన కొద్దీ కొత్త దారులు తొక్కాలని ఉవ్విళ్ళూరాడు. తానే ప్రపంచాగ్నిగా మారాడు.

తాను కొత్త శైలిని ఎన్నుకొన్నాడు. “ఈ యుగం నాది” అని ఎలుగెత్తి చాటాడు. “సామాజిక దృక్పథాన్ని జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్ళిన నాయకుడాయనే. శ్రీశ్రీ “మహాప్రస్థానం” అనే గొప్పకావ్యం రాశాడు. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం అని అర్థం. కమ్యూనిస్టు భావాలు గల శ్రీశ్రీ ఎర్రబావుటా ఎగరేస్తూ మరో ప్రపంచానికి పదండి అని మేల్కొలుపు పాడుతూ ఇలా పాడాడు.

సామాజంలోని ఎక్కువ తక్కువల్నీ, బలవంతుల – ధనవంతుల అన్యాయాల్ని ఎదిరించిన శ్రీశ్రీ కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరించాడు.

“దేశ చరిత్రలు” అనే ఖండిక చారిత్రక వాస్తవికత స్పష్టీకరిస్తుంది. “తాజ్ మహల్ నిర్మాణానికి – రాళ్ళెత్తిన కూలీ లెవరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ – అది మోసిన బోయీలెవ్వరు?” అని మొట్టమొదటిగా శ్రామికశక్తిని గుర్తించి సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రకటించినవాడు శ్రీశ్రీ.

“కదిలేదీ కదిలించేదీ
మారేదీ మార్పించేదీ
మునుముందుకు సాగించేదీ” కవిత్వమని శ్రీశ్రీ కొత్త నిర్వచనం ఇచ్చాడు.

ఆయన సమకాలీన సమాజాన్ని హేళన చేస్తూ సిరిసిరిమువ్వా అనే శతకం రాశాడు. కథలూ, నాటికలూ, వ్యాసాలూ, పీఠికలూ… ఏది రాసినా శ్రీశ్రీ ముద్ర గాఢంగా కనిపిస్తూనే ఉంటుంది.

సమాజాన్ని చైతన్యపరిచి, అభ్యుదయ కవిత్వానికి యుగకర్తగా ఉండి, కొత్త తరానికి బాటలు వేసి, తెలుగు కవిత్వంలో – సంతకంగా నిలిచిన శ్రీశ్రీ ప్రజాకవి, సమాజకవి.

8th Class Telugu 5th Lesson ప్రతిజ్ఞ 1 Mark Bits

1. వికారినామ వర్మంలో ఆషాఢంలో మొదటి వరం కురిసింది. (నానార్థాలు గుర్తించండి) (S.A. I – 2019-20)
ఎ) వాన, జడి
బి) సంవత్సరం, వాన
సి) వయస్సు, మొదట
డి) మార్గం, దారి
జవాబు:
బి) సంవత్సరం, వాన

2. “చేసినంత” (పదాన్ని విడదీయండి) (S.A. I – 2019-20)
ఎ) చేసిన + యంత
బి) చేసి + అన్నంత
సి) చేసిన + అంత
డి) చేసినన్ + యంత
జవాబు:
సి) చేసిన + అంత

3. కోటిరత్నాలు (సమాసం పేరు గుర్తించండి) (S.A. I – 2019-20)
ఎ) ద్వంద్వ
బి) బహువ్రీహి
సి) అవ్యయీభావ
డి) ద్విగు
జవాబు:
డి) ద్విగు

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

4. నా కరములో ఉన్న అరటి పండును కరి కరముకు అందించాను. నానార్థాలు గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) చేయి, హస్తము
బి) హస్తము, కేలు
సి) చేయి, ఏనుగు
డి) చేయి, తొండము
జవాబు:
డి) చేయి, తొండము

5. ప్రాణమున్నంత వరకూ నిజాయితీగా బతకాలి (వికృతి గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) పానము
బి) ప్రానము
సి) పాణము
డి) పాణం
జవాబు:
ఎ) పానము

6. రాజు కొలువుసేసి ప్రజలతో పలికెను (పదాన్ని విడదీయండి) (S.A. I – 2018-19)
ఎ) కొలువు + జేసి
బి) కొలువు + చేసి
సి) కొలువున్ + జేసి
డి) కొలువుం + చేసెన్
జవాబు:
బి) కొలువు + చేసి

7. కింది వానిలో తృతీయా తత్పురుష సమాసపదాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) కాలుసేతులు
బి) నాలుగుదిక్కులు
సి) బుద్ధిహీనుడు
డి) షడ్రుచులు
జవాబు:
సి) బుద్ధిహీనుడు

8. శ్రామిక శక్తితో ప్రపంచం అభివృద్ధి చెందుతోంది. (వికృతి పదం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) శత్రు
బి) సత్తు
సి) సుత్తి
డి) సత్తి
జవాబు:
డి) సత్తి

9. రావణుడు తన గుణముల చేత హీనుడయ్యాడు. (విభక్తిని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ప్రథమ
బి) తృతీయా
సి) పంచమీ
డి) సప్తమీ
జవాబు:
డి) సప్తమీ

10. రామరాజ్యంలో నెలకు ఆనాడు వానలు ప్రతి సంవత్సరం కురిసేవి. గీత గీసిన పదానికి నానార్థ పదాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) ఘర్షణ
బి) కర్షకుడు
సి) హర్షం
డి) వర్షం
జవాబు:
డి) వర్షం

11. ఎప్పటికైనా దమ్మమే జయిస్తుంది. గీత గీసిన పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) శౌర్యం
బి) యుద్ధం
సి) అధర్మం
డి) ధర్మం
జవాబు:
డి) ధర్మం

12. “ఋగ్యజుస్సామ అధర్వణాలు నాలుగువేదాలు” గీత గీసిన పదం ఏ సమాసం? (S.A. III – 2015-16)
ఎ) ద్విగు సమాసం
బి) బహువ్రీహి సమాసం
సి) తత్పురుష సమాసం
డి) కర్మధారయ సమాసం
జవాబు:
ఎ) ద్విగు సమాసం

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

13. “ఆ ఊళ్లో దొంగభయం ఎక్కువ” గీత గీసిన పదానికి సరైన విగ్రహవాక్యాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) దొంగ యందు భయం
బి) దొంగ వలన భయం
సి) దొంగ యొక్క భయం
డి) దొంగ కొరకు భయం
జవాబు:
బి) దొంగ వలన భయం

14. క్రింది వాక్యాలలో గీతగీసిన పదానికి సమానార్థకం కాని పదాన్ని గుర్తించండి. సీత హేమాభరణాలు ధరించింది. (S.A. III – 2015-16)
ఎ) అంగారం
బి) బంగారం
సి) స్వర్ణం
డి) పుత్తడి
జవాబు:
ఎ) అంగారం

భాషాంశాలు – పదజాలం

15. ఘర్మజలం విలువ తెలియాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) విషాదాశ్రువులు
బి) చెమటనీరు
సి) కన్నీరు
డి) ఆనందబాష్పాలు
జవాబు:
బి) చెమటనీరు

16. ధరిత్రిపై శాంతి నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) జలధి
బి) వారిధి
సి) భూమి
డి) వనజం
జవాబు:
సి) భూమి

17. హేమంతో ఆభరణాలు చేస్తారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) రజితం
బి) కాంశ్యం
సి) అయస్సు
డి) బంగారం
జవాబు:
డి) బంగారం

18. జలం జీవనాధారం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పీయూషం
బి) నీరు
సి) క్షీరం
డి) సుధ
జవాబు:
బి) నీరు

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

19. కర్షకులు పంటలు పండిస్తారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పురోహితులు
బి) రైతులు
సి) ఆత్మజులు
డి) అనంతులు
జవాబు:
బి) రైతులు

పర్యాయపదాలు :

20. బంగారంతో ఆభరణాలు చేస్తారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) హేమం, హిమం
బి) పుత్తడి, హేమం
సి) కాంచనం, రజితం
డి) అభ్రకం, అయస్సు
జవాబు:
బి) పుత్తడి, హేమం

21. హలంతో పొలం దున్నాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) నాగలి, నీరు
బి) నాగము, నభము
సి) నరము, నారి
డి) వయము, వయసు
జవాబు:
ఎ) నాగలి, నీరు

22. ధ్వని వచ్చింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) రవం, రాగి
బి) శబ్దం, రవం
సి) రసం, రంజని
డి) రతనం, వదనం
జవాబు:
బి) శబ్దం, రవం

23. అగ్ని ప్రకాశించింది – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) చిచ్చు, నిప్పు
బి) నిబం, నింబం
సి) అగ్గి, అశనం
డి) అద్రి, సభం
జవాబు:
ఎ) చిచ్చు, నిప్పు

24. ఇలపై కొంతి వికసించాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ధరణి, వాకిలి
బి) పయస్సు, ధారుణి
సి) జగం, జలధి
డి) భూమి, వసుధ
జవాబు:
డి) భూమి, వసుధ

ప్రకృతి – వికృతులు :

25. మనం ప్రతిజ్ఞ చేయాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) ప్రయాస
బి) ప్రకాస
సి) పదెన
డి) ప్రతిన
జవాబు:
డి) ప్రతిన

26. ధరం ఆచరించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) దరమం
బి) దమ్మం
సి) దశమం
డి) దరన
జవాబు:
బి) దమ్మం

27. న్యాయం పాటించాలి – గీత గీసిన పదానికి దీనికి వికృతి పదం ఏది?
ఎ) నైయం
బి) నాయం
సి) నేయం
డి) నోయం
జవాబు:
బి) నాయం

28. ప్రాణం తిపి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) పారం
బి) పానం
సి) పాయం
డి) సాయం
జవాబు:
బి) పానం

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

29. శ్రీ వెల్లి విరియాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) శీరి
బి) సిరి
సి) శ్రీరి
డి) చిరి
జవాబు:
బి) సిరి

30. అగ్గి చల్లారింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) అగ్లో
బి) అగ్ని
సి) అగ్గి
డి) అగా
జవాబు:
బి) అగ్ని

31. బాగెము పండాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) భాగ్యము
బి) భాసము
సి) సంపద
డి) భోగ్యము
జవాబు:
ఎ) భాగ్యము

32. కరంతో పని చేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చేయి, తొండం, కిరణం
బి) హస్తం, పాదం, నఖము
సి) నది, ఝరి, సాగరం
డి) కరం, చదరం, చందనం
జవాబు:
ఎ) చేయి, తొండం, కిరణం

33. భూత కాలంలో తిరిగిరావు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జరిగిపోయినది, ప్రాణి
బి) భూమి, జలధి
సి) ధర్మం, వసుధ
డి) నీరు, ఉదధి
జవాబు:
ఎ) జరిగిపోయినది, ప్రాణి

34. ఆయన కాలం చెందాడు – గీత గీసిన పనికి నానార్థాలు గుర్తించండి.
ఎ) భరతం, భాగ్యం
బి) సమయం, మరణం
సి) సమయం, కన్ను
డి) భాగ్యం, బానిస
జవాబు:
బి) సమయం, మరణం

35. బలం చూపాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) లావు, సామర్థ్యం
బి) మరణం, జననం
సి) చక్రం, వాన
డి) అదృష్టం, పర్జన్యం
జవాబు:
ఎ) లావు, సామర్థ్యం

36. కన్ను రక్షణీయం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) బలం, సామర్థ్యం
బి) నయనం, బండిచక్రం
సి) నేత్రం, కాలం
డి) వాన, నీరు
జవాబు:
బి) నయనం, బండిచక్రం

37. భాగ్యం పండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
ఎ) వర్షం, నీరు
బి) అదృష్టం, సంపద
సి) అవకాశం, అనంతం
డి) అకాలం, అనాగరికం
జవాబు:
బి) అదృష్టం, సంపద

వ్యుత్పత్తర్థాలు :

38. దుఃఖం వల్ల కన్నుల నుండి కారే నీరు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
ఎ) అశ్రువులు
బి) ఆశ్రమం
సి) అరణి
డి) వసుధ
జవాబు:
ఎ) అశ్రువులు

39. ధర్మము – దీనికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) ధరకు లొంగేది
బి) ధరించబడేది
సి) ధరచేత కూడినది.
డి) ధరణమును పొందునది
జవాబు:
బి) ధరించబడేది

వ్యాకరణాంశాలు

సంధులు :

40. కూరగాయలు తెచ్చారు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) కూరె + కాయ
బి) కూర + కాయ
సి) కూర + గాయ
డి) కూర + ఆయ
జవాబు:
బి) కూర + కాయ

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

41. పాలుదాగి – ఇందులోని సంధిని గుర్తించండి.
ఎ) గుణసంధి
బి) గసడదవాదేశ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) పూర్వరూప సంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి

42. పరుషములు అనగా –
ఎ) క చ ట త ప
బి) గ జ డ దలు
సి) న జ బ జ న
డి ) ప ద ని స
జవాబు:
ఎ) క చ ట త ప

43. క్రింది వానిలో సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) గుళోన్నతి
బి) విలాపాగ్నులు
సి) ఏకైక
డి) తల్లిదండ్రులు
జవాబు:
సి) ఏకైక

44. శ్రమైక జీవనం – గీత గీసిన పదాన్ని విడదీసి గుర్తించండి.
ఎ) శ్రమ + ఔక
బి) శ్రమ + ఏక
సి) శ్రమ + ఐక
డి) శ్రమ + ఓక
జవాబు:
బి) శ్రమ + ఏక

సమాసాలు :

45. రాజపూజితుడు పండితుడు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) రాజుకు పూజితుడు
బి) రాజునందు పూజితుడు
సి) రాజువలన పూజితుడు
డి) రాజుచేత పూజితుడు
జవాబు:
డి) రాజుచేత పూజితుడు

46. పేదలకు అన్యాయం జరుగకూడదు – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) న్యాయం కావాలి
బి) న్యాయం కానిది
సి) న్యాయమందు కూడినది
డి) న్యాయం కొరకు కానిది
జవాబు:
బి) న్యాయం కానిది

47. శివుడు జటాధారి – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
ఎ) పంచమీ తత్పురుష
బి) షష్ఠీ తత్పురుష
సి) చతుర్డీ తత్పురుష
డి) ద్వితీయా తత్పురుష
జవాబు:
డి) ద్వితీయా తత్పురుష

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

48. రాజభటుడు వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) ప్రథమా తత్పురుష
బి) చతుర్డీ తత్పురుష
సి) షష్ఠీ తత్పురుష
డి) తృతీయా తత్పురుష
జవాబు:
సి) షష్ఠీ తత్పురుష

49. చతుర్దీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) తిండిగింజలు
బి) పాపభీతి
సి) విద్యాహీనుడు
డి) శాస్త్ర నిపుణుడు
జవాబు:
ఎ) తిండిగింజలు

50. అగ్నిభయం ఎక్కువ – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) అగ్ని కొరకు భయం
బి) అగ్ని వలన భయం
సి) అగ్నిచేత భయం
డి) అగ్నియందు భయం
జవాబు:
బి) అగ్ని వలన భయం

51. ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసం గుర్తించండి.
ఎ) ద్వంద్వం
బి) షష్ఠీ తత్పురుష
సి) అవ్యయీభావ
డి) తత్పురుష
జవాబు:
డి) తత్పురుష

52. పంచమీ విభక్తి ప్రత్యయాలను గుర్తించండి.
ఎ) డు, ము, వు, లు
బి) వలన, కంటె, పట్టు
సి) కొరకు, కై
డి) అందు, న
జవాబు:
బి) వలన, కంటె, పట్టు

ణవిభజన :

53. మాత్రా ఛందస్సు గల సాహితీ ప్రక్రియ ఏది?
ఎ) దండకం
బి) గద్యం
సి) గేయం
డి) పద్యం
జవాబు:
సి) గేయం

54. UIU- ఇది ఏ గణం?
ఎ) త గణం
బి) ర గణం
సి) న గణం
డి) మ గణం
జవాబు:
సి) న గణం

వాక్యాలు :

55. ఆయన సంస్కృతం, తెలుగు, ఆంగ్లం నేర్చుకున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) సంక్లిష్ట వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) సామాన్య వాక్యం
జవాబు:
సి) సంయుక్త వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

56. కృష్ణ బొబ్బిలి వెళ్ళి ఇల్లు కట్టాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
బి) సంక్లిష్ట వాక్యం

57. రమ అందమైనది. రమ తెలివైనది – ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా గుర్తించండి.
ఎ) రమ తెలివైనది కావడంతో అందమైనది.
బి) రమ అందమైనది, తెలివైనది.
సి) రమ తెలివైనది, అందమైనది.
డి) రమ అందమైనది కావడంతో తెలివైనది.
జవాబు:
బి) రమ అందమైనది, తెలివైనది.

58. అందరు బడికి వెళ్ళాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) కొందరు బడికి వెళ్ళలేకపోవచ్చు.
బి) అందరు బడికి వెళ్ళకూడదు.
సి) అందరు బడికి వెళ్ళియుండవచ్చు.
డి) అందరు బడికి వెళ్ళి తీరాలి.
జవాబు:
బి) అందరు బడికి వెళ్ళకూడదు.

59. దొంగతనం చేయవద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) విధ్యర్థక వాక్యం
సి) నిషేధార్థక వాక్యం
డి) అభ్యర్థక వాక్యం
జవాబు:
సి) నిషేధార్థక వాక్యం

60. భవిష్యత్కాల అసమాపక క్రియను గుర్తించండి.
ఎ) అప్యర్థకం
బి) క్యార్థకం
సి) శత్రర్థకం
డి) చేదర్థకం
జవాబు:
డి) చేదర్థకం

61. దయతో అనుమతించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) శత్రర్థక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) ప్రార్థనార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
సి) ప్రార్థనార్థక వాక్యం

62. వానలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అభ్యర్థక వాక్యం
బి) శత్రర్థక వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) చేదర్థక వాక్యం
జవాబు:
డి) చేదర్థక వాక్యం

అలంకారాలు :

63. పొలాలు దున్నీ – హలాలు దున్ని – ఇందులోని అలంకారం గుర్తించండి.
ఎ) ఉపమ
బి) వృత్త్యనుప్రాస
సి) యమకం
డి) లాటానుప్రాస
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

64. కింది అలంకారాలలో పొసగని అలంకారం గుర్తించండి.
ఎ) ముక్తప్రదగ్రస్తం
బి) రూపక
సి) అంత్యానుప్రాస
డి) యమకం
జవాబు:
బి) రూపక

సొంతవాక్యాలు :

65. కార్మిక లోకం : సమస్త కార్మిక లోకం దేశ సౌభాగ్యం కోసం కృషి చేస్తుంది.

66. నవ్యకవిత్వం : శ్రీ శ్రీ గారు నవ్య కవిత్వం రాయడానికి సిద్ధపడినారు.

67. దాస్యం : బ్రిటిషు ప్రభుత్వంలో మనం దాస్యం అనుభవించాము.

68. కర్షక వీరులు : సమాజంలో కర్షకవీరులు నిరంతరం శ్రమిస్తారు.

69. విరామం : నిరంతరం పనిచేసేవారికి విరామం పొందాలి.

70. ఖరీదు : వస్తువుల ఖరీదు అధికంగా ఉన్నది.

71. ప్రపంచ భాగ్యం : ప్రపంచ భాగ్యం వెల్లి విరియడానికి మనం కృషి చేయాలి.

72. స్వర్ణవాయిద్యములు : తిరుమలలో స్వామివారికి స్వర్ణ వాయిద్యములు మ్రోగిస్తారు.

73. చిహ్నం : ఎన్నికల్లో అభ్యర్థులకు చిహ్నం ఇస్తారు.

74. ప్రణవం : వేదాల్లో ప్రణవం అతి ప్రధానమైనది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు.

AP State Syllabus 8th Class Telugu Important Questions 4th Lesson అజంతా చిత్రాలు

8th Class Telugu 4th Lesson అజంతా చిత్రాలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఆ) కింది అపరిచిత గద్యాలను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

*ఈ క్రింది వచనాలను చదివి వాటి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ‘మన ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాలో, నరసరావుపేటకు ఏడుమైళ్ళ దూరంలో “కోటప్పకొండ” ఉంది. ఆ కొండ మీద 600 అడుగుల ఎత్తున కోటేశ్వర స్వామి గుడి ఉంది. పూర్వపు శాసన ఆధారాలను బట్టి క్రీ.శ. 11వ శతాబ్దానికే ఈ గుడి ఉందని తెలుస్తోంది. ఈ కొండ ఎత్తు 1587 అడుగులు. ఈ కొండ చుట్టూ రాళ్ళ మధ్యలో చిన్న చిన్న నీటి గుంటలున్నాయి. వీనిని “దొనలు” అంటారు. ఈ కొండ మధ్యలో “పాపనాశనము” అనే తీర్థం ఉంది. ఇది శివుడు త్రిశూలంతో కొడితే ఏర్పడింది. దీనిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం.
ప్రశ్నలు :
1. కోటప్ప కొండ ఎక్కడ ఉంది?
జవాబు:
కోటప్పకొండ గుంటూరు జిల్లాలో, నరసరావుపేటకు ఏడుమైళ్ళ దూరంలో ఉంది.

2. కోటప్పకొండపై ఎవరి గుడి ఉంది ? అది ఎంత ఎత్తు?
జవాబు:
కోటప్పకొండపై కోటేశ్వరస్వామివారి గుడి ఉంది. ఆ కొండ 1587 అడుగుల ఎత్తు.

3. కోటప్పకొండ పైనున్న గుడి యొక్క ప్రాచీనత ఎట్టిది?
జవాబు:
ఈ గుడి క్రీ.శ. 11వ శతాబ్దానికి చెందినది. కొండ మధ్యలో పాపనాశనము అనే తీర్థం ఉంది. దీనిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం.

4. దొనలు అంటే ఏమిటి?
జవాబు:
కొండ చుట్టూ రాళ్ళ మధ్యలో చిన్న చిన్న నీటి గుంటలున్నాయి. వీటిని దొనలు అంటారు.

2. శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన భావ కవిత్వం పై తిరుగుబావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తరువాత విప్లవ కవిత్వమునకు స్ఫూర్తినిచ్చాడు. “అనితర సాధ్యం నా మార్గం” అని చాటిన ప్రజాకవి. “మహాప్రస్థానం” కావ్యం, “సిరిసిరి మువ్వ శతకం” శ్రీశ్రీకి మంచి కీర్తిప్రతిష్ఠలు సంపాదించి పెట్టాయి. ఆయన సమాజాన్ని చైతన్యపరిచే రచనలెన్నో చేశాడు. అందుకే సాహిత్య విమర్శకులు ఆయనను అభ్యుదయ కవిత్వానికి యుగకర్త అంటారు.
ప్రశ్నలు :
1. శ్రీశ్రీ అసలు పేరేమి?
జవాబు:
శ్రీరంగం శ్రీనివాసరావు.

2. ఆయన అభ్యుదయ భావాలు దేనికి స్ఫూర్తినిచ్చాయి?
జవాబు:
ఆయన అభ్యుదయ భావాలు విప్లవ కవిత్వానికి స్ఫూర్తినిచ్చాయి.

3. తన రచనాశైలి విషయంలో ఆయన ఏమని చాటుకొన్నాడు?
జవాబు:
‘అనితర సాధ్యం నా మార్గం’ అని శ్రీ శ్రీ తన రచనా శైలి విషయంలో చాటుకొన్నాడు.

4. శ్రీశ్రీకి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన రచనలు ఏవి?
జవాబు:
మహాప్రస్థానం అనే కావ్యం, సిరిసిరి మువ్వ అనే శతకం శ్రీశ్రీకి కీర్తిప్రతిష్ఠలు తెచ్చి పెట్టిన రచనలు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

3. జనపదం అంటే పల్లెటూరు. జనపదాలలో ఉండేవారు జానపదులు. జానపదులు పాడే పాటలు లేక గేయాలను జానపద గేయాలంటారు. వీటిని ఆంగ్లంలో ‘ఫోక్ సాంగ్స్’ అంటారు. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను లోక్ గీత్ లేదా లోక్ సాహిత్య అంటారు. జానపద సాహిత్యం సమిష్టి సంపద. శిష్ట సాహిత్యంలాగా కాక జానపద సాహిత్యం పలువురి చేతులలో పెరిగింది. ఇది దాని మొదటి లక్షణం. గేయ రచనా కాలం స్పష్టంగా ఉండకపోవడం మరో లక్షణం. నదీ నదాలు, వాగులు, వంకలూ మనకు ఉపయోగపడక సముద్రం పాలైనట్లే జానపద గేయస్రవంతి కూడా చాలా భాగం మనకు అందలేదు. జానపద సాహిత్యాన్ని భద్రపరచవలసిన అవసరం ఉన్నది.
ప్రశ్నలు :
1. జానపదులు అంటే ఎవరు?
జవాబు:
జనపదాల్లో ఉండేవారిని జానపదులు అంటారు.

2. ఉత్తర భారతదేశంలో జానపదాలను ఏమంటారు?
జవాబు:
ఉత్తర భారతదేశంలో జానపదాలను ‘లోక్ గీత్’ (లేదా) ‘లోక్ సాహిత్య’ అని అంటారు.

3. జానపద సాహిత్యం ప్రథమ లక్షణం ఏమిటి?
జవాబు:
సమిష్టి సంపదయై, పలువురి చేతులలో పెరుగుట జానపద సాహిత్య ప్రథమ లక్షణం.

4. ఆంగ్లములో జానపద గేయాల్ని ఏమంటారు?
జవాబు:
ఆంగ్లములో జానపద గేయాలను “ఫోక్ సాంగ్స్” అని అంటారు.

4. . మేధా సంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతమవుతుంది అనేది ఎంతయినా యథార్థం. ఒక దేశం యొక్క సంస్కృతి, వికాసం, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా, కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక యుగంలో విద్య మానవునికి ఒక ముఖ్యమైన జీవితావసరంగా కూడా మారింది. నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు ఒక ప్రాథమిక అవసరంగా భావించి వాటిని రాజ్యాంగంలో పొందుపరచడమైనది.
ప్రశ్నలు :
1. యథార్థమైనది ఏది?
జవాబు:
స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతమవుతుంది.

2. ఒక దేశ సంస్కృతి, ప్రగతి దేని మీద ఆధారపడి ఉంటుంది?
జవాబు:
ఒక దేశ సంస్కృతి, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

3. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక అవసరాలేవి?
జవాబు:
నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు అనే ప్రాథమిక అవసరాలు రాజ్యాంగంలో పొందుపరచ బడ్డాయి.

4. వైజ్ఞానిక వాస్తవం ఏమిటి?
జవాబు:
మేధాసంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం.

5. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. 1 – 2018-19)

ఈ గుహలను సమీపిస్తుంటే ఇటు పచ్చనికొండ, అటు పచ్చనికొండ. ఈ రెండు కొండల మధ్య ‘వాఘోరా’ నది రాళ్ళ గుట్టల గుండా జలజలా ప్రవహిస్తూ నది పాడుకొనే పాటలను వింటూ, నది అంచు వెంట కాలినడకన, గుహలకు చేరాలి. మీ పైన నీలాకాశం, మీమ్ము అలరిస్తూ అడవి పువ్వులు, మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు. గుహలను చేరేవరకు రెండు, మూడు మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలో అడుగు పెడితే, దానికి అదే ఒక ప్రపంచం.
ప్రశ్నలు
1. గుహల సమీపంలో ప్రవహిస్తున్న నది పేరేమిటి?
జవాబు:
వా ఘోరా నది

2. కణకణ, గడగడ ఇటువంటి పదాలను ధ్వన్యనుకరణ పదాలు అంటారు. పై పేరాలో అటువంటి పదం ఉంది. వెతికి రాయండి.
జవాబు:
జలజల

3. “పువ్వుల కమ్మని నెత్తావులు” అంటే ఏమిటి?
జవాబు:
పువ్వుల కమ్మని పరిమళాలు

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘మెలిక’ అంటే ఏమిటి?

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

6. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2017-18)

అజంతా చిత్రాలలో అధిక భాగం జాతక కథలే. సిద్ధార్థుడిగా జన్మించడానికి పూర్వం గౌతమబుద్దుడు కొన్ని వందల జన్మలు ఎత్తినాడని బౌద్ధవుతస్తుల నమ్మకం. పూర్వ జన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడిగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటున్నాయి. ఈ వివిధ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాలలో చూడవచ్చు. అయితే అజంతా చిత్రాలన్నీ జాతక కథలే కావు. జాతక కథలతో ఎలాంటి సంబంధం లేనివీ ఎన్నో ఉన్నాయి. వెలితిగా కాస్త చోటు కనబడితే చాలు దానిలో ఏ ఆకునో, రెమ్మనో, ఏ పువ్వునో చిత్రించి వేశారు. అదీ. ఇదీ కాకపోతే, ఆ కళా తపస్వులు తమ కుంచెతో అటోక గీతను, ఇటోక గీతను గీయడం ద్వారానే సౌందర్య సృష్టి చేశారు.
ప్రశ్నలు :
1. అజంతా చిత్రాలలో అధిక భాగం వేటిని గురించి తెలియజేశారు?
జవాబు:
జాతక కథలు

2. సిద్ధార్థుని జన్మ విషయంలో బౌద్ధ మతస్తుల నమ్మకం ఏమిటి?
జవాబు:
పూర్వం కొన్ని వందల జన్మలు ఎత్తాడని నమ్మకం.

3. కళాతపస్వులు సౌందర్య సృష్టి ఎలా చేసేవారు?
జవాబు:
వారు తమ కుంచెతో అటొక గీతను ఇటొక గీతను గీయడం ద్వారా సౌందర్య సృష్టి చేశారు.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జాతక కథలలోని విషయం ఏమిటి?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“అజంతా చిత్రాలు” పాఠ్యభాగ రచయితను గూర్చి వివరించండి.
జవాబు:
‘అజంతా చిత్రాలు’ పాఠ్యభాగ రచయిత నార్ల వేంకటేశ్వరరావు. ఈయన 1908 లో కృష్ణాజిల్లాలోని ‘కవుతరం’ అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు (అనువాద రచన), నరకంలో హరిశ్చంద్రుడు (నాటకం), నార్లవారిమాట (పద్య కావ్యం ) మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం, సమాజ
శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి. నార్లవారి రచన, సరళమైన శబ్దాలతో, సొగసైన భావాలతో సుందరశైలిలో సాగుతుంది.

ప్రశ్న 2.
వ్యూపాయింట్ గురించి రాయండి.
జవాబు:
వాఘోరా నది పుట్టినచోట కొండ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గుహలుంటాయి. రెండవ వంపు పైన వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనబడుతూ ఉంటుంది. దాన్ని ‘వ్యూపాయింట్’ అంటారు. కొన్ని శతాబ్దాలపాటు అజంతా గుహల గురించి లోకానికి తెలియదు. మేజర్ గిల్ అనే బ్రిటిష్ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి ఒక జంతువును తరుముకొంటూ కొండపైకి వెళ్ళాడు. ఎదురుగుండా చెట్ల సందులోనుంచి, ఒక చెక్కడపు పని అతనికి కనిపించింది. అతడు కొండ ఎక్కిచూస్తే అతనికి అజంతా గుహలలో పదహారవ దాని శిరోభాగం కనిపించినట్లు అర్థమయింది. లోకం మరచిపోయిన అజంతా గుహలను మేజర్ గిల్ ఏ ప్రదేశం నుంచి చూశాడో అదే “వ్యూపాయింట్”. చాలామంది సందర్శకులు వ్యూపాయింట్ కు వెళ్ళి అక్కడి నుండి అజంతా గుహలను చూస్తూ ఉంటారు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
అజంతా గుహల ద్వారా భారతీయ సాంఘిక వ్యవస్థ రూపాన్ని వివరించండి.
జవాబు:
ప్రాచీన కాలంలో భారతీయ సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేదో, అప్పటి వృత్తులు, వ్యాసంగాలు, వినోదాలు ఎలాంటివో తెలుసుకోవాలంటే అజంతా గుహలను చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు రాణ్మందిరాలు ఏ విధంగా ఉండేవి? రాజుల, రాణుల వేషభాష లేవి? రాజసభలను ఏవిధంగా తీర్చేవారు? అప్పటి సైనికబలం ఏ విధంగా ఉండేది? ఆనాటి ఆయుధాలేవి? – ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలిపేవి అజంతా గుహలే. అజంతా గుహలకు వెళితే భారత జాతీయ బలాలను సింహళం మీదకు దండయాత్రకు చేరవేసిన నౌకాదళాన్ని చూడవచ్చు. మహాసాగరాలను దాటి వెళ్ళిన భారతీయ వ్యాపారులను చూడవచ్చు. పర్ష్యన్ రాయబారులతో మాట్లాడే భారతీయ చక్రవర్తులను చూడవచ్చు. గౌతమ బుద్ధుని కారుణ్య సందేశం మానవ వికాసానికే కాక పశుపక్ష్యాదుల జీవితాన్ని సయితం ఎంత పునీతం చేసిందో, తేజోవంతం చేసిందో చూడవచ్చు. అందుచేత అజంతా గుహలను చూస్తే ఆనాటి భారతీయ సాంఘిక వ్యవస్థ ఎలాంటిదో తెలుస్తుంది.

ప్రశ్న 4.
“యాత్రా రచన” ప్రక్రియను పరిచయం చెయ్యండి. (S.A.I – 2019-20)
జవాబు:
రచయిత తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచనే యాత్రారచన. దీనిలో ఆ ప్రదేశం ప్రత్యేకత, ప్రకృతి రామణీయకత, చరిత్ర వంటి అంశాలుంటాయి. రచయిత ఆత్మాశ్రయ శైలిలో భావాలను తెలియజేస్తాడు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
అజంతా చిత్రాల్లోని బుద్ధుని జాతక కథల విశేషాలను తెల్పండి.
జవాబు:
అజంతా చిత్రాలలో అధికభాగం జాతక కథలే. గౌతమ బుద్ధుడు సిద్ధార్థునిగా జన్మించడానికి ముందు కొన్ని వందల జన్మలు ఎత్తినాడని, బౌద్ధులు నమ్ముతారు. ఆ పూర్వజన్మలలోని బుద్ధుని జీవిత చరిత్రలనే ‘జాతక కథలు’ అని పిలుస్తారు. బుద్ధుడు పూర్వజన్మలలో మానవ జన్మలనే కాకుండా, పక్షిరాజుగా, గజేంద్రునిగా ఎన్నెన్నో జన్మలు ఎత్తినట్లు జాతక కథలు తెలియజేస్తున్నాయి. ఈ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాల్లో చూడగలము.

మానవుల పట్ల బౌద్ధులకు ఎంత నిరసన పూర్వకమైన అభిప్రాయముందో, వారు చిత్రించిన జాతక కథలు తెలుపుతాయి. అటువంటి కథలలో ఇది యొకటి.

జాతక కథ :
అడవిగుండా వెడుతున్న ఒక బాటసారి, ఒక గుంటలో పడిపోతాడు. అతనిపై జాలిపడి, ఒక కోతి అతడిని రక్షిస్తుంది. వాడు ఆ కోతి తనకు చేసిన మేలు మరచిపోయి, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. వెంటనే కోతులన్నీ అతడిని ముట్టడిస్తాయి. అతడు భయపడి, తనని మన్నించుమని, ప్రాధేయపడతాడు. ఇక ముందైనా బుద్ధి కలిగియుండమని కోతులు అతడిని విడిచి పెడతాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 2.
అజంతా గుహల్లో వ్యక్తమయ్యే స్త్రీల సౌందర్యాన్ని వివరించండి.
జవాబు:
అజంతా గుహలలో బౌద్ధభిక్షువులు స్త్రీల సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రించారు. అందుకే జవహర్ లాల్ నెహ్రూ గారు ‘అజంతా’ మన మనస్సును ఏదో కలల లోకానికి తీసుకొని వెడుతుందని చెప్పారు. అజంతా అతి వాస్తవికమైన లోకమని చెప్పారు. బుద్ధుడు శిష్యులకు “స్త్రీలకు దూరంగా ఉండండి. వారిని కన్నెత్తి కూడా చూడవద్దు” అని చెప్పినా, బౌద్ధభిక్షువులు అజంతా గుహల్లో అందాలు ఒలుకుతున్న స్త్రీలు అశేషంగా ఉన్నారని నెహ్రూగారు చెప్పారు.

అక్కడ రాజకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు వంటి స్త్రీలు ఎక్కడ చూసినా ఉన్నారు.

అందులో కొందరు కూర్చున్నవారు, కొందరు నిలబడి ఉన్నవారు, కొందరు ముస్తాబు చేసేవారు, కొందరు ఊరేగింపుగా వెడుతున్నవారు ఉన్నారు. ఈ అజంతా స్త్రీలు ఎంతగానో పేరు పొందారు. సన్యసించిన వారైనా ఈ చిత్రకారులు, ఈ స్త్రీలను ఎంతో సౌందర్యవంతులుగా చిత్రించారు. అజంతా గుహలలో మహారాణులే కాక, సమస్త వర్ణాలకు చెందిన స్త్రీలూ చిత్రింపబడ్డారు. ఆనాటి రాణుల మందిరాలనూ, రాణుల వేషాలను చిత్రించిన ఆ చిత్రకారుల ప్రతిభను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ప్రశ్న 3.
వాఘోరానది పుట్టుక, విశేషాలను తెలపండి.
జవాబు:
అజంతా గుహలకు వెళ్ళే దారిలో అటొక కొండ, ఇటొక కొండ ఉంటాయి. అందులో ఒక కొండమెలికే, వాఘోరానది యొక్క జన్మస్థానం. కొండమీద ఏడుకొలనులు ఉంటాయి. ఒక కొలను నుండి నీరు మరొక కొలనుకు జాలువారుతూ, 250 అడుగుల ఎత్తునుంచి పెద్ద ధారగా, కొండ దిగువకు వాఘోరానది దూకుతుంది. అలా దూకిన తరువాత, కొండ ఎన్ని మలుపులు తిరుగుతుందో, తానూ అన్ని మలుపులు తిరుగుతూ, సమతల ప్రదేశానికి చేరి, కొన్ని వందల మైళ్ళు ప్రవహించి, వాఘోరానది తపతిలో కలిసిపోతుంది.

వాఘోరానది వెంట వెళుతుంటే, రాళ్ళగుట్టల గుండా జలజల ప్రవహిస్తూ ఆ నది పాడే పాటలు వినిపిస్తాయి. పైన నీలాకాశమూ, అలరించే అడవి పువ్వులూ, ఆ పువ్వుల కమ్మని సువాసనలూ మరొక లోకంలో మనల్ని విహరింపచేస్తాయి. ఇటుకొండ, అటుకొండ, ముందుకొండ, వెనుకకొండ, పైన కొండ – ప్రక్కన వారానది – నీలాకాశం – నీలాలనీళ్ళు — పచ్చని చెట్లు – కమ్మని సువాసనలు – అదొక భూలోక స్వర్గం అనిపిస్తుంది.

వాఘోరా నది పుట్టిన చోట, కొండ అర్ధచంద్రాకారంగా ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గుహలుంటాయి. మరొక వంపులో వలయాకారంలో ఒక కట్టడం ఉంటుంది. దానిని ‘వ్యూ పాయింట్’ అంటారు.

ప్రశ్న 4.
నార్ల వారి అనుభూతిని గురించిన వర్ణనను వివరించండి.
జవాబు:
చూచిన ఒక దృశ్యాన్ని వర్ణించడం సులభం కావచ్చు కాని ఒక అనుభూతిని వర్ణించడం సులభం కాదు.

ఇరుకుగా ఉండే ఇంటిని వదలి, ఇరుకుగా ఉండే వీధుల వెంట నడిచి, అపారమైన సముద్రపు తీరంలో నిలిచినప్పుడు పొందే అనుభూతిని, పరిమిత జీవితాలలోని పరిమిత సమస్యలతో కంటికి నిద్ర దూరమయినప్పుడు, ఆకాశంలోని అనంతమైన నక్షత్రాలను చూచినప్పుడు, పొందే అనుభూతిని వర్ణించడం సులభం కాదు.

అదేవిధంగా జీవనోపాధి కోసం పగలంతా పాట్లు పడి, విసిగి వేసారి ఇంటికి చేరినప్పుడు, గడపలోనే కేరింతలు కొడుతూ కాళ్ళకు అడ్డంపడే తన ముద్దు బిడ్డను ఎత్తుకొన్నప్పుడు పొందే అనుభూతిని, పచ్చనిచెట్టును, పచ్చికబయలును చూసే అవకాశం లేని బస్తీలో బ్రతికే మనిషి గాలికి తలలూపుతూ, దిక్కులను అంటుకుంటున్నట్లు కనిపించే వరిచేలను చూచినప్పుడు పొందే అనుభూతిని వర్ణించడం సులభం కాదు.

హృదయాన్ని ఊపివేసే ఏ అనుభూతిని గాని, జీవితాన్ని కదిలించే ఏ అనుభూతిని గాని వర్ణించడం సులభం కాదు.

ప్రశ్న 5.
అజంతా గుహలలోని చిత్రాల గురించి విదేశీయుల అభిప్రాయాలను తెలపండి.
జవాబు:
అజంతా గుహలను ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలటరీ ఆఫీసర్. వ్యూపాయింట్ నుండి చూస్తే చెక్కడపు పని కనిపించడంతో ఆయన కొండపైకి వెళ్ళి అజంతా గుహలను చూసి లోకానికి తెలియజేశాడు.

మేజర్ గిల్ ముప్పయి సంవత్సరాలపాటు కష్టపడి అజంతా చిత్రాలకు కాపీలను తయారుచేసుకొన్నాడు. వాటిలో కొన్ని అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. మిగిలిన వాటికి జాన్ గ్రిఫిల్మ్ కాపీలు తయారుచేయించాడు. కాని అవి కూడా అగ్నిప్రమాదంలో బూడిదయ్యాయి. మేజర్ గిల్ కు జాన్ గ్రిఫికు అజంతా చిత్రాలంటే అమిత మక్కువని దీనిని బట్టి అర్థమవుతుంది.

ఫెర్గుసన్ అనే విదేశీయుడు ఫైజాల్, ఆర్కాన్యాజా ఇటలీలో తలెత్తడానికి ముందు అజంతా చిత్రాలకు సాటిరాగల చిత్రాలు యూరప్లో లేవని చెప్పాడు.

గ్రీఫ్ త్న్ అనే మరో విదేశీయుడు 26 అజంతా చిత్రాలకు సాటిరాగల చిత్రాలు యూరప్ లో ఉన్నవి అన్నాడు. ఫోరె టైన్ మరింత రేఖావిన్యాసాన్ని ప్రదర్శించినా, వెనాసియన్ మరింత వర్ల వైశిష్యాన్ని చూపినా మరణం ఆసన్నమైన రాకుమారి భావాలను మరింత ప్రభావవంతంగా వారు చూపడం వారికి సాధ్యపడేది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. కొండను తొలిచి, ఆ గుహలలో మలచిన ఆ ఆలయాలలోని చిత్రాలను చూచి రోడౌన్ సైల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

విన్ సెంట్ స్మిత్ అనే విదేశీయుడు అజంతా గుహలలోని చిత్రాలను గీసినవారు పర్ష్యన్ చిత్రకారులు కావచ్చని అన్నాడు.

ప్రశ్న 6.
అజంతా గుహలలో ఎన్నో బుద్ధుడి చిత్రాలు ఉన్నాయి. అజంతా గుహలకు – జాతక కథలకు ఉన్న సంబంధం ఏమిటో వివరించండి. (S.A. III – 2015-16)
జవాబు:
అజంతా చిత్రాలలో అధికభాగం జాతక కథలే. సిద్ధార్థుడుగా జన్మించడానికి పూర్వం గౌతమ బుద్ధుడు కొన్ని వందల జన్మలెత్తాడని బౌద్ధమతస్థుల నమ్మకం. పూర్వజన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడుగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటాయి. ఈ వివిధ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాలలో చూడవచ్చు.

బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని, ఆయన అంత గంభీరమూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను, ఈ జగత్తును చిత్రించడంలో ఈ కుడ్య చిత్రాలను చిత్రించిన బౌద్ధభిక్షువులు చూపించారు. అజంతా గుహలు మొత్తం 29. వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే, మిగిలినవి బౌద్ధ విహారాలు. గౌతమబుద్ధుని కారుణ్య సందేశం కేవలం మానవుని వికాసానికే కాక పశు పక్ష్యాదుల జీవితాన్ని సైతం ఎంత పునీతం చేసిందో, తేజోవంతం చేసిందో ఇక్కడ చూడవచ్చు.

బుద్ధుని బోధనలకు ప్రేరేపితులైన ఆయన శిష్యులు బుద్ధుని నిర్యాణానంతరం బౌద్ధమత వ్యాప్తికై బుద్ధుని బోధనలు ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా కొందరు అజంతా గుహలను, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను లక్ష్యంగా బుద్ధుని భావాలను ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దారు. ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయత వారికి ఇంకా కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు. బుద్ధుని పట్ల ఉన్న భక్తి వారిచేత అజంతా గుహలను అంత అందంగా తీర్చిదిద్దేటట్లు చేసింది.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
శిల్పిని గురించి ఆత్మకథ రాయండి. దీన్ని ఏకపాత్రాభినయంగా రాయండి.
జవాబు:
నేను మీకు తెలుసా ! నేను రాళ్ళను బొమ్మలుగా చెక్కే శిల్పిని. నేను రాళ్ళను దేవుడి బొమ్మలుగా చెక్కితే, మీరు వాటిని పసుపు కుంకాలతో పూజిస్తున్నారు. పూర్వం మహారాజులు మాకు ఎంతో డబ్బు ఇచ్చి దేవాలయాల్లో శిల్పాలు చెక్కించేవారు. మీరు మేము చెక్కిన నంది విగ్రహాలూ, నాట్య ప్రతిమలూ లొట్టలు వేసుకుంటూ చూస్తారు. చూసినంత సేపూ ఓహో, ఆహా అని అంటారు. కానీ మీలో ఏ ఒక్కరూ నన్ను పోషించరు. మరి నన్ను ఎవరు చూస్తారు ? దేవుడు బొమ్మలు చెక్కే నాకు, ఇంక దేవుడే దిక్కు. నేను సంగీతం వచ్చే స్తంభాలు చెక్కాను. అందమైన స్త్రీమూర్తులను చెక్కాను. నా శిల్పాన్ని పోషించిన రాజులను మీరు రాజుల సొమ్ము రాళ్ళపాలన్నారు. కాని నా శిల్పాలు శాశ్వతంగా నిలుస్తాయి.

ప్రశ్న 2.
శిల్పం, సంగీతం ………. ఇలాంటి వాటికి సంబంధించిన అదనపు సమాచారం లేదా చిత్రాలు సేకరించండి. వాటిని గురించి రాయండి.
జవాబు:
కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం అనేవి లలితకళలు :

ఎ) ప్రపంచ ప్రసిద్ధుడైన చిత్రలేఖన కళాకారుల వివరాలు :

1) వడ్డాది పాపయ్య :
ఆంధ్రదేశంలో శ్రీకాకుళంలో 1921లో పుట్టాడు. ఈయన భారతదేశం గర్వించదగ్గ చిత్రకారుడు. ఈయన తొలి గురువు తండ్రి. తరువాత గురువు రవివర్మ. చందమామ, ఆంధ్రపత్రిక వంటి పత్రికల్లో చిత్రాలు గీశారు. ఈయన చిత్రాలలో తెలుగుదనం, తెలుగు సంస్కృతి ఆచారవ్యవహారాలు, పండుగలకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు.

2) లియోనార్డో డావిన్సి :
ఈయన ఇటలీ దేశస్థుడు. ఈయన ‘మొనాలిసా’ చిత్రాన్ని గీశాడు. ఈ చిత్రాన్ని ఎవరు చూసినా మంత్ర ముగ్ధులవుతారు. ఇప్పుడు ఈ చిత్రం పారిస్ నగరంలో ‘టాఫ్స్’ అనే వస్తు ప్రదర్శనశాలలో ఉంది.

3) పాబ్లో పికాసో (1881 – 1973) :
పికాసో 20వ శతాబ్దిలోని చిత్ర కళాకారులలో మిక్కిలి ప్రసిద్ధుడు. 1901లో ఈయన చిత్రించిన “తల్లి ప్రేమ (మాతా, శిశువు)” చిత్రం అద్భుత కళాఖండం. తన బుగ్గను శిశువు తలకు ఆనించి, కళ్ళు మూసి తన్మయత్వం చెందుతున్న తల్లి చిత్రం ఇది.

4) రాజా రవివర్మ :
దేవుడు మనిషిని సృష్టించాడు. ఆ మనిషి దేవుణ్ణి చిత్రించి మనుషులకు ఇచ్చాడు. గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళను తన చిత్రకళ ద్వారా ఇళ్ళకు తెచ్చిన ఘనత రాజా రవివర్మకు దక్కుతుంది. రవివర్మ చిత్రించిన దేవుళ్ళ బొమ్మలు ప్రసిద్ధి పొందాయి. ఈయన చిత్రించిన కావ్యస్త్రీలందరిలో దమయంతి గొప్ప అందాల రాశి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
విహారయాత్రను గూర్చి స్నేహితునికి / స్నేహితురాలికి లేఖ.
జవాబు:

లేఖ

నిడదవోలు,
x x x x x x x x

ప్రియమైన స్వప్నకు,

శుభాకాంక్షలతో శశిరేఖ రాయునది.
నేను గడచిన సెలవులలో హైదరాబాదు విహారయాత్ర చేసి వచ్చాను. అక్కడ చూడాల్సిన వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాలార్జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, నెహ్రూ జంతుప్రదర్శనశాల (జూ), చార్మినార్, బిర్లా మందిర్, అసెంబ్లీ హాల్, గోలకొండ మొదలైనవి చూసి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాల సౌందర్యాన్ని అందరూ తప్పక చూడవలసిందే. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యపట్టణమైన హైదరాబాదును నీవు కూడా దర్శించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
శశిరేఖ.

చిరునామా :
కె. స్వప్న,
7వ తరగతి, జిల్లా పరిషత్ హైస్కూలు,
ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా.

ప్రశ్న 4.
దర్శనీయ స్థలాలలో “అజంతా గొప్పది” అని నిరూపిస్తూ మీ పాఠం ఆధారంగా రాయండి. (S.A. II – 2018-19)
జవాబు:
దర్శనీయ స్థలాల్లో ‘అజంతా గొప్పది’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతీయ చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలు ఎన్నో అజ్ఞానం, నిర్లక్ష్యం, స్వార్థాల వల్ల పాడైపోతున్నాయి.

మనదేశంలో దర్శనీయ స్థలాలు అనగానే మొదట గుర్తుకు వచ్చేది అజంతా గుహలే. ప్రాచీనకాలంలో భారతీయ సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేదో, అప్పటి వృత్తులు, వ్యాసాంగాలు, వినోదాలు ఎలాంటివో తెలుసుకోవాలంటే అజంతా గుహలను చూస్తే తెలుస్తుంది. ఒకప్పటి రాజుల, రాణుల వేషభాషలు, రాజసభలు, సైనికబలం, ఆయుధాలు ఇవన్నీ అజంతా గుహల ద్వారా తెలుస్తాయి. ఇంకా నౌకాదళాన్ని, సాగరాలు దాటిన భారతీయ వ్యాపారులను, పర్ష్యన్ రాయబారులతో మాట్లాడిన భారతీయ చక్రవర్తులను, గౌతమబుద్ధుని సందేశాలను చూడవచ్చు.

అజంతా గుహల్లో బౌద్ధ భిక్షువులు స్త్రీల సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అందుకే జవహర్‌లాల్ నెహ్రూ ‘అజంతా’ మన మనస్సును ఏదో కలల లోకానికి తీసుకువెళుతుందని, అజంతా అతి వాస్తవికమైన లోకమని చెప్పారు. అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతుంది.

అందుకే అజంతా దర్శనీయ స్థలాలలో గొప్పదని చెప్పవచ్చు.

8th Class Telugu 4th Lesson అజంతా చిత్రాలు 1 Mark Bits

1. అరకులోయ ప్రకృతి సౌందర్యం అద్భుతం (విగ్రహవాక్యం గుర్తించండి) (S.A. I – 2019-20)
ఎ) ప్రకృతి దైన సౌందర్యం
బి) ప్రకృతి కొఱకు సౌందర్యం
సి) ప్రకృతి యొక్క సౌందర్యం
డి) ప్రకృతి చేత సౌందర్యం
జవాబు:
సి) ప్రకృతి యొక్క సౌందర్యం

2. ప్రజలు శాంతిని కోరుతున్నారు (సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) ప్రజలు శాంతిని కోరడం లేదు
బి) ప్రజలచే శాంతి కోరబడుచున్నది
సి) శాంతిని ప్రజలు కోరుచున్నారు
డి) శాంతి చేత ప్రజలు కోరుతున్నారు.
జవాబు:
బి) ప్రజలచే శాంతి కోరబడుచున్నది

3. అజంతా చిత్రాలు అగ్నిలో బూడిద పాలైనాయి. (పర్యాయపదాలు గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) బూడిద, బుగ్గి
బి) వహ్ని, నిప్పు
సి) నీరు, జలము
డి) గృహము, ఇల్లు
జవాబు:
బి) వహ్ని, నిప్పు

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

4. అజంతాలోని గుహలగోడల పై బుద్ధుని కుడ్య చిత్రాలున్నాయి. (సమాసాన్ని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) పంచమీ
బి) షష్టీ
సి) సప్తమీ
డి) ప్రథమ
జవాబు:
బి) షష్టీ

5. ప్రజలు పుస్తకాలు చదివారు. (కర్మణి వాక్యాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) పుస్తకాలు ప్రజలను చదివాయి.
బి) చదవడం వల్ల ప్రజలు బాగుపడ్డారు.
సి) పుస్తకాలచేత ప్రజలు చదవబడ్డారు.
డి) ప్రజలచేత పుస్తకాలు చదవబడ్డాయి.
జవాబు:
డి) ప్రజలచేత పుస్తకాలు చదవబడ్డాయి.

6. సముద్రాన్ని వార్ధి అని కూడా అంటారు. గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) సంద్రం
బి) ఇంద్రం
సి) చంద్రం
డి) బృందం
జవాబు:
ఎ) సంద్రం

7. జాతీయాలకు సరిపోయే అర్థం గ్రహించి సరైన సమాధానం కింద గీత గీయండి. దొంగలు అజంతా గుహలో తలదాచుకున్నారు. (S.A. III – 2015-16)
ఎ) నివసించారు.
బి) వస్తువులు దాచుకున్నారు.
సి) తలను దాచుకున్నారు.
డి) ఆశ్రయం పొందారు.
జవాబు:
ఎ) నివసించారు.

భాషాంశాలు – పదజాలం

అర్ధాలు :

8. మేఘాలు ఆవరించాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆవరించాయి
బి) కప్పివేశాయి
సి) కనిపించాయి
డి) గోచరించాయి
జవాబు:
బి) కప్పివేశాయి

9. కొలనులో తామరలు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంబుధి
బి) జలధి
సి) సరస్సు
డి) సాగరం
జవాబు:
సి) సరస్సు

10. విహారయాత్రపై కుతూహలం ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆసక్తి
బి) అనాసక్తి
సి) గోచరించు
డి) దర్శించు
జవాబు:
ఎ) ఆసక్తి

11. రామాయణం ఆది కావ్యం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంతిమ
బి) మొదటి
సి) చివరి
డి) మధ్యకు
జవాబు:
బి) మొదటి

12. మన అస్తిత్వం కోల్పోకూడదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఉనికి
బి) ఊపిరి
సి) ఊరు
డి) ఉసురు
జవాబు:
ఎ) ఉనికి

13. స్త్రీలు ముస్తాబు అవుతున్నారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తిరస్కారం
బి) ఆస్కారం
సి) పరిష్కారం
డి) అలంకారం
జవాబు:
డి) అలంకారం

14. కుడ్యం పై చిత్రాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) గోడ
బి) ఇల్లు
సి) వాకిలి
డి) వారిధి
జవాబు:
ఎ) గోడ

పర్యాయపదాలు :

15. రాజు రాజ్యం పాలించాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పురోహితుడు, అమాత్యుడు
బి) ప్రభువు, నృపతి
సి) నరపతి, సురపతి
డి) క్షితీశుడు, జాలరి
జవాబు:
బి) ప్రభువు, నృపతి

16. ఆకాశంలో తారలు ఉన్నాయి- గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) నభం, నింగి
బి) విరులు, సుమం
సి) దివి, దానవం
డి) వరి, గది
జవాబు:
ఎ) నభం, నింగి

17. సరస్సులో జలం ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సముద్రం, క్షీరం
బి) నీరం, సుధ
సి) అవని, జలధి
డి) వారి, ఉదకం
జవాబు:
డి) వారి, ఉదకం

18. సముద్రం అనంతం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) క్షీరం, నీరం
బి) సాగరం, అంబుధి
సి) జలధి, జాగరణ
డి) అంబుధి, వారి
జవాబు:
బి) సాగరం, అంబుధి

19. పూల తావి మధురం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) అంతరంగం, తాపత్రయం
బి) పరిమళం, సువాసన
సి) పరితపించు, తనివి
డి) ఆకాశం, అవరోధం
జవాబు:
బి) పరిమళం, సువాసన

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

20. కొండ పై నది ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పర్వతం, నగం
బి) శిఖరం, సమున్నది
సి) గాలి, మారుతం
డి) కొడవలి, కోరుడం
జవాబు:
ఎ) పర్వతం, నగం

21. సముద్రాలలోని కెరటం భయానకం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వర్చస్సు, మేధస్సు
బి) తరంగం, అల
సి) మిత్రుడు, గోల
డి) సరస్సు, శిరస్సు
జవాబు:
బి) తరంగం, అల

ప్రకృతి – వికృతులు :

22. సంతోషంగా ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సంతసం
బి) సంబరం
సి) సంబురం
డి) సంబారం
జవాబు:
ఎ) సంతసం

23. ఇంతిని గౌరవించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) మహిళ
బి) స్త్రీ
సి) శ్రీ
డి) వనిత
జవాబు:
బి) స్త్రీ

24. తెలుగు భాష లెస్స – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) బస
బి) బాస
సి) బోస
డి) బైస
జవాబు:
బి) బాస

25. యాత్ర చేశాము – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) యాతర
బి) జేతర
సి) జోతర
డి) జైతర
జవాబు:
ఎ) యాతర

26. పక్షి ఎగిరింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) పచి
బి) పచ్చి
సి) పక్కి
డి) విహంగం
జవాబు:
సి) పక్కి

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

27. పూవు వికసించింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) పూజ
బి) పుష్పం
సి) కుసుమం
డి) జలం
జవాబు:
బి) పుష్పం

28. గోడ చిత్రాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) గహ్వర
బి) గవాక్షం
సి) కుడ్యం
డి) శిఖరం
జవాబు:
సి) కుడ్యం

29. మానవులు కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) కీరితి
బి) కిరితి
సి) కరితి
డి) కృతి
జవాబు:
ఎ) కీరితి

30. చిత్రం బాగుంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) చెత్తరువు
బి) చిత్తరువు
సి) చిక్కరువు
డి) చిత్తవు
జవాబు:
బి) చిత్తరువు

31. ప్రజ్ఞ ఇంటికి వెళ్ళింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) పగై
బి) పజ
సి) గజ
డి) జయీ
జవాబు:
ఎ) పగై

32. వేసము వేశాము – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) ధరష
బి) వేషము
సి) వషము
డి) ధృతము
జవాబు:
బి) వేషము

33. దిస్ట్రి తగిలింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) దిష్టి
బి) దృతి
సి) ధృతి
డి) దోష్టి
జవాబు:
ఎ) దిష్టి

నానార్థాలు :

34. దేవుడే దిక్కు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) దెస, దైవం, దాపరికం
బి) శరణు, రక్ష, అంబోధి
సి) శరణు, శతం, శాంకరి
డి) దిస, రక్షణ, పక్షం
జవాబు:
డి) దిస, రక్షణ, పక్షం

35. ఉత్తరం రాశాను – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ఉత్తరం, వేరుణ
బి) లేఖ, సమాధానం
సి) కాలం, విచారం
డి) ప్రశ్న, జవాబు
జవాబు:
బి) లేఖ, సమాధానం

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

36. వర్షం కురిసింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వాస, సంవత్సరం
బి) మాసం, సంవత్సరం
సి) వాన, వాగ్యుద్ధం
డి) సమరం, వాన
జవాబు:
ఎ) వాస, సంవత్సరం

37. తపస్వి వెళ్ళాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ముని, నారదుడు
బి) చంద్రుడు, చంచలం
సి) చారిత్రం, చరితం
డి) పులుగు, పయోధి
జవాబు:
బి) చంద్రుడు, చంచలం

వ్యుత్పత్త్యర్థాలు :

38. ‘పక్షి’ – దీనికి వ్యత్పత్తి ఏది?
ఎ) పక్షములు కలది
బి) పక్కములు లేనిది
సి) పయస్సు కలది
డి) పరువం కలది
జవాబు:
ఎ) పక్షములు కలది

39. సంతోషింపచేయువాడు – అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) సర్వం సహా
బి) చంద్రుడు
సి) శుక్రుడు
డి) ధరణి
జవాబు:
బి) చంద్రుడు

40. మహిని పాలించువాడు – అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) మహీపాలుడు
బి) మహాత్ముడు
సి) మహనీయుడు
డి) మహీధరము
జవాబు:
ఎ) మహీపాలుడు

41. సగరపుత్రులచే తవ్వబడినది – ఈ వ్యుత్పత్తి గల పదం గుర్తించండి.
ఎ) సారధి
బి) సాధికారత
సి) జలధి
డి) సాగరం
జవాబు:
డి) సాగరం

వ్యాకరణాంశాలు

సంధులు :

42. నీలాకాశం మనోహరం – ఇది ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) గుణసంధి
సి) త్రికసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

43. క్రింది వానిలో యడాగమ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) లేకుండెను
బి) తలయెత్తు
సి) అమ్మమ్మ
డి) ఊరెల్ల
జవాబు:
బి) తలయెత్తు

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

44. పక్ష్యాదులు ఉన్నాయి – గీత గీసిన పదానికి విడదీయడం గుర్తించండి.
ఎ) పక్షి + అదులు
బి) పక్షే + యాదులు
సి) పక్షి + ఆదులు
డి) పక్ష్మ + ఆదులు
జవాబు:
సి) పక్షి + ఆదులు

45. క్రింది వానిలో వికల్ప సంధిని గుర్తించండి.
ఎ) గుణసంధి
బి) అత్వసంధి
సి) గసడదవాదేశ సంధి
డి) ఇత్వసంధి
జవాబు:
డి) ఇత్వసంధి

46. చెట్టుగాని – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) త్రికసంధి
సి) గసడదవాదేశ సంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
సి) గసడదవాదేశ సంధి

47. క్రింది వానిలో పుంప్వాదేశ సంధికి ఉదాహరణ ఏది?
ఎ) చెక్కడపు పని
బి) చెక్కపని
సి) చిలుకజోస్యం
డి) మహోన్నతం
జవాబు:
ఎ) చెక్కడపు పని

48. సర్వోత్తమంగా ఉంది – దీనిని విడదీస్తే
ఎ) సర్వ + ఉత్తమం
బి) సర్వో + త్తమం
సి) సర్వ + ఆత్తమ
డి) సర్వే + ఉత్తమ
జవాబు:
ఎ) సర్వ + ఉత్తమం

సమాసాలు :

49. ప్రకృతి సౌందర్యం పరవసింపజేసింది – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం ఏది?
ఎ) ప్రకృతి యొక్క సౌందర్యం
బి) ప్రకృతితో సౌందర్యం
సి) ప్రకృతి కొరకు సౌందర్యం
డి) ప్రకృతియైన సౌందర్యం
జవాబు:
ఎ) ప్రకృతి యొక్క సౌందర్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

50. నది యొక్క ప్రవాహం – దీనికి సమాసపదం గుర్తించండి.
ఎ) జలనది
బి) నదీప్రవాహం
సి) నద్వజలం
డి) అమజలం
జవాబు:
బి) నదీప్రవాహం

51. భక్తి శ్రద్ధలు ఉండాలి – ఇది ఏ సమాసం?
ఎ) ద్విగు సమాసం
బి) కర్మధారయ సమాసం
సి) ద్వంద్వ సమాసం
డి) తత్పురుష సమాసం
జవాబు:
సి) ద్వంద్వ సమాసం

52. సప్తమీ తత్పురుషమునకు ఉదాహరణ గుర్తించండి.
ఎ) కుడ్య చిత్రాలు
బి) ప్రకృతి సౌందర్యం
సి) నలుదిక్కులు
డి) తల్లిదండ్రులు
జవాబు:
ఎ) కుడ్య చిత్రాలు

53. షష్ఠీ తత్పురుషమునకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) కర్మణి వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) దశకంఠుడు
డి) ముజ్జగములు
జవాబు:
ఎ) కర్మణి వాక్యం

54. అగ్ని ప్రమాదం జరిగింది – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) అగ్ని వలన ప్రమాదం
బి) అగ్నికి ప్రమాదం
సి) అగ్ని యందు ప్రమాదం
డి) అగ్ని కొరకు ప్రమాదం
జవాబు:
ఎ) అగ్ని వలన ప్రమాదం

55. సంఖ్యా శబ్దం – పూర్వంగా కలిగిన సమాసం గుర్తించండి.
ఎ) పంచమీ తత్పురుష
బి) ద్విగు సమాసం
సి) రూపకం
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
బి) ద్విగు సమాసం

56. ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం గుర్తించండి.
ఎ) తత్పురుష సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహుప్రీహి సమాసం
డి) అవ్యయీభావ సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

57. పచ్చిక బయలు – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) పచ్చిక యందు బయలు
బి) పచ్చిక వలన బయలు
సి) పచ్చిక కొరకు బయలు
డి) పచ్చికతో బయలు
జవాబు:
డి) పచ్చికతో బయలు

గణ విభజన:

58. అజంత – ఇది ఏ గణము?
ఎ) జ గణం
బి) త గణం
సి) న గణం
డి) మ గణం
జవాబు:
ఎ) జ గణం

59. చిత్తము – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UIU
బి) UII
సి) IUI
డి) III
జవాబు:
బి) UII

60. వ్యవధి – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UII
బి) IUI
సి) UUU
డి) II
జవాబు:
డి) II

61. IIUI – ఇది ఏ గణము?
ఎ) భగ
బి) సల
సి) నల
డి) గగ
జవాబు:
బి) సల

వాక్యాలు :

62. ప్రజల చేత శాంతి కోరబడింది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నీవార చరిత్ర
బి) పినాకపాణి
సి) అత్మార్థక వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
ఎ) నీవార చరిత్ర

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

63. వానలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అభ్యర్థక వాక్యం
బి) ధాత్వర్థక వాక్యం
సి) క్వార్థక వాక్యం
డి) చేదర్థక వాక్యం
జవాబు:
డి) చేదర్థక వాక్యం

64. పాలు తెల్లగా ఉండును – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) చేదర్థక వాక్యం
సి) శత్రర్థక వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
ఎ) తద్ధర్మార్థక వాక్యం

65. స్వాతంత్ర్యం పొందాలి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) అప్యర్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
ఎ) విధ్యర్థక వాక్యం

66. మీరు పాఠం విన్నారు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) మీరు పాఠం శ్రద్ధగా వినలేదు గదా !
బి) మీరు పాఠం వినలేదు.
సి) మీరు పాఠం వినకపోవచ్చు.
డి) మీరు విని తీరాలి.
జవాబు:
బి) మీరు పాఠం వినలేదు.

అలంకారాలు :

67. అర్థ భేదం లేకపోయినా తాత్పర్య భేదం కలిగిన అలంకారం ఏది?
ఎ) లాటానుప్రాస
బి) యమకం
సి) వృత్త్యనుప్రాస
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
ఎ) లాటానుప్రాస

68. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) ఉపమ
బి) వృత్త్యనుప్రాస
సి) యమకం
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

69. మానవా ! నీ ప్రయత్నం మానవా! – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) యమకం
బి) ముక్తపదగ్రస్తం
సి) అంత్యానుప్రాస
డి) పరికరం
జవాబు:
ఎ) యమకం

70. ‘ఉత్ప్రేక్ష’ అనగా
ఎ) ఊహ
బి) బింబప్రతిబింబ భావం
సి) అనన్వయం
డి) సమన్వయం
జవాబు:
ఎ) ఊహ

71. ఈ రాజు సాక్షాత్తు పరమేశ్వరుడే – ఇది ఏ అలంకారం?
ఎ) అతిశయోక్తి
బి) రూపకం
సి) అంత్యానుప్రాస
డి) లాటానుప్రాస
జవాబు:
బి) రూపకం

సొంతవాక్యాలు :

72. కుతూహలం : హిమాలయ సందర్శన కోసం మనస్సు కుతూహల పడుతున్నది.

73. శాశ్వత కీర్తి : సత్కార్యాలు చేసి శాశ్వత కీర్తిని పొందవచ్చు.

74. చెక్కుచెదరకుండ : అమరావతిలో శిల్ప సంపద చెక్కుచెదరకుండా ఉంది.

75. ప్రకృతి సౌందర్యం : హిమాలయాల్లోని ప్రకృతి సౌందర్యం పులకరింప జేస్తుంది.

76. భూతల స్వర్గం : కాశ్మీర్ భూతల స్వర్గంలా మనకు దర్శనం ఇస్తుంది.

77. ఆవరించు : నీలి మేఘాలు ఆకాశాన్ని ఆవరించి ఉన్నాయి.

78. పరిసరాలు : మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

79. తేజోవంతం : సూర్యబింబం తేజోవంతంగా వెలుగొందుతున్నది.

80. సభ్యలోకం : విద్వాంసులను సభ్యలోకం ఘనంగా సత్కరిస్తుంది.

81. పునీతం : పుణ్యక్షేత్ర దర్శనంతో పునీతం అవుతాము.

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు.

AP State Syllabus 8th Class Telugu Important Questions 3rd Lesson నీతి పరిమళాలు

8th Class Telugu 3rd Lesson నీతి పరిమళాలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది చుక్కగుర్తు గల పద్యాలకు భావాలను రాయండి.

1) చ. తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తిఁ గోరు నా
ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను శేషుఁడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవఁడే మణి మహాభరమైన ధరిత్రి భాస్కరా ! – (భాస్కర శతకం)

భావం :
భాస్కరా ! కీర్తిని కోరే గుణవంతుడు, తనకు ఎలాంటి లాభమునూ ఆశింపడు. లోకానికి మేలు జరిగే కార్యము ఎంత భారమైనా, చేయడానికి పూనుకుంటాడు. ఆదిశేషుడు గాలిని మాత్రమే మేస్తూ, తన వేయి పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని నిత్యం మోస్తున్నాడు కదా !

2) చ. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం
బదనుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టఁగ నేర్చునటయ్య భాస్కరా ! – (భాస్కర శతకం)

భావం:
భాస్కరా ! ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని, మనోజ్ఞతనూ గ్రహింప లేనప్పుడు, ఆ చదువు వ్యర్థం. దాన్ని గుణవంతులు ఎవరూ మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి నలపాకంగా, వంట చేసినా, దానిలో తగిన ఉప్పు వేయకపోతే అది రుచించదు కదా?

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

3) ఉ. భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితుఁ జేయుఁ బవిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించు నన్నియున్ – (సుభాషిత రత్నావళి)

భావం :
మానవులకు బంగారు కేయూరాలు, ముత్యాలహారాలు అలంకారాలు కావు. జుట్టు దువ్వుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, పన్నీటితో స్నానం చేయడం మానవుడికి అలంకారాలు కావు. పవిత్రమైన వాక్కు, పురుషుని అలంకరిస్తుంది. సంస్కారవంతమైన మాటయే, నిజమైన అలంకారము. మిగిలిన అలంకారాలు, నశించి పోయేవే.

4) చ. వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికికి (జిక్కె (జిల్వ గనువేదురుఁ జెందెను లేళ్ళు, తావినో
మని నశించెఁ దేటి, తరమా యిరుమూటిని గెల్వ వైదుసా
ధనముల నీవె గావఁదగు దాశరథీ కరుణాపయోనిధీ ! – (దాశరథీ శతకం)

భావం :
దయా సముద్రుడవైన ఓ రామా ! తన దురదను పోగొట్టుకోవడానికి ఏనుగూ ; నోటి రుచిని ఆశించి చేప, సంగీతానికి లొంగి పామూ, అందానికి బానిసయై జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలూ, బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి, ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్లనే నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియములందూ చాపల్యం గల నేను, ఎలా బయటపడగలను? ఓ దశరథ పుత్రా! కరుణాసాగరా ! రామా ! నీవే నన్ను కాపాడాలి.

5) ఆ.వె. క్షమను కడఁక నెవరు గాపాడుకొందుఱో
క్షమను చిరము వారు కావ గలరు
కదలకుండ నెవరికడ క్షమయుండునో
సర్వకార్యములకు క్షములు వారు – (సభారంజన శతకం)

భావం :
ఎవరు ప్రయత్నంతో క్షమను (ఓరిమిని) కాపాడుకుంటారో, వారు క్షమను’ (భూమిని) కాపాడతారు. ఎవరిలో క్షమ (సహనం) నిశ్చలంగా ఉంటుందో, వారు అన్ని పనుల్లోనూ క్షములై (సమర్థులై) ఉంటారు.

6) శా. ఊరూరం జనులెల్ల క్షమిడరో, యుండం గుహలలవో
చీరానీకము వీధులం దొరకదో శీతామృత స్వచ్ఛ వాః
పూరం బేరుల బారదో తపసులం బ్రోవంగ నీవోపవో
చేరంబోవుదు రేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా! – (శ్రీకాళహస్తీశ్వర శతకం)

భావం :
శ్రీకాళహస్తీశ్వరా ! తినడానికి భిక్షం అడిగితే ప్రతి గ్రామంలోనూ ప్రజలు భిక్షం పెడతారు. నివసించడానికి గుహలు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతం లాంటి తియ్యని నీరు ఉంది. తపస్సు చేసుకొనే మనుష్యులను కాపాడడానికి నీవున్నావు. ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలియడం లేదు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

ఆ) కింది అపరిచిత పద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి
కం|| “ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే”
ప్రశ్నలు :
1. సర్వోపగతుండెవరు?
జవాబు:
సర్వోపగతుండు ‘చక్రి’. చక్రి అనగా చక్రమును ధరించే శ్రీమహావిష్ణువు.

2. చక్రి ఎక్కడున్నాడు?
జవాబు:
చక్రి అన్ని చోట్లా ఉంటాడు.

3. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తుంది?
జవాబు:
ఈ పద్యం, దానవాగ్రణిని అంటే రాక్షసరాజు హిరణ్యకశిపుని సంబోధిస్తుంది.

4. ఈ పద్యం ఏ గ్రంథంలోనిది .? (రామాయణం, భారతం, భాగవతం)
జవాబు:
ఈ పద్యం భాగవతం లోనిది.

2. కింది పద్యాన్ని చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ”
ప్రశ్నలు :
1. కమలములు ఎపుడు వాడిపోతాయి?
జవాబు:
కమలములు నీటిలో నుండి బయటకు వస్తే సూర్యుని కాంతి తాకి వాడిపోతాయి.

2. మిత్రులు శత్రువులు ఎపుడు అవుతారు?
జవాబు:
తమ తమ స్థానాలను కోల్పోతే మిత్రులు శత్రువులు అవుతారు.

3. ఈ పద్యానికి మకుటమేది?
జవాబు:
సుమతీ

4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
రశ్మి అనగా ఏమిటి?

3. కింది పద్యమును చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి

అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ ! వినురవేమ!
ప్రశ్నలు :
1. అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది?
జవాబు:
అంటూ ఉంటే అతిశయిల్లేది రాగము.

2. తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
జవాబు:
తింటూ ఉంటే తీయనయ్యేది వేము.

3. సాధనతో సమకూరేవి ఏవి?
జవాబు:
సాధనమున పనులు సమకూరు ధరలోన

4. ఈ పద్యానికి మకుటం ఏమిటి?
జవాబు:
విశ్వదాభిరామ ! వినురవేమ !

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

4. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించండి.
చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తినుడువడేని
దయయుసత్యంబులోనుగా దలపడేని
కలుగనేటికి తల్లులు కడుపుచేటు
ప్రశ్నలు :
1. “కడుపుచేటు” అనే మాటకు అర్థం
ఎ) చెడ్డకడుపు
బి) పుట్టుక దండగ
సి) తల్లులకు బాధ
జవాబు:
బి) పుట్టుక దండగ

2. శివపూజ ఎలా చేయమంటున్నాడు కవి?
ఎ) ఆరు చేతులతో
బి) చేతులు నొప్పి పుట్టేటట్లు
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు
జవాబు:
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు

3. దయను, సత్యాన్ని రెండింటిలో మనిషి వేటిని తలచాలి?
ఎ) దయను మాత్రమే
బి) సత్యాన్ని మాత్రమే
సి) దయను, సత్యాన్ని రెండింటిని
జవాబు:
సి) దయను, సత్యాన్ని రెండింటిని

4. నోరారా హరి కీర్తిని………….
ఎ) పిలవాలి
బి) పలకాలి
సి) అరవాలి
జవాబు:
బి) పలకాలి

5. కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.
ప్రశ్నలు :
1. నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
జవాబు:
నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.

2. పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.

3. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.

4. ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.

6. ఈ కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడుదగన్
హేమంబు కూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ !
ప్రశ్నలు:
1. చీమలు పెట్టిన పుట్టలు వేటికి స్థానమవుతాయి?
జవాబు:
పాములకు

2. పై పద్యంలో కవి పామరుడిని ఎవరితో పోల్చాడు?
జవాబు:
చీమలతో

3. ‘బంగారం’ అనే అర్థం వచ్చే పదం పై పద్యంలో ఉంది. గుర్తించి రాయండి.
జవాబు:
హేమము

4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘భూమీశుడు’ అనగా ఎవరు?

7. ఈ కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు జల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ ! వినురవేమ !
ప్రశ్నలు :
1. అల్పుని మాటలు ఎలా ఉంటాయి?
జవాబు:
ఆడంబరంగా

2. ఆహ్లాదకరంగా మాట్లాడువారు ఎవరు?
జవాబు:
సజ్జనుడు

3. కవి ఈ పద్యంలో ఏ రెండు లోహాలను పోల్చారు?
జవాబు:
కంచు, బంగారం

4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
దీనిలోని మకుటం ఏది?

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

8. కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొరనింద సేయ బోకుము కార్యా
లోచనము లొంటి జేయకు
మాచారము విడువ బోకుమయ్య ! కుమారా !
ప్రశ్నలు :
1. ఒంటరిగా చేయకూడనిది ఏది?
జవాబు:
కార్యాలోచనము.

2. వేటిని విడిచి పెట్టకూడదు?
జవాబు:
ఆచారములు.

3. “తనని పోషించిన యజమానిని నిందించరాదు” అనే భావం వచ్చే పద్యపాదాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
బ్రోచిన దొర నింద సేయబోకుము.

4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ పద్యా నికి మకుటం ఏమిటి?
(లేదా)
ఈ పద్యాన్ని రాసినది ఎవరు?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘శతకం’ అనే ప్రక్రియను వివరించండి. (S.A. I – 2018-19)
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘శతకం’ అనే ప్రక్రియ ఒకటి. ఇందులో నూరు పద్యాలు ఉంటాయి. కొన్ని శతకాల్లో నూరుకు పైగా పద్యాలు ఉంటాయి. శతకంలో మకుటం ప్రధానంగా ఉంటుంది. కొన్ని శతకాల్లో మకుటం లేకుండా పద్యాలు ఉంటాయి. నీతి, ధర్మం, భక్తి, వైరాగ్యం మొదలైన అంశాలను శతకపద్యాలు బోధిస్తాయి. శతక పద్యాలు సమాజంలో నైతిక విలువలను, ఆధ్యాత్మిక భావనను, సత్ప్రవర్తనను కల్గిస్తాయి. సమాజంలో మూఢాచారాలను. తొలగించడానికి సహకరిస్తాయి.

ప్రశ్న 2.
సంస్కారం అంటే ఏమిటి? దాని గురించి నీవు ఏమనుకున్నావో రాయండి.
జవాబు:
సంస్కారం అంటే సంస్కరించడం. అంటే చక్కజేయడం. సాంఘికం, రాజకీయం, పరిపాలన, న్యాయవ్యవస్థ వంటి రంగాల్లో ఉన్న లోపాలను సవరించి, మంచి మార్గంలో పెట్టడం “సంస్కారం”. అలా సంస్కారం చేసిన వారిని “సంస్కర్త” అంటారు. పెద్దలు చెప్పిన మంచిదారిలో నడవడం “సంస్కారం”.

వీరేశలింగం గారు తన కాలం నాటి సంఘంలోని లోపాలను ఎత్తిచూపి, ప్రజలను మంచిదారిలో పెట్టడానికి కృషి చేశాడు. అందుకే ఆయన గొప్ప “సంఘసంస్కర్త” అయ్యాడు.

రాజకీయాలలోని లోపాలను సవరించడానికి ‘అన్నాహజారే’ వంటివారు లోక్ పాల్ బిల్లుకోసం ప్రయత్నించి విజయం సాధించారు. అన్నాహజారే “రాజకీయ సంస్కర్త”.

పూర్వకాలంలో శంకరాచార్యులవారు వేదమతాచారంలోని లోపాలను సంస్కరించి, అద్వైతమతాన్ని స్థాపించారు. ఆయన “మత సంస్కర్త”.

ఇటువంటి సంస్కరణల వల్ల మనిషిలో పెంపొందే ఉత్తమ గుణమే “సంస్కారం”.

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 3.
ఏనుగు లక్ష్మణకవి “వాగ్భూషణమే సుభూషణం” అని చెప్పాడు కదా ! దీనిని మీరు సమర్థిస్తారా? ఎందుకు?
జవాబు:
ఏనుగు లక్ష్మణకవి వాగ్భూషణమే సుభూషణం అని చెప్పాడు. ఇది నిజమే. ఈ మాట అందరినీ ఆలోచింపచేసేదిగా ఉంది. మంచి మాటకున్న శక్తిని లోకానికి చాటాడు. ఇది విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మంచి వాక్కు వల్ల విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న వాక్ శక్తిని పెంపొందించుకొనగలుగుతారు. నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకుంటారు. ఈ వాక్ శక్తి వల్ల ఎంతటి వారినైనా చక్కగా ఆకట్టుకొనగలుతారు. హేతువాద దృష్టిని అలవరుచుకొనగలుగుతారు. – చక్కని విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. వాక్ శక్తి వల్ల అనేకములైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ప్రశ్న 4.
పాఠంలోని పద్యాల్లో ఉన్న నీతిని సొంతమాటల్లో రాయండి.
జవాబు:

  1. గొప్ప గుణవంతుడు, లోకానికి హితమైన కార్యాన్ని ఎంత భారమైనా చేయడానికి పూనుకుంటాడు.
  2. ఉప్పులేని కూరవలె రసజ్ఞత లేని చదువు వ్యర్థం.
  3. సంస్కారవంతమైన మాటయే నిజమైన అలంకారం.
  4. మానవులను పంచేంద్రియ చాపల్యం నుండి భగవంతుడే కాపాడాలి.
  5. క్షమాగుణం కలవాడే అన్ని కార్యములకు సమర్థుడు.
  6. మానవులు రాజులను ఆశ్రయించడం వ్యర్థం.
  7. ఎదుటి వాడి బలాన్ని తెలుసుకోకుండా అతడితో పోరాడడం అవివేకం.
  8. జీర్ణం కాని చదువూ, తిండి చెరుపు చేస్తాయి.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
‘నీతి పరిమళాలు’ పాఠ్యభాగం ఆధారంగా నీవు గ్రహించిన విషయాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
‘నీతి పరిమళాలు’ అనే పాఠ్యభాగంలో శతక కవులు చక్కని నీతులను చెప్పారు. ఆ నీతులు సమాజానికి ఎంతగానో సహకరిస్తాయి. జగతిని జాగృతం చేస్తాయి. సారం లేకుండా చదివే చదువు ఉప్పులేని కూర వంటిది. మానవునికి బంగారు ఆభరణాలు, పుష్పాలు, సుగంధద్రవ్యాలు, పన్నీటి స్నానాలు అలంకారాలు కావు. సంస్కారవంతమైన వాక్కు మాత్రమే మానవులకు నిజమైన అలంకారం.

మానవుడు పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే ఏదైనా సాధించగలడు. పంచేంద్రియాలకు బానిసలైతే పతనాన్ని పొందుతారు. మానవులకు ఓర్పు గొప్ప అలంకారం. ఓర్పుతో అసాధ్యమైన పనులను కూడా సాధించగలడు.

గొప్పవారితో తలపడడం మంచిది కాదు. శక్తిసామర్థ్యాలను గుర్తించకుండా ఎదుటివారితో తలపడితే పరాభవం కలుగక మానదు. గొప్పవారితో పోరాడటం వల్ల వారికేమీ నష్టం కలుగదనే సత్యాన్ని గ్రహించాలి. ఇలాంటి నీతులు అనేకం అనేది పాఠ్యభాగం ద్వారా గ్రహించాను.

ప్రశ్న 2.
“నోరు మంచిదైతే – ఊరు మంచిదౌతుంది” – దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
ఈ సమస్త చరాచర ప్రకృతిలో అన్నిటికన్నా అద్వితీయమైంది మానవ జన్మ. అది ఎంతో విశిష్టమైంది, విలక్షణమైంది. మమతలు పంచుకుంటూ, మంచిని పెంచుకుంటూ, మానవతకు మారాకులు తొడుగుతూ, ఇలాతలంపై చిరునవ్వుల సిరివెన్నెలలు చిలికించగల శక్తి ఒక్క మానవుడికి మాత్రమే వుంది. అయితే, ఆ మానవుడికి నిజమైన ఆభరణం ఏమిటి? పూసుకునే అత్తరులా? వేసుకునే వస్త్రాలా? చేసుకునే సింగారాలా? ఇది ఒక మహత్తరమైన ప్రశ్న. మనసుపెట్టి ఆలోచిస్తే ఇవేవీ అసలైన ఆభరణాలు కావని ఇట్టే తెలిసిపోతుంది. ఇవన్నీ చెరిగిపోయేవి, వన్నె తరిగిపోయేవి. అలా కాకుండా, మానవుడికి ఎన్నటికీ చెరగని, తరగని ఆభరణంలా నిలచేది మధురమైన వాక్కు ఒక్కటే. మృదువైన భాషణంతో మనిషి అందరినీ ఆకర్షించగలుగుతాడు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతాడు. తన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతాడు. దీనికి భిన్నంగా పరుషమైన, కఠినమైన వాక్కు కలిగివుంటే ఆత్మీయులు కూడా ఆగర్భ శత్రువులుగా మారిపోతారు. అంతేకాదు, విరసమైన వాక్కు వలన జరిగే పనులు కూడా చెడిపోతాయి.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
‘నీతి పరిమళాలు’ పాఠం ఆధారంగా ఏయే మంచి గుణాలను అలవరచుకున్నారో పట్టిక తయారు చేయండి.
జవాబు:

  • మానవులకు బంగారు ఆభరణాలు అలంకారాలు కాదు.
  • సంస్కారవంతమైన వాక్కు మాత్రమే నిజమైన అలంకారం.
  • రసజ్ఞత లేని చదువు ఉప్పులేని కూరవంటిది.
  • గుణవంతుడు లోకానికి మేలు కలిగే కార్యక్రమమంత భారమైనా చేయడానికి ప్రయత్నిస్తాడు.
  • మానవుడు పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.
  • ఓర్పును మించిన ఆభరణం మరొకటి లేదు. ఓర్పుతో అసాధ్యములైన పనులను సాధంపవచ్చు.
  • రాజులను సేవించడం కంటే దేవదేవుడిని సేవించడం మిన్న.
  • శక్తియుక్తులు తెలుసుకోకుండా తోటివారితో పోరాడకూడదు.
  • అర్థం చేసుకొని చదవాలి. అవసరమైనంత మాత్రమే భుజించాలి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 2.
నీకు నచ్చిన శతక కవిని గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

పొదిలి,
x x x x x

ప్రియమైన మిత్రుడు రాధాకృష్ణకు,

నీ మిత్రుడు రాయునది నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది మన తెలుగు సాహిత్యంలో ఎందరో శతకకవులు ఉన్నారు. వారిలో నాకు భాస్కర శతక రచయిత మారద వెంకయ్య బాగా నచ్చారు. వారు జీవిత సత్యాలను చక్కగా ఆవిష్కరించారు. ప్రతి పద్యంలోను, దృష్టాంతంలో చెప్పిన విధం ఆకట్టుకుంది, అన్ని రంగాలమీద తన అభిప్రాయాలను, ముఖ్యంగా చదువు, వినయం మొదలైన విషయాల మీద చక్కని పద్యాలను రచించారు. భాస్కరా అనే మకుటంతో పద్యాలు రచించారు. వీరి శైలి కూడా లలితంగా ఉంటుంది. అట్లే నీకు నచ్చిన శతక కవిని గురించి వివరంగా నాకు తెలియజేయి. పెద్దలందరికి నా నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ మిత్రుడు,
x x x x x x

చిరునామా :
టి. రాధాకృష్ణ, 10వ తరగతి,
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,
పెదనందిపాడు, గుంటూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 3.
పాఠంలోని పద్యభాగాల ఆధారంగా విద్యార్థులలో నైతిక విలువల పట్ల అవగాహన పెంచడానికై ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
శతకపద్యాలు చదవండి

ప్రియమైన విద్యార్థులారా ! మన తెలుగు సాహిత్యంలో శతక గ్రంథాలకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఎందరో మహాకవులు తమ జీవిత అనుభవసారాన్ని రంగరించి చిన్న చిన్న పద్యాలతో మనకు అందించారు. విలువైన అంశాలను చిన్నపద్యాల్లో చిరస్థాయిగా గుర్తుపెట్టుకోనే విధంగా అందించారు. దీన్ని మనం మరువకూడదు. వేమన, వీరబ్రహ్మం వంటి ప్రజా కవులు సమాజంలోని సాంఘిక దురాచారాలను తూర్పారబట్టారు. నైతిక విలువల్ని, మనోధైర్యాన్ని పెంచడానికి కృషి చేశారు. ఆ మహనీయుల పద్యరత్నాలను అందరూ చదవండి. వాటిని ఆచరించండి. లోకానికి ఆదర్శంగా నిలువండి.
ఇట్లు,
తెలుగు భాషా సేవా కమిటి.

ప్రశ్న 4.
పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతకకవులు వచ్చారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనలను గురించి తెలుసుకోవడానికి పిల్లలు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు ? ఇంటర్వ్యూకు అవసరమైన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:
ఇంటర్వ్యూ ప్రశ్నావళి

  1. శతక కవులకు స్వాగతం. ‘శతకాలు’ ఎన్ని రకాలు?
  2. తెలుగులో మొదటి శతకకర్త ఎవరు?
  3. శతకాల్లో ఎన్ని రకాలున్నాయి?
  4. మకుటం లేని శతకాలు ఏమైనా ఉన్నాయా?
  5. నీతి శతకాల ప్రాముఖ్యత ఏమిటి?
  6. భక్తి శతకాలు మీరు ఏమైనా రాశారా?
  7. ‘కాళహస్తీశ్వర శతకం’లో భక్తి ఎక్కువగా ఉందా? రాజదూషణ ఉందా?
  8. వసురాయకవి గారి భక్త చింతామణి శతకం గూర్చి చెప్పండి.
  9. ‘సుమతి శతకం’ ప్రత్యేకత. ఎటువంటిది?
  10. మీకు నచ్చిన శతకం ఏమిటి?
  11. ఛందోబద్ధం కాని శతకాలు ఏమైనా ఉన్నాయా?
  12. మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?

8th Class Telugu 3rd Lesson నీతి పరిమళాలు 1 Mark Bits

1. తావినికికి జిక్కెం “జిల్వ” (అర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) చేప
బి) పాము
సి) ఏనుగు
డి) తేనెటీగ
జవాబు:
బి) పాము

2. “రాముడు” ఇది ఏ గణం? (S.A. I – 2018-19)
ఎ) ర గణం
బి) జ గణం
సి) డ గణం
డి) న గణం
జవాబు:
సి) డ గణం

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

3. మూడూ లఘువులు గల గణం ఏది?
ఎ) స గణం
బి) న గణం
సి) ర గణం
డి) మ గణం
జవాబు:
బి) న గణం

4. కరుణా పయోనిధి గాంభీర్య ఘనుడు (అర్థాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) నది
బి) లోయ
సి) తటాకం
డి) సముద్రము
జవాబు:
డి) సముద్రము

5. ఏనుగుల బలము చాలా ఎక్కువ. (గురులఘువులు గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) UIU
బి) III
సి) IIU
డి) UUI
జవాబు:
బి) III

6. రాజు బడికి వెళ్ళాలని తొందర పడుతున్నాడు. (సంధి విడదీయండి) (S.A. II – 2017-18)
ఎ) వెళ్ళా + లని
బి) వెళ్ళాల + అని
సి) వెళ్ళాలి + అని
డి) వెళ్ళా + అని
జవాబు:
సి) వెళ్ళాలి + అని

7. మూడూ గురువులే ఉండే గణం ఏది? (S.A. I – 2019-20)
బి) ర గణం
ఎ) న గణం
సి) జ గణం
డి) మ గణం
జవాబు:
డి) మ గణం

భాషాంశాలు – పదజాలం

అర్ధాలు :

8. విద్యార్థులకు క్షమ అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) దారి
బి) ధనం
సి) ఓర్పు
డి) వినయం
జవాబు:
సి) ఓర్పు

9. శత్రువులకు కూడా చెఱుపు తల పెట్టకూడదు – గీత గీసిన పదానికి గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వారి
బి) కీడు
సి) అగ్ని
డి) జలధి
జవాబు:
బి) కీడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

10. సరస్సులో మీనం ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఎలుక
బి) చేప
సి) కప్పు
డి) పాము
జవాబు:
బి) చేప

11. చిరకాలం జీవించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) గతకాలం
బి) మంచి కాలం
సి) విద్యా కాలం
డి) చాలా కాలం
జవాబు:
డి) చాలా కాలం

12. ధరిత్రి పై శాంతి నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) భూమి
బి) జలధి
సి) సాగరం
డి) వనం
జవాబు:
ఎ) భూమి

13. ఇంచుక జ్ఞానం అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తపన
బి) కొంచెము
సి) అధికము
డి) చాతుర్యం
జవాబు:
బి) కొంచెము

14. పయోధిలో రత్నాలు ఉంటాయి – గీత అర్థం గుర్తించండి.
ఎ) అవని
బి) పాపము
సి) సముద్రం
డి) భూషణము
జవాబు:
సి) సముద్రం

పర్యాయపదాలు :

15. భాస్కరుడు గొప్ప కాంతివంతుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సూర్యుడు, రజనీకరుడు
బి) రవి, ప్రభాకరుడు
సి) ఆదిత్యుడు, చంద్రుడు
డి) రవి, కువలయానందకరుడు
జవాబు:
బి) రవి, ప్రభాకరుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

16. విద్యార్థులు కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) తపస్సు, ఉషస్సు
బి) రోచస్సు, ధనుస్సు
సి) యశస్సు, ఖ్యాతి
డి) ధరణి, వర్చస్సు
జవాబు:
సి) యశస్సు, ఖ్యాతి

17. అమృతం సేవిస్తారు దేవతలు – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
ఎ) క్షీరం
బి) నారం
సి) వారి
డి) సుధ
జవాబు:
డి) సుధ

18. దివిపై తారలు ఉదయించాయి – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
ఎ) చుక్కలు, నక్షత్రాలు
బి) దినకరాలు, అరవిందాలు
సి) కుముదాలు, కలువలు
డి) నిలయాలు, కిసలయాలు
జవాబు:
ఎ) చుక్కలు, నక్షత్రాలు

19. సింహం వడిగా వెళ్ళింది – గీత గీసిన పదానికి సమానార్థకం గుర్తించండి.
ఎ) వాయువు
బి) వేగం
సి) మందం
డి) దురంతం
జవాబు:
బి) వేగం

20. రాజు ప్రజలను పాలించు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) నీరపతి, జలనిధి
బి) గతనందనుడు, దాశరథి
సి) నృపతి, క్షితిపతి
డి) అంబుధి, సచివుడు
జవాబు:
సి) నృపతి, క్షితిపతి

ప్రకృతి – వికృతులు :

21. లక్ష్మి సంపదలను ఇచ్చు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) లెచ్చి
బి) లచ్చి
సి) లచ్చ
డి) లక్కి
జవాబు:
బి) లచ్చి

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

22. గుణమును ఆశ్రయించాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) గెనము
బి) గనము
సి) గృనము
డి) గొనము
జవాబు:
డి) గొనము

23. దేశ చరిత్ర ఉన్నతమైంది – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) చోరిత
బి) చరిత
సి) చారిత్ర
డి) చెరిత్ర
జవాబు:
బి) చరిత

24. అగ్గిలో పడితే కాలుతుంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) అగ్న
బి) అగ్ని
సి) అగ్గి
డి) అగ్లీ
జవాబు:
బి) అగ్ని

25. హృదయం నిర్మలంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) ఎద
బి) హేవయం
సి) హోదయం
డి) హదయం
జవాబు:
ఎ) ఎద

26. శ్రీ కావాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) సరి
బి) సెరి
సి) శీరి
డి) సిరి
జవాబు:
డి) సిరి

27. నీకు కర్ణం చేయాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) కార్యం
బి) కర్రమ
సి) కారం
డి) పని
జవాబు:
ఎ) కార్యం

నానార్థాలు :

28. ఆకాశంలో మిత్రుడు ప్రకాశిస్తున్నాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వారిధి, వార్షికం
బి) సూర్యుడు, స్నేహితుడు
సి) రవి, శని
డి) గురువు, వారిధి
జవాబు:
బి) సూర్యుడు, స్నేహితుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

29. సుధను దేవతలు త్రాగుతారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) దధి, క్షీరం
బి) ఘృతం, వారి
సి) అమృతం, పాలు
డి) నీరు, లవణం
జవాబు:
డి) నీరు, లవణం

30. రాజు కువలయానందకరుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ఉదధి, వారిదం
బి) నృపతి, చంద్రుడు
సి) శుక్రుడు, వాచస్పతి
డి) వారిధి, అంబుధి
జవాబు:
బి) నృపతి, చంద్రుడు

31. సూర్యుని కరం కాంతివంతం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కిరణం, వాయువు
బి) జలధి, ఉదధి
సి) వారిదం, కీడు
డి) చేయి, తొండము
జవాబు:
డి) చేయి, తొండము

వ్యుత్పత్త్యర్థాలు :

32. దాశరథి రక్షించుగాక – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
ఎ) దశరథుని కుమారుడు
బి) దాశరథికి తమ్ముడు
సి) దశరథుని చేత తమ్ముడు
డి) దశరథునికి ఆత్మీయుడు
జవాబు:
ఎ) దశరథుని కుమారుడు

33. పయోధి – ఈ పదానికి వ్యుత్పత్తి గుర్తించండి.
ఎ) నీటికి చెందునది
బి) నీటిలో రత్నాలు కలది
సి) నీటిని ధరించునది
డి) నీటి కొరకు ఆనందము
జవాబు:
సి) నీటిని ధరించునది

34. విశ్వమును ధరించునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) భూషితం
బి) ధరణి
సి) జలధి
డి) వారిధి
జవాబు:
బి) ధరణి

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

35. ‘కరి’ దీనికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
ఎ) అంకుశం కలది
బి) కరము కలది
సి) నీరము కలది
డి) క్షీరము కలది
జవాబు:
బి) కరము కలది

36. సర్వభూతములయందు సమభావన కలవాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) వారి
బి) జలధి
సి) మిత్రుడు
డి) శత్రువు
జవాబు:
సి) మిత్రుడు

37. పాపములను తొలగించువాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) ఈశుడు
బి) విధాత
సి) వేంకటేశుడు
డి) శంకరుడు
జవాబు:
సి) వేంకటేశుడు

వ్యాకరణాంశాలు

సంధులు :

38. శివునికి జలాభిషేకం చేశారు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) జన + అభిషేకం
బి) జల + అభిషేకం
సి) జలే + అభిషేకం
డి) జలా + ఆభిషేకం
జవాబు:
బి) జల + అభిషేకం

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

39. వేంకటేశ నమోనమః – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) వేంకట + ఈశ
బి) వేంకట్ + ఈశు
సి) వెంకట + ఆశ
డి) వేంక + టేశ
జవాబు:
డి) వేంక + టేశ

40. వీటిలో ఆమ్రేడిత సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) పల్లెటూరు
బి) ముందడుగు
సి) ఊరూరు
డి) చిగురుటాకు
జవాబు:
సి) ఊరూరు

41. చాలకున్న – ఇది ఏ సంధి పదమో గుర్తించండి.
ఎ) ఉత్వసంధి
బి) ఇత్వసంధి
సి) అత్వసంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
సి) అత్వసంధి

42. కీర్తిఁగోరుట మంచిది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) ఉత్వసంధి
బి) సరళాదేశ సంధి
సి) త్రికసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) సరళాదేశ సంధి

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

43. లక్ష్మీ నీవే నాకు రక్ష – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) త్రికసంధి
సి) ఆమ్రేడిత సంధి
బి) పడ్వాదిసంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

44. దానికేమి? ఎక్కడ ఉన్నావు? – గీత గీసిన పదానికి సంధిని గుర్తించండి.
ఎ) యడాగమ సంధి
బి) సరళాదేశ సంధి
సి) ఇత్వసంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) ఇత్వసంధి

45. శ్రీకాళహస్తీశ్వరా – దీనిని విడదీయండి.
ఎ) శ్రీ + కాళహస్తీశ్వరా
బి) శ్రీకాళహస్తి + ఈశ్వరా
సి) శ్రీకాళహస్తి + ఏశ్వరా
డి) శ్రీకాళ + హస్తీశ్వరా
జవాబు:
బి) శ్రీకాళహస్తి + ఈశ్వరా

గణ విభజన

46. ‘ఉత్పలమాల’ – దీనికి గల గణాలను గుర్తించండి.
ఎ) భ, ర, న, భ, భ, ర, వ
బి) మ, స, జ, స, త, త, గ
సి) స, భ, ర, న, మ, య, వ
డి) న, జ, భ, జ, జ, జ, ర
జవాబు:
ఎ) భ, ర, న, భ, భ, ర, వ

47. UUU – ఇది ఏ గణము?
ఎ) న గణం
బి) మ గణం
సి) త గణం
డి) భ గణం
జవాబు:
బి) మ గణం

48. చంపకమాల – వృత్తంలోని పాదానికి అక్షరాల సంఖ్య
ఎ) 21
బి) 20
సి) 19
డి) 22
జవాబు:
ఎ) 21

49. ‘భూషలు’ – ఇది ఏ గణము?
ఎ) త గణం
బి) మ గణం
సి) భ గణం
డి) య గణం
జవాబు:
సి) భ గణం

50. క్షమను చిరమువారు కావగలదు – ఇది ఏ పద్య పాదము?
ఎ) మత్తేభం
బి) ఆటవెలది
సి) తేటగీతి
డి) కందం
జవాబు:
బి) ఆటవెలది

వాక్యాలు

51. అల్లరి చేయవద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్ధక వాక్యం
బి) తద్ధర్మార్థక వాక్యం
సి) అప్యర్థక వాక్యం
డి) నిషేధార్థక వాక్యం
జవాబు:
డి) నిషేధార్థక వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

52. మీకు మేలు కలుగుగాక ! – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధాక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) ఆశీరార్థక వాక్యం
డి) విధ్యర్థక వాక్యం
జవాబు:
సి) ఆశీరార్థక వాక్యం

53. వాడు వస్తాడో రాడో? – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) సందేహార్థక వాక్యం
సి) అద్యర్థక వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
బి) సందేహార్థక వాక్యం

54. తప్పక అందరు రావాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) తప్పక అందరు రాకూడదు
బి) తప్పక కొందరు రాకూడదు
సి) తప్పక కొందరు రాకపోవచ్చు
డి) అందరు తప్పక రాలేకపోవచ్చు
జవాబు:
బి) తప్పక కొందరు రాకూడదు

55. అందరు కలలు కనాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) అందరు కలలు కనలేకపోవచ్చు.
బి) అందరు కలలు కని తీరాలి.
సి) అందరు కలలు కనకూడదు.
డి) కొందరు కలలు కనాలి.
జవాబు:
సి) అందరు కలలు కనకూడదు.

56. రమ తెలివైనది, అందమైనది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) సంక్లిష్ట వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) సంయుక్త వాక్యం
జవాబు:
డి) సంయుక్త వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

57. ధూర్జటి శతకం రచించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
ఎ) ధూర్జటి యందు శతకం రాశాడు.
బి) ధూర్జటి చేత శతకం రచింపబడింది.
సి) ధూర్జటి వల్ల శతకం రాశాడు.
డి) ధూర్జటికి శతకం రాయవచ్చు.
జవాబు:
బి) ధూర్జటి చేత శతకం రచింపబడింది.

58. అల్లరి చేస్తే శిక్ష తప్పదు – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
ఎ) చేదర్థకం
బి) అప్యకం
సి) శత్రర్థకం
డి) క్వార్ధకం
జవాబు:
ఎ) చేదర్థకం

అలంకారాలు

59. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్టు – ఇందలి అలంకారాన్ని గుర్తించండి.
ఎ) ఉపమ
బి) వృత్త్యనుప్రాస
సి) లాటానుప్రాస
డి) యమకం
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

60. వీరు పొమ్మనువారు కాదు పొగబెట్టువారు – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.
ఎ) అంత్యానుప్రాస
బి) వృత్త్యనుప్రాస
సి) యమకం
డి) లాటానుప్రాస
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

సొంతవాక్యాలు :

61. లోకహితం : మహనీయులు లోకహితం కోసం నిరంతరం ప్రయత్నిస్తారు.

62. సత్త్వము : పాండవులు యుద్ధంలో తమ సత్త్వమును ప్రదర్శించారు.

63. క్షమ : విద్యార్థులకు అన్ని రంగాల్లోను క్షమ మిక్కిలి అవసరం.

64. పవిత్రవాణి : సజ్జనులు సభల్లో తమ పవిత్ర వాణిని వినిపిస్తారు.

65. నలపాకము : వివాహ విందులోని వంటకాలు నలపాకమువలె రుచికరంగా ఉన్నాయి.

66. అనిశం : భారత సైనికులు సరిహద్దుల్లో అనిశం రక్షణ బాధ్యతలను చూస్తారు.

67. రసజ్ఞత : కవులు సందర్భానుగుణంగా రసజ్ఞతతో మాట్లాడుతారు.

68. భూషణము : విద్వాంసులకు వినయమే గొప్ప భూషణము.

69. నిరర్థకము : నిరర్థకంగా సంపదను, కాలాన్ని వృథా చేయకూడదు.

70. స్వచ్ఛము : మా చెరువులోని నీరు స్వచ్ఛముగా ఉన్నది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు.

AP State Syllabus 8th Class Telugu Important Questions 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు

8th Class Telugu 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది పరిచిత గద్యాంశాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. (4) నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సమాజంలో కుటుంబమే అత్యంత కీలకమైంది. ప్రప్రథమ సమూహం కుటుంబమే. వ్యక్తి సమాజంలో ఒంటరిగా మనజాలడు. కుటుంబంతో తాను మమేకమై జీవించడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు. అందుకే పుట్టుకతోనే మనిషికి కుటుంబంతో విడదీయలేని అనుబంధం ఏర్పడుతుంది. పోషణ, భద్రత కల్పించడం కుటుంబవ్యవస్థలో మౌలికాంశాలు. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. కుటుంబంలో అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతూంటాయి. పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, విచక్షణ జ్ఞానాన్నివ్వడం, సంస్కృతిని వారసత్వంగా అందించడం కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి.
ప్రశ్నలు :
1. వ్యక్తి సమాజంలో ఎలా మనజాలడు?
జవాబు:
వ్యక్తి సమాజంలో ఒంటరిగా మనజాలడు.

2. వ్యక్తి ఎలా ఆనందాన్ని పొందగలుగుతాడు?
జవాబు:
వ్యక్తి కుటుంబంతో తాను మమేకమై జీవించడం ద్వారా ఆనందాన్ని పొందగలుగుతాడు.

3. కుటుంబ వ్యవస్థలో మౌలికాంశాలు ఏవి?
జవాబు:
పోషణ, భద్రత కల్పించడం కుటుంబ వ్యవస్థలో మౌలికాంశాలు.

4. . కుటుంబ వ్యవస్థకు ప్రాథమిక లక్షణం ఏది?
జవాబు:
కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం

2. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. (4) నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

వేదకాలంనాటికే నాగరికమైన పద్ధతుల్లో ఈ కుటుంబవ్యవస్థ ఏర్పడిందని కొందరు చరిత్రకారుల భావన. వారి రాతల వల్ల కుటుంబ జీవనవిధానం ఆ కాలంలో అత్యున్నత స్థాయిలో ఉండేదనీ, భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఉన్నతశ్రేణిలో ఉండేవని తెలుస్తూంది. వేల ఏండ్ల నుంచీ విలువలకు కట్టుబడి జీవిస్తూ విశ్వానికి ఆదర్శంగా నిలిచిన కుటుంబ వ్యవస్థ మనది. ఆనాడు కుటుంబ జీవనం చాలా వరకు సాఫీగా సుఖంగా సాగిపోయిందనీ, అది చాలా నియమబద్ధంగా ఉండేదని తెలుస్తూంది. ఆ కుటుంబంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైంది. గౌరవప్రదమైంది. అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ‘ఇంటికి దీపం ఇల్లాలు’ అనే నానుడిని బట్టి భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎంతటి ఉన్నతస్థానం ఇచ్చారో | అర్థమవుతుంది. ఆ
ప్రశ్నలు:
1. కుటుంబ వ్యవస్థ ఎప్పటి నుండి ఏర్పడిందని చరిత్రకారులు భావించారు?
జవాబు:
కుటుంబ వ్యవస్థ వేద కాలం నుండి ఏర్పడిందని చరిత్రకారులు భావించారు.

2. ఏ బాంధవ్యాలు ఉన్నత స్థాయిలో ఉండేవి?
జవాబు:
భార్యాభర్తల సంబంధ, బాంధవ్యాలు ఉన్నత స్థాయిలో ఉండేవి.

3. కుటుంబంలో ఎవరి పాత్ర కీలకమైంది?
జవాబు:
కుటుంబంలో తల్లి పాత్ర కీలకమైంది.

4. పై పేరాలో ఉన్న తెలుగు నానుడి ఏది?
జవాబు:
పై పేరాలో ఉన్న నానుడి ‘ఇంటికి దీపం ఇల్లాలు’

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

3. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. (4) నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కాలం మారింది. కుటుంబం అనే మాటకు అర్థం, దాని నమూనా మారిపోయింది. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకు ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడం, స్వార్థం పూర్తిగా పెరిగిపోవడం, వీటివల్ల ఉమ్మడి కుటుంబవ్యవస్థలో మార్పులు అనివార్యమయ్యాయి. చిన్న కుటుంబభావన బలపడింది. సమష్టి వ్యవస్థ పూర్తిగా వ్యవ వ్యవస్థగా మారింది. తత్కారణంగా జీవన సరణిలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునికతవల్ల శ్రమవిభజనలో కొత్త మార్పులు వచ్చాయి. స్త్రీ పురుష సంబంధాల్లో కొత్త ధోరణులు ఏర్పడ్డాయి. ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటిపైనే ‘వ్యష్టి’ కుటుంబం ఆధారపడింది. ఈ వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయాధికారం లభిస్తాయి. అయితే ఇలా వ్యక్తి ప్రాధాన్యత పెరిగి ఉమ్మడికుటుంబ వ్యవస్థ మరుగున పడిపోతుంది.
ప్రశ్నలు:
1. కాలంతోపాటు దేనికి అర్థం మారింది?
జవాబు:
కాలంతో పాటు కుటుంబం అనే మాటకు అర్థం మారిపోయింది.

2. ఏ కారణం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మరుగున పడిపోయింది?
జవాబు:
వ్యక్తి ప్రాధాన్యత పెరగడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మరుగున పడిపోయింది.

3. ఏ సంబంధాల్లో కొత్త ధోరణులు ఏర్పడ్డాయి?
జవాబు:
స్త్రీ, పురుష సంబంధాల్లో కొత్త ధోరణులు ఏర్పడ్డాయి.

4. వ్యష్టి కుటుంబం వేటిమీద ఆధారపడింది?
జవాబు:
ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటి పైన వృష్టి కుటుంబం ఆధారపడింది.

4. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. (4) నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చిన్ననాటి నుంచి ఇంట్లో అందరితో గడిపిన మధుర క్షణాలు, జీవితంలో జరిగిన సంఘటనలు పెద్దయిన తరవాత సినిమాలా కళ్ళముందు మెదలాలి. ఈ మధురమైన అనుభూతిని పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోవాలంటే చక్కని కుటుంబం కావాలి. గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి మహనీయులెందరికో వారి కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి. ఆ * ఉమ్మడి కుటుంబం, వ్యక్తి కుటుంబాల మేలి కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా; ఆధిపత్యాల పోరులేని, ప్రేమానురాగాలు, విలువలు, మానవసంబంధాలు అంతస్సూత్రమైన ఒక మంచి
కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. అప్పుడే సమాజం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతాయి.
ప్రశ్నలు:
1. దేన్ని పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోవాలి?
జవాబు:
మధురమైన అనుభూతిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలి.

2. కుటుంబ వ్యవస్థ ఎవరికి స్ఫూర్తినిచ్చింది?
జవాబు:
కుటుంబ వ్యవస్థ గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్, అబ్దుల్ కలాం వంటి వారికి స్ఫూర్తినిచ్చింది.

3. మనకు ఎలాంటి కుటుంబం కావాలి?
జవాబు:
మనకు కమ్మని కుటుంబం కావాలి.

4. ఈ గద్యాంశానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పై పేరాకు ‘ఉమ్మడి కుటుంబం’ అనే శీర్షిక తగింది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

5. కింది పరిచిత గద్యం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2016-17)

కాలాలు మారినా ఏళ్లు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉంది. విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు మూలస్తంభాల మీద మన కుటుంబవ్యవస్థ ఆధారపడి ఉంది. “అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారికోసమే నా జీవితం” అనే త్యాగభావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక, కుటుంబ వ్యవస్థ బాగుంటే సమాజమూ బాగుంటుంది.
ప్రశ్నలు:
1. ఎటువంటి త్యాగభావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదికగా ఉంది?
జవాబు:
“అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారి కోసమే నా జీవితం”.

2. భారతీయ కుటుంబ వ్యవస్థకు ఆధార స్తంభాలు ఏవి?
జవాబు:
విశ్వసనీయత, సమగ్రత, ఏకత

3. కుటుంబ వ్యవస్థలోని గొప్పదనమేమిటి?
జవాబు:
కాలాలు మారినా ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉండటం విశేషం.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
సమాజ అభివృద్ధికి దోహదం చేసేదేది?

6. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. III – 2015-16)

‘కలసి ఉంటే కలదు సుఖం’ అనే సూత్రం ఆధారంగా సమష్టి కుటుంబం కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చేది. కొందరి మనోభావాలు భిన్నంగా ఉన్నప్పటికీ మొత్తం కుటుంబానికి అక్కరకు వచ్చేదే అమలయ్యేది. స్వార్థపరతకు తావు తక్కువ. మన అనే భావనకు అందరూ లోనై ఉండేవారు. రైతు కుటుంబాల్లో అయితే ఇంటిల్లిపాదీ ఇంటి పనుల్లో, బయటి పనుల్లో పాలుపంచుకునేవారు. శ్రామిక వర్గం అంతా దాదాపు అలానే ఉండేది. ఊరిలో ఏదన్నా పెళ్లి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకొని ఆ కార్యక్రమం చేసేవారికి ఆనందం కలిగించేవారు. ఈ సంఘీభావమే దేశానికి వెన్నెముక అయింది. సిరిసంపదలను పోగుచేసింది. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టిందానాడు. మన ఇతిహాసాలైన రామాయణ భారతాలు ఈ సమష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి. –
ప్రశ్నలు:
1. సమష్టి కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చే మూల సూత్రం ఏది?
జవాబు:
“కలసి ఉంటే కలదు సుఖం”

2. ఏది దేశానికి వెన్నెముక?
జవాబు:
సంఘీభావం.

3. ఈ పై పేరా ఆధారంగా రెండు ప్రశ్నలు తయారు చేయండి.
జవాబు:
1) కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించేవి ఏవి?
2) ఏ భావనకు అందరూ లోనై ఉండేవారు?

ఆ) కింది అపరిచిత గద్యాంశాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ఈ కింది వచనాలను చదివి వాటి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

గాంధీజీ తన ప్రసంగాలలో సత్యం, అహింస అనే రెండు తరచుగా ఉపయోగించేవారు. అయితే ఈ రెంటిలో మొదటిదానికే ప్రాధాన్యమిచ్చారు. అతడు సత్యాన్వేషకుడే కాదు. సత్యాన్ని ఆరాధించిన భక్తుడు. తన జీవితాన్ని “సత్యమార్గంతో పరిశోధనలు”గా అభివర్ణించారు. ప్రారంభంలో భగవంతుడే సత్యమని ప్రకటించారు. కానీ, చివరకు “సత్యమే భగవంతుడు” అని ప్రకటించే స్థితికి వచ్చారు. “ఎందుకంటే భగవంతుని ఉనికిని నిరాకరించవచ్చు. కానీ, సత్యమును కాదనడం కష్టం.
ప్రశ్నలు :
1. గాంధీ తన ప్రసంగాలలో తరచుగా ఉయోగించేవి ఏవి?
జవాబు:
సత్యం, అహింస.

2. ఆయన తన జీవితాన్ని ఏమని అభివర్ణించారు?
జవాబు:
సత్యమార్గంతో పరిశోధనలు.

3. ప్రారంభంలో ఆయన దేనిని సత్యమని ప్రకటించారు?
జవాబు:
భగవంతుడే సత్యం.

4. చివరకు ఆయన దేనిని భగవంతునిగా ప్రకటించే స్థితికి వచ్చారు?
జవాబు:
సత్యమే భగవంతుడు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. భాష నేర్చుకోవడం రెండు రకాలు. భాష కోసం భాష విషయం కోసం భాష. భాషా స్వరూప స్వభావాలను సమగ్రంగా అధ్యయనం చేయడం మొదటి రకంలోనిది. శాస్త్ర సాంకేతిక విషయాలను, సాహిత్య సాంస్కృతిక విషయాల వంటి వాటిని అధ్యయనం చెయ్యడం రెండవ రకంలోనిది. అలాగే భాష కూడా రెండు రకాలుగా తయారయింది. ప్రాచీన (కావ్య) భాష, ఆధునిక (ప్రామాణిక) భాష, సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని ఆనందించడానికి ప్రాచీన భాష ఉపయోగిస్తుంది. కాని, దాన్ని గురించి చెప్పడానికీ, రాయడానికి ఆధునిక భాషే కావాలి. ఎందువల్లనంటే ఏ కాలంలో జీవించేవాడి ఆలోచన, అలవాట్లూ ఆ కాలం నాటి భాషలోనే సాగుతుంటాయి. కనుక ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం. ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం. వివిధ శాస్త్ర విషయాలను వివరించడానికే కాదు, పూర్వ భాషా సాహిత్యాలను వివరించడానికి కూడా ఆధునిక భాషే కావాలి.
ప్రశ్నలు :
1. భాషను ఏయే రకాలుగా నేర్చుకొంటాము?
జవాబు:
భాషను భాష కోసం, విషయం కోసం నేర్చు కుంటాము.

2. భాష ఎన్ని రకాలుగా తయారయింది?
జవాబు:
భాషలో ప్రాచీన (కావ్య) భాష, ఆధునిక (ప్రామాణిక) భాష అని రెండు రకాలు.

3. ప్రాచీన భాష ఎందుకు ఉపయోగపడుతుంది?
జవాబు:
ప్రాచీన భాష సాహిత్యంలోని తరతరాల వార సత్వాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది.

4. ఆధునిక భాష ఉపయోగం ఏమిటి?
జవాబు:
ఆధునిక భాష సాహిత్యంలో తరతరాల గురించి చెప్పడానికి, రాయడానికి ఉపయోగపడుతుంది.

3. పరభాషల ద్వారా కాక మాతృభాష ద్వారా విద్యాబోధన చేయుటయే సహజమైన పద్ధతి అని వాదించి వంగభాషలో బాలురకు ఉపయుక్తములగు వాచకములను, శాస్త్ర గ్రంథములను రచించిన విద్యావేత్త ఈశ్వరచంద్రుడు.

అతనివలే ఒకవైపు సంఘ సంస్కరణ చేయుచు, మరొకవైపు భాషాసేవ చేసిన మహనీయుడు మన వీరేశలింగం పంతులు గారు. పంతులుగారికి దక్షిణదేశ విద్యాసాగరుడను బిరుదు కలదు. విద్యాసాగరుడు పంతులుగారు పరస్పరం ఉత్తరములు రాసుకొనేవారు. ఈశ్వరచంద్రుని వలన వంగదేశము, పంతులుగారి వలన తెలుగుదేశము వాసిగాంచినవి.
ప్రశ్నలు :
1. విద్యాబోధన చేయుటకు సహజమైన పద్ధతి ఏది?
జవాబు:
మాతృభాష ద్వారా విద్యాబోధన చేయుట సహజమైన పద్ధతి.

2. ఈశ్వరచంద్రుడు ఏ భాషలో వాచకములను రాసెను?
జవాబు:
ఈశ్వరచంద్రుడు వంగభాషలో వాచకములను రాసెను.

3. పంతులుగారి బిరుదు ఏమిటి?
జవాబు:
‘దక్షిణ దేశ విద్యాసాగరుడు’ అనేది పంతులుగారికి గల బిరుదు.

4. ఈశ్వరచంద్రుని వలన ఏ దేశము వాసిగాంచెను?
జవాబు:
ఈశ్వరచంద్రుని వలన వంగదేశము వాసి గాంచెను.

4. మేధా సంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతమవుతుంది అనేది ఎంతయినా యథార్థం. ఒక దేశం యొక్క సంస్కృతి, వికాసం, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా, కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక యుగంలో విద్య మానవునికి ఒక ముఖ్యమైన జీవితావసరంగా కూడా మారింది. నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు ఒక ప్రాథమిక అవసరంగా భావించి వాటిని రాజ్యాంగంలో పొందుపరచడమైనది.
ప్రశ్నలు:
1. యథార్థమైనది ఏది?
జవాబు:
స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంత మవుతుంది.

2. ఒక దేశ సంస్కృతి, ప్రగతి దేని మీద ఆధారపడి ఉంటుంది?
జవాబు:
ఒక దేశ సంస్కృతి, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

3. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక అవసరాలేవి?
జవాబు:
నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు అనే ప్రాథమిక అవసరాలు రాజ్యాంగంలో పొందుపరచ బడ్డాయి.

4. వైజ్ఞానిక వాస్తవం ఏమిటి?
జవాబు:
మేధాసంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

5. వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు ఐదువందల మంది శిష్యులతో హిమాలయాల్లో ఉండేవాడు. ఒకసారి ఎండలు బాగా కాసి అన్నిచోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి. శిష్యులలో ఒకడు వాటి దప్పిక తీర్చడం కోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టెలో పోసేవాడు. జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ నీరు తాగుతుండటంతో శిష్యుడికి పండ్లు తెచ్చుకోవడానికి గూడా తీరిక చిక్కలేదు. తనేమీ తినకుండానే ఆ జంతువులకు నీళ్ళు పోసేవాడు. ఇది చూసి జంతువులన్నీ మోయగలిగినన్ని పళ్ళు తెచ్చి ఇతనికివ్వాలని నిర్ణయించుకుంటాయి. అవన్నీ కలిపితే రెండువందల యాభై బండ్లు నిండాయి. వాటిని అక్కడి ఐదువందలమంది శిష్యులు తృప్తిగా తినేవాళ్ళు.
ప్రశ్నలు:
1. జంతువులు ఎందుకు అల్లాడిపోయాయి?
జవాబు:
జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి.

2. వాటి బాధ ఎలా తీరింది?
జవాబు:
బోధిసత్వుని శిష్యుడు ఒక తొట్టెను తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టిలో పోయటం ద్వారా వాటి బాధ తీరింది.

3. ఈ కథ ద్వారా మీరు గ్రహించిందేమిటి?
జవాబు:
అన్ని ప్రాణుల యెడల జాలి, దయ కలిగి ఉండాలనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాను.

4. జీవకారుణ్యం అంటే ఏమిటి?
జవాబు:
జీవులపట్ల జాలి, దయ కలిగి ఉండుటను జీవ కారుణ్యం అంటారు.

6. ఈ కింది వ్యవహార రూపాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. I – 2018-19)
జవాబు:

పెదపాడు,
xxx x x

ప్రియమైన మిత్రుడు శ్రీకర్ కు,

నీ మిత్రుడు వినయ్ రాయునది. ఉభయకుశలోపరి. నేను బాగానే చదువుచున్నాను. నీవు బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. నేను ఒక చిన్నకథ చదివాను. గాంధీజీ జీవితానికి సంబంధించింది. నువ్వు ఆ కథ చదువుతావని ఇక్కడ రాస్తున్నాను.

మహాత్మాగాంధీ బాలునిగా ఉన్నప్పుడు ఆయనను “మోనియా” అని పిలిచేవారు. ఒకనాడాయన ఇంటి సమీపంలో దేవాలయ ప్రాంగణంలో కొందరు పిల్లలు ఆయనను కొట్టారు. ఈ విషయం తల్లికి చెప్పాడు. “నీవు వారిని తిరిగి కొట్టలేక పోయినావా ?” అని ఆమె అన్నది. “అమ్మా ! ఆ పని చెయ్యమని నీవేల అంటున్నావు ? నేను వారి సోదరుడను కదా!” అని మోనియా తల్లితో అన్నాడు.

ఈ చిన్న కథలో తోటి వారితో ఎలా మెలగాలో, తప్పు చేసిన వారిపట్ల ఏ భావం కలిగి ఉండాలో ఉంది కదా ! ఈ కథ నీకూ నచ్చి ఉంటుందని అనుకుంటూ, దసరా సెలవులు ఎలా గడిపావో విశేషాలతో లేఖరాయి.

ఇట్లు,
నీ మిత్రుడు, కె. వినయ్,
8వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
అమరావతి, గుంటూరు జిల్లా.

చిరునామా :
డి. శ్రీకర్
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
దేవులపల్లి, పగో జిల్లా.

ప్రశ్నలు:
1. గాంధీజీని బాల్యంలో ఏ పేరుతో పిలిచేవారు?
జవాబు:
మోనియా

2. గాంధీజీ తనను కొట్టిన వారిని తిరిగి కొట్టడానికి ఎందుకు నిరాకరించాడు?
జవాబు:
వారిని సోదరులుగా భావించాడు కనుక.

3. ఈ కథ ద్వారా నీవేం తెలుసుకున్నావు?
జవాబు:
తోటివారితో ఎలా మెలగాలో తెలుసుకున్నా

4. పై లేఖ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పై పేరాలో ఎవరి కథ చెప్పబడింది?

7. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2018-19)

రామాయణం అనే మహా గ్రంథాన్ని సంస్కృత భాషలో వాల్మీకి మహర్షి రాశారు. అందులో 6 కాండలు ఉన్నాయి. తెలుగులో గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనే పేరుతో, మొల్ల రామాయణం అనే పేరుతో కవయిత్రి మొల్ల రచించారు. రామాయణంలో గురు – శిష్య, తండ్రి – కొడుకుల, అన్నదమ్ముల, భార్యభర్తల, స్నేహితుల సంబంధం బాంధవ్యాల గురించి చెప్పారు. –
ప్రశ్నలు:
1. గోనబుద్ధారెడ్డి రచించిన గ్రంథం పేరు ఏమి?
జవాబు:
రంగనాథ రామాయణం

2. సంస్కృత భాషలో రామాయణం రాసిన వారెవరు?
జవాబు:
వాల్మీకి

3. రామాయణంలో ఎన్ని కాండలున్నాయి?
జవాబు:
6 కాండలున్నాయి.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
రామాయణం దేని గురించి చెబుతుంది?

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

8. ఈ క్రింది అపరిచిత గద్యం చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (S.A. III – 2015-16)

పాండురాజు భార్య కుంతీదేవికి ముగ్గురు కొడుకులు. వారిలో ధర్మరాజు పెద్దవాడు. రెండోవాడైన భీముడు బలవంతుడు. మూడోవాడైన అర్జునుడు విలువిద్యలో నిపుణుడు. పాండురాజు రెండో భార్య అయిన మాద్రికి నకుల, సహదేవులనే ఇద్దరు కుమారులు పుట్టారు. మొత్తం అందరూ కలిపి పాండురాజుకు ఐదుగురు కొడుకులున్నారు. ఈ ఐదుగుర్నీ పాండవులంటారు.
ప్రశ్నలు :
1. పాండురాజు కొడుకులను ఏమంటారు?
జవాబు:
పాండవులు అంటారు.

2. కుంతీదేవికి మొత్తం ఎంతమంది కొడుకులు?
జవాబు:
ముగ్గురు

3. భీముడి ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
బలవంతుడు

4. పాండవులు ఎంతమంది?
జవాబు:
ఐదుగురు

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘మన’ అనే భావన వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?
జవాబు:
‘మన’ అనే భావన ఉంటే సమష్టి కుటుంబ వ్యవస్థ అనేది సక్రమంగా ఉంటుంది. ఆ కుటుంబ సభ్యులు అందరూ, ఆ కుటుంబం అభివృద్ధికి పాటుపడతారు. ఆ కుటుంబం ‘మనది’ అనుకుంటారు. అందువల్ల భేదభావాలు ఈర్ష్యాద్వేషాలు లేకుండా అందరూ తమ శక్తికి మించి పనిచేస్తారు. ముఖ్యంగా రైతు కుటుంబాల్లో ఐతే, ఇంటిల్లిపాదీ ఇంటిపనుల్లో, బయట పనుల్లో పాలుపంచుకుంటారు. వ్యవసాయం పనులు ఇంటి వారంతా కలిసి చేసుకుంటారు. కాబట్టి వేరుగా కూలిపని వారిని పెట్టుకోనక్కరలేదు. కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కోపని చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. కాబట్టి ఆ కుటుంబం అవసరాలను, ఆ కుటుంబం వారే ఇతరుల అవసరం లేకుండా పూర్తి చేసుకోవచ్చు. వారిండ్లలో పెళ్ళిపనులు వంటి కార్యక్రమాలు వస్తే, కుటుంబ సభ్యులు అందరూ, అది తమ కార్యక్రమమని శ్రమను పంచుకొని ఆనందంగా ఆ పని పూర్తి చేస్తారు. ఈ ‘మన’ అన్న సంఘీభావం, దేశానికి వెన్నెముక వంటిది. అందరూ కుటుంబం మనది అనుకుంటే, ఆ కుటుంబం సిరిసంపదలతో వర్ధిల్లుతుంది.

ప్రశ్న 2.
‘మంచి కుటుంబ నేపథ్యంలో వచ్చిన పిల్లలే, ఈ సమాజంలో నిలదొక్కుకుంటున్నారు. ఎందుకు?
జవాబు:
మంచి కుటుంబంలో పెరిగిన పిల్లలు, తల్లిదండ్రుల నుండి క్రమశిక్షణ, ఇంట్లో పెద్దల నుండి ప్రేమానురాగాలు, నీతి, చక్కని నడవడి నేర్చుకుంటారు. వారు చక్కగా చదువుకొని, బాధ్యతతో పెరిగి పెద్దవారవుతారు. తమ తల్లిదండ్రుల పట్ల, దేశంపట్ల, సంఘం పట్ల, మంచి బాధ్యతతో క్రమశిక్షణ గలిగి, దేశభక్తితో నడచుకుంటారు. దేశ పౌరులుగా తమ విధులను నెరవేరుస్తారు.

సహజంగా పిల్లలు సమష్ఠి కుటుంబంలో పెరిగి, సంతోషాన్ని, కష్టాల్నీ, బాధల్నీ ఒకరికొకరు పంచుకోవాలి. కాని వ్యష్టి కుటుంబాల్లో పిల్లలు ‘ఎవరికివారే యమునా తీరే’ అన్నట్లు వెలుగుతున్నారు. అందువల్లే పిల్లల్లో కొందరు అనాథలుగా, సమాజ వ్యతిరేక శక్తులుగా మారిపోతున్నారు. వీరిలో కొందరు అశాంతి, హింసలకు ముఖ్యకారకులు అవుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావంతో పాటు, సమాజమూ, తోడి పిల్లలూ, ప్రసారసాధనాల ప్రభావమూ కూడా ఉంటుంది.

అందువల్లే మంచి కుటుంబం నేపథ్యం నుండి వచ్చిన పిల్లలే, సమాజంలో నిలదొక్కుకుంటున్నారు.

ప్రశ్న 3.
కుటుంబ వ్యవస్థకు మౌలికాంశాలేవి?
జవాబు:
కుటుంబ వ్యవస్థకు మౌలికాంశాలు పోషణ, భద్రత కల్పించడం. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, విచక్షణ జ్ఞానాన్నివ్వడం, సంస్కృతిని వారసత్వంగా అందించడం, కుటుంబ వ్యవస్థ ప్రధానోద్దేశాలలో ఒకటి. విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు స్తంభాల మీద మన కుటుంబవ్యవస్థ ఆధారపడియుంది. “అందరిలో నా సుఖం ఉంది. వారి కోసమే మన జీవితం” అనేది భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
తల్లిదండ్రులు ఇతరులతో పోటీపడుతూ పరుగెడుతున్న నేటి సమాజంలో పిల్లల పరిస్థితులు ఏమిటి?
జవాబు:
తల్లిదండ్రులు నేటికాలానికి అనుగుణంగా, ఆర్థిక పరిస్థితిని బట్టి ఇద్దరూ సంపాదిస్తేనే గాని కుటుంబం గడిచే పరిస్థితి ఉండటం లేదు.

వారు సమాజంలో ఒక యాంత్రికమైన జీవనాన్ని గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో పిల్లల ఆలనా పాలనా, మంచిచెడ్డలు చూసుకునే సమయం కూడా వారికి ఉండటం లేదు.

ఈ రోజుల్లో తల్లిదండ్రులు, తమ పిల్లలను బాగా చదివించాలనీ, వాళ్ళు మంచి ఉద్యోగులుగా, మంచి డబ్బు సంపాదించే వాళ్ళుగా తయారవ్వాలని పోటీపడుతున్నారు. అందుకోసం తమ సర్వస్వాన్నీ త్యాగం చేసి, పిల్లల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. ఇది ఒక రకంగా మంచి పోటీయే.

కాని ఈ పోటీలో తల్లిదండ్రులు, తమ పిల్లలకు ఏ విషయంపై అభిరుచి ఉందో, ఆసక్తి ఉందో గమనించడం లేదు.

శక్తి గల పిల్లలు, తల్లిదండ్రుల కృషి వల్ల బాగుపడుతున్నారు. కాని అందరూ ఒకే దారి తొక్కడం వల్ల పోటీ పెరుగుతోంది. నిరుద్యోగం పెరిగిపోతోంది. దానితో పిల్లలలో నిరాశా నిస్పృహలు పెరిగిపోతున్నాయి. మరి కొందరు పిల్లలకు ఆ చదువులపై ఆసక్తి, శక్తి లేక, మధ్యలోనే చదువులు మానివేసి, తప్పుడు దారులు తొక్కుతున్నారు. మరికొందరు నక్సలైట్లుగా, ఉగ్రవాదులుగా, హింసా ప్రవర్తకులుగా మారిపోతున్నారు.

బలవంతంగా పిల్లలను ఇంగ్లీషు మాధ్యమంలో చదివించడంతో, అటు ఇంగ్లీషు, ఇటు మాతృభాష రెండూ రాక, ఉభయభ్రష్టులు అవుతున్నారు. ముఖ్యంగా అందరికీ ప్రాథమిక విద్య, మాతృభాషలోనే నేర్పాలి. పదవతరగతి పూర్తి అయ్యే వరకూ, మాతృభాషను ప్రథమ భాషగా పిల్లలకు నేర్పాలి. పిల్లల అభిరుచులను తల్లిదండ్రులు తెలిసికొని, వారి ఇష్టానికి తగిన చదువులనే చదివించాలి.

పిల్లలపై తల్లిదండ్రులు, తమ అభిరుచులనూ, ఆసక్తులను అంటగట్టక, పిల్లల ఇష్టాలను గుర్తించి, వారిని సర్వతోముఖంగా అన్ని రంగాలలో సంసిద్ధులను చేయాలి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 2.
వృష్టి కుటుంబమైనా, సమష్టి కుటుంబమైనా సమాజానికి, దేశానికి పనికి వచ్చే పిల్లల్ని అందించాలంటే ఏం చేయాలి?
జవాబు:
కుటుంబ పరమైన వారసత్వభావనలు, మానవ సంబంధాలు, ఆప్యాయత, అనురాగం, జీవన సంప్రదాయాలు, సంస్కృతి తమ పిల్లలకు అందేలా చేయాలి. తల్లిదండ్రులకు పిల్లల సంక్షేమమే, మొదటి ప్రాధాన్యం కావాలి. తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, పరోపకారగుణం అందించాలి. సమస్త సద్గుణాలకూ, దుర్గుణాలకూ ఇల్లే పునాది అని తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లల్ని కేర్ టేకింగ్ సెంటర్లలో వదలి, తాము ఉద్యోగాలు చేసుకుంటూ కూర్చోరాదు.

పిల్లలకు పెద్దల పై, గురువులపై, తల్లిదండ్రులపై గౌరవం ఆదరం కలిగేలా చూసుకోవాలి. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలి. చిన్ననాటి నుండి విలువలను కాపాడే సంస్కృతిని, విద్యను నేర్పించాలి. పిల్లలకు హక్కులతో పాటు బాధ్యతలను నేర్పించాలి.

తల్లిదండ్రులు, తాము ఏ కుటుంబంలో ఉన్నప్పటికీ, కుటుంబ భావనలు పిల్లలకు వివరించి చెప్పగలగాలి. పెద్దల బలాన్ని పొందాలి. ఉమ్మడి, వ్యష్టి కుటుంబాల మేలు కలయికతో, ఆధిపత్యాల పోరులేని ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు అంతస్సూత్రంగా ఉన్న ఒక కొత్త కుటుంబవ్యవస్థను ఏర్పాటు చేసుకొని, పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి. వారికి తమ కుటుంబ వారసత్వాన్ని అందించాలి.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
ఉమ్మడి కుటుంబ ఆవశ్యకతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

అమరావతి,
x x x x x

ప్రియమైన మిత్రుడు రమేష్ కు,

నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన భారతదేశంలోని కుటుంబ వ్యవస్థకు సమున్నతమైన స్థానం ఉంది. ప్రజలందరూ ఉమ్మడి కుటుంబాన్ని గౌరవించాలి. ఉమ్మడి కుటుంబం వల్ల మానవీయ సంబంధాలు పెరుగుతాయి. నైతిక విలువలు వృద్ధి పొందుతాయి. ఆత్మీయతానురాగాలు నిత్యం ఉంటాయి. పరస్పర సహకారం కలుగుతుంది. అందువల్ల మనమంతా ఉమ్మడి కుటుంబాలనే గౌరవిద్దాం. మన కుటుంబ వ్యవస్థను చిరకాలం నిలుపుదాం. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు.

ఆత్మీయతానురాగాలు నిత్యం ఉంటాయి. పరస్పర సహకారం కలుగుతుంది. అందువల్ల మనమంతా ఉమ్మడి కుటుంబాలనే గౌరవిద్దాం. మన కుటుంబ వ్యవస్థను చిరకాలం నిలుపుదాం. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు
ఇట్లు,
x x x x x x x x

చిరునామా :
పి రమేష్,
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,
చెరువు జమ్ములపాలెం,
బాపట్ల మండలం,
గుంటూరు జిల్లా.

ప్రశ్న 2.
సహజీవన మాధుర్యం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
వ్యక్తి కుటుంబంలో సభ్యుడైనా – సమాజంలో పౌరుడుగా కొనసాగుతూ ఉంటాడు. కుటుంబాలన్నీ కలిసే సంఘ మనబడుతుంది. కానీ వ్యక్తి తన పాత్రను అటు కుటుంబంలో, ఇటు సమాజంలో బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. మంచి కుటుంబ సభ్యుడు కానప్పుడు ఆకష్టం, నష్టం కుటుంబానికే పరిమితమై ఉంటుంది. కానీ సత్పౌరుడు కాకపోతే దేశానికే సమస్యగా పరిణమిస్తాడు. అందుకే కుటుంబక్షేమం కోసం వ్యక్తినీ, సమాజశ్రేయస్సుకోసం కుటుంబాన్నీ, దేశశ్రేయస్సుకోసం సమాజాన్నీ కూడా పరిత్యజించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇక్కడ మనిషి హక్కుల్నీ, బాధ్యతల్నీ బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎదురవుతుంది. వ్యక్తి తనహక్కుల్నే అనుభవించడంలో సమాజంలోని సాటివారి ప్రాథమికహక్కుల్ని కూడా గౌరవించాల్సి ఉంది. వ్యక్తి స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛను హరించని పరిస్థితుల్లో మాత్రమే రాణిస్తుంది. అంటే నాగరిక సమాజంలో ప్రతిమనిషికీ, ఇంకొకరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహజీవనంలో వసుధైక కుటుంబ భావన పరిపూర్ణంగా పాటించాల్సి ఉంది.

ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకూ సమాజం ఒకేలా లేదు. ప్రాథమిక అవసరాల కోసం మనిషి జీవించే తీరులో మార్పు వచ్చింది. దేశ కాలపరిస్థితుల్ని బట్టి మానవుడు నియమబద్ధమైన ప్రవర్తన నియమావళిని రూపొందించుకొంటూనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో అనేక అంతరహిస్సంఘర్షణలకు లోనయ్యాడు. మానసికంగా పరిశ్రమించి, తపస్సు చేసి జీవితపరమార్థాన్ని తెలుసుకోగలిగాడు. తాను దర్శించిన సత్యాల ప్రాతిపదికగా మానవజాతికోసం, మూల్యవ్యవస్థను నిర్మించాడు. ఈ మూల్యవ్యవస్థ నిర్మాణం సమిష్టి కృషిగానే సాగింది. వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం అనే క్రమంలో సువ్యవస్థిత స్థితిని ఉంచేందుకు చేసే కృషి కూడా మూల్యం అని చెప్పబడుతుంది. వ్యక్తి తన లో నుంచి రూపొందించుకున్న విలువ, సామాజికమై, అందరి సంక్షేమం కోసం ఉద్దేశింపబడుతుంది. సత్యం చర మొదలైనవి ఇలాంటివే.

ప్రశ్న 3.
“ఉత్తమ సమాజ రూపకల్పనకు కుటుంబ వ్యవస్టే వెన్నెముక” అనడానికి కారణాలు రాయండి. (S.A. I – 2018-19)
జవాబు:
సమాజానికి కుటుంబం వెన్నెముక. మంచి కుటుంబం, మంచి సమాజం వీటి నుంచి మంచి దేశం, మంచి ప్రపంచం ఏర్పడతాయి. అందుకు అందరూ కృషి చేయాలి.

కుటుంబం అనే మాట మధురమైనది. కుటుంబం అన్న భావన తలపుకు రాగానే మనస్సులో ఏదో అనిర్వచనీయమైన హాయి కలుగుతుంది. తీపి జ్ఞాపకాలెన్నో గుర్తుకు వస్తాయి.

చిన్ననాటి నుంచి ఇంట్లో అందరితో గడిపిన మధురక్షణాలు, జీవితంలో జరిగిన సంఘటనలు పెద్దయిన తర్వాత సినిమాలా కళ్ళముందు మెదలాలి. ఈ మధురమైన అనుభూతిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే చక్కని కుటుంబం కావాలి. గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి మహనీయులెందరికో వారి కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి.

ఉమ్మడి కుటుంబం, వ్యష్టి కుటుంబాల మేలి కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగకుండా, ఆధిపత్యాల పోరులేని, ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు అంతస్సూత్రమైన ఒక మంచి కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. అప్పుడే సమాజం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 4.
“అభివృద్ధి చెందుతున్న సమాజానికి, అనుబంధాలతో ఉన్న కుటుంబమే మూలం” ఈ వాక్యాన్ని సమర్థించే “ఇల్లు – ఆనందాల హరివిల్లు” ఎలా అవుతుందో తెల్పండి. (S.A. II – 2017-18)
జవాబు:
‘అభివృద్ధి చెందుతున్న సమాజానికి, అనుబంధాలతో ఉన్న కుటుంబమే మూలం’ అని ‘ఇల్లు – ఆనందాల హరివిల్లు’ పాఠం ద్వారా రచయిత చెప్పిన మాట అక్షరసత్యం. సమాజం అంటే మనుషులే. మనుషులంతా కలిస్తేనే సమాజం. దీనిని బట్టి సమాజం బాగుంది అంటే మనుషులు బాగున్నట్టే కదా !

ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక, సహాయ సహకారాలందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన సంబంధాలున్న స్త్రీ పురుషులు, వారి పిల్లలు ఉన్న సమూహమే కుటుంబం అని పెద్దలు నిర్వచించారు. ‘విశ్వసనీయత, సమగ్రత, ఏకత’ అనే వాటి మీద కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. “అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారి కోసమే నా జీవితము” అనే త్యాగభావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.

సమాజంలో కుటుంబమే అత్యంత కీలకం. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. తల్లిదండ్రులకు పిల్లల సంక్షేమమే తొలి ప్రాధాన్యం. మంచి కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లలు కష్టాలను అధిగమించి సమాజంలో నిలదొక్కు కుంటారు. కుటుంబం అనే హరివిల్లులో అమ్మానాన్నలు, పిల్లలు, తాతానానమ్మలు ఇలా అందరూ భాగమైతే అందం, ఆనందం వెల్లి విరుస్తుంది. ఆ ‘ఇల్లే ఇలలో స్వర్గం’ అవుతుంది. కుటుంబంలోని సభ్యుల మధ్య బంధాలు, అనురాగాలు, గౌరవం, మంచితనం అనేవి సహజంగా ఉన్నప్పుడు ఆ లక్షణాలు పిల్లలకూ వారసత్వంగా వస్తాయి.

ఈ వారసత్వ లక్షణాలున్న కుటుంబం సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది.

8th Class Telugu 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు 1 Mark Bits

1. ఇల్లు – ఆనందాల “హరివిల్లు” (అర్థాన్ని గుర్తించండి) (S.A.I – 2018-19)
ఎ) ఇంద్రధనస్సు
బి) మేఘం
సి) ఆనందం
డి) సత్కారం
జవాబు:
ఎ) ఇంద్రధనస్సు

2. మనం చట్టం అతిక్రమించకూడదు. (ప్రకృతిని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) చుట్టం
బి) శాస్త్రం
సి) క్షేమం
డి) శీర్షం
జవాబు:
బి) శాస్త్రం

3. కింది వాటిలో సరైన సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) లత, శ్రీలత అక్కా చెల్లెళ్ళు.
బి) చెట్లు చిగిర్చిపూలు పూశాయి.
సి) రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
డి) మీరు అల్లరి చేయవద్దు. కూర్చోండి.
జవాబు:
బి) చెట్లు చిగిర్చిపూలు పూశాయి.

4. సమప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడితే అది ఏ వాక్యం? (S.A.I- 2018-19)
ఎ) సంయుక్త వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సామాన్య వాక్యం
డి) సంక్లిష్ట వాక్యం
జవాబు:
ఎ) సంయుక్త వాక్యం

5. కుటుంబంతో కలిపి దేవాలయానికి వెళ్లాలి (సంధి పేరు గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) సవర్ణదీర్ఘసంధి
బి) అత్వసంధి
సి) గుణసంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘసంధి

6. ఈ కింది వానిలో సంయుక్త వాక్యం గుర్తించండి. (S.A. II – 2018-19)
ఎ) విమల తెలివైనది. విమల అందమైనది కదా
బి) విమల తెలివైనదీ, విమల అందమైన దీ
సి) విమల తెలివిగానే విమల అందమైనదే
డి) విమల తెలివైనది మరియు అందమైనది.
జవాబు:
డి) విమల తెలివైనది మరియు అందమైనది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

7. చిన్మయీ హోంవర్క్ పూర్తి చేసి నిద్రపోయింది. (ఏ రకపు వాక్యమో గుర్తించండి) (S.A. III – 2016-17)
ఎ) సంయుక్త వాక్యం
బి) సామాన్య వాక్యం
సి) సంక్లిష్ట వాక్యం
డి) విశేష వాక్యం
జవాబు:
సి) సంక్లిష్ట వాక్యం

8. అక్షర పాటలు రాస్తుందీ, పాడుతుంది. (ఏ వాక్యమో గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) సంయుక్త వాక్యం
బి) సందేహ వాక్యం
సి) విద్యర్థక వాక్యం
డి) సంక్లిష్ట వాక్యం
జవాబు:
ఎ) సంయుక్త వాక్యం

9. అమ్మ కడుపు నిండా అన్నం పెట్టింది. (ప్రకృతి పదం గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) ఉదరం
బి) గర్భం
సి) అర్భకుడు
డి) పొట్ట
జవాబు:
బి) గర్భం

10. నేను దక్షిణానికి తిరిగి దక్షిణ నిచ్చాను. (నానార్థాలు గుర్తించండి.) (S.A. II – 2017-18)
ఎ) తూర్పు – పడమర
బి) ఉత్తరం – దక్షిణం
సి) ఒక దిక్కు – సంభావన
డి) డబ్బు – దస్కం
జవాబు:
సి) ఒక దిక్కు – సంభావన

11. అనైక్యత అనర్ధానికి దారి తీస్తుంది. వాక్యంలో గీత గీసిన పదానికి వ్యతిరేకపదం గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) వాక్యం
బి) ద్వేషం
సి) ఐక్యత
డి) క్రోథం
జవాబు:
సి) ఐక్యత

12. నారాయణ అన్నం తిన్నాడు. నారాయణ నీళ్లు తాగాడు. ఈ రెండు సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మారిస్తే ఏది సరైన వాక్యమవుతుంది? (S.A. III – 2015-16)
ఎ) నారాయణ అన్నం తిని నీళ్లు తాగాడు.
బి) నారాయణ అన్నం, నీళ్లు తాగాడు
సి) నారాయణ అన్నం తిని నీళ్లు తాగలేదు.
డి) నారాయణ అన్నం తింటూ నీళ్లు తాగుతున్నాడు.
జవాబు:
ఎ) నారాయణ అన్నం తిని నీళ్లు తాగాడు.

భాషాంశాలు – పదజాలం

ఆర్థాలు :

13. ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆవేదన
బి) అంగీకారం
సి) తిరస్కారం
డి) విజయం
జవాబు:
బి) అంగీకారం

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

14. రాష్ట్రానికి తొలి రాజధాని కర్నూలు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) మొదటి
బి) చివరి
సి) మధ్యమ
డి) ప్రయోజన
జవాబు:
ఎ) మొదటి

15. పనులకు భంగం కలుగకూడదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆటంకం
బి) ఆవేదన
సి) ఆకారం
డి) ఆకలి
జవాబు:
ఎ) ఆటంకం

16. వీరుల మధ్య పోరు జరిగింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సాగరం
బి) అంబుధి
సి) యుద్ధం
డి) తరుణం
జవాబు:
సి) యుద్ధం

17. పనిలో సామర్థ్యం కనబరచాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అయోగ్యత
బి) మోదం
సి) భేదం
డి) యోగ్యత
జవాబు:
డి) యోగ్యత

18. విద్యార్థులకు వివేచన అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) మిక్కిలి
బి) ఆలోచన
సి) ఆరాధన
డి) అపరాధం
జవాబు:
బి) ఆలోచన

19. మనిషికి స్వాతంత్ర్యం అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) మోదము
బి) స్వేచ్ఛ
సి) బంధిఖాన
డి) ప్రియము
జవాబు:
బి) స్వేచ్ఛ

20. ఇలపై నందనం విరియాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తార్కాణం
బి) భూమి
సి) సుధ
డి) వ్యధ
జవాబు:
బి) భూమి

పర్యాయపదాలు:

21. పుష్పాల్లో సౌరభం ఉంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సువాసన, తావి
బి) తరుణం, తామకం
సి) తమసం, తదనంతరం
డి) వాసన, దుర్గంధం
జవాబు:
ఎ) సువాసన, తావి

22. స్వరంలో దేవతలు ఉంటారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) మర్త్యము
బి) త్రిదివం
సి) త్రిభువనం
డి) రసాతలం
జవాబు:
బి) త్రిదివం

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

23. భార్యను గౌరవించాలి-గీత గీసిన పదానికి సమానార్థక పదాలు గుర్తించండి.
ఎ) విన్నానం
బి) వివేణం
సి) యతి, పది
డి) సతి, నది
జవాబు:
ఎ) విన్నానం

24. రాము గృహంలో ఉన్నాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
ఎ) ధూదం, ద్రవ్యం
బి) ఇల్లు, సదనం
సి) నికేతనం, నందనం
డి) నారలు, మదిలు
జవాబు:
బి) ఇల్లు, సదనం

25. తల్లి వంద్యురాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పితామహి, ప్రభావతి
బి) సతి, గాంధర్వం
సి) జనని, మాత
డి) జనని, జనకుడు
జవాబు:
సి) జనని, మాత

26. జనకుడు ఊరికి వెళ్ళాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఊరు, పేరు
బి) తండ్రి, పిత
సి) పత, జత
డి) నాకం, నరకం
జవాబు:
బి) తండ్రి, పిత

27. పెళ్ళి జరిగింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సాహచర్యం, సంతర్పణ
బి) సాయుధం, బలాత్కారం
సి) వివాహం, పరిణయం
డి) సదనం, నికేతనం
జవాబు:
సి) వివాహం, పరిణయం

28. సదనంలో ఉన్నాను – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) గతం, గేహం
బి) ఇల్లు, గృహం
సి) నికేతనం, నాటకం
డి) వీధి, రంగం
జవాబు:
బి) ఇల్లు, గృహం

29. కర్షకుడు వ్యవసాయం చేస్తాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) రైతు, భూమీశుడు
బి) కృషీవలుడు, రైతు
సి) పృథ్వి, ధరణీశ్వరుడు
డి) అవని, జలధి
జవాబు:
బి) కృషీవలుడు, రైతు

ప్రకృతి – వికృతులు :

30. పుణ్యం పొందాలి – గీత గీసిన పదానికి వికృతి రూపం గుర్తించండి.
ఎ) పొన్నెం
బి) పున్నెం
సి) పన్నెం
డి) పందెం
జవాబు:
బి) పున్నెం

31. చట్టం తెలియాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి. ఏది?
ఎ) శాస్త్రి
బి) శాస్త్రం
సి) శారం
డి) వస్త్రం
జవాబు:
బి) శాస్త్రం

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

32. మంత్రంతో పని జరగాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) చంద్రం
బి) జింతం
సి) గెంత్రం
డి) పంత్రం
జవాబు:
సి) గెంత్రం

33. విజ్ఞానం సాధించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) ఇల్లాలు, కులస్త్రీ
బి) పత్ని, గవి
సి) విన్ననం
డి) విన్నపం
జవాబు:
ఎ) ఇల్లాలు, కులస్త్రీ

34. కర్ణం సాధించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) పర్జన్యం
బి) కార్యం
సి) కార్యెం
డి) కర్యం
జవాబు:
బి) కార్యం

నానార్థాలు :

35. అకాలంలో మరణించాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ఆకాశం, అనంతం
బి) సమయం, మరణం
సి) చావు, కీర్తి
డి) యశస్సు, ఆర్తి
జవాబు:
బి) సమయం, మరణం

36. పురోహితుడు దక్షిణ పొందాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) నాగరికం, సదనం
బి) తటం, ధాన్యం
సి) ఒక దిక్కు, సంభావన
డి) నగలు, నుదురు
జవాబు:
సి) ఒక దిక్కు, సంభావన

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

37. మానవులు ధర్మం ఆచరించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ధరణి, దాపరికం
బి) మోక్షం, ముత్యం
సి) దిక్కు, శరణు
డి) పుణ్యం, న్యాయం
జవాబు:
డి) పుణ్యం, న్యాయం

వ్యుత్పత్యర్థాలు :

38. పక్షములు కలది – అనే వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
ఎ) పాక్షికం
బి) సాగరం
సి) పక్షి
డి) నది
జవాబు:
సి) పక్షి

39. ఇలా జరిగిందని చెప్పునది – అనే వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
ఎ) కావ్యం
బి) ప్రక్రియ
సి) గాథ
డి) ఇతిహాసం
జవాబు:
డి) ఇతిహాసం

40. మనువు వల్ల పుట్టినవాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం గుర్తించండి.
ఎ) ఉత్తరం
బి) మానవుడు
సి) దానవుడు
డి) దక్షిణ
జవాబు:
బి) మానవుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

41. సువాసనతో కూడినది – అనే వ్యుత్పత్త్యం గల పదం
ఎ) సౌరభం
బి) దానవం
సి) దాపరికం
డి) నాకము
జవాబు:
ఎ) సౌరభం

వ్యాకరణాంశాలు

సంధులు :

42. ప్రేమానురాగాలు పెంచాలి – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) గుణసంధి
సి) వృద్ధి సంధి
డి) త్రికసంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

43. క్రింది వానిలో పొసగని సంధి ఏది?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) అత్వసంధి
సి) గుణసంధి
డి) వృద్ధిసంధి
జవాబు:
బి) అత్వసంధి

44. భావ + ఉద్వేగాలు – దీన్ని కలిపి రాస్తే
ఎ) భావైద్వేగాలు
బి) భావోద్వేగాలు
సి) బావాద్వేగాలు
డి) భవైద్వేగాలు
జవాబు:
బి) భావోద్వేగాలు

45. లు, ల, న సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) నట్టిల్లు
బి) అమ్మలక్కలు
సి) అనుబంధాలు
డి) సూర్యోదయం
జవాబు:
సి) అనుబంధాలు

46. తెలుగులో నిత్య సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) త్రికసంధి
బి) ఇత్వసంధి
సి) ఉత్వసంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) ఉత్వసంధి

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

47. సూత్రమైన – దీన్ని విడదీస్తే
ఎ) సూత్రము + అయిన
బి) సూత్రం + ఐన
సి) సూత్రాలు + ఐన
డి) సూత్రము + ఐన
జవాబు:
డి) సూత్రము + ఐన

48. ప్రత్యక్షంగా చూడాలి – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) యణాదేశ సంధి
సి) త్రికసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
బి) యణాదేశ సంధి

49. పరోపకారం చేయాలి – దీన్ని విడదీయండి.
ఎ) పర + అపకారం
బి) పర + ఉపకారం
సి) పరె + అపకారం
డి) పరై + అపకారం
జవాబు:
బి) పర + ఉపకారం

50. నిరయాధికారం ఉండాలి – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) సవర్ణదీర్ఘ సంధి
సి) త్రికసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) సవర్ణదీర్ఘ సంధి

సమాసాలు :

51. అవ్యయీభావ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) పరోక్షం
బి) ప్రత్యక్షం
సి) ఆశ్రమధర్మం
డి) స్త్రీపురుషులు
జవాబు:
బి) ప్రత్యక్షం

52. భార్యాభర్తలు ఉన్నారు – ఇది ఏ సమాసం?
ఎ) అవ్యయీభావ సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహుహ్రీహి సమాసం
డి) కర్మధారయ సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం

53. పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏమిటి?
ఎ) తత్పురుష సమాసం
బి) బహుహ్రీహి సమాసం
సి) అవ్యయీభావ సమాసం
డి) రూపక సమాసం
జవాబు:
సి) అవ్యయీభావ సమాసం

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

54. భారతదేశము – ఏ సమాసం?
ఎ) సంభావనా పూర్వపద కర్మధారయం
బి) కర్మధారయ సమాసం
సి) ద్విగు సమాసం
డి) బహున్రీహి సమాసం
జవాబు:
ఎ) సంభావనా పూర్వపద కర్మధారయం

55. దినము దినము – దీనిని సమాసపదంగా చేస్తే
ఎ) ప్రతిదినం
బి) అనుదినం
సి) యదినం
డి) గతదినం
జవాబు:
ఎ) ప్రతిదినం

56. సమానాధికరణ తత్పురుష అని దేనిని అంటారు?
ఎ) అవ్యయీభావం
బి) బహుజొహి
సి) కర్మధారయం
డి) ద్విగు
జవాబు:
సి) కర్మధారయం

57. ఉన్నతశ్రేణి – ఇది ఏ సమాసం?
ఎ) అవ్యయీభావం
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) విశేషణ ఉత్తరపద కర్మధారయం
డి) ఉపమాన పూర్వపద కర్మధారయం
జవాబు:
బి) విశేషణ పూర్వపద కర్మధారయం

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

58. శుభమును, అశుభమును – దీన్ని సమాస పదంగా మార్చండి.
ఎ) అశుభశుభములు
బి) అశుభాశుభములు
సి) శుభాశుభములు
డి) శుభఅశుభములు
జవాబు:
బి) అశుభాశుభములు

59. షష్ఠీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) ఉన్నతశ్రేణి
బి) శ్రామికవర్గం
సి) కొత్త ధోరణులు
డి) పక్షం రోజులు
జవాబు:
బి) శ్రామికవర్గం

గణ విభజన :

60. IUU – ఇది ఏ గణము?
ఎ) న గణం
బి) య గణం
సి) త గణం
డి) మ గణం
జవాబు:
బి) య గణం

61. ‘న’ గణమును గుర్తించండి.
ఎ) UUU
బి) UIU
సి) III
డి) UII
జవాబు:
సి) III

62. భాస్కరా – ఇది ఏ గణము?
ఎ) త గణం
బి) జ గణం
సి) మ గణం
డి) ర గణం
జవాబు:
డి) ర గణం

వాక్యాలు :

63. పెండ్లి జరిగింది గాని సందడి లేదు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) సంయుక్త వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
ఎ) సంయుక్త వాక్యం

64. వాల్మీకి రామాయణం రచింపబడింది – దీన్ని కర్తరి వాక్యంగా రాస్తే
ఎ) వాల్మీకి వల్ల రామాయణం రాశాడు.
బి) వాల్మీకి రామాయణం రచించాడు.
సి) రామాయణం నందు వాల్మీకి రచించాడు.
డి) రచించాడు రామాయణం వాల్మీకి.
జవాబు:
బి) వాల్మీకి రామాయణం రచించాడు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

65. ‘నాకు చదవడం ఇష్టం’ అని రవి అన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) ప్రత్యక్ష కథన వాక్యం
డి) పరోక్ష కథన వాక్యం
జవాబు:
సి) ప్రత్యక్ష కథన వాక్యం

66. మీకు మేలు కలుగుగాక – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణివాక్యం
బి) ఆశీరార్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) అభ్యర్థక వాక్యం
జవాబు:
బి) ఆశీరార్థక వాక్యం

67. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) శత్రర్థక వాక్యం
బి) హేత్వర్ధక వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
బి) హేత్వర్ధక వాక్యం

68. నేను తప్పక వస్తాను – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అప్యర్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) నిశ్చయార్థక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
బి) కర్మణి వాక్యం

69. పెద్దలను మనం గౌరవించాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) కొందరు పెద్దలను గౌరవించవలెను.
బి) పెద్దలను మనం గౌరవించకూడదు.
సి) పెద్దలను మనం గౌరవించకపోవచ్చు.
డి) పెద్దలను మనం తప్పక గౌరవింపలేకపోవచ్చు.
జవాబు:
బి) పెద్దలను మనం గౌరవించకూడదు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

70. అందరు కలసి ఉండాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) అందరు కలసి ఉండకూడదు.
బి) అందరు కలసి ఉండవచ్చు.
సి) అందరు కలసి ఉండాలి గదా!
డి) కొందరు కలిసి ఉండకూడదు.
జవాబు:
ఎ) అందరు కలసి ఉండకూడదు.

సొంతవాక్యాలు :

71. జీవనవిధానం : భారతీయుల జీవనవిధానం అందరికీ ఆదర్శంగా నిలవాలి.

72. విశ్వసనీయత : నేటి రాజకీయ నాయకుల్లో విశ్వసనీయత తగ్గింది.

73. ప్రాతిపదిక : భారతీయులకు సహనం ఒక ప్రాతిపదికగా ఉంది.

74. సంస్కృతి : అమరావతికి ఘనమైన సంస్కృతి ఉంది.

75. అత్యున్నత స్థాయి : మన విద్యా ప్రమాణాలు అత్యున్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.

76. కీలకం : కోర్టులో సాక్ష్యాలు కీలకంగా మారుతాయి.

77. ఆచార వ్యవహారాలు : భారతీయుల ఆచార వ్యవహారాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయి.

78. నియమబద్ధజీవనం : ప్రాచీన కాలంలో ఋషులు నియమబద్ధ జీవనం గడిపేవారు.

79. చేదోడు వాదోడు : మిత్రులు ఒకరినొకరు చేదోడు వాదోడుగా ఉండాలి.

80. ఆలనా పాలనా : తల్లిదండ్రులు పిల్లల ఆలనా పాలనా శ్రద్ధగా చూస్తారు.

81. సహాయసహకారాలు : ఆపన్నులకు ధనవంతులు సహాయసహకారాలను అందించాలి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం.

AP State Syllabus 8th Class Telugu Important Questions 1st Lesson అమ్మకోసం

8th Class Telugu 1st Lesson అమ్మకోసం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది చుక్కగుర్తు గల పద్యాలకు భావాలను రాయండి.

1) ఉ. ఆయతపక్ష తుండహతి నక్కులతైలము లెల్ల నుగ్గుగాఁ
జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం
బాయక వీపునం దవడుఁబాముల మోవను, వారికిం బనుల్
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!

భావం:
పద్మం వంటి ముఖం గల తల్లీ ! విశాలమైన నా రెక్కలతో వాడి అయిన ముక్కుతో కుల పర్వతాలనన్నిటినీ పిండిగా చేయగల గొప్పబలం, కీర్తి నాకు ఉన్నాయి. అటువంటి నేను నీచమైన పాములను ఎల్లకాలం వీపు మీద మోయడానికీ, వాటికి సేవలు చేయడానికీ, గల కారణం ఏమిటో చెప్పు.

2) చ. అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు; నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జి
త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహాగేంద్రుఁడు సంతసంబునన్

భావం:
“నీవు అంతులేని విక్రమం, వేగం, బలం కలిగిన పక్షి శ్రేష్ఠుడివి. నీకు దాస్యం పోగొట్టు కోవాలనే అభిప్రాయం ఉంటే నీ భుజబలం, సామర్థ్యం తెలిసేలా, మాకు అమృతాన్ని తెచ్చి ఇయ్యి” అని పాములు చెప్పగా, గరుత్మంతుడు అప్పుడు సంతోషంతో.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

3) మ. వితతోల్కాశనిపుంజ మొక్కొ యనఁగా విన్వీథి విక్షిప్ర ప
క్షతి వాతాహతిఁ దూలి, తూల శకలాకారంబు లై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దల్పాలుర్ భయం బందఁగన్.

భావం:
పక్షిరాజు మనోవేగంతో బయలు దేరాడు. అప్పుడతడు నిప్పు కణాలతో కూడిన తోక చుక్కలా ఉన్నాడు. ఆకాశంలో కదలుతూ ఉన్నప్పుడు, అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూది పింజలై చెదరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా, గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్నచోటికి వెళ్ళాడు.

ఆ) కింది అపరిచిత పద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !
ప్రశ్నలు:
1. ఫణికి విషం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
ఫణికి విషం తలలో ఉంటుంది.

2. దేనికి విషం తోకలో ఉంటుంది?
జవాబు:
వృశ్చికానికి (తేలుకు) విషం తోకలో ఉంటుంది.

3. ఖలునకు విషం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
ఖలునకు విషం నిలువెల్లా (శరీరమంతా) ఉంటుంది.

4. ఈ పద్యం ద్వారా మనకు ఏం తెలుస్తోంది?
జవాబు:
ఈ పద్యం ద్వారా మనకు ఖలుని స్వభావం తెలుస్తోంది.

2. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.
ప్రశ్నలు :
1. నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
జవాబు:
నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.

2. పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.

3. ఈ పద్యానికి శీర్షికను సూచి.డి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.

4. ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

3. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
నక్షరంబు జిహ్వ కిక్షు రసము
అక్షరంబు తన్ను రక్షించు గావున
నక్షరంబు లోక రక్షితంబు.
ప్రశ్నలు:
1. మానవులకు ఏం కావాలి?
జవాబు:
మానవులకు అక్షరం (విద్య) కావాలి.

2. అక్షరం జిహ్వకు ఎటువంటిది?
జవాబు:
అక్షరం జిహ్వకు చెరకురసం వంటిది.

3. అక్షరము దేనిని రక్షిస్తుంది?
జవాబు:
అక్షరము తనను (చదువుకున్నవానిని) రక్షిస్తుంది.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘అక్షర మహిమ.’

4. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
మందుడు మృత్పిండమువలె
గిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.
ప్రశ్నలు:
1. సుజనుడు ఎట్లు ఉంటాడు?
జవాబు:
సుజనుడు కందుకంలా ఉంటాడు.

2. మందుడు ఎలా ఉంటాడు?
జవాబు:
మందుడు మృత్పిండంలా ఉంటాడు.

3. సుజనుని కవి దేనితో పోల్చాడు?
జవాబు:
సుజనుని కవి బంతితో పోల్చాడు.

4. ఈ పద్యంలోని అలంకారమేమి?
జవాబు:
ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘అమ్మకోసం’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
తెలుగులో ఆదికవిగా పేరుపొందిన నన్నయ గురించి పరిచయం చేయండి. (S.A.III – 2015-16)
జవాబు:
‘అమ్మకోసం’ అనే పాఠ్యభాగ రచయిత నన్నయభట్టు. ఈయన 11వ శతాబ్దికి చెందినవాడు. రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. సంస్కృత మహాభారతాన్ని ఆంద్రీకరించిన కవిత్రయంలో నన్నయ మొదటివాడు. ఈయనకు ఆదికవి, శబ్దశాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. భారతంలోకి ఆది, సభా పర్వాలను పూర్తిగాను, అరణ్య పర్వంలోని సగభాగాన్ని అనువదించారు.

అక్షరమ్యత, ప్రసన్నకథా కలితార్థయుక్తి, నానారుచిరార్థ సూక్తినిధిత్వం నన్నయ కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. అనువాద పద్ధతిలో, శైలిలో తరువాతి కవులకు మార్గదర్శకుడయ్యాడు నన్నయ.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
‘ఇతిహాసం’ ప్రక్రియను వివరించండి.
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘ఇతిహాసం’ అనే ప్రక్రియ ముఖ్యమైనది. ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆశురూపంలో ఉండేవి. ఇందులో కథ, కథనానికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. రామాయణ, మహాభారతాలను ఇతిహాసాలు అని అంటారు.

ప్రశ్న 3.
గరుత్మంతుని స్వభావాన్ని వివరించండి.
జవాబు:
‘అమ్మకోసం’ అనే పాఠ్యభాగంలో గరుత్మంతుని పాత్ర ప్రముఖమైనది. తల్లి పట్ల అపరిచితమైన భక్తి విశ్వాసాలు కలవాడు. తల్లిదాస్యాన్ని గూర్చి తెలుసుకున్నాడు. ఆమె దాస్యాన్ని తొలగించడానికి ప్రయత్నించాడు. అమృతభాండాన్ని తీసుకొని వచ్చి తల్లికి దాస్యవిముక్తిని కలిగించాడు.

గరుత్మంతుని వేగం అసమానమైంది. అంతులేని పరాక్రమం, గరుత్మంతునికే సొంతం. తల్లికి దాస్యవిముక్తిని కల్గించాడు. తల్లి ఆశలను నెరవేర్చాడు. పిల్లలందరు తనలాగే ఉండాలని లోకానికి తెలియజేసిన మహనీయుడు గరుత్మంతుడు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
గరుత్మంతుడు తల్లికి దాస్య విముక్తిని కల్గించి ఉత్తమునిగా కీర్తి పొందాడు కదా ! అట్లే నీ తల్లికి నీవు ఎలా సేవలు చేస్తావు? ఆమెకు ఎలాంటి ఆనందాన్ని కల్గిస్తావు?
జవాబు:
గరుత్మంతుడు తల్లిని సేవించాడు. ఆమెకు దాస్యవిముక్తిని కలిగించాడు. సమాజానికి ఆదర్శంగా నిలిచాడు. గరుత్మంతుడినే నేను ఆదర్శంగా తీసుకున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ అని పెద్దలు అంటారు. తల్లిదండ్రుల ఋణాన్ని పిల్లలు తీర్చుకోవాలి. వారికి అండగా ఉండాలి.

తల్లిదండ్రులకు ఇంటి పనుల్లోను, బయట పనుల్లోను చేదోడువాదోడుగా ఉంటాను. తల్లిదండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడతారు. తల్లిదండ్రులకు ఇబ్బందులు కలిగినపుడు వారికి అండగా ఉంటాను. తల్లిదండ్రుల కష్టాలను తొలగించేందుకు కృషి చేస్తాను.

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు కలుగదు. ఆ పుత్రుని పదిమంది మెచ్చుకొంటున్నప్పుడు కలుగుతుంది. ధృతరాష్ట్రునకు నూరుమంది కొడుకులు పుట్టారు. వారి వల్ల ఆయనకు కష్టాలే వచ్చాయి గాని సుఖం కలుగలేదు. వారందరూ అధర్మ మార్గాన నడిచారు. పాండు పుత్రులు ఐదుగురైనా ధర్మమార్గాన నడిచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. పెద్దయిన తరువాత మా తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని మేము బాగా చదువుతున్నాము. నేను, మా చెల్లి మా తల్లిదండ్రుల్ని ప్రత్యక్షదైవాలుగా చూసుకొంటున్నాము. మా చదువులు పూర్తయ్యే వరకు మా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండి, ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల కష్టాలు తొలగిస్తాము.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
తల్లిని గౌరవించాలని తెలియజేసే విధంగా కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  • తల్లిని గౌరవించు. ఆదర్శంగా జీవించు.
  • మాతృమూర్తి రూపమిచ్చిన అమృతమూర్తి,
  • సకల పుణ్యతీర్థాలు తల్లిలో ఉన్నాయి. ఆ తల్లిని మించిన దైవం లేదు.
  • కొట్టినా పెట్టేది తల్లి. పెట్టినా కొట్టేది కొడుకు.
  • కష్టబెట్టబోకు కన్నతల్లి మనసు.
  • కన్నతల్లి కంటే ఘనదైవంబు లేదు.
  • అంతులేని ప్రేమ తల్లి మనసు.
  • త్యాగానికి మరోరూపు తల్లి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
తల్లిదండ్రులను గౌరవించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

పొదిలి.
x x x x x x x

ప్రియమైన మిత్రుడు శరత్ కు,

నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన కన్న తల్లిదండ్రులు దైవంతో సమానం. వారిని గౌరవించడం మన ధర్మం. పుట్టినప్పటి నుంచి మన బాధ్యతలను తల్లిదండ్రులు చూస్తారు. వారు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పిల్లల అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులను గౌరవించాలి. వారు చెప్పినట్లు మంచి మార్గంలో నడవాలి. అందరికి ఆదర్శంగా నిలవాలి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దూరంగా విడిచిపెట్టకుండా తమ దగ్గరే ఉంచుకొని, వారి యోగక్షేమాలను చూచుకోవాలి. నీవు నా (అభిప్రాయంతో ఏకీభవిస్తావని ఆశిస్తున్నాను. పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపగలవు.)

ఇట్లు
నీ మిత్రుడు,
x x x x x x x

చిరునామా :
పి.శరత్, 8వ తరగతి,
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,
జిల్లెళ్ళమూడి, బాపట్ల మండలం,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 3.
ప్రాచీన సాహిత్యంలోని ముఖ్యమైన గ్రంథాలేమిటో మీ పాఠ్యపుస్తకం ఆధారంతో రాసి – వాటిని చదవడం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలియజేయండి. (S.A. III – 2015-16)
జవాబు:
సమాజ హితమే సాహిత్యం , సంఘంలోని ప్రజలకు మంచి చెడులను తెలియచెప్పేవి గ్రంథాలు. అందులో ప్రాచీన సాహిత్యంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రామాయణం, భారతం, భాగవతాదులు. మన పాఠ్యాంశాలలో అమ్మకోసం (ఆంధ్రమహాభారతం), హరిశ్చంద్రుడు (హరిశ్చంద్రోపాఖ్యానం) అనేవి ప్రాచీన సాహిత్య గ్రంథాలు.

ఈ గ్రంథాలు చదవడం ద్వారా ప్రజలకు అన్ని విధాల మంచి జరుగుతుంది. మాతృభక్తి, విలువలు ఒకటి చెబుతుంటే, మరొకటి వ్యక్తిత్వ విలువలు నేర్పుతుంది. తల్లిదండ్రుల పట్ల పిల్లల వైఖరి ఎలా ఉండాలో భారతం చెబుతుంది. ఇంకా ఒక సమాజానికి నిలువుటద్దంగా నిలిచింది. అందుకే ‘వింటే భారతం వినాలి’ అంటారు. అనగా సమాజంలోని వ్యక్తులకు అద్దం పట్టే విధంగా భారతం తీర్చిదిద్దబడింది. అన్ని రకాల వ్యక్తిత్వాలు భారతంలో మనం చూడవచ్చు. ధర్మం ఎవరి వైపు ఉంటుందో, వారి వైపే విజయం ఉంటుంది అని తెలుస్తుంది. హరిశ్చంద్రుడు సత్యవాక్పరిపాలన పాటించి సత్యహరిశ్చంద్రుడు అయ్యాడు. ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధం ఆడలేదు. మహాత్మగాంధీకి సత్యమార్గాన్ని చూపిన వ్యక్తి, ఈ మహనీయుడు. ఈయన కథను చదవడం ద్వారా విశ్వసనీయత, నైతిక విలువలు పెరుగుతాయి. ధర్మతత్పరతకు అవకాశం కల్గుతుంది. ‘సత్యమేవ జయతే’ అన్న సూక్తికి రూపం హరిశ్చంద్రుడు. పై గ్రంథములను చదవడం వల్ల ప్రజలకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.

8th Class Telugu 1st Lesson అమ్మకోసం 1 Mark Bits

1. అమిత పరాక్రమంబును “రయంబు”ను (అర్థాన్ని గుర్తించండి) (S.A. I. 2019-20)
ఎ) బలము
బి) వేగము
సి) దుమ్ము
డి) రజను
జవాబు:
బి) వేగము

2. మెరుపులతో పాటు కులిశములు రాలాయి (పర్యాయ పదాలు గుర్తించండి) (SA. I. 2018-19)
ఎ) పన్నగం, పిడుగు
బి) అశని, పిడుగు
సి) అశని, ఫణి
డి) గగనం, సర్పం
జవాబు:
బి) అశని, పిడుగు

3. ఆయత పక్షతుండహతి. పక్షము అనే పదానికి నానార్థాలు గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) వైపు, రెక్క
బి) రెక్క వారం
సి) పులుగు, పక్షి
డి) ఖగం , పక్షి
జవాబు:
ఎ) వైపు, రెక్క

4. “అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునపుడు సంధియగు” ఈ సూత్రం వర్తించే సంధి పదాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) నెగడెందమములు
బి) అత్యుగ్ర
సి) ఔరౌర
డి) వంటాముదం
జవాబు:
సి) ఔరౌర

5. గరుత్మంతుని పక్షములు చాలా అందమైనవి (నానార్థాలు గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) రెక్కలు, 15 రోజుల కాలం
బి) పాలు, అమృతము
సి) పృథ్వీ, ధర
డి) ఆకాశము, అంబరం
జవాబు:
ఎ) రెక్కలు, 15 రోజుల కాలం

6. గీత బజారుకు వెళ్లి కూరగాయలు కొన్నది (ఏ వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) శత్రర్థకం
బి) సంక్లిష్ట
సి) సంయుక్త
డి) సామాన్య
జవాబు:
బి) సంక్లిష్ట

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

7. మహాభారతమును తెలుగులో మొట్టమొదటగా నన్నయ రాశారు. (సంధి పేరు గుర్తించండి) (SA. II – 2017-18)
ఎ) ఆమ్రేడిత
బి) గుణ
సి) అకార
డి) త్రిక
జవాబు:
ఎ) ఆమ్రేడిత

8. అశని ధ్వని వింటే నాకు భయంగా ఉంటుంది. (సమానార్థక పదాలు గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) పిడుగు – కులిశం
బి) అల – గోల
సి) తరంగం – అల
డి) సరస్సు – శిరస్సు
జవాబు:
ఎ) పిడుగు – కులిశం

9. “నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు” ఇది ఏ రకమైన వాక్యం (S.A. III – 2015-16)
ఎ) కర్తరి వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) సామాన్య వాక్యం
డి) సంక్లిష్ట వాక్యం
జవాబు:
సి) సామాన్య వాక్యం

భాషాంశాలు – పదజాలం

ఆర్థాలు :

10. విద్యార్థులకు అభీష్టం చదువుపట్లే ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) కోరిక
బి) అమరిక
సి) తపన
డి) అంతరంగం
జవాబు:
ఎ) కోరిక

11. గగనంలో చంద్రుడు ఉదయించాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) త్రిదిపం
బి) ఆకాశం
సి) దరి
డి) దారి
జవాబు:
బి) ఆకాశం

12. ఈ సంవత్సరంలో వృష్టి కురిసింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) క్షేత్రం
బి) నింగి
సి) వాన
డి) క్షీరం
జవాబు:
సి) వాన

13. దివాకరుడు వెలుగును ఇచ్చాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) శుక్రుడు
బి) తపన
సి) పాంథము
డి) సూర్యుడు
జవాబు:
డి) సూర్యుడు

14. పుట్టలో ఉదగం ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) భుజం
బి) భుజగం
సి) శీర్షం
డి) ఉదరం
జవాబు:
బి) భుజగం

15. కుశమును కోయడం చాలా కష్టం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) దర్భ
బి) ధర
సి) ధరణి
డి) వసుధ
జవాబు:
ఎ) దర్భ

16. అనిమిషనాథుడు వయుధం ధరించాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) శని
బి) కుబేరుడు
సి) ఇంద్రుడు
డి) వాయువు
జవాబు:
సి) ఇంద్రుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

17. అమరులు అమృతం త్రాగారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) కిన్నెరులు
బి) రాక్షసులు
సి) గంధర్వులు
డి) దేవతలు
జవాబు:
డి) దేవతలు

పర్యాయపదాలు :

18. తల్లి పుత్రుని రక్షించు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) అంబ, అంబాలిక
బి) మాత, జనని
సి) అమ్మ, అమృతం
డి) వనిత, మాత
జవాబు:
బి) మాత, జనని

19. దినకరుడు అస్తమించాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) జలధి, జలజం
బి) రజనీశ్వరుడు, రాతిరి
సి) సూర్యుడు, ఆదిత్యుడు
డి) మారుతి, ఇనుడు
జవాబు:
సి) సూర్యుడు, ఆదిత్యుడు

20. ఖగము గగనంపై విహరించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పుండరీకం, శృంగాలం
బి) నక్క, కాకి
సి) బకము, వింజామరం
డి) పక్షి, పులుగు
జవాబు:
డి) పక్షి, పులుగు

21. శైలంబుపై ఝరి ప్రవహించింది – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
ఎ) అది
బి) తరువు
సి) నగరం
డి) పథము
జవాబు:
ఎ) అది

22. ఆననం పై కుంకుమ బొట్టు ఉంది – గీత గీసిన పదానికి సమానార్థకం గుర్తించండి.
ఎ) కరం
బి) ముఖం
సి) నాశిక
డి) కర్ణం
జవాబు:
బి) ముఖం

ప్రకృతి – వికృతులు :

23. హృదయం నిర్మలంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) ఎద
బి) హేయం
సి) హాయం
డి) హంస
జవాబు:
ఎ) ఎద

24. శక్తి మించి పని చేయరాదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సత్తి
బి) సెత్తి
సి) సొత్తి
డి) మిత్తి
జవాబు:
ఎ) సత్తి

25. కులము కంటే గుణము మిన్న – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) కొలము
బి) గొలము
సి) కెలము
డి) కిలము
జవాబు:
ఎ) కొలము

26. అగ్ని మండును – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) అగ్గే
బి) అగ్గి
సి) అగ్గి
డి) అచ్చి
జవాబు:
బి) అగ్గి

27. ప్రజలు సంతోషం పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) సంతషం
బి) సెంతసం
సి) సొంతసం
డి) సంతసం
జవాబు:
డి) సంతసం

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

28. మానవుడు ముతి పొందాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) ముగిచె
బి) ముక్తి
సి) ముత్తె
డి) ముచ్చ
జవాబు:
బి) ముక్తి

నానార్థాలు :

29. అన్నింట అర్థం అవసరం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కారణం, కాసర
బి) సంపద, శబ్దార్థం
సి) శ్రీ, గానుగ
డి) లక్ష్మి, అరమరిక
జవాబు:
బి) సంపద, శబ్దార్థం

30. పక్షి రయమున వెళ్ళె – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వనము, వేగము
బి) వేదం, వెల్లువ
సి) వేగం, వేకువు
డి) వేకువ, వరద
జవాబు:
బి) వేదం, వెల్లువ

31. దేవతలు సుధను త్రాగారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) అమృతం, పాలు
బి) నీరు, నాలుక
సి) జలం, వారి
డి) క్షీరం, సున్నం
జవాబు:
ఎ) అమృతం, పాలు

32. పక్షి పక్షములతో ఎగిరింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) 15 రోజులకాలం
బి) క్షీరం
సి) జలధి
డి) ఉదధి
జవాబు:
ఎ) 15 రోజులకాలం

33. సరస్సులో వారి ఉంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) లావు
బి) సరస్వతి
సి) సామర్థ్యం
డి) లక్ష్మి
జవాబు:
బి) సరస్వతి

వ్యుత్పత్తర్థాలు :

34. దేవతలు అమృతం త్రాగారు – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
ఎ) మృతి కావాలనేది
బి) మరణము పొందింపనిది
సి) మరణం కానిది
డి) మరణం చెందేది
జవాబు:
బి) మరణము పొందింపనిది

35. పున్నామ నరకం నుండి రక్షించువాడు-అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) పుత్రుడు
బి) భూమాత
సి) జనకుడు
డి) పురం
జవాబు:
ఎ) పుత్రుడు

36. అనిమిషనాథుడు దివి యందు ఉండె – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం గుర్తించండి.
ఎ) దేవతలకు ప్రభువు
బి) రాక్షసులకు రాజు
సి) దేవతలకు గురువు
డి) దేవతలకు సేనాని
జవాబు:
ఎ) దేవతలకు ప్రభువు

37. వెనతేయుడు బుధిమంతుడు – గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) వినత యొక్క అల్లుడు
బి) వినత యొక్క కుమారుడు
సి) వినత యొక్క మామ
డి) వినత యొక్క ఆశయం
జవాబు:
బి) వినత యొక్క కుమారుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

38. భుజంగము – దీనికి వ్యుత్పత్తి ఏది?
ఎ) వేగంగా పోవునది
బి) మంధముగా పోవునది
సి) కుటిలముగా పోవునది
డి) గగనంపై వెళ్ళునది
జవాబు:
సి) కుటిలముగా పోవునది

39. ఖేచరం విహరించును – గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) సర్వత్ర తినునది
బి) ఆకాశమున సంచరించునది
సి) ఆకాశంచేత పయనించునది
డి) స్వర్గంపై తిరిగేది
జవాబు:
బి) ఆకాశమున సంచరించునది

వ్యాకరణాంశాలు

సంధులు :

40. అత్యుగ్రం – దీన్ని విడదీయడం గుర్తించండి.
ఎ) అతో + అగ్రము
బి) అతీ + అగ్రము
సి) అతే + అగ్రం
డి) అతి + ఉగ్రము
జవాబు:
డి) అతి + ఉగ్రము

41. దధ్యోదనం – ఇది ఏ సంధి?
ఎ) సునీతి పరిమళాలు
బి) నీతి పరిమళాలు
సి) పరిమళనీతులు
డి) అపరిమళనీతులు
జవాబు:
ఎ) సునీతి పరిమళాలు

42. చిట్టచివర ఉన్నాను – దీనిని విడదీయడం గుర్తించండి.
ఎ) చిట్టి + చివర
బి) చివర + చివర
సి) చిట్ట + చివర
డి) చిరు + చివర
జవాబు:
బి) చివర + చివర

43. ద్విరుక్తము యొక్క పరరూపాన్ని ఏమంటారు?
ఎ) ఆమ్రేడితం
బి) త్రికము
సి) ఉత్వ
డి) శత్రర్థకం
జవాబు:
ఎ) ఆమ్రేడితం

44. వృద్ధులు అనగా ఏవి?
ఎ) ఆ, ఈ, ఏ
బి) ఉ, ఋ, ఎ
సి) య, వ, ర, ల
డి) ఐ, ఔ
జవాబు:
డి) ఐ, ఔ

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

45. దేశోన్నత్యం పెరగాలి – ఇది ఏ సంధి?
ఎ) అత్వసంధి
బి) వృద్ధిసంధి
సి) త్రికసంధి
డి) యణాదేశ సంధి
జవాబు:
బి) వృద్ధిసంధి

46. క్రింది వానిలో పొసగని సంధి ఏది?
ఎ) ఇత్వసంధి
బి) ఉత్వసంధి
సి) త్రికసంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) త్రికసంధి

47. మనోవేగంతో వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) విసర్గసంధి
సి) గుణసంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
బి) విసర్గసంధి

సమాసాలు :

48. సంఖ్యా శబ్దం కలిగిన సమాసమును గుర్తించండి.
ఎ) ద్వంద్వ సమాసం
బి) ద్విగు సమాసం
సి) షష్ఠీ తత్పురుష
డి) తృతీయా తత్పురుష
జవాబు:
బి) ద్విగు సమాసం

49. వనకరి – ఇది ఏ సమాసము?
ఎ) ద్వితీయా తత్పురుష
బి) చతుర్థి తత్పురుష
సి) సప్తమీ తత్పురుష
డి) అవ్యయీభావ సమాసం
జవాబు:
సి) సప్తమీ తత్పురుష

50. గుణసంయుతులు – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) గుణమునందు సంయుతులు
బి) గుణము యొక్క సంయుతులు
సి) గుణములతో సంయుతులు
డి) గుణం వల్ల సంయుతులు
జవాబు:
బి) గుణము యొక్క సంయుతులు

51. నీతి యొక్క పరిమళాలు – దీనికి సమస్త పదం గుర్తించండి.
ఎ) యణాదేశ సంధి
బి) గుణసంధి
సి) త్రికసంధి
డి) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
బి) గుణసంధి

52. సూర్యుని దెస – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) దెస సూర్యుడు
బి) సూర్యదేస
సి) అసూర్యదెస
డి) సూర్యుని యొక్క దెస
జవాబు:
డి) సూర్యుని యొక్క దెస

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

53. దినము దినము – దీన్ని సమాసపదంగా గుర్తించండి.
ఎ) యథాదినం
బి) ప్రతిదినం
సి) దినంప్రతి
డి) అనుదినం
జవాబు:
బి) ప్రతిదినం

54. తల్లిదండ్రులు – ఇది ఏ సమాసం?
ఎ) ద్వంద్వ సమాసం
బి) అవ్యయీభావం
సి) కర్మధారయం
డి) ద్విగు సమాసం
జవాబు:
ఎ) ద్వంద్వ సమాసం

55. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసాన్ని గుర్తించండి.
ఎ) బహుజొహి
బి) కర్మధారయం
సి) అవ్యయీభావం
డి) తత్పురుష
జవాబు:
ఎ) బహుజొహి

గణవిభజన:

56. రగణం – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UUI
బి) UUU
సి) UIU
డి) IUU
జవాబు:
సి) UIU

57. వితతోల్కాశనిపుంజ మొక్క యనఁగా విన్వీథి విక్షిప్త ప – ఇది ఏ పద్యపాదమో గుర్తించండి?
ఎ) చంపకమాల
బి) ఉత్పలమాల
సి) మత్తేభం
డి) శార్దూలం
జవాబు:
సి) మత్తేభం

58. క్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబు లై వారిద – ఇది ఏ పద్యపాదమో తెల్పండి.
ఎ) చంపకమాల
బి) మత్తేభం
సి) శార్దూలం
డి) ఉత్పలమాల
జవాబు:
బి) మత్తేభం

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

59. ఘోరవికార సన్నిహిత కోపముఖంబులు, దీప్తవిద్యుడు – ఇది ఏ పద్యపాదమో గుర్తించండి.
ఎ) ఉత్పలమాల
బి) చంపకమాల
సి) శార్దూలం
డి) మత్తేభం
జవాబు:
ఎ) ఉత్పలమాల

60. UUU – ఇది ఏ గణం?
ఎ) మ గణం
బి) య గణం
సి) త గణం
డి) స గణం
జవాబు:
ఎ) మ గణం

61. ఆటవెలదిలోని రెండు, నాలుగు పాదాల్లో ఉండే గణాలు గుర్తించండి.
ఎ) 3 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు
బి) 5 సూర్యగణాలు
సి) 2 సూర్యగణాలు 3 ఇంద్రగణాలు
డి) 5 ఇంద్రగణాలు
జవాబు:
బి) 5 సూర్యగణాలు

వాక్య రకాలు :

62. రాము తప్పక వస్తాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) ఆనంతర్యార్థక వాక్యం
సి) నిశ్చయార్థక వాక్యం
డి) అప్యర్థక వాక్యం
జవాబు:
సి) నిశ్చయార్థక వాక్యం

63. రవి పాఠం విని నిద్రపోయాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) సామాన్య వాక్యం
జవాబు:
బి) సంక్లిష్ట వాక్యం

64. “నాకు ఆటలంటే ఇష్టం” అని రవి అన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్తరి వాక్యం
బి) ప్రత్యక్ష కథన వాక్యం
సి) పరోక్ష కథన వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
బి) ప్రత్యక్ష కథన వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

65. మీకు మేలు కలుగుగాక – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) చేదర్థకం
బి) ఆశీరార్థకం
సి) అభ్యర్థకం
డి) ధాత్వర్ధకం
జవాబు:
ఎ) చేదర్థకం

66. బాగా చదివితే మార్కులు వస్తాయి – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) తర్థర్మార్థక వాక్యం
సి) చేదర్థక వాక్యం
డి) అభ్యర్థక వాక్యం
జవాబు:
బి) తర్థర్మార్థక వాక్యం

67. గరుత్మంతుడు దాస్యం తొలగించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
ఎ) గరుత్మంతునిచేత దాస్యం తొలగించబడింది
బి) గరుత్మంతుని వల్ల దాస్యం చేరింది
సి) గరుత్మంతునికి దాన్యం తొలగాలి
డి) దాస్యంచేత గరుత్మంతుడు తొలగించాడు
జవాబు:
ఎ) గరుత్మంతునిచేత దాస్యం తొలగించబడింది

68. రైలు వచ్చింది గాని చుట్టాలు రాలేదు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) హేత్వర్థక వాక్యం
సి) అప్యర్థక వాక్యం
డి) సంయుక్త వాక్యం
జవాబు:
డి) సంయుక్త వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

69. గరుత్మంతుడు ఎగిరి వెళ్ళాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
ఎ) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళియుండకూడదు
బి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళలేదు
సి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళవచ్చు
డి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళకూడదు
జవాబు:
బి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళలేదు

సొంతవాక్యాలు :

70. అన్యులు : కుటుంబ విషయాలను అన్యులకు చెప్పరాదు.

71. గుప్తము : విద్య మానవునికి గుప్తమగు ధనము.

72. ఉత్తముడు : శ్రీరాముడు మానవులలో పరమ ఉత్తముడు.

73. కరుణ : పేదప్రజలపై ధనవంతులు కరుణ చూపాలి.

74. సమర్థులు : సమర్థులు మాత్రమే అసాధ్యములైన పనులు చేస్తారు.

75. ప్రసిద్ధికెక్కు : అమరావతి చారిత్రాత్మకంగా మిక్కిలి ప్రసిద్ధికెక్కింది.

76. ఉపాయము : ఉపాయముతో అపాయాన్ని తొలగించుకోవచ్చు.

78. దాస్యము : విదేశీయుల పాలనలో భారతీయులు దాస్యము అనుభ వించారు.

79. విముక్తులు : ఖైదీలు సత్ప్రవర్తనతో జైలు నుండి విముక్తులయ్యారు.

80. దీవెనలు : తల్లిదండ్రులు తమ పిల్లలకు దీవెనలు అందజేస్తారు.

AP Board 8th Class Telugu Grammar

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions 8th Class Telugu Grammar Notes, Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Grammar

తెలుగు సంధులు

నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి.

గమనిక :
పై వాక్యంలో “చిన్నప్పుడు” అనే పదం, చిన్న + అప్పుడు అనే రెండు పదాలు కలవడం వల్ల వచ్చింది. దీనినే “సంధి పదం” అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం, రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసినప్పుడు, లేదా రాయవలసినప్పుడు, “సంధి పదం” ఏర్పడుతుంది.

* తెలుగు సంధులు: రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధులను “తెలుగు సంధులు” అంటారు.

* సంధి : వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల (అచ్చుల) కలయికను “సంధి” అని పిలుస్తారు.

* సంధి కార్యం : రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును “సంధి కార్యం” అని పిలుస్తారు.

* పూర్వ స్వరం : సంధి జరిగే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును, (స్వరాన్ని) “పూర్వ స్వరం” అని పిలుస్తారు.

* పర స్వరం : సంధి జరిగే రెండవ పదం మొదటి అక్షరంలోని అచ్చును (స్వరాన్ని) “పర స్వరం” అని పిలుస్తారు.
ఉదా :
రామ + అయ్య : ‘మ’ లో ‘అ’, పూర్వ స్వరం; ‘అయ్య’ లోని ‘అ’ పర స్వరం.

1. అత్వ సంధి సూత్రం : అత్తునకు సంధి బహుళం.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
మేనల్లుడు = మేన + అల్లుడు – (న్ +) అ + అ = అ – (అత్వ సంధి)
1) ఒకప్పుడు = ఒక + అప్పుడు – (అ + అ = అ) – (అత్వ సంధి)
2) వచ్చినందుకు = వచ్చిన + అందుకు – (అ + అ = అ) – (అత్వ సంధి)
3) రాకుంటే = రాక + ఉంటే – (అ + ఉ = ఉ) – (అత్వ సంధి)
4) లేకేమి = లేక + ఏమి = (అ + ఏ = ఏ) – (అత్వ సంధి)
5) పోవుటెట్లు = పోవుట + ఎట్లు – (అ + ఎ = ఎ) – (అత్వ సంధి)
6) చేసినంత = చేసిన + అంత – (అ + అ = అ) – (అత్వ సంధి)
7) విరిగినప్పుడు = విరిగిన + అప్పుడు – (అ + అ = అ) – (అత్వ సంధి)
8) చాలకున్న = చాలక + ఉన్న – (అ + ఉ = ఉ) – (అత్వ సంధి)
9) ఒకింత = ఒక + ఇంత = (అ + ఇ = ఇ) = (అత్వ సంధి)

గమనిక :
పై సంధి పదాలలోని పూర్వ స్వరం ‘అ’. అది పర స్వరంలోని అచ్చుతో కలిస్తే పూర్వ స్వరం ‘అ’ లోపిస్తుంది. ‘అ’ లోపించింది కాబట్టి ‘అత్వ సంధి’.

అత్వసంధి లేక ‘అకారసంధి’ అంటారు. పొట్టి ‘అ’ అనే అక్షరానికి అచ్చు పరమైతే ‘అత్వ సంధి’ వస్తుంది.

అత్వ సంధి (అకార సంధి) సూత్రం : అత్తునకు సంధి బహుళం.

AP Board 8th Class Telugu Grammar

2. ఇత్వ సంధి సూత్రం : ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) ఏమంటివి = ఏమి + అంటివి – (ఇ + అ = అ) – (ఇత్వసంధి)
సంధి జరుగనప్పుడు “య కారం” ఆగమంగా వస్తుంది. దానినే ‘యడాగమం’ అని పిలుస్తారు.

ఆ) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి – (ఇ + అ = య) – (ఇకార సంధి రాని యడాగమ రూపం)
ఇ) వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు – (ఇ + ఇ = ఇ) – ఇత్వసంధి
ఈ) వచ్చిరిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు – (ఇ + ఇ + యి) – (యడాగమం వచ్చిన రూపం)

గమనిక :
పై ఉదాహరణలలో హ్రస్వ ఇకారానికి అచ్చు కలిసినపుడు సంధి జరిగింది. దీనిని “ఇత్వసంధి” అంటారు. ఇత్వసంధి తప్పక జరగాలన్న నియమం లేదు.

* వైకల్పికం :
ఇత్వ సంధి జరగవచ్చు లేక జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని “వైకల్పికం” అని పిలుస్తారు.

అభ్యాసం :
ఉదా :
1) ఏమంటివి = ఏమి + అంటివి – (మ్ + ఇ + అ = మ)
2) పైకెత్తినారు = పైకి + ఎత్తినారు – (ఇ + ఎ = ఎ) – ఇత్వసంధి
3) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు – (ఇ + అ = అ) – ఇత్వసంధి
4) దారవుతుంది = దారి + అవుతుంది – (ఇ + అ = అ) – ఇత్వసంధి
5) పైకెత్తు = పైకి + ఎత్తు – (ఇ + ఎ = ఎ) – ఇత్వసంధి
6) జగానికంతా = జగానికి + అంతా – (ఇ + అ = ఆ) – ఇత్వసంధి
7) అదేమిటి = అది + ఏమిటి – (ఇ + ఏ = ఏ) – ఇత్వసంధి
8) వెళ్ళాలని = వెళ్ళాలి + అని – (ఇ + అ = అ) – ఇత్వ సంధి

ఇత్వసంధి సూత్రం :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.

3. ఉత్వ సంధి (ఉకారసంధి) సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
రాముడతడు = రాముడు + అతడు – (డ్ + ఉ + అ = డ) – (ఉత్వ సంధి)
1) అతడెక్కడ = అతడు + ఎక్కడ – (ఉ + ఎ = ఎ) – (ఉత్వ సంధి)
2) మనమున్నాము = మనము + ఉన్నాము – (ఉ + ఉ = ఉ) – (ఉత్వ సంధి)
3) మనసైన = మనసు + ఐన – (ఉ + ఐ = ఐ) – (ఉత్వ సంధి)
4) బాల్యమంతా = బాల్యము + అంతా – (ఉ + అ = అ) – (ఉత్వసంధి)
5) దేవతలంతా = దేవతలు + అంతా – (ఉ + అ = అ) – (ఉత్యసంధి)
6) అందమైన = అందము + ఐన – (ఉ + ఎ = ఐ) – (ఉత్వసంధి)
7) తలపెల్ల = తలపు + ఎల్ల (ఉ + ఎ = ఎ) – (ఉత్వసంధి)

గమనిక :
హ్రస్వ ఉకారానికి, అనగా ఉత్తుకు, అచ్చు కలిసినప్పుడు, పూర్వ స్వరం ఉకారం లోపించి, పర స్వరం కనిపిస్తుంది.
లోపించిన పూర్వ స్వరం ‘ఉ’ కాబట్టి, ఇది “ఉత్వ సంధి” అని పిలువబడుతుంది.

ఉత్వ సంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

నిత్యం :
నిత్యం అంటే, తప్పక సంధికార్యం జరుగుతుందని అర్థం.

4. యడాగమం :
సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అని పిలుస్తారు.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) మాయమ్మ = మా + అమ్మ = మాయమ్మ
ఆ) మాయిల్లు = మా + ఇల్లు = మాయిల్లు
ఇ) హరియతడు = హరి + అతడు = హరియతడు

గమనిక :
పై ఉదాహరణలలో సంధి జరుగలేదు. కానీ కొత్తగా ‘య్’ వచ్చి చేరింది. అలా చేరడం వల్ల ఈ కింది విధంగా మార్పు జరిగింది.
అ) మా + య్ + అమ్మ : మా ‘య’ మ్మ
ఆ) మా + య్ + ఇల్లు : మా ‘యి’ ల్లు
ఇ) హరి + య్ + అతడు = హరి ‘య’ తడు

యడాగమ సంధి
సూత్రం : సంధి లేనిచోట “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అంటారు.

AP Board 8th Class Telugu Grammar

5. ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా వస్తుంది.

ఆమ్రేడితం :
ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించగా, రెండవసారి ఉచ్చరించిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.
ఉదా :
1) ఆహాహా – ‘ఆహా + ఆహా’ ఆహా అనే పదం రెండుసార్లు వచ్చింది. అందులో రెండవ ‘ఆహా’ అనే దాన్ని ఆమ్రేడితం అని పిలవాలి.
2) అరెరె = అరె + అ = రెండవసారి వచ్చిన ‘అరె’ ఆమ్రేడితం.
3) ఔరౌర = ఔర + ఔర – రెండవసారి వచ్చిన ‘ఔర’ ఆమ్రేడితం.

గమనిక :
పై ఉదాహరణలలో ఒక్కొక్క పదం రెండుసార్లు వచ్చింది. రెండవసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.

ఆమ్రేడిత సంధికి ఉదాహరణములు :
ఔర + ఔర = ఔర్ + అ
ఆహా + ఆహా ఆహ్ + ఆ
ఓహో + ఓహో = ఓహ్ + ఓ

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వ పదం అనగా మొదటి పదం చివర, అ, ఆ, ఓ వంటి అచ్చులున్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే, సంధి వస్తుంది.

ఔర + ఔర = ఔరౌర – (అ + ఔ = ఔ)
ఆహా + ఆహా = ఆహాహా – (ఆ + ఆ = ఆ)
ఓహోహో = ఏమి + ఏమి – (ఓ + ఓ = ఓ)
ఏమి + ఏమి = ఏమేమి – (ఇ + ఏ = ఏ)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు – (ఉ + ఎ = ఎ)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి – (ఇ + ఏ = ఏ)
అరె + అరె = అరెరె – (ఎ + అ = అ)

పై విషయాలను గమనిస్తే ఆమ్రేడిత సంధి సూత్రాన్ని ఇలా తయారుచేయవచ్చు.

ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా వస్తుంది.

గమనిక :
ఆమ్రేడిత సంధి కింది ఉదాహరణలలో వికల్పంగా జరుగుతుంది. ఈ కింది ఉదాహరణలను గమనిస్తే సంధి జరిగిన రూపం, సంధిరాని రూపమూ కనబడతాయి.
ఉదా :
ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి (సంధి వైకల్పికం)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు, ఎట్లుయెట్లు (సంధి వైకల్పికం)
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత (సంధి వైకల్పికం)

6. ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి :
కింది ఉదాహరణలను గమనించండి.
1) పగలు + పగలు = పట్టపగలు
2) చివర + చివర = చిట్టచివర
3) కడ + కడ = కట్టకడ

గమనిక :
1) పగలు + పగలు = పట్టపగలు అవుతోంది. అంటే ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ అన్న అక్షరాలకు బదులుగా ‘ట్ట’ వచ్చింది. ‘ట్ట’ వచ్చి ‘పట్టపగలు’ అయింది.
2) చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘ట్ట’ వచ్చి, ‘చిట్టచివర’ అయింది.
3) కడ + కడ అన్నప్పుడు ‘డ’ స్థానంలో ‘మీ’ వచ్చి ‘కట్టకడ’ అయింది. ఇప్పుడు కింది వాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్ట యెదురు
కొన + కొన = కొట్టకొన
మొదట + మొదట = మొట్టమొదట
బయలు + బయలు = బట్ట బయలు
తుద + తుద = తుట్టతుద

గమనిక :
ఆమ్రేడితం పరంగా ఉంటే, కడ మొదలైన శబ్దాల మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలకు ‘ట్ట’ వస్తుండడం గమనించాం.

సూత్రం :
ఆమ్రేడితం పరంగా ఉంటే, కడాదుల తొలి అచ్చు మీది అగ్ని అక్షరాలకు ఆద్యంతమైన ద్విరుక్తటకారం వస్తుంది.

AP Board 8th Class Telugu Grammar

7. ద్రుతప్రకృతిక సంధి (సరళాదేశ సంధి) :
ఈ కింది పదాలు చదివి పదంలోని చివర అక్షరం కింద గీత గీయండి.
1) పూచెను 2) చూచెన్ 3) తినెను 4) ఉండెన్

గమనిక :
పై పదాలను గమనిస్తే పదాల చివర, ను, చ్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉంది. ఈ నకారాన్ని ‘ద్రుతం’ అంటారు. ద్రుతము చివరన గల పదాలను “ద్రుత ప్రకృతికములు” అంటారు.

గమనిక :
పూచెను, చూచెన్, తినెన్, ఉండెన్ – అనేవి ద్రుత ప్రకృతికములు.

కింది ఉదాహరణములను గమనించండి.
ఉదా : అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి
ఊ) చేసెను + తల్లీ = చేసెను + దల్లీ
ఋ) దెసను + చూసి = దెసను + జూసి

గమనిక :
ద్రుతప్రకృతానికి ‘క’ పరమైతే ‘గ’, ‘చ’ పరమైతే ‘జ’, ‘ట’ పరమైతే ‘డ’, ‘త’ పరమైతే ‘ద’, ‘ప’ పరమైతే ‘బ’ ఆదేశంగా వస్తాయి.
1) క – ‘గ’ గా, 2) చ – ‘జ’ గా 3) ట – ‘డ’ గా 4) త – ‘ద’ గా 5) ప – ‘బ’ గా మార్పు వచ్చింది.

ఇందులో ‘క చ ట త ప’ లకు ‘పరుషములు’ అని పేరు, ‘గ జ డ ద బ’ లకు ‘సరళములు’ అని పేరు. దీనిని బట్టి సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉంటుంది.

సూత్రం :
ద్రుతప్రకృతికము మీది పరుషాలకు సరళాలు వస్తాయి.

గమనిక :
ఇప్పుడు పై ఉదాహరణలలో మార్పు గమనించండి.
ఉదా :
పూచెఁ గలువలు ; (ద్రుతం అరసున్నగా మారింది)
పూచెను + కలువలు (పూచెం గలువలు (ద్రుతం సున్నగా మారింది) పూచెన్గలువలు (ద్రుతం మీది హల్లుతో కలిసి సంశ్లేష రూపం అయ్యింది) పూచెను గలువలు (ద్రుతము మార్పు చెందలేదు) దీనికి సూత్రం చెపితే సూత్రం ఇలా ఉంటుంది.

2వ సూత్రం :
ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.
గమనిక :
అంటే ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.

8. గసడదవాదేశ సంధి :
కింది పదాలను ఎలా విడదీశారో గమనించండి.
1) గొప్పవాడుగదా = గొప్పవాడు + కదా డు + క)
2) కొలువు సేసి = కొలువు + చేసి (వు + చే)
3) వాడుడక్కరి = వాడు + టక్కరి (డు + ట)
4) నిజముదెలిసి = నిజము + తెలిసి (ము + తె)
5) పాలువోయక = పాలు + పోయక (లు + పో)

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వపదం చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప లు ఉన్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీద, ప్రత్యయాలు క, చ, ట, త, ప లు పరమైతే, వాటి స్థానంలో గ, స, డ, ద, వ, లు ఆదేశంగా వస్తాయి. అంటే –
1) క – గ – గా మారుతుంది
2) చ – స గా మారుతుంది
3) ట – డ గా మారుతుంది.
4) త – ద – గా మారుతుంది
5) ప – వ గా మారుతుంది

అంటే క, చ, ట, త, ప లకు, గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి.

AP Board 8th Class Telugu Grammar

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గ స డ ద వ లు బహుళంగా వస్తాయి.

ద్వంద్వ సమాసంలో గ స డ ద వా దేశ సంధి :
కింది పదాలను గమనించండి.
కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి + లు
టక్కుడెక్కులు = టక్కు + టెక్కు + లు
తల్లి దండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు : ఊరు + పల్లె + లు
నల్ల గలువలు = నల్ల + కలువ + లు

గమనిక :
పై ఉదాహరణలు ద్వంద్వ సమాసపదాలు. పై ఉదాహరణలలో కూడా క చట త ప లకు గ స డ ద వ లు వచ్చాయి. దీన్నే గ స డ ద వా దేశం అంటారు.

గసడదవాదేశ సంధి
సూత్రం : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న క చ ట త ప లకు గ స డ ద వ లు క్రమంగా వస్తాయి.
కింది పదాలను కలపండి.
1) అక్క + చెల్లి = అక్కాసెల్లెండ్రు
2) అన్న + తమ్ముడు = అన్నదమ్ములు
3) నల్ల + కలువ = నల్ల కలువలు

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ అనే వర్ణాలకు అవే (స)వర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం తప్పనిసరిగా వస్తుంది.

గమనిక :
‘అ’ వర్ణానికి – ‘అ, ఆ’ లు – సవర్ణాలు
‘ఇ’ వర్ణానికి – ‘ఇ, ఈ’ లు – సవర్ణాలు
‘ఉ’ వర్ణానికి – ‘ఉ, ఊ లు’ – సవర్ణాలు
‘ఋ’ వర్ణానికి – ‘బు, ఋ’ లు – సవర్ణాలు

ఉదా :
1) రామానుజుడు = రామ + అనుజుడు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
2) రామాలయం = రామ ఆలయం – (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
3) కవీంద్రుడు = ఇంద్రుడు – (ఇ + ఇ = ఈ) = సవర్లదీర్ఘ సంధి
4) భానూదయం = భాను + ఉదయం (ఉ + ఉ = ఊ) – సవర్ణదీర్ఘ సంధి
5) వధూ పేతుడు = వధూ + ఉపేతుడు – (ఊ + ఉ = ఊ) – సవర్ణదీర్ఘ సంధి
6) పిత్రణం = పితృ + ఋణం – (ఋ + ఋ = ఋ) – సవర్ణదీర్ఘ సంధి
7) మాత్రణం = మాతృ + ఋణం – (ఋ + ఋ = ఋ) – సవర్ణదీర్ఘ సంధి
8) విద్యాధికుడు = విద్య + అధికుడు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
9) విలాపాగ్నులు = విలాప + అగ్నులు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
10) విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
11) ప్రేమానురాగాలు = ప్రేమ + అనురాగాలు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
12) పవనాగ్ని = పవన + అగ్ని – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Grammar

2. గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తాయి.
1. ఉదా :
రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు – (ఆ + ఇ = ఏ) – గుణసంధి
మహేంద్రుడు = మహా + ఇంద్రుడు – (ఆ + ఇ = ఏ) – గుణసంధి
నరేంద్రుడు = నర + ఇంద్రుడు – (అ + ఇ = ఏ) – గుణసంధి
సురేంద్రుడు = సుర + ఇంద్రుడు – (అ + ఇ = ఏ) – గుణసంధి
నిజేచ్ఛ = నిజ + ఇచ్చ – (అ + ఇ = ఏ) – గుణసంధి

2.ఉదా :
పరోపకారం = పర + ఉపకారం – (అ + అ + ఉ) – గుణసంధి
మహోన్నతి = మహా + ఉన్నతి – (ఆ + ఉ + ఓ) – గుణసంధి
దేశోన్నతి = దేశ + ఉన్నతి – (అ + ఉ = ఓ) – గుణసంధి
గృహోపకరణం = గృహ + ఉపకరణం – (అ + ఉ = ఓ) – గుణసంధి
రజోవృష్టి = రజ + వృష్టి – (అ + ఉ = ఓ) – గుణ సంధి
గుళోన్నతి = గుణ + ఉన్నతి – (అ + ఉ = ఓ) – గుణసంధి
సూర్యోదయం = సూర్య + ఉదయం = (అ + ఉ = ఓ) = గుణసంధి

3. ఉదా :
రాజర్షి = రాజ + ఋషి – (అ + ఋ = అర్) – గుణసంధి
మహర్షి = మహా + ఋషి – (ఆ + ఋ = అర్) – గుణసంధి

గమనిక :
1) అ, ఆ లకు, ఇ, ఈ లు కలిసి ‘ఏ’ గా మారడం
2) అ, ఆ లకు, ఉ, ఊ లు కలిసి ‘ఓ’ గా మారడం
3) అ, ఆ లకు, ఋ, ౠ లు కలిసి ‘అర్’ గా మారడం.

పై మూడు సందర్భాల్లోనూ, పూర్వ స్వరం అంటే సంధి విడదీసినపుడు మొదటి పదం చివరి అచ్చు, అ, ఆ లుగా ఉంది. పర స్వరం, అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు ఇ, ఉ, ఋలుగా ఉన్నాయి.

గమనిక :
1) అ, ఆ లకు – ‘ఇ’ కలిస్తే ‘ఏ’ గా మారుతుంది.
2) అ, ఆ లకు – ‘ఉ’ కలిస్తే ‘ఓ’ గా మారుతుంది.
3) అ, ఆ లకు – ‘ఋ’ కలిస్తే ‘అర్’ గా మారుతుంది.

గమనిక :
ఏ, ఓ, అర్ అనే వాటిని గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని “గుణసంధి” అంటారు.

3. యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ, లకు అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

ఈ కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.
ఉదా :
అ) అత్యానందం = అతి + ఆనందం – (త్ + ఇ + ఆ = యా) – యణాదేశ సంధి
1) అత్యంతం = అతి + అంతం – (అత్ + ఇ + అ + య) – యణాదేశ సంధి

ఉదా :
ఆ) అణ్వస్త్రం = అణు + అస్త్రం – (ణ్ + ఉ + అ = వ) – యణాదేశ సంధి
2) గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ – (ర్ + ఉ + ఆ = వ) – యణాదేశ సంధి

ఉదా :
ఇ) పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ – (బ + ఆ = రా) – యణాదేశ సంధి
3) మాత్రంశ = మాతృ + అంశ – (ఋ + అ = ర) – యణాదేశ సంధి

గమనిక :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు (వేరే అచ్చులు) పక్కన వచ్చినపుడు, క్రమంగా వాటికి య – వ – ర లు వచ్చాయి. యవరలను ‘యణ్ణులు’ అంటారు. యణ్ణులు చేరితే వచ్చే సంధిని ‘యణాదేశ సంధి అంటారు. యణాదేశ సంధిలో, ‘ఇ’ కి బదులుగా “య్”, ‘ఉ’ కి బదులుగా ‘వ్’, ‘ఋ’ కి బదులుగా ‘ర్‌’ వచ్చాయి.

యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ లకు, అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

4. వృద్ధి సంధి
సూత్రం : అకారానికి ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారమూ, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారమూ వస్తాయి.
ఈ కింది పదాలను విడదీయండి.
1.ఉదా :
వసుధైక = వసుధా + ఏక- (అ + ఏ = ఐ) – వృద్ధి సంధి
అ) రసైక = రస + ఏక – (అ + ఏ = ఐ) – వృద్ధి సంధి
ఆ) సురైక = సుర + ఏక- (అ + ఏ = ఐ) – వృద్ధి సంధి

2. సమైక్యం = సమ + ఐక్యం = (అ + ఐ = ఇ) – వృద్ధి సంధి
అప్లైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం – (అ + ఐ = ఐ) – వృద్ధి సంధి
ఈ) దేవైశ్వర్యం = దేవ + ఐశ్వర్యం – (అ + ఐ = ఐ) – వృద్ధి సంధి

3. పాపౌఘము = పాప + ఓఘము – (అ + ఓ = ఔ) – వృద్ధి సంధి
ఉ) వనౌకసులు = వన + ఓకసులు – (అ + ఓ = ఔ) – వృద్ధి సంధి
ఊ) వనౌషధి = వన + ఓషధి – (అ + ఓ = ఔ) – వృద్ధి సంధి

4. రసౌచిత్యం = రస + ఔచిత్యం – (అ + ఔ = ఔ) – వృద్ధి సంధి
ఋ) దివ్యౌషధం = దివ్య + ఔషధం – (అ + ఔ = ఔ) – వృద్ధి సంధి
ఋ) దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం – (అ + ఔ = ఔ) – వృద్ధి సంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను విడదీసినపుడు మీరు గమనింపదగిన విషయం ఇది.
1. వృద్ధి సంధి ఏర్పడేటప్పుడు, ప్రతిసారీ పూర్వస్వరంగా ‘అ’ వచ్చింది.
2. పర స్వరం స్థానంలో వరుసగా “ఏ, ఐ, ఓ, ఔ”లు ఉన్నాయి.
3. అకారానికి ఏ, ఐ లు కలిపినపుడు ‘ఐ’ వచ్చింది.
4. అకారానికి ఓ, ఔ లు కలిపినపుడు ‘ఔ’ వచ్చింది.

వృద్ధి సంధి
సూత్రం : అకారానికి ఏ, ఐ లు పరమైనపుడు ‘ఐ’ కారమూ, ఓ, ఔ లు పరమైనపుడు ‘ఔ’ కారమూ వస్తాయి.

గమనిక :
ఐ, ఔ లను ‘వృద్దులు’ అంటారు.

AP Board 8th Class Telugu Grammar

సమాసాలు

సమాసం :
వేరు వేరు అర్థాలు గల రెండు పదాలు కలసి, ఏకపదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు.

గమనిక :
అర్థవంతమైన రెండు పదాలు కలిసి, క్రొత్తపదం ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వ పదం అంటారు. రెండవ పదాన్ని ఉత్తరపదం అంటారు.
ఉదా :
‘రామ బాణం’ అనే సమాసంలో, ‘రామ’ అనేది పూర్వపదం. ‘బాణం’ అనేది ఉత్తరపదం.

1. ద్వంద్వ సమాసం:
రెండు కాని, అంతకంటే ఎక్కువ కాని నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని “ద్వంద్వ సమాసం” అంటారు. (సమాసంలోని రెండు పదాల అర్థానికి ప్రాధాన్యం గల సమాసం ద్వంద్వ సమాసం.)

ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.
1) ఈ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు.
జవాబు:
అన్నదమ్ములు

2) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు

3) ప్రమాదంలో నా కాలుసేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలుసేతులు

I. ఈ కింది ద్వంద్వ సమాసాలను వివరించండి. విగ్రహవాక్యం రాయండి.
సమాస పదాలు – విగ్రహవాక్యాలు
1) ఎండవానలు – ఎండా, వానా
2) తల్లిదండ్రులు – తల్లి, తండ్రి
3) గంగాయమునలు – గంగ, యమున

II. ఈ కింది విగ్రహవాక్యాలను సమాసపదాలుగా మార్చండి.

విగ్రహము – సమాసపదం
1) కుజనుడూ, సజ్జనుడూ – కుజనసజ్జనులు
2) మంచి, చెడూ – మంచిచెడులు
3) కష్టమూ, సుఖమూ – కష్టసుఖములు
4) వజ్రమూ, వైడూర్యము – వజ్రవైఢూర్యాలు

2. ద్విగు సమాసం :
సమాసంలో మొదటి (పూర్వ) పదంలో సంఖ్య గల సమాసాలను ద్విగు సమాసాలు అంటారు.
అభ్యాసం :
కింది సమాస పదాలను ఉదాహరణలలో చూపిన విధంగా వివరించండి.
ఉదా :
నవ రసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
1) రెండు జడలు – రెండు (2) సంఖ్య గల జడలు
2) దశావతారాలు – దశ (10) సంఖ్య గల అవతారాలు
3) ఏడు రోజులు – ఏడు (7) సంఖ్య గల రోజులు
4) నాలుగు వేదాలు – నాలుగు (4) సంఖ్య గల వేదాలు
5) మూడు రోజులు – మూడు (3) సంఖ్య గల రోజులు
6) రెండు రోజులు – రెండు (2) సంఖ్య గల రోజులు
7) రెండు చేతులు – రెండు (2) సంఖ్య గల చేతులు
8) ముగ్గురు దేవతలు- ముగ్గురు (3) సంఖ్య గల దేవతలు

గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్యావాచకం పూర్వపదంగా ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు “ద్విగు సమాసాలు”.

3. తత్పురుష సమాసం :
విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

అభ్యాసము :
కింది పదాలను చదివి, విగ్రహ వాక్యాలు రాయండి.
సమాసం – విగ్రహవాక్యం
1) రాజభటుడు – రాజు యొక్క భటుడు
2) తిండి గింజలు – తిండి కొఱకు గింజలు
3) పాపభీతి – పాపము వల్ల భీతి

గమనిక :
‘రాజ భటుడు’ అనే సమాసంలో ‘రాజు’ పూర్వ పదం. ‘భటుడు’ ఉత్తర పదం. ‘రాజభటుడు’ కు విగ్రహవాక్యం రాస్తే; ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో యొక్క అనేది షష్ఠీవిభక్తి ప్రత్యయం. భటుడు రాజుకు చెందినవాడు అని చెప్పడానికి షష్ఠీ విభక్తి ప్రత్యయాన్ని వాడారు. ఈ విధంగా విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు “తత్పురుష సమాసాలు”.

గమనిక :
పూర్వ పదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు వస్తాయి.

తత్పురుష సమాసం రకాలు విభక్తులు ఉదాహరణ, విగ్రహవాక్యం
1) ప్రథమా తత్పురుష సమాసం డు, ము, వు, లు మధ్యాహ్నం – అహ్నం యొక్క మధ్యభాగం
2) ద్వితీయా తత్పురుష సమాసం ని, ను, ల, కూర్చి, గురించి జలధరం – జలమును ధరించినది
3) తృతీయా తత్పురుష సమాసం చేత, చే, తోడ, తో బుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు
4) చతుర్డీ తత్పురుష సమాసం కొఱకు, కై వంట కట్టెలు – వంట కొఱకు కట్టెలు
5) పంచమీ తత్పురుష సమాసం వలన, (వల్ల) కంటే, పట్టి దొంగభయం – దొంగ వల్ల భయం
6) షష్ఠీ తత్పురుష సమాసం కి, కు, యొక్క, లో, లోపల రామబాణం – రాముని యొక్క బాణం
7) సప్తమీ తత్పురుష సమాసం అందు, న దేశభక్తి – దేశము నందు భక్తి
8) నఃణ్ తత్పురుష సమాసం నఞ్ అంటే వ్యతిరేకము అసత్యం – సత్యం కానిది

అభ్యాసం :
కింది సమాసాలు చదివి, విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో తెలపండి.

సమాసం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) రాజ పూజితుడు రాజుచే పూజితుడు తృతీయా తత్పురుషము
ఆ) ధనాశ ధనము నందు ఆశ సప్తమీ తత్పురుషము
ఇ) పురజనులు పురమందు జనులు సప్తమీ తత్పురుషము
ఈ) జటాధారి జడలను ధరించినవాడు ద్వితీయా తత్పురుషము
ఉ) భుజబలం భుజముల యొక్క బలం షష్ఠీ తత్పురుషము
ఊ) అగ్నిభయం అగ్ని వల్ల భయం పంచమీ తత్పురుషము
ఋ) అక్రమం క్రమం కానిది నఞ్ తత్పురుష సమాసం

తత్పురుష సమాసాలు :
విభక్తుల ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాలను గూర్చి తెలిసికొన్నారు. కింది వాటిని కూడా పరిశీలించండి.
1) మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యము (మధ్య భాగం)
2) పూర్వకాలము – కాలము యొక్క పూర్వము (పూర్వ భాగం)

గమనిక :
పై వాటిలో మొదటి పదాలైన మధ్య, పూర్వ అనే పదాలకు ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ‘మధ్యము’, ‘పూర్వము’గా మారతాయి. ఇలా పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాము. కింది వాటిని పరిశీలించండి.
1) నఞ్ + సత్యం = అసత్యం – సత్యం కానిది
2) నఞ్ + భయం = అభయం – భయం కానిది
3) నఞ్ + అంతము = అనంతము – అంతము కానిది
4) నఞ్ + ఉచితం = అనుచితం – ఉచితము కానిది

గమనిక :
సంస్కృతంలో ‘నఃగ్’ అనే అవ్యయం వ్యతిరేకార్థక బోధకం. దీనికి బదులు తెలుగులో అ, అన్ అనే ప్రత్యయాలు వాడతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నఇస్’ అనే అవ్యయాన్ని బట్టి, దీన్ని “నఞ్ తత్పురుష సమాసం” అంటారు.

అభ్యాసం :
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామం పేర్కొనండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) అర్ధరాత్రి రాత్రి యొక్క అర్ధము ప్రథమా తత్పురుషం
ఆ) అనూహ్యము ఊహ్యము కానిది నఞ్ తత్పురుషం
ఇ) అక్రమం క్రమము కానిది నఞ్ తత్పురుషం
ఈ) అవినయం వినయం కానిది నఞ్ తత్పురుషం

సమాపక – అసమాపక క్రియలు

ఈ కింది వాక్యాలలోని క్రియలను గమనించండి.

1) ఉదయ్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.
2) వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది.
3) అరుణ్ చిత్రాలు గీసి ప్రదర్శనకు పెట్టాడు.

AP Board 8th Class Telugu Grammar

అ) సమాపక క్రియలు :
పై వాక్యాలలో ప్రతివాక్యం చివరన ఉన్న వెళ్ళాడు, పెట్టాడు వంటి క్రియలు పని పూర్తి అయ్యిందని తెలుపుతున్నాయి. వీటిని సమాపక క్రియలు అంటారు.

ఆ) అసమాపక క్రియలు :
వాక్యం మధ్యలో ఉన్న ‘చేసి’ ‘గీసి’ ‘చదివి’ – అన్న క్రియలు పని పూర్తికాలేదని తెలుపుతున్నాయి. వీటిని అసమాపక క్రియలు అంటారు.

ఇ) అసమాపక క్రియా – భేదాలు

1) క్త్వార్థకం : (భూతకాలిక అసమాపక క్రియ)
భాస్కర్ ఆట ఆడి, అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఈ వాక్యంలో భాస్కర్ ‘కర్త’. ‘వచ్చాడు’ అనేది కర్త. వాచకానికి చెందిన ప్రధాన క్రియ.

ఆడి, అలసి అనేవి కర్తృవాచక పదానికి చెందిన ఇతరక్రియలు. ఆడి, అలసి అనే పదాలు క్రియలే కాని, వాటితో పూర్తి భావం తెలియడం లేదు. ఆడి, అలసిపోయి అనే క్రియల తర్వాత, ఏం చేస్తాడు? అనే ప్రశ్న వస్తోంది. ఆడి, అలసిపోయి అనే క్రియలు, భూతకాలంలోని పనిని సూచిస్తున్నాయి. వీటిని భూతకాలిక అసమాపక క్రియలని క్వార్థకం’ అని పిలుస్తారు.

ఈ క్రియలన్నీ ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే చివరి – ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం ‘క్వార్థం’.
ఉదాహరణ :
పుష్ప అన్నం తిని నిద్రపోయింది. ఇందులో ‘తిని’ అనేది క్వార్థం (అసమాపక క్రియ)

2) శత్రర్థకం : (వర్తమాన అసమాపక క్రియ)
అఖిలేశ్ మధుకర్ తో ‘మాట్లాడుతూ’ నడుస్తున్నాడు. ఈ వాక్యంలో ‘నడుస్తున్నాడు’ అనే ప్రధానక్రియకు ‘మాట్లాడుతూ’ అనే ఉపక్రియ వర్తమాన కాలంలో ఉండి, అసమాపక క్రియను సూచిస్తుంది.

ఈ విధంగా ‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల వర్తమాన అసమాపక క్రియగా మారుతుంది. వర్తమాన అసమాపక క్రియను ‘శత్రర్థకం’ అంటారు.
ఉదా :
1) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంది.
2) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.
3) సలీమా పాడుతూ నాట్యం చేస్తుంది.

గమనిక :
పై వాక్యాలలో 1) చదువుతూ 2) ఆలోచిస్తూ 3) పాడుతూ అనేవి శత్రర్థకములు.

3) చేదర్థకం : (ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.)
కింది వాక్యం చదవండి.

“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది.”

పై వాక్యంలో ప్రధాన క్రియ ‘వస్తుంది’ – ఇది ఫలితాన్ని సూచిస్తుంది. ఈ ఫలితం రావాలంటే షరతును విధించడానికి చేర్చే అసమాపక క్రియ చేస్తే ఇది కారణం. అది కార్యం. ఈ విధంగా సంశ్లేష వాక్యాల్లో ప్రధాన క్రియ సూచించే పని జరగటానికి షరతును సూచించే క్రియ ‘చేదర్థకం’ అంటారు. చేత్ అర్థాన్ని ఇచ్చేది – చేదర్థకం. వీటిలో ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :
1. మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.
2. మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది.

అభ్యాసం :
ఈ కింది వాక్యంలోని అసమాపక క్రియలను రాయండి.
1) రమ రోడ్డు మీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి దగ్గరలో ఉన్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది.
జవాబు:
తీసి, వేసి, ఎక్కి అనేవి అసమాపక క్రియలు.

తద్ధర్మ క్రియలు :
ఒక వస్తువు స్వభావాన్నీ , ధర్మాన్ని తెలిపే క్రియలనూ, నిత్య సత్యాలను తెలిపే వాటినీ, ‘తద్దర్మ క్రియలు’ అంటారు.
ఉదా :
1) సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
2) సూర్యుడు పడమట అస్తమిస్తాడు.
3) పక్షి ఆకాశంలో ఎగురుతుంది

ప్రశ్నా వాక్యాలు :
ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఏమిటి అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారుచేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నా వాక్యంగా మార్చవచ్చు.
ఉదా :
1) మీరు బడికి వెళతారా?
2) దైన్య స్థితిని చూస్తారా?

అభ్యాసం :
కింది వాటిని జతపరచండి.

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి అ) చేదర్థకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో ఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతే ఇ) ప్రశ్నార్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా? ఈ) క్వార్థకం

జవాబు:

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి ఈ) క్వార్థకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో ఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతే అ) చేదర్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా? ఇ) ప్రశ్నార్థకం

వాక్య రకాలు

వాక్యాలు మూడు రకాలు

  1. సామాన్య వాక్యం
  2. సంక్లిష్ట వాక్యం
  3. సంయుక్త వాక్యం

1) ఉష పాఠం చదువుతున్నది.
2) మురళి మంచి బాలుడు.

1) సామాన్య వాక్యం :
గమనిక :
పై మొదటి వాక్యంలో క్రియ ఉంది. రెండో వాక్యంలో క్రియ లేదు. ఈ విధంగా క్రియ ఉన్నా, లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు.

AP Board 8th Class Telugu Grammar

2) సంక్లిష్ట వాక్యం : ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి.
ఉదా :
1) శ్రీకాంత్ అన్నం తిన్నాడు.
2) శ్రీకాంత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీకాంత్ అన్నం తిని బడికి వచ్చాడు. (సంక్లిష్ట వాక్యం)

గమనిక :
పై వాక్యాలను కలిపినపుడు ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అసమాపక క్రియలు ఉంటాయి. ఇటువంటి వాక్యాలను ‘సంక్లిష్ట వాక్యాలు’ అంటారు.

3) సంయుక్త వాక్యం :
సమ ప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను ‘సంయుక్త వాక్యాలు’ అంటారు.
ఉదా :
1) సీత చదువుతుంది, పాడుతుంది.
2) అతడు నటుడు, రచయిత.
3) అశ్విని, జ్యోతి అక్కా చెల్లెండ్రు.

సామాన్య వాక్యాలు :
అ) రాజు అన్నం తిన్నాడు.
ఆ) గోపి పరీక్ష రాశాడు.
ఇ) గీత బడికి వెళ్ళింది.

గమనిక :
పై వాక్యాల్లో తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు. ప్రతి వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంది. ఇలా ఒకే సమాపక క్రియ ఉంటే, ఆ వాక్యాలను ‘సామాన్య వాక్యాలు’ అంటారు.

కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి.
ఉదా :
హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని.

సంక్లిష్ట వాక్యాలు :
గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.

గమనిక :
పై సామాన్య వాక్యాలలో రెంటిలోనూ ‘గీత’ అనే నామవాచకం ఉంది. ఈ విధంగా తిరిగి చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి, మొదటి వాక్యంలోని క్రియ ‘వెళ్ళింది’ అనే దాన్ని ‘వెళ్ళి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.
ఉదా :
గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) 1) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు:
విమల వంట చేస్తూ, పాటలు వింటుంది. (సంక్లిష్ట వాక్యం)

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు:
అమ్మ నిద్రలేచి, ముఖం కడుక్కుంది. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
1) తాత భారతం చదివి, నిద్రపోయాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు. (సామాన్య వాక్యాలు)

2) చెట్లు పూత పూస్తే, కాయలు కాస్తాయి. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
చెట్లు పూత పూస్తాయి. చెట్లు కాయలు కాస్తాయి. (సామాన్య వాక్యాలు)

3) రాముడు నడుచుకుంటూ వెళ్ళి, తన ఊరు చేరాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు. రాముడు తన ఊరు చేరాడు. (సామాన్య వాక్యాలు)

AP Board 8th Class Telugu Grammar

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది. (సంక్లిష్ట వాక్యం)

2) మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మహతి ఆట ఆడి, అన్నం తిన్నది. (సంక్లిష్ట వాక్యం)

3) నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
నారాయణ అన్నం తింటూ, నీళ్లు తాగుతాడు. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు. (సామాన్య వాక్యాలు)

2) రజియా పాట పాడుతూ ఆడుకుంటున్నది. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రజియా పాట పాడుతుంది. రజియా ఆడుకుంటున్నది. (సామాన్య వాక్యాలు)

సంయుక్త వాక్యం:

కింది వాక్యాలను గమనించండి.

విమల తెలివైనది. విమల అందమైనది – విమల తెలివైనది, అందమైనది.
ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి, ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు.

సంయుక్త వాక్యాలుగా మారేటప్పుడు వచ్చే మార్పులు :
అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది, అందమైనది. (రెండు నామపదాల్లో ఒకటి లోపించడం)

ఆ) అజిత అక్క. శైలజ చెల్లెలు.
అజిత, శైలజ అక్కా చెల్లెళ్ళు. (రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది)

ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
ఆయన డాక్టరా? ప్రొఫెసరా? (రెండు సర్వనామాల్లో ఒకటి లోపించింది)

కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు

1) కింది వాక్యాలను పరిశీలించి మార్పులను గమనించండి.
అ) సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
ఆ) సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.

గమనిక :
పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కానీ వాక్య నిర్మాణంలో తేడా ఉంది. ఈ రెండు వాక్యాల మధ్య భేదం ఇది.
1) “సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు”.

AP Board 8th Class Telugu Grammar

1) కర్తరి వాక్యం :
ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ కర్తను సూచిస్తుంది. కర్మకు ద్వితీయా విభక్తి చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం’ అంటారు.

2) సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. అనే రెండవ వాక్యంలో
1) కర్తకు తృతీయా విభక్తి ఉంది.
2) క్రియకు ‘బడు’ అనే ధాతువు చేరింది
3) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.

2) కర్మణి వాక్యం :
వాక్యంలో క్రియకు ‘బడు’ ధాతువు చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని ‘కర్మణి వాక్యం’ అంటారు.

అభ్యాసం – 1: కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాల్మీకిచే రామాయణం రచింపబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
ప్రజలచే శాంతి కోరబడుతోంది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 2 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. (కర్తరి వాక్యం)

ఆ) నాచే రచింపబడిన గ్రంథం నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను రచించిన గ్రంథం నేతాజీ చరిత్ర. (కర్తరి వాక్యం)

అభ్యాసం – 3 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా :
ఆళ్వారుస్వామి చిన్నప్పుడే కథ రాశారు (కర్తరి వాక్యం)
జవాబు:
చిన్నప్పుడే ఆళ్వారుస్వామిచే కథ రాయబడింది. (కర్మణి వాక్యం)

అ) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
ఉసిరికాయ తీసి లింగయ్య చేత నాయకునికి ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)

ఆ) నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. (కర్తరి వాక్యం)
జవాబు:
పిల్లలతో నాయకుల చేత అరగంట కాలం గడుపబడింది. (కర్మణి వాక్యం)

ఇ) వాద్యాల చప్పుడు విన్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాద్యాల చప్పుడు వినబడింది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 4 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని తీసుకుపోబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
గ్రామీణులు నాయకులను ఎదుర్కొని తీసుకుపోయారు. (కర్తరి వాక్యం)

ఆ) కాయలన్నీ అతని ముందర పోయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
కాయలు అతని ముందర పోశారు. (కర్తరి వాక్యం)

ఇ) బాలురచే సెలవు తీసికోబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బాలురు సెలవు తీసికొన్నారు. (కర్తరి వాక్యం)

అలంకారాలు

అలంకారం : చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.
అలంకారాలు రెండు రకాలు :
అ) శబ్దాలంకారాలు
ఆ) అర్థాలంకారాలు

అ) శబ్దాలంకారాలు :
శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి “శబ్దాలంకారాలు”.

కింది గేయాన్ని గమనించండి.
“అది గదిగో మే
మేడకున్నది గో
గోడ పక్కన నీ
నీడలో కోడె దూ
దూడ వేసింది పే

పై కవితలో ప్రతివాక్యం చివర ‘డ’ అనే అక్షరం మళ్ళీ మళ్ళీ వచ్చింది (అంటే పునరావృతమయ్యింది). ఇది ఆ కవితకు అందం తెచ్చింది. వినడానికి సొంపుగా తయారయ్యింది. ఈ అందం, వినసొంపు – ‘డ’ అనే శబ్దం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని “శబ్దాలంకారం” అంటారు.

1) అంత్యానుప్రాసాలంకారం :
ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.
ఉదా :
1) భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామకథయే రక్తి
ఓ కూనలమ్మ”

గమనిక :
పై కవితలో ప్రతి వాక్యం చివర ‘క్తి’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ కవితలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

2) ‘గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము

పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం ప్రతిపాదం చివరా వచ్చింది. కాబట్టి దీనిలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

AP Board 8th Class Telugu Grammar

1. అంత్యానుప్రాసాలంకారం : (లక్షణం) :
పాదాంతంలో, లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు, లేదా అక్షరాలు ఉంటే, దాన్ని ‘అంత్యానుప్రాసాలంకారం’ అంటారు.
కింది గేయాలు గమనించండి :
1) “వేదశాఖలు వెలసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట

గమనిక :
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర ‘ఇచ్చట’ అనీ, అలాగే రెండవ పాదం చివర కూడా ‘ఇచ్చట’ అనీ ఉంది. కాబట్టి అంత్యానుప్రాసాలంకారం దీనిలో ఉంది.
2) ‘తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుర్రపు కళ్ళెం

పై మూడు పాదాల్లోనూ చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి దీనిలో కూడా ‘అంత్యానుప్రాసాలంకారం’ ఉంది.

2. వృత్త్యనుప్రాసాలంకారం :
అక్షరం అనేక సార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. ‘వృత్తి’ అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం.
ఉదా :
నాయనా ! నేను నిన్నే మన్నా అన్నానా? నీవు నన్నేమన్నా అన్నావా?

గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం, అనేకమార్లు వచ్చింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాస’ అనే శబ్దాలంకారం.

అభ్యాసం :
1) కా కి కో కికా దు దా !
2) లచ్చి పుచ్చకాయలు తెచ్చిచ్చింది.

గమనిక :
మొదటి వాక్యంలో ‘క’, రెండో వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ‘వృత్త్యనుప్రాసాలంకారం. ఈ కింది వాక్యాలు చూడండి.
1) ఆమె కవతో వడి వడి అడుగులతో గపను దాటింది.
2) చి చినుకులు ప మని పడుతున్నవేళ

గమనిక :
మొదటివాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ట’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి.
ఈ ఉదాహరణలు కూడా చూడండి.
అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకి ఎక్కాడు.
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్షక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యంక్ష్యమా.

గమనిక :
ఈ విధంగా ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని ‘వృత్త్యనుప్రాస అలంకారం’ అంటారు.

3. ఛేకానుప్రాసాలంకారం : కింది వాక్యం చదవండి.
ఉదా :
“నీకు వంద వందనాలు”.

పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంట వెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ నూరు సంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’ వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది.

ఛేకానుప్రాస (లక్షణం):
హల్లుల జంట, అర్థభేదంతో వెంట వెంటనే వస్తే దానిని ‘ఛేకానుప్రాస’ అలంకారం అంటారు.
ఛేకానుప్రాసకు మరో ఉదాహరణ :
1) పాప సంహరుడు హరుడు

ఆ) అర్థాలంకారాలు :
అర్థ వైచిత్రిచేత అందాన్ని కలిగించేవి అర్థాలంకారాలు.

1. ఉపమాలంకారం :
1) ఆమె ముఖం అందంగా ఉంది.
2) ఆమె ముఖం చంద్రబింబం లాగా అందంగా ఉన్నది.

గమనిక :
పై వాక్యాలలోని తేడాను గమనించండి. ఆమె ముఖం చంద్రబింబం లాగా అందంగా ఉంది. అనే వాక్యం మనలను ఆకట్టుకుంది. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికిగాను అందమైన పోలికను చెప్పడాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.
ఉదా :
సోముడు భీముడి వలె బలవంతుడు.

గమనిక :
ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1) సోముడు – ఉపమేయం – (అంటే ఎవరిని గురించి చెప్పుతున్నామో ఆ పదం)
2) భీముడు – ఉపమానం – (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3) బలవంతుడు – సమానధర్మం (పోల్చడానికి వీలయిన సమాన గుణం)
4) వలె – ఉపమావాచకం – (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

ఉపమాలంకారం (లక్షణం) :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ‘ఉపమాలంకారం’.

2. ఉత్ప్రేక్షాలంకారం :
ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పడం “ఉత్ప్రేక్షాలంకారం”.
ఉదా :
ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహం ఏమో అని భయపడ్డాను.

గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం లేదా ఊహించుకోవడం కూడా అలంకారమే. ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించి చెప్పడాన్ని ‘ఉత్ప్రేక్షాలంకారం’ అంటారు.
ఉదా :
1) ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అన్నట్లు ఉన్నవి.
2) ఆ ఏనుగు నడగొండా అన్నట్లు ఉంది.
పై వాక్యంలో 1) ఉపమేయం – ఏనుగు
2) ఉపమానం – నడకొండ (నడిచే కొండ)

అంటే ఏనుగును, నడిచే కొండలా ఊహించాము. కాబట్టి “ఉత్ప్రేక్షాలంకారము”.

AP Board 8th Class Telugu Grammar

3. రూపకాలంకారం (లక్షణం) :
ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, వీటి రెంటికీ ఆ భేదాన్ని (భేదం లేదని) చెప్పడమే రూపకాలంకారం అంటారు.
ఉదా :
‘ఆయన మాట కఠినమైనా మనసు వెన్న’ ఇందులో
1) ‘మనస్సు’ – అనేది ఉపమేయము.
2) వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనస్సు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది. అంటే వెన్నకూ మనస్సుకూ భేదం లేదు. రెండూ ఒకటే అనే భావాన్ని ఇస్తోంది.

అభ్యాసం :
కింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి.
1) మా అన్న చేసే వంట నలభీమపాకం
2) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం

గమనిక :
మొదటి వాక్యంలో అన్న చేసే వంటకూ, నలభీమపాకానికీ భేదం లేనట్లు చెప్పబడింది. అలాగే రెండవ వాక్యంలో కుటుంబంలోని తండ్రికీ, హిమగిరి శిఖరానికీ భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి పై రెండు వాక్యాలు ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి. – ఈ కింది ఉదాహరణలు కూడా చూడండి.
1) లతా లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లారు.
2) రుద్రమ్మ చండీశ్వరీ దేవి జల జలా పారించె శాత్రవుల రక్తమ్ము.
3) ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.
4) మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు.
5) మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే.

గమనిక :
పై పాదాల్లో రూపకాలంకారాలు ఉన్నాయి.

4. అతిశయోక్తి అలంకారం :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని ‘అతిశయోక్తి’ అలంకారం అంటారు.
కింది వాక్యాన్ని గమనించండి.
ఉదా :
ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా, ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై వాక్యంలో గమనిస్తున్నాము.

‘అతిశయోక్తి అలంకారం : (లక్షణం) :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పటం.

5. స్వభావోక్తి అలంకారం :
ఏదైనా విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే దాన్ని ‘స్వభావోక్తి’ అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తరిచూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి.

స్వభావోక్తికి మరియొక ఉదాహరణము :
1) ఆ లేళ్ళు బెదురుచూపులతో, నిక్కపొడుచుకున్న చెవులతో, భయభ్రాంత చిత్తములతో అటూ ఇటూ చూస్తున్నాయి.

సమన్వయం :
ఇక్కడ లేళ్ళ యొక్క సహజగుణాన్ని ఉన్నది ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇది ‘స్వభావోక్తి’ అలంకారము.

ఛందస్సు

కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమములకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.

1) లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు). హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.

2) గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు”.

గురులఘువుల గుర్తులు

లఘువు అని తెలుపడానికి గుర్తు : 1
గురువు అని తెలుపడానికి గుర్తు : U

గురులఘువుల నిర్ణయం

ఎ) గురువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం.
AP Board 8th Class Telugu Grammar 1
AP Board 8th Class Telugu Grammar 2

బి) లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధము :
AP Board 8th Class Telugu Grammar 3
గమనిక :
గురువులు కాని అక్షరాలన్నీ లఘువులు :

AP Board 8th Class Telugu Grammar 4

గణ విభజన

1) ఒకే అక్షరం గణాలు :
ఒకే అక్షరం గణంగా ఏర్పడితే, అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణం ఉంటాయి.
AP Board 8th Class Telugu Grammar 5

2) రెండక్షరాల గణాలు :
రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువులు, లఘువులు ఉంటాయి. ఇవి నాలుగు రకాలు.
అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అని అంటారు.
AP Board 8th Class Telugu Grammar 6
ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిపి గణంగా ఏర్పడితే అది ‘లగం’, లేదా ‘వ’ గణం అని అంటారు.
AP Board 8th Class Telugu Grammar 7
ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.
AP Board 8th Class Telugu Grammar 8
ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.
AP Board 8th Class Telugu Grammar 9

అభ్యాసము :
రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.
AP Board 8th Class Telugu Grammar 10

మూడక్షరాల గణాలు

మూడక్షరాల గణాలు మొత్తం ఎనిమిది (8).
AP Board 8th Class Telugu Grammar 11 AP Board 8th Class Telugu Grammar 12

అ) మూడక్షరాల గణాలను గుర్తించే సులభ మార్గం :
AP Board 8th Class Telugu Grammar 13

య, మా, తా, రా, జ, భా, న, స అనే సూత్రాన్ని కంఠస్థం చేసి, పై విధంగా ఒక చక్రం గీయండి. మీకు కావలసిన గణం పేరు గల మొదటి అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ అక్షరాన్నుండి కుడిగా ఉన్న మూడక్షరాలలోనూ, గురు లఘువులు ఏ క్రమంగా ఉన్నాయో, మీకు కావలసిన గణానికి గురు లఘువులు ఆ క్రమంలో ఉంటాయి. ఉదా : మీకు య గణము యొక్క గురు లఘువుల క్రమం కావాలి అనుకోండి. అపుడు ‘య’ నుండి కుడివైపుగా ‘యమాతా’ అనే మూడక్షరాలను వేరుగా రాయండి.

AP Board 8th Class Telugu Grammar 14

అభ్యాసం -1:
కింది పాదాలు ఏ వృత్తాలకు సంబంధించినవో గుర్తించండి.

1) పరమ తపోని వేశన ముబంగ రుపంట లకున్ని వాసమ (బ్బు)
AP Board 8th Class Telugu Grammar 15
1) పై పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది చంపకమాల పద్యపాదం.
2) యతి 11వ అక్షరం – (ప – బ).
3) ప్రాస నియమం కలదు.
4) పద్యపాదంలో 21 అక్షరాలున్నాయి.

2) రాతరు ణమ్మిదే మరల రాదుసు నా గత కాలమెప్పుడున్
AP Board 8th Class Telugu Grammar 16
1) పై పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదం.
2) యతి 10వ అక్షరం (రా – రా).
3) ప్రాసనియమం కలదు.
4) పద్యపాదంలో 20 అక్షరాలు ఉన్నాయి.

అభ్యాసం – 2 :
కింద సూచించిన పద్యపాదాన్ని పూరించి గణ విభజన చేసి, అది ఏ పద్యపాదమో గుర్తించండి.
1. జాతి శిరస్సు నెత్తికొని ……
AP Board 8th Class Telugu Grammar 17
గమనిక :
1) పై పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదం.
2) యతి 10వ అక్షరం (జా – క్ష్మా).
3) ప్రాస నియమం కలదు.
4) పద్యపాదంలో 20 అక్షరాలున్నాయి.

ఆ) మూడక్షరాల గణాల నిర్ణయంలో మరో పద్దతి :
AP Board 8th Class Telugu Grammar 18
అని రాసుకొని, దానికి గురు లఘువులు గుర్తించండి. మీకు కావలసిన గణం పేరు గల అక్షరంతో, ప్రక్క రెండు అక్షరాలూ కలిపి, దానిలోని గురు లఘువులు ఎలా ఉన్నాయో గమనిస్తే, ఏ గణానికి ఏ అక్షరాలు ఉంటాయో తెలుస్తుంది.
ఉదా : 1) య గణం = యమాతా – IUU – ఆది లఘువు
2) మ గణం = మాతారా – UUU – సర్వ గురువులు
3) త గణం = తెరాజ – UUI – అంత్య లఘువు
4) ర గణం = రాజభా – UIU – మధ్య లఘువు
5) జ గణం = జభాన – I U I – మధ్య గురువు
6) భ గణం = భానస – U II – ఆది గురువు
7) న గణం = నసల – III – సర్వ లఘువులు
8) లగం (లేక ‘వ’ గణం = I U = లఘువు, గురువు)

నాలుగు అక్షరాల గణములు

AP Board 8th Class Telugu Grammar 19

సూర్య గణాలు – ఇంద్ర గణాలు

AP Board 8th Class Telugu Grammar 20

2) ఇంద్ర గణాలు : ఇవి ఆఱు రకాలు : నల, నగ, సల, భ, ర, త – అనేవి ఇంద్ర గణాలు.
AP Board 8th Class Telugu Grammar 21
AP Board 8th Class Telugu Grammar 22

యతి – ప్రాసలు

I. గమనిక : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు.
1. యతి : పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
2. ప్రాస : పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

II. గమనిక : నియమం చెప్పినచోట ‘యతి’, ‘ప్రాస’లు ప్రయోగించడం వల్ల చదవడానికీ, వినడానికీ, జ్ఞాపకం పెట్టుకోడానికీ సౌకర్యం కలుగుతుంది.

3. యతి మైత్రి :
పద్యపాదము యొక్క మొదటి అక్షరంతో, ఆ పద్యంలో నిర్ణయింపబడిన స్థానమందలి అక్షరం మైత్రి కలిగి ఉండడాన్ని యతిమైత్రి అంటారు. యతిమైత్రి యతిస్థానంలోని హల్లుకేకాక, అచ్చుతో కూడా మైత్రి ఉండాలి.

1. ఉత్పలమాల
కింది పద్యపాదాలను పరిశీలించండి.
AP Board 8th Class Telugu Grammar 23

గమనిక :
పై పాదాల్లో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇలా పద్యంలో నాలుగు పాదాల్లోనూ ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్త పద్యం’ అంటారు.

యతి :
పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరం గానీ, దాని వర్ణమైత్రి అక్షరం గాని ఆ పాదంలో మరొకచోట రావడాన్ని ‘యతి మైత్రి’ లేదా యతి స్థానం అంటారు.

పై పద్యపాదాల్లో పదవ అక్షరం (ఆ – న; జే – సి) యతి.

ప్రాస :
పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాల్లోనూ ‘య’ అనే అక్షరం వచ్చింది. ఈ పద్యాలలో రెండవ అక్షరంగా ఒకే గుణింతాక్షరం రావడాన్ని ‘ప్రాస’ నియమం అంటారు. పై లక్షణాలు గల పద్యాన్ని ‘ఉత్పలమాల’ పద్యం అంటారు.

ఉత్పలమాల పద్యం లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 10వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

2. చంపకమాల
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
AP Board 8th Class Telugu Grammar 24

చంపకమాల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్త పద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.

3. శార్దూలం
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 8th Class Telugu Grammar 25

శార్దూల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.

4. మత్తేభం
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
AP Board 8th Class Telugu Grammar 26

మత్తేభ పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

AP Board 8th Class Telugu లేఖలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions 8th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu లేఖలు

1. విహార యాత్రను వివరిస్తూ తండ్రికి లేఖ :
జవాబు:

ఏలూరు,
x x x x x

పూజ్యులైన నాన్నగారికి నమస్కారములు.

నేను క్షేమంగానే ఉన్నాను. అక్కడ అందరూ క్షేమమని తలుస్తాను. ఇటీవల నేను నా మిత్రులతో కలిసి హైదరాబాదు విహారయాత్రకు వెళ్ళి వచ్చాను. ఆ విశేషాలు ఈ లేఖలో తెలియజేస్తున్నాను.

గడచిన బుధవారం సాయంకాలం ఏలూరులో రైలు ఎక్కి తెల్లవారేసరికి హైదరాబాదు చేరాం. అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని నగరదర్శనానికి బయలుదేరాం.

ఆ నగర శోభను చూస్తుంటే నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఎక్కడ చూసినా ఫ్లెఓవర్ బ్రిడ్జీలు చూడముచ్చటగా ఉన్నాయి. ట్యాంక్ బండ్ పై గల విగ్రహాలు చూపరులను అట్టే ఆకర్షించేలా ఉన్నాయి.

ముఖ్యంగా సాలార్‌జంగ్ మ్యూజియం, నెహ్రూ జంతుప్రదర్శనశాల, చార్మినార్, బిర్లామందిర్, పబ్లిక్ గార్డెన్స్, రామోజీ ఫిల్మ్ సిటీ, గోలకొండ కోట వంటివి యాత్రికులను బాగా ఆకర్షిస్తాయి. రెండు రోజులపాటు అక్కడి దర్శనీయ స్థలాలను చూసి మరల రైలులో సరదాగా పాటలు పాడుకొంటూ జోక్స్ వేసుకొంటూ కాలం తెలియకుండా తిరుగు ప్రయాణం చేశాం. అమ్మగారికి నా నమస్కారాలు.

ఇట్లు,
తమ కుమారుడు,
రాళ్ళబండి సిద్ధార్థ.

చిరునామా :
శ్రీరాళ్ళభండి శ్రీనివాస్ గారు,
కానూరు,
పెనమలూరు మండలం, కృష్ణాజిల్లా.

2. వార్షికోత్సవమును గూర్చి మిత్రునకు లేఖ :
జవాబు:

అమలాపురం,
x x x x x

ప్రియ మిత్రుడు శ్రీరాంకుమార్‌కు,

ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. గడచిన బుధవారం మా పాఠశాల వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా రంగురంగుల తోరణాలతో అలంకరించాం. సాయంత్రం 6 గం||లకు సభ ప్రారంభింపబడింది. ఆ సభకు మా ప్రాంత ఎం.ఎల్.ఏ. గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నివేదిక చదివి వినిపించారు. ముఖ్య అతిథిగారు విద్యార్థులంతా బాగా చదువుకోవాలని చక్కని సందేశం ఇచ్చారు. ఆటల పోటీలలోనూ, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలోనూ గెలుపొందిన వారికి బహుమతులు పంచిపెట్టబడ్డాయి. ఆ తరువాత పిల్లలచే నాటికలు వేయబడ్డాయి.

మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం గూర్చి వ్రాయగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
వి. దిలీప్ కుమార్.

చిరునామా :
గార్లపాటి శ్రీరాంకుమార్,
10వ తరగతి,
ఎస్.పి.వి.కె.ఆర్. హైస్కూలు,
దొమ్మేరు – ప.గో.జిల్లా, పిన్ : 534 351.

AP Board 8th Class Telugu లేఖలు

3. సందర్శించిన ఒక ప్రదేశాన్ని గూర్చి వివరిస్తూ మిత్రునికి లేఖ.
(లేదా)
చూసిన విజ్ఞానయాత్రా విశేషాలను వివరిస్తూ మిత్రునికి లేఖ.
జవాబు:

హైద్రాబాదు,
x x x x x

ప్రియ మిత్రుడు శంకరు,

నేను క్షేమంగా ఉన్నాను. మీరంతా క్షేమమని తలుస్తాను. నేను ఇటీవల ఆగ్రా వెళ్ళివచ్చాను. అక్కడి విశేషాలు నీకు వివరిస్తాను.

ఆలో ముఖ్యంగా చూడదగ్గది తాజ్ మహల్. షాజహాన్ దంపతుల పవిత్ర ప్రణయానికి శాశ్వత చిహ్నమే తాజమహల్. దాన్ని చూసి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అది ఒక ఎత్తైన వేదిక మీద ఉన్న చలువరాతి కట్టడం. దానికి నాలుగువైపులా నాలుగు చంద్రకాంత శిలా స్తంభాలున్నాయి. ప్రధాన భవనం లోపల గోడలు మణులతో చెక్కబడి ఉన్నాయి. యమునా నదీతీరంలో ఉన్న ఆ తాజ్ మహల్ సౌందర్యం చూసి ఆనందించవలసిందే గాని చెప్పడానికి వీలుకాదు. అందుకే ప్రపంచంలోని ఏడు వింతలలో తాజ్ మహల్ కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు. నీవు కూడా అవకాశం దొరికినప్పుడు తాజ్ మహల్ తప్పక చూడవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
ఆర్ శ్రీనివాస్.

చిరునామా :
కె. శంకరరావు,
S/O సత్యనారాయణరావు గారు,
ఆర్.ఆర్. నగర్,
విజయవాడ – 520 012.

4. మీ వీధిలో పారిశుధ్య పరిస్థితిని (అపరిశుభ్రతను) గూర్చి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ వ్రాయుము.
జవాబు:

పామర్రు,
x x x x x

మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి గారికి నమస్కరించి మోహన్ వ్రాయు విన్నపము.

అయ్యా,
నేను కరణం గారి వీధిలో నివాసం ఉంటున్నాను. మా వీధిలో ఎక్కడ చూసినా చెత్త, దుమ్ము, మురికి ప్రత్యక్షమవుతాయి. చెత్త పారెయ్యడానికి చెత్త కుండీలు లేవు. మురికినీరు కాలువలు నిండిపోయి రోడ్డుమీదే ప్రవహిస్తుంది. ఇక దుర్గంధం చెప్పడానికి వీలులేదు. ఆ మురికి వల్ల దోమల బాధకూడా ఎక్కువైంది. దీనివల్ల మలేరియా సోకే ప్రమాదముంది. కాబట్టి మావీధి పారిశుధ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవల్సిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
వి.యస్. మోహన్.

చిరునామా :
ఆరోగ్యశాఖాధికారి గారు,
పురపాలక సంఘ కార్యాలయం,
పామర్రు, కృష్ణాజిల్లా.

AP Board 8th Class Telugu లేఖలు

5. నచ్చిన రాజకీయ నాయకుని గురించి మిత్రునికి లేఖ :
జవాబు:

నెల్లూరు,
x x x x x

ప్రియ స్నేహితురాలు పద్మకు,

నేను క్షేమముగా ఉన్నాను. నీ క్షేమసమాచారములు తెలుపగలవు. నీవు ఈ మధ్య నాకు వ్రాసిన ఉత్తరములో నాకు నచ్చిన రాజకీయ నాయకుని గురించి వ్రాయమన్నావు కదా ! అందుకే ఈ లేఖ వ్రాయుచున్నాను.

నాకు నచ్చిన రాజకీయ నాయకుడు భారత మాజీ ప్రధాని, ‘భారతరత్న’ అవార్డు గ్రహీత శ్రీ మొరార్జీ దేశాయ్. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనిన మహోన్నత నాయకులలో ఆయన ఒకరు. గాంధీజీ ఆదర్శాలకోసం జీవితాంతము పాటుబడిన వ్యక్తి మొరార్జీ. ఉన్నతమైన విలువలు, ఆదర్శమైన విధానాలకు కట్టుబడిన వ్యక్తిగా మొరార్జీ ప్రపంచ ప్రఖ్యాతి పొందినారు. మొరార్జీ ఏనాడు పదవులను ఆశించలేదు, పదవులే ఆయనను జీవితాంతం ఆశించినాయి. నైతిక విలువలకు మొరార్జీ గొప్ప ఉదాహరణ. అందులకే ఆయన అంటే నాకు ఎంతో ఇష్టము.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
పి. శశికళ.

చిరునామా :
వి. పద్మ,
10వ తరగతి, బాలికోన్నత పాఠశాల,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.

6. మీ పాఠశాలలో జరిగిన జాతీయ పండుగను గూర్చి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

చెరుకూరు,
x x x x x

ప్రియ మిత్రుడు ప్రవీణ్ కుమార్‌కు,

ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ఇటీవల మా పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ‘ఫిబ్రవరి 21 న బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా చక్కనైన సూక్తులు రాసిన చార్టులు తగిలించి, అలంకరించాం. మన మాతృభాషను కాపాడిన, కాపాడుతున్న ఎందరో మహనీయులైన వారి చిత్రపటాలు సేకరించి, ప్రదర్శనగా ఉంచాం. ప్రక్కనే వారు మాతృభాష కోసం చేసిన కష్టాన్ని క్లుప్తంగా రాసి, ఉంచాం. గిడుగు, గురజాడ వంటి మహనీయులకు పెద్దపీట వేసాం. ఆ సభకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త “ఆర్ష విద్యాసాగర్, మధురభారతి” శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిని ఆహ్వానించాం. వారి ఉపన్యాసం ఎలా సాగిందంటే బీడునేల మీద వాన చినుకులు పడిన విధంగా మమ్మల్ని ఉత్తేజితులను చేసింది. ఆ తర్వాత మాలో కొంతమంది మాతృభాష గొప్పదనాన్ని గురించి మాట్లాడారు. అలాగే మీ పాఠశాలలో జరిగిన విశేషాలను లేఖ వ్రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
డి. ప్రవీణ్ కుమార్,
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
బాపట్ల, గుంటూరు జిల్లా.

7. ఇటీవల మీ పాఠశాలలో నిర్వహించబడిన ‘అమ్మకు వందనం’ కార్యక్రమంలోని విశేషాలను తెలుపుతూ మీ సోదరికి లేఖ రాయండి.
జవాబు:

లేఖ

చెరుకూరు,
x x x x x

ప్రియమైన పద్మావతి అక్కకు,

మేము ఇక్కడ క్షేమం. మీరు అక్కడ క్షేమమని తలుస్తాను. నేను బాగా చదువుతున్నాను. ఇటీవల మా పాఠశాలలో ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి తల్లిని
పిలిపించారు. ఆ తల్లులకు వారి పిల్లల చేత కాళ్ళు కడిగించి, పాదాల మీద పూలు వేసి, నమస్కరించమన్నారు. మేమంతా అట్లా చేసి, అమ్మల ఆశీస్సులు తీసుకొన్నాము. నేను, మరికొంతమంది విద్యార్థులు అమ్మ గొప్పదనాన్ని గురించి మాట్లాడాము. అమ్మ కళ్ళలో ఏదో తెలియని ఆనందం కనిపించింది. దానిని ఎప్పుడూ పోకుండా చూసుకోవాలని అనుకున్నాను. బావగారు, పిల్లలు ఏం చేస్తున్నారు ? అందరినీ అడిగానని చెప్పు.

ఇట్లు,
నీ తమ్ముడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
ఎస్. పద్మా వతి,
W/o ఎస్. పూర్ణచంద్ర,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

AP Board 8th Class Telugu లేఖలు

8. మామూలు వాక్యాలు కూడా సరైన పదాలు జోడించి అందంగా వివరిస్తూ రాస్తే వర్ణనాత్మక వాక్యాలు అవుతాయి కదా! అలాగే మీరు కూడా మంచి పదాలతో మీకు నచ్చిన ఒక కథను వర్ణిస్తూ రాయండి.
జవాబు:
వర్ణనాత్మక కథ :

ప్రేమే పరమాన్నం

ఆప్యాయతతో ఆదరించిన వారింట పచ్చడన్నం తిన్నా తృప్తిగా ఉంటుంది. అదే ప్రేమ నటిస్తూ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా ఆ భోజనం రుచించదు. అంటే నిజమైన రుచి వంటకంలో లేదు. వండి వడ్డించిన వారి మనసులో ఉంది. దానికి ఉదాహరణే ఈ కథ.

పాండవులు పాచికల ఆటలో మోసపోయి 12 యేండ్లు అడవుల్లో, ఒక యేడాది మారువేషాల్లో బతికి అరణ్య, అజ్ఞాత వాసాలు పూర్తి చేసుకొన్నారు. తిరిగి రాజ్యాన్ని అప్పగించమంటూ కృష్ణుడి ద్వారా కౌరవులకు రాయబారం పంపారు పాండవులు. అప్పుడు కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళగా, దుర్యోధనుడు శ్రీకృష్ణుణ్ణి మచ్చిక చేసుకొని, తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నించి, కపట ప్రేమను ఒలకబోస్తాడు. కానీ కృష్ణుడు తాను కౌరవుల అతిథిగా రాలేదని, పాండవుల రాయబారిగా వచ్చానని చెబుతాడు. ఆ రాత్రి బసకు ధృతరాష్ట్రుని మంత్రి విదురుని ఇంటికి వెళతాడు. ఆయన భోగభాగ్యాల లాలస లేక నిరాడంబర జీవితాన్ని గడుపుతుంటాడు. తన ఇంటి తలుపు తట్టిన కృష్ణుని చూసి నివ్వెరపోయాడు. అంతులేని ఆనందంతో చేతులు జోడించాడు. అపరిమితమైన ప్రేమతో స్వాగతం పలికాడు.

శ్రీకృష్ణునికి పాదపూజ చేస్తాడు. ఆకలిగా ఉందన్న ఆయనకు అరిటాకు వేసి, ఇంటిలో ఉన్న కొన్ని అరటిపళ్ళు పెడతాడు విదురుడు. శ్రీకృష్ణునికి భక్తిపూర్వక నైవేద్యంగా ప్రేమతో వడ్డించింది ఆ ఇంటి ఇల్లాలు. విదురుడు వింజామరతో విసురుతున్నాడు. వారి ఆదరాభిమానాలకు వాసుదేవుడు కరిగిపోయాడు. ఆ దంపతులు భక్తి పారవశ్యంలో కృష్ణుణ్ణి చూస్తూ అరటిపండ్లు ఒలిచి పండును పక్కన పెట్టి తొక్కను ఇస్తుంటే వాటినే ఆరగించాడు ఆ పరమాత్మ. తర్వాత గమనించిన దంపతులు తేరుకొని మన్నించమని ప్రార్థిస్తారు. భక్తులకు తాను దాసుణ్ణని, వారు మనసు పెట్టి సమర్పించింది ఏదైనా సరే స్వీకరిస్తానని చెప్తాడు.

ఎదుటి వారికి ఇచ్చేది ఏదైనా సరే అణకువతో ఇవ్వాలి. అహంకారం లేని సమర్షణను ఆనందంగా స్వీకరించడానికి భగవంతుడైనా నిరుపేద ముంగిటికి వస్తాడు. తన భక్తులు తనకేమిచ్చారో చూడకుండా ఎలా ఇచ్చారన్న దానికే పెద్దపీట వేస్తాడు.

AP Board 8th Class Telugu వ్యాసాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions 8th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu వ్యాసాలు

1. వాతావరణ కాలుష్యం

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. వాతావరణం పరిశుభ్రంగా ఉండి, చక్కటి ఆరోగ్యకరంగా ఉంటే మానవుని జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మానవునికి హానికరమైన పదార్థాలు వాతావరణంలో కలిసి ఉంటే దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికినీరు మొదలైనవి వాతావరణ కాలుష్యానికి కారణాలు. కర్మాగారాల వల్ల నదులన్నీ మురికినీటితో నిండిపోయి జలకాలుష్యం ఏర్పడుతోంది. పరిశ్రమలవల్ల గాలి కలుషితమవుతోంది. మోటారువాహనాల వల్ల నగరాలలోను, పట్టణాలలోను ధ్వని కాలుష్యం ఎక్కువవుతోంది.

వాతావరణ కాలుష్యం చాలా భయంకరంగా తయారయింది. పారిశ్రామికీకరణ వల్ల ఈ సమస్య మరీ ఘోరంగా తయారయింది. వాతావరణ కాలుష్యం మానవుని మనుగడకే పెద్ద సవాలుగా పరిణమించింది. దీనివల్ల ఉదరకోశవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి.

వాతావరణ కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికలు తయారుచేసి అమలు చేయాలి. పరిశ్రమలు, కర్మాగారాలు మానవుల నివాసాలకు దూరంగా నెలకొల్పాలి. ప్రతి వ్యక్తి తన ఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశం ఉన్నచోట మొక్కలను విరివిగా పెంచాలి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు పరిశోధనలు చేసి వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు చేయాలి.

2. బాల కార్మికులు

నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ.) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేటట్లు చూడాలి.

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

మన రాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపు మాపేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది.

బాలకార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

AP Board 8th Class Telugu వ్యాసాలు

3. కరవు నివారణోపాయాలు

అనావృష్టి వల్ల కరవు వస్తుంది. కరవును క్షామం అని కూడా అంటారు. సామాన్య వర్షపాతంలో 75% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘కరవు’గాను, 50% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరవు’ గాను భారత వాతావరణ శాఖ నిర్వచించింది.

ఋతుపవనాల నియమరహిత స్వభావం వల్ల దేశంలో ఏదో ఒకచోట ప్రతి సంవత్సరం తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. ఎక్కువగా వాయవ్య భారతదేశం, ఆ తరువాత దక్షిణ మరియు మధ్య భారతదేశంలో తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులు అతిగా కరవులు సంభవించే రాష్ట్రాలు.

నివారణోపాయాలు :

  1. కరవు పీడిత ప్రాంతాలలో భూమిశిస్తు పూర్తిగా తొలగించడం గానీ, తగ్గించడం గానీ చేయాలి.
  2. క్షామపీడిత ప్రాంతాలలో ప్రజలు తిరిగి వ్యవసాయం చేసుకొనేందుకు వీలుగా ఆర్థిక సహాయం అందించడం, నీటి పారుదల సౌకర్యాలు కలిగించడం వంటివి చేయాలి.
  3. ఆయా ప్రాంతాలను బట్టి ఏయే పంటలు వేస్తే బాగా పండుతాయో వ్యవసాయదారులకు సూచనలివ్వాలి.
  4. పండిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కలిగించాలి.
  5. తుపానులు వచ్చినపుడు తట్టుకొని, నిలబడి పంటనిచ్చే కొత్త రకాలను శాస్త్రజ్ఞులు కనిపెట్టాలి.
  6. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడాలి.

కరవు నష్టాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం “కరవుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక” (Drought prone area programme) ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలో నీటిపారుదల, మృత్తికా పరిరక్షణ, వనీకరణ మొదలగు పథకాలున్నాయి. ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా మానవతా దృష్టితో కరవుపీడిత ప్రాంతీయులను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించాలి.

4. పర్యావరణ సంరక్షణ

భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్తా, చెదారమే కాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి. జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగేనీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగేనీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజీ వ్యవస్థ అరకొరగా ఉంది. దీనివల్ల కలరా, మలేరియా, ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.

యంత్రాలవల్ల, వాహనాల వల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. 1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్య నివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

AP Board 8th Class Telugu వ్యాసాలు

5. విద్యార్థులు – క్రమశిక్షణ

విద్యను అర్థించేవారు విద్యార్థులు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనని కలిగి ఉండటం. నిజానికి క్రమశిక్షణ అన్ని వర్గాలవాళ్ళకీ, అన్ని వయస్సుల వాళ్ళకీ అవసరమే. అయితే విద్యార్థులు భావిభారత పౌరులు! జాతి భవిష్యత్తు వాళ్ళమీదే ఆధారపడి ఉంది. “మొక్కై వంగనిదే మానై వంగునా !” అన్నారు. చిన్నప్పుడే క్రమశిక్షణ అలవడటం సాధ్యం. పెద్దయిన తర్వాత మనిషి మారటం చాలా కష్టం. అందుకని విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉండాలి.

అయితే విద్యార్థుల్లో క్రమశిక్షణ ఎందుకు లోపిస్తోంది? అనే అంశాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది. అందుకు కొన్ని కారణాలు :

  1. కావలసిన కోర్సులో సీటు దొరకకపోవడం – కావలసిన రంగంలో ఉద్యోగం దొరకకపోవడం.
  2. రాజకీయ పార్టీల, నాయకుల ప్రభావం, జోక్యం.
  3. విద్యాలయాల్లో అవినీతి, అవకతవకల పరంపరలు !
  4. ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చెయ్యడం.
  5. తల్లిదండ్రుల అశ్రద్ధ, అలసత్వం.

ఇన్ని కారణాలతో పాటు పేర్కొనవలసిన మరొక రెండు ముఖ్యమైన అంశాలున్నాయి – ఒకటి సినిమా, రెండు టి.వి ! ఈ రెండూ మానసిక వికాసానికి,
జ్ఞానాభివృద్ధికి ఉద్దేశించబడ్డాయి. కానీ పాశ్చాత్య విషసంస్కృతి ప్రభావంచే ఈ రెండు ప్రసార సాధనాలూ యువకులపై, విద్యార్థుల పై “స్లోపాయిజన్” లా పని చేస్తున్నాయి.

విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడాలంటే ముందుగా –

  1. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణులపై కఠిన వైఖరి అవలంబించాలి.
  2. విద్యారంగంలోని అవకతవకల్ని, అవినీతిని (లీకేజీ, మాస్ కాపీయింగ్ సంప్రదాయాల్ని) అరికట్టాలి.
  3. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, ఆదర్శవంతంగా ప్రవర్తిస్తూ బోధనకి అంకితమవ్వాలి.
  4. రాజకీయ పార్టీల నీడ కూడా విద్యాలయాలపై పడకూడదు.
  5. విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ ఉండాలి.
  6. విద్యార్థుల్లో దేశభక్తి, సచ్ఛీలత, సహనం అలవడేలా తగిన చర్యలు తీసుకోవాలి.

క్రమశిక్షణ ఇతరులు బలవంతంగా రుద్దినట్లు ఉండకూడదు. ఆత్మగౌరవానికి సంబంధించినదిగా, ఆత్మశక్తికి సంబంధించినదిగా, జీవితధ్యేయంగా క్రమశిక్షణను అలవరచుకోవాలి. అప్పుడు విద్యార్థులతో పాటు దేశం కూడా అక్షరజ్యోతిగా వెలిగి అభివృద్ధి బాటలో పయనిస్తుంది.

AP Board 8th Class Telugu వ్యాసాలు

6. దూరదర్శన్

విజ్ఞానశాస్త్ర ప్రగతికి, మానవుడి ప్రతిభకి నిదర్శనం టెలివిజన్ దృశ్యతరంగాలను గాలిలో ప్రసారం చేయటం ద్వారా దృశ్యాలు చూడగలుగుతున్నాం. శబ్దతరంగాల ద్వారా శబ్దం వింటున్నాం. టెలివిజనను మానవుడి ప్రతిసృష్టిగా పేర్కొనాలి. ఇది బ్రిటన్లో 1936లో మొదట వ్యాప్తిలోకి వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్ బర్డ్ 1928లో కనిపెట్టాడు.

టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. టి.వి.లు లేని ఊరులేదు. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. టి.వి.ల ద్వారా ప్రభుత్వం, వాణిజ్య సంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మన సంస్కృతిని, కళలను కాపాడుకోవచ్చు. మనం చూడలేని ప్రదేశాలు చూడవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని మన ముందు నిలబెట్టేది టెలివిజన్. విద్యారంగంలో, వైద్యరంగంలో, వాణిజ్యరంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో నేడు టెలివిజన్‌కు తిరుగులేని స్థానం ఉంది. “వీడియో” పరిజ్ఞానానికి టి.వి. మూలకారణం. నిరక్షరాస్యత నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్.

విదేశీ చానల్స్ ప్రసారం వల్ల యువత నిర్వీర్యమవుతోంది. మన సంస్కృతిని విస్మరిస్తున్నారు. సినిమాల వ్యామోహం, సెక్స్ వ్యామోహం ఎక్కువై పెడదారి పడుతున్నారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం పిల్లలపై టి.వీ.లు దుష్ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడైంది. కాబట్టి టెలివిజన్ ని మంచికి ఉపయోగించుకొనేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రైవేట్ ఛానల్సను నియంత్రించి వాటిపై సెన్సారు అధికారాన్ని కలిగి ఉండాలి. అప్పుడే టి.వి. వల్ల సత్రయోజనాలుంటాయి.

7. వరకట్న సమస్య

వరునికిచ్చు కట్నం వరకట్నం. దాని వల్ల సమాజంలో ఏర్పడే సమస్యని వరకట్న సమస్య అంటారు. వరకట్నం కేవలం ఆడపిల్ల తల్లిదండ్రులకే కాదు కుటుంబం మొత్తానికి కూడా అదొక దుర్భర సమస్యగా తయారైంది. అసలు కట్నం అంటే కానుక. పెళ్ళి సందర్భంగా ఇచ్చే కానుక క్రమక్రమంగా కట్నమైంది. పూర్వకాలంలో కన్యాశుల్కం ఉండేది. డబ్బు ఇచ్చి కన్యల్ని కొనుక్కొనే వాళ్ళు. ఆధునిక కాలంలో దాని స్థానంలో వరకట్నం వచ్చింది. ఇప్పుడు పెళ్ళి సమయంలో పెళ్ళికూతురు తల్లిదండ్రులు పెళ్ళికొడుక్కి ఇచ్చే ధనం లేదా సంపదని వరకట్నం అంటున్నారు. కొందరు డబ్బు కట్నంగా ఇస్తే మరికొందరు భూములు ఇస్తారు.

వరకట్నం తీసుకోవడం గానీ, ఇవ్వడం గానీ నేరమని చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని పాటిస్తున్నదెవరు ? చట్టాన్ని కాపాడవలసిన అధికారులే వరకట్నం ఇస్తున్నారు – తీసుకుంటున్నారు. కంచే చేను మేస్తోంది ! వరకట్నం ఇవ్వనని ఎవరైనా శపథం చేస్తే అమ్మాయికి పెళ్ళికాని పరిస్థితి కూడా ఏర్పడుతోంది ! ఆశ్చర్యం ఏమిటంటే అమ్మాయికి కట్నం ఇవ్వలేక నానా బాధలు పడ్డవారే, అబ్బాయి పెళ్ళి దగ్గరికి వచ్చేటప్పటికి కట్నం ఇవ్వాలని పట్టుబడతారు.

వరకట్న నిర్మూలనం సాధ్యమవ్వాలంటే ముందుగా పెద్దలలో మార్పు రావాలి. శాఖాంతర, కులాంతర, ప్రేమ వివాహాలను ప్రోత్సహించాలి. యువతీయువకులు ఆదర్శాలతో ఈ వరకట్నమనే దురాచారాన్ని రూపు మాపాలి. అమ్మాయికి ఇవ్వటం, అబ్బాయికి తీసుకోవటం రెండూ అక్రమమేనన్న ఆలోచన కలగాలి. కట్నం అనేది బానిసవ్యాపారమన్న ప్రచారం సాగాలి. రేడియోలు, టీ.వీ.లు, సాహిత్యం ద్వారా వరకట్న దురాచారం గురించి ప్రజలకి తెలియజెయ్యాలి. వరకట్న నిషేధ చట్టాన్ని ప్రజలు అమలుపరచాలి. అప్పుడే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుంది లేదా ‘తంటా’ అవుతుంది !

8. గ్రంథాలయాలు

“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో – కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నది సూక్తి. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాల ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించేవి వున్నాయి. తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం (Library) అంటారు.

అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నాళం కృష్ణారావు మొదలైన వాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు. గ్రంథాలయ మహాసభలు నిర్వహించి పుస్తకాలను సేకరించి భద్రపరిచారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలున్నాయి. అమెరికాలో గల ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోము నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’, ‘బ్రిటిష్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరొందాయి. మన దేశంలో చెన్నైలోని “కన్నెమరా” గ్రంథాలయం, తంజావూరులోని “సరస్వతీ మహలు”, వేటపాలెంలోని “సారస్వత నికేతనం”, హైదరాబాదులోగల “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం కూడా నెలకొల్పబడింది.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి.

గ్రంథాలయాల వల్ల చాలా లాభాలున్నాయి :

  1. గ్రంథాలయాలు మనిషిని మనిషిగా మారుస్తాయి.
  2. మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి.
  3. దేశాభ్యుదయానికి, సమాజవికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
  4. గ్రంథపఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.
  5. గ్రంథాలు తండ్రివలె ఆదేశిస్తాయి. తల్లివలె లాలిస్తాయి. మిత్రుని వలె ఆదుకుంటాయి. గురువువలె ప్రబోధిస్తాయి.

గ్రంథాలయాధికారులు పుస్తకాలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి. డబ్బును దుర్వినియోగం చెయ్యకుండా మంచి పుస్తకాలనే కొనాలి. హాని కలిగించే పుస్తకాలను నిర్మొహమాటంగా తిరస్కరించాలి. పోటీ పరీక్షలకి, ఉద్యోగ పరీక్షలకి, చదువుకి కావలసిన పాఠ్య గ్రంథాలు, క్విజ్ పుస్తకాల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం గ్రంథాలయోద్యమాన్ని నీరుకార్చకుండా తగిన శ్రద్ధవహిస్తే సమాజం అభ్యుదయ పథంలో పయనిస్తుంది.

AP Board 8th Class Telugu వ్యాసాలు

9. కంప్యూటర్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్ లో ‘డేటా’ (Data) ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్ఛితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్‌ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డువేర్, సాఫ్ట్వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డువేర్ అంటే కంప్యూటర్ పరికరాలు. సాఫ్ట్ వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది.

కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగాహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైనవాటి టిక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్ ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు.

అయితే కంప్యూటర్లని వాడటం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందనీ, నిరుద్యోగ సమస్య పెరుగుతుందని కొందరి వాదన. ఇది కొంతవరకు నిజమే. ఆ మాత్రంచేతనే ఆధునిక విజ్ఞానాన్ని త్రోసిరాజనడం న్యాయం కాదు. కాబట్టి భావిభారత పౌరులైన విద్యార్థులు కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తప్పక దాన్ని అభ్యసించాలి.

10. జాతీయ సమైక్యత

ఒక దేశంలో పుట్టి పెరిగిన వారంతా ఒక జాతి వారని చెప్పవచ్చు. మనది భారతజాతి. భాష, మతం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఒక్క టైనా, కాకున్నా ఒకే ప్రభుత్వం కిందనున్న ప్రజలంతా ఒకే జాతి అని చెప్పవచ్చు. మతాలు వేరయినా, భాషలు, రాష్ట్రాలు వేరయినా జాతి అంతా కలసి ఉండటమే జాతీయ సమైక్యత అంటారు.

మన భారతీయులలో కనిపించే దౌర్బల్యం అనైక్యత. మతం పేరిటనో, అధికారాన్ని ఆశించో మన రాజులొకరితో ఒకరు కయ్యాలాడుకొని విదేశీయుల పాలనలో దేశాన్ని పడవేశారు. నేటికీ మన దేశాన్నత్యాన్ని సహింపలేని విదేశాలున్నాయి. ఆ దేశాలతో మన జాతి సమైక్యతకు భంగం కలిగించే కొన్ని శక్తులు, మన దేశంలోనే ఉండి పొత్తు పెట్టుకొంటున్నవి. అట్టి అవాంఛనీయ శక్తులను తుదముట్టించి మన జాతినంతా ఒకే తాటిపై నిలపాలి. మనం ఏ రాష్ట్రం వారమైనా, ఏ భాషను మాట్లాడే వారమైనా మనమందరం భారతీయులమనే మాట మరువరాదు.

కొందరు మత కలహాలు పెంచి వారిలో భేదాలు రెచ్చగొట్టి హత్యలకు, లూటీలకు, గృహదహనాలకు సిద్ధపడుతున్నారు. దీనివల్ల ప్రజలలో ఇతర మతంవారిపై ద్వేషం పెరుగుతుంది. కొందరికి ప్రాంతీయ దురభిమానం, మరికొందరికి తమ భాషలపై ‘మోజు ఎక్కువ. స్వభాషాభిమానం ఉండటం మంచిదే. కానీ పరభాషపై ద్వేషం ఉండకూడదు. భాషా రాష్ట్రాలుగా విభజించిన తరువాత ప్రాంతీయ దురభిమానాలు పెరిగి నదీ జలాల కొరకు, తమ ప్రాంతాల అభివృద్ధి కొరకు పరస్పరం కలహించుకొంటున్నారు.

మన జాతిలో అనైక్యతను పోగొట్టి ఐక్యపరచటానికి ప్రభుత్వం జాతీయ సమైక్యతా మండలిని స్థాపించింది. భారత జాతి అంతా ఒక్కటే అని బోధిస్తున్నది. జాతీయ సమైక్యత వల్ల దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా విదేశాలలో భారత జాతి కీర్తిపతాకలు రెపరెపలాడతాయి.

11. మతసామరస్యం

భారతీయ సమాజంలోని వ్యక్తులకు మతం అనేది పుట్టుక నుండి సంక్రమిస్తుంది. అదే విధంగా మతము యొక్క ప్రభావం వ్యక్తిపై పుట్టుక నుండి మరణించే వరకు ఉంటుంది. ప్రపంచంలో అధిక ప్రభావం కలిగిన ముఖ్యమైన మతాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. ఎవరికి వారు వారి మతం గొప్పదిగా భావించడం జరుగుతుంది. ఒకనాటి సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి, ఆనాటి సమాజంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి మతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న మతాలను ఏడు రకాలుగా విభజించవచ్చు.

1) హిందూమతం, 2) ముస్లింమతం, 3) క్రైస్తవమతం, 4) బౌద్ధమతం, 5) జైనమతం, 6) సిక్కుమతం, 7) పార్సీ, యూదుమతం. భారతీయ సమాజంలో హిందూమతం వారే ఎక్కువగా ఉన్నప్పటికీ అనేక కారణాలవల్ల మతాల మధ్య వ్యత్యాసాలు, సంఘర్షణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ విధమైన మతతత్వానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి : 1) ప్రజలలో స్వార్థబుద్ధి 2) మహమ్మదీయులలో ఆర్థిక బలహీనతల కారణంగా మైనార్టీలకు ఎక్కువ సౌకర్యాలను కలిగించాలనే వారి వాదన 3) ప్రాంతీయతత్త్వం మొదలైన కారణాలవల్ల భారతీయ సమాజంలో మతతత్త్వం వెర్రితలలు వేస్తోంది. మతతత్వానికి మరొక ముఖ్యకారణం మతంతో రాజకీయాలు మిళితమై ఉండటం.

మతాన్ని రాజకీయాల్లో చేర్చటంవల్ల భారత్ నుండి పాకిస్థాన్ విడిపోయింది. నేడు సిక్కుమతం వారు భారత్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడతామని అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. మరో ప్రక్క ‘రామజన్మభూమి – బాబ్రీ మసీదు’ వివాదం మతసమస్యగా తయారయింది. భారతదేశంలో మతకలహాలు తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. అల్ప సంఖ్యాకులకు, అధిక సంఖ్యాకులకు మధ్య పరస్పర విశ్వాసం, సామరస్యం లోపించడంతో ఈ భయానక వాతావరణం ఏర్పడి అల్లర్లు, అలజడులు, ఆస్తినష్టం, ప్రాణనష్టం తరచు ఏర్పడుతూనే ఉన్నాయి. వివిధ రాజకీయ పక్షాలు పాక్షిక ప్రయోజనాల సాధన కోసం మతకలహాలను ఒక ఆయుధంగా ఉపయోగించుకొంటున్నాయి.

ఈ విధమైన పరిస్థితులను చక్కదిద్దాలంటే ప్రజలు చైతన్యవంతులై రాజకీయ నాయకుల బూటకపు మాటలకు మోసపోక పరమత సహనం కలిగిఉండాలి. మత సామరస్యంతో అందరూ కలిసిమెలసి జీవించడం నేర్చుకోవాలి.

AP Board 8th Class Telugu వ్యాసాలు

12. జనాభా సమస్య (కుటుంబ నియంత్రణ)

జనాభా ఎక్కువగుట వలన సమస్య ఏర్పడటాన్ని జనాభా సమస్య అంటారు.
“అమెరికాలో డాలర్లు పండును
ఇండియాలో సంతానం పండును”

అని తెలుగులో బాలగంగాధరతిలక్ అనే కవి వ్యంగ్యంగా భారతీయులకి సంతానంపై గల మక్కువ తెలిపాడు. జనాభా సమస్య ఏర్పడటానికి ఈ క్రింది కారణాలు ముఖ్యం 1) సంతానం ఎక్కువగా ఉండటం గొప్పదనంగా భావించడం. 2) ఆడపిల్లలు లేదా మగపిల్లలు కావాలనే కోరికలు. 3) చిన్నప్పుడే వివాహాలు చెయ్యటం. 4) నిరక్షరాస్యత. 5) మత విశ్వాసాలు.

ఇన్ని కారణాల వల్ల రాను రాను జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. జనాభా సమస్యను పరిష్కరించటానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికా విధానం రూపొందించింది.
జనాభా సమస్య నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలు :

  1. ‘కుటుంబ నియంత్రణ’ ను అన్ని మతాల ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
  2. జనాభా సమస్య వల్ల ఏర్పడే నష్టాలను ప్రజలకు తేటతెల్లం చెయ్యాలి.
  3. స్త్రీల కంటే పురుషులు కుటుంబ నియంత్రణ చికిత్స చేసుకోవటం తేలిక. అని చెప్పాలి.
  4. కుటుంబ నియంత్రణకి ప్రోత్సాహం కలిగించే సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలి.
  5. ఆడయినా, మగయినా ఒకటేనన్న భావాన్ని కలిగించాలి.
  6. కుటుంబ నియంత్రణ పాటించడం పాపమనే భావనని తొలగించాలి.

అప్పుడు మాత్రమే జనాభా పెరుగుదలను అరికట్టడం సాధ్యమవుతుంది. జనాభా సమస్య వల్ల నష్టాలు ఇవి –

  1. జనాభా పెరుగుదల వల్ల ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య, కాలుష్య సమస్యల వంటివి ఎక్కువవుతాయి.
  2. విద్యాలయాలలో సీట్లు లభించక విద్యావకాశాలు తగ్గిపోతాయి.
  3. దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుంది.
  4. “అందరికీ ఆరోగ్యం ” అనేది సాధ్యం కానేరదు.
  5. సంతానం ఎక్కువగా వుంటే తల్లిదండ్రులపై భారం ఎక్కువై పిల్లల్ని సక్రమంగా పెంచి పోషించలేరు.
  6. జనాభా ఇదే విధంగా పెరుగుతూవుంటే బట్టకీ, ఇంటికీ కూడా కరవు తప్పదు.

అందువల్ల ప్రభుత్వం జనాభా సమస్య నిర్మూలనకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ‘చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం’ అని బోధించడమే కాదు. నాయకులు, అధికారులు తాము కూడా పాటించాలి. కుటుంబ నియంత్రణ పాటించని వారిని శిక్షించే చట్టం రూపొందించాలి. అప్పుడే దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుంది.

13. విజ్ఞానయాత్రలు

విజ్ఞానయాత్రలు లోకజ్ఞానాన్ని కలిగించేవి. అయినా ఇవి వినోదయాత్రలుగా, విహారయాత్రలుగా వ్యవహారంలో ఉన్నాయి. అంటే కొన్ని ప్రత్యేక స్థలాలకి ప్రయాణం చేయటం వల్ల విజ్ఞానం సంపాదించవచ్చు. విజ్ఞానమే కాకుండా వినోదం కూడా లభిస్తుంది.

పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచారవ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది. ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తోందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. అది కేవలం “Bookish knowledge”. జలవిద్యుత్ కేంద్రానికి వెళ్ళి, అది పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాల అవగాహనకు యాత్రలు ఎంతో అవసరం.

విజ్ఞానయాత్రల వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు – 1) లోకజ్ఞానం అలవడుతుంది. 2) మానసిక విశ్రాంతి లభిస్తుంది. 3) విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు. 4) పదిమందితో ఏవిధంగా మెలగాలో అనుభవం వస్తుంది. 5) స్నేహితులను పొందే అవకాశం లభిస్తుంది. 6) జాతి సమైక్యత, దేశ సమైక్యతకి దోహదం చేస్తాయి. 7) కవులకి, చిత్రకారులకి, మానసిక రోగులకి స్ఫూర్తిని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

ఇటువంటి విజ్ఞాన యాత్రల్లో చాలా రకాలున్నాయి-1) ప్రకృతికి సంబంధించినవి – ఊటీ, హిమాలయాలు, జోగ్ జలపాతం మొదలగునవి. 2) చారిత్రక సంబంధమైనవి-ఎల్లోరా, రామప్పగుడి, చార్మినార్ మొదలగునవి. 3) శాస్త్ర సంబంధమైనవి-బిర్లా ప్లానిటోరియం, పరిశ్రమలు, అణుకేంద్రాలు మొదలగునవి. 4) మత సంబంధమైనవి-కాశీ, మక్కా, వాటికన్, తిరుపతి మొదలగునవి.

ఈ యాత్రల పట్ల విద్యార్థి దశనుండే ఉత్సాహం ఏర్పడేలా చూడాలి. విద్యార్థిగా ఉన్నప్పుడే లోకజ్ఞానం అలవడితే జీవితం సంపన్నమవుతుంది – అర్థవంతమవుతుంది. ఉపాధ్యాయుల, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయుల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులలో ఐకమత్యానికి కూడా ఈ యాత్రలు తోడ్పడతాయి.

విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం యువకులకో లేదా విద్యార్థులకో, కళాకారులకో అనుకోవటం సరికాదు. అన్ని వయస్సులవాళ్ళకీ, అన్ని వృత్తులవాళ్ళకీ అవసరమే. కూపస్థ మండూకం లాగా జీవించటం మానవుడి నైజం కాదు కాబట్టి విజ్ఞానయాత్రలు అత్యంతావశ్యకాలు.

14. వార్తాపత్రికలు

వార్తలను అందించే పత్రికలను “వార్తా పత్రికలు” (News papers) అంటారు. వార్తలను ఇంగ్లీషులో NEWS అంటారు గదా! ఆ అక్షరాలను బట్టి కొందరు ఈ విధమైన వివరణ ఇస్తారు – N అంటే North, E అంటే East, W అంటే West, S అంటే South. కాబట్టి ప్రపంచం నలుమూలలా జరిగే సంఘటనలను అందించేవి వార్తా పత్రికలు అనే వివరణ సమంజసంగానే కనిపిస్తుంది.

ప్రాచీనకాలంలో వార్తలను చేరవేయటానికి మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని వాడేవారు. “వార్తాహరులు”, “రాయబారులు” ఉండేవారు. కానీ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత ముద్రణాయంత్రాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ‘అచ్చు’కి ప్రాముఖ్యం లభించి వార్తా పత్రికల వ్యాప్తి జరిగింది.

ప్రపంచంలో మొట్టమొదటగా వెనిస్ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు. సుమారు క్రీ.శ. 1620 నాటికి వార్తా పత్రికలు వచ్చినట్టు తెలుస్తోంది. భారతదేశంలో మొదటి వార్తాపత్రికగా “ఇండియా గెజిట్”అని కొందరు, “బెంగాల్ గెజిట్”అని మరికొందరు పేర్కొంటున్నారు. క్రీ.శ. 1850 నుంచి మన దేశంలో పత్రికల ప్రచురణ అధికమైంది. కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, ఖాసా సుబ్బారావు, సి.వై. చింతామణి, గోరా, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఎ.బి.కె. ప్రసాద్ మొదలైనవారు సంపాదకులుగా తెలుగువార్తా పత్రికల ప్రాచుర్యానికి ‘ఎంతో కృషి చేశారు.

ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రభూమి, వార్త అనే దినపత్రికలు తెలుగునాట విశేష ఆదరణ పొందాయి.

వార్తా పత్రికల వల్ల లాభాలు చాలా ఉన్నాయి. అవి :

  1. మానవుడి మేధ వికసిస్తుంది.
  2. ఆర్థిక, రాజకీయ, విద్య, క్రీడ, వ్యవసాయ, సాహిత్యాదిరంగాలలోని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.
  3. సమాజంలో అట్టడుగున పడి కనిపించని వాస్తవాలెన్నో పత్రికల ద్వారా తెలుస్తాయి.
  4. రచయితలకు, యువతకు, కళాకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారవేత్తలకు, రైతులకు ఇంకా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ వార్తా పత్రికలు కరదీపికలు.
  5. జాతీయాభివృద్ధికి, జాతి సమైక్యతకి దోహదపడతాయి.
  6. ప్రభుత్వానికీ, ప్రజలకీ మధ్య వారధి వలె తోడ్పడతాయి. అంటే ప్రభుత్వ పథకాలూ, లోపాలూ ప్రజలకి తెలియజేస్తాయి. ప్రజల కష్టనష్టాలూ, సమస్యలూ, అభిప్రాయాలూ ప్రభుత్వానికి తెలియజేస్తాయి.

కొన్ని పత్రికలు నిష్పాక్షికంగా ఉండి అధికారుల అవినీతిని, అక్రమాలని బహిరంగపరుస్తున్నాయి. మరికొన్ని అశ్లీలానికీ, నీతిబాహ్యమైన అంశాలకీ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛని కాపాడాలి. సంపాదకులు, పత్రికా నిర్వాహకులు పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యకుండా నైతిక బాధ్యత కలిగి ఉండాలి.

AP Board 8th Class Telugu వ్యాసాలు

15. స్వచ్ఛభారత్

‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికి పేటలు, గంగ, గోదావరి వంటి నదుల జలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్చతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శన్ వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson స్ఫూర్తి ప్రదాతలు

8th Class Telugu ఉపవాచకం 6th Lesson స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. నెల్లూరు జిల్లా సంగం మండలంలో గాంధీ జనసంఘం ఒక మారుమూల గిరిజన గ్రామం. యానాదులు, ఎరుకల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన పద్మశ్రీ వెన్నెలకంటి రాఘవయ్యగారు గిరిజనులకోసం నిర్మించిన | గ్రామం ఇది. రెక్కాడితేగాని డొక్కాడని వీరు ఊరిపక్కనే ఉన్న కాలువలో చేపలు పట్టి అమ్ముకుంటూ, వ్యవసాయం, కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ఆ కుగ్రామంలో మల్లి మస్తానయ్య కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళ గురించి గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ఊళ్లలో కూడా చెప్పుకుంటారు. కారణం ఏమిటంటే పూటగడవడం కూడా కష్టంగా ఉండే ఆ కుటుంబంలోంచి ఆడపిల్లతో సహా నలుగుర్నీ బడికి పంపి చదివిస్తుండడమే. మస్తానయ్య కాస్త అక్షరజ్ఞానం ఉన్నవాడు. చదువు విలువ తెలిసినవాడు. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసేవాడు. ఇంట్లో తిండికి, బట్టకు లేకపోయినా పిల్లల పుస్తకాలకు మాత్రం కొరత రాకూడదనుకునేవాడు. అలాంటి నిరుపేద కుటుంబంలో 1974 సెప్టెంబరు 3వ తేదీన మస్తాన్ బాబు జన్మించాడు.
ప్రశ్నలు :
1. గాంధీ జనసంఘం ఏ జిల్లాలోని ఏ మండలంలో ఉంది?
జవాబు:
గాంధీ జనసంఘం నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఉంది.

2. గాంధీ జనసంఘం గిరిజన గ్రామాన్ని ఎవరు నిర్మించారు?
జవాబు:
గాంధీ జనసంఘం గిరిజన గ్రామాన్ని వెన్నెలకంటి రాఘవయ్య నిర్మించాడు.

3. కాస్త అక్షరజ్ఞానం కలవాడు ఎవరు?
జవాబు:
కాస్త అక్షరజ్ఞానం కలవాడు మస్తానయ్య.

4. మస్తాన్ బాబు ఏ తేదీన జన్మించాడు?
జవాబు:
మస్తాన్ బాబు 3.9. 1974వ తేదీన జన్మించాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

2. ఒకరోజు స్నేహితులతో కలిసి గుట్టలు ఎక్కడానికి వెళ్ళాడు. అదే అతడి పర్వతారోహణకు బీజం పడినరోజు. రాళ్ళు, ముళ్ళు దాటుకుంటూ కొండనెక్కడం అతనికి తెలియని ఆనందాన్నిచ్చింది. స్నేహితులంతా వంటచెరకు సేకరిస్తుంటే పొదల మధ్య కాలిబాట చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. చేతిలో ఉన్న కత్తితో నాగజెముడు పొదలు నరుకుతుంటే ఆ చెట్లకుండే తెల్లని పాలు చింది కళ్ళలో పడ్డాయి. అంతే కళ్ళు మండిపోతుంటే ఏడుస్తూ బాధ తట్టుకోలేక కిందపడి దొర్లసాగాడు. ఇంతలో స్నేహితులు వచ్చారు. అందరూ కలిసి వైద్యశాలకు తీసుకుపోయారు. ఈ వార్త తండ్రికి చేరింది. కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆసుపత్రికి చేరారు. డాక్టరు మందులిచ్చి | భయపడాల్సిందేమీ లేదని చెప్పి ఇంటికి పంపాడు.

ప్రశ్నలు:
1. మస్తాన్ గుట్టలు ఎక్కడానికి ఎవరితో వెళ్ళాడు?
జవాబు:
మస్తాన్ గుట్టలు ఎక్కడానికి స్నేహితులతో వెళ్ళాడు.

2. స్నేహితులందరూ మస్తాన్ ను ఎక్కడికి తీసుకొని వెళ్ళారు?
జవాబు:
స్నేహితులందరు మస్తాన్ ను వైద్యశాలకు తీసుకొని వెళ్ళారు.

3. ఏ పొదలను నరుకుతుంటే తెల్లని పాలు చిందాయి?
జవాబు:
నాగజెముడు పొదలను నరుకుతుంటే తెల్లని పాలు చిందాయి.

4. హూటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నది ఎవరు?
జవాబు:
హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.

3. 1962వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుండి ఐ.ఎ.యస్.కు ఎంపికయిన నాదెళ్ళ యుగంధర్ నాయుడిది అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామం. వీరి శ్రీమతి ప్రభావతి. ఈ దంపతులకు 1967లో సత్య నాదెళ్ళ జన్మించారు. కలెక్టరుగా, ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రణాళికాసంఘ సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేసిన యుగంధర్ మంచి అధికారిగా మన్ననలు అందుకున్నారు. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన సత్య బాల్యం నుంచే తెలివితేటలు ప్రదర్శించేవాడు. తండ్రికున్న కార్యదీక్షా లక్షణాల్ని పుణికిపుచ్చుకొని పెరిగాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిగా అందరితో కలవిడిగా ఉండడం, అందర్నీ కలుపుకొనిపోవడం, నిజాయితీగా వ్యవహరించడం, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయటం, అవసరాల్లో ఉన్నవారిని ఆదరించటం, చేయూతనివ్వడం లాంటి సర్వోన్నత లక్షణాలను అలవరుచుకున్నాడు. సత్యకు క్రికెట్ అంటే ఎంతో మక్కువ. క్రికెట్ జట్టులో సభ్యుడిగా, తన ప్రతిభను నిరూపించుకొని కెప్టెన్ గా కొనసాగాడు. క్రికెట్ బృందాన్ని సమన్వయపరిచే క్రమంలోనే నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నానని ఆటలు ఆడటం ద్వారా మాత్రమే ఒత్తిడిని అధిగమించడం, విజయం కోసం పోరాడడం వంటి గుణాలు అలవడతాయనీ తాను నమ్ముతానని ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ళ చెప్పారు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివి 1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బి.ఇ డిగ్రీ పొందారు. ఆ తరువాత అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సులో మాస్టర్స్ డిగ్రీ, షికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ పొందారు.
ప్రశ్నలు :
1. సత్య నాదెళ్ళ ఏ జిల్లాలో జన్మించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ అనంతపురంలో జన్మించాడు.

2. సత్య నాదెళ్ళ ఏ సంవత్సరంలో జన్మించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ 1967లో జన్మించాడు.

3. సత్య నాదెళ్ళకు ఏ ఆట అంటే ఇష్టం?
జవాబు:
సత్య నాదేళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.

4. షికాగో యూనివర్సిటీ నుండి ఏ డిగ్రీ పొందాడు?
జవాబు:
చికాగో యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మిని స్టేషన్లో మాస్టర్ డిగ్రీ పొందారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

4. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించటంతోపాటు మరింత కష్టపడవలసి ఉందని ఈ సందర్భంగా ‘సత్య’ వ్యాఖ్యానించాడు. టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ కి సి.ఇ.వో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఏడాదికి 112 కోట్ల వేతనం తీసుకునే ఉద్యోగిగా తమ సంస్థలో నవకల్పనలకే పెద్దపీట వేస్తామని చెప్పారు. సత్య నాదెళ్ళ జీవితభాగస్వామి శ్రీమతి అనుపమ. వీరికి ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటం వల్ల అలాంటి పిల్లల కొరకు హైదరాబాద్ లో ఒక పాఠశాలను స్థాపించారు. ‘నేను నిర్మించటాన్ని, నిరంతరం నేర్చుకోవడాన్ని ఇష్టపడతాను. పట్టుదల, కార్యదక్షత, నిజాయితి, నాయకత్వం, సేవాభావం అనే లక్షణాలను సాధించినపుడే ఎంతటి క్లిష్టమైన విజయశిఖరాలనైనా అధిరోహించగలుగుతాం” అంటూ ఆ చరిత్రని నిరూపించిన సత్య నాదెళ్ళ నేటి యువతరానికి చక్కని రోల్ మోడల్.
ప్రశ్నలు :
1. సత్య నాదెళ్ళ జీవిత భాగస్వామి పేరు ఏది?
జవాబు:
సత్య నాదేళ్ళ జీవిత భాగస్వామి పేరు శ్రీమతి అనుపమ.

2. సత్య నాదెళ్ళ ఎవరి కోసం హైదరాబాద్ లో పాఠశాలను ప్రారంభించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ బుద్ధిమాంద్యం గల పిల్లల కోసం ఒక పాఠశాలను స్థాపించాడు.

3. సత్య నాదెళ్ళకు ఏడాదికి జీతం ఎంత?
జవాబు:
సత్య నాదేళ్ళకు ఏడాదికి జీతం 112 కోట్లు.

4. టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చివేసిన అరుదైన సంస్థలలో అగ్రగామి సంస్థ ఏది?
జవాబు:
టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చివేసిన అరుదైన సంస్థలలో అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్.

5. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, తుమ్మపూడి గ్రామంలో కీ.శే. సూర్యదేవర రామదేవరాయలు, వెంకాయమ్మ దంపతులకు 1914వ సంవత్సరం జూలై నెల 3వ తేదీన సంజీవ్ దేవ్ జన్మించాడు. నాలుగేళ్ళ వయస్సులోనే అతని తల్లి మరణించింది. కొంతకాలం వారి చిన్నాన్న సూర్యదేవర వెంకటకృష్ణయ్యగారివద్ద పెరిగాడు. ఆ తరువాత కృష్ణాజిల్లాలోని కోనాయపాలెంలో అమ్మమ్మ సంరక్షణలో మేనమామ ఇంట పెరిగాడు. విద్యాభ్యాసమంతా ఇంటి దగ్గరే కొనసాగింది. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపేవాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో చక్కని ప్రావీణ్యం సంపాదించాడు. అయితే 13 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి తనను గారాబంగా పెంచుతున్న ” అమ్మమ్మ కూడా చనిపోయింది. మరికొంతకాలానికి తాను అమితంగా ప్రేమించే తన గారాల చెల్లి కూడా చనిపోవడంతో జీవితంలో విషాదం తప్ప మరేమీ మిగలలేదని తల్లడిల్లిపోయాడు. అక్కున చేర్చుకుని అదరించేవారు లేక ఒంటరితనాన్ని భరించలేక 18 సంవత్సరాల వయస్సులో హిమాలయాలకు వెళ్ళిపోయాడు.
ప్రశ్నలు:
1. సంజీవ్ దేవ్ ఎక్కడ జన్మించాడు?
జవాబు:
సంజీవ్ దేవ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మకూరు గ్రామంలో జన్మించాడు.

2. సంజీవ్ తల్లిదండ్రుల పేర్లు ఏమి?
జవాబు:
సంజీవ్ తల్లిదండ్రుల పేర్లు సూర్యదేవర రామ దేవరాయలు, వెంకాయమ్మ.

3. సంజీవ్ కు ఏ భాషల్లో ప్రావీణ్యం ఉంది?
జవాబు:
సంజీవ్ కు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం ఉంది.

4. సంజీవ్ ఎందుకు హిమాలయాలకు వెళ్ళాడు?
జవాబు:
సంజీవ్ ఒంటరితనాన్ని భరించలేక తన 18వ సంవత్సరంలో హిమాలయాలకు వెళ్ళాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

6. అనేక భాషలను సొంతంగా నేర్చుకుని బహుభాషావేత్తగా రూపొందినట్లుగానే చిత్రకళను కూడా సొంతంగా అభ్యసించి చిత్రకారుడయ్యాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా ముందు చిత్రకళా విమర్శకుడై యాభై సంవత్సరాల వయస్సు దాటాక కుంచె చేతపట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు. సాహిత్యాన్ని, చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని, శిల్పాన్ని గురించి విడివిడిగా వివరించడమేకాక లలితకళలన్నింటిలోను అంతర్లీనంగా ఉన్న సంబంధ బాంధవ్యాలను, తాత్వికతలను తులనాత్మకంగా విశ్లేషించారు. ఆయన ప్రతిభను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం డి.లిట్ తో సత్కరించింది. కళలు, సాహిత్యం , సమాజ అభ్యున్నతికి దోహదపడేవిగా ఉండాలని కాంక్షించి జీవితాంతం దానికోసమే కృషిచేసిన కళాతత్వవేత్త సంజీవ్ దేవ్ 25-8-1999న ఇహలోక యాత్రను ముగించాడు. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్వయంకృషితో అద్భుత ప్రతిభను ప్రదర్శించిన సంజీవ్ దేవ్ జీవనవిధానం మనందరికీ ఆనంద దాయకం
ప్రశ్నలు :
1. సంజీవ్ చిత్రకళను ఎలా అభ్యసించాడు?
జవాబు:
సంజీవ్ చిత్రకళను సొంతంగా అభ్యసించి చిత్రకళా కారుడయ్యాడు.

2. దేనిని చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు?
జవాబు:
కుంచె చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు.

3. సంజీవ్ ను సత్కరించిన విశ్వవిద్యాలయం ఏది?
జవాబు:
సంజీవ్ ను సత్కరించిన విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం.

4. సంజీవ్ ఏ తేదీన మరణించాడు?
జవాబు:
సంజీవ్ 25-8-1999న మరణించాడు.

7. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

సీతారామరాజు 1897లో పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో క్షత్రియ కుటుంబంలో జన్మించారు. గుర్రపుస్వారీ, మూలికావైద్యం, జ్యోతిష్యంలో పట్టు సంపాదించాడు. ఆంగ్లేయుల విధానాలకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో 1922 నుంచి 1924 మే వరకు తెగువతో పోరాడిన వీరుడు సీతారామరాజు. అన్నవరం, శంఖవరం, రంపచోడవరం పోలీస్ రాణాలపై దాడిచేసి ఆంగ్లేయులకు చెమటలు పట్టించాడు. ఈ మన్యం వీరుని కుతంత్రంతో చుట్టుముట్టి రూథర్‌ఫోర్డ్ నేతృత్వంలోని సేనలు కాల్చి చంపాయి.
ప్రశ్నలు :
1. సీతారామరాజు జన్మస్థలం ఏది?
జవాబు:
పశ్చిమ గోదావరి జిల్లా ‘మోగల్లు’.

2. సీతారామరాజుకు ఏ విషయాలలో పట్టు ఉంది?
జవాబు:
గుర్రపుస్వారీ, మూలికా వైద్యం, జ్యోతిష్యంలో

3. ఆంగ్లేయులకు ఏ కారణంతో ఆగ్రహం కలిగింది?
జవాబు:
వీరి విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, వారి పోలీస్ ఠాణాలపై దాడి చేయడం వల్ల.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
సీతారామరాజును ఎవరి నేతృత్వంలోని సేనలు కాల్చాయి?

8. కింది సంభాషణ చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పద్మావతి : మిత్రులారా ! బాగున్నారా !
పూజిత : బాగున్నాము. మీ పాఠశాలలో జూలై 4న ఏదో ఉత్సవం జరిపినట్లున్నారు. ఏమిటది?
పద్మావతి : అవును. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించాము.
పూజిత : మీ పాఠశాలలో ఆయన జయంతిని ఎలా నిర్వహించారు?
పద్మావతి : ఆ రోజు ఉదయం పాఠశాల ప్రార్థనా సమావేశంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాం.
హరిత : మా ప్రధానోపాధ్యాయుల వారు అల్లూరి వారిని గురించి చెప్పి రంప విప్లవాన్ని వారు నడిపిన తీరు, ధైర్యాన్ని గురించి వివరించారు.
పూజిత : అలాగా ! ఆ మహావీరుని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి?
పద్మావతి : పాఠశాల గ్రంథాలయాలలో ఆ వీరుని జీవితచరిత్ర గురించి శ్రీ ఎం.వి.ఆర్. శాస్త్రి, శ్రీ ఎం. చలపతిరావు వంటివారు రాసిన పుస్తకాలున్నాయి చదువు.
పూజిత : అలాగే !
హరిత : నా దగ్గర పుస్తకం ఉంది ఇమ్మంటారా?
పూజిత : ఇవ్వు. చదివి మళ్ళీ ఇచ్చేస్తాను. ఉంటాను.
ప్రశ్నలు :
1. పై సంభాషణలో ‘పుట్టిన రోజు’ అనే అర్థం వచ్చే పదం ఉంది. వెతికి రాయండి.
జవాబు:
జయంతి.

2. అల్లూరి సీతారామరాజు నడిపిన విప్లవోద్యమం ఏది?
జవాబు:
రంప విప్లవోద్యమం.

3. పై సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది?
జవాబు:
పద్మావతి, పూజిత, హరితల మధ్య సంభాషణ జరిగింది.

4. చనిపోయిన ప్రముఖుల పట్ల గౌరవం, అభిమానం ప్రకటిస్తూ మాట్లాడే మాటలను ఏమంటారు?
జవాబు:
నివాళులు అర్పించడం.

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి.

ప్రశ్న 1.
సాహసవీరుడు మస్తాన్ బాబు జీవితచరిత్ర నుండి మీరేమి నేర్చుకున్నారు?
జవాబు:
మన రాష్ట్రంలో ఎందరో సాహసవీరులు ఉన్నారు. వారిలో మస్తాన్‌బాబు ప్రసిద్ధుడు. ఈయన జీవిత చరిత్ర అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మస్తాన్‌బాబు నెల్లూరు జిల్లాలోని ఒక కుగ్రామంలో 3-9-1974వ తేదీన జన్మించారు. వీరిది నిరుపేద కుటుంబం. తండ్రి అక్షర జ్ఞానం కలవాడు. చదువు విలువ తెలిసినవాడు. అందువల్లనే మస్తాన్ బాబు చదువుకోసం ఎంతో కష్టపడ్డారు.

మస్తాన్ బాబు మాత్రం చదువుపట్ల ఆసక్తి చూపేవాడు కాదు. తండ్రి మందలించినా వినిపించుకోలేదు. అల్లరిచిల్లరగా తిరిగేవాడు. తండ్రి ఆందోళన చెంది మస్తాన్ బాబును కోరుకొండ సైనిక స్కూలులో చేర్పించాడు. మస్తాన్ బాబు స్కూల్ లోని ఉదయ్ భాస్కర్ విగ్రహాన్ని తదేకంగా చూశాడు. ఉదయ్ భాస్కర్ ఆ పాఠశాల పూర్వ విద్యార్థి. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహనీయుడు.

మస్తాన్ ఐ.ఐ.టిలో బి.టెక్ లో చేరాడు. తండ్రి ఎన్నో ఇబ్బందులు పడి కుమారుడిని చదివించాడు. చదువు పూర్తికాగానే సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. ఇంతలోనే తండ్రి మరణం మస్తాన్ ని బాగా కుంగదీసింది. లక్షలాది జీతాన్ని కూడా వదులుకొని తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాడు. అందుకోసం గంధోతిలోయను చేరాడు. దాని కోసం కొత్త సాధన చేశాడు. శారీరకంగా శ్రమ చేశాడు. హిమాలయాల్లోని కాంచనగంగ కనుమలను చేరుకున్నాడు. శ్రమించి ఎవరెస్టు శిఖరంపై కాలుమోపాడు. జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు. నాలుగు శిఖరాలను దాటి తిరిగివస్తుండగా 600 కి.మీ. దిగువన మంచు తుపాను భయంకరంగా వచ్చింది. మస్తాన్ తలదాచుకున్న గుడారాన్ని కబళించి వేసింది. ఏ పర్వతాలను ప్రాణప్రదంగా భావించాడో ఆ పర్వాతాలలోనే తనువు చాలించాడు. దేశమంతా ఆ సాహసవీరునికి నివాళులను అర్పించింది.

ఈ విధంగా మస్తాన్ ఎన్నో కష్టాలను అనుభవించి చివరకు లక్ష్యం చేరుకున్నాడు. లక్షల రూపాయల ఉద్యోగాన్ని వదులుకున్నాడు. తాను కలలుకన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. వీరమరణం పొందాడు. ఆ మహనీయుని కార్యదక్షత, దృఢసంకల్పం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకం కావాలి. తింటానికి తిండి లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగులేకపోయినా అందరితో కలిసిమెలిసి నవ్వుతూ ఉండడం మనం తప్పక నేర్చుకోవాలి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 2.
కార్యదక్షత, దృఢసంకల్పం మనకు మార్గదర్శనం చేస్తాయి. చర్చించండి.
జవాబు:
కార్యదక్షత, దృఢసంకల్పం మనకు మార్గదర్శనం చేస్తాయి. ఎందుకంటే ఒక పనిని సాధించాలంటే ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటిది లక్ష్యం సాధించాలంటే ఎంతో శ్రమచేయవలసి ఉంటుంది. అన్ని పరిస్థితులు, సదుపాయాలు, అవకాశాలు సరిగ్గా ఉంటే లక్ష్యసాధన సులభం అవుతుంది. లక్ష్యం అనేది ఉన్నతంగా ఉంటే, దాన్ని సాధించడానికి ఎన్నో ఆటంకాలు, సమస్యలు ఎదురవుతాయి. వాటిని చాకచక్యంగా ఎదుర్కొని విజయాన్ని వరించాలి. కార్యదీక్ష, పట్టుదల ఉంటే ఎంతటి అసాధ్యాలను అయినా సుసాధ్యం చేయగలమని నమ్మాలి.

ఇలాంటి కార్యదక్షత, దృఢసంకల్పం గల వారిలో పర్వతారోహకుడు మస్తాన్‌వలి ప్రముఖుడు. కుటుంబ పరిస్థితులు బాగులేకపోయిన, ఆర్థిక పరిస్థితులు అడ్డంకులుగా నిలిచినా వాటిని లెక్కచేయలేదు. లక్షలాది రూపాయల ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా భావించాడు. తాను కలలుగన్న పర్వతారోహణను చేయాలనుకున్నాడు. ఉద్యోగాన్ని వదులుకున్నాడు. శారీరకంగా కృషి చేశాడు. ఎన్నో ఇబ్బందులను పడి చివరకు లక్ష్యాన్ని చేరుకున్నాడు. అందరికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు.

ఆయన కార్యదీక్ష, దృఢసంకల్పం అందరికి ఆదర్శంగా నిలిచింది. లక్ష్యాన్ని సాధించి తిరుగుప్రయాణంలో తన ప్రాణాలను కోల్పోయాడు. తాను బాగా ప్రేమించిన శిఖరాలపైనే వీరమరణం పొందారు. మస్తాన్‌బాబు నుంచి విద్యార్థులందరు స్ఫూర్తి పొందాలి. కార్యదీక్షపై శ్రద్ధ వహించాలి. కష్టాలను అధిగమించే మనస్సును పెంపొందించుకోవాలి. అందరికి ఆదర్శంగా నిలవాలి. ఇదే మన ముందు తరాలకు అందించే గొప్ప కానుక.

ప్రశ్న 3.
సత్య నాదెళ్ళ వ్యాపారదిగ్గజంగా మారడానికి తోడ్పడిన అంశాలేమిటి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంది మేధావులు ఉన్నారు. వారు ప్రపంచంలోని వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తెలుగువారి మేధాసంపత్తిని దశదిశలా విస్తరింపజేశారు. వారిలో సత్య నాదెళ్ళ సుప్రసిద్ధులు. ఈయన వైఫల్యాలను ఎదుర్కొనడమేగాదు, వైఫల్యాల నుండి ఏమి నేర్చుకున్నామనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు.

సత్య నాదెళ్ళ 1967లో అనంతపురంలో విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. అందువలనే చిన్నతనం నుండే అన్ని విషయాలలోనూ అసమాన ప్రతిభను కనబరిచేవాడు. తండ్రి నుండి కార్యదక్షను పుణికిపుచ్చుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం, అవసరాల్లో ఆదుకోవడం మొదలైన ఉత్తమ లక్షణాలు ఇతనిలో ఉన్నాయి. ఒత్తిడిని అధిగమించగలిగే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకున్నాడు. దేశవిదేశాల్లో విద్యను పూర్తి చేశాడు. వ్యాపార రంగంలో మాస్టర్ డిగ్రీ పొందారు.

వీరి ప్రతిభను గుర్తించి ఎన్నో సంస్థలు ఉద్యోగంలో చేరమని ఆహ్వానించాయి. 1992లో మైక్రోసాఫ్ట్ వ్యాపార సేవల రంగంలో కీలకపాత్ర పోషించాడు. ఐదేళ్ళలో కంపెనీ వ్యాపారాన్ని 6 వేల కోట్ల నుండి 31 వేల కోట్లకు దాటించాడు. కొంత కాలం బిల్ గేట్సకు టెక్నాలజీ సలహాదారుగా ఉన్నాడు. ఆధునాతన సాఫ్ట్ వేర్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈయన కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. అకుంఠితమైన సత్య నాదెళ్ళ కార్యదీక్ష అందరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

ఈయనకు గల అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, నిరంతర దీక్ష, నాయకత్వ ధోరణి ఇవన్నీ అందరినీ ఆకర్షించాయి. ఏడాదికి 112 కోట్ల వేతనం తీసుకునే ఉద్యోగిగా ఎంతో గర్వించారు. ఈయన సేవల వల్ల సాఫ్ట్ వేర్ ఎంతో ఘనత సాధించింది. కరెంటు బిల్లు నుండి క్రయోజనిక్ రాకెట్ ఇంజన్ దాకా ప్రతిచోటా సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. కంప్యూటర్ అక్షరాస్యత అవసరంగా మారిన కాలం ఇది. ఈయనకు గల పట్టుదల, కార్యదక్షత, నిజాయితి, నాయకత్వం, సేవాభావం అనే లక్షణాలే ఈయనకు విజయశిఖరాలు అధిరోహించేలా చేశాయి.

ప్రశ్న 4.
డా|| సంజీవ్ దేవ్ తమ రచనలు, చిత్రాల ద్వారా సమాజానికి ఏమి తెలియజేస్తున్నారని మీరు భావిస్తున్నారు?
జవాబు:
ప్రకృతే మనకు గురువు, దైవం, ఆప్తమిత్రుడు. మనకు ఎదురయ్యే సమస్యలన్నింటికీ ప్రకృతి నుండే పరిష్కారం లభిస్తుంది. ప్రకృతిని ప్రేమించగలిగితే ప్రజాజీవితం సాధ్యమవుతుందని విశ్వసించే వారిలో ముఖ్యుడు డా|| సంజీవ్ దేవ్. వీరు 3. 7.1914వ తేదిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం – తుమ్మకూరు గ్రామంలో జన్మించాడు. వీరు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపేవారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు.

18 సంవత్సరాల వయసులో హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ స్వామి పవిత్రానంద దగ్గర శిష్యరికం చేస్తూ పాశ్చాత్య తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. మానవ జీవితం గురించి, ప్రకృతి గురించి పరిశోధన చేశాడు.

డా|| సంజీవ్ దేవ్ ఈ ప్రయాణంలో ఎందరో ప్రముఖులను కలిశాడు. ఈయన గొప్ప ప్రకృతి ప్రేమికుడు కావడంతో కవిగానే కాకుండా చిత్రకళా విమర్శకునిగా కూడా పేరు పొందాడు. కొంతకాలం తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వచ్చి సొంత ఊరిని మించిన స్వర్గం లేదని భావించాడు. తనకు సన్నిహితులైన చిత్రకారుడు ఎస్.వి. రామారావు, భావకవి కృష్ణశాస్త్రి, నవలారచయిత చలం, కథారచయిత బుచ్చిబాబు మొదలగువారితో కవిత్వ చర్చలు చేసేవారు.

ఈయన గొప్ప మానవతావాది. దేశవిదేశాల నుండి ఎంతోమంది భిన్న అంశాలపై ఆయనకు ఉత్తరాలు రాసేవారు. గొప్ప లేఖా రచయిత కావడంతో వారందరికీ ఓపికగా ప్రత్యుత్తరాలిస్తూ సందేహ నివృత్తి చేసేవారు. ఈయన మనం ఆనందంగా జీవించడంతోపాటు ఇతరులను కూడా సంతోషపెట్టడమే సర్వమతాలసారం అని ప్రకటించారు. ఈయన కవి, చిత్రకారుడు మాత్రమే కాదు గొప్ప మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కూడా.

డా|| దేవ్ గారు ఎన్నో భాషలను నేర్చుకున్నారు. బహుభాషావేత్తగా, విమర్శకుడిగా గుర్తింపు పొందారు. కుంచె చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు. సాహిత్యాన్ని, చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని, శిల్పాన్ని గురించి విడివిడిగా వివరించడమే కాకుండా లలితకళలన్నింటిలోను అంతర్లీనంగా ఉన్న సంబంధ బాంధవ్యాలను తాత్వికతలను తులనాత్మకంగా విశ్లేషించు వీరు 25.8.1999న పరమపదించారు. వీరు స్వయంకృషితో, ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వీరి జీవనవిధానం అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ మహామనీషి మరణించినా వీరి రచనలు, చిత్రాలు, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 5.
మన జీవితానికి స్ఫూర్తినిచ్చేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరి గురించి రాయండి.
జవాబు:
మన జీవితానికి స్ఫూర్తినిచ్చేవారు ఎందరో ఉన్నారు. అలనాటి రాముడు మొదలుకొని గాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖులే కాక వెలుగులోకి రాని మహనీయులు ఎందరో ఉన్నారు. ఎందరు ఉన్నా నా తొలి ప్రాధాన్యం మాత్రం అమ్మానాన్నలే. వారే లేకపోతే మనం ఎక్కడున్నాం, ఎవరో ఒకరి పేరు పెట్టి ఏదో ఒకటి రాయవచ్చు. కానీ అమ్మనాన్నల గొప్పదనాన్ని గుర్తించి కూడా వేరొకర్ని కీర్తించడం సబబేనా ? కాదు కదా ! అందుకే మరి మా అమ్మా నాన్నల గురించి చెబితే స్వార్థం అంటారుగా. అందుకే వారిని మనసులో తలుచుకొంటూ వారి స్థానాన్ని, వారి ప్రేమను మీ ముందుంచుతాను.

ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది అమ్మ అయితే, ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు నాన్న. కన్ను మూసే వరకు ప్రేమించేది అమ్మ. కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది నాన్న. జీవితం అమ్మది. జీవనం నాన్నది. ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది. ఆకలి విలువ తెలిసేలా నాన్న చేస్తాడు. అమ్మ భద్రత. నాన్న బాధ్యత. పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది. పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు. నడక అమ్మది. నడవడిక నాన్నది. తన అనుభవాలను విద్యలా అమ్మ బోధిస్తే, నీ అనుభవమే విద్య అని తెలిసేలా చేస్తాడు నాన్న. అమ్మ ఆలోచనైతే, నాన్న ఆచరణ.

అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకోగలవు. కానీ నాన్న ప్రేమను నువ్వు నాన్నవు అయ్యాకే తెలుసుకోగలవు మిత్రమా !

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson జీవ గడియారాలు

8th Class Telugu ఉపవాచకం 5th Lesson జీవ గడియారాలు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. చురుకుగా ఉండే సమయాన్ని ఆధారం చేసుకొని జంతు ప్రపంచంలోని జంతువులను రెండు వర్గాలుగా విభజించారు. దివాచరాలు-పగలు చురుగ్గా ఉండేవి. నిశాచరాలు – రాత్రివేళ చురుగ్గా ఉండేవి.

మన ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలు, దోమలు ఇత్యాదులు రాత్రివేళ మాత్రమే బయటకు వస్తాయి. పగలు విశ్రాంతి తీసుకుంటాయి. పిచ్చుకలు, కాకులు, ఆవులు, ఇతర జంతువులు పగలు చురుగ్గా ఉంటాయి. మానవునితో సహవాసం చేస్తున్నందుకుగాను కుక్క పిల్లి వంటి జంతువులు పగటివేళ మేలుకుని ఉన్నా, రాత్రిళ్లు మాత్రం చురుగ్గా ఉంటాయి. కారణం సహజసిద్ధంగా అవి రాత్రిళ్లు ఆహారం కోసం వేటాడతాయి. ఈ జీవులను శాస్త్రవేత్తలు రకరకాల పరీక్షలకు గురిచేసారు. ఉదాహరణకు రాత్రిపూట సంచరించే గబ్బిలాన్ని పగటి సమయంలో చీకటి గదిలో ఉంచడం, పగటిపూట సంచరించే ఉడతను రాత్రిపూట పగటిలా వెలుగులో వుంచడం వంటివి. అన్ని పరీక్షలలోనూ, జీవులన్నీ, ఈ దైనందిన లయలను నిర్దిష్ట క్రమంలోనే ప్రదర్శిస్తాయి అని రుజువైంది.
ప్రశ్నలు :
1. గబ్బిలాలు పగటిపూట ఏ గదిలో ఉంటాయి?
జవాబు:
గబ్బిలాలు పగటిపూట చీకటిగదిలో ఉంటాయి.

2. పగలు మాత్రమే విశ్రాంతి తీసుకునే జంతువులు ఏవి?
జవాబు:
ఎలుకలు, బొద్దింకలు, కోతులు మొదలైనవి పగలు విశ్రాంతి తీసుకుంటాయి.

3. రాత్రిళ్ళు ఆహారం కోసం వేటాడే జంతువులు ఏవి?
జవాబు:
రాత్రిళ్ళు ఆహారం కోసం వేటాడే జంతువులు కుక్కలు, పిల్లులు.

4. ప్రపంచంలోని జంతువులను ఎన్ని వర్గాలుగా విభజించారు?
జవాబు:
ప్రపంచంలోని జంతువులను రెండు వర్గాలుగా విభజించారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

2. ఈ దైనందిన లయలు జంతువులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మొక్కలలో కూడా ఇవి ఉంటాయి. కొన్ని చెట్ల ఆకులు మన మాదిరిగా రాత్రికాగానే నిద్రపోయి తెల్లవారగానే మేలుకుంటాయి. చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కలలో ఆకులు ఉదయం నిక్కబొడుచుకొని ఉండి, సాయంత్రానికి వాలిపోతాయి. అలాగే పూలు వికసించడం కూడా. ఈ మొక్కలను పూర్తిగా చీకటిలో ఉంచినా, లేదా 24 గంటలూ వెలుగులో ఉంచినా వాటి పనిలో మార్పురాదు. ఒక మల్లెపూవును పగటివేళ కటిక చీకటిగదిలో ఉంచినా కూడా వికసింపచేయడం సాధ్యం కాదు. ఈ విధంగా సూర్యుని వెలుతురు ఆధారం చేసుకొని జీవులు చూపే, ఈ మార్పులను పగటిలయలు – ‘డయర్నల్ రిథమ్స్’ అంటారు.
ప్రశ్నలు:
1. ఏ పూవును పగటివేళ, కటికచీకటి గదిలో ఉంచినా వికసింపచేయడం సాధ్యం కాదు?
జవాబు:
మల్లెపూవును పగటివేళ కటిక చీకటిలో ఉంచినా వికసింపచేయడం సాధ్యం కాదు.

2. జీవగడియారాలకు గల మరొక పేరు ఏమి?
జవాబు:
జీవగడియారాలకు గల మరొక పేరు శరీరధర్మ గడియారాలు.

3. లయలు జంతువులకు మాత్రమే కాకుండా వేటికి ఉంటాయి?
జవాబు:
లయలు జంతువులకు మాత్రమే కాకుండా మొక్కలకు కూడా ఉంటాయి.

4. ఏ జాతికి చెందిన ఆకులు ఉదయం పూట నిక్కపొడుచుకొని ఉంటాయి?
జవాబు:
చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కల ఆకులు ఉదయం పూట నిక్కపొడుచుకొని ఉంటాయి.

3. సీతాకోకచిలుకలు పుట్టిన వెంటనే సూర్యతాపానికి గురికాకుండా ఉండడానికి తెల్లవారుఝామునే ప్యూపా నుండి బయటకు వస్తాయి. కీటకాలు మకరందం లభించే సమాయల్లో చురుగ్గా ఉంటాయి. మొక్కలు కూడా కీటకాలు చురుగ్గా ఉండే సమయాల్లోనే పుష్పాలు వికసింపచేస్తాయి. ఇది పరస్పర సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.

ఒక జీవి పుట్టిన నాటి నుండి ఏర్పడిన ఈ లయలు, ఆ జీవి బాహ్యపరిస్థిలులు మారినా లయలు మాత్రం మారవు. అందుకే కాబోలు పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతో కానిపోవు అంటారు మనవాళ్లు.
ప్రశ్నలు:
1. సీతాకోకచిలుకలు ఎందుకోసం ప్యూపా నుండి బయటకు వస్తాయి?
జవాబు:
సీతాకోక చిలుకలో సూర్యతాపానికి గురికాకుండా ఉండడానికి వీలుగా ప్యూపా నుండి బయటకు వస్తాయి.

2. కీటకాలు ఏ సమయాల్లో చురుగ్గా ఉంటాయి?
జవాబు:
కీటకాలు మకరందం లభించిన సమయాల్లో చురుగ్గా ఉంటాయి.

3. ఈ పేరాలోని సామెత ఏది?
జవాబు:
ఈ పేరాలోని సామెత – “పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానిపోవు”.

4. మొక్కలు ఏ సమయాల్లో పూలను వికసింపచేస్తాయి?
జవాబు:
మొక్కలు కీటకాలు చురుగ్గా ఉండే సమయాల్లో పుష్పాలు వికసింపచేస్తాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

4. సముద్రపు ఒడ్డున నివసించే ఫిడ్లర్ క్రాబ్’ అనే వాయులీన పీత, ఉదయం ముదురు రంగులో ఉండి, రాత్రిళ్ళు లేతరంగులకు మారిపోతుంది. బహుశః శత్రువులనుండి రక్షించుకోవడానికి కాబోలు ఈ రంగులు మార్చడం, దాన్ని ఎప్పుడూ వెలుతురు ఉండే ఎ.సి.గదిలోకి మార్చినా, రంగుల మార్పిడిలో మాత్రం తేడా రాలేదు. అంటే సూర్యునితో సంబంధం లేకుండానే ఈ లయ కొనసాగుతుందన్నమాట. “పీత కష్టాలు పీతవి”. అలాగే నిద్రగన్నేరు మొక్కలో ఆకుల కదలిక ఈ కోవకు చెందినదే.

మానవులలో ఆహారం తీసుకోవడం ఒక అలవాటుగా మారడం వలన ఈ లయలో కొంత మార్పు ఉండవచ్చు. ప్రతిరోజూ నియమబద్ధంగా ఆహారం తీసుకొనే వారికి, నిర్ణీత సమయానికే ఆకలి వేస్తుంది. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేసేవారికి రోజులో ఒకసారి మాత్రమే ఆకలి వేస్తుంది. అలాగే నిద్ర, మెలకువ కూడా,
ప్రశ్నలు :
1. సముద్రపు ఒడ్డున నివసించే వాయులీన పీత పేరు ఏమి?
జవాబు:
సముద్రపు ఒడ్డున నివసించే వాయులీన కేత ఫిడ్లర్ క్రాబ్.

2. వాయులీన పీత ఎందుకు రంగులను మార్చుకుంటుంది?
జవాబు:
వాయులీన పీత శత్రువుల నుండి రక్షించుకోవడానికి రంగులను మారుస్తుంది.

3. నిర్ణీత సమయానికి ఎవరికి ఆకలి వేస్తుంది?
జవాబు:
ప్రతిరోజు నియమబద్ధంగా ఆహారం తీసుకొనే వారికి నిర్ణీత సమయానికి ఆకలి వేస్తుంది.

4. సంవత్సరం పొడవునా ఏవి సమానంగా ఉండవు?
జవాబు:
సంవత్సరం పొడవునా పగలు, రాత్రి సమానంగా ఉండవు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

5. మొక్కలు చైతన్యవంతంగా ఉన్నప్పుడే పోషకాలు అందించడం ద్వారా వృధావ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడి సాధించవచ్చు. చేపలు, రొయ్యలు ఎప్పుడు ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటాయో, తెలియడం వలన చేపల చెరువు శుభ్రంగా ఉండటమే కాక వృధా వ్యయం తగ్గుతుంది. కోళ్ల ఫారంలో ఎక్కువ సమయం వెలుగు ఉంచడం వలన గ్రుడ్లు ఉత్పత్తి పెరగడం రైతులందరికీ తెలిసిందే. పగలు తక్కువ ఉన్న కాలంలో గొర్రెలలో ఉన్ని ఎక్కువవుతుంది. కాబట్టి ఎండాకాలం చీకటిలో ఉంచడం వలన ఉన్ని ఉత్పత్తి ఎక్కువ చేయవచ్చు. ఇక మన సంగతి, రక్తంలో కొలెస్టరాల్, గ్లూకోజ్ శాతం లయబద్ధంగా మారుతుంటుంది. కాబట్టి ఏ సమయంలో మనం మందులు వాడితే పూర్తి స్థాయిలో ఫలితం ఉంటుందో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఆస్తమా రోగులలో రాత్రిళ్లు శ్వాస సమస్యలు అధికమౌతాయి. అందుచేత ఎడ్రినలిన్ అనే ఇంజక్షన్ రాత్రిళ్ళు ఇస్తారు. అలాగే ఇన్సులిన్ ఇంజక్షన్ రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగినపుడే ఇవ్వాలి.
ప్రశ్నలు:
1. ఏ రకంగా మొక్కల నుండి అధిక దిగుబడిని సాధించవచ్చు?
జవాబు:
మొక్కలు చైతన్యవంతంగా ఉన్నప్పుడే పోషకాలు అందించడం ద్వారా వృధా వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడిని సాధింపవచ్చు.

2. గొర్రెలలో ఎప్పుడు ఉన్ని ఎక్కువగా ఉంటుంది?
జవాబు:
గొర్రెలలో పగలు తక్కువ ఉన్న కాలంలో ఉన్ని ఎక్కువగా ఉంటుంది.

3. ఆస్తమా రోగుల్లో రాత్రిళ్ళు ఏ సమస్యలు అధికం అవుతాయి?
జవాబు:
ఆస్తమా ఉన్న రోగుల్లో రాత్రిళ్ళు శ్వాససంబంధమైన సమస్యలు అధికమౌతాయి.

4. ఇన్సులిన్ ఇంజక్షన్ ఎప్పుడు ఇవ్వాలి?
జవాబు:
ఇన్సులిన్ ఇంజక్షన్ రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగినప్పుడే ఇవ్వాలి.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి.

ప్రశ్న 1.
డయర్నల్ రిథమ్స్ అంటే ఏమిటి? వివరించండి.
జవాబు:
భూమిపై నివసించే జీవులన్నింటిలో జరిగే కార్యకలాపాలు నిర్ణీత సమయాలను అనుసరించి ఆవృత్తి అవుతుంటాయి. మానవులలో ఎన్ని గంటలకు నిద్రపోవాలి? ఎన్ని గంటలకు నిద్రలేవాలి? ఎప్పుడు భోజనం చేయాలి ? అనే విషయాలు మనం ఆరేడు నెలల వయసులో ఉన్నప్పుడే స్థిరపడిపోతాయి. ఈ గడియారాలు మనకు కనిపించకపోయినా వాటి ప్రభావం తెలుస్తూనే ఉంటుంది. మనకు అనుభవంలోకి వచ్చే, మనకు కనపించకుండా మన శరీరంలో ఉన్న ఈ జీవగడియారాలే మూలం.

మానవుల్లాగే జంతువులు కూడా ఈ భూమ్మీద తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. జంతువుల విషయానికొస్తే చురుకుగా ఉండే సమయాన్ని ఆధారం చేసుకొని జంతు ప్రపంచంలోని జంతువులను రెండు వర్గాలుగా విభజించారు. అవి :
1) దివాచరాలు (పగలు చురుగ్గా ఉండేవి)
2) నిశాచరాలు (రాత్రివేళ చురుగ్గా ఉండేవి)

మన ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలు, దోమలు, ఇత్యాదులు రాత్రివేళ మాత్రమే బయటకు వస్తాయి. పగలు ఇవి విశ్రాంతి తీసుకుంటాయి. పిచ్చుకలు, కాకులు, ఆవులు, ఇతర జంతువులు పగలు చురుగ్గా ఉంటాయి. కుక్క పిల్లి వంటి జంతువులు పగటివేళ మేలుకుని ఉన్నా, రాత్రిళ్ళు ఆహారం కోసం వేటాడతాయి. ఈ జీవులను శాస్త్రవేత్తలు రకరకాలుగా పరీక్షలు చేశారు. ఉదాహరణకు రాత్రిపూట సంచరించే గబ్బిలాన్ని పగటి సమయంలో చీకటి గదిలో ఉంచడు. పగటిపూట సంచరించే ఉడతను రాత్రిపూట పగటిలా వెలుగులో ఉంచడం వంటివి. అన్ని పరీక్షలలోనూ, జీవులన్నీ ఈ దైనందిన లయలను నిర్దిష్ట క్రమంలోనే ప్రదర్శిస్తాయని ఋజువైంది.

ఈ దైనందిన లయలు జంతువులకు పరిమితం అనుకుంటే పొరపాటే. మొక్కలలో కూడా ఇవి ఉంటాయి. కొన్ని చెట్ల ఆకులు మన మాదిరిగానే రాత్రికాగానే నిద్రపోయి తెల్లవారగానే మేలుకుంటాయి. చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కలలో ఆకులు ఉదయం నిక్కబొడుచుకుని ఉండి, సాయంత్రానికి వాలిపోతాయి. అలాగే పూలు వికసించడం కూడా అంతే. ఈ మొక్కలను పూర్తిగా చీకటిలో ఉంచినా, లేదా 24 గంటలూ వెలుగులో ఉంచినా వాటి పనిలో మార్పు రాదు. ఒక మల్లెపువ్వును పగటివేళ కటిక చీకటిగదిలో ఉంచినా కూడా వికసింపజేయడం సాధ్యం కాదు. ఈ విధంగా సూర్యుని వెలుతురు ఆధారం చేసుకొని జీవులు చంపే ఈ మార్పులను పగటిలయలు – “డయర్నల్ రిథమ్స్” అని అంటారు. ఈ విధంగా మానవులు, జంతువులు మరియు మొక్కలు దైనందిన లయలు ఈ డయర్నల్ రిథమ్స్ ని ఆధారం చేసుకొని నడుస్తుంటాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

2. జెట్ బాగ్ అంటే ఏమిటి? వివరించండి.
జవాబు:
మానవులలో, జంతువులలో, మొక్కలలో ఉండే జీవగడియారాల వల్లనే అవి ఎప్పుడు ఏ పనిచేయాలో నిర్ధారణ జరుగుతుంది. జీవుల శరీరంలోని గడియారంలో ఏ పని సమర్థవంతంగా చేయగలదో నిర్ణయిస్తుంది. మొక్కలు సూర్యుడు ఉండే పగటివేళలోనే ఆహారాన్ని తయారు చేయగలుగుతాయి. అంటే రాత్రివేళ ఆకులు విస్తరించి ఉండడం వలన ఉపయోగం ఉండదు. మనం చేతి గడియారం చూసుకొని ఏ పని ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటాం. అలాగే సీతాకోకచిలుకలు పుట్టిన వెంటనే సూర్య తాపానికి గురికాకుండా ఉండడానికి తెల్లవారుఝామునే ప్యూపా నుండి బయటకు వస్తాయి. కీటకాలు మకరందం లభించే సమయాల్లో చురుగ్గా ఉంటాయి. మొక్కలు కూడా కీటకాలు చురుగ్గా ఉండే సమయాల్లోనే పుష్పాలు వికసింపజేస్తాయి. ఇది పరస్పర సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రతిరోజు నియమం ప్రకారం భోజనం చేసేవారికి నిర్ణీత సమాయానికే ఆకలి వేస్తుంది. రోజుకు ఒకసారి భోజనం చేసేవారికి ఒకసారి మాత్రమే ఆకలి వేస్తుంది. అలాగే నిద్ర, మెలకువ, కూడా అంతే. ప్రతిరోజు జీవుల శరీరంలోని ఈ కనిపించని గడియారం తనకు తాను సరిచేసుకుంటుంది. ఈ గడియారాన్ని మనం కృత్రిమంగా కూడా సరిచేయవచ్చు.

మనం విమానంలో ఖండాంతర ప్రయాణం చేసినప్పుడు అక్కడి రాత్రి, పగలు షిఫ్ట్ లో పనిచేసేవారికి, ఈ తేడాను అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా నిర్ణీత సమయం మించి మేల్కొనడం సాధ్యం కాదు. ఈ విధంగా శరీరంలోని లయలను అలవాటు ద్వారా కృత్రిమంగా సరిచేయడాన్ని “జెట్ లాగ్” అంటాము.

“జెట్ బాగ్” అనేది కృత్రిమ ప్రక్రియ. ఇది కేవలం ప్రయత్నం, అలవాటు ద్వారానే కొనసాగించబడుతుంది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

3. జీవగడియారాలు పాఠం నుండి మీరు ఏమి గ్రహించారో సంక్షిప్తంగా గ్రహించండి.
జవాబు:
మానవ జీవన విధానంలో నిర్దిష్ట సమయంలో కార్యకలాపాలను నిర్దిష్ట సమయంలో నిర్వహించాలంటే దానికి గడియారం చాలా అవసరం. గడియారాలు రాకముందు మనిషికి సమయాన్ని తెలియజేసిన, ఇప్పటికీ తెలియజేస్తున్న జీవ గడియారం కోడిపుంజు. ఇది రోజులో నిర్ణీత సమయాలలో చాలాసార్లు కూస్తుంది. కోడిపుంజు ఇలా కూయడానికి కారణం దాని శరీరంలో ఉన్న, ఎవరికీ కనిపించని గడియారం.

దాని ప్రభావం వల్ల అది అప్రయత్నంగానే కూస్తుంది. మనుషుల్లో కూడా ఎప్పుడు భోంచేయాలి? ఎప్పుడు నిద్రపోవాలి? ఎప్పుడు మేల్కొనాలి? అనేది మన శరీరంలో కనిపించకుండా ఉన్న ఈ జీవగడియారాల వల్లనే తెలుస్తుంది. 24 గంటల కాలంలో ఒక జీవి ప్రదర్శించే దైనందిన కార్యకలాపాలను ‘దైనందిన లయలు’ లేదా సర్కేడియన్ రిథమ్స్ అని అంటారు. ఈ లయలు గడియారంలో 24 గంటలను పోలి యుంటాయి. అందువల్ల వీటిని జీవగడియారం లేదా శరీర ధర్మగడియారం అనవచ్చు.

మన చేతి గడియారం మాదిరిగానే జీవుల శరీరంలోని గడియారం ఏ సమయంలో జీవి ఒక పనిని సమర్థవంతంగా చేయగలదో నిర్ణయిస్తుంది. మొక్కలు సూర్యుడు ఉండే పగటివేళలోనే ఆహారాన్ని తయారు చేయగలుగుతాయి. సీతాకోకచిలుకలు పుట్టిన వెంటనే సూర్యతాపానికి గురికాకుండా ఉండడానికి తెల్లవారుఝామునే ప్యూపా నుండి బయటకు వస్తాయి. కీటకాల మకరందం లభించే సమయాల్లో చురుగ్గా ఉండడం కూడా ఈ “జీవ గడియారాల” ద్వారానే జరుగును. ఒక జీవికి పుట్టిన నాటి నుండి ఏర్పడిన లయలు, ఆ జీవి బాహ్య పరిస్థితులు మారినా లయలు మాత్రం మారవు. అందుకే మన పెద్దలు “పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కాని పోవు” అంటారు.

తెలతెలవారుతుండగానే సందడిచేసే కాకులు, చీకటి పడగానే ముడుచుకుపోయే ఆకులు, 21 రోజులు రాగానే గుడ్డులోంచి బయటకు వచ్చే కోడిపిల్ల ఇలా ఎన్నెన్నో ప్రకృతి నియమాలను తెలియజేస్తాయి. ఇంత లయబద్దంగా కదులుతున్న ప్రకృతిని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే ప్రకృతి తన గురించి తెలుసుకోమంటే నిరంతరం సవాళ్ళు విసురుతూనే ఉంటుంది. ఈ ప్రకృతి నియమాలు, జీవుల దైనందిన కార్యకలాపాలు ఈ జీవ గడియారాల వల్లనే నిరంతరంగా, నిర్దిష్టంగా, నియమిత సమయాలకనుగుణంగా పనిచేస్తున్నాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson మధుపర్కాలు

8th Class Telugu ఉపవాచకం 4th Lesson మధుపర్కాలు Textbook Questions and Answers

I. అవగాహన-ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. పుట్టన్నది రెండు నిట్టాళ్ళపాక. అవి నెత్తిమీద నీడకోసం వేసుకున్న నిట్టాళ్ళు, అసలా ఇంటికి నిట్టాళ్ళు ఆ దంపతులే. పుట్టన్నా, సీతమ్మా ఒక్కటే ఎత్తు. భౌతికంగానే కాదు… ఆత్మలో కూడా సమానమైన ఎత్తులోనే ఉంటారు. ఒకటిగా ఉన్న ఆత్మను రెండుచేసి, రెండింటికి రెండు శరీరాలు కల్పించి, భూలోకంలో కొన్నాళ్ళు ఆడుకురండని ఆ విధాత పంపాడా, అనిపిస్తుంది వారిని చూస్తే.

పుట్టన్న వృత్తి బట్టలనేత. రోజుకు ఏ నాలుగుగంటలో తప్ప, చేతిలో కండెను పడుగులో నుంచి అటూ యిటూ గిరాటువేస్తూ, వస్త్రం నేస్తూనే ఉంటాడు. సీతమ్మ రాట్నం దగ్గర నుంచి లేవదు. వడివడిగా చిలపలు తోడటం, కండెలు చుట్టడం, పడుగు వేసినప్పుడు భర్తతోపాటు గంజిపెట్టడం, కుంచె తీయడం ఆమె విధులు. ఏ సమయంలో కూడా | వారు ‘కాయకష్టం చేస్తున్నాం’ అనే భావాన్ని బయట పెట్టేవారు కాదు. అదో యజ్ఞంగానే చూసుకునేవారు. ఒక్క కండె చుడితే సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి. ఒక జానెడునేస్తే పుట్టన్న పెదవుల మీద పొట్లపువ్వులు పూచేవి.
ప్రశ్నలు :
1. పుట్టన్న వృత్తి ఏది?
జవాబు:
పుట్టన్న వృత్తి బట్టలనేత వృత్తి.

2. సీతమ్మ ఎక్కడి నుండి లేవదు?
జవాబు:
సీతమ్మ రాట్నం దగ్గర నుండి లేవదు.

3. పుట్టన్న దంపతులు దేనిని యజ్ఞంగా భావించేవాళ్ళు?
జవాబు:
పుట్టన్న దంపతులు వృత్తిని యజ్ఞంగా భావించేవాళ్ళు.

4. ఎప్పుడు సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి?
జవాబు:
ఒక్క కండె చుడితే సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

2. పుణ్యం, ధర్మం జీవితానికి పెట్టని కోటలుగా భావిస్తూ జీవిస్తున్న పుట్టన్నకు, ధనం మీద ఆశలేదు. మూడు పూటలా కడుపును గంజితో నింపడం ఒక్కటే అతని ఆశయం. సీతమ్మ కూడా అంతకుమించి ఏమీ కోరదు. కాకపోతే గోవుకు మేత ఒకటి కావాలి. కాని, కొమ్ము చెంబులతో పాలకు వచ్చేవారంతా, చిట్టూ, తవుడూ, తెలకపిండి చెక్కలు, కానుకలుగా తెస్తూనే ఉంటారు. ఊరి ఆసామి …… కుప్ప నూర్పిళ్ళ కాలంలో అడక్కుండానే వరిగడ్డి తెచ్చి అతని దొడ్లో వామి పెట్టి పోతారు. జనపకట్టలు తెచ్చి ఇంటిమీద ఎండేసి పోతారు. పుట్టన్న వద్దని బ్రతిమాలినా వినరు. “నీ గోవు కామధేనువు పుట్టన్నా” అని వారు నవ్వుకొని వెళ్ళి పోతారు.
ప్రశ్నలు :
1. జీవితానికి పెట్టని కోటలు ఏవి?
జవాబు:
పుణ్యం ధర్మం అనేవి జీవితానికి పెట్టని కోటలు.

2. పుట్టన్నకు దేని మీద ఆశ లేదు?
జవాబు:
పుట్టన్నకు ధనం మీద ఆశ లేదు.

3. ఊరి ప్రజలు పుట్టన్నను ఏమని ప్రశంసించేవారు?
జవాబు:
ఊరి ప్రజలు పుట్టన్నను ‘నీ గోవు కామధేనువు పుట్టన్నా” అని ప్రజలు ప్రశంసించేవారు.

4. పుట్టన్న ఆశయం ఏమిటి
జవాబు:
మూడు పూటలా కడుపును గంజితో నింపడం ఒక్కటే పుట్టన్న ఆశయం.

3. అప్పుడే సందెవెలుగులు దూసుకువస్తున్నాయి. గానుగచెట్టు చిటారు కొమ్మకు అతికించినట్లుగా నెలవంక కనిపిస్తున్నాడు. పుట్టన్న వాకిట్లోకి రాగానే ఆవు “అంబా” అని అరిచింది. పుట్టన్నకు పట్టరాని దుఃఖం వచ్చింది. వెళ్ళి దాని మెడ కౌగలించుకొన్నాడు. “నా మీద కోపం వచ్చిందా ? అమ్ముతున్నానని బాధపడుతున్నావా ? ఏం చెయ్యను, ఆచారం కోసం అమ్ముకోవలసి వచ్చింది. నువ్వెక్కడున్నా ప్రతిరోజూ వచ్చి చూస్తా……. నిన్ను దైవం లాగా కొలుస్తున్నా. నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడుతారు నన్ను?” అని మెడ వదలి ఉత్తరీయంతో దాని ఒళ్ళంతా తుడిచాడు. దానిని
విడవలేక విడవలేక ఊళ్లోకి వెళ్ళాడు.
ప్రశ్నలు :
1. నెలవంక ఎలా కనిపిస్తున్నాడు?
జవాబు:
నెలవంక గానుగచెట్టు చిటారుకొమ్మకు అతికించి నట్లుగా కనిపిస్తున్నాడు.

2. పట్టరాని దుఃఖం ఎవరికి వచ్చింది?
జవాబు:
పట్టరాని దుఃఖం పుట్టన్నకు వచ్చింది.

3. పుట్టన్న వాకిట్లోకి రాగానే అరిచింది ఏది?
జవాబు:
పుట్టన్న వాకిట్లోకి రాగానే గోవు “అంబా” అని ముద్ర వేసింది.

4. పుట్టన్న దేనిని అమ్ముకోవలసి వచ్చింది?
జవాబు:
పుట్టన్న గోవును అమ్ముకోవలసి వచ్చింది.

4. ఆ రోజే బయలుదేరి బస్తీకి వెళ్ళాడు. నూలు తెచ్చాడు. ఆ నాలుగు రోజులు అతడు మగ్గం గోతిలో నుంచి లేవలేదు. సీతమ్మ రాట్నం వదలలేదు. నాలుగురోజులు గడిచాయి. తెల్లారే లగ్నం ….. ఆ సందెవేళ ఆముదం దీపాలు – అటూఇటూ పెట్టి నేత నేస్తున్నాడు పుట్టన్న. ఇంతట్లోనే చెరువుగట్టున మేళాలు మ్రోగినాయి. “పెళ్ళివారు దిగారు” అంది సీతమ్మ. “ఇంకొక్క ఘడియలో నేత పూర్తి అవుతుంది” అన్నాడు పున్న. మరి కాసేపటికి పల్లకి, దాని వెంట బళ్ళూ ఆ వీధినే వచ్చాయి. సీతమ్మ చూడటానికి బైటికి వెళ్ళింది. ఇలాయి బుడ్ల వెలుతుర్లో పెళ్ళికొడుకును చూచింది. వెంట ఇరవై బళ్లున్నాయి. అన్నీ వాళ్ళ ఇల్లు దాటిపోయేదాకా నిలబడి చూచి ఇంట్లోకి వచ్చింది సీతమ్మ “పెళ్ళికొడుకు కళ్ళూ, ముఖం బాగానే ఉన్నాయి. పాతికేళ్ళుంటాయి. అయినా ఫరవాలా! ఈడుగానే ఉంటాడు. పార్వతి మాత్రం ఒడ్డూ పొడుగూ లేదూ” అంది.
ప్రశ్నలు :
1. ఇలాయి బుడ్ల వెలుతురులో ఎవరిని చూసింది?
జవాబు:
ఇలాయి బుడ్ల వెలుతురులో పెండ్లి కొడుకును చూసింది

2. పుట్టన్న బస్తీకి వెళ్ళి ఏమి తెచ్చాడు?
జవాబు:
పుట్టన్న బస్తీ నుండి నూలు తెచ్చాడు.

3. చెరువు గట్టున ఏవి మ్రోగాయి?
జవాబు:
చెరువు గట్టున మేళాలు మ్రోగాయి.

4. సీతమ్మ దేనిని వదలలేదు?
జవాబు:
సీతమ్మ రాట్నం వదలలేదు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

5. తెల్లవారింది. పాపయ్యగారింట్లో పెళ్ళి వైభవంగా జరుగుతోంది. అర ఎకరం పందిరి వేసినా జనం పట్టక కిటకిటలాడిపోతున్నారు. ఒక పందిరి గుంజనానుకొని సీతమ్మ నిలబడింది, ఆవిడకు కొంచెం పక్కగా పుట్టన్న ఉన్నాడు. నూతన దంపతులు తలంబ్రాలు పోసుకుంటున్నారు. సన్నాయిపాట సాగిపోతోంది, సంతోష తరంగాలుగా. పిల్ల తల్లితండ్రులు ఒకరినొకరు ఎరగనంత క్రొత్తగా చూచుకుంటున్నారెందుకో. పుట్టన్న తన ధర్మం నెరవేర్చుకొన్నానన్న ఆనందంలో మునిగిపోయాడు. లగ్నం అయింది. ‘అందరు భోజనాలకు పదండి’ అన్న కేకలు నాలుగువైపుల నుంచి వినిపించాయి. అంతా వెళ్ళినా పుట్టన్న, సీతమ్మ గోడ ప్రక్కగా నిలబడి – ఏదో చెప్పుకొని నవ్వుతున్నారు. పాపయ్య చూశాడు వారిని. “ఏం అక్కా నువ్విక్కడే ఉన్నావు – బావయ్య అలిగాడా? కలిగిందేదో పెడతాం. అంత అలిగితే ఎలా బావా” అన్నాడు.
ప్రశ్నలు :
1. ఎవరి ఇంట్లో పెండ్లి వైభవంగా జరిగింది?
జవాబు:
పాపయ్య గారి ఇంట్లో పెండ్లి వైభవంగా జరిగింది.

2. సీతమ్మ ఎలా నిలబడింది?
జవాబు:
సీతమ్మ పందిరి గుంజకు ఆనుకొని నిలబడింది.

3. నూతన దంపతులు వేటిని పోసుకున్నారు?
జవాబు:
నూతన దంపతులు తలంబ్రాలు పోసుకున్నారు.

4. నలువైపులా ఏ కేకలు వినిపించాయి?
జవాబు:
నలువైపులా “భోజనానికి పదండి” అనే కేకలు వినిపించాయి.

6. మధుపర్కాలు తీసుకొని వెళ్ళి ఇచ్చిందాక ఒక దీక్షతో ఉన్నారు పుట్టన్న దంపతులు. ఆ కార్యం నెరవేరింది. వారి మనసులో బరువు తగ్గింది. తగ్గిన తర్వాత ఆవు మీద బెంగ అధికమైంది. ఎలాగో మనస్సుకు సంతృప్తి తెచ్చుకొని నిద్రపోయారు. కాని నిద్రలో వారికాగోమాత ప్రత్యక్షమైంది. పుట్టన్నకు ఆవు ‘అంబా’ అని అరుస్తూన్నట్లు వినిపించింది. దిగ్గునలేచి వెళ్ళి ఇంటి మీద ఉన్న జనప కట్ట తీసుకుని గానుగచెట్టు దగ్గరికి వెళ్ళాడు. బిక్కు బిక్కు మంటూ కట్టుకొయ్య కనిపించింది. అతడి మనస్సు చిట్లి, కొన్ని బెల్లులూడిపోయినట్లయింది. తిరిగివచ్చి ఇంట్లో పడుకొన్నాడు. నిద్ర రావడం లేదు. ఆవు ముట్టెతెచ్చి అతని పొట్టమీద నెట్టి గోకమన్నట్లుగా తోచింది. గభాలున లేచి కూర్చున్నాడు. చూపు చూరులోకీ, మనస్సు శూన్యంలోకి చొచ్చుకుపోతోంది. “నువ్వు పోసిన పాలు త్రాగి పసి పిల్లలు గుక్కలు మాని నిద్రపోతున్నారు.” అని పూజారి అన్నమాటలు వినిపించినాయి. ఆ భావాన్ని తరుముకొంటూ వెనకనుంచి పసిపిల్లల ఏడ్పులు వినిపించినాయి. చెవులు గట్టిగా మూసుకొని “సీతా” అని పిలిచాడు. ఆమె లేచింది. తన అనుభూతి అంతా చెప్పాడు.
ప్రశ్నలు :
1. పుట్టన్న దంపతులకు దేని మీద బెంగ పెరిగింది?
జవాబు:
పుట్టన్న దంపతులకు ఆవుమీద బెంగ పెరిగింది.

2. నిద్రలో ఏది ప్రత్యక్షమైంది?
జవాబు:
నిద్రలో గోమాత ప్రత్యక్షమయింది.

3. శూన్యంలోనికి ఏది చొచ్చుకొని పోయింది?
జవాబు:
శూన్యంలోనికి మనస్సు చొచ్చుకొని పోయింది.

4. ఎవరు గుక్కలు మాని నిద్రపోతున్నారు?
జవాబు:
పసిపిల్లలు గక్కలు మాని నిద్రపోతున్నారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

7. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

దీనితో ముడిపడిన సమస్య అసలు వివాహాలను జరిపే తీరు ఎంతవైభవంగా, ఎంత ధనవ్యయం చేసి జరిపిస్తే అంత ఘనతగా పరిగణించడం మన సమాజంలో పరిపాటి. నిరాడంబరంగా వివాహం జరపడానికి సంఘం హర్షించదు. ఇందువల్ల ఎంత శక్తిహీనుడైనా అప్పో సప్పో చేసి ఘనంగా వివాహం జరిపినట్టు అనిపించుకోవలసి వస్తున్నది. అంతేకాదు, వివాహ సమయంలో బంధువులు, మిత్రులు, వధూవరులకు చదివించే కానుకల హెచ్చుతగ్గులు కూడా ప్రతిష్ఠకు సంబంధించిన విషయంగా పట్టించుకునే స్థితికి మన సంఘం దిగజారిపోయింది. ఈ దురాచారాల నిర్మూలనకు శాసనాలు అవసరమే కావచ్చు కానీ అంతకంటే ముఖ్యంగా వీటి పట్ల ఏహ్యభావాన్ని ప్రజలలో కలిగించడం ముఖ్యం.
ప్రశ్నలు :
1. వివాహం ఎలా జరగడాన్ని సంఘం హర్షించదు?
జవాబు:
వివాహం నిరాడంబరంగా జరగడాన్ని సంఘం హర్షించదు.

2. ‘వధూవరులు” అనేది జంట పదం. అలాంటి జంటపదం పై పేరాలో ఉంది గుర్తించి రాయండి.
జవాబు:
హెచ్చుతగ్గులు

3. శక్తికి మించి వివాహాలు ఘనంగా జరిపించడం, విలువైన బహుమతులివ్వడం వంటివి ఎటువంటివని రచయిత ఉద్దేశ్యం?
జవాబు:
దురాచారాలని రచయిత ఉద్దేశ్యం

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ పేరా దేని గురించి చెపుతుంది?

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పుట్టన్న దంపతుల ఆచారమేమిటి ? దాన్ని కొనసాగించడానికి ఆయన చేసిన త్యాగమేమి?
జవాబు:
పుట్టన్న వృత్తి బట్టలు నేయటము. అతని భార్య సీతమ్మ రాట్నం వడికేటప్పుడు భర్తకు సహాయపడేది. తరతరాలుగా వచ్చే బాంధవ ముద్ర చెరిగిపోకుండా కాపాడుకోవడం అతని ముఖ్య ఆశయం.

ఆ గ్రామంలో ఏ ఇంట్లో పెళ్ళి జరిగినా పుట్టన్న స్వయంగా నేసి, మధుపర్కాలు పంపిస్తాడు. అది ఆ పుట్టన్న దంపతుల ఆచారం. మధుపర్కాలకు వారు పైకం ఏమీ తీసుకోరు. ఆ మధుపర్కాలు కట్టుకొని కొత్త దంపతులు పీటల మీద కూర్చుని, తలంబ్రాలు పోసుకోవడం – దానిని పుట్టన్న దంపతులు చూడడం మామూలు.

క్రమంగా పుట్టన్న దంపతులు అలా ఉచితంగా మధుపర్కాలు ఇవ్వడంతో బీదవారయ్యారు. ఆ గ్రామంలో పెద్దకాపు పాపయ్య గారింట్లో వారి అమ్మాయి పార్వతికి పెళ్ళి కుదిరింది. పాపయ్య ఆ విషయం సీతమ్మకు చెప్పి, పుట్టన్నకు చెప్పమన్నాడు. మధుపర్కాలు నేయడానికి పుట్టన్న వద్ద నూలు లేదు. పుట్టన్న దగ్గర ఒక ఆవు ఉంది. దాని పాలు పితికి రోజూ గ్రామంలో చంటి పిల్లలకు ఉచితంగా వారు పాలు పోసేవారు. నూలు కొనడం కోసం అప్పుచెయ్యడం పుట్టన్నకు ఇష్టం లేక, ఆ ఆవును అచ్చన్నగారికి అమ్మేశాడు. ఈ విధంగా తమ ఆచారం కొనసాగించడానికి పుట్టన్న ఆవును అమ్మి త్యాగం చేశాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

ప్రశ్న 2.
ఈ కథవల్ల పల్లెటూళ్ళలోని మనుషుల మధ్య ఆత్మీయతానుబంధాలు ఎలా ఉన్నాయని మీకనిపించింది?
జవాబు:
పల్లెటూళ్ళలోని వారు ఎప్పుడూ కలసిమెలసి జీవిస్తారు. ఒకరిపట్ల ఒకరు ఆత్మీయతానుబంధాలు కలిగి ఉంటారు. ఇతరులను మోసం చేయటం, వారిపట్ల ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉండటం చేయరు. ఎదుటివారికి సంతోషం వచ్చినా, దుఃఖం కలిగినా అన్నిట్లో పాలుపంచుకుంటారని అనిపించింది.

పుట్టన్న దంపతులు తమ ఆవుపాలు పిల్లలకు పాలకోసం వచ్చే వారికి ఉచితంగా పోసేవారు. ఆ గ్రామంలో ఏ ఇంట్లో పెళ్ళి జరిగినా వారు ఆ నూతన దంపతులకు స్వయంగా నేసి మధుపర్కాలు ఇస్తారు. దాని కోసం పైకం ఏమీ తీసుకోరు. అలాగే వారింటికి పాలకోసం వచ్చేవారంతా చిట్టు, తవుడు, తెలగపిండి, చెక్కలు కానుకలుగా వీరికి ఇచ్చేవారు. కుప్పనూర్పిళ్ళ కాలంలో వరిగడ్డి తెచ్చి పుట్టన్న దొడ్డిలో మేత వేసేవారు.

గ్రామంలో పురుషులు ఆడవారిని అక్కలుగా, చెల్లెళ్ళుగా పిలిచేవారు. పురుషులు వరుసలు కలిపి ‘బావ’ అని పిలిచేవారు. పాపయ్య కాపు పుట్టన్నను “బావా” అని, సీతమ్మను “అప్పా” అని పిలుస్తాడు.

మధుపర్కాలు ఉచితంగా ఇచ్చే తన ఆచారం కోసం పుట్టన్న తనకు ఇష్టమైన ఆవును సైతం అమ్మివేశాడు. ఆవును అమ్మివేశాక పుట్టన్న ఇంటికి పాలకోసం వచ్చిన పూజారి, పుట్టన్నను “ఋషి” వంటివాడని మెచ్చుకున్నాడు.

మధుపర్కాలు పుట్టన్న ఇంటి నుండి పట్టుకు వెళ్ళడానికి మేళతాళాలతో రావడం, సీతమ్మకు కుంకం పెట్టి తాంబూలం ఇవ్వడం, పెళ్ళి భోజనాల దగ్గర పాపయ్య, పుట్టన్న దంపతుల పరిహాసం మాటలూ, ఆ గ్రామ ప్రజల మధ్యన ఉన్న అనుబంధాలకు నిదర్శనాలు. పాపయ్యగారి అల్లుడు తనకు మామగారిచ్చిన మాన్యాన్ని, పుట్టన్న దంపతులకు మధుపర్కాల మాన్యంగా ఇవ్వడం, అందుకు పాపయ్య అంగీకరించడం, ఆ గ్రామ ప్రజల మధ్యగల ఆత్మీయతానుబంధాలను గుర్తు చేస్తున్నాయి.

ప్రశ్న 3.
పుట్టన్న దంపతుల మంచితనాన్ని వర్ణిస్తూ పది వాక్యాలు రాయండి.
(లేదా)
మధుపర్కాలను ఉచితంగా పంపే ఆచారాన్ని కాపాడుకునేందుకు పుట్టన్న దంపతులు అష్టకష్టాలు పడ్డారు. వారి మంచితనాన్ని తెలిపేలా పది వాక్యాలు రాయండి.
జవాబు:
పుట్టన్న దంపతులు ఆదర్శదంపతులు. మంచితనం మూర్తీభవించిన వారు. పుట్టన్న చేసే ప్రతి మంచిపనికి సహకరిస్తూ, అతనికి చేదోడువాదోడుగా ఉండే ఉత్తమ ఇల్లాలు సీతమ్మ.

పుట్టన్న దంపతులు చేనేత వృత్తిగా జీవించేవారు. వారి గ్రామం పాలవెల్లి. అందులో వారు పువ్వుల వంటివారు. ఆ గ్రామంలో పెళ్ళిళ్ళు అయిన కొత్త దంపతులందరికీ ఉచితంగా ఆ దంపతులు మధుపర్కాలను వేసి ఇచ్చే మహాదాతలు. పుట్టన్న దంపతులు శారీరకంగానే కాక, మానసికంగా కూడా వారి మనస్సులు ఒకటే. వారికి ఒక ఆవు ఉండేది. దానిని మేపి, దాని పాలు చంటిపిల్లల కోసం కొమ్ముచెంబులతో వచ్చే ఊరి వారికి ఉచితంగా పోసేవారు. అందరికీ పాలు పోశాక అతనికి ఖాళీ చెంబు మిగిలేది.

ఆ గ్రామంలో ఏ పెళ్ళి జరిగినా ఆ దంపతులకు మధుపర్కాలు నేసి ఇవ్వడం ఆ దంపతులకు ఆచారం. క్రమంగా ఉచితంగా ఇచ్చే మధుపర్కాలతో వారి సంపాదన హరించింది. పాపయ్య కాపు గారి అమ్మాయి పెళ్ళికి మధుపర్కాలు నేసి ఇయ్యడానికి నూలు లేక తమకు ఎంతో ఇష్టమైన ఆవును సైతం ఆ దంపతులు అమ్ముకున్నారు. తరతరాలుగా వచ్చే ఆచారాన్ని పోగొట్టుకోవడం కన్నా, గోవును వదులుకోవడం మంచిదని వారు నిర్ణయించారు. అప్పుచేయడం పుట్టన్నకు అసలు ఇష్టం లేదు. ఇక ఉచితంగా మధుపర్కాలు అందించలేక గ్రామం నుండి వెళ్ళిపోడానికి కూడా వారు సిద్ధం అయ్యారు.

పాపయ్య గారి అల్లుడు పుట్టన్న మంచితనం గుర్తించి వారికి ఆవును తిరిగి ఇప్పించి, రెండెకరాల మధుపర్కాల మాన్యం ఇచ్చాడు. దీని ద్వారా మంచి చేసేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని తెలుస్తోంది.. తాము మంచిగా ఉంటూ, ఎదుటివారు మంచిగా మెలిగేలా ఆదర్శప్రాయమైన జీవనం సాగించిన పుట్టన్న దంపతులు మంచిక మారురూపాలు.

ప్రశ్న 4.
ఈ పాఠంలోని అల్లుడు గారి పాత్ర ద్వారా ఎలాంటి ఆదర్శాన్ని గ్రహించారు?
జవాబు:
పాఠంలో పాసయ్య కాపు గారి అల్లుడు చాలా మంచివాడు. ధనవంతుడు, తన పెళ్ళికి మధుపర్కాలు ఉచితంగా నేసి ఇచ్చిన పుట్టన్న దంపతులు నూలు కోసం తమ ఆవును అమ్ముకున్నారని, వారు ఆ గ్రామంలోని పసిపాపకు ఆ ఆవుపాలను ఉచితంగా పోసేవారని తెలిసికొన్నాడు. పుట్టన్న ఆవును అచ్చన్నకు అమ్మేశాడని తెలుసుకొని, పుట్టన్నకు అచ్చన్న ఇచ్చిన డబ్బును, అచ్చన్నకు తిరిగి ఇచ్చివేశాడు. ఆవును పుట్టన్న ఇంటి దగ్గర తిరిగి కట్టివేయనునీ అచ్చన్నకు చెప్పాడు.

అంతేకాకుండా, తనకు మామగారు కానుకగా ఇచ్చిన రెండెకరాల మాన్యాన్ని పుట్టన్న దంపతుల పేర రాయించే ఏర్పాటు చేశాడు. ఆ డబ్బుతో వారు గ్రామస్థులకు ఉచితంగా మధుపర్కాలు శాశ్వతంగా ఇచ్చే ఏర్పాటును చేశాడు. ఆవునూ, మాన్యాన్ని తీసుకోడానికి, పుట్టన్నను ఒప్పించాడు.

ఈ పాత్ర ద్వారా మంచిపనులు చేసేవారికి మనం సాయంచేయాలని, మనకు దేవుడిచ్చిన సంపదను మంచికార్యాలు చేయడానికి, మంచికార్యాలు చేసేవారికి సాయం చేయడానికి వినియోగించాలని గ్రహించాము.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

ప్రశ్న 5.
మధుపర్కాలు పాత్రలలో ఆచారాలు పాటించడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పుట్టన్న పొరుగూరికి వెళ్లిపోదాం అనుకున్నాడు కదా ! దీనిపై నీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
పుట్టన్న దంపతులు ఆదర్శ దంపతులు. మంచితనం మూర్తీభవించిన వారు. పుట్టన్న చేసే ప్రతి మంచి పనికి సహకరిస్తూ అతనికి చేదోడు వాదోడుగా ఉండే ఉత్తమ ఇల్లాలు సీతమ్మ. పున్న దంపతులు చేనేత వృత్తిగా జీవించేవారు. ఆ గ్రామంలో పెళ్ళిళ్ళు అయిన కొత్త దంపతులందరికీ ఉచితంగా పుట్టన్న దంపతులు మధుపర్కాలను వేసి ఇచ్చే మహాదాతలు. క్రమంగా ఉచితంగా ఇచ్చే మధుప్కూలతో వారి సంపాదన హరించింది. పాపయ్య కాపు కూతురి పెళ్ళి మధుపర్కాలు నేసి ఇవ్వడానికి నూలు లేక ఇంట్లో ఉన్న అవును అమ్ముకున్నారు పుట్టన్న దంపతులు. అప్పుచేయడం ఇష్టంలేని ఆ దంపతులు ఊరు విడిచి వెళ్ళిపోదామనుకున్నారు. ఆ సమయంలో ఎవరున్నా ఇలాగే ఆలోచించేవారు.

“తనకు మాలిన ధర్మం పనికిరాదన్నది” పెద్దల మాట. కానీ పుట్టన్న దంపతులు తాగడానికి గంజినీళ్ళే అయినా దానధర్మాలు విడువలేదు మాట తప్పి, పూర్వపు ఆచారాన్ని విడిచి ఆ వూరిలో బ్రతకలేమని భావించి, పొరుగూరు వెళదామన్నాడు. అలా అనడంలో కూడా అయిష్టమే ఉంది కాని సంతోషం లేదు. బాధలో అన్న మాటే గాని, నిజంగా వెళ్ళాలని కాదు అని నా అభిప్రాయం.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson గులాబి అత్తరు

8th Class Telugu ఉపవాచకం 3rd Lesson గులాబి అత్తరు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. “ఇంకేమంటే మనవి చేసుకున్నాను గదా,
గోల్కొండ తరవాత పెద్దాపురమే చూడతగ్గదని విన్నానని ? ముందు తమరిది చిత్తగించకోరుతున్నాను.” ఇలా అని, భాను, మూత తెరిచి ఒక చిన్న పెట్టి దివాంజీ ముందు వుంచాడు. లోపల, ఎర్రని ముఖముల్ గుడ్డ అతికించిన చక్కని పెట్టి అది. అందులో ఒక చిన్న సీసా. చక్కని నగిషీ పనితో
యెంతో ముచ్చటగా వుందది. సీసాలో సగానికి పైగా అత్తరు వుంది. అది చూసి అక్కడివారందరూ గుటకలు మింగారు.
ప్రశ్నలు :
1. గోలకొండ తరువాత చూడదగినది ఏది?
జవాబు:
గోలకొండ తరువాత చూడదగినది పెద్దాపురం.

2. అత్తరు సీసా ఎలా ఉంది?
జవాబు:
అత్తరు సీసా చక్కని నగిషీ పనితో ఎంతో ముచ్చటగా ఉంది.

3. సీసాలో ఎంత అత్తరు ఉంది?
జవాబు:
సీసాలో సగానికి పైగా అత్తరు ఉంది.

4. అత్తరు సీసా చూసి అక్కడివారు ఏమి చేశారు?
జవాబు:
అత్తరు సీసా చూసి అక్కడివారు గుటకలు మింగారు.

2. “పెద్దాపురం ప్రభువులకు నజరు పెట్టుకుందామని తయారుచేశానది. గోల్కొండ నవాబుగారికి వట్టివేళ్ళ అత్తరు మిక్కిలి ప్రియం అని తెలిసి అదెంత శ్రద్ధగా తయారుచేశానో, పెద్దాపురం మహారాజులుంగారికి గులాబీ అత్తరు మిక్కిలి ప్రీతిపాత్రం అని తెలిసి అదీ అంతే శ్రద్ధగానూ తయారుచేశాను. ఆ సీసాలో ఉన్నది ఒక్కటే తులం – దీని నిమిత్తం కాశ్మీరం జాతి పువ్వులు వాడాను. ఢిల్లీ పరిసరాల్లో పారశీక జాతులే ఎక్కువ. కాశ్మీరజాతి చాలా అరుదుగా దొరుకుతుంది. అందుచేత, ఆ కాస్త అత్తరూ తయారు కావడానికి దాదాపుగా రెండేళ్ళు పట్టింది మహాప్రభూ” అని వివరించి చెప్పాడతను.

ఇది విని అక్కడివారు; దాని విశిష్టతా, విలువ ఊహించుకుని చాలా ఆనందించారు; కాని “ఆశ్చర్యమా?”
ప్రశ్నలు :
1. ఎవరికి నజరు పెట్టుకుందామని తయారు చేశాడు?
జవాబు:
పెద్దాపురం ప్రభువులకు నజరు పెట్టుకుందామని తయారు చేశాడు.

2. పెద్దాపురం మహారాజుకి ప్రీతిపాత్రం అయినది ఏది?
జవాబు:
పెద్దాపురం ప్రభువులకు గులాబీ అత్తరు ప్రీతి పాత్రమైనది.

3. గులాబీ అత్తరులో ఏ జాతి పువ్వులు వాడారు?
జవాబు:
గులాబీ అత్తరులో కాశ్మీరుజాతి పువ్వులు వాడారు.

4. ఢిల్లీ పరిసరాల్లో ఏ జాతులు ఎక్కువ?
జవాబు:
ఢిల్లీ పరిసరాల్లో పారశీక జాతులెక్కువ.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

3. ప్రతిఘటనలు అతిక్రమించగలిగితేనే జీవితానికి విజయం చేకూరుతుంది. కాని, ఒక్కొక్క జీవితానికి హృదయం పునాది అయితే, మరొక్క జీవితానికి మేధస్సు ప్రధానం అయి ఉంటుంది.

ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువయిపోతుంది. అక్కడ సానుభూతి కూడా ఉండదు. ఏ జీవితానికి పునాది హృదయమో అది కళాబంధురం అవుతుంది. అక్కడే కళలకు పరిణతి ఉంటుంది. అక్కడే కళలకు వినియోగం కూడా అక్కడే తన్మూలంగా కలిగే ఆనందానుభవమూ ఉంటుంది. అలాంటి ఆనందం తాననుభవించాలన్నా, ఇతర్లకు కలిగించాలన్నా ఆ కళాశీలి, తప్పనిసరిగా మహామేధావి అయివుండాలి.

కళావేత్తలోనే – కళాసాధనలోనే తన జీవితం పరిపక్వం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే? ఎవరి సంకల్పం విశుద్ధమో, ఎవరి హృదయం కళామయమో, ఎవరి దీక్ష అనన్య సామాన్యమో, ఎవరి ప్రాప్యం లోక కళ్యాణమో ఆ కళాశీలుల నిర్మాణాలే ద్వంద్వ భూయిష్టమైన భౌతికజగత్తులో ధ్రువతారలయి మెరుస్తూ ఉంటాయి.

నిజంగా షుకురల్లీ ఖాను అలాంటి కళాశీలి. అతని అత్తరు అలాంటి ధ్రువతార.
ప్రశ్నలు :
1. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ ఏది తక్కువౌతుంది?
జవాబు:
ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువయిపోతుంది.

2. వేటిలోనే ఒక జీవితాన్ని పరిపక్వం చేసుకుంటూ ఉండాలి?
జవాబు:
కళావేత్తలోనే, కళారాధనలోనే తన జీవితం పరిపక్వం చేసుకుంటూ ఉండాలి.

3. నిజమైన కళాశీలి ఎవరు?
జవాబు:
నిజమైన కళాశీలి షుకురలీఖాన్.

4. కళాశీలి తప్పనిసరిగా ఏమై ఉండాలి?
జవాబు:
కళాశీలి తప్పనిసరిగా మహామేధావి అయి ఉండాలి.

4. తన అత్తర్లకు విలువ కేవలం డబ్బే అయితే అందుకోసం అతనింత దూరం రానక్కర్లేదు. ఉన్నవూరే కదలనక్కర్లేదు. అసలు, ఢిల్లీ నగరమే ఒక మహాదేశం అంత. అక్కడే ఎందరో ప్రభువులూ, సంపన్నులు ఉన్నారు. వారిలో ఎందరో రసికులున్నారు. అతని అత్తర్లు కళ్ళకద్దుకునేవారు వందల వేలమంది ఉన్నారు.

అయితే, పెద్దాపురం ప్రభువు, శ్రీశ్రీశ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజు రసికత ఢిల్లీలో గుబాళించింది. ఢిల్లీ పాదుషా రసికతకే వంకలు దిద్దింది. అంచేత ఖాను ఆగలేకపోయాడు. దీక్ష పట్టాడు. తపస్సులో కూచున్నాడు. అపూర్వ సాధన చేశాడు. తహతహలాడిపోయాడు. రెక్కలు కట్టుకువచ్చి మరీ వాలాడు.

కాని, షష్టి గడియలూ పువ్వులతోనే కాలంగడిపే అతనికి, ఇక్కడ ప్రభుదర్శనం గగనపుష్పం అయిపోయింది. అపూర్వమైన జాతిరత్నం గులకరాళ్లతో కూడుకుపోయి వుండినట్టనిపించిదతనికి వచ్చి వచ్చి ముళ్ళకంచె ల్లోనూ, మురికి గుంటల్లోనూ పడిపోయినట్టు బాధపడ్డాడతను.
ప్రశ్నలు:
1. ఢిల్లీ నగరంలో ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
ఢిల్లీ నగరంలో ఎందరో ప్రభువులు, సంపన్నులు ఉన్నారు.

2. అత్తర్లు కళ్ళకద్దుకునేవారు ఎంతమంది ఉన్నారు?
జవాబు:
అత్తర్లు కళ్ళకద్దుకునేవారు వందల వేల మంది ఉన్నారు.

3. పెద్దాపురం మహారాజు ఎవరు?
జవాబు:
పెద్దాపురం ప్రభువు శ్రీశ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి

4. పేరాలోని రెండు జాతీయాలు ఏవి?
జవాబు:
తహతహలాడిపోవు, గగనపుష్పం.

5. తెల్లవారడం తడవుగా వెళ్ళి రాణేదారు పాదాల మీద వాలిపోయాడు ఖాను. ఇంతవరకూ అంత గొప్ప అత్తర్లు పెద్దాపురం కోటకు రాలేదన్న సంగతి రాణేదారుకి తెలుసు. ఖానుకి మంచి సన్మానం జరగడం దివాంజీకి సుతరామూ ఇష్టం లేదు. ఇది తెలుసు ఇతనికి. బుర్ర ఎగిరిపోడానికి కయినా ఒప్పుకుంటాడు గానీ భాను సరయిన ధర చెప్పడు ఇదీ తెలుసు అతనికి. అయితే మాత్రం మహారాజు చూశాడంటే భాను అత్తర్లు విడిచిపెట్టడు. ఈ విషయాన్ని ఆ సమయంలో దివాంజీ దగ్గర వుండిన వారందరూ గుర్తించేశారు.
ప్రశ్నలు:
1. ఖాను ఎవరి పాదాల మీద వాలిపోయాడు?
జవాబు:
భాను ఠాణేదారు పాదాలమీద వాలిపోయాడు. ఉంది.

2. భానుకి సన్మానం జరగడం ఎవరికి ఇష్టం లేదు?
జవాబు:
భానుకి సన్మానం జరగడం దివాంజీకి సుతరామూ ఇష్టం లేదు.

3. అత్తరు చూశాడంటే విడిచిపెట్టనిది ఎవరు?
జవాబు:
అత్తరును చూశాడంటే విడిచిపెట్టనిది మహారాజు.

4. ఈ పేరా ఆధారంగా దివాంజీ ఎలాంటి స్వభావం గలవాడు?
జవాబు:
ఈ పేరా ఆధారంగా దివాంజీ అసూయాపరునిగా తెలుస్తుంది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

6. సీసా భళ్ళుమంది. సీసా పెంకులు ఘళ్ళున చెదిరిపడ్డాయి. రాజసఖుల హృదయాలు రువ్వుమన్నాయి. ఆ ప్రదేశం అంతా అత్తరు సౌరభంతో గుమ్మంది. అందరూ ఆ పరిమళానికి మత్తెక్కుతున్నట్టయ్యారు.

ఒక క్షణానికి తెలివివచ్చి అందరూ కళ్ళెత్తి చూసేటప్పటికి, హఠాత్తుగానూ అప్రయత్నంగానూ వెనక్కి తిరిగి చూసి ఖాను కొయ్యయిపోయాడు.

అదేమిటో అని అందరూ వెనక్కి తిరిగి చూడగా, పంచకళ్యాణి మీద శ్రీ శ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహాద్భుతమైన గులాబి అత్తరు సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ. ఎక్కడివీ సమనోహర సుగంధ పరిమళాలు అని అరకంట చూస్తూ నిలిచి ఉన్నాడు.

మోర పైకెత్తుకుని, పంచకళ్యాణి గుర్రం సైతం అద్భుతాన్ని ఆస్వాదిస్తూ ఉండుండి సప్రయత్నంగా ఊపిరి తీసుకుంటోంది.
ప్రశ్నలు :
1. రాజ సభ్యుల హృదయాలు ఏమైనాయి?
జవాబు:
రాజసఖుల హృదయాలు ఠువ్వుమన్నాయి.

2. మహారాజు దేని మీద వెళ్తున్నాడు?
జవాబు:
మహారాజు పంచకళ్యాణి మీద వెళ్తున్నాడు.

3. కొయ్యబారిపోయింది ఎవరు?
జవాబు:
కొయ్యబారిపోయింది ఖాను.

4. ఏ పరిమళానికి అందరు మత్తెక్కిపోయారు?
జవాబు:
గులాబీ అత్తరు పరిమళానికి అందరు మత్తెక్కి పోయారు.

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“గులాబీ అత్తరు” కథను సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
శ్రీశ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజు పెద్దాపురాన్ని పరిపాలించే ప్రభువు. ఆ రాజు యొక్క రసికత ఢిల్లీ వరకు వ్యాపించింది. ఆ వార్త విని ఢిల్లీ నగరవాసి అయిన షుకురల్లీఖాన్ ఎలాగైనా ఆ పెద్దాపురం ప్రభువును కలిసి తన అత్తరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నాడు.

షుకురలీఖాను ఎంతో సుమధుర సువాసనలు గుభాళించే అత్తరులను తయారు చేయడంలో పెట్టింది పేరు. ఈ భాను చేసే అత్తరుకు ఢిల్లీ ప్రభువులందరూ ముగ్ధులయ్యేవారు. ఖాను అత్తరు తయారీలో బాగా ఆరితేరినవాడు. అయితే పెద్దాపురం ప్రభువుకు తన అత్తరు గుభాళింపు చూపించి మంచి పేరు సంపాదించాలనుకున్నాడు. అందుకు గాను ఆ రాజ్యంలో కొలువులో పనిచేస్తున్న ఠాణేదారు సహాయంతో రాజ భవనానికి వచ్చాడు. రాజ కొలువులో జవానులు, పెద్ద మనుషులు, దివాంజీ ఉండడం గమనించి తన అత్తరు సీసా బిరడా తీసి, వెంటనే బిగించాడు. ఆ సుమధుర సువాసనకు అక్కడి వారందరికీ ఒక్కసారిగా మత్తెక్కినట్లయింది. అందరూ తమ ముక్కులకు పని చెప్పారు. అందరూ ఆ వాసనకు ముగ్ధులయ్యారు.

కాని దివాంజీ మాత్రం ఆ పరిమళాన్ని అసహ్యించుకున్నాడు. ఇది చూచి ఖాను నిరాశపడ్డాడు. ఎట్టకేలకు దివాంజీని కలిసి తాను అత్తరు వ్యాపారినని, తన వద్ద సువాసనతో కూడిన గులాబీ అత్తరు ఉందని చూపించాడు. కాని దివాంజీ ఆసక్తిని చూపలేదు. దాంతో నిరాశగా తిరిగి వెళ్ళాడు. మరుసటిరోజు ఖాను మళ్ళీ దివాంజీని కలిసే ప్రయత్నం చేశాడు. కానీ నిరాసే ఎదురైంది. తాను రెండు సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన గులాబీ అత్తరు సీసాను కోపంగా కోట గోడవద్ద విసిరికొట్టాడు. అది పగిలిపోయింది. దాని వాసన అంతటా వ్యాపించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న రాజు గారు అక్కడి పరిమళానికి ముగ్ధుడయ్యాడు.

ఖాను ఆశ నెరవేరింది. దివాంజీ ఎన్ని యుక్తులు పన్నినా, అనుమతి ఇవ్వకపోయినా తన గులాబి అత్తరు ప్రభువుల దృష్టిలో పడింది. తన సంకల్పసిద్ధి నెరవేరింది. తన ప్రయత్నానికి దేవుడే ప్రతిఫలాన్ని ఇచ్చాడని ఎంతో సంతోషించాడు. ప్రయత్నం ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది.

ప్రశ్న 2.
షుకురభీ ఖాన్ స్వభావం ఎలాంటిది?
జవాబు:
‘గులాబీ అత్తరు’ అనే పాఠ్యభాగంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. వాటిలో షుకురలీఖాన్ పాత్ర ప్రముఖమైంది. ఖాను ఒక అత్తరు వ్యాపారి. అతడు తయారుచేసే అత్తరుకు అందరు ముగ్గులవుతారు. ఢిల్లీ నవాబుతో ఎన్నో సత్కారాలు పొందాడు. ప్రశంస, కీర్తి కోసం నిరంతరం శ్రమపడే స్వభావం భానుది. ఖాను చేసిన అత్తరు పరిమళాన్ని ఆస్వాదించినవారు ఒక్కక్షణం మత్తెక్కినట్లు అవుతారు.

దక్షిణ దేశంలో పెద్దాపురం ప్రభువు కీర్తి దశదిశల వ్యాపించింది. అది తెలుసుకొని ఖాను రెండు సంవత్సరాలపాటు శ్రమించి తయారు చేసిన గులాబీ అత్తరును తీసుకొని పెద్దాపురం సమీపించాడు. రాజును సమీపించి అత్తరు ఇచ్చి కీర్తి ప్రతిష్ఠలను పొందాలని భావించాడు. రాజదర్శనం చాలా కష్టం అయింది. ఆ కొలువు కూటంలో ఉన్న దివాంజీని కలిసాడు. రాజదర్శనం కలిగించమని కోరాడు. కొన్నిరకాల అత్తరులను చూపించాడు. దివాంజీ ఆసక్తిని చూపలేదు. ఫలితం దక్కలేదు. కోపంతో ఖాను ఆ అత్తరు సీసాను ప్రాకారం పై కొట్టాడు. తన శ్రమ వృథా అయిందని భావించాడు.

గులాబి అత్తరు సీసా పగిలి ఆ పరిమళం, సౌరభం ఆ ప్రాంతం అంతా వ్యాపించిన సమయంలో రాజావారు అక్కడికే రావడం, ఆ సౌరభానికి ముగ్ధుడవ్వడం చూసి ఎంతో సంబరపడిపోయాడు. తన ప్రయత్నం ఫలించినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్న కృతజ్ఞతాశీలి. మాటల్లో నేర్పరి. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగల ధీరత్వం గల వ్యాపారి. లాభంతో పాటు, కీర్తిని ఆశించే కీర్తితత్పరుడు. అతని అత్తరు ధ్రువతార వంటిది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

ప్రశ్న 3.
పెద్దాపురం ప్రభువు ఎవరు? ఆయన గురించి రాయండి.
జవాబు:
దక్షిణ భారత దేశంలో పెద్దాపురం ప్రభువు శ్రీ శ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి ప్రసిద్ధుడు. ఈయన గొప్ప రసికరాజు. ఈయన కీర్తి దశదిశల విస్తరించింది. ఢిల్లీ వరకు విస్తరించింది. ప్రజలను ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా రాజ్యాన్ని పాలించాడు. ఉదార స్వభావం కలవాడు. పరిపాలనలో తన కార్యనిర్వహణా చతురతను ప్రదర్శించేవాడు. ఎంతటి సమస్యనైనా తన మేధా సంపత్తితో చక్కగా పరిష్కరించేవాడు. తన రాజ్యంలో అందరికి న్యాయం జరగాలని ఆకాంక్షించాడు. దివాంజీకి గొప్ప పదవిని ఇచ్చి గౌరవించాడు. అయితే దివాంజీ నమ్మకద్రోహం చేసేవాడు. దివాంజీ తన ముందు నటిస్తున్నాడనే విషయం తెలియక ఆయనకు గౌరవం ఇచ్చేవాడు.

పెద్దాపురం రాజావారు ఎంత సరసులో ఆయన పరివారం అంత విరసులు. పెద్దాపురంలోని ప్రజలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండేవారు. పంచకళ్యాణి గుర్రంపై నగర సంచారం చేస్తూ ఉండేవారు. ఖాను తన కోసం కష్టపడి రెండు సంవత్సరాల సమయం వెచ్చించి తయారుచేసిన గులాబి అత్తరును కోపంతో విసిరివేయగా అది పగిలి ఆ సువాసన అంతటా వ్యాపించగా, ఆ పరిమళాన్ని నిలబడి ఆశ్వాదించిన సువాసన ప్రియుడు. మహాద్భుతమైన గులాబి అత్తరు సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ, ఆ సుమధుర, సుమనోహర సుగంధ పరిమళాలకు ఎంతో ముగ్ధుడయ్యాడు. దక్షిణ దేశానికంతటికీ జాతిరత్నం శ్రీవత్సవాయి ప్రభువు.