AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 2nd Lesson గుశ్వం

8th Class Telugu ఉపవాచకం 2nd Lesson గుశ్వం Textbook Questions and Answers

I. అవగాహన-ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. గుశ్వం నాటిక హాస్యంతో కూడినది. ఎందుకంటే శిష్యులు పదాలు సరిగా పలకలేక పోవడం గుఱ్ఱం బదులు : | గుల్లం అనడం నవ్వు తెప్పిస్తుంది. గుర్రంలో ‘గు’, అశ్వంలో ‘శ్వం’ కలిపి ‘గుశ్వం’ అనే పదం వారు తయారు చెయ్యడం హాస్యానికి కారణం. గుర్రానికి గుడ్డు ఉండదని కూడా తెలియని వాళ్ళ అమాయకత్వం, ఆ అయోమయాన్ని గురువు గారికి కూడా తగిలించి వాళ్ళు గుర్రం గుడ్డు తెస్తామనగానే ఆయన తలూపి పది వరహాలివ్వడం నవ్వు పుట్టిస్తుంది. బూడిద గుమ్మడికాయను గుడ్డు అని చెప్పగానే నమ్మేయడం గుమ్మడికాయ పగిలిపోతే ఆ శబ్దానికి బెదిరి కుందేలు పరుగెత్తడం చూసి ఆ కాయలోంచే కుందేలు వచ్చి ఉంటుందని వారు భావించి దానివెంట పరుగెత్తడం మరీ విడ్డూరం. ఇలా ఈ కథలో ప్రతి సన్నివేశమూ నవ్వు పుట్టిస్తుంది ఈ నాటికలో. –
ప్రశ్నలు :
1. శిష్యుల అమాయకత్వం ఎలాంటిది?
జవాబు:
గుర్రానికి గుడ్డు ఉండదని తెలియకపోవడం శిష్యుల అమాయకత్వం.

2. పరమానందయ్య శిష్యులు ఎలాంటివారు?
జవాబు:
పరమానందయ్య శిష్యులు అమాయకులు.

3. ‘గుశ్వం’ నాటిక దేనితో కూడినది ?
జవాబు:
‘గుశ్వం’ అనే నాటిక హాస్యంతో కూడినది.

4. శిష్యులు దేనిని గుర్రం గుడ్డుగా భావించారు?
జవాబు:
శిష్యులు బూడిద గుమ్మడికాయను గుర్రం గుడ్డుగా భావించారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

2. పరమానందయ్యగారు పేరు పొందిన గురువు. ఆయన దగ్గర శిష్యులు అమాయకులు. ఏ పని చెప్పినా అయోమయంగా చేస్తారు. వాళ్ళకు గురువుగారు ఒక రోజు గుర్రం గురించి చెప్పాలనుకున్నారు. చెన్నడు అనే శిష్యుడికి గుఱ్ఱం అని పలకమంటే అ పలకలేని చెన్నడు గుల్లం అన్నాడు. గున్నడు అనే శిష్యుడు ఇంకో పేరు చెప్పమంటే గురువు ‘అశ్వం’ అని చెప్పాడు. అశ్వమనే పేరు నాదంటే నాదని ఆ యిద్దరు కొట్లాడుకుంటూ గుర్రంలోని ‘గు’, అశ్వంలోని ‘శ్వం’ కలిపి ‘గుశ్వం’ అనే పేరు తయారుచేశారు. గురువుగారు వారిని విసుక్కుంటూ నాకు గుర్రమెక్కాలనే కోరిక తీరిక కనీసం మీకు గుర్రం గురించి చెబుదామనుకుంటే ఆ పేరు గూడ నేర్చుకోలేకపోయారు. అంటుంటే తిన్నడు అనే మరోశిష్యుడు పది వరహాలిస్తే గుర్రం గుడ్డు కొనుక్కొస్తానని చెప్పి చెన్నడు, గున్నడు ఇద్దర్నీ
వెంటబెట్టుకొని ఒక బూడిద గుమ్మడికాయను కొనుక్కొని వస్తుంటే దారిలో అది కిందపడి పగిలింది.
ప్రశ్నలు:
1. పేరు పొందిన గురువు ఎవరు?
జవాబు:
పేరు పొందిన గురువు పరమానందయ్య.

2. శిష్యులు ఏ పని చేసినా ఎలా చేస్తారు?
జవాబు:
శిష్యులు ఏ పని చేసినా అయోమయంగా చేస్తారు.

3. గుర్రాన్ని సంస్కృతంలో ఏమని అంటారు?
జవాబు:
గుర్రాన్ని సంస్కృతంలో ‘అశ్వం’ అని అంటారు.

4. బూడిద గుమ్మడికాయను దేనిగా భావించారు?
జవాబు:
బూడిద గుమ్మడికాయను గుర్రం గుడ్డుగ భావించారు.

3. ఇంతలో పరమానందయ్య గారి మరో శిష్యుడు, ‘తిన్నడు’ వచ్చి, గుర్రం గుడ్డును పట్టేశాననీ, పది వరహాలిస్తే అది వారికి ఇచ్చి గుర్రం గుడ్డు మోసితెస్తానన్నాడు. గురువుగారు కూడా ఆ మాటనమ్మి శిష్యులకు డబ్బిచ్చి పంపారు. శిష్యులు ఆ డబ్బు ఇచ్చి గుర్రం గుడ్డు అని బూడిద గుమ్మడికాయను కొని మోసి తెస్తుండగా ఆ కాయ పగిలిపోయింది. అప్పుడే అక్కడ తిరుగుతున్న కుందేలు పిల్లను చూసి, శిష్యులు గుర్రం పిల్ల పారిపోయిందని, దానికై వెతికి, పట్టుకోలేక ఏడుస్తూ వచ్చి గురువుగారికి చెప్పారు. బూడిదగుమ్మడికాయ ముక్కల్ని చూసి, శిష్యులూ, తానూ కూడా, తెలివితక్కువ పని చేశామని గురువుగారు తెలిసికొన్నారు.

ఇంతలో బూడిదగుమ్మడికాయ అమ్మిన పెద్దమనిషి, కుందేలు పిల్లను పట్టి తెచ్చి, పదివరహాలనూ గురువుగారికి తిరిగి ఇచ్చాడు. జరిగిన విషయం అంతా గురువుగారికి చెప్పాడు.
ప్రశ్నలు:
1. తిన్నడు ఎవరు?
జవాబు:
తిన్నడు పరమానందయ్య శిష్యుడు.

2. కుందేలు పిల్లను శిష్యులు దేనిగా గుర్తించారు?
జవాబు:
కుందేలు పిల్లను గుర్రం పిల్లగా గుర్తించారు.

3. పది వరహాలు ఇస్తే ఏది తెస్తామని శిష్యులు చెప్పారు?
జవాబు:
పది వరహాలు ఇస్తే గుర్రం గుడ్డును తెస్తామని చెప్పారు.

4. పెద్దమనిషి దేనిని అమ్మాడు?
జవాబు:
పెద్దమనిషి బూడిద గుమ్మడికాయను అమ్మాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

4. గుఱ్ఱము అనే మాట తెలుగు అనీ, అశ్వము అనే మాట సంస్కృతము అనీ గురువుగారు చెప్పారు. అయితే ఆ రెండు మాటలు వస్తే సంస్కృతము, తెలుగుభాషలు పూర్తిగా తమకు వచ్చేస్తాయని గున్నడు అంటాడు.

మరో శిష్యుడు తిన్నడు, గుర్రం గుడ్డు అనుకొని, బూడిద గుమ్మడికాయను పది వరహాలిచ్చి కొన్నాడు. గుర్రం గుడ్డు పెట్టదని కూడా ఆ శిష్యులకు తెలియదు. వారు పరమ మూర్ఖులు. వారికి గురుభక్తి ఎక్కువ. గురువుగారు చచ్చిపోతే తాము బతికే అంత తెలివి తక్కువ వాళ్ళము కాము అని వారు తమ గురుభక్తిని ప్రకటిస్తారు.

పరమానందయ్యగారి శిష్యులు అతి తెలివిని చూపిస్తారు. గుర్రము కొంటే అది తన్నుతుందనీ, గుడ్డును కొని, దాని పిల్లను పెంచితే ఆ గుర్రం పిల్ల తాము చెప్పిన మాట వింటుందనీ వారు గురువు గారికి ధర్మసూక్ష్మాన్ని వివరిస్తారు.

ఆ గురువుగారు తమకు చెప్పిన మాటలు గురువుగారికే తిరిగి వారు అప్పచెపుతారు. గుర్రం గుడ్డు తొందరగా కొనాలనీ, ‘ఆలస్యం అమృతం విషం’ అని గురువుగారికి వారు గుర్తు చేస్తారు.
ప్రశ్నలు:
1. గుర్రం గుడ్డు అనుకొని బూడిద గుమ్మడికాయను కొన్న శిష్యుడు ఎవరు?
జవాబు:
తిన్నడు గుర్రం గుడ్డు అనుకొని బూడిద గుమ్మడ కాయను కొన్నాడు.

2. అతి తెలివిని ప్రదర్శించినది ఎవరు?
జవాబు:
పరమానందయ్య శిష్యులు అతి తెలివిని ప్రదర్శిస్తారు.

3. ఆలస్యం అమృతం విషం అని గుర్తు చేసినది ఎవరు?
జవాబు:
ఆలస్యం అమృతం విషం అని గుర్తు చేసినది శిష్యులు.

4. గుర్రం అనే పదాన్ని సంస్కృతంలో ఏమని అంటారు?
జవాబు:
గుర్రం అనే పదాన్ని సంస్కృతంలో ‘అశ్వం’ అని అంటారు.

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఈ నాటకం వేయడానికి ఒకరు గురువుగాను, ముగ్గురు శిష్యులుగా, ఇంకొకరు పెద్దమనిషిగా ఉండాలి. నాటకంలోని సంభాషణలను అభ్యాసం చేయండి. పాత్రలకనుగుణంగా దుస్తులు ధరించాలి. అలంకరించుకోవాలి. తరగతిలో / పాఠశాలలో ప్రదర్శించాలి.
జవాబు:
నాటకం మీ తరగతిలో ప్రదర్శించండి.

ప్రశ్న 2.
“గుశ్వం” నాటకాన్ని కథగా సొంతమాటల్లో పది వాక్యాల్లో రాయండి.
జవాబు:
పరమానందయ్యగారికి చెన్నడు, గున్నడు అనే శిష్యులు ఉన్నారు. గురువుగారు చెన్నడికి ‘గుజ్జము’ అనే మాట చెప్పారు. అతడు దాన్ని గుల్లము అని పలుకుతాడు. అపుడు గున్నడు, చెన్నడి నోరు చిన్నదనీ గుఱ్ఱం, బండి వాడినోరు పట్టడం లేదనీ చెప్పాడు. గురువుగారు ‘అశ్వము’ అని మరో మాట చెప్పాడు. గున్నడు, చెన్నడు కలసి, గుఱ్ఱములో ‘ఱ్ఱ’ తీసి, అశ్వములోని ‘శ్వ’ అక్కడ పెట్టి, ‘గుశ్వం’ అనే మాట తయారుచేశారు. గురువుగారు అది తప్పని చెప్పి, వాళ్ళను మందలించి వారికి ‘తురగము’ అని మరో మాట చెప్పారు.

ఇంతలో పరమానందయ్య గారి మరో శిష్యుడు, ‘తిన్నడు’ వచ్చి, గుర్రం గుడ్డును పట్టేశాననీ, పది వరహాలిస్తే అది వారికి ఇచ్చి గుర్రం గుడ్డును మోసితెస్తానన్నాడు. గురువుగారు కూడా ఆ మాటనమ్మి శిష్యులకు డబ్బిచ్చి పంపారు. శిష్యులు ఆ డబ్బు ఇచ్చి గుర్రం గుడ్డు అని బూడిద గుమ్మడికాయను కొని మోసి తెస్తుండగా ఆ కాయ పగిలిపోయింది. అప్పుడే అక్కడ తిరుగుతున్న కుందేలు పిల్లను చూసి, శిష్యులు గుర్రం పిల్ల పారిపోయిందని, దానికై వెతికి, పట్టుకోలేక ఏడుస్తూ వచ్చి గురువుగారికి చెప్పారు. బూడిద గుమ్మడికాయ ముక్కల్ని చూసి, శిష్యులూ, తానూ కూడా, తెలివితక్కువ పని చేశామని గురువుగారు తెలిసికొన్నారు.

ఇంతలో బూడిద గుమ్మడికాయ అమ్మిన పెద్దమనిషి, కుందేలు పిల్లను పట్టి తెచ్చి, పదివరహాలనూ గురువుగారికి తిరిగి ఇచ్చాడు. జరిగిన విషయం అంతా గురువుగారికి చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

ప్రశ్న 3.
“గుశ్వం” నాటిక హాస్యంతో కూడినది కదా! ఎందుకో వివరంగా పది వాక్యాల్లో రాయండి.
జవాబు:
పరమానందయ్యగారు శిష్యుడికి ‘గుఱ్ఱం’ అనే మాట చెపితే చెన్నడనే శిష్యుడు “గుల్లము” అంటాడు. ‘గుఱ్ఱము’ అనే
మాటలో బండి ‘ఱ’ ఉంది అని గురువుగారంటే, అందుకే గుల్లము, బండి ‘ఱ’, ఒక్కసారిగా తన నోట పట్టడం లేదని శిష్యుడంటాడు. గున్నడు అనే మరో శిష్యుడు, చెన్నడి నోరు బొత్తిగా చిన్నదనీ, బళ్ళూ, రాళ్ళూ అసలు పట్టవని అంటాడు. ఈ మాటలు హాస్యంతో కూడినవి.

అలాగే ‘గుఱ్ఱంలో’ ఱ తీసివేసి అశ్వంలో ‘శ్వ’ ను కలిపి, శిష్యులు, ‘గుశ్వం’ అనే మాట సృష్టిస్తారు. అది కూడా హాస్యంతో కూడినదే. ఇంకో శిష్యుడు తిన్నడు గుర్రం గుడ్డుతెస్తానని పదివరహాలిచ్చి, బూడిద గుమ్మడికాయను కొని తెస్తాడు. ఆ శిష్యులకు గుర్రం గుడ్డు పెట్టదనీ, పిల్ల మాత్రమే పుడుతుందనీ తెలియకపోవడం నవ్వు పుట్టిస్తుంది. కుందేలు పిల్ల పారిపోతే, గుర్రం పిల్ల పారిపోయిందని శిష్యులు వెతకడం నవ్వు పుట్టిస్తుంది. గుర్రాన్ని కొనడం కంటె, గుర్రం గుడ్డుకొని దాని పిల్లను పెంచితే అది తమ చెప్పినమాట బాగా వింటుందనే, శిష్యుల అతితెలివిమాట కూడా నవ్వు పుట్టిస్తుంది.

గుర్రం గుడ్డును తామే పొదుగుతామని శిష్యులు అంటారు. ఆ మాట మరీ నవ్వు పుట్టిస్తుంది. గురువుగారి దగ్గర ఆ శిష్యులు చూపించే వినయమూ, వారి అతి తెలివితక్కువ మాటలూ మనకు నవ్వును తెప్పిస్తాయి. కాబట్టి “గుశ్వం” – హాస్యనాటిక.

ప్రశ్న 4.
“గుశ్వం” నాటికలోని శిష్యులు ఎలాంటివారు ? వీరి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
గుశ్వం నాటికలో చెన్నడు, గున్నడు, తిన్నడు అనే ముగ్గురు శిష్యులున్నారు. వీరు అతి తెలివి తక్కువవారు. కాని వారంతా అతి తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరంతా మూర్ఖులయిన శిష్యులు.

అందులో చెన్నడికి ‘గుఱ్ఱం’ అనే మాటలో బండి ‘ఓ’ పలకదు. ఆ మాటను ‘గుల్లము’ అంటాడు. తనకు గుల్లము బండి ఒక్కసారే నోట పట్టడం లేదంటాడు. గున్నడు అనే మరో శిష్యుడు, చెన్నడికి నోరు బొత్తిగా చిన్నదనీ బళ్ళు, రాళ్లు దాంట్లో పట్టవు అని అంటాడు.

గుఱ్ఱము అనే మాట తెలుగు అనీ, అశ్వము అనే మాట సంస్కృతము అనీ గురువుగారు చెప్పారు. అయితే ఆ రెండు మాటలు వస్తే సంస్కృతము, తెలుగుభాషలు పూర్తిగా తమకు వచ్చేస్తాయని గున్నడు అంటాడు.

మరో శిష్యుడు తిన్నడు, గుర్రం గుడ్డు అనుకొని, బూడిద గుమ్మడికాయను పది వరహాలిచ్చి కొన్నాడు. గుర్రం గుడ్డు పెట్టదని కూడా ఆ శిష్యులకు తెలియదు. వారు పరమ మూర్ఖులు. వారికి గురుభక్తి ఎక్కువ. గురువుగారు చచ్చిపోతే తాము బతికే అంత తెలివి తక్కువ వాళ్ళము కాము అని వారు తమ గురుభక్తిని ప్రకటిస్తారు.

పరమానందయ్య గారి శిష్యులు అతి తెలివిని చూపిస్తారు. గుర్రము కొంటే అది తన్ను తుందనీ, గుడ్డును కొని, దాని పిల్లను పెంచితే ఆ గుర్రం పిల్ల తాము చెప్పినమాట వింటుందని వారు గురువు గారికి ధర్మసూక్ష్మాన్ని వివరిస్తారు.

గురువుగారు తమకు చెప్పిన మాటలు గురువుగారికే తిరిగి వారు అప్పచెపుతారు. గుర్రం గుడ్డు తొందరగా కొనాలనీ, ‘ఆలస్యం అమృతం విషం’ అని గురువుగారికి వారు గుర్తు చేస్తారు.

మొత్తంపై పరమానందయ్యగారి శిష్యుల మాటలూ, చేష్టలూ అడుగడుగునా నవ్వు పుట్టిస్తాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

ప్రశ్న 5.
పరమానందయ్య గురువుగారు, తిన్నడు, చెన్నడు, గున్నడు శిష్యులు కదా! గురుశిష్యుల మధ్య ఉండే సంబంధం గురించి తెలపండి.
జవాబు:
గురువులు పూర్వకాలంలో శిష్యులకు తామే భోజనం పెట్టి, వారికి చదువు చెప్పేవారు. శిష్యులు గురువులు చెప్పిన పనులుచేస్తూ, భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా గురువులు చెప్పే విద్యలు నేర్చుకొనేవారు.

గురుశిష్యులు ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవారు. శిష్యులు గురువుగారినీ, గురువుగారి భార్యను ఎంతో భక్తితో సేవించేవారు. వారు చెప్పే పనులన్నీ చేసేవారు. గురువుగారి పూజకు, అగ్నిహోత్రాది విధులకు, కావలసిన సమిధలు, పూజాద్రవ్యాలు శిష్యులు తెచ్చి ఇచ్చేవారు.

గురుపత్ని శిష్యులకు కడుపునిండా భోజనం పెట్టేది. గురువుగారు శిష్యుల మంచి చెడ్డలను చూస్తూ వారికి కావలసిన విద్యలు నేర్పేవారు. చదువు పూర్తి అయిన తర్వాత గురువులకు, శిష్యులు గురుదక్షిణ సమర్పించేవారు. గురువులు ఏమి అడిగినా శిష్యులు వారికి ఇచ్చేవారు.

ఉదంకుడు అనే శిష్యుడు, పౌష్య మహారాజు భార్య కుండలాలను అడిగితెచ్చి గురుపత్నికి ఇచ్చి, ఆ విధంగా గురుదక్షిణ సమర్పించాడు. ఏకలవ్యుడు’ అనే శిష్యుడు తాను ఆరాధించే గురువు ద్రోణాచార్యునికి తన కుడిచేతి బొటనవ్రేలును గురుదక్షిణగా సమర్పించాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson హద్దులు-హద్దులు

8th Class Telugu ఉపవాచకం 1st Lesson హద్దులు-హద్దులు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. సంక్రాంతి పండక్కి వచ్చిన అల్లుడు ఇడ్డెన్లు, బొబ్బట్లు, గారెలు, మొక్కజొన్న పొత్తులు, తాలింపు శనగలు ఇలా తెగ చిరుతిళ్ళు లాగించి కడుపునొప్పంటుంటే డాక్టరుకు కబురు చేశారు మామగారు. డాక్టరుగారు అల్లుడికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయ్యాక, అల్లుడిగారు జబ్బేమిటంటూ మామగారు డాక్టర్ని అడిగాడు. డాక్టరుగారు ఒక పళ్ళెంలో ఉన్న గారెలు, బొబ్బట్లు, వేరుశనగ పప్పులు, ఐదూ, పది పైసల నాణేలూ చూపించాడు. ఆ డబ్బులెక్కడివో అని అత్తగారు అయోమయంగా చూసింది. మెంతుల డబ్బాలోను, పప్పుల డబ్బాలోను అత్తగారు దాచుకున్న డబ్బులు శనగపప్పుతో పాటు బొబ్బట్లలో కలిసి అల్లుడిగారు పొట్టలోకి వెళ్ళి పోయుంటాయన్నారు మామగారు.
ప్రశ్నలు :
1. అల్లుడి కడుపునొప్పికి కారణమేంటి?
జవాబు:
ఇద్దెన్లు, బొబ్బట్లు, గారెలు, మొక్కజొన్నలు, తాలింపు శనగలు బాగా తినడంతో కడుపునొప్పి వచ్చింది.

2. అల్లుడికి ఆపరేషన్ చేసి తీసిన వాటిలో ఏమేమి ఉన్నాయి?
జవాబు:
గారెలు, బొబ్బట్లు, వేరుశనగపప్పులు, ఐదు పైసల నాణేలు, పది పైసల నాణేలు.

3. సంక్రాంతి పండక్కి కాక, ఇంకా ఏయే సందర్భాలలో అల్లుళ్ళను మామగారు ఇంటికి ఆహ్వానిస్తారు?
జవాబు:
గృహప్రవేశాలకు, దీపావళి, ఉగాది వంటి పండు గలకు, ఇంట్లో వేడుకలకు మావగారు అల్లుళ్ళని ఆహ్వానిస్తారు.

4. పై గద్యంలో మీకు నవ్వు తెప్పించిన విషయమేంటి?
జవాబు:
బొబ్బట్లు, గారెలు, వేరుశనగపప్పులతో పాటు అల్లుడిగారి పొట్టలోంచి ఐదు పైసల నాణేలు, పది పైసల నాణేలను డాక్టరుగారు బయటకు తీసి అందరికీ ఆదర్శంగా నిలవాలి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

2. పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు. బావమరిది బావగారిని హద్దు మీరి వేళాకోళం చేస్తున్నాడు. అందుకు మామగారు కొడుకును మందలించాడు. మామగారు – అతిగా ఫలహారాలు పెట్టకు, అల్లుడి ఆరోగ్యం పాడవుతుంది అని భార్యతో చెప్పాడు. ఇంతలో అల్లుడు కడుపునొప్పితో మెలితిరిగిపోయాడు. బావగారితో మరిది వేరుశనగకాయలు కావాలా ? అని వేళాకోళం చేస్తాడు. అల్లుడు మరిది పై కోపపడతాడు.

అత్తగారు డాక్టరును తీసుకురమ్మని భర్తతో అంటుంది. పండుగ ఖర్చుతోపాటు, డాక్టరు ఖర్చూ వచ్చిందని మామగారు మూలుగుతాడు. చివరకు డాక్టరు పరీక్షించి అల్లుడి పొట్టకు ఆపరేషన్ చేయాలన్నాడు. వేయిరూపాయలు ఖర్చవుతుందన్నాడు. అల్లుడు తన ప్రాణం పోతుందని కంగారు పడ్డాడు. తప్పనిసరయి, మామగారు ఆపరేషను చేయించాడు.
ప్రశ్నలు:
1. పండుగకు వచ్చింది ఎవరు?
జవాబు:
పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు.

2. అల్లుడు ఎవరిపై కోపపడతాడు?
జవాబు:
అల్లుడు మరిది పై కోపపడతాడు.

3. అత్తగారు ఎవరిని తీసుకురమ్మని భర్తతో అంటుంది?
జవాబు:
అత్తగారు డాక్టరును తీసుకొని రమ్మని భర్తతో అంటుంది.

4. బావమరిది ఎవరిని హద్దుమీరి వేళాకోళం చేస్తున్నాడు?
జవాబు:
బావమరిది బావగారిని హద్దుమీరి వేళాకోళం చేస్తున్నాడు.

3. ‘హద్దులు హద్దులు’ నాటకంలో అల్లుడు పొట్టకు డాక్టరు రంపంతో కోసి ఆపరేషను చేసినట్లు చూపించిన ఘట్టం మంచి హాస్యఘట్టం.

డాక్టరు నర్సును ఆపరేషనుకు సిద్ధం చేయమంటాడు. నర్సు రంపం తీసుకువస్తుంది. “ఈ రంపమేమిటి ? దీనితో కోస్తారా?” అని అల్లుడు కంగారుపడతాడు. “దేనితో కోస్తే నీకెందుకు ? మాట్లాడకుండా బల్లమీద పడుకో” అని డాక్టరు అల్లుడిని మందలిస్తాడు.

ఆ తర్వాత ప్రేక్షకులకు పేషంటు కనబడడు. కానీ డాక్టరు రంపంతో కోసినట్లు నటించి పొట్టలో నుంచి, బొబ్బట్లు, గారెలు, చెంచాలు వగైరా ఒక్కొక్కటీ తీసి, ప్రేక్షకులకు చూపించి, పక్కన పెడుతూ ఉంటాడు. ఈ ఘట్టం మంచి నవ్వును తెప్పించింది.
ప్రశ్నలు:
1. ‘హద్దులు హద్దులు’ అనే నాటకంలో హాస్యఘట్టం ఏది?
జవాబు:
హద్దులు హద్దులు అనే నాటకంలో అల్లుడు పొట్టకు డాక్టరు రంపంతో కోసి ఆపరేషను చేసినట్లు చూపించిన ఘట్టం మంచి హాస్యఘట్టం.

2. డాక్టరు ఎవరిని మందలించాడు?
జవాబు:
డాక్టరు అల్లుడిని మందలించాడు.

3. ప్రేక్షకులకు కనబడనిది ఎవరు?
జవాబు:
ప్రేక్షకులకు కనబడనిది పేషంటు.

4. కంగారు పడినది ఎవరు?
జవాబు:
కంగారు పడినది అల్లుడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

4. హద్దులు హద్దులు నాటిక ద్వారా, తినడానికి హద్దులు, నవ్వడానికి హద్దులు, ఆలస్యానికి హద్దులు, తొందరకు – హద్దులు, చాదస్తానికి హద్దులు, అల్లరికి హద్దులు, ఖర్చుకు హద్దులు – ఉండాలని రచయిత సందేశం ఇచ్చాడు.

పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు గదా అని, అతిగా ఫలహారాలూ, పిండివంటలూ, చిరుతిళ్ళు పెడితే, అవి తిన్న వారికి రోగం వస్తుందని ఈ నాటిక సందేశం ఇస్తోంది. బావమరిది బావగారిని వేళాకోళం చేయడం సహజం. కానీ అల్లరి అతిగా ఉండరాదని ఈ నాటిక సందేశం ఇచ్చింది. అల్లం రసం పట్టే సందే ఉంటే, మరి రెండు బొబ్బట్లు బావగారు లాగించేసే వారని మరిది అతిగా వేళాకోళం చేశాడు.
ప్రశ్నలు:
1. ప్రతీదానికి హద్దులు ఉండాలని సందేశం ఇచ్చింది ఎవరు?
జవాబు:
ప్రతీదానికి హద్దులు ఉండాలని సందేశం ఇచ్చింది రచయిత.

2. పండుగకు వచ్చింది ఎవరు?
జవాబు:
పండుగకు వచ్చింది కొత్త అల్లుడు.

3. చిరుతిళ్ళు అతిగా తింటే ఏమి వస్తుంది?
జవాబు:
చిరుతిళ్ళు అతిగా తింటే రోగం వస్తుంది.

4. ఎవరు ఎవరిని వేళాకోళం చేయడం సహజం?
జవాబు:
బావమరిది బావను వేళాకోళం చేయడం సహజం.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఈ నాటిక సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కొత్త అల్లుడు తన అత్తవారింటికి పండుగకి వస్తాడు. కొత్త అల్లుడు వచ్చాడనే సంబరంతో వాళ్ళు రకరకాల పిండివంటలు చేసి అల్లుడికి విందుభోజనం తినిపిస్తారు. తమ ఇంటికి వచ్చిన బావగారిని మరిది హద్దుమీరి వేళాకోళం చేస్తుంటాడు. అది చూచిన మామగారు తన కొడుకుని అలా చేయకూడదని మందలిస్తాడు. అత్తగారు కూడా ఎంత బావయినా అలా చేయకూడదని కొడుకుని కోప్పడుతుంది. అల్లుడుగారు కూడా కొంత బెట్టుగా ఉంటే బాగుంటుంది అంటుంది.

ఇంతలో అల్లుడు కడుపునొప్పితో మెలితిరిగిపోతాడు. బావగారితో మరిది వేరుశనగకాయలు కావాలా ? అని వేళాకోళం చేస్తాడు. అల్లుడు మరిదిపై కోప్పడతాడు.

అత్తగారు డాక్టరును తీసుకురమ్మని భర్తతో అంటుంది. పండుగ ఖర్చుతో పాటు, డాక్టరు ఖర్చూ వచ్చిందని మామగారు మూలుగుతాడు. చివరకు డాక్టరు పరీక్షించి అల్లుడి పొట్టకు ఆపరేషన్ చేయాలన్నాడు. వేయిరూపాయలు ఖర్చవుతుందన్నాడు. అల్లుడు తన ప్రాణం పోతుందని కంగారుపడ్డాడు. తప్పనిసరయి, మామగారు ఆపరేషను చేయించాడు.

అల్లుడు పొట్టలో అతడు తిన్న గారెలు, బూరెలతోపాటు చెంచాలు, అణాలు, నాణేలు ఉన్నాయి. వాటిని తీసి డాక్టరు అందరికీ చూపించాడు. అత్తగారు పోపులడబ్బాలో దాచిన నాణేలు శనగపప్పుతో కలిసి అల్లుడి పొట్టలోకి వెళ్ళాయి.

అన్ని పనులకూ హద్దులు ఉండాలి అని ఈ నాటిక సందేశం ఇస్తుంది.

ప్రశ్న 2.
ఈ నాటికలో మీకు నచ్చిన హాస్య సంఘటనను రాయండి. “హద్దులు – హద్దులు” నాటికలోని మీకు నచ్చిన హాస్య సన్నివేశాన్ని రాయండి.
(లేదా)
హద్దులు – హద్దులు నాటిక ద్వారా మీరు పొందిన ‘హాస్యానుభూతి’ని మీ మాటల్లో రాయండి.
జవాబు:
ప్రతిదానికి హద్దులుండాలంటూ హాస్యస్పోరకంగా సాగిన ఈ నాటకం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. అయితే నాకు ఈ నాటకంలో అల్లుడి పొట్టను డాక్టరు రంపంతో కోసి ఆపరేషను చేసినట్లు చూపించిన ఘట్టం కడుపు ఉబ్బేలా నవ్వు తెప్పించింది.

డాక్టరు నర్పును ఆపరేషనుకు సిద్ధం చేయమంటాడు. నర్పు రంపం తీసుకువస్తుంది. “ఈ రంపమేమిటి ? దీనితో కోస్తారా ?” అని అల్లుడు కంగారుపడతాడు. “దేనితో కోస్తే నీకెందుకు ? మాట్లాడకుండా బల్లమీద పడుకో” అని డాక్టరు అల్లుడిని మందలిస్తాడు.

తర్వాత ప్రేక్షకులకు పేషంటు కనబడడు. కానీ డాక్టరు రంపంతో కోసినట్లు నటించి పొట్టలో నుంచి, బొబ్బట్లు, గారెలు, చెంచాలు వగైరా ఒక్కొక్కటీ తీసి, ప్రేక్షకులకు చూపించి, పక్కన పెడుతూ ఉంటాడు.

డాక్టరు ఆపరేషను పూర్తి చేసి, “పెద్దవాళ్ళెవరో ఒకసారి ఇలా రండి” అని పిలిస్తాడు. అత్తగారు, “ఆపరేషన్ పూర్తయ్యిందా ! మా అల్లుడు కులాసాగా ఉన్నాడా ?” అని డాక్టర్ని అడుగుతుంది. అప్పుడు డాక్టరు “ఏమల్లుడు ? నా మొఖం అల్లుడు” అంటాడు. అప్పుడు అత్తగారు గుండెలు బాదుకొని, “అయ్యో అయిపోయిందా, అయ్యో నా తల్లీ ! ఓ నా కూతురా ! చిన్నతనంలోనే నీకీ…..” అంటూ ఏడుస్తుంది.

“ఛా. ఛా ! ఊరుకోండి. మీ అల్లుడు నిక్షేపంలా ఉన్నాడు” అని డాక్టరు ఆవిడను మందలిస్తాడు.

ఈ హాస్య ఘట్టం నాకు ఎంతగానో నచ్చింది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

ప్రశ్న 3.
హద్దులు – హద్దులు నాటిక ద్వారా రచయిత ఇచ్చిన సందేశాన్ని వివరంగా చర్చించండి.
జవాబు:
దేనికైనా హద్దులుండాలని రచయిత ఈ నాటకం ద్వారా సందేశమిచ్చారు.

పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు గదా అని, అతిగా ఫలహారాలూ, పిండివంటలూ, చిరుతిళ్ళు పెడితే, అవి తిన్నవారికి రోగం వస్తుందని ఈ నాటిక సందేశం ఇస్తోంది. బావమరిది బావగారిని వేళాకోళం చేయడం సహజం. కానీ అల్లరి అతిగా ఉండరాదని ఈ నాటిక సందేశం ఇచ్చింది. “అల్లం రసం పట్టే సందే ఉంటే, మరి రెండు బొబ్బట్లు బావగారు లాగించేసే వార”ని మరిది అతిగా వేళాకోళం చేశాడు.

అల్లుడు అజీర్ణం చేసి, గిలగిలలాడుతూ ఉంటే, డాక్టరు దగ్గరకు వెళ్ళడానికి ఖర్చు అవుతుందని మామగారు వెనకాడతాడు. ఆలస్యానికి హద్దులుండరాదని ఈ ఘట్టం చెపుతోంది.

అల్లుడికి అజీర్ణం చేయడానికి నీవే కారణం అని మామగారూ, మీరే కారణం అని అత్తగారూ డాక్టరు దగ్గరే పోట్లాటకు దిగారు. పోట్లాటకు హద్దులుండాలి అని ఈ నాటిక సూచిస్తోంది.

డాక్టరు ఆపరేషనుకు ఫీజు వేయి రూపాయలు కావాలన్నాడు. ఫీజుకు హద్దులుండాలని ఈ నాటిక తెలుపుతోంది. అల్లుళ్ళు అత్తవారింట్లో అతి చనువుగా ఉండరాదనీ, మరీ ముంగిగా కూడా ఉండరాదనీ ఈ నాటిక తెలిపింది.

రచయిత ఈ నాటకం ద్వారా తినడానికి హద్దులు, నవ్వడానికి హద్దులు, ఆలస్యానికి హద్దులు, తొందరకు హద్దులు, చాదస్తానికి హద్దులు, అల్లరికి హద్దులు, పిసినారితనానికి హద్దులు, ఖర్చుకు హద్దులు ….. మొత్తానికి అన్నింటికీ హద్దులుండాలని సందేశమిచ్చారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 11 భూదానం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 11th Lesson భూదానం

8th Class Telugu 11th Lesson భూదానం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో గాంధీజీ, ఆయన అనుచరులూ, కాంగ్రెసు సేవాదళ్ కార్యకర్తలూ ఉన్నారు. వారు పాదయాత్ర చేస్తున్నారు.

ప్రశ్న 2.
వీళ్ళు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు?
జవాబు:
వీళ్ళు పార్టీ కార్యక్రమాలను ప్రజలలో ప్రచారం చేయడానికి, ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోవడానికి, పాదయాత్ర చేస్తున్నారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

ప్రశ్న 3.
ఇలా పాదయాత్రలు చేసినవారు మీకు తెలుసా? చెప్పండి.
జవాబు:
గాంధీజీ, వినోబా భావే, వంటి నాయకులు పాదయాత్రలు చేశారు. వెనుక, శంకరాచార్యులు, మహావీరుడు, బుద్ధుడు, కబీరు, చైతన్యుడు, నామ్ దేవ్ వంటి గురువులు కూడా పాదయాత్రలు చేశారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
‘భూదానం’ అని పాఠం పేరును విన్నప్పుడు మీరేమి అనుకున్నారు?
జవాబు:
సామాన్యంగా పుణ్యం కోసం దానాలు చేస్తూ ఉంటారు. ఆ దానాల్లో దశదానాలు ముఖ్యం. ఆ పది దానాల్లో భూదానం ఒకటి. పెద్దలు చనిపోయినపుడు వారు స్వర్గానికి వెళ్ళడానికి బ్రాహ్మణులకు భూమిని దానం చేస్తారు. లేదా లక్షవర్తి వ్రతం, ఋషి పంచమీ వ్రతం వంటివి చేసినపుడు, పుణ్యం కోసం భూదానం చేస్తారు. ఈ విధంగా ఎవరో పుణ్యాత్ములు, భూదానం చేశారని భూదానం మాట విన్నప్పుడు అనుకున్నాను.

ప్రశ్న 2.
ఈ పాఠం ద్వారా మీరు గ్రహించినదేమిటి?
జవాబు:
గాలి మీద, నీటి మీద, వెలుగు మీద ప్రజలందరికీ సమాన హక్కు ఉన్నట్లే, భూమి మీద కూడా అందరికీ సమాన హక్కు ఉన్నదని గ్రహించాను.

ప్రశ్న 3.
‘భూ సమస్య చాలా పెద్దది’ అని వినోబా అన్నారు కదా ! ఇలా ఎందుకు అని ఉంటారు ? ఇది ఈనాటి పరిస్థితులలో కూడా ఇలాగే ఉందా? దీని మీద మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
మనదేశంలో కొందరి దగ్గర అంగుళం భూమి కూడా లేదు. కొందరి దగ్గర వందలాది వేలాది ఎకరాల భూమి ఉంది. భూమి కలవారు తక్కువ. లేని వారు ఎక్కువ. అందువల్ల భూ సమస్య చాల పెద్దది అని వినోబా అన్నారు.

ఈనాడు మనదేశంలో భూసంస్కరణలు అమలయ్యాయి. అందువల్ల ప్రతి వ్యక్తి వద్ద కూడా 28 ఎకరాల పల్లం భూమి, లేక 50 ఎకరాల మెట్ట భూమి మించి ఉండరాదు. ఇప్పుడు కూడా భూ సమస్య ఉంది. ఇల్లు కట్టుకొనే చోటు లేక పేదలు బాధపడుతున్నారు. కొందరు నాయకులు అక్రమంగా సెజ్ ల పేరుతో వేల ఎకరాల భూమిని ఆక్రమిస్తున్నారు.

II. చదవడం – రాయడం

1. కింది వాక్యాలు చదవండి. ఆ వాక్యాలకు సమానభావం వచ్చే వాక్యాన్ని గుర్తించండి.

అ) పల్లె పట్టణాల ప్రజల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది. పల్లెల్లో ఆప్యాయతతో కూడిన ప్రత్యేక విశేషం కనబడింది.
అ) పల్లె పట్టణాల ప్రజల్లో ప్రత్యేక విశేషం ఉంది. (✗)
ఆ) పల్లె ప్రజల కంటే, పట్టణాల ప్రజల్లో ఎక్కువ విశేషం ఉంది. (✗)
ఇ) పల్లె ప్రజల్లో పట్టణ ప్రజల కంటే తక్కువ విశేషం కనబడింది. (✗)
ఈ) ఆప్యాయత అనే ప్రత్యేక విశేషం, పల్లె ప్రజల్లో ఎక్కువగా కనబడింది. (✓)

ఆ) వినోబాకు తెలుగు వచ్చు. కానీ తెలుగులో మాట్లాడలేరు. అయినా వచ్చిన తెలుగు భాష వల్ల ఎంతో ప్రయోజనం కలిగింది.

అ) వినోబాకు తెలుగు వచ్చు. కానీ సరిగా మాట్లాడలేరు. (✓)
ఆ) వినోబాకు తెలుగు రాదు. కాబట్టి అసలే మాట్లాడలేరు. (✗)
ఇ) వినోబాకు తెలుగు బాగా వచ్చు, బాగా మాట్లాడగలరు. (✗)
ఈ) వినోబాకు తెలుగు బాగా రాదు. కానీ ఎంతో కొంత మాట్లాడగలరు. (✗)

ఇ) శివరాంపల్లి వెళ్ళవలసిన అవసరం లేకపోతే తోవలో కొద్ది రోజులపాటు ఉండవలసిన గ్రామాలు అనేకం తగిలాయి.
అ) శివరాంపల్లికి తప్పకుండా వెళ్ళాలి కాబట్టి తోవలోని గ్రామంలో ఉండవలసిన అవసరం ఉన్నా ఉండకుండా వెళ్ళారు. ( ✓)
ఆ) శివరాంపల్లికి వెళ్ళవలసిన అవసరం లేదు. అందుకే తోవలోని గ్రామాల్లో ఉండకుండా వెళ్ళారు. (✗)
ఇ) శివరాంపల్లికి వెళ్ళారు. తోవలోని గ్రామాల్లో కూడా కొద్దిరోజులు ఉండి వెళ్ళారు. (✗)
ఈ) శివరాంపల్లికి వెళ్ళడం కంటే ఇతర గ్రామాల్లో ఉండడం ఎక్కువ అవసరం. (✗)

ఈ) “మాకు కొద్దిగా భూమి దొరికితే, కష్టపడి పని చేసుకుంటాం; కష్టార్జితం తింటాం”.
అ) కష్టపడి పనిచేయడానికి భూమి ఉంటే, మేము మా కష్టార్జితం తింటాం. (✓)
ఆ) భూమి లేదు కాబట్టి, మేము కష్టపడి కష్టార్జితం తింటున్నాం. (✗)
ఇ) మాకు కొద్దిగా భూమి దొరికితే కష్టపడకుండా తినవచ్చు. (✗)
ఈ) మాకు భూమి ఉన్నది కాబట్టి కష్టార్జితం తినవలసిన పనిలేదు. (✗)

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. పాఠంలోని కింది పేరాలు చదవండి. ఆ పేరాలోని ముఖ్యమైన పదం / పదాలు కింద గీత గీయండి. అవి ఎందుకు ముఖ్యమైనవో రాయండి.
1వ పేరా, 3వ పేరా, 6వ పేరా, 7వ పేరా, 13వ పేరా, చివరి పేరా

పేరా పేరా లో ముఖ్యమైన పదం/పదాలు ఎందుకు ముఖ్యమో రాయడం
1వ పేరా పాదయాత్ర పాదయాత్ర వల్ల ప్రజలను, ప్రకృతిని దగ్గరగా చూడవచ్చు.
3వ పేరా పాదయాత్రే తగిన యాత్రా సాధనం పాదయాత్రలో తిరిగేటప్పుడు ప్రతి మాట నిండు హృదయంతో, ఎంతో విశ్వాసంతో చెప్పగలిగే వారు. అవసరమైన నిబ్బరం, ఆత్మవిశ్వాసం భావే గారికి కలిగాయి.
6వ పేరా ప్రజలు ప్రేమతో భూమిని ఇవ్వగలరు. ప్రేమతో 100 ఎకరాలు వెదిరె రామచంద్రారెడ్డి భూదానం చేయడం వల్ల.
7వ పేరా ఏ సమస్యనైనా అహింసా విధానంలో పరిష్కరింపవచ్చు. వినోబా భావే సాధించిన భూదాన విజయము నెహ్రూజీ అభినందనలను అందుకొంది.
13వ పేరా ఏడాదిలో లక్ష ఎకరాల భూదానం ప్రతి సభలో ప్రజలు భూదానం చేయడం వల్ల.
చివరి పేరా దేవుడు కల్పవృక్షం వంటివాడు భగవంతుడే భూదాన రూపంలో సాక్షాత్కరించాడని భావే గారి తలంపు.

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) వినోబా శివరాంపల్లికి ఎలా వెళదామనుకున్నారు? ఎందుకు?
జవాబు:
వినోబా శివరాంపల్లికి పాదయాత్ర ద్వారా వెళ్ళాలనుకున్నారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రకృతినీ, ప్రజలనూ, మిక్కిలి దగ్గరగా చూడవచ్చు. అందుకే వినోబా పాదయాత్ర ద్వారా శివరాంపల్లి వెళ్ళాలనుకున్నారు.

ఆ) వినోబాకు తెలుగు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందారు?
జవాబు:
వినోబాకు తెలుగు రావడం వల్ల, ప్రార్థన సభల్లో స్థితప్రజ్ఞుని లక్షణాలను గురించి తెలుగులో చెప్పేవారు. వినోబాగారి తెలుగుమాటలు ప్రజల హృదయాలకు హత్తుకొనేవి. మాట్లాడుతున్నవాడు తనవాడే, తన సోదరుడే అని, ప్రజలు ప్రేమతో ఆయనకు స్వాగతం పలికారు.

ఇ) వినోబా గ్రామాలకు వెళ్ళడం వల్ల ఏమి గ్రహించారు?
జవాబు:
వినోబా గ్రామాలకు వెళ్ళడం వల్ల, అక్కడ గ్రామంలో ఉన్న లోటుపాట్లు తెలుసుకోగలిగారు. అక్కడి సమస్యల్ని గ్రహించి వాటిని పరిష్కరించగలిగారు. ప్రతి గ్రామంలోనూ వినోబా భావే గారి ఉద్యమానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉండాలనీ, గ్రామస్థులతో సంబంధం ఏర్పడి ఉండాలనీ, అప్పుడు ఎన్నో గొప్ప కార్యాలను సాధించగలమని ఆయన గ్రహించారు.

ఈ) వినోబాకు పోచంపల్లిలో ఎలాంటి అనుభవం ఎదురైంది?
జవాబు:
వినోబా భావే పోచంపల్లి గ్రామం వెళ్ళారు. ఆ గ్రామ దళితులు వినోబాగార్ని కలిసి, తమకు కొద్దిగా భూమి దొరికితే కష్టపడి పనిచేసుకుంటాం, కష్టార్జితం తింటాం అని చెప్పారు. వారంతా సమష్టి వ్యవసాయం చేసుకోవడానికి అంగీకరిస్తే, వారికి పొలం ఇప్పిస్తాననీ, వారికి పొలం కావాలి అన్న అర్జీని ప్రభుత్వానికి పంపిస్తాననీ వినోబా చెప్పారు. ఇంతలో అదే సభలో వెదిరె రామచంద్రారెడ్డిగారు ఆ దళితులకు తాను వంద ఎకరాల భూమిని దానం ఇస్తానని వాగ్దానం చేశారు.

ఉ) వినోబా భూ సమస్యను ఎలా పరిష్కరించాలని భావించారు?
జవాబు:
పోచంపల్లిలో వినోబాగారికి గొప్ప అనుభవం కల్గింది. ప్రజలు ప్రేమతో భూమిని ఇవ్వగలరనే అనుభూతి ఆయనకు కలిగింది. భూ సమస్య విషయంలో కలిగిన ప్రత్యక్ష అనుభవాన్ని అర్థం చేసుకొంటే, భూ సమస్యకు పరిష్కారం సులభం అవుతుందని వినోబా గ్రహించారు. భూదానం చేయమని ప్రతి సభలోనూ ప్రజల ముందు ఆయన చేయి చాచారు. గాలిమీద, నీటిమీద, వెలుగుమీద అందరికి హక్కు ఉన్నట్లే, భూమిపై కూడా హక్కు అందరికీ ఉందని వినోబా ప్రజలకు చెప్పారు. భూదాన యజ్ఞం ద్వారా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని వారు భావించారు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) “పల్లెల్లో పట్టణాల కంటే ఆప్యాయతతో కూడిన ప్రత్యేక విశేషం కనబడింది,” అని వినోబా అన్నారు కదా ! పల్లెల్లోని ప్రత్యేక ఆప్యాయత అంటే ఏమై ఉంటుంది?
జవాబు:
పల్లెల్లో అతిథులకు ప్రేమగా స్వాగతం పలుకుతారు. వచ్చిన అతిథులకు అన్నపానీయములు అందిస్తారు. అందులోనూ తమ సమస్యల్ని అడిగి తెలుసుకొనే వినోబా వంటి సత్పురుషులను పల్లె ప్రజలు ప్రేమతో ఆదరంగా పిలిచి, వారికి ఉండడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. వారికి భోజన సదుపాయములు చేస్తారు. తమకు ఉన్న భూమిని దానం చేస్తారు. వినోబా వంటి వారి మాటలను ఆదరంగా వింటారు. ఇది చూచిన వినోబా, పల్లె ప్రజలలో ప్రత్యేక ఆప్యాయత ఉందని రాశారు.

ఆ) ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి భాషను నేర్చుకోవడం అవసరమా? ఎందువల్ల?
జవాబు:
మనము ఏదైనా ఇతర ప్రాంతాలకు, అక్కడ కొన్నిరోజులు ఉండి, అక్కడి ప్రజలతో పనిచేయవలసిన పరిస్థితి ఉంటే మనము అక్కడి ప్రజల భాష తెలిసికోవలసిన అవసరం వస్తుంది. ఒక ప్రక్క రాష్ట్రానికి గానీ, ఒక విదేశానికి కానీ, చదువుకోసమో, ఉద్యోగం కోసమో వెళ్ళవలసివస్తే అక్కడి ప్రజల భాషను నేర్చుకోవడం తప్పనిసరి అవుతుంది.

ఇ) సమష్టి వ్యవసాయం అంటే ఏమిటి? ఈనాడు గ్రామాల్లో సమష్టి వ్యవసాయాలు జరగకపోవడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
‘సమష్టి వ్యవసాయం’ అంటే గ్రామంలో రైతులు అందరూ తమకు ఉన్న పొలాల్ని కలిసికట్టుగా శ్రమించి పండించడం. వారు వచ్చిన ఫలసాయాన్ని, వారికి ఉన్న పొలాలను బట్టి పంచుకుంటారు. వ్యవసాయానికి పెట్టుబడులు అందరూ కలిసి పెడతారు. లాభనష్టాల్ని సమంగా పంచుకుంటారు.

ఈనాడు గ్రామాల్లో ప్రజలు బీదలు, ధనికులుగా, కులాలు మతాలుగా విడిపోయారు. గ్రామాల్లో అందరికీ వ్యవసాయ భూములు లేవు. అందరూ సమానంగా పెట్టుబడులు పెట్టలేరు. ప్రజలు గ్రామాల్లో ఐకమత్యంగా లేరు. అందువల్ల గ్రామాల్లో సమష్టి వ్యవసాయం నేడు సాగడం లేదు.

ఈ) బీదలకు ఉపకారం చేశామని దాతలు భావించకూడదని వినోబా చెప్పారు కదా ! ఆయన ఎందుకని అలా అని ఉంటారు?
జవాబు:
బీదవాళ్ళకు ఉపకారం చేశామని భూదానం చేసిన దాతలు అనుకుంటే, అది అహంకారం అవుతుంది. దానివల్ల వినోబా ఆశించిన ఫలితం సిద్ధించదు. గాలిమీద, నీటి మీద, వెలుగు మీద ప్రజలందరికీ హక్కు ఉన్నట్లే, భూమి మీద కూడా అందరికీ హక్కు ఉన్నదని ప్రజలు భావించాలి. కొందరి దగ్గర అంగుళం భూమిసైతం లేకపోవడం, మరికొందరి దగ్గర వేలాది ఎకరాలు ఉండడం సబబు కాదు. కాబట్టి దాతలు ఉపకారం చేశామని కాకుండా, ప్రజలందరికీ భూమిపై హక్కు ఉందని గ్రహించి భూదానం చేయాలి.

ఉ) పేదలకు, భూమికి ఉండే సంబంధం తల్లికి, బిడ్డలకు ఉన్న సంబంధం వంటిది అని వినోబా అన్నారు కదా ! అది సరైందేనా? ఎందుకు?
జవాబు:
పేదవారికి భూమిని ఇప్పించడమే వినోబాగారి పాదయాత్రలో ప్రధానమైన ఉద్దేశ్యం. ప్రజలలో భూదానం చేయాలన్న ప్రవృత్తిని మేల్కొల్పాలని వినోబా భావించారు. భూమి తల్లి వంటిది. కాగా ప్రజలు ఆ భూమికి బిడ్డలవంటివారు. ప్రజలు తల్లి వంటి భూమిని దున్ని పంటలు పండిస్తారు – అంటే తల్లి వంటి భూమి, తనకు పిల్లల వంటి ప్రజలకు, ఫలసాయాన్ని అందిస్తుంది. కాబట్టి పేదలకూ, భూమికీ గల సంబంధం, తల్లీ బిడ్డల సంబంధం వంటిది అని వినోబా భావించారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) వినోబా గురించి 10 వాక్యాలలో వ్యాసం రాయండి.
(లేదా)
భూదానోద్యమాన్ని విజయవంతంగా వినోబాభావే నడిపిన విధము రాయండి.
జవాబు:
వినోబా భావే గాంధీగారి ముఖ్య శిష్యుడు. గొప్ప సర్వోదయ నాయకుడు. వార్దాలో ఉండేవాడు. 1951లో హైదరాబాదు దగ్గరలో ఉన్న “శివరాంపల్లి” లో సర్వోదయ సమ్మేళనం జరిగింది. ప్రజలను దగ్గరగా చూడవచ్చని, వార్ధా నుండి వినోబా పాదయాత్రలో శివరాంపల్లి వెడుతున్నారు. 1951 ఏప్రిల్ 8వ తేదీన, వినోబా ‘పోచంపల్లి’ గ్రామం వచ్చారు. ఆ గ్రామ దళితులు తమకు కొంచెం భూమి దొరికితే కష్టార్జితంతో తింటాం భూమి ఇప్పించండి అని వినోబాను అడిగారు. వారు సమష్టి వ్యవసాయం చేసుకొని జీవిస్తామంటే, భూమిని ఇప్పిస్తాననీ, అర్జీ పెట్టమనీ, వినోబా వారికి చెప్పారు.

ఇంతలో ఆ ఊరి పెద్ద రైతు వెదిరె రామచంద్రారెడ్డి ఆ దళితులకు తాను వంద ఎకరాల భూమిని దానం చేస్తానన్నాడు. ప్రజలు ప్రేమతో భూమిని దానం ఇస్తారని వినోబాకు అనుభవం అయ్యింది. వినోబా పేదలకు భూమిని ఇప్పించడం కోసం, పాదయాత్ర చేశారు. ఒక ఏడాదిలో లక్ష ఎకరాల భూమి దానంగా వచ్చింది. వినోబా భూదాన యజ్ఞం ఫలించింది. గాలి, నీరు, వెలుగు వలె భూమి కూడా ప్రజలందరి హక్కు అని వినోబా నమ్మకం.

ఆ) కొందరికి అసలే భూమి లేకపోవడం, మరికొందరికి వందల ఎకరాల భూమి ఉండడం అనే పరిస్థితి నేడు కూడా ఉంది కదా! ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మీరు సూచించే పరిష్కార మార్గాలు ఏమిటి?
జవాబు:
నేటికీ మన ప్రజలలో కొందరికి అంగుళం కూడా భూమి లేదు. కాగా కొందరికి వందలు, వేల ఎకరాల భూమి ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మన ప్రభుత్వాలు భూసంస్కరణలు తెచ్చాయి. ఏ వ్యక్తికీ పల్లం భూమి 28 ఎకరాలు, మెట్టభూమి అయితే 50 ఎకరాలు మించి ఉండకూడదని చట్టం ఉంది. ఎక్కువగా పొలం ఉన్నవారి నుండి సర్కారు తీసుకొని, పేదలకు పంచింది.

కాని ఈ పని సక్రమంగా జరగలేదు. ప్రజలలో కొందరు తమవద్ద ఎక్కువగా ఉన్న పొలాలను ఎవరో కావలసిన వారి పేరున రాసి, బినామీ ఆస్తులుగా తమవద్దనే వాటిని ఉంచుకున్నారు. అదీగాక నేడు పరిశ్రమల స్థాపన పేరుతో, విమానాశ్రయాలు, ఓడరేవులు పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూముల్ని ప్రభుత్వ పెద్దల పలుకుబడితో కొందరు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వము భూసంస్కరణలను నియమబద్ధంగా, న్యాయంగా అమలు జరిపిస్తే, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

IV. పదజాలం

1. పాఠం ఆధారంగా కింది పదాల అర్థాలు తెలుసుకోండి. వీటిని సొంతవార్యాలలో రాయండి.

అ) “కష్టార్జితం” :
కష్టార్జితం అంటే కష్టపడి సంపాదించడం. తానే కష్టపడి పనిచేసి డబ్బునూ, భూమినీ సంపాదిస్తే, దాన్ని కష్టార్జితం అంటారు. తల్లిదండ్రుల వల్ల, తాత ముత్తాతల వల్ల ఆస్తులు సంక్రమిస్తే, దాన్ని “పిత్రార్జితం” అంటారు.

ఆ) “నిండు హృదయం” :
‘నిండు హృదయం’ అంటే మనశ్శుద్ధిగా అని భావం. తన మనస్సుకు పూర్తిగా అంగీకారం అయిన విషయం .

ఇ) “అసాధారణ ఘట్టం” :
సాధారణంగా జరిగే సంగతి కానిది. ఇటువంటి సంఘటన అరుదుగా జరుగుతుంది. అరుదైన సంఘటన అని భావం.

ఈ) “హృదయశుద్ధి” :
నిర్మలమైన మనస్సుతో చేసే పని. ఏదో తప్పని పరిస్థితులలో ఎదుటివారినీ నమ్మించడానికి కాకుండా, నిండు మనస్సుతో పవిత్రమైన బుద్ధితో చేయడం.

ఉ) “జీవన పరివర్తనం” :
బ్రతుకు విధానంలో మార్పు. అప్పటివరకు సాగించే బ్రతుకు విధానంలో మార్పు రావడాన్ని ‘జీవన పరివర్తనం’ – అంటారు.

ఊ) “సమాజ పరివర్తనం” :
మన చుట్టూ ఉంటే సంఘాన్ని ‘సమాజం’ అంటారు. నాటి వరకు నడచుకొనే మార్గం నుండి కొత్త విధానంలోకి సంఘ ప్రజలు మారడాన్ని “సమాజ పరివర్తనం” అంటారు.

ఎ) “సత్కార్యాలు” :
మంచిపనులు. సంఘంలోని ప్రజల మంచికోసం చేసే పనులు సత్కార్యాలు. దానధర్మాలు చేయడం, భూదానం, నేత్రదానం, అవయవదానం వంటి మంచి పనులను సత్కార్యాలు అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. కింది పదాలకు పర్యాయపదాలు రాసి సొంతవాక్యాలు రాయండి.
అ) రాత్రి = నిశి, రేయి రాత్రిపూట చంద్రుడు ఉదయిస్తాడు.
ఆ) పల్లె = గ్రామం, జనపదం పల్లెలు ప్రగతికి పట్టుకోమ్మలు.
ఇ) హృదయం= ఎద, మనసు హృదయం నిర్మలంగా ఉండాలి.
ఈ) భూమి = వసుధ, ధరణి భూమిపై శాంతి నెలకోవాలి.
ఉ) ఆకాంక్ష = కోరిక, వాంఛ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలి.

3. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) పాపము = దుష్కృతం, పావడం
ఆ) ప్రజలు – జనులు, సంతానము
ఇ) ధనము = సంపద, ఆవులమంద
ఈ) యుగము = కృతాదియుగం, రెండు
ఉ) పొలం – కేదారము, అడవి
ఊ) వ్యవసాయం = కృషి, ప్రయత్నం, పరిశ్రమ

4. కింది వాక్యాలలో గీత గీచిన పదాలకు వికృతి పదాలు రాయండి.
అ) ప్రజలు ప్రేమతో భూమిని ఇస్తున్నారు.
ఆ) త్రిలింగ భాష మధురమైనది.
ఇ) మంచివారి హృదయంలో భగవంతుడుంటాడు.
ఈ) ఎవరి కార్యములను వారు సమర్థవంతంగా చెయ్యాలి.

ప్రకృతి వికృతి

ప్రజలు – పజలు
ప్రేమ – ప్రేముడి
భాష – బాస
త్రిలింగం – తెలుగు
హృదయం – ఎద, డెందము
కార్యం – కర్జము

V. సృజనాత్మకత

ప్రశ్న 1.
నువ్వే వినోబా స్థానంలో ఉంటే, నేటి పరిస్థితుల్లో ప్రజలకు ఏమని సందేశం ఇస్తావు ? దాన్ని రాసి ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
“ఏకపాత్రాభినయం”

నేను గాంధీగారి శిష్యుణ్ణి. నా పేరు వినోబా భావే. నా పేరు ఈ పాటికే మీ చెవిన పడి ఉంటుంది. నేను భూదాన యజ్ఞం ప్రారంభించాను. ఈ యజ్ఞంలో మొదటి దానం చేసిన పుణ్యాత్ముడు పోచంపల్లిలో రామచంద్రారెడ్డి. ఆ దానకర్ణుడు తన గ్రామంలో దళితులకు 100 ఎకరాలు భూదానం చేశాడు. మనం తల్లికి పుట్టినప్పుడు, మన వెంట ఏమీ తీసుకురాలేదు. పోయినప్పుడు పూచికపుల్ల కూడా పట్టుకెళ్ళలేము.

మన తోటి సోదరులు బీదవారు, ఇల్లు కట్టుకోవడానికి కూడా జాగా లేక ఏడుస్తున్నారు. దాతలారా ! వారి కన్నీరు తుడవండి. భూదాన యజ్ఞంలో మీ వంతుగా ఒక సమిధ వేసి, పుణ్యం సంపాదించండి. మీకు గాంధీజీ ఆశీస్సులు ఉంటాయి. కదలండి. వస్తా …

(లేదా)

ప్రశ్న 2.
ఈనాటి పరిస్థితులకునుగుణంగా భూదానం ఆవశ్యకతను వివరిస్తూ ఒక పోస్టరును తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
పోస్టరు

“మిత్రులారా ! భూదానం అన్ని దానాల్లో గొప్పదానం. భూదానం చేసేవారికి స్వర్గాది పుణ్యలోకాలు వస్తాయి. మీ తోడిజనంలో కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి చోటులేక, కూరగాయలు పండించడానికి జాగాలేక, వ్యవసాయం చేయడానికి పొలం లేక బాధపడుతున్నారు. మీకు వ్యవసాయ కూలీలు దొరకడం లేదు.

మనం గాలి, నీరు, వెలుగు సమంగా అనుభవిస్తున్నాం. అలాగే భూమి కూడా ప్రజలందరిది. మీకున్న వంద ఎకరాలలో రెండు ఎకరాలు తక్కువైతే, మీ వారికి లోటు రాదు. కానీ ఆ రెండు ఎకరాలు మీరు దానం ఇస్తే, 100 మంది దరిద్ర నారాయణులు ఇళ్ళు కట్టుకుంటారు. కలకాలం మీ పేరు చెప్పుకుంటారు. మీకు స్వర్గం వస్తుంది.

ఎకరం పైగా దానం చేసిన రైతులకు ముఖ్యమంత్రి గారు స్వయంగా సత్కారం చేస్తారు. త్వరపడండి. భూదానం చేయండి. పుణ్యం మూట కట్టుకోండి. పత్రికల్లో మీ పేరు, మీ ఫొటోతో వేస్తారు. మరువకండి.

ఇట్లు,
భూదాన యజ్ఞం సభ్యులు.

VI. ప్రశంస

1. భూదానం అనేది ఒక సత్కార్యం. ఇలాంటివే ఇంకా ఏ ఏ సత్కార్యాలు చేయవచ్చు ? ఇలాంటి సత్కార్యాలు చేసిన వారిని అభినందిస్తూ లేఖ రాసి ప్రదర్శించండి.
జవాబు:
భూదానం ఒక మంచిపని. భూదానం లాగానే విద్యాదానం, నేత్రదానం, కిడ్నీదానం, అవయవదానం, పాఠశాలలకు కావలసిన ఫర్నిచరు దానం, పేద విద్యార్థులకు పుస్తకదానం, పేద విద్యార్థులకు ఫీజులకు ధన దానం, మెరిట్ విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం, మంచి క్రీడాకారులకు షీల్డులు ఇవ్వడం వంటివి చేయవచ్చు.

సత్కార్యాలను చేసిన వారిని అభినందిస్తూ లేఖ

విజయవాడ,
x x x x x

పి. సుధీర్ కుమార్,
8వ తరగతి,
S/o రాజేంద్ర కుమార్,
శాంతి హైస్కూలు,
గవర్నరుపేట, విజయవాడ.

పూజ్యశ్రీ కె. గుణశేఖర్ గార్కి,

అయ్యా, నమస్తే. మీరు మీ ‘బంటుమిల్లి’ గ్రామంలో, దళితులకు ఇండ్లు కట్టుకోవడానికి మూడు ఎకరాల పొలం ఇచ్చారట. మీ ఊరి హైస్కూలు పిల్లలకు ఉచితంగా నోటుపుస్తకాలు, పెన్నులు ఇచ్చారట. మీ తదనంతరం మీ నేత్రాలను నేత్రదానం చేశారట. మేము పేపరులో చదివాం. మీరు చేసిన ఈ దానాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయి.

మీకూ, మీ దానగుణానికీ, మా పాఠశాల విద్యార్థుల తరఫున అభినందనలు. నమస్కారాలు. సెలవు.

ఇట్లు,
మీ అభిమాని,
పి. సుధీర్.

చిరునామా :
K. గుణశేఖర్,
S/o ల్యాండ్ లార్డ్,
బంటుమిల్లి,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్.

(లేదా)

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. వినోబా భూదాన ఉద్యమం కోసం చేసిన పాదయాత్రను అభినందిస్తూ, ఆయనకు ఏమని లేఖ రాస్తారు? రాసి గోడ పత్రికలో ప్రదర్శించండి.
జవాబు:

వినోబాభావే గారికి అభినందన లేఖ

గుంటూరు,
x x x x x

పి. సీతాలక్ష్మి,
8వ తరగతి,
వివేకానంద హైస్కూల్,
రాజేంద్రనగర్,
గుంటూరు.

పూజ్యశ్రీ వినోబా భావే మహాశయులకు,

నమస్కారములు. మీరు మా నగరానికి దగ్గరలో గల పోచంపల్లిలో రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన వంద ఎకరాల భూదానంతో ప్రేరణ పొంది, భారతదేశంలో భూదాన యజ్ఞం ప్రారంభించారనీ, బీదలకు లక్షల ఎకరాలు భూమిని ఇప్పించారనీ మా మాష్టారు చెప్పారు. నేను మీ ఉద్యమాన్ని, యజ్ఞాన్ని గూర్చి తెలుసుకొని మురిసిపోయాను.

మీకు శతకోటి నమస్కారాలు. ప్రజలలో భూదానం చేయాలనే ప్రేరణ కల్గించిన మీకు, మా పాఠశాల విద్యార్థుల తరఫున అభినందన మందారాలు. నమస్తే.

ఇట్లు,
మీ అభిమాని,
కుమారి పి. సీతాలక్ష్మి,
8వ తరగతి,
సెక్షను-‘ఎ’.

చిరునామా :
వినోబా భావే ఆశ్రమ సంచాలకులకు,
వార్థా,
మహారాష్ట్ర.

ప్రాజెక్టు పని

1. పోచంపల్లిలో రామచంద్రారెడ్డిగారు వినోబా భావే ప్రసంగానికి ప్రేరణపొంది ఒకేసారి వంద ఎకరాలను దానం చేశారు కదా! అలా మీ ఊరిలోనూ పేరు పొందిన దాతలు కొందరు ఉంటారు కదా ! వాళ్ళ పేర్లను సేకరించి ఎవరు ఏ రకమయిన దానం చేశారో తెలియజేసే వివరాలను రాసి గోడపత్రికలో పెట్టండి.
జవాబు:
కొవ్వూరు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో రెవెన్యూ డివిజన్ కేంద్రము. కొవ్వూరు గ్రామం గోదావరీ నదికి పశ్చిమతీరాన ఉంది.

మా గ్రామంలో ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠము అనే సంస్కృతాంధ్ర కళాశాల ఉంది. దానికి ప్రిన్సిపాలుగా కీ|| శే|| కేశిరాజు వేంకట నృసింహ అప్పారావుగారు ఉండేవారు. వారు గాంధీ మార్గంలో నడిచిన దేశభక్తులు. వినోబా భావే గారి పిలుపుతో ప్రేరణ పొంది, వీరికున్న నాలుగు ఎకరాల పంటభూమిని భూదానం చేశారు. వారు కేవలం ఖద్దరు ధరించేవారు. వీరికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయన మా గ్రామవాసి అని తెలిసి నేను ఆనందిస్తున్నాను.

పి. శకుంతల, యన్. శ్రీధర్
గవర్నమెంటు హైస్కూలు,
కొవ్వూరు, ప|| గో|| జిల్లా,

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను విడదీయండి. సంధి పేరు రాయండి.
అ) సర్వోదయం = సర్వ + ఉదయం – గుణసంధి
ఆ) ఊహాతీతం = ఊహ + అతీతం – సవర్ణదీర్ఘ సంధి
ఇ) ఆయాచోట్ల = ఆ + ఆచోట్ల – యడాగమ సంధి
ఈ) తేవాలని = తేవాలి + అని – ఇత్వసంధి
ఉ) మరొకటి = మరి + ఒకటి – ఇత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు, సమాస నామాలు రాయండి.
అ) పాదయాత్ర – పాదములతో యాత్ర – తృతీయా తత్పురుష
ఆ) పల్లె ప్రజలు – పల్లె యందలి ప్రజలు – సప్తమీ తత్పురుష
ఇ) వంద ఎకరాలు – వంద సంఖ్యగల ఎకరాలు – ద్విగు సమాసం
ఈ) నా గ్రంథం – నా యొక్క గ్రంథం – షష్ఠీ తత్పురుష సమాసం

3. కింది వానిలో కర్తరి వాక్యం కర్మణి వాక్యంగా, కర్మణి వాక్యం కర్తరి వాక్యంగా మార్చండి.
అ) నెహ్రూ తన జాబులో సంతోషాన్ని వ్యక్తం చేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
నెహ్రూ చేత తన జాబులో సంతోషం వ్యక్తము చేయబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
ఆయనకు సమాధానం రాసి పంపారు. (కర్తరి వాక్యం)

ఇ) భగవంతుడు నా మాటలకు శక్తిని ప్రసాదించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
భగవంతుని చేత నా మాటలకు శక్తి ప్రసాదింపబడింది. (కర్మణి వాక్యం)

ఈ) నాచే దీనికి భూదానయజ్ఞం అని పేరు పెట్టబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను దీనికి భూదానయజ్ఞం అని పేరు పెట్టాను. (కర్తరి వాక్యం)

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

ఇల్లు : గృహం, సదనం
హృదయం : ఎద, మనసు
వ్యవసాయం : కృషి, సేద్యము
అవసరం : ఆవశ్యకం, అక్కల
తోవ : దారి, పథము
నిర్ణయం : నిశ్చయం, సిద్ధాంతం

వ్యతిరేకపదాలు

రాత్రి × పగలు
సమిష్టి × వ్యష్టి
లక్ష్యం × అలక్ష్యం
శాంతి × అశాంతి
ప్రత్యక్షం × పరోక్షం
సుఖం × కష్టం
ప్రవృత్తి × అప్రవృత్తి
స్పష్టం × అస్పష్టం
న్యాయం × అన్యాయం
విశ్వాసం × అవిశ్వాసం
అంగీకారం × తిరస్కారం
సత్కార్యం × దుష్కార్యం
హింస × అహింస

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

ప్రకృతి – వికృతులు

దూరం – దవ్వు
శక్తి – సత్తి
రూపం – రూపు
హృదయం – ఎద, ఎడద
గుణము – గొనము
కార్యం – కర్జం
న్యాయం – నాయం
యాత్ర – జాతర
యజ్ఞము – జన్నము
సత్యం – సత్తు

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశమగును.
శంకరాచార్యులు = శంకర + ఆచార్యులు – సవర్ణదీర్ఘ సంధి
ఊహాతీతుడు = ఊహ + అతీతుడు – సవర్ణదీర్ఘ సంధి
కష్టార్జితం = కష్ట + ఆర్జితం – సవర్ణదీర్ఘ సంధి
ప్రత్యక్షానుభవం = ప్రత్యక్ష + అనుభవం – సవర్ణదీర్ఘ సంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
వందలాది = వందలు + ఆది – ఉత్వసంధి
సాధనమని = సాధనము + అని – ఉత్వసంధి
అవసరమైన : అవసరము + ఐన – ఉత్వసంధి

ఇత్వసంధి
సూత్రము : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
కావాలనుకొని = కావాలి + అనుకొని – ఇత్వసంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
హృదయ పరివర్తనము హృదయము నందు పరివర్తనము సప్తమీ తత్పురుష సమాసం
మూడు విధానాలు మూడు సంఖ్యగల విధానాలు ద్విగు సమాసం
భూసమస్య భూమి యొక్క సమస్య షష్ఠీ తత్పురుష సమాసం
లక్ష ఎకరాలు లక్ష సంఖ్యగల ఎకరాలు ద్విగు సమాసం
రెండుమాటలు రెండు సంఖ్యగల మాటలు ద్విగు సమాసం
యాత్రాసాధనము యాత్ర కొరకు సాధనము చతుర్థి తత్పురుష సమాసం
భూదానం భూమి యొక్క దానము షష్ఠీ తత్పురుష సమాసం
సత్కార్యము మంచిదైన కార్యము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
భూదాన యజ్ఞము భూదానమనెడి యజ్ఞము రూపక సమాసం
భూఖండము భూమి యొక్క ఖండము షష్ఠీ తత్పురుష సమాసం
శాంతియుతం శాంతితో యుతం తృతీయా తత్పురుష సమాసం
కష్టార్జితం కష్టముతో ఆర్జితం తృతీయా తత్పురుష సమాసం

కొత్త పదాలు-అర్ధాలు

అభిలషించు = కోరు
అవధులు = హద్దులు, మేరలు
అనుగ్రహించు = దయతో ఇచ్చు
అనుభూతి = ప్రత్యక్ష జ్ఞానము
అహంకారం = గర్వము
ఆత్మవిశ్వాసం = తనపై నమ్మకం
ఆటపట్టు = నిలయం, చోటు
ఆచరణ = నడవడి (చేయుట)
అర్జీ = పై అధికారులకు రాసే లేఖ.
ఈర్ష్య = ద్వేషం
ఊహాతీతం = ఊహింపశక్యం కానిది
ఔదార్యం = దాతృత్వము;
కష్టార్జితం = కష్టపడి సంపాదించినది
కుత్తుక = కంఠము
కృతనిశ్చయులు = నిశ్చయం చేసుకున్నవారు
చిత్తశుద్ధి = మనస్సు పరిశుద్ధి
జాబు = ఉత్తరము
టూకీగా = కొద్దిగా, సంగ్రహంగా
తార్కాణం = నిదర్శనము

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

తామస భావం = తమోగుణం
నిబ్బరం = స్థిరము, తదేకాగ్రత
నిక్షిప్తం = ఉంచబడినది
దళితులు = హరిజనులు
దర్శనం = చూచుట
పరిష్కరించు = చక్కబెట్టు
పరివర్తన – మార్పు
ప్రభంజనం = పెద్ద గాలి
బీజాలు = విత్తనాలు
మహత్కార్యం = గొప్ప పని
మహత్తర = గొప్ప
మాత్సర్యం = అసూయ
ముమ్మరంగా = అధికంగా
సమ్మేళనం = సమావేశం
యోచించడం = ఆలోచించడం
రాజస భావం = రజోగుణం
లోభం = దురాశ
వ్యక్తం = వెల్లడి
వాగ్దానం = మాట ఇచ్చుట
విడ్డూరం = మొండితనం
సుగమము = సులభముగా తెలియునది
సమష్టి వ్యవసాయం= అందరూ కలసి చేసే వ్యవసాయం
సమక్షం = ఎదుట
సాక్షాత్కారం = ప్రత్యక్షము
హత్తుకోవడం = చేరుకోవడం
హేతువు = కారణం
స్థిత ప్రజ్ఞులు = మనస్సులోని కోరికలను పూర్తిగా వదలి, నిర్మలమైన మనస్సుతో తృప్తి పొందేవారు ‘సిద్ధ ప్రజ్ఞులు’ అని భగవద్గీత చెబుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 10 సంస్కరణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 10th Lesson సంస్కరణ

8th Class Telugu 10th Lesson సంస్కరణ Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మొదటి చిత్రంలో ఉన్నవారు ఎవరు? ఆయన ఎలా ప్రసిద్ధులు?
జవాబు:
మొదటి చిత్రంలో ఉన్నది రాజారామ్మోహన్ రాయ్. ఆయన 1821 నాటివాడు. గొప్ప సంఘసంస్కర్త. ఆయన బ్రహ్మ సమాజమతాన్ని స్థాపించాడు. నాడు హిందూ సమాజంలో ఉన్న ‘సతి’ అనే దురాచారాన్ని నిర్మూలించడానికి, బాల్య వివాహాలను అరికట్టడానికి కృషిచేశాడు.

ప్రశ్న 2.
రెండో చిత్రంలో ఉన్నవారు ఎవరు? వారు ఎవరికోసం కృషి చేశారు?
జవాబు:
రెండో చిత్రంలో ఉన్నది కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఆయనకు “ఆంధ్రా రాజా రామమోహన రాయలు” అనే పేరు ఉంది. ఆయన గొప్ప సంఘసంస్కర్త. హితకారిణీ సమాజాన్ని స్థాపించారు. సాంఘిక దురాచార నిర్మూలనకు కృషిచేశారు. ఆయన స్త్రీ విద్యావ్యాప్తికి, వితంతు స్త్రీలకు పునర్వివాహాలు చేయించడానికి కృషి చేశారు.

ప్రశ్న 3.
సాంఘిక దురాచారాలు అంటే ఏమిటి?
జవాబు:
సంఘంలో ఉన్న చెడ్డ ఆచారాలను, సాంఘిక దురాచారాలు అంటారు. వరకట్నం, కన్యాశుల్కం, ‘సతి’ ఆచారం, వితంతు స్త్రీలను చిన్నచూపు చూడటం. స్త్రీ విద్య పనికిరాదనడం వంటివి సాంఘిక దురాచారాలు.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 4.
నేడు మన సమాజంలో ఏయే దురాచారాలు ఉన్నాయి?
జవాబు:
నేడు మన సమాజంలో వరకట్నం, బాల్యవివాహాలు, లంచగొండితనం, అంటరానితనం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం, వెట్టిచాకిరి, మతదురహంకారం వంటి దురాచారాలు ఉన్నాయి.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
మీరు గమనించిన దురాచారాలు, మూఢనమ్మకాలపై మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
దురాచారాలు :
సంఘంలో దురాచారాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అంటరానితనం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం, మూఢనమ్మకాలు, వరకట్నం, బాల్యవివాహాలు, వెట్టిచాకిరి, లంచగొండితనం, మతదురహంకారం వంటి దురాచారాలు సంఘంలో బాగా పేరుకుపోయాయి.

మూఢనమ్మకాలు :
దయ్యాలున్నాయని నమ్మడం, శకునాలు నమ్మడం, తాంత్రిక విద్యలపై నమ్మకం, అమావాస్య, చవితి వంటి తిథులు మంచివి కావనడం మొదలైన మూఢనమ్మకాలు కూడా సంఘంలో ప్రబలి ఉన్నాయి. నా

అభిప్రాయం :
ప్రజలలో చాలామంది నిరక్షరాస్యులు. వారిని సరిదిద్ది వారిలో గల దురాచారాల్ని మూఢనమ్మకాల్ని నిర్మూలించడంలో మనవంతు కృషి చేయాలి. సాంఘిక దురాచారాలను గురించి ప్రజలకు వివరించి చెప్పి వానిని ప్రజలు మానేటట్లు చేయడం మన కర్తవ్యం.

N.C.C., N.S.S., స్కౌటింగ్, రెడ్ క్రాస్ మొదలైన సంస్థల ద్వారా విద్యార్థులు ఈ సాంఘిక సేవలో పాలు పంచుకోవచ్చు. విద్యార్థులు తలచుకుంటే దేశంలోని ప్రజల దురాచారాలను, మూఢనమ్మకాలను సమూలంగా నిర్మూలించగలరని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
ప్రస్తుతం సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలు ఏవి? వాటి నిర్మూలనకు మీ వంతు కృషిగా ఏమి చేయాలను కుంటున్నారు?
జవాబు:
ప్రస్తుతం సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలలో కొన్ని :
1. వరకట్న దురాచారము
2. అవినీతి
3. బాలకార్మిక వ్యవస్థ

వరకట్న దురాచారం చాలా భిన్నమైన సమస్య. దీన్ని నిర్మూలించుటకు ప్రజలే సిద్ధంగా లేరు అని చెప్పవచ్చును. కట్నం తీసుకోకపోవటం అన్నది వరుని వైపు వారు చిన్నతనంగా భావించటం, కట్నం అవసరం లేదు అని వరునివైపువారు చెబితే వరునివైపు ఏవో లోపాలు ఉన్నట్లు వధువువైపు వారు అనుకోవటం జరుగుతున్నది. దీనినే నేను నా వంతు కృషిగా వరునివైపు వారికి, వధువువైపు వారికి అలాగే సమాజంలోని వారి అందరికి వరకట్న నిర్మూలన గురించి వివరంగా తెలియచేస్తాను. అలాగే నేను కూడా వరకట్నం తీసుకోను, వరకట్నం ఇవ్వను.

అవినీతి – ఇది ఇప్పుడు పెద్ద జటిల సమస్య. ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తున్నది. నావైపు కృషిగా ముందు నేను అవినీతిని చేయను. అలాగే నా చుట్టూ వున్న సమాజ సభ్యులు అందరినీ కాకపోయినా నా స్నేహితుల వరకైనా అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు కృషి చేస్తాను.

బాలకార్మికులు కూడా మనదేశంలో చాలామంది ఉన్నారు. నా స్నేహితుల సహాయంతో నేను వారిని ఆదుకుంటాను. అటువంటి వారిని గుర్తించి వారిని వెట్టిచాకిరి నుండి విడిపించి నావంతు కృషిగా పాఠశాలల్లో చేర్పిస్తాను.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 3.
“వరకట్న నిర్మూలన” కు రావలసిన మార్పులను “వరునివైపు – వధువువైపు” జట్లుగా విడిపోయి చర్చించండి.
జవాబు:

వరుడువైపు వాళ్ళు వధువువైపు వాళ్ళు
1) కట్నం తీసుకోవడమంటే బానిసలుగా అమ్ముడు పోవడమే అని మేం గ్రహిస్తాం. మీరు కూడా కట్నం ఇవ్వమని ఖచ్చితంగా చెప్పాలి. 1) అవును. మా తల్లిదండ్రులకు కట్నాలు ఇవ్వవద్దని చెపుతాం. సంతల్లో పశువుల్లా మగపిల్లల్ని బేరం పెట్టి అమ్మే తల్లిదండ్రులను మీరు వ్యతిరేకించండి.
2) వరునివైపు వారు కట్నం తీసుకోమని అంటే వారిలో ఏదో లోపం ఉందని ఆడపిల్లల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆ ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. 2) కొంతమంది అలానే ఆలోచిస్తున్నారు. తమ ఆడ పిల్లలకు కట్నం ఇవ్వలేక బాధపడే తల్లిదండ్రులు సైతం తమ మగపిల్లలకు కట్నాల కోసం పంతం పట్టడం దురదృష్టం.
3) వరకట్న నిషేధ చట్టం చేసి, ఏళ్ళు గడుస్తున్నా, ఏ మార్పు రాలేదు. వరకట్నం పుచ్చుకోవడం నేరమని మేము భావిస్తాం. 3) వరకట్నం ఇవ్వడం నేరమని మేము భావిస్తాం. వరకట్న బాధిత మహిళల గురించి రోజూ దినపత్రికల్లో చదువుతున్నాం, టీవీల్లో చూస్తున్నాం. వారిని హింసించేవారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి.
4) సృష్టిలో స్త్రీలు, పురుషులు ఇరువురికీ సమ ప్రాధాన్యముందని మా అభిప్రాయం. 4) అవును. తల్లిదండ్రులు ఈ విషయం గుర్తించి తమ ఆడపిల్లలకు కూడా తమ ఆస్తిలో వాటా కల్పించాలి. స్త్రీవిద్యను ప్రోత్సహించాలి.
5) మహిళా సంఘాలవాళ్ళు వరకట్న సమస్య విషయంలో అంత చైతన్యవంతంగా లేరనే చెప్పాలి. వారు వరకట్న నిర్మూలన కోసం ఉద్యమాలు చేయాలి. 5) అవును. పురుషులు కూడా వరకట్న వ్యతిరేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రచార, ప్రసార సాధనాలు తమ తోడ్పాటును అందించాలి.

II చదవడం, అవగాహన చేసుకోవడం

1. కింది పదాలు ఏ పేరాలోనివో గుర్తించి, ఆ పదాన్ని దేనికి సంబంధంగా వాడారో రాయండి.
జవాబు:

పదం పేరా సంఖ్య ఎందుకోసం వాడారు
పెనుభూతం 3 తరతరాలుగా మన సమాజాన్ని బాధిస్తున్న వరకట్న దురాచారం.
జటిలసమస్య 4 స్త్రీల అభ్యున్నతికి అవరోధంగా నిలిచిన రెండు ముఖ్య సమస్యలలో రెండవది, పరిష్కరించడానికి కష్టతరమైనది అయిన వరకట్న దురాచారం (మొదటిది విద్యావిహీనత).
రూపుమాపడం 2 బాల్యవివాహ దురాచారం.
పరిపాటి 8 వివాహ వేడుకల్లో మితిమీరి ధనవ్యయం చేయడం ఘనతగా పరిగణించడం.

2. కింది పేరాను చదవండి. ఎక్కడ?, ఏమిటి?, ఎందుకు?, ఎవరు?, ఎలా? అనే పదాలతో ప్రశ్నలు రాయండి.
వేమన జన్మించింది, తిరిగిందీ రాయలసీమే ఐనా ఆయన పద్యాలు, ఆయన సందేశం, ప్రభావం ఆంధ్రదేశము అంతా వుంది. వీరి పద్యాలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. వేమన సందేశానికి దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సమాజంలోని ఎక్కువ తక్కువలు, వివక్షలు, అంటరానితనం, అంధ విశ్వాసాలు, మూఢాచారాలు, జీవహింస, అవినీతి, అధర్మం మొదలైన విషయాలపై తన సరళమైన పద్యాల ద్వారా ప్రజల మనస్సులో హత్తుకుపోయేటట్లు విమర్శనాత్మక రచనలు చేశాడు. కులవ్యవస్థపై దాడి చేశాడు. స్వానుభవమైన, ఆచరణయోగ్యమైన తత్త్వాన్ని సరళభాషలో ప్రజలకు చెప్పి ప్రజాకవిగా తెలుగువారి మదిలో శాశ్వతస్థానం పొందారు.
ప్రశ్నలు :
1) వేమన ఎక్కడ జన్మించాడు?
2) వేమన ఎక్కడ తిరిగాడు?
3) వేమన పద్యాలూ, సందేశం ప్రభావం ఎక్కడ ఉంది?
4) ఆంధ్రదేశమంతా ఏమిటి ఉంది?
5) వేమన పద్యాలు ఎలా అనువాదమయ్యా యి?
6) వేమన సందేశానికి ఎక్కడెక్కడ గుర్తింపు వచ్చింది?
7) వేమన ఏ విషయాలపై రచనలు చేశాడు?
8) వేమన ఎలా విమర్శనాత్మక రచనలు చేశాడు?
9) వేమన దేనిపై దాడిచేశాడు?
10) కులవ్యవస్థపై దాడిచేసింది ఎవరు?
11) వేమన ఎందుకు విమర్శనాత్మక రచనలు చేశాడు?
12) వేమన పద్యాలు ఎలా ఉంటాయి?
13) వేమన ప్రజాకవి ఎలా అయ్యాడు?
14) వేమన ఎటువంటి తత్త్వాన్ని ప్రజలకు చెప్పాడు?
15) వేమన ఎవరి మదిలో శాశ్వత స్థానం పొందాడు?

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

3. కింది పట్టికను చూడండి. సదాచారం ఏదో, దురాచారం ఏదో గుర్తించండి. కారణం రాయండి.
జవాబు:

అంశం సదాచారం/దురాచారం
బాల్య వివాహాలు చేయడం దురాచారం
పెద్దలను గౌరవించడం సదాచారం
వరకట్నం తీసుకోవడం / ఇవ్వడం దురాచారం
తల్లిదండ్రులకు సేవచేయడం సదాచారం
వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం దురాచారం
స్త్రీ విద్యను ప్రోత్సహించడం సదాచారం
బడి ఈడు పిల్లలను పనుల్లో పెట్టడం దురాచారం
ఆడపిల్లలకు తొందరగా పెండ్లిండ్లు చేయడం దురాచారం
చిన్న పిల్లలను వసతి గృహాల్లో ఉంచి చదివించడం సదాచారం
తోటివారిని ఎవరినైనా సమానంగా చూడడం సదాచారం

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) శాసనాలు అమలు కావాలంటే ఏమి చేయాలని నండూరివారు అన్నారు?
జవాబు:
శాసనాలు చేసినంత మాత్రాన ఏ సాంఘిక సంస్కరణ ప్రయత్నమూ విజయవంతం కాబోదు. ఆ సాంఘిక సంస్కరణ యొక్క అవసరాన్ని ప్రజలు గుర్తించాలి. దానికి సంబంధించిన మానసిక చైతన్యం ప్రజలలో ప్రస్ఫుటించాలి. ప్రజల నుండి ఆ సంస్కరణకు, పూర్తి సహకారం రావాలని నండూరివారు అన్నారు.

ఆ) బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టడానికి ఏమేమి తోడ్పడతాయి?
జవాబు:
అతి బాల్యవివాహాలు ఈనాడు చెదురు మదురుగానే అక్కడక్కడ జరుగుతున్నాయి. నేడు అది ఒక పెద్ద సమస్యగా పరిగణించదగినంతగా జరగడం లేదు. ఈ పరిణామం సాధ్యం కావడానికి ప్రభుత్వం చేసిన ‘శారదా శాసనం’ ఒక్కటే కారణం అని అనుకోలేము. బాల్యవివాహాలు అనే దురాచారాన్ని రూపుమాపడానికి ఎందరో మహానుభావులూ సంఘసంస్కర్తలు, కృషి చేశారు. వారి కృషి ఫలితంగా, ప్రజలలో బాల్యవివాహాల పట్ల కలిగిన ఏవగింపు ఈ దురాచార నిర్మూలనకు ముఖ్య కారణం.

ఇ) వరకట్న దురాచారం గురించి రచయిత అభిప్రాయం ఏమిటి?
జవాబు:
వరకట్న దురాచారం నిర్మూలనానికి శాసనాలు ఉన్నప్పటికీ ఇది నిర్మూలన కాలేదు సరిగదా, నానాటికీ పెనుభూతంలా పెరిగిపోతోంది.

ఈ దురాచార నిర్మూలనకు ప్రజలు సిద్ధంగా లేరని, వరకట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం అన్నవి ప్రతిష్ఠకూ, సంఘంలో గౌరవానికి సంబంధించిన విషయాలుగా చెల్లుబాటు అవుతున్నాయని రచయిత అభిప్రాయం.

కట్నం అసలు తీసుకోకపోవడం, నలుగురిలో చిన్నతనంగా వరునివైపు వారు భావిస్తున్నారు. కట్నం తీసుకోని వరునిలో, ఏదో లోపం ఉండి ఉంటుందని, వధువువైపువారు సామాన్యంగా అనుకుంటున్నారు. ఎక్కువ కట్నం ఇవ్వడం, తీసుకోవడం గొప్పగా భావిస్తున్నారు.

వరకట్నం, వివాహంలో అధిక ధనవ్యయం చేయడం వంటి దురాచారాల నిర్మూలనకు, శాసనాలు అవసరమేకానీ, అంతకంటే ముఖ్యంగా వీటి పట్ల ఏహ్యభావాన్ని ప్రజల్లో కలిగించడం చాలా ముఖ్యమని, వీటి పట్ల యువతీయువకులు ఎదురు తిరిగేలా చేయాలని, కేవలం శాసనాలు దీన్ని సాధింపలేవని రచయిత అభిప్రాయపడ్డాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) నేడు పెళ్ళిళ్ళ సందర్భంగా ఎన్ని రకాలుగా ధనం వృథా అవుతుందో మీరు గమనించిన విషయాలు రాయండి.
జవాబు:
నేడు పెళ్ళిళ్ళ సందర్భంగా కొంతమంది ధనవంతులు వృథాగా ధనాన్ని ఖర్చుచేస్తున్నారు. అనవసర ఆడంబరాలకు పోయి విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. అలాగే మరికొంతమంది తమ తాహత్తుకు మించి, ఇతరులను చూచి (పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు) ధనాన్ని ఖర్చు పెడతారు. దానికి తమవద్ద ధనం లేక వడ్డీలకు తెచ్చి ఖర్చు పెడుతున్నారు. తరువాత వాటిని తీర్చలేక అప్పుల పాలవుతున్నారు.

ఆ) నేటికీ సమాజంలో ఏయే దురాచారాలు కనపడుతున్నాయి? దానికి కారణాలేమిటి?
(లేదా)
మన సంఘంలో ఉన్న దురాచారాలు తెలపండి.
జవాబు: నేటికీ వరకట్నాలు, మద్యపానం, క్లబ్బులు, పబ్బులు, అర్ధనగ్న నృత్యాలు, మత్తుమందులు, వగైరా దురాచారాలు సమాజంలో కనబడుతున్నాయి.

ముఖ్యంగా యువతీ యువకులు చదువులకూ, ఉద్యోగాలకూ గ్రామాలను వదలి, పట్టణాలకు వెడుతున్నారు. అక్కడ ప్రక్కవాళ్ళను చూసి, దురాచారాలు నేర్చుకుంటున్నారు. నాగరికత పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కట్నం తీసుకోని మగాణ్ణి అసమర్థునిగా సంఘం జమకడుతోంది. వరకట్నం తీసుకోకుండా, ఏ మగాడైనా ఆదర్శంగా పెళ్ళిచేసుకుంటే, అతణ్ణి వధువు తరపువారే ఏదో లోపం ఉన్నవాడిగా జమకడుతున్నారు. ఆడపిల్లలకు బాగా చదువు లేకపోడంతో కట్నాలు
ఇచ్చి పెళ్ళిళ్లు చేయవలసి వస్తోంది. ఆడపిల్లలకు ఆస్తిహక్కు లేకపోడంతో వరకట్నాలు అడుగుతున్నారు.

ఇ) దేశంలో వందశాతం అక్షరాస్యత ఇంకా సాధించలేకపోవడానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, బీదవారు కావడం వల్ల, వారికి చదువుపై ఆసక్తి లేకపోవడం వల్ల, పిల్లల్ని చదివించే ఆర్థికబలం లేకపోవడం వల్ల, పిల్లల్ని బడికి పంపడం లేదు.
  2. వయోజన పాఠశాలలు లేకపోవడం వల్ల చదువురాని పెద్దలు చదువుకోడం లేదు.
  3. చదువుకొనే వారికి హాస్టళ్ళలో భోజనం, ఉచిత పుస్తకాలు, దుస్తులు, పాఠశాలలకు వెళ్ళడానికి సైకిళ్ళు వగైరా ఇవ్వకపోడం వల్ల పిల్లలు చదవడం లేదు.
  4. గిరిజన ప్రాంతాల్లో, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ విద్య నేర్పే పాఠశాలలు లేవు.
  5. చదువుకొనే బాలబాలికలను కొందరు తల్లిదండ్రులు బాల్యంలోనే పనిలో పెడుతున్నారు. వారి చిన్నపాటి సంపాదనకు తల్లిదండ్రులు ఆశపడుతున్నారు.
  6. బాలకార్మికులవల్ల విద్యా శాతం పెరగడం లేదు.
  7. మన భారత ప్రభుత్వం భారతీయులనందరినీ అక్షరాస్యులను చేయాలనీ, నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలనీ తీర్మానించింది. మన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాస్యతను పెంచడానికి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అందులో శాశ్వత పథకాలు నత్తనడక నడుస్తున్నాయి. తాత్కాలిక పథకాలు తాటాకులమంటలా చురచురా వెలిగి ఆరిపోతున్నాయి. అందువల్లే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కావటల్లేదు.
  8. పథకాలు మంచివయినా, ఆచరణలో చిక్కులు వస్తున్నాయి. విద్యాశాఖకు ఏటా వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా, క్షేత్రస్థాయి సిబ్బందిలో గూడుకట్టుకున్న అలసత్వం, అశ్రద్ధ, నిర్లిప్తతతో ప్రజల్లో ఆశించిన చైతన్యం రావడం లేదు.
  9. AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి. –

అ) “ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేయడం కోసం అధికంగా ఖర్చు చేయడం”- దీన్ని వ్యతిరేకిస్తూ సరైన కారణాలు రాయండి.
జవాబు:
ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేయడం కోసం అధికంగా ఖర్చు చేయడం అనేది నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. దీనికి కారణాలు :

  1. అధికంగా ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయడం వలన అమూల్యమైన డబ్బు దుర్వినియోగం అవుతుంది. అందుకు బదులుగా అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరం.
  2. అలా ఖర్చు చేయకుండా ఆ ధనాన్ని ఏ పేదవారికో, చదువుకునేందుకు ఆర్థికసాయం లేక మధ్యలోనే చదువుకు స్వస్తి చెపుతున్న వారికో వినియోగించవచ్చు.
  3. అడుగడుగునా మనకు కనిపించే అన్నార్తులను, అభాగ్యులను ఆదుకోవచ్చు.
  4. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వంటివి నెలకొల్పవచ్చు.
  5. ధనవంతులు తాము ఖర్చు పెడుతున్న సొత్తుతో ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని అక్కడి వారికి జీవనోపాధిని కల్పించవచ్చు.
  6. గ్రామాలలో పరిశ్రమలను, కర్మాగారాలను నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు.
  7. జాషువాగారు చెప్పినట్లు రెండు నూలు దండలు, రెండు కప్పుల టీ పెళ్ళికి చాలు. ఒకరిని చూసి మరొకరు ఎక్కువగా పెళ్ళి ఖర్చులు చేసి పొలాలు అమ్ముకోడం, అప్పులు చేయడం, బంగారం వగైరా తాకట్టు పెట్టడం, అమ్మడం చేయరాదు.
  8. వధూవరులు, భగవంతుని సన్నిధిలో దండలు మార్చుకోవాలి. రిజిష్టరు ఆఫీసులో మూడు వందల ఖర్చుతో, పెళ్ళితంతు పూర్తి చేయాలి. ఒక్క ఫోటో చాలు.

ఆ) ‘స్త్రీలందరూ విద్యావంతులైతే, వరకట్న నిర్మూలన జరుగుతుంది’ – దీనిపై మీ అభిప్రాయాలను తెలుపుతూ వ్యాసం రాయండి.
జవాబు:
స్త్రీలందరూ విద్యావంతులయితే, వరకట్నాలు తగ్గవచ్చు. కాని ఆ చదువువల్ల వరకట్నాలు పూర్తిగా పోవు. చదువుకున్న స్త్రీ, తన కన్న ఎక్కువ చదివిన, ఎక్కువ సంపాదిస్తున్న మగాడినే పెళ్ళాడుతోంది. అందుచేత అటువంటి మగాళ్ళు, మరింత కట్నం అడుగుతున్నారు.

స్త్రీలు అందరూ విద్యావంతులయి, తాము కట్నం తీసికొన్న మగవాడిని పెళ్ళాడము అని పంతంపడితే, వరకట్నాలు పూర్తిగా తగ్గిపోతాయి. వరకట్నం ఆశింపని, సజ్జనుడిని స్త్రీ పెళ్ళాడడానికి ముందుకు వస్తే వరకట్నాలు పోతాయి. స్త్రీలకు పురుషులతోపాటు సమాన ఆస్తి హక్కులు ఇస్తే, వరకట్నాలు పోతాయి. పెళ్ళిళ్ళలో దుబారా వ్యయాన్ని అరికడితే, వరకట్నాలు తగ్గుతాయి.

పెళ్ళికాని స్త్రీలు, విద్యావంతులయి, ఉద్యోగాలు చేసికొంటూ, లేదా వృత్తివిద్యలు నేర్చుకొని స్వయంగా ఉపాధిని కల్పించుకొంటే, క్రమంగా వరకట్నాలు దూరం అవుతాయి. ఆడపిల్లల తండ్రులూ ఆడపిల్లలూ, కట్నం ఇవ్వనే ఇవ్వము అని భీష్మిస్తే, కట్నాలు దూరం అవుతాయి.

కేవలం స్త్రీలందరూ విద్యావంతులయినంత మాత్రాన, కట్నాలు పోవు అని నా అభిప్రాయం.

IV. పదజాలం

1. కింది పదాలకు సమానార్థాన్నిచ్చే పదాల సమూహంలో సమానార్థాన్ని ఇవ్వని పదం ఉంది. దాన్ని గుర్తించండి.
ఉదా :
ఇనుడు – సూర్యుడు, రవి, ఇంద్రుడు, భానుడు

అ) పరిణయం – పెళ్ళి, పరిమళం, మనువు, వివాహం
ఆ) శాసనం – ఆజ్ఞ, చట్టం, ఉత్తరం, ఉత్తరువు
ఇ) స్త్రీ – కొమ్మ, బంతి, పడతి, ఉవిద
ఈ) ధనం – విత్తం, దండనం, ద్రవ్యం, పైకం
ఉ) అభ్యున్నతి – తిరోగతి, ప్రగతి, పురోగతి, అభివృద్ధి

2. కింద ప్రకృతి, వికృతి పదాల ఆధారంతో వాక్యాలు రాయండి.
(విద్య – విద్దె; స్త్రీ – ఇంతి, నిజం – నిక్కం, యత్నం – జతనం)
ఉదా :
అ) విద్య రహస్యంగా దాచిన ధనం వంటింది.
జవాబు:
విద్దె లేనివాడు వింత పశువు.

ఆ) నేడు స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు.
జవాబు:
ఇంతులు ఇంటి సౌభాగ్యానికి పట్టుకొమ్మలు.

ఇ) నిజం నిర్భయంగా చెప్పాలి.
జవాబు:
దొంగ నిక్కం చెప్పినా, ఎవ్వరూ నమ్మరు.

ఈ) నిరంతర యత్నం వల్ల పనులు సాధింపవచ్చు.
జవాబు:
మనం జతనంతో ఏదైనా సాధించగలము.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

3. కింది వానిని సొంతవాక్యాలలో రాయండి.
అ) పెనుభూతం, ఆ) తరతరాలు, ఇ) నిరాడంబరం, ఈ) అప్పో సప్పో, ఉ) దిగజారిపోవు, ఊ) దురాచారాలు, ఋ) శాసనాలు, బ) హెచ్చుతగ్గులు.

అ) పెనుభూతం : అవినీతి నేటి కాలంలో పెనుభూతంలా మారింది.

ఆ) తరతరాలు : తరతరాలుగా ‘మా ఇంటిలో అందరూ వేంకటేశ్వర స్వామినే కొలుస్తున్నారు.

ఇ) నిరాడంబరం : గాంధీజీ నిరాడంబర జీవితాన్ని గడిపేవారు.

ఈ) అప్పో సప్పో : కొందరు తమ పిల్లలను అప్పో సప్పో చేసి కష్టపడి చదివించుకొంటున్నారు.

ఉ) దిగజారిపోవు : నేటి యువతరం చెడు వ్యసనాలకు లోనై దిగజారిపోతున్నది.

ఊ) దురాచారాలు : దురాచారాలను అందరం కలిసికట్టుగా రూపుమాపాలి.

ఋ) శాసనాలు : శాసనాలను చేసినంత మాత్రాన దురాచారాలు రూపుమాసిపోవు.

ఋ) హెచ్చుతగ్గులు : ధనిక, పేద అనే హెచ్చుతగ్గులు సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నాయి.

V. సృజనాత్మకత

* వరకట్నానికి రోజూ ఎంతో మంది బలైపోతున్నారు. వాటిని గురించి పత్రికల్లో, టి.విల్లో రోజూ చూస్తూనే ఉన్నాం. వరకట్నం లాంటి భయంకరమైన దురాచారాన్ని నిర్మూలించాలనే భావం ప్రజల్లో కలిగేటట్లు “పోస్టర్” తయారు చేయండి.
జవాబు:
వరకట్నం వద్దు – కోడలే ముద్దు

సోదర సోదరీమణులారా ! నిత్యం మనం పత్రికల్లో వరకట్న బాధితుల వివరాలను చదువుతున్నాం. టి.విల్లో వరకట్నం సరిపడ ఇవ్వలేదనీ, ఇంకా ఇమ్మనీ, పుట్టింటి ఆస్తులు తెగనమ్మి పట్టుకురమ్మనీ బాధించే భర్తల గురించి, అత్తమామల గురించి, ఆడపడుచుల గురించి చూస్తున్నాం. మీ ఇంటికి వచ్చిన కోడలిని లక్ష్మీదేవిగా భావించి, ఆదరించాలి. మీ కోడళ్ళను, మీ కన్నబిడ్డలుగా చూడాలి.

మీరు మీ కోడళ్ళను ప్రేమగా చూస్తే, మీ ఆడుబిడ్డలను వాళ్ళ అత్తవారు అలాగే చూస్తారు. మీరు మీ కోడళ్ళను సూటిపోటీ మాటలు అనేటప్పుడు మీ కన్నబిడ్డలకు ఆ పరిస్థితే ఎదురయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి మీరు మీ ఆడపిల్లలకు కట్నం ఇవ్వకండి. మీరు తీసుకోకండి. మీ ఆడపిల్లలను బాగా చదివించండి. వారు కూడా సంపాదించేలా తయారుచేయండి. మీ మగపిల్లలతో సమంగా ఆడపిల్లలకు మీ ఆస్తి పంచి ఇవ్వండి. “ఇలా మీరంతా దీక్షపట్టండి. ప్రతిజ్ఞ చెయ్యండి.” “వరకట్నం ఇవ్వం. వరకట్నం తీసుకోము.” ఇదే మా ప్రతిజ్ఞ.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

(లేదా)
* ఈ మధ్య కాలంలో పెండ్లిళ్ళు, ఇతర కార్యక్రమాల్లో సుమారు 20% ఆహార పదార్థాలు వృథా అవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దీన్ని అరికట్టడానికి నియమావళి రూపొందించి పోస్టర్ రూపొందించండి.
* శుభకార్యాలలో ఆహార పదార్థాల వృథాను అరికట్టడానికి ప్రజలను ఉద్దేశిస్తూ కరపత్రం రాయండి.
జవాబు:
పెళ్ళిళ్ళలో ఆహారపదార్థాల దుర్వ్యయం అరికడదాం

మిత్రులారా ! నిత్యావసర వస్తువుల ధరలు నిత్యం పెరిగిపోతున్నాయి. దేశ జనాభా పెరిగిపోతోంది. మన రైతులు చెమటోడ్చి పండించే పంటలు, దేశజనాభాకు సరిపోవడం లేదు.

మనలో చాలామంది పెళ్ళిళ్ళకు, చిన్న చిన్న కార్యక్రమాలకు వందల మందికి విందు చేస్తున్నాము. పిలిచిన వారందరూ రాకపోవడం, పూర్తిగా తినకపోవడం వల్ల కనీసం 30% పదార్థాలు మిగిలిపోతున్నాయి. అవి వృథా అవుతున్నాయి.

మనం కింది నియమాలు చేసికొందాం :

  1. పెళ్ళికి 100 మంది అతిథులు మించరాదు.
  2. చిన్న చిన్న శుభకార్యాలకు 10 మంది మించరాదు.
  3. మిగిలిన ఆహార పదార్థాలను వృద్ధాశ్రమాలకు గాని, అనాథ శరణాలయాలకు గాని తీసుకెళ్ళి వారికి పంచిపెట్టాలి. అంతేకాకుండా వండించేటప్పుడు తగిన పాళ్ళలో వండించాలి.
  4. మిగిలిన ఆహారపదార్థాలు పేదసాదలకు అన్నదానం చేయించాలి.
  5. వ్యర్థ పదార్థాలను బయట పడవేస్తే దానికి జరిమానా విధించాలి.

VI. ప్రశంస

* రంగాపురం గ్రామంలో రాధ 10వ తరగతి చదువుతున్నది. ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఆ గ్రామంలోని ‘బాలల హక్కుల వేదిక’ సభ్యులు వెళ్ళి బాల్యవివాహం జరపడం వల్ల నష్టాలను ‘రాధ’ తల్లిదండ్రులకు వివరించారు. బాల్య వివాహాన్ని ఆపారు. రాధ తన చదువును తిరిగి కొనసాగించింది. రాధ వివాహం ఆపిన ‘బాలల హక్కుల వేదిక’ను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
జవాబు:

లేఖ

అనంతపురం,
x x x x x x x x

‘బాలల హక్కుల వేదిక’ వారికి,
రామాపురం,
బంటుమిల్లి మండలం,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్.

మిత్రులారా,
మీరు సాధించిన ఘనవిజయాన్ని గూర్చి పత్రికలో చదివాము. మీ వేదిక సభ్యులు ‘రాధ’ అనే 10వ తరగతి చదివే 15 సంవత్సరాల అమ్మాయికి నిశ్చయమైన బాల్యవివాహాన్ని ఆపుచేయించారని తెలిసింది. బాల్యవివాహం వల్ల రాధ జీవితంలో ఎదుర్కోవలసిన కష్టాలను, ఆమె తల్లిదండ్రులకు వివరించి చెప్పి ఆ పెళ్ళిని జరగకుండా మీరు ఆపు చేయించారని తెలిసి మేము ఎంతో ఆనందించాము. మీరు చాలా మంచిపని చేశారు. రాధకు తిరిగి చదువుకొనే అవకాశం కల్పించి, ఆమె జీవితంలో వెలుగు రేఖలు ప్రసరించేలా చేశారు. మీకు మా ప్రత్యేక అభినందనలు. ధన్యవాదములు.

మీ వేదిక సభ్యులందరికీ మా కృతజ్ఞతలు.

ఇట్లు,
స్నేహ బాల సంఘం,
అనంతపురం,
ఆంధ్రప్రదేశ్.

చిరునామా:
బాలల హక్కుల వేదిక,
రామాపురం,
బంటుమిల్లి మండలం,
కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రాజెక్టు పని

* సంఘంలో దురాచారాలను రూపుమాపటం కోసం కృషిచేసిన సంఘసంస్కర్తల చిత్రపటాలు, వారి సేవల వివరాలు పాఠశాల గ్రంథాలయం నుండి / పత్రికల నుండి సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 2
1) ఆధునిక భారతదేశ సంఘసంస్కర్తలలో అగ్రగణ్యుడు రాజారామ్మోహన్ రాయ్. భారతీయ సాంఘిక పునరుజ్జీవనోద్యమ పితామహునిగా ఆయనను పేర్కొంటారు. సతీసహగమన నిషేధానికి, స్త్రీ విద్య, ఆధునిక విద్యా వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసెను. ఆయన చేసిన విజ్ఞప్తికి స్పందించి లార్డ్ బెంటింక్ ‘సతీసహగమన నిషేధ’ చట్టాన్ని జారీ చేసెను. రాజా రామమోహన్ రాయ్ ‘బ్రహ్మసమాజము’ను స్థాపించెను.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 3
2) కందుకూరి వీరేశలింగం (1848 – 1919) గొప్ప సంఘసంస్కర్త. ఆధునిక సాహిత్య యుగకర్త. స్త్రీ పునర్వివాహ ఉద్యమకర్త. ఆయన రచించిన ‘రాజశేఖర చరిత్ర’ తెలుగులో తొలి నవల. స్వీయచరిత్ర, ఆంధ్రకవుల చరిత్ర. ఇతర రచనలు, వివేకవర్ధిని, సతీహితబోధిని ఆయన ప్రారంభించిన తెలుగు పత్రికలు.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 4
3) రాజారామ్మోహన్ రాయ్ తరువాత అంతటి పేరొపొందిన సంఘసంస్కర్త, గొప్ప సంస్కృత పండితుడు, విద్యావేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్. కలకత్తా సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. వితంతు పునర్వివాహానికి చట్టబద్ధత కల్పిస్తూ 1856లో శాసనం వెలువడటం వెనుక ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి ఎంతగానో ఉంది. అనేక బాలికల పాఠశాలలను స్థాపించి స్త్రీ విద్యకై కృషి చేశారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 5
4) గోవింద రనడే గొప్ప మత, సాంఘిక సంస్కరణవేత్త. బాల్యవివాహాల నిషేధానికి, పరదా పద్ధతి తొలగించడానికి కృషి చేశారు. ‘ఇండియా నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్’ను ప్రారంభించారు. ప్రార్థనా సమాజ అభివృద్ధికి కృషి చేశారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 6
5) శ్రీ నారాయణ గురు స్వాతంత్ర్యోద్యమ కాలంలోని దక్షిణాది సంఘసంస్కర్తలలో ఒకరు. ఆయన గొప్ప పండితుడు. తత్త్వవేత్త. కేరళ వజ్జవ కులంలో జన్మించిన ఆయన అంటరానితనాన్ని నిర్మూలించారు.

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను ఏం చేసి, సంధి పేరు రాయండి.
ఉదా :
చేసినంత = చేసిన + అంత – అత్వసంధి
అ) ఎక్కడైనా = ఎక్కడ + ఐనా – అత్వసంధి
ఆ) కారణమని = కారణము _ అని – ఉత్వసంధి
ఇ) బాధిస్తున్న = బాధిస్తు + ఉన్న – ఉత్వసంధి
ఈ) నిజమే = నిజము + ఏ – ఉత్వసంధి
ఉ) ఏమైన = ఏమి + ఐన – ఇత్వసంధి
ఊ) లేరనడం = లేరు + అనడం – ఉత్వసంధి
ఋ) హీనుడైన = హీనుడు + ఐన – ఉత్వసంధి

2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
ఉదా :
సంఘసంస్కర్తలు – సంఘమును సంస్కరించేవారు – ద్వితీయా తత్పురుషం
అ) వరకట్నం = వరుని కొరకు కట్నం – చతుర్డీ తత్పురుషం
ఆ) స్త్రీల అభ్యున్నతి = స్త్రీల యొక్క అభ్యున్నతి – షష్ఠీ తత్పురుషం
ఇ) విద్యావిహీనత = విద్యచేత విహీనత – తృతీయా తత్పురుషం
ఈ) విద్యావ్యాప్తి = విద్య యొక్క వ్యాప్తి – షష్ఠీ తత్పురుషం
ఉ) ధనవ్యయం = ధనము యొక్క వ్యయం – షష్ఠీ తత్పురుషం
ఊ) శక్తిహీనుడు = శక్తిచేత హీనుడు – తృతీయా తత్పురుషం

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

3. ముందు పాఠాల్లో క్వార్థకం, చేదర్థకం, శత్రర్థకం క్రియలను గురించి తెలుసుకున్నారు కదా !
కింది వాక్యాలలో గీత గీసిన క్రియలు వేటికి సంబంధించినవో గుర్తించండి.
ఉదా :
నీటిని వృథా చేస్తే భవిష్యత్తులో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడ్డారు. – చేదర్థకం
అ) టి.వి. ఎక్కువగా చూస్తే విలువయిన సమయం వృథా అవుతుంది. – చేదర్థకం
ఆ) అప్పన్న కొట్టు కుళ్ళి మంచివి ఏరి తీసుకురా! – క్వార్థకం
ఇ) దీప దిక్కులు చూస్తూ నడుస్తోంది. – శత్రర్థకం
ఈ) అఖిల పాటలు వింటూ ముగ్గులు వేస్తున్నది. – శత్రర్థకం
ఉ) మేధావంతుల వలస తగ్గితే మన దేశాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. – చేదర్థకం
ఊ) మీ అక్క భోజనం చేసి లేవలేకపోతుందేమో? – క్వార్థకం
ఋ) మహేశ్ తేనీరు తాగుతూ పత్రిక చదువుతున్నాడు. – శత్రర్థకం

తత్పురుష సమాసాలు :
విభక్తులు ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాల గురించి తెలుసుకున్నారు కదా ! కింది వాటిని కూడా పరిశీలించండి.
1) పూర్వకాయము – కాయము యొక్క పూర్వము

పై దానిలో ‘పూర్వ’ అనే పదానికి ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ‘పూర్వము’గా మారింది. ఇలా మొదటి పదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాం.

* సమాసంలో పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడమే ప్రథమా తత్పురుష, అంటే విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలు (డు, ము, వు, లు) చేరతాయి.

దీనినే ఏకదేశి సమాసం అని కూడా అంటారు. సాధారణంగా తత్పురుష సమాసాలలో ఉత్తరపదార్థానికి ప్రాధాన్యం ఉంటుంది. కాని ఏకదేశి సమాసం అంటే పూర్వపదార్థ ప్రధానంగల తత్పురుష సమాసం. కింది వాటిని పరిశీలించండి.
1) నఞ్ + సత్యం అసత్యం = సత్యం కానిది
2) నఞ్ + న్యాయము = అన్యాయము = న్యాయము కానిది
3) నఞ్ + ఉచితం = అనుచితం = ఉచితము కానిది

సంస్కృతంలో ‘నఞ్’ అనేది వ్యతిరేకార్థ బోధకం. దీనికి బదులు తెలుగులో అ, అన్ అనే ప్రత్యయాలు వాడుతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నః’ అనే అవ్యయాన్ని అనుసరించి, దీన్ని “నఞ్ తత్పురుష సమాసం” అంటారు.

5. కింది పదాలకు విగ్రహవాక్యాలు, సమాస పదాలు రాసి, సమాసం పేరు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) అర్ధరాత్రి రాత్రి యొక్క అర్ధము ప్రథమా తత్పురుష సమాసం
ఆ) అనూహ్యము ఊహ్యము కానిది నఞ్ తత్పురుష సమాసం
ఇ) అక్రమం క్రమం కానిది నఞ్ తత్పురుష సమాసం

6. తత్పురుష సమాసానికి చెందిన పదాలను ఇంతకు ముందు పాఠాల్లో వెదకండి. పట్టికలో రాయండి.

సమాసం పేరు విగ్రహవాక్యం సమాస పదం
1) ప్రథమా తత్పురుష సమాసం అర్ధము యొక్క ప్రథమము ప్రథమార్ధము
2) ద్వితీయా తత్పురుష సమాసం కృష్ణుని ఆశ్రయించిన వాడు కృష్ణాశ్రితుడు
3) తృతీయా తత్పురుష సమాసం జలముతో అభిషేకము జలాభిషేకము
4) చతుర్డీ తత్పురుష సమాసము లోకము కొఱకు హితము లోకహితములు
5) పంచమీ తత్పురుష సమాసం దొంగ వలన భయము దొంగభయము
6) షష్ఠీ తత్పురుష సమాసం జటల యొక్క పంక్తి జటాపంక్తి
7) సప్తమీ తత్పురుష సమాసం తటము నందలి భూజములు తటభూజములు
8) నఞ్ తత్పురుష సమాసం క్షరం కానిది అక్షరం

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

కృషి : సేద్యం, వ్యవసాయం
ధనం : డబ్బు, సంపద, విత్తము
మిత్రుడు : స్నేహితుడు, నేస్తము, సఖుడు
శక్తి : సామర్థ్యం, బలము
ఏవగింపు : అసహ్యం, రోత, జుగుప్స
హర్షము : ఆనందం, సంతోషం
స్త్రీ : మహిళ, వనిత, ఉవిద
మంత్రి : ప్రధాని, సచివుడు, ప్రెగడ
సహకారం : సహాయం, తోడ్పాటు

వ్యుత్పత్యర్థాలు

మిత్రుడు : అన్ని ప్రాణుల యందు సమభావన కలవాడు (స్నేహితుడు)
సత్యం : సత్పురుషుల యందు పుట్టినిది (నిజం)
శాసనం : దీని చేత శిక్షింపబడును (ఆజ్ఞ)

నానార్థాలు

సత్యం – సత్తు, పూజ్యము, సాధువు
ప్రయత్నం – కృషి, సేద్యం, పరిశ్రమ
ప్రజ – జనం, సంతతి, పుట్టుట
చైతన్యం – ప్రాణం, తెలివి, ప్రకృతి
శక్తి – బలిమి, పార్వతి, పరాశరుని తండ్రి
కళ్యాణం – వివాహం, బంగారం, అక్షయం
ఘనం – మేఘం, శరీరం, గొప్పది
కృషి – సేద్యం, యత్నం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
వ్యతిరేకాభిప్రాయం = వ్యతిరేక + అభిప్రాయం – సవర్ణదీర్ఘ సంధి

యణాదేశ సంధి :
సూత్రం : ఇ, ఉ, ఋ లకు సవర్ణముకాని అచ్చు పరమగునప్పుడు క్రమముగా య, వ, రలు ఆదేశమగును.
అభ్యున్నతి = అ + ఉన్నతి – యణాదేశ సంధి

అత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
చేసినంత = చేసిన + అంత – అత్వ సంధి
ఎక్కడైనా = ఎక్కడ + ఐనా – అత్వ సంధి
ఐనప్పుడు = ఐన + అప్పుడు – అత్వ సంధి
తగినంత = తగిన + అంత – అత్వ సంధి

లు ల న ల సంధి :
సూత్రం : లు, ల, న లు పరమైనపుడు ఒక్కొక్కపుడు ముగాగమానికి లోపమూ, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ విభాషగా వస్తాయి.
మాత్రాన = మాత్రము + న – లు ల సంధి
తరాలు = తరము + లు – లుల సంధి
వివాహాలు = వివాహము + లు – లు ల న ల సంధి
అవకాశాలు = అవకాశము + లు – లు ల న ల సంధి

ఇత్వసంధి :
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
ఒక్కటే = ఒక్కటి + ఎ – ఇత్వ సంధి

గసడదవాదేశ సంధి :
సూత్రం : ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
సరిగదా = సరి + కదా – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
యువతీయువకులు యువతియును, యువకుడును ద్వంద్వ సమాసం
హెచ్చుతగ్గులు హెచ్చును, తగ్గును ద్వంద్వ సమాసం
వధూవరులు వధువును, వరుడును ద్వంద్వ సమాసం
బంధుమిత్రులు బంధువులు, మిత్రులు ద్వంద్వ సమాసం
బాల్యవివాహాలు బాల్యము నందలి వివాహములు సప్తమీ తత్పురుష సమాసం
సంస్కరణ ప్రయత్నం సంస్కరణ యొక్క ప్రయత్నం షష్ఠీ తత్పురుష సమాసం
స్త్రీల అభ్యున్నతి స్త్రీల యొక్క అభ్యున్నతి షష్ఠీ తత్పురుష సమాసం
విద్యావ్యాప్తి విద్య యొక్క వ్యాప్తి షష్ఠీ తత్పురుష సమాసం
వరకట్నం వరుని కొరకు కట్నం చతుర్డీ తత్పురుష సమాసం
పెనుభూతము పెద్దదైన భూతము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
దురాచారం దుష్టమైన ఆచారం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ముఖ్యమంత్రి ముఖ్యమైన మంత్రి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ముఖ్య సమస్యలు ముఖ్యమైన సమస్యలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జటిల సమస్య జటిలమైన సమస్య విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రకృతి – వికృతులు

మంత్రి – మంతిరి
వివాహం – వియ్యము
రూపము – రూపు
స్త్రీ – ఇంతి
విద్య – విద్దె
దూరము – దవ్వు
శ్రీమతి – సీమాటి
ఆశ్చర్యం – అచ్చెరువు
గౌరవం – గారవము
విషయం – విసయం
సత్యం – సత్తు
నిజం – నిక్కం

రచయిత పరిచయం

రచయిత : “శ్రీ నండూరి రామమోహనరావు”

జన్మస్థలం : వీరు కృష్ణాజిల్లా “విస్సన్నపేట”లో జన్మించారు.

జీవిత కాలం : 1927 – 2011.

ప్రసిద్ధి : రామమోహనరావుగారు, తెలుగు పాత్రికేయులలో సుప్రసిద్ధులు. వీరు జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితా జ్యోతి మొదలైన పత్రికలలో సంపాదకులుగా పనిచేశారు.

రచనలు : వీరు పిల్లల కోసం కొన్ని ఇంగ్లీషు నవలలను, తెలుగులోనికి అనువదించి రాశారు. 1) “చిలక చెప్పిన రహస్యం”, 2) “మయూరకన్య” అనే పిల్లల నవలలూ, 3) “హరివిల్లు” పేరిట పిల్లల గేయాలు రాశారు. నండూరి వారి సంపాదకీయ వ్యాసాలు అయిన “అనుపల్లవి”, ! “చిరంజీవులు”, “నండూరి రామమోహనరావు వ్యాఖ్యావళి” పేరిట సంకలనాలుగా వచ్చాయి.

అవార్డులు : తెలుగు విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , వీరిని “ఉత్తమ పాత్రికేయుడు” అవార్డు నిచ్చి సత్కరించింది.

కఠిన పదాలకు అర్థాలు

శాసనాలు = చట్టాలు
సాంఘిక సంస్కరణ = సంఘాన్ని చక్కజేయడం
ఆవశ్యకత = అవసరము
ప్రస్పుటించాలి = ప్రకాశించాలి; వెల్లడించాలి
చెదురు మదురు = అక్కడక్కడ
పరిణామం = మార్పు
రూపుమాపు = నశింపజేయు
మహామహులు = గొప్పవారు
ఏవగింపు = రోత
నిర్మూలన = పెల్లగించుట, నాశనం
పెనుభూతం = పెద్ద దయ్యం

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

అభ్యున్నతి = అభివృద్ధి
అవరోధాలు = ఆటంకాలు
విద్యావిహీనత = విద్య లేకపోవడం
జటిల సమస్య = పెనగొనిన సమస్య (చిక్కు సమస్య)
ప్రయత్నపూర్వకంగా = ప్రయత్నం చేయడం ద్వారా
విద్యాశూన్యులు = విద్య చేత శూన్యులు (చదువు రానివారు)
ప్రతిష్ఠ = గౌరవం; కీర్తి
ధనవ్యయం = ధనాన్ని ఖర్చు చేయడం
పరిగణించడం = లెక్కించడం
హర్షించదు = సంతోషించదు
శక్తిహీనుడు = శక్తిలేనివాడు
ఏహ్యభావాన్ని = రోతను

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 9 సందేశం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 9th Lesson సందేశం

8th Class Telugu 9th Lesson జసందేశం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

స్వంత లాభం కొంతమానుకు
పొరుగువారికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
పాడిపంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటుపడవోయ్;
తిండి కలిగితే కండగలదోయ్
కండ కలవాడేను మనిషోయ్
చెట్టపట్టాల్ పట్టుకొని దే
శస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ములవలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్
– గురజాడ అప్పారావు

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై పంక్తులు ఏ గేయంలోవి ? ఆ గేయాన్ని ఎవరు రాసారు?
జవాబు:
పై పంక్తులు దేశభక్తి గేయంలోవి. ఆ గేయాన్ని గురజాడ అప్పారావు గారు రాసారు.

ప్రశ్న 2.
ఈ గేయంలో ఉన్న విషయాలేమిటి?
జవాబు:

  • స్వంత లాభం కొంచెం వదులుకొని, తోటివాడికి సాయం చేయాలి.
  • దేశమంటే మట్టికాదు మనుషులు.
  • దేశంలో పాడి పంటలు అభివృద్ధి అయ్యేటట్లు శ్రమించాలి.
  • కండ బలం ఉన్నవాడే మనిషి.
  • దేశ ప్రజలు కలసిమెలసి జీవించాలి.
  • జాతిమత భేదాలు విడచి, ప్రజలు సోదరులవలె మెలగాలి.

ప్రశ్న 3.
గేయ సందేశం ఏమిటి ?
జవాబు:
పరోపకారం, దేశభక్తి, ఐకమత్యం అనేవి అందరూ కలిగి ఉండాలనేదే ఈ గేయ సందేశం.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

ప్రశ్న 4.
దేశభక్తిని గురించిన గేయాలు, కవితలు, పద్యాలను కవులు ఎందుకు రాస్తారు?
జవాబు:
దేశభక్తిని గురించిన గేయాలను, కవితలను, పద్యాలను కవులు ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి రాస్తారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ పాఠంలోని పద్యాల్లో మనదేశం గొప్పతనం గురించి చదివినపుడు మీకేమనిపించింది?
జవాబు:
ఈ పాఠంలోని పద్యాల్లో మన భారతదేశం తపోభూమి అని, బంగారు పంటలకు నిలయమని, శాంతి వెన్నెలలో,
కురిపించిన దేశమని, గంగ, గోదావరి వంటి పవిత్ర నదులు ప్రవహించిన దేశమని చదివినప్పుడు, నేను ఇటువంటి గొప్ప దేశంలో పుట్టాను కదా ! అని గర్వంగా తల ఎత్తుకొని తిరగాలనిపించింది. జన్మభూమి స్వర్గం కంటే గొప్పది కదా.

మరింతగా మన దేశ సౌభాగ్యం వర్ధిల్లేలా పాటుపడాలని అనిపించింది. మన దేశంలో అన్యాయాలు, దౌర్జన్యాలు, కుల మత హింసలు లేకుండా చూడాలని అనిపించింది. అవినీతి, లంచగొండితనం, కుంభకోణాలు, పేదరికం లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. ప్రపంచ దేశాల్లో నేను జన్మించిన నా భారతమాత చాలా గొప్పది అనిపించింది.

ప్రశ్న 2.
ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు?
జవాబు:
మనం చట్టసభలకు ఎన్నుకొనేవారే ప్రజా ప్రతినిధులు. అనగా ఎం.పి.లు, ఎం.ఎల్.ఎ.లు మొదలైనవాళ్ళు ప్రజల కష్టాల్ని చట్టసభల్లో ప్రతిధ్వనింపచేసేవారు కావాలి. ప్రజల సమస్యల్ని, కష్టాల్ని ప్రభుత్వానికి తెలిపి, వాటిని పరిష్కరించేవారు. కావాలి. అవినీతి, లంచగొండితనం, దుర్మార్గం అన్న వాటికి వారు దూరంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోవాలి. వాటికి త్వరగా పరిష్కార మార్గాల్ని చూపించగలగాలి. ప్రతినిధుల ఎప్పుడూ ప్రజల పక్షంలోనే నిలబడాలి. అన్యాయానికీ, అధికారానికి బానిసలు కారాదు. సచ్ఛీలత కలిగి, సత్కార్యాలు: చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆదర్శప్రాయ జీవనం సాగించాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

ప్రశ్న 3.
లంచగొండితనం మన దేశ ప్రగతి గౌరవాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదో చర్చించండి.
జవాబు:
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మూడవ, నాలుగవ సాధారణ ఎన్నికల తర్వాత రాజకీయ నాయకులలో అవినీతి బాగా ఎక్కువైంది. రాజకీయ నాయకులలో, మంత్రులలో అవినీతి ఎక్కువైనపుడు అధికారులకి అది అనుకూలంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలలో గల సిబ్బంది ప్రతి చిన్నపనికీ లంచం తీసుకొంటున్నారు. ప్రతిపనికీ “ఒక రేటు” ఉంటోంది. చివరికి జీతాలు ఇవ్వడానికీ, పింఛను చెల్లించడానికి మాత్రమే కాదు – మరణించిన వాళ్ళకి “సర్టిఫికేట్” ఇవ్వడంలోనూ లంచం తప్పని పరిస్థితులున్నాయంటే అవినీతి ఎంతగా విలయతాండవం చేస్తోందో గ్రహించవచ్చు.

ఈ రోజు మన దేశంలో లంచగొండితనం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఈ లంచగొండితనం చిన్న ఉద్యోగుల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు మంత్రుల నుండి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ల దాకా ఈ లంచగొండితనం విస్తరించింది.

లంచం ఇవ్వనిదే ప్రభుత్వంలో ఏ పనీ కావట్లేదు. ప్రపంచంలో లంచగొండితనం ఎక్కువ ఉన్న దేశాల్లో మన భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యమంత్రులూ, వారి పుత్రులూ, అల్లుళ్ళూ వేల కోట్ల రూపాయలు లంచాలుగా మేసేస్తున్నారు.

ఇందువల్ల మన దేశంలో అభివృద్ధి జరుగడం లేదు. ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెడితే పది పైసల పని కూడా కావట్లేదు. ఏ పనీ సక్రమంగా సాగటంలేదు. కట్టిన ప్రాజెక్టులు, రోడ్లు, పరిశ్రమలు కొద్ది రోజుల్లోనే పాడయిపోతున్నాయి. దేశాన్ని రక్షింపవలసిన మిలటరీ, పోలీసు వ్యవస్థలు సైతం లంచగొండితనాన్ని మరిగి బాధితులకు అన్యాయం చేస్తున్నాయి. పెద్ద పెద్ద అధికారులు లంచగొండితనానికి అలవాటుపడి జైళ్ళలో మగ్గుతున్నారు.

అవినీతి, లంచగొండితనంల కారణంగా ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోంది. కనుక ప్రజలు యువత అవినీతి నిర్మూలనకు నడుంకట్టి ఈ దుష్ట జాడ్యాన్ని మన దేశం నుండి తరిమికొట్టాలి.

II. చదవడం – రాయడం

1. కింది పద్యం చదవండి. దాని భావంలోని ఖాళీలలో సరైన పదాలు రాయండి.
“దేశభక్తి మరియు దేశసమగ్రత
ప్రజల నాడులందు ప్రబలి ప్రబలి
కర్మభూమి యగు నఖండ భారతమహా
క్షితిని నెగురు ప్రగతి కేతనమ్ము”.

భావం :
దేశభక్తి, ………… అనే భావాలు ప్రజల్లోని నరనరాల్లో …………. కర్మభూమి అయిన మన ……….. దేశం ప్రగతి ……………….. రెపరెపలాడుతోంది.
జవాబు:
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు ప్రజల నరనరాల్లో వ్యాపించి కర్మభూమి అయిన మన అఖండ భారతదేశం ప్రగతి జెండా రెపరెపలాడుతుంది.

2. కింది ఖాళీలకు సరైన సమాధానాన్ని గుర్తించండి.

అ) మధురమైన ధర్మా నికి ………………… తగలరాదు. (రాయి / దెబ్బ)
జవాబు:
మధురమైన ధర్మానికి దెబ్బ తగలరాదు.

ఆ) భరత జాతి …………… ఆశయాలకు అనుగుణంగా లేదు. (మహాత్ముడి / బుద్ధుడి)
జవాబు:
భరత జాతి మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా లేదు.

ఇ) సకల జగతికి ………. నేర్పినట్టి మన భరతమాతను పూజించాలి. (అశాంతి / శాంతి)
జవాబు:
సకల జగతికి శాంతి నేర్పినట్టి మన భరతమాతను పూజించాలి.

ఈ) అఖండ భారతావనిలో ………….. కేతనం ఎగురవేయాలి. (ప్రగతి / తిరోగతి)
జవాబు:
అఖండ భారతావనిలో ప్రగతి కేతనం ఎగురవేయాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

3. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.

అ) భారతీయులు ఏమని ప్రతిజ్ఞ చేయాలి?
జవాబు:
“ఇది నా దేశం, ఇది నన్ను కన్నతల్లి. నాదేశ సౌభాగ్య సంపదలు, అభివృద్ధి చెందడానికి నేను సహాయపడతాను. ప్రపంచమంతా దీన్ని పూజించేటట్లుగా గొప్ప ప్రగతిని నెలకొల్పుతాను” అంటూ భారతీయులు ప్రతిజ్ఞ చేయాలి.

ఆ) మనదేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు ఏవి?
జవాబు:
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, కావేరి, గోదావరి, సింధు, నర్మద అనే జీవనదులు మనదేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు.

ఇ) ఈ పాఠంలో కవి చెప్పిన “మహామౌని” ఎవరు ? ఆయన గొప్పతనం ఏమిటి?
జవాబు:
ఈ పాఠంలో కవి చెప్పిన “మహామౌని” మహాత్మాగాంధీ. భారతమాత ముద్దుబిడ్డలలో మహాత్మాగాంధీ అగ్రగణ్యుడు. సత్యం, శాంతి, అహింస అనే సూత్రాలను పాటించి, రవి అస్తమింపని బ్రిటిషు సామ్రాజ్యం పునాదులను కదలించి, భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు. మన జాతిపిత అయిన గాంధీజీ తన బోసి నోటితో పలికిన శాంతి సందేశానికి ప్రపంచమంతా జేజేలు పలికింది. అది మన భారతదేశానికి కీర్తిని తెచ్చింది.

ఈ) మనదేశ ప్రగతి కేతనం ఎప్పుడు రెపరెపలాడుతుంది?
జవాబు:
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు ప్రజల నరనరాల్లో వ్యాపించినపుడు, పుణ్యభూమియైన అఖండ భారతదేశంలో ప్రగతి కేతనం రెపరెపలాడుతుంది.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) పాఠంలో కవి చెప్పిన విషయాలే గాక, మనదేశ కీర్తిని పెంచిన ఇతర విషయాలు రాయండి.
జవాబు:

  • మన దేశంలో బుద్ధుడు జన్మించి ప్రపంచంలోని చాలా దేశాల్లో బౌద్ధమతం విస్తరించేలా తన సందేశాన్ని అందించాడు.
  • వివేకానందుడు ప్రపంచ మత మహాసభలో పాల్గొని సర్వమత సమానత్వాన్ని చాటాడు.
  • రవీంద్రనాథ్ ఠాగూర్ తన కవితల ద్వారా, సర్ సి.వి. రామన్ శాస్త్ర పరిశోధనల ద్వారా మన దేశ కీర్తిని పెంచారు.
  • మన ఇతిహాసాలైన భారత రామాయణాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి. మన మహర్షులు, వేదాలు, ధర్మ ప్రచారా మన దేశ కీర్తిని విస్తరించాయి.
  • నెహ్రూ, ఇందిర వంటి మన నాయకులు ప్రపంచ ఖ్యాతిని సంపాదించారు.
  • మన రోదసీ విజ్ఞానం ప్రపంచ ఖ్యాతిని సంపాదించింది.
  • మన పారిశ్రామికవేత్తలలో కొందరు ప్రపంచ ప్రసిద్ధి పొందారు.
  • మన క్రికెట్టు ఆటగాడు టెండూల్కర్ ప్రపంచ ఖ్యాతి పొందాడు.

ఆ) మన జీవనదులు దేశానికి ఎటువంటి పరిపుష్టిని కలిగిస్తున్నాయి?
జవాబు:
మనదేశంలో కవి చెప్పినట్లు గంగ, సింధు, బ్రహ్మపుత్ర, కృష్ణానది, గోదావరి, కావేరి వంటి జీవనదులు ఉన్నాయి. నదులపై భాక్రానంగల్, నాగార్జునసాగర్, హీరాకుడ్ వంటి ఎన్నో బహుళార్థసాధక ప్రాజెక్టులు నిర్మించారు. వాటి నుఁ కాలువల ద్వారా వ్యవసాయానికి నీరు అందుతోంది. ఆ నీటితో బంగారు పంటలు పండుతున్నాయి. ఈ ప్రాజెక్టుల వ విద్యుదుత్పత్తి కూడా జరుగుతోంది.

మన ప్రభుత్వాలు నదులలోని పవిత్రమైన జీవజలాలను పూర్తిగా వినియోగించుకుంటే దేశం పాడిపంటల సస్యశ్యామలంగా ఉంటుంది.

ఇ) భారతీయ సంస్కృతిలో నీకు బాగా నచ్చిన విషయాలు ఏమిటి? అవి ఎందుకు బాగా నచ్చాయి?
జవాబు:
ఒక జాతి నిర్వీర్యం కాకుండా ఆత్మబలాన్ని సమకూర్చుకోవడానికి సంస్కృతి తోడ్పడుతుంది. ప్రజా జీవితం ప్రశాంతం సాగాలంటే సంస్కృతి ఇచ్చే సంస్కారమే మూలాధారం అవుతుంది. ఆత్మ సంస్కారాన్ని నేర్పి, మానవుడు సంఘజీవి అ. మానవసేవే మాధవ సేవ అని బోధించేది సంస్కృతి. మన భారతీయ సంస్కృతి ఎంతో విశిష్టమైనది.

భారతీయ సంస్కృతిలో దేవాలయాలు, పురాణాలు, రామాయణ భారత ఇతిహాసాలు, భాగవతము, భగవద్గీత వం భక్తి గ్రంథాలు, జీవనదులైన గంగ, గోదావరుల వంటి నదులు, మన ఋషులు, వారు బోధించిన ధర్మ ప్రబోధాలు నా బాగా నచ్చాయి.

మన దేశంలోని ఆచార వ్యవహారాలు, తల్లిదండ్రులను, గురువులను పిల్లలు గౌరవించడం, పెద్దల పట్ల, ఆచార్యు పట్ల ప్రజలకు గౌరవాదరాలు ఉండడం వంటి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అంటే నాకు గౌరవం.

మనకు ఉన్న దేవాలయాల వంటి గొప్ప దేవాలయాలు, పుణ్యనదులు మరి ఏ దేశానికీ లేవు. మన రామాయః భారత భాగవతాల వంటి పుణ్య గ్రంథాలు ఏ దేశానికీ లేవు. మనకు ఉన్న తత్త్వశాస్త్ర గ్రంథాలు, వేదాంత గ్రంథాల భగవద్గీత, వేదాలు వంటివి మనకే సొంతం. అవి ఏ దేశానికీ లేవు. ఇంత గొప్ప సంస్కృతి గల దేశంలో జన్మించడ నాకు గర్వకారణం.

ఈ) నీవే ప్రజాప్రతినిధివి అయితే దేశం కోసం ఏం చేస్తావు?
జవాబు:
నేనే ప్రజాప్రతినిధిని అయితే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వివరిం వాటిని పరిష్కరించేటట్లు చేస్తాను. దేశానికి హాని కలిగించే పనిని ఏదైనా జరుగకుండా అడ్డుకుంటాను. అలాగే నా పాటు ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలుస్తాను. అంటే నేను ప్రజలపట్ల చూపుతున్న సమస్యా పరిష్కారాల వారు కూడా తీర్చేటట్లు ఆదర్శంగా ఉంటాను.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) మనదేశాన్ని గురించి ప్రపంచం పొగడాలంటే, దేశంలో ఏమేమి ఉండగూడదని కవి చెప్పాడు?
జవాబు:
ఘనత గన్న మన పుణ్యదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కుల, మత హింసలనే పిశాచాలను తల ఎత్తనీయకు. నానాటికీ పెరిగిపోతున్న దుష్టులు, మోసగాళ్ళ గూండాయిజం నిలువకూడదు. బలిష్టమైన దేశ సౌభాగ్యాన్ని లంచాలనే జలగలు పట్టి పీల్చకూడదు. ప్రతినిధులైన వాళ్ళు పగలు, సెగలు రగిలించే మాటలు మాట్లాడకూడదు. “మనమంతా అన్నదమ్ములము” అనే తీయని ధర్మానికి దెబ్బ తగులనీయకూడదు. అలా జరిగినప్పుడు సమైక్యత అనే ఢంకా మోగుతుంది. మన భారతదేశాన్ని ప్రపంచం పొగడుతుంది.

ఆ) “భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను” ఈ వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
“భారతదేశం జీవనదులకు, పాడి పంటలకు నిలయమైయున్న దేశం. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను.” – ఈ వాక్యాన్ని మీ మాటల్లో రాయండి.
జవాబు:
మన భారతదేశం వేదాలు పుట్టిన దేశం. వ్యాస వాల్మీకాది మహర్షులు జన్మించిన దేశం. మన దేశం శ్రీలు పొంగిన జీవగడ్డ. పాడిపంటలు పొంగిపొర్లిన భాగ్యసీమ. ఇది వేదాంగాలూ, రామాయణం పుట్టిన దేశం. భారత భాగవతాలు పుట్టిన దేశం. ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. ఇది పవిత్ర భూమి. ఇక్కడ విస్తారమైన వృక్షసంపద ఉంది. లక్ష్మీబాయి, రుద్రమ్మ వంటి వీరవనితలకు ఇది జన్మభూమి. ప్రచండ పరాక్రమం ఉన్న రాజులు ఇక్కడ పుట్టారు. కాళిదాసు, తిక్కన వంటి మహాకవులు ఇక్కడ పుట్టారు. గాంధీ, బుద్ధుడు వంటి శాంతిదూతలు ఇక్కడే పుట్టారు. గంగా, సింధు, గోదావరి, కృష్ణా వంటి పవిత్ర నదులు ఇక్కడే పుట్టి, దేశాన్ని తమ జలాలతో సిరుల సీమగా మార్చాయి. ఇక్కడ నెహ్రూజీ, ఇందిర వంటి జాతీయ నాయకులూ, అబ్దుల్ కలామ్ వంటి శాస్త్రజ్ఞులూ ఇక్కడే పుట్టారు. ఇది కర్మభూమి. ఇది పవిత్రభూమి. అందుకే భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను.

IV. పదజాలం

1. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాసి ఆ వాక్యాలను తిరిగి రాయండి.

అ) మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ కేతనాన్ని ఎగురవేస్తాం.
జవాబు:
కేతనాన్ని = జెండాను
వాక్యం : మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగురవేస్తాం.

ఆ) ప్రతి వ్యక్తికీ మనోదార్డ్యుం ఉండాలి.
జవాబు:
మనోదార్యుం = దృఢమైన మనస్సు
వాక్యం : ప్రతి వ్యక్తికి దృఢమైన మనస్సు ఉండాలి.

ఇ) ఇతరుల సంపదలు చూసి మచ్చరికించకూడదు.
జవాబు:
మచ్చరికించ = అసూయ
వాక్యం : ఇతరుల సంపదలు చూసి అసూయపడరాదు.

ఈ) రవి చేతిరాతను చూసి అందరూ అబ్బురపడతారు.
జవాబు:
అబ్బురపడు = ఆశ్చర్యపోవు
వాక్యం : రవి చేతిరాతను చూసి అందరూ ఆశ్చర్యపోతారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

2. కింద గీత గీసిన పదాలకు వికృతి పదాలతో తిరిగి వాక్యాలు రాయండి.

అ) నాదేశ సమగ్రతను కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
జవాబు:
ప్రతిజ్ఞ (ప్ర) – ప్రతిన (వి)
నాదేశ సమగ్రతను కాపాడతానని ప్రతిన చేస్తున్నాను.

ఆ) నాది తెలుగుజాతి. నాది తెలుగు భాష.
జవాబు:
భాష (ప్ర) – బాస (వి)
నాది తెలుగు జాతి. నాది తెలుగు బాస.

ఇ) మనకు దేశంపై భక్తి ఎక్కువగా ఉండాలి.
జవాబు:
భక్తి (ప్ర) – బత్తి (వి)
మనకు దేశంపై బత్తి ఎక్కువగా ఉండాలి.

ఈ) మన కీర్తి ఖండ ఖండాంతరాలకు వ్యాపించింది.
జవాబు:
కీర్తి (ప్ర) – కీరితి (వి)
మన కీరితి ఖండ ఖండాంతరాలకు వ్యాపించింది.

3. పాఠానికి సంబంధించిన మాటలను కింది గళ్ళ నుండి వెతికి పక్క గళ్ళల్లో రాయండి. వాటితో వాక్యాలు తయారుచేయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 1

వాక్యములు :

  1. భారత ప్రభుత్వం జ్ఞానానంద కవిని పద్మశ్రీతో సత్కరించింది.
  2. హిందూదేశము జీవనదులకు పుట్టినిల్లు.
  3. దేశ యువత, దేశభక్తిని పెంపొందించుకోవాలి.
  4. ఇది నా దేశము, అనే ప్రేమ భావము దేశ పౌరులలో కలగాలి.
  5. హనుమంతుడు సీతమ్మకు సందేశమును తీసుకువెళ్ళాడు.
  6. గంగానదిని భారతీయులు మహా పుణ్యనదిగా భావించి సేవిస్తారు.
  7. బాపూజీ శాంతి సందేశానికి ప్రపంచం జోహార్లు ఆర్పించింది.
  8. గాంధీజీ, హింసను విడనాడండని దేశ ప్రజలకు సందేశం అందించాడు.
  9. సింధునది హిమాలయాల్లో పుట్టిన జీవనది.
  10. నెహ్రూ శాంతిదూత.

V. సృజనాత్మకత

* పాఠంలో మనదేశం గొప్పతనాన్ని తెలుసుకున్నారు కదా ! మన దేశ గొప్పతనాన్ని వర్ణిస్తూ భారతీయ విలువలు కాపాడటానికి అందరూ బాధ్యత తీసుకోవాలని ఒక “కరపత్రం” తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
భారతీయ విలువలను కాపాడదాం

సోదర సోదరీమణులారా ! మన భారతదేశం తపోభూమి. ఇది బంగారు పంటలకు నిలయం. శాంతి సందేశాన్ని ప్రపంచానికి అందించిన బుద్ధుడు, గాంధీజీ జన్మించిన పవిత్రదేశం మనది. గంగా, గోదావరి, కృష్ణానది, సింధు, * బ్రహ్మపుత్ర వంటి పవిత్ర నదులు ప్రవహిస్తున్న పవిత్ర భాగ్యసీమ మనది.

ఇది వేద వేదాంగాలు పుట్టిన కర్మభూమి. భారత, భాగవత, రామాయణాలు, వేదవ్యాస, వాల్మీకి, కాళిదాసుల వంటి కవులు పుట్టిన దేశం ఇది. కృష్ణదేవరాయలు వంటి మహా సాహితీ సమరాంగణ చక్రవర్తులు జన్మించిన పవిత్రభూమి ఇది. ఝాన్సీలక్ష్మీబాయి, రాణిరుద్రమ్మ వంటి వీరనారులకు జన్మభూమి ఇది. గాంధీజీ, నెహ్రూ, ఇందిర వంటి రాజకీయ దురంధరులకు ఇది పుట్టినిల్లు. శంకరాచార్యులు వంటి అద్వైతమత ప్రవక్త నడయాడిన కర్మభూమి ఇది.

మన భారతీయులందరూ న్యాయానికీ, ధర్మానికీ, శాంతికీ, సత్యాహింసలకూ ప్రాధాన్యం ఇచ్చారు. మనం పైన చెప్పిన పుణ్యాత్ములకు వారసులం. మన భారతీయ విలువలను కాపాడదాం. నిజమైన భారతీయులం అనిపించుకుందాం. భారతీయులారా ! మన భారతభూమి గౌరవాన్ని రక్షించుకుందాం.

ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడదాం. మన దేశ గౌరవాన్ని నిలబెడదాం.

VI. ప్రశంస

*మనదేశం ప్రపంచ ప్రసిద్ధి చెందటానికి ఎంతో మంది కృషి చేశారు. నేటికీ విద్య, వ్యాపారం, క్రీడలు, సాంస్కృతికం, రాజకీయం మొదలైన రంగాలలో ఎంతో మంది కృషి చేస్తున్నారు. అటువంటి వ్యక్తులలో మీకు తెలిసిన వ్యక్తిని గూర్చి వారి కృషిని గూర్చి ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
అబ్దుల్ కలామ్ ఆజాద్

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆజాద్ ఆదర్శ భారతీయుడు. ప్రముఖ శాస్త్రజ్ఞుడు. భారతదేశాన్ని స్వర్ణభారతం చేయాలని శ్రమించే నిరంతర శ్రామికుడు. వివాహానికి, వివాదానికి జీవితంలో చోటివ్వని వ్యక్తి. నేటి బాలలకు ఈయన ప్రచోదక శక్తి. ఈయన ప్రజాస్వామ్యహితైషి.

అబ్దుల్ కలామ్ ఆజాద్ తమిళనాడులోని రామేశ్వరంలో జైనులబ్లీన్, ఆషియమ్మ దంపతులకు 1931, అక్టోబరు 15న జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం రామేశ్వరం, రామనాథపురం, తిరుచురాపల్లి, మద్రాసులలో కొనసాగింది. మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ‘ఏరో ఇంజనీరింగులో డి.ఎం. ఈ.టీ’ చేసి తరువాత సైన్సులో డిప్లొమా (ఆనర్సు) చేశాడు.

ఈయన 1958వ సంవత్సరంలో డీ.ఆర్.డి.ఓ. లో జూనియర్ సైంటిస్టుగా చేరాడు. తరువాత కొద్దికాలానికే ఆ సంస్థకే డైరెక్టరు జనరల్ అయ్యాడు. మధ్యలో ఇస్రోలో సైంటిస్టుగా, డీ. ఆర్.డి.ఎల్. డైరెక్టరుగా పనిచేశాడు. 1999లో భారత ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టాడు.

అబ్దుల్ కలాంకు ‘పద్మవిభూషణ్’ వంటి పురస్కారాలతోపాటు, భారతదేశ అత్యున్నత పురస్కారమయిన ‘భారతరత్న’ లభించింది. ఈయన అగ్ని, పృథ్వి, త్రిశూల్, ఆకాశ్, నాగ్ మొదలైన క్షిపణుల రూపకల్పనకు సారథ్యం వహించి భారతదేశ క్షిపణి పితామహుడిగా పేరు పొందాడు. 1998 అణుపరీక్షలలో కలాం ముఖ్య పాత్ర పోషించాడు. అంతేగాక తేలికపాటి యుద్ధ విమానం, ప్రధాన యుద్ధ ట్యాంకు ‘అర్జున్’ ప్రాజెక్టుల రూపకల్పనకు నాయకత్వం వహించి అనేక మైలురాళ్ళను అధిగమించాడు.

అబ్దుల్ కలాం వ్యక్తిత్వం విశిష్టమయినది. ఈయన సమష్టితత్వం కలవాడు. ఈయన ఎక్కడ ఏ స్థాయిలో పనిచేసినా అందరినీ కలుపుకొని పనిచేసే మనస్తత్వం కలవాడు. కల్మషం లేని వ్యక్తిత్వం ఈయన సొంతం. ఈయన దేశం కోసం అనునిత్యం తపిస్తాడు. ఈయన ఒక శాస్త్రవేత్తగా ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం మొదలుకొని, అణుపరిజ్ఞానం ఉపయోగించడం దాకా అనేక రంగాలలో పని చేశాడు.

ఈయన ఆచరణ భగవద్గీత, ఖురాన్లు. అభిరుచి కర్ణాటక సంగీతం. ఈయన స్వప్నం అభివృద్ధి చెందిన భారతదేశం. ఈయన భారత దేశాభివృద్ధికి కలలు కనమని భారతీయులకు సందేశం ఇస్తాడు.

రాజకీయానుభవం లేకపోయినా గత రాష్ట్రపతులకు ధీటుగా ప్రత్యేక శైలిలో రాష్ట్రపతిగా పనిచేయడం కలాం విలక్షణతకు మచ్చుతునక. ఏ బాధ్యతనైనా ఈయన చక్కగా నెరవేర్చగలడు. ఈ దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళే విధానాలకు రూపకల్పన చేయగల సమర్థుడు.

కలాం గొప్ప ఆదర్శ పురుషుడు. ఎన్నికలలో ఓటువేసి, అన్ని పనులూ ప్రభుత్వమే చేయాలని అనుకోడం పొరపాటని, దేశాన్ని నిందించడం కాక దేశ వ్యవస్థను పటిష్ఠం చేసే మార్గం గురించి అందరూ ఆలోచించాలని ఈయన పలికే పలుకులు భారతీయులందరికీ ఆదర్శం.

అబ్దుల్ కలామ్ అజాద్ కు మంచితనంలో తల్లిదండ్రులు, క్రమశిక్షణలో బంధువులైన శంషుద్దీన్, అహ్మద్ జలాలుద్దీన్స్ స్ఫూర్తి. అజాద్ వంటి వ్యక్తి రాష్ట్రపతి కావడం భారతీయులందరికీ గర్వకారణము.

ప్రాజెక్టు పని

* ప్రపంచస్థాయిలో మన దేశ గౌరవం పెరగాలంటే కింద ఇవ్వబడిన అంశాలకు సంబంధించి మనమేం చేయాలో తరగతి గదిలో సమగ్రంగా చర్చించి వ్యక్తిగత నివేదిక (రిపోర్టు) ను తయారుచేయండి.
1) క్రీడలు – కళలు
2) వైజ్ఞానిక ప్రగతి
3) అవినీతి, లంచగొండితనం లేని సమాజం
4) భాషా సంస్కృతీ పరిరక్షణ
జవాబు:
1) క్రీడలు – కళలు :
121 కోట్ల జనాభా గల మన దేశం ఒలింపిక్ క్రీడల వంటి ఆటల్లో ప్రపంచస్థాయిలో ఒక్క బంగారు పతకం కూడా గెల్చుకోలేకపోతున్నది. అందుకని పాఠశాల స్థాయి నుండి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆటలలో నైపుణ్యం చూపిన వారికి ప్రత్యేక శిక్షణను ఇప్పించాలి. నగరాలన్నింటిలో మంచి క్రీడా మైదానాలు ఉండాలి. సంగీతము, చిత్రలేఖనము వంటి లలిత కళలలో ప్రతిభ చూపిన బాలురకు పోటీలు నిర్వహించి బహుమతులివ్వాలి. ప్రత్యేక్ష శిక్షణ ఇప్పించాలి.

2) వైజ్ఞానిక ప్రగతి :
మన దేశంలో విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు బాగా వ్యయం చేయాలి. అందులో ప్రతిభ చూపిన వారికి స్కాలర్ షిప్పులు ఇవ్వాలి. అవసరం అయితే విదేశాలలో శిక్షణను ఇప్పించాలి. ప్రతిభకు పట్టం కట్టాలి.

3) అవినీతి, లంచగొండితనం లేని సమాజం :
ప్రపంచంలో మనదేశం లంచగొండి, అవినీతి దేశంగా చెడ్డ పేరు తెచ్చుకొంటోంది. నిత్యం పత్రికలు ఆ విషయాలు రాస్తున్నాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణ వచ్చిన నాయకుణ్ణి ప్రజలు ఎన్నుకోరాదు. అటువంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి. సజ్జనులను ప్రోత్సహించాలి. అవినీతిపరుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.

4) భాషా సంస్కృతీ పరిరక్షణ :
మాతృభాషను ఆదరించాలి. మన సంస్కృతిని కాపాడాలి. ప్రభుత్వం దీనికి ప్రత్యేక శాఖను ఏర్పరచి, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ప్రజలు ఈ సంస్కృతిని కాపాడుకోవాలి.

అనంత కాలం ఇంకా ఆర్థిక పరిస్థను ఆస్ట్రేలు జరగా అను

VII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది పదాలకు గురువులను, లఘువులను గుర్తించండి.
UTI దేశము
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 2

2) కింది వాటిలో తప్పుగా ఉన్న గణాలను గుర్తించి సరి చేయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 3
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 4

3) ఛందస్సులో గణాల విభజన తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం.

అ) కింది పద్యపాదాలను పరిశీలించండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 5

పై పాదాల్లో “భ, ర, న, భ, భ, ర, వ” అనే గణాలు ఒకే వరుసలో వచ్చాయి కదా ! ఇలా పద్యంలో నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్తిపద్యం’ అంటారు.

పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరంగానీ, దాని వర్ణమైత్రి అక్షరంగానీ ఆపాదంలో నియమిత స్థానంలో రావటాన్ని “యతిమైత్రి” లేదా “యతిస్థానం” అంటారు.

ఈ పద్య పాదాల్లో ఆ-అ; జే (ఏ) – సి (ఇ)లకు యతిమైత్రి చెల్లింది.

పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాలలో ‘య’ అను అక్షరం వచ్చింది. ఇలా పద్య పాదాలన్నింటిలోను రెండవ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని “ప్రాసనియమం” అంటారు.

పై పద్యపాదాలు ‘ఉత్పలమాల’ పద్యానివి. పై ఉదాహరణననుసరించి ‘ఉత్పలమాల’ పద్య లక్షణాలను ఈ విధంగా పేర్కొనవచ్చు.

ఇలాంటి లక్షణాలు గల పద్యాన్ని “ఉత్పలమాల” పద్యం అంటారు. పై విషయాల ఆధారంగా ఉత్పలమాల పద్య లక్షణాలను ఎలా రాయాలో గమనించండి.

ఉత్పలమాల:

  1. ఇది వృత్తపద్యం.
  2. ఇందు నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రతిపాదంలో 10వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతిపాదంలోను 20 అక్షరాలుంటాయి.
    ఈ లక్షణాలు గల పద్యపాదమే ఉత్పలమాల పద్యపాదం.

ఆ) ఉత్పలమాల పద్య లక్షణాలు తెలుసుకున్నారు కదా ! ఈ పద్య లక్షణాల ఆధారంగా కింద ఇవ్వబడిన చంపకమాల పద్యానికి గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి పద్యం కిందగల లక్షణాలు పూరించండి.

‘అమిత పరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముడవు, నీవు, నీదయిన దాస్యము వాపికొనంగ నీకు జి
త్తము గలదేని, భూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతము దెచ్చియి మ్మనిన నవ్విహగేంద్రుడు సంతసంబునన్

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 6

చంపకమాల :

  1. ఇది వృత్త పద్యం.
  2. పద్యంలో నాలుగు పాదాలు ఉన్నాయి.
  3. ప్రతి పాదంలోను ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలు ఉన్నాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
    (అ – య) (త – దా) (త్త – ద) (క – న) వీటికి యతి మైత్రి.
  5. ప్రాస నియమం ఉంది.
  6. ప్రతి పాదంలోను 21 అక్షరాలు ఉంటాయి.

ఇ) కింది పాదాలు ఏ వృత్తాలకు సంబంధించినవో గుర్తించండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 7

గమనిక :
పై పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ గణాలు ఉన్నాయి. కాబట్టి పై పద్యపాదము ‘చంపకమాల’ వృత్తమునకు సంబంధించినది.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 8
గమనిక :
పై పాదంలో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ వృత్తము.

ఈ)కింద సూచించిన పద్యపాదాలను పూరించి గణవిభజన చేసి అవి ఏ పద్యపాదములో గుర్తించండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 9

గమనిక : పై పద్యపాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి (ప – బం) ‘చంపకమాల’ పద్యము. యతి 11వ అక్షరము.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

భూమి – వసుధ, ధరణి, అవని
కేతనం – జెండా, పతాకము
వికారి – ముని, తాపసి
గంగ – భాగీరథి, త్రిపథగ
ఖ్యాతి – కీర్తి, యశము
బ్రహ్మ – విధాత, ధాత, సృష్టికర్త

వ్యుత్పత్యర్థాలు

ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
బ్రహ్మ – ప్రజలను వర్థిల్ల చేయువాడు (విధాత)

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

నానార్థాలు

ధర్మము = పుణ్యం, న్యాయం, ఆచారం
జలం = నీరు, ఎర్రతామర
భావము = పుట్టుక, ప్రపంచం, సంసారం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
మహాభ్యుదయమ్ము = మహా + అభ్యుదయమ్ము – సవర్ణదీర్ఘ సంధి
కుమారాగ్రణి = కుమార + అగ్రణి – సవర్ణదీర్ఘ సంధి
నయవంచకాళి = నయవంచక + ఆళి – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
భరతోర్వర = భరత + ఉర్వర – గుణసంధి
సహోదరా = సహ + ఉదరా – గుణసంధి
నవ్యోజ్జ్వల = నవ్య + ఉజ్జ్వ ల – గుణసంధి

యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమముగా య, వ, రలు ఆదేశమగును.
అభ్యుదయము = అభి + ఉదయము – యణాదేశ సంధి

అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
సంపాదించుకొన్నట్టి = సంపాదించుకొన్న + అట్టి – అత్వసంధి
నేర్పినట్టి = నేర్పిన + అట్టి – అత్వసంధి
మొలకెత్తు = మొలక + ఎత్తు – అత్వసంధి
నాడులందు = నాడుల + అందు – అత్వసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
ఏదైనను = ఏది + ఐనను – ఇత్వ సంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
శిరమెత్తగా = శిరము + ఎత్తరా – ఉత్వసంధి
జోతలర్పించే = జోతలు + అర్పించె – ఉత్వసంధి
పాడయ్యె = పాడు + అయ్యె – ఉత్వసంధి
తరుణమ్మిదే = తరుణమ్ము + ఇదే – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి (అ)
సూత్రం (అ) : ప్రథమమీది పురుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
పట్టుగొమ్మ = పట్టు + కొమ్మ – గసడదవాదేశ సంధి

గసడదవాదేశ సంధి సూత్రం (ఆ) : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి.
అన్నదమ్ములు = అన్న + తమ్ముడు – గసడదవాదేశ సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

యడాగమ సంధి
సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం అవుతుంది.
కన్నయది = కన్న + అది – యడాగమ సంధి
నీళాదేశము = నీ + ఈదేశము – యడాగమ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
జాతి శిరస్సు జాతి యొక్క శిరస్సు షష్ఠీ తత్పురుష సమాసం
శాంతి చంద్రికలు శాంతి అనెడి చంద్రికలు రూపక సమాసం
గంగా నది గంగ అనే పేరుగల నది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
నా దేశము నా యొక్క దేశము షష్ఠీ తత్పురుష సమాసం
ప్రపంచ చరిత్ర ప్రపంచము యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం
నిఖిల ధరణి నిఖిలమైన ధరణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నవ్యభారతము నవ్యమైన భారతము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహామౌని గొప్పవాడైన మౌని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నీ తల్లి నీ యొక్క తల్లి షష్ఠీ తత్పురుష సమాసం
దేశభక్తి దేశము నందు భక్తి సప్తమీ తత్పురుష సమాసం
ప్రజలనాడులు ప్రజల యొక్క నాడులు షష్ఠీ తత్పురుష సమాసం
అఖండ భారతం అఖండమైన భారతం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
గట్టి ప్రతిజ్ఞ గట్టిదైన ప్రతిజ్ఞ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
హింసా పిశాచి హింస అనెడి పిశాచి రూపక సమాసం
అన్నదమ్ములు అన్నయును, తమ్ముడును ద్వంద్వ సమాసం
– సకల ప్రపంచము సకలమైన ప్రపంచము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ధాన్యాగారాలు ధాన్యమునకు ఆగారాలు షష్ఠీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

ప్రతిజ్ఞ – ప్రతిన
భూమి – బూమి
భాష – బాస
గౌరవం – గారవం
కీర్తి – కీరితి
భక్తి – బత్తి
హృదయం – ఎద
అద్భుతం – అబ్బురం
భృంగారం – బంగారం
మత్సరం – మచ్చరం

కవి పరిచయం

కవి : సురగాలి తిమోతి జ్ఞానానందకవి

జన్మస్థలం : బొబ్బిలి తాలూకా, ‘పెద పెంకి’ గ్రామంలో జన్మించారు.

జీవిత కాలం : 1922 – 2011

ఉద్యోగం : కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.

ప్రతిభ : ప్రాథమిక విద్యను నేర్చుకుంటున్నప్పుడే ఆశువుగా సీసపద్యాలు చెపుతూ “దీనబంధు శతకాన్ని” రాశారు.

రచనలు : 1) ఆమ్రపాలి 2) పాంచజన్యం 3) క్రీస్తు శతకం 4) నా జీవితగాథ 5) కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు 6) పర్జన్యం 7) గోల్కొండ మొ||నవి.

రచనా శైలి : సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించిన కవి.

అవార్డు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును 1975లో పొందారు.

పురస్కారం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “ఉత్తమ ఉపాధ్యాయ” పురస్కారం ఇచ్చింది. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

1వ పద్యము (కంఠస్థ పద్యం)

*చం. పరమ తపోనివేశనము బంగరుపంటలకు న్నివాస మ
బ్బురమగు శాంతిచంద్రికల భూమి ప్రపంచచరిత్రలోన బం
ధురతర కీర్తి గొన్న భరతోర్వర నా జనయిత్రియంచు పా
డర! శిరమెత్తరా! విజయఢంకను గొట్టుమురా! సహైదరా!
ప్రతిపదార్థాలు :
సహోదరా (సహ + ఉదరా) = ఓ సోదరా !
పరమ తపోనివేశనము ; పరమ = మేలైన (అధికమైన)
తపః + నివేశనము = తపస్సునకు ఉనికి పట్టు (తపో భూమి).
బంగరుపంటలకున్ = బంగారు పంటలకు
నివాసము = నిలయము
అబ్బురము + అగు = అసాధారణమైన
శాంతిచంద్రికల = శాంతివెన్నెలలు కురిసే
భూమి = ప్రదేశము
ప్రపంచచరిత్రలోనన్ = ప్రపంచదేశముల చరిత్రలో
బంధురతరకీర్తి ; బంధురతర = మిక్కిలి రమ్యమైన
కీర్తి = కీర్తిని
భరతోర్వరభ (రత + ఉర్వర) = భారత భూమి
నా జనయిత్రి + అంచు = నా తల్లియని
పాడర = కీర్తించు
శిరము + ఎత్తరా = తల ఎత్తుకోరా !
కైకొనుమురా = తీసికొనుము

భావం :
ఓ భారతకుమార శ్రేష్ఠుడా ! “ఇది నా దేశం. ఈమె నన్ను కన్నతల్లి. నా దేశ సౌభాగ్య సంపదలు అభివృద్ధి చెందడానికి నేను సహాయమందిస్తాను. ప్రపంచమంతటా దీన్ని పూజించేటట్లుగా గొప్ప అభివృద్ధిని నెలకొల్పుతాను” అంటూ నీవు నీ మనస్సులో గట్టిగా ప్రతిజ్ఞ చెయ్యి (చేయుము).

2వ పద్యము

మ. ఇది నాదేశము నన్నుఁ గన్నయది నా యీ దేశ సౌభాగ్య సం
పదలీ విశ్వమునందు వర్ధిలగఁ దోడ్పాటున్ బొనర్తున్ మహా
భ్యుదయమ్మున్ నెలకొల్పుదున్ భువనముల్ పూజింపనంచీవు నీ
యెదలో గట్టి ప్రతిజ్ఞఁ గైకొనుమురా! హిందూకుమారాగ్రణీ!
ప్రతిపదార్థాలు :
హిందూకుమార + అగ్రణీ = శ్రేష్ఠుడైన ఓ భారత కుమారా!
ఇది నా దేశము – ఇది నా దేశము
నన్నున్ = నన్ను
కన్నయది (కన్న + అది) = కన్నది (కనిన తల్లి)
నా, ఈ = ఈ నా యొక్క
దేశ సౌభాగ్య సంపదలు; దేశ = దేశము యొక్క
సౌభాగ్య = వైభవపు
సంపదలు = ఐశ్వర్యములు
ఈ విశ్వమునందు = ఈ ప్రపంచంలో
వర్దిలగన్ = వృద్ధి పొందడానికి
తోడ్పాటున్ = సాయమును
పొనర్తున్ = చేస్తాను
భువనముల్ = లోకములు (ప్రపంచములు)
పూజింపన్ = పూజించేటట్లుగా
మహాభ్యుదయమున్ (మహా + అభ్యుదయమున్) = గొప్ప అభివృద్ధిని = పొందిన
నెలకొల్పుదున్ = నిలబెడతాను
అంచున్ = అంటూ
ఈ వు = నీవు
నీ + ఎదలోన్ = నీ మనస్సులో
గట్టి = దృఢమైన ప్రతిజ్ఞను
విజయఢంకను = విజయఢంకాను
కొట్టుమురా – మ్రోగించరా ! (చాటింపుము)

భావం :
ఓ సోదరా ! మన దేశం తపోభూమి. బంగారు పంటలకు నిలయం. శాంతి వెన్నెలలు కురిసే పుణ్యభూమి. ప్రపంచంలో మనోహరమైన కీర్తిని పొందిన ఈ భరతభూమి నా తల్లి అని గర్వంగా తల ఎత్తుకొని చాటిస్తూ, విజయఢంకాను మ్రోగిస్తూ నీ దేశం గురించి కీర్తించు.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

3వ పద్యము (కంఠస్థ పద్యం )

*ఉ. జాతి శిరస్సు నెత్తికొని క్ష్మాతలవీధిని గౌరవాన హుం
తన మొప్పగాఁ దిరిగినన్ గలుగున్ గడుకీర్తి భారత
క్ష్మాతలి కట్టి భాగ్యమును గల్గగ శాంతి సముద్ధరింప లే
రా ! తరుణమ్మిదే మరల రాదు సుమీ! గతకాల మెన్నడున్
ప్రతిపదార్థాలు :
జాతి = భారతజాతి
శిరస్సున్ + ఎత్తి = తల ఎత్తుకొని
క్ష్మాతల వీధిని . = భూమండలంలో (ప్రపంచంలో)
గౌరవాన = గౌరవంగా
హుందాతనము + ఒప్పగాన్ = హుందాగా
తిర్గినన్ = తిరిగితే
కడు = మిక్కిలి
కీర్తి = కీర్తి
కలుగున్ = కలుగుతుంది
అట్టి భాగ్యమును = అటువంటి సౌభాగ్యము
కల్గగన్ = కలిగే విధంగా
శాంతిన్ = శాంతిని
సముద్ధరింపన్ = పైకి తేవడానికి (లేవనెత్తడానికి)
లేరా = లెమ్ము
తరుణము + ఇదే = ఇదే తగిన సమయము
ఎన్నడున్ = ఎప్పుడునూ
గతకాలము = జరిగిపోయిన కాలం
మరల రాదు సుమీ = తిరిగి రాదు సుమా !

భావం :
భారత జాతి తల ఎత్తుకొని ప్రపంచ వీధిలో సగౌరవంగా, హుందాగా తిరిగినప్పుడే గొప్ప కీర్తి కలుగుతుంది. మన దేశానికి అటువంటి సౌభాగ్యం కలిగే విధంగా శాంతిని పెంపొందించడానికి ఇదే సరైన సమయము. అందుకు సిద్ధం కండి. ఎందుకంటే పోయిన కాలం తిరిగి రాదు కదా !

4వ పద్యము

మ. మతమేదైనను భాషయేదయిన సంపాదించుకొన్నట్టి సం
స్కృతి యేదైనను నిండు నీ తనువులో జీర్ణించు జాతీయతా
హితనవ్యోజ్జ్వల భావబంధురత లీ హింసా ప్రపంచాన క
ద్భుత రీతిన్ గనిపింపగా వలయు బాబూ! శాంతి దీక్షారతా!
ప్రతిపదార్థాలు :
(ప్రపంచానికి) శాంతి దీక్షారతా = శాంతి దీక్షయందు ఆసక్తి గలవాడా !
మతము = నీ మతము
ఏదయినను (ఏది + అయినను) ఏమయినప్పటికీ
భాషయేదయిన = నీ భాష ఏదయినా
సంపాదించుకున్నట్టి (సంపాదించుకున్న + అట్టి) = ఆర్జించినట్టి
సంస్కృతి – నాగరికత (సంస్కారము)
ఏదైనను (ఏది + ఐనను) = ఏదయినా
నిండు = నిండైన
నీ తనువులో = నీ శరీరములో (నీ నరనరాల్లో)
జీర్ణించు = నిండిన
జాతీయతా = భారత జాతీయత అనే
హిత = మేలయిన
నవ = కొత్తయైన
ఉజ్జ్వల = ప్రకాశించే
భావబంధురతలు = ఇంపైన భావములు
ఈ హింసా ప్రపంచానకున్ = ఈ హింసతో నిండిన ప్రపంచానికి
అద్భుత రీతిన్ = అద్భుతంగా
కనిపింపగా వలయున్ = కనిపించాల్సిన అవసరం ఉంది

భావం :
శాంతి దీక్షయందు ఆసక్తి గలవాడా ! నీ మతం, భాష, సంస్కృతి ఏవయినప్పటికీ, నీ నరనరాల్లో నిండిన భారతీయ భావన హింసతో నిండిన ఈ ప్రపంచానికి అద్భుతంగా కనిపించాలి.

5వ పద్యము

తే.గీ. నిఖిల ధరణికి శాంతిని నేర్పినట్టి
భరత భువనమ్ము నీ తల్లి ప్రథితయశము
నిలువఁబెట్టుట నీవంతు నిశ్చయముగ
నీకుఁ గలదు బాధ్యతయు హిందూకుమార!
ప్రతిపదార్థాలు :
హిందూకుమార ! = ఓ భారత కుమారా !
నిఖిల ధరణికిన్ = సమస్త భూమండలానికీ
శాంతిని = శాంతి మార్గాన్ని ముందు
నేర్పినట్టి (నేర్పిన + అట్టి) = నేర్పించినట్టి
భరత భువనమ్ము = భారత భూమి (భారతదేశం)
నీ తల్లి = నీకు తల్లి
ప్రథిత యశము = ప్రసిద్ధి పొందిన కీర్తి
నిలువబెట్టుట = నిలబెట్టడం
నిశ్చయముగ = తప్పక
నీ వంతు = నీ వాటా
నీకున్ = నీకు
బాధ్యతయు = పూచీయూ
కలదు = ఉంది

భావం :
ఓ భారత కుమారా ! సమస్త భూమండలానికి శాంతిని నేర్పినది భారతదేశం. నీ తల్లియైన ఈ భారతదేశం యొక్క సముజ్జ్వల కీర్తిని నిలబెట్టాల్సిన బాధ్యత నీమీద ఉంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

6వ పద్యము

సీ. శిరమెత్తరాదు మచ్చరికించి విషపు దౌ
ర్జన్య కులమత హింసాపిశాచి
నిలవఁగారాదు పెన్ బలిసిపోయిన దుష్ట
నయవంచకాళి గూండాయిజమ్ము
తొలచఁగారాదు విద్రోహాన దేశ భా
గ్యాల దార్యతను లంచాల జలగ
వచియింపఁగారాదు ప్రతినిధి యగువాడు
పగ ననల్ మొలకెత్త పలుకుబడుల

ఆ.వె. అంద అన్నదమ్ములన్న మధురమైన
ధర్మమునకు దెబ్బతగులరాదు
నాడురా ! సమేకతా డిండిమము మ్రోగు
వసుధ పొగడ నవ్యభారతమున
ప్రతిపదార్థాలు :
మచ్చరికించి = పట్టు పట్టి
విషపు = తీవ్రంగా వ్యాపించే
దౌర్జన్య కులమత హింసాపిశాచి;
దౌర్జన్య = దుండగములు (దౌర్జన్యములు)
కులమత = కులానికి, మతానికి చెందిన
హింసా పిశాచి = హింస అనే భూతము
శిరము + ఎత్తరాదు = తల ఎత్తరాదు (చెలరేగరాదు)
పెన్ = పెద్దగా
బలిసిపోయిన = పెరిగిపోయిన
దుష్ట = దుష్టులు
నయవంచక + ఆళి = నయవంచకుల సమూహం యొక్క (మోసగాండ్ర యొక్క)
గూండాయిజమ్ము = గూండాయిజం
నిలువగా రాదు = నిలువకూడదు
దేశభాగ్యాల = దేశ సౌభాగ్యముల
దాద్యతను = సత్తువను
లంచాల జలగ = లంచములు అనే జలగ
తొలచగా రాదు = పీల్చరాదు
ప్రతినిధి + అగువాడు = ప్రజా ప్రతినిధులయిన వారు (శాసనసభ్యులు)
పగ = శత్రుత్వము
ననల్ = చివుళ్ళు
మొలకెత్తన్ = అంకురించేలా
పలుకుబడులు = మాటలు
వచియింపగారాదు = మాట్లాడరాదు
అందరు = దేశప్రజలు అందరూ
అన్నదమ్ములు = సోదరులు
అన్న = అనిన
మధురమైన = తీయని
ధర్మమునకున్ = ‘ధర్మానికి
దెబ్బ తగులనీయరాదు = దెబ్బ తగలకూడదు
నవ్య భారతమున = నూతన భారతదేశంలో
వసుధ పొగడన్ = ప్రజలు పొగిడేలా
సమేకతా = సమైక్యము అనే
డిండిమము = ఢక్కా
నాడు = ఆనాడే
మ్రోగున్ రా = ధ్వనిస్తుందిరా !

భావం :
ఇటువంటి పుణ్యదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కులమత హింసలు అనే పిశాచాలను తలయెత్తనీయకూడదు. నానాటికీ పెరిగిపోతున్న దుష్టుల, మోసగాళ్ళ యొక్క గూండాయిజం నిలువకూడదు. బలిష్ఠమైన దేశ సౌభాగ్యాన్ని లంచాలు అనే జలగలు పట్టి పీల్చకూడదు. పగలు, సెగలు రగిలించే మాటలు ప్రజా ప్రతినిధులైన వారు మాట్లాడకూడదు. మనమంతా అన్నదమ్ములం అన్న తీయనైన ధర్మానికి దెబ్బతగులనీయకూడదు. అలా జరిగినప్పుడు సమైక్యము అనే ఢక్కా నవ్యభారతంలో ప్రజలు పొగిడేలా మోగుతుంది.

7వ పద్యము (కంఠస్థ పద్యం)

*శా. ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్
ఈ గోదావరి సింధు నర్మదలు నీ యీదేశ సౌభాగ్య ధా
న్యాగారాలకు పట్టుగొమ్మలు నఖండంబైన నీ ధారుణీ
భాగ్యమ్మీ సకల ప్రపంచమునకున్ స్వామిత్వముం బూనెడిన్
ప్రతిపదార్థాలు:
ఈ గంగానది = ఈ గంగానది
బ్రహ్మపుత్రయునున్ = బ్రహ్మపుత్రా నదియును
ఈ కృష్ణమ్మ = ఈ కృష్ణా నదియు
కావేరియున్ = కావేరీ నదియు
ఈ గోదావరి = ఈ గోదావరి నదియు
సింధు నర్మదలు = సింధు నదియు, నర్మదా నదియు
నీ + ఈ దేశ = నీ యొక్క ఈ భారతదేశపు
సౌభాగ్య ధాన్యాగారాలకు = సౌభాగ్యానికీ, ధాన్యాగారాలకు
పట్టుగొమ్మలు (పట్టు + కొమ్మలు) = ఆధారములు
అఖండంబయిన = సంపూర్ణమైన
ఈ ధారుణీ భాగమ్ము = ఈ భూభాగము
ఈ సకల ప్రపంచమునకున్ = ఈ సమస్త ప్రపంచానికి
స్వామిత్వమున్ = ఆధిపత్యమును
పూనెడిన్ = వహిస్తుంది

భావం :
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, కావేరి, గోదావరి, సింధు, నార్మద అనే జీవనదులు ఈ దేశ సౌభాగ్యమైన ధాన్యాగారాలకు ముఖ్యమైన ఆధారం. అఖండమైన సౌభాగ్య సంపదలు గలిగిన ఈ దేశం ప్రపంచానికి అధిపతి అయ్యింది.

8వ పద్యము

తే.గీ. ముసలి సన్న్యాసి బాపూజీ బోసినోరు
విప్పిపలికిన పలుకుకే విశ్వజగతి
జోతలర్పించె జాతికి ఖ్యాతి యదియ
ఆ మహామౌని నేల పాడయ్యె నేడు
ప్రతిపదార్థాలు :
ముసలి సన్న్యాసి = ముసలివాడైన సన్న్యాసి వంటివాడైన
బాపూజీ = గాంధీజీ యొక్క
బోసినోరు = పళ్ళులేని నోరు
విప్పి = విప్పి
పలికిన = మాట్లాడిన
పలుకుకే = మాటకే
విశ్వజగతి = ప్రపంచము
జోతలు + అర్పించే = జోహార్లు సమర్పించింది
అదియ = అది ప్రపంచం, గాంధీజీకి జోహార్లు సమర్పించడం అన్నది
జాతికి= భారత జాతికి
ఖ్యాతి = కీర్తినిచ్చేది ఖ్యాతి
ఆ మహామౌని = ఆ గొప్ప మునివంటి గాంధీజీ పుట్టిన
నేల = భూమి (భారతదేశం)
నేడు = ఈనాడు
పాడయ్యె = చెడిపోయింది (గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నడవడం లేదు)

భావం :
గొప్ప ముసలి సన్యాసి వంటి గాంధీజీ తన బోసి నోరు విప్పి పలికిన పలుకులకు (శాంతి సందేశానికి) ప్రపంచ మంతా జేజేలు పలికింది. అందువల్ల మన భారత జాతికి ఖ్యాతి వచ్చింది. అటువంటి మహాత్ముని కన్న భూమి, నేడు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నడవడం లేదు.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

9వ పద్యము

ఆ.వె. దేశభక్తి మఱియు దేశసమగ్రత
ప్రజల నాడులందు ప్రబలి ప్రబలి
కర్మభూమియగు నఖండ భారతమహా
క్షితిని నెగురు ప్రగతి కేతనమ్ము
ప్రతిపదార్థాలు :
దేశభక్తి = దేశమునందు భక్తి
మఱియున్ = మఱియు
దేశసమగ్రత = దేశము యొక్క సమగ్రత అనే భావాలు
ప్రజల నాడులందు = ప్రజల నరనరాలలో
ప్రబలి, ప్రబలి = బాగా వ్యాపించి
కర్మ భూమి + అగు = పుణ్యభూమియైన
అఖండ భారత మహాక్షితిని ;
అఖండ = సంపూర్ణమైన
భారత = భారతము అనే
మహాక్షితినిన్ = గొప్ప నేలపై
ప్రగతి కేతనమ్ము = అభివృద్ధి అనే జెండా
ఎగురు = ఎగురుతుంది

భావం :
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు, ప్రజల నరనరాల్లో వ్యాపించి, పుణ్యభూమియైన అఖండ భారతదేశంలో ప్రగతి జెండా రెపరెపలాడుతూ ఎగురుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 8 జీవన భాష్యం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 8th Lesson జీవన భాష్యం

8th Class Telugu 8th Lesson జీవన భాష్యం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

“శ్రద్ధగలవాడే జ్ఞానాన్ని పొందుతాడు”.
“కటిని తిడుతూ కూర్చోడం కన్నా చిన్న దీపం వెలిగించు”.
“అణుశక్తి కన్నా ఆత్మశక్తి మిన్న”.
“త్యాగగుణానికి తరువులే గురువులు”.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై వాక్యాల ద్వారా మీరేం గ్రహించారు?
జవాబు:
పై వాక్యాల ద్వారా కొన్ని సూక్తులను తెలుసుకున్నాము. కొన్ని సందేశాలను, ఉపదేశాలను గ్రహించాము.

ప్రశ్న 2.
ఇలాంటి వాక్యాలనేమంటారు?
జవాబు:
ఇలాంటి వాక్యాలను సుభాషితములని, సూక్తులని అంటారు. మంచి మాటలు, సందేశాలు అని కూడా అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

ప్రశ్న 3.
ఇలాంటి సందేశాలు, మంచిమాటలు ఇంకా ఏ ఏ రూపాలలో ఉంటాయి?
జవాబు:
ఇలాంటి సందేశాలు, మంచి మాటలు పద్యాలు, శ్లోకాలు, గేయాలు, మినీ కవితలు, గజళ్ళు మొదలైన రూపాలలో ఉంటాయి.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
‘జీవన భాష్యం’ గజలను రాగయుక్తంగా, భావయుక్తంగా పాడండి.
జవాబు:
పాడడం, మీ ఉపాధ్యాయుల సాయంతో నేర్చుకోండి.

ప్రశ్న 2.
‘జీవన భాష్యం’ అనే పేరు ఈ పాఠానికి తగిన విధంగా ఉందా? ఎందుకు? చర్చించండి.
జవాబు:
‘జీవన భాష్యం’ అంటే బ్రతుకు పై వ్యాఖ్యానం. జీవితం ఎలా నడిపించుకోవాలో వివరంగా చెప్పడమే ‘జీవన భాష్యం’. ఈ గజల్ లో నారాయణరెడ్డి గారు జీవితమును గూర్చి కొన్ని సత్యాలు చెప్పారు. మనసుకు దిగులు మబ్బు ముసిరితే కన్నీళ్ళు వస్తాయన్నారు. ఆటంకాలు వస్తాయనీ, జంకకుండా అడుగులు వేయాలనీ చెప్పారు. బీడు భూములు దున్ని విత్తితే పంటలు పండుతాయని చెప్పారు. మనుషులు అందరూ కలిసి ఉండాలని చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా జీవితంలో పరీక్షలు తప్పవన్నారు. కేవలం బిదుదులు పొందినంత మాత్రాన విలువలేదనీ, మంచి త్యాగం చేస్తేనే మనిషి పేరు నిలబడుతుందని చెప్పారు. ఈ విధంగా జీవితం గూర్చి వివరించి చెప్పినందువల్ల ‘జీవనభాష్యం’ అన్న పేరు ఈ పాఠానికి తగియుంది.

ప్రశ్న 3.
ఈ “గజల్స్” ద్వారా “సినారె” ఏం సందేశమిస్తున్నారు?
జవాబు:
లక్ష్యసాధనలో ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయనీ, అయినా జంకకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుందనీ, ఆ స్ఫూర్తె నలుగురూ అనుసరించే దారి అవుతుందని సినారె చెప్పారు.

  • ఎడారి దిబ్బలను దున్నితే ఏమి ఫలితం ఉండదని అనుకోక, వాటిని దున్నితే పంటలు పండుతాయని చెప్పారు.
  • మనుషులు తమలో తాము భేదాలు ఎంచుకోకుండా కలసిమెలిసి జీవించాలని చెప్పారు.
  • మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా పరీక్ష ఉంటుందని గుర్తు చేశారు.
  • బిరుదులు, సత్కారాలు పొందడంలో విలువ, గుర్తింపు లేవని, మానవాళికి పనికివచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని సినారె సందేశమిచ్చారు.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. అ) కరిగితే, ముసిరితే, మమత, దేవత, పెరిగి, మరిగి వంటి పదాలు గజల్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి, వాటి కింద గీత గీయండి. ఆ పాదాలు రాయండి.
జవాబు:

  1. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.
  2. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది.
  3. నిలువెల్ల మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు
  4. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు
  5. విరిగినపుడు నిలువెత్తుగా పెరిగి తెలుసుకో
  6. మౌలిక తత్వం సలసల మరిగి తెలుసుకో

ఆ) గజళ్ళలో కవి తన గురించి ప్రస్తావించిన పంక్తులు ఏవి? వాటిని రాసి భావాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
బిరుదులు పొందే వ్యాప్తికీ విలువేమి “సినారే”. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది – అనే పంక్తులు కవి తన గురించి ప్రస్తావించినవి.

భావం :
ఓ సినారే! గొప్ప బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికొచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. కింది పేరాను చదివి, ఐదేసి ప్రశ్నలు తయారుచేయండి.

చైనా తత్త్వవేత్త కన్ఫ్యూషియస్. ఆయన చాలా తెలివైనవాడు. ఒక రాజుగారు అతణ్ణి గురించి విని తన సభకు పిలిపించుకున్నాడు. మూడు పంజరాలు చూపించాడు. మొదటి పంజరంలో ఒక ఎలుక, దాని ఎదురుగా తినే పదార్థాలు ఉన్నాయి. రెండో పంజరంలో పిల్లి ఉంది. దాని ఎదురుగా పళ్ళెంలో పాలు ఉన్నాయి. మూడో పంజరంలో ఒక గద్ద ఉంది. దాని ఎదురుగా తాజా మాంసం ఉంది. కానీ ఎలుక ఏ పదార్థం తినటం లేదు; పిల్లి పాలు ముట్టుకోవడం లేదు; గద్ద కూడా మాంసం ముట్టడం లేదు. దీనికి కారణమేమిటి? అని అడిగాడు రాజు. తత్త్వవేత్త ఇలా సమాధానం ఇచ్చాడు- “పిల్లిని చూసి భయపడి ఎలుక ఆహారం తీసుకోలేదు. పిల్లి ఎలుకమీద ఆశతో పాలు ముట్టుకోలేదు. పిల్లిని, ఎలుకను ఒకేసారి తినాలనే ఆశతో గద్ద మాంసం ముట్టుకోలేదు. అలాగే భవిష్యత్తు మీద ఆశతో ప్రజలు వర్తమానాన్ని విస్మరిస్తున్నారు. సుఖానికి దూరమవుతున్నారు. ఈ సమాధానానికి సంతృప్తిపడి రాజు కన్ఫ్యూషియకు విలువైన బహుమానాన్ని ఇచ్చాడు.
జవాబు:
ప్రశ్నలు:

  1. కన్ఫ్యూషియస్ ఎవరు? ఆయన ఎలాంటివాడు?
  2. మొదటి, రెండు, మూడు పంజరాలలో ఏమేమి ఉన్నాయి?
  3. మూడో పంజరం ఎదురుగా ఏమి ఉంది?
  4. రాజు ఏమని ప్రశ్నించాడు?
  5. రాజు అడిగిన ప్రశ్నకు తత్త్వవేత్త ఏమి సమాధానమిచ్చాడు?

3) కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.

అ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యంలో మీరేమి గ్రహించారు?
జవాబు:
ఎడారిలో ఇసుకదిబ్బలు ఉంటాయి. అక్కడ నీళ్ళు దొరకవు. ఇసుక నేలల్లో పంటలు పండవు. అందువల్ల నీళ్ళు దొరకని ఎడారులలోని ఇసుక దిబ్బలను దున్నితే ఫలితము ఏముంటుంది? అవి వ్యవసాయానికి పనికిరావు కదా ! అని నిరాశపడరాదని కవి చెప్పాడు. సేద్యానికి పనికిరావు కదా అని బంజరు బీడులను దున్నకుండా విడిచి పెట్టవద్దనీ, వాటిని దున్ని విత్తులు చల్లితే చక్కని పైరుపంటలు పండుతాయనీ, నిరాశ పనికిరాదనీ, ఆశావహ దృక్పథంతో ముందుకు నడిస్తే తప్పక ఫలితాలు వస్తాయనీ కవి ఈ వాక్యాల ద్వారా సందేశం అందించాడు.

ఆ) నిలువెల్లా మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు – అంటే మీకేమి అర్థమైంది?
జవాబు:
సి. నారాయణరెడ్డిగారు తల్లిని చక్కగా అభివర్ణించారు. మాతృత్వ మధురిమలను సుమనోహరంగా ఆవిష్కరించారు. మానవునికి తొలి గురువు తల్లి. చేతులను పట్టుకొని నడిపిస్తుంది. అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. మమతానురాగాలను అందిస్తుంది. మూర్తీభవించిన శాంతమూర్తి తల్లి. మమతను అందిస్తుంది. మనలో దుఃఖాన్ని తొలగిస్తుంది. సుఖాన్ని కల్గిస్తుంది. వెలుగులా దారి చూపిస్తుంది. అందుకే సి.నా.రె. గారు తల్లిని ఉద్దేశించి, నిలువెల్ల మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు – అని ప్రశంసాత్మకంగా అన్నాడు.

ఇ) సమైక్య సంఘర్షణ అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు:
పచ్చదనమంటే అది వృక్ష సంపదకు చిరునామా. చినుకులు కురవాలంటే మేఘం రూపుదిద్దుకోవాలి. కేవలం ప్రభుత్వాలు, చట్టాల వలన సమాజం బాగుపడదు. ఎవరికి వారు స్వీయక్రమశిక్షణను, నైతిక నియమాలను అలవరచుకోవాలి. రాశికన్నా వాసి ముఖ్యం. పుక్కిటి పురాణాలు ఎన్ని రాసినా ప్రయోజనం శూన్యం. సమైక్యతతోనే సంఘం వర్థిల్లుతుంది గానీ, వ్యక్తిగతంగా పోరాడి సాధించేది ఏమీ ఉండదు. మానవతను మేలుకొలిపేదే నిజమైన సాహిత్యమవుతుంది. అలాగే తోటి మనిషికి సేవచేసే దయగల మనుషుల్లోనే దైవం దాగి ఉందనే భావాన్ని కవి వ్యక్తపరిచారు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) ఈ పాఠంలో గజల్ ప్రక్రియను గూర్చి తెలుసుకున్నారు కదా ! మీకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియల పేర తెలపండి. వాటిని గురించి రాయండి.
జవాబు:
నాకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియలు :
1. ప్రబంధం
2. కథానిక
3. ఆత్మకథ
4. ఇతిహాసం

1. ప్రబంధం :
పురాణేతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి స్వతంత్ర కావ్యంగా వ్రాస్తే దాన్ని “ప్రబంధం” అంటారు. మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్తమాల్యద మొ||నవి ప్రబంధాలు.

2. కథానిక :
ఒక వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్నీ, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించ సాహిత్య ప్రక్రియను “కథానిక” అంటారు. ఇది వచన ప్రక్రియ. మరీ చిన్నదిగాను, మరీ పెద్దది గాను లేకుండా ఉండటం కథానిక లక్షణం.

3. ఆత్మకథ :
ఆత్మకథ అంటే తనను గురించి తాను రాసుకొన్న కథ. ఎవరైనా తమ ఆత్మకథను రాసుకోవచ్చు. అవి ఆత్మకథలే అయినా సమాజ జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ప్రముఖ వ్యక్తులు తమ జీవితాల గురించి రాసుకొన్న విషయాలు సమకాలిక సమాజానికి వ్యాఖ్యానాలుగా ఉపయోగపడతాయి.

4. ఇతిహాసం :
ఇతిహాసం అంటే పూర్వ కథ అని అర్థం. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆశురూపంలో ఉండేవి. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, భారతం మొ||నవి ఇతిహాసాలు.

ఆ) మంచి పంటలు పండడానికి రైతు చేసే శ్రమ ఎలాంటిదో వివరించండి.
(లేదా)
విరామము లేకుండా శ్రమిస్తూ మనకు అన్నం పెడుతున్న కర్షకుల శ్రమను గురించి వివరించండి.
జవాబు:
మంచి పంటలు పండించాలంటే రైతులు పొలాల్ని చక్కగా దున్నాలి. తరువాత నీరు పెట్టాలి. మంచి విత్తనాలు తెచ్చి, నారుమళ్ళు వేయాలి. సేంద్రియ ఎరువుల్ని వేయాలి. పశువుల పేడను ఎరువులుగా వేస్తే మంచిది. పురుగుమందులు ఎక్కువగా వాడరాదు. సకాలంలో చేనుకు నీరు పెట్టాలి. కలుపు మొక్కలను తీసిపారవేయాలి. చేనును ఆరబెట్టి, సకాలంలో చేనుకు నీరందించాలి. ఎలుకల బెడద లేకుండా చూసుకోవాలి. రైతులు నిత్యం చేనును గమనించాలి. ఏదైనా పురుగుపడితే వేప పిండి వగైరా చల్లి వాటిని అరికట్టాలి. వర్షాధారంగా పండే పంట అయితే, నీరు కావలసినపుడు ఇంజన్ల ద్వారా తోడి నీరు పెట్టాలి. రైతు ఇంతగా శ్రమిస్తేనే మంచిపంటలు పండుతాయి.

ఇ) ఓటమి కలిగినపుడు మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది? వివరించండి.
జవాబు:
సాధారణంగా ఓటమి మానవుని కుంగదీస్తుంది. నీరసింపజేస్తుంది. శూన్యుడిగా మారుస్తుంది. అయితే మానవుడు ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలని బోధించాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఉపదేశించాడు.

పరమాణువులో దాగిన లక్షణాలను విశ్లేషించడం ద్వారా భూమి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. సముద్రంలోతు తెలియాలంటే కారే కన్నీటి బిందువుల వెనుక దాగున్న కష్టాల కడలిని అర్థం చేసుకోవాలి. సంతృప్తి గురించి తెలియాలంటే, ఎంత సంపద ఉన్నా సంపన్నులు పొందలేకపోతున్న సంతృప్తిని తమ కళారాధనతో పొందుతున్న కళాకారులను పరిశీలించాలి. గుండెలోతుల్లో నుండి ప్రేమతో పలకరించే వారూ, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారూ ఉంటారు. ఎవరి మాట వెనుక ఏ ఏ అర్థాలున్నాయో తెలుసుకోగలగాలి. కెరటం నాకు ఆదర్శం. పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నట్లుగా ఓటమిని జయించాలంటే కెరటంలా కిందపడినా పైకి లేవగలగాలి. పండిన చెట్టు వంగడానికి కారణం ఉపకార గుణం. అలా ఎంత ఎదిగినా ఒదిగి ఉపకరించడం నేర్చుకోవాలి. అనాయాసంగా ఏదీ పట్టుబడదు. విజయం సాధించాలంటే కష్టపడడం తప్ప మరొక దొడ్డిదారి ఏదీ లేదు. దాని మూలాలను బాగా శోధించి తెలుసుకోవాలనే భావనను ఈ గజల్ ద్వారా సి.నా.రె గారు తెలిపారు.

ఈ) అమ్మను జ్ఞానపీఠంగా కవి ఎందుకు వర్ణించాడు?
జవాబు:
‘జీవన భాష్యం’ అనే పాఠ్యభాగంలో నారాయణరెడ్డిగారు మాతృత్వాన్ని, అమ్మ గొప్పతనాన్ని చక్కని మాటలతో ఆవిష్కరించారు. అమ్మ గొప్పతనాన్ని చక్కగా తెలియజేశారు. అమ్మ మనకందరికి తొలి గురువు.

పెరిగే సినారె బ్రతుకులో దొరికింది అమ్మ ప్రాపు.

చిన్నప్పుడు ఆ బొమ్మ కావాలి ! ఈ మిఠాయి కావాలి ! అని మొండికేసి ఇప్పుడే కొని పెట్టమని మంకుపట్టు పట్టి అమ్మ చంకనెక్కి ఇదుగో ఈ బండి చూడు ఎంత బాగుందీ అదుగో ఆ గుర్రం చూడు అది నీకే అంటూ బుజ్జగించినా అమ్మ చంక దిగలేదు. నేనెంత అల్లరి చేసినా, చిరునవ్వుతో భరించింది. దెబ్బతగిలి ఏడుస్తున్నప్పుడు ఓర్చుకోవాలని, మిత్రులతో దెబ్బలాడినపుడు సర్దుకోవడం నేర్చుకోవాలనీ జ్ఞాన బోధచేస్తూ నా బాల్యమంతా వేలుపట్టి నడిపించింది. చీకటిలో ఏమీ కనిపించనపుడు తన వెన్నెల వెలుగులతో దారిని చూపే చంద్రునిలా, ఆకలైనపుడు ఆకలికి తీర్చే నిండుకుండలా తన ప్రేమానురాగాలతో వెలుగులా నిలిచింది అమ్మ. మెరిసే సూర్యోదయకాలపు సూర్యకిరణంలా వసంత ఋతువులో పూచే పూవులా పెరిగిన నాకు అమ్మ అండ దొరికిందని ఈ గజల్ ద్వారా కవి అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) సంతకం యొక్క ప్రాధాన్యం ఏమిటి ? సంతకం గురించి సినారె ఏమి చెప్పారు?
జవాబు:
ఆధునిక సమాజంలో సంతకానికి తరగని విలువ ఉంది. సంతకం లేని ఏ ఉత్తరువు చెల్లనేరదు. ఒక్క సంతకం జీవితాన్నే మారుస్తుంది. కవి సంతకం యొక్క గొప్పదనాన్ని తన పరిభాషలో చక్కగా వ్యక్తపరిచారు.
పచ్చదనమంటే అది వృక్ష సంపదకు చిరునామా. చినుకులు కురవాలంటే మేఘం రూపుదిద్దుకోవాలి. కేవలం ప్రభుత్వాలు, చట్టాల వలన సమాజం బాగుపడదు. ఎవరికి వారు స్వీయక్రమశిక్షణను, నైతిక
నియమాలను అలవరచుకోవాలి. రాశికన్నా వాసి ముఖ్యం. పుక్కిటి పురాణాలు ఎన్ని రాసినా ప్రయోజనం శూన్యం. సమైక్యతతోనే సంఘం వర్ధిల్లుతుంది గానీ, వ్యక్తిగతంగా పోరాడి సాధించేది ఏమీ ఉండదు. మానవతను మేలుకొలిపేదే నిజమైన సాహిత్యమవుతుంది. అలాగే తోటి
మనిషికి సేవచేసే దయగల మనుషుల్లోనే దైవం దాగి ఉందనే భావాన్ని ఈ గజల్ ద్వారా కవి వ్యక్తపరిచారు.

ఆ) తెలుసుకోడం వల్ల ప్రయోజనం ఏమిటి ? కవి ఏమేమి తెలుసుకోమన్నాడు?
(లేదా)
సి.నా.రె గారు గజల్ అనే ప్రక్రియ ద్వారా తెలుసుకోవడం వల్ల ప్రయోజనాలు చెప్పారు. అవి మీ మాటల్లో రాయండి.
జవాబు:
పరమాణువులో దాగిన లక్షణాలను విశ్లేషించడం ద్వారా భూమి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. సముద్రంలోతు తెలియాలంటే కారే కన్నీటి బిందువుల వెనక దాగున్న కష్టాల కడలిని అర్థం చేసుకోవాలి. సంతృప్తి గురించి తెలియాలంటే, ఎంత సంపద ఉన్నా సంపన్నులు పొందలేకపోతున్న సంతృప్తిని తమ కళారాధనతో పొందుతున్న కళాకారులను పరిశీలించాలి. గుండెలోతుల్లో నుండి ప్రేమతో పలకరించే వారూ, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారూ ఉంటారు. ఎవరి మాట వెనుక ఏ ఏ అర్థాలున్నాయో తెలుసుకోగలగాలి. కెరటం నాకు ఆదర్శం. పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నట్లుగా ఓటమిని జయించాలంటే కెరటంలా కిందపడినా పైకి లేవగలగాలి. పండిన చెట్టు వంగడానికి కారణం ఉపకార గుణం. అలా ఎంత ఎదిగినా ఒదిగి ఉపకరించడం నేర్చుకోవాలి. అనాయాసంగా ఏదీ పట్టుబడదు. విజయం సాధించాలంటే కష్టపడడం తప్ప మరొక దొడ్డిదారి ఏదీ లేదు. దాని మూలాలను బాగా శోధించి తెలుసుకోవాలనే భావనను ఈ గజల్ ద్వారా సి.నా.రె గారు తెలిపారు.

IV. పదజాలం

1. కింది పదాలకు అర్థాలు తెలుసుకోండి. ఆ పదాల్ని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) ముసరడం = క్రమ్ముకోవడం, చుట్టుముట్టడం, వ్యాపించడం
సొంతవాక్యం : ఆకాశంలో నీలిమేఘాలు ముసరడంతో చీకటిగా ఉంది.

ఆ) అలవోకగా = అతి సులువుగా, తేలికగా
సొంతవాక్యం : కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో అలవోకగా బరువును ఎత్తింది.

ఇ) పూర్ణకుంభం = నిండినది, సమస్తము
సొంతవాక్యం : అధికారులకు దేవాలయాలలో పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు.

ఈ)హృదయం = మనసు, ఎద
సొంతవాక్యం : సజ్జనుల హృదయం ఎప్పుడూ మంచి ఆలోచనతోనే ఉంటుంది.

V. సృజనాత్మకత

* ‘జీవన భాష్యం’ గజల్ లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
జవాబు:
……………. నీరవుతుంది.
…………….దారవుతుంది.
……………. పైరవుతుంది.
……………. ఊరవుతుంది.
……………. ఏరవుతుంది.
……………. పేరవుతుంది.
జవాబు:
సొంత వచన కవిత :
1) శాంతి, మంచు కూడితే కోపాగ్ని నీరవుతుంది.
2) పదిమందీ అట్లానే నడిస్తే అదే నీ దారవుతుంది.
3) సకాలంలో విత్తులు చల్లితే ఆ విత్తే పైరవుతుంది.
4) కులమత భేదాలే కూలితే ఉన్నదే ఊరవుతుంది.
5) శక్తికి మించని త్యాగం నీ ఈవికి ఏరవుతుంది.
6) పదిమందీ నిను పొగిడితే నీ కీర్తికి పేరవుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

(లేదా)

*ఆచార్య సి.నారాయణరెడ్డిగారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి దగ్గర ఏం తెలుసుకోవాలనుకొంటున్నా! ప్రశ్నలు రాయండి.
జవాబు:
ప్రశ్నలు : 1) సినారె గారూ ! మీరు సాహిత్య రచనలు ఎప్పటి నుంచి ప్రారంభించారు?
2) మీరు వ్రాసిన సినిమా పాటలు మీరు వింటున్నపుడు మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది?
3) మీరు ఇంత గొప్ప రచయితగా మారటానికి ప్రేరణ ఎవరు?
4) మీరు “పద్మభూషణ్” బిరుదును పొందినపుడు మీరు ఎలా స్పందించారు?
5) సినీ గేయ రచయితగా మీకు నచ్చిన సినిమా పాట ఏది?
6) వేటూరిని గొప్ప సినీ గేయ రచయిత అంటారు కదా ! వారి రచనలపై మీ అభిప్రాయం ఏమిటి?
7) తెలుగులో పాండిత్యం రావాలంటే ఏమి చేయాలి?

VI. ప్రశంస

* చదువులో వెనకబడిన ఒక విద్యార్థి తనలో కలిగిన మార్పు వల్ల కొద్దికాలంలోనే గతంలో కన్నా మెరుగైన ఫలితాల: పొందాడు. అతనిలో వచ్చిన మార్పును గురించి తెలుపుతూ వాళ్ళ అమ్మానాన్నలకి ఉత్తరం రాయండి.
జవాబు:

లేఖ

ప్రొద్దుటూరు,
x x x x x x x x

పూజ్యులు, ఆనందరావు గారికి,

మీకు నమస్కారములు. నేను మీ అబ్బాయి సురేష్ సహ విద్యార్థిని. మేము కూడా ప్రొద్దుటూరు జి పరిషత్ ఉన్నత పాఠశాలలోనే చదువుతున్నాము. ఈ మధ్య మీ సురేష్ అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడ తరగతిలో శ్రద్ధగా పాఠాలు వింటున్నాడు. సాయంత్రం మాతో ఆటలు కూడా ఆడుతున్నాడు.

రాత్రివేళ హాస్టలులో 10 గంటల వరకూ చదువుతున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకే లేచి, 6 గంటల వరక చదువుతున్నాడు. ఏ రోజు ఇంటిపని ఆ రోజే పూర్తిచేస్తున్నాడు. రోజూ ఉదయం పండ్లరసం, సాయంత్రం హార్లి! తాగుతున్నాడు. అందువల్ల సురేష్ అలసిపోకుండా చదువుపై మంచి దృష్టి పెడుతున్నాడు. ప్రత్యేకంగా లెదులు, సామాన్యశాస్త్రములలో మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. సురేశ్, ప్రతిభకు కారణం అతను చూపే శ్రద్ధ, ఆహారపు .. అలవాట్లలో మార్పు, చదువుతో పాటు ఆటలపై చూపే ఆదరము అని నా అభిప్రాయం.

నా సహవిద్యార్థి, మీ అబ్బాయి సురేష్ కు మా తరగతి విద్యార్థుల తరఫున అభినందనలు. మీకు మా నమస్కారాలు. సెలవు.

ఇట్లు,
మీ విశ్వసనీయురాలు,
x x x x x x,
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ప్రొద్దుటూరు.

చిరునామా :
బి. ఆనందరావుగారు,
8/23-6, సంతబజార్,
శివాలయం వీధి,
బద్వేలు.

ప్రాజెక్టు పని

*ఆచార్య సి.నారాయణరెడ్డిగారి రచనలు, పాటల వివరాలను సేకరించి ఒక పట్టికను తయారుచేయండి. దాన్ని తరగతిలో చదివి వినిపించండి. ప్రదర్శించండి.
జవాబు:
రచనలు:

1) ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు – ప్రయోగములు 2) ‘విశ్వంభర’ (జ్ఞానపీఠ అవార్డు గెలుచుకుంది)
3) నాగార్జున సాగరం 4) కర్పూర వసంతరాయలు
5) మధ్యతరగతి మందహాసం 6) ప్రపంచపదులు
7) విశ్వనాథనాయకుడు 8) నారాయణరెడ్డి గేయాలు
9) దివ్వెల మువ్వలు 10) అజంతా సుందరి
11) రామప్ప 12) నవ్వని పువ్వు
13) వెన్నెలవాడ 14) ఋతుచిత్రం
15) స్వప్నభంగం 16) విశ్వగీతి
17) జలపాతం 18) సినీగేయాలు
19) జాతిరత్నం 20) తరతరాల వెలుగు (గేయ రూపకాలు)
21) అక్షరాల గవాక్షాలు 22) మంటలు – మానవుడు
23) ఉదయం నా హృదయం 24) మార్పు నా తీర్పు
25) ఇంటిపేరు చైతన్యం 26) రెక్కలు
27) నడక నా తల్లి 28) కాలం అంచుమీద
29) కవిత నా చిరునామా 30) కలం సాక్షిగా
31) భూమిక, మట్టీ – మనిషి (దీర్ఘ కావ్యాలు) 32) తెలుగు గజళ్ళు
33) వ్యాసవాహిని, సమీక్షణం 34) పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు (యాత్రా సాహిత్యం)
35) పాటలో ఏముంది – నా మాటలో ఏముంది (సినిమా పాటల విశ్లేషణ)

ఈ పాఠం ‘జీవన భాష్యం’ వలెనే సినారే గారి ‘ప్రపంచ పదులు’ కావ్యం కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి, మానవ జీవితానికి ఉపకరించే అమూల్యమైన సందేశాలను అందిస్తుంది.

ప్రపంచ పదులు

1. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది?
ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది?
నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి
ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది?
ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది?

2. చీకటికి చురకపెడుతుందిలే చిన్న మిణుగురు పురుగు
మొండివానను ఆపుతుందిలే రెండు మూరల గొడుగు
మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే
దూరాన్ని చెరిపివేస్తుందిలే బారుచీమల పరుగు
పాపాన్ని కడిగివేస్తుందిలే పాలనవ్వుల నురుగు

3. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది?
చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది?
ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా
మరగనిదే నీరు ఎలా మబ్బురూపు కడుతుంది?
నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది?

4. ఒక్క చినుకు చాలు మట్టి గుక్కను పలికించాలంటే
ఒక్క చెణుకు చాలు నవ్వు చుక్కలు మొలిపించాలంటే
ఊహల్లో గీసుకున్న వ్యూహాలకు విలువేముంది?
ఒక్క మెరుపు చాలు నింగి పక్కను దొరలించాలంటే
ఒక్క చరుపు చాలు పుడమి రెక్క ఎగిరించాలంటే

మరికొన్ని సినారె విరచిత గేయాలు :
1) “నా పేరు కవి
ఇంటి పేరు చైతన్యం
ఊరు సహజీవనం
తీరు సమభావనం.”

2) “నా వచనం బహువచనం
నా వాదం సామ్యవాదం
కవిత్వం నా మాతృభాష
ఇతివృత్తం మానవత్వం”

3) “ఊపిరాడడం లేదు
ఉక్కపోస్తుంది, ఎ.సీ గదిలో
కారణం తెలిసిపోయింది.
కవిత రాయలేదు ఇవాళ”.

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. క్వార్థకం
భాషాభాగాల్లో ఒకటైన ‘క్రియ’ను గురించి కింది తరగతుల్లో తెలుసుకున్నారు. క్రియలను బట్టి వచ్చే వాక్య భేదాలను కొన్నింటిని చూద్దాం.

కింది వాక్యం చదవండి.

భాస్కర్ ఆటలు ఆడి ఆలసిపోయి ఇంటికి వచ్చాడు.
భాస్కర్ – కర్త
వచ్చాడు – కర్తృవాచక పదానికి సంబంధించిన ప్రధాన క్రియ.
ఆడి, అలసి – కర్తృవాచక పదానికి సంబంధించిన ఇతర క్రియలు.
ఆడి, అలసిపోయి అనే పదాలు క్రియలే కానీ, వాటితో పూర్తిభావం తెలియడం లేదు.
‘ఆడి’ అనే క్రియకు ‘ఆడి’ తర్వాత ఏం చేశాడు ? ఏం జరిగింది ? అనే ప్రశ్న ఉదయిస్తోంది.
పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు. ఇంకా, జరిగిపోయిన విషయాన్ని అంటే భూతకాలంలోని పనిని సూచిస్తుంది.
‘ఆలసిపోయి’ అనే క్రియ కూడా అలాంటిదే.

వీటిని భూతకాలిక అసమాపక క్రియలని, క్వార్థం అనీ అంటారు.

ఈ క్రియలన్నీ కూడా ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే భూతకాలిక అసమాపక క్రియ అయి, చివర ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం క్వార్థక క్రియ అన్నమాట.

కొన్ని ఉదాహరణలు చూడండి. కింది వాక్యాల్లోని క్త్వార్థక క్రియలను గుర్తించండి.

1. రాముడు లంకకు వెళ్ళి, రావణునితో యుద్ధం చేసి, జయించి, సీతను తీసుకొని అయోధ్యకు వచ్చాడు.
2. పుష్ప అన్నం తిని, నిద్రపోయింది.

2. శత్రర్థకం
కింది వాక్యం చదవండి.

“అఖిలేశ్ మధుకరుడితో మాట్లాడుతూ నడుస్తున్నాడు”.
ఈ వాక్యంలో –
‘నడుస్తున్నాడు’ అనే ప్రధాన క్రియకు ‘మాట్లాడుతూ’ అనే ఉపక్రియ వర్తమానకాలంలో ఉండి అసమాపక క్రియను సూచిస్తున్నది.

ఈ విధంగా,
‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘-తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల, వర్తమానకాలిక అసమాపక క్రియగా మారుతున్నది. వర్తమానకాలిక అసమాపక క్రియను శత్రర్థకం’ అంటారు.

కింది వాక్యాలు చదవండి. వీటిలో ‘శత్రర్థకం’ పదాల కింద గీత గీయండి.

అ) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంటున్నది.
ఆ) సౌజన్య పడుతూ లేస్తూ సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నది.
ఇ) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.
ఈ) ఫల్గుణ్ పేపరు చదువుతూ టీ.వి చూస్తున్నాడు.
ఉ) సలీమా పాడుతూ నాట్యం చేస్తున్నది.

పైన తెలిపిన విధంగా మరికొన్ని వాక్యాలు రాయండి.

1. లత అన్నం తింటూ చదువుతున్నది.
2. రవి పాఠం వింటూ రాస్తున్నాడు.
3. అమ్మ వంట చేస్తూ పాటలు వింటున్నది.
4. పరీక్ష రాస్తూ, ఆలోచిస్తున్నాడు.

3. చేదర్థకం
కింది వాక్యం చదవండి.

“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుంది”.
కింది ప్రశ్నకున్న జవాబు గురించి ఆలోచించండి.
ప్ర|| ఫలితం దానంతటదే ఎప్పుడు వస్తుంది?
జవాబు:
కష్టపడి పనిచేస్తే –
కష్టపడడం – కారణం
ఫలితం – కార్యం

కార్యం ఫలించడానికి కారణం అవసరం. కార్యకారణ సంబంధ వాక్యమే చేదర్థక వాక్యం.

అంటే పై వాక్యం కార్యకారణ సంబంధాన్ని సూచిస్తున్నది. ఇలా కార్యకారణ సంబంధాలను సూచించే వాక్యాల్లో తే/ ఇతే| ఐతే/ అనే ప్రత్యయాలు చేరుతాయి. (ప్రాచీన వ్యాకరణం ప్రకారం ఇన / ఇనన్ అనే ప్రత్యయాలు). దీన్ని బట్టి వీటిని ‘చేత్’ అనే అర్థం ఇచ్చే ప్రత్యయాలు అని అంటాం. (ఇదే చేతే అనే ఇచ్చేవి)

సంక్లిష్ట వాక్యాల్లో చేత్ అనే ప్రత్యయం చేరి కార్యకారణ సంబంధం తెలిపే వాక్యాలను చేదర్థక వాక్యాలని అంటాం.

కింది వాక్యాలు పరిశీలించండి. చేదర్థక పదాల కింద గీత గీయండి.

అ) మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.
ఆ) జీవ వైవిధ్యాన్ని కాపాడితే ప్రకృతి సమతులితమవుతుంది.
ఇ) మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది.

1. కింది పదాలు విడదీసి, సంధుల పేర్లను పేర్కొనండి.
అ) బాల్యమంతా – బాల్యము + అంతా – ఉత్వసంధి
ఆ) దేవతలంతా = దేవతలు + అంతా – ఉత్వసంధి
ఇ) దారవుతుంది = దారి + అవుతుంది – ఇత్వసంధి
ఈ) విరిగినప్పుడు = విరిగిన + అప్పుడు – అత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. రూపకాలంకారం :
కింది వాక్యాన్ని చదవండి.
“ఆయన మాట కఠినమైనా మనసు వెన్న”.
పై వాక్యంలో
మనసు – ఉపమేయం (పోల్చబడేది)
వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనసు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది.

అంటే, వెన్నకు, మనసుకు భేదం లేదు. రెండూ ఒకటే (మెత్తనివే) అనే భావాన్ని ఇస్తున్నది.

ఇలా,
ఉపమానానికి ఉపమేయానికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడాన్ని “రూపకాలంకారం” అంటారు.
ఉదా :
(అ) లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లినారు.

సమన్వయం :
ఉపమానమైన లతలను, ఉపమేయమైన లలనలను, అట్లే ఉపమానమైన కుసుమములను, ఉపమేయమైన అక్షతలకు అభేదం తెలుపుతుంది. అందువల్ల ఇది రూపకాలంకారం.

(ఆ) మౌనిక తేనెపలుకులు అందరికీ ఇష్టమే.
సమన్వయం :
ఇక్కడ ఉపమానమైన తేనెకు, ఉపమేయమైన పలుకులకు అభేదం తెల్పబడింది. అందువల్ల ఇది రూపకాలంకారం.

3. కింది వాక్యాలను పరిశీలించండి. అలంకారాన్ని గుర్తించండి.
అ) మా అన్నచేసే వంట నలభీమపాకం.
అన్న చేసే వంట – ఉపమేయం (పోల్చబడేది)
నలభీమపాకం – ఉపమానం (పోల్చినది)

ఇక్కడ ‘అన్న చేసే వంట’ అనే ఉపమేయానికి, ‘నలభీమపాకం’ అనే ఉపమానానికి అభేదం చెప్పినందున రూపకాలంకారము.

ఆ) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం.
తండ్రి – ఉపమేయం (పోల్చబడేది)
హిమగిరి శిఖరం – ఉపమానం (పోల్చినది)

ఇక్కడ ఉపమేయమైన తండ్రికి, ఉపమానమైన హిమగిరి శిఖరానికి అభేదం చెప్పినందున రూపకాలంకారము.

ఇ) నందనందనుడు ఆనందంగా నర్తించెను.
ఈ వాక్యంలో నంద అనే హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగింపబడింది. అందునల్ల ఇది ఛేకానుప్రాసాలంకారం.

ఈ) నల్లపిల్లి మెల్లగా ఇల్లు చొచ్చి చల్లని పాలు తాగింది.
ఈ పై ఉదాహరణలో ‘ల్ల’ కారం పలుమార్లు ఆవృత్తం అయ్యింది. అందువల్ల ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

అడుగు : పాదము, చరణము
మనసు : చిత్తము, ఉల్లము, హృదయము
నేస్తము : మిత్రుడు, స్నేహితుడు
గిరి : పర్వతం, అది
కన్ను : చక్షువు, నయనం, అక్షి
హిమగిరి : హిమాలయం, శీతాద్రి, తుహినాద్రి
మనిషి : మానవుడు, నరుడు
దారి : బాట, మార్గము, పథము

వ్యుత్పత్తరాలు

పక్షి – పక్షములు గలది (పిట్ట)
ధరణి – విశ్వాన్ని ధరించునది (భూమి)
భూజము – భూమి నుండి పుట్టినది (చెట్టు)

నానార్థాలు

ఫలము – పండు, ప్రయోజనం
గుణం – స్వభావం, వింటినారి
కన్ను – నేత్రం, బండిచక్రం

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

సంధులు

అ) సంధి పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.

నీరవుతుంది = నీరు + అవుతుంది – ఉత్వసంధి
కన్నీరవుతుంది = కన్నీరు + అవుతుంది – ఉత్వసంధి
దారవుతుంది = దారి + అవుతుంది – ఉత్వసంధి
ఫలమేమి = ఫలము + ఏమి – ఉత్వసంధి
ఎత్తులకెగిరినా = ఎత్తులకు + ఎగిరినా – ఉత్వసంధి
విలువేమి = విలువ + ఏమి – ఉత్వసంధి

ఆ) సంధికార్యాలు.
అవ్వసంది
సూత్రం : అత్తునకు సంధి బహుళము.
విలువేమి = విలువ + ఏమి – అత్వసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
దారవుతుంది = దారి + అవుతుంది – ఇత్వసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
నీరవుతుంది = నీరు + అవుతుంది – ఉత్వసంధి
ఫలమేమి = ఫలము + ఏమి – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
ఇసుక గుండెలు ఇసుక యొక్క గుండెలు షష్ఠీ తత్పురుష సమాసం
కన్నీరు కంటి యొక్క నీరు షష్ఠీ తత్పురుష సమాసం
హిమగిరి శిరసు హిమగిరి యొక్క శిరసు షష్ఠీ తత్పురుష సమాసం
ఎడారి దిబ్బలు ఎడారి యందలి దిబ్బలు షష్ఠీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

హృదయం – ఎద, ఎడద
త్యాగం – చాగం
మనిషి – మనిసి
సుఖం – సుకం
నీరము – నీరు
మృగము – మెకము

కవి పరిచయం

కవి : ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి

జననం : 1931

స్థలం : కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామం.

నిర్వహించిన పదవులు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా ఉన్నారు.

రచనలు : నాగార్జునసాగరం, కర్పూరవసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంభర, ప్రపంచపదులు మొ॥న నలభైకి పైగా కావ్యాలు, అద్భుతమైన సినిమా పాటలు రాశారు. ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు’ అనే సిద్ధాంత గ్రంథం ! ప్రసిద్ధి పొందింది.

పురస్కారాలు : జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ’ అవార్డు, భారత ప్రభుత్వ ‘పద్మభూషణ్’ అవార్డు.

గజల్ పాదాలు – భావాలు

1, 2 పాదాలు :
మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది

భావం : నీటితో నింపుకున్న మబ్బులు తడితో బరువెక్కిపోతే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది. భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు అడుగులు

3, 4 పాదాలు:
వంకలు దొంకలు కలవని జడిపించకు నేస్తం
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.

భావం :
ఓ నేస్తమా ! మనం ఒక లక్ష్యాన్ని సాధించటానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు వేస్తే నీవు అనుకున్న విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తె నలుగురు అనుసరించే దారిగా మారుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

5, 6 పాదాలు :
ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది

భావం :
నేల అంతా బీటలు పడి, ఎందుకూ పనికి రాకుండా ఉన్నదని, ఏ పంటలూ పండవనీ, ఏ ప్రయత్నం చేయకుండానే నిరాశపడకూడదు. కష్టపడి శ్రమతో ఆ నేలనే దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

7, 8 పాదాలు :
మృగమూ ఒకటనే అనుకుంటే వ్యర్థం
మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది

భావం :
మనం మనిషీ, మృగమూ ఒకటి అని భావించ కూడదు. మృగం ఏ అరణ్య ప్రాంతంలోనైనా ఒంటరిగా నివసించగలదు. కానీ మనిషి అలాకాదు. నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించటమే ఉత్తమ సాంఘిక జీవనం అవుతుంది. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథం ఉండాలి. అప్పుడే అందరూ కలసిమెలసి ఆనందంగా జీవించ గలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

9, 10 పాదాలు :
ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష
హిమగిరి శిరసే మాడితే అది యేరవుతుంది

భావం :
మనం ఎంత సమర్థులం అయినా, అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా. ఇక మనకు ఎలాంటి కష్టాలూ, బాధలూ రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచ వలసిందే. ఉన్నతమైన హిమాలయ శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషికైనా గర్వం నీరు కారిపోవలసిందే.

11,12 పాదాలు :
బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి “సినారే”
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.

భావం :
మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపు లేదు. మానవాళికి మనిషీ పనికి వచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 7 హరిశ్చంద్రుడు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 7th Lesson హరిశ్చంద్రుడు

8th Class Telugu 7th Lesson హరిశ్చంద్రుడు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

బలి చక్రవర్తి గొప్పదాత. అతడు ఒకసారి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞవేదిక దగ్గర దానధర్మాలు చేస్తున్నాడు. వామనుడు దానం స్వీకరించడానికి వచ్చాడు.
బలి : ఏం కావాలి ?

వామనుడు : మూడడుగుల నేల.

బలి : తప్పక ఇస్తాను.

శుక్రాచార్యుడు : బలీ ! వద్దు ! వద్దు ! వచ్చినవాడు రాక్షసవిరోధి ! అతనికి దానం ఇస్తే నీకీ ప్రమాదం !

బలి : గురువర్యా ! నేను ఆడినమాట తప్పను. వామనా ! మూడడుగుల నేల గ్రహించు.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
బలిని దానం ఇవ్వవద్దని ఎవరన్నారు? ఎందుకన్నారు?
జవాబు:
బలిని దానం ఇవ్వవద్దని శుక్రాచార్యుడు అన్నాడు. వచ్చినవాడు రాక్షసవిరోధి కాబట్టి దానం ఇవ్వవద్దని చెప్పాడు.

ప్రశ్న 2.
దానం ఇస్తే ఎవరికి ప్రమాదం?
జవాబు:
దానం ఇస్తే బలి చక్రవర్తికి ప్రమాదం.

ప్రశ్న 3.
బలి చక్రవర్తి గొప్పదనం ఏమిటి?
జవాబు:
బలి చక్రవర్తి తాను ఆడినమాట తప్పను అని చెప్పాడు. తాను అన్న మాటకు కట్టుబడి మూడడుగుల నేలను వామనునికి ధారపోశాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

ప్రశ్న 4.
ఆడినమాట తప్పనివారి గురించి మీకు తెలుసా?
జవాబు:
బలి, శిబి చక్రవర్తి, హరిశ్చంద్రుడు మొదలగువారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

అ) హరిశ్చంద్రుని గొప్పదనం గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
హరిశ్చంద్రుడు అయోధ్య రాజధానిగా పాలించిన సూర్యవంశ చక్రవర్తి. సూర్యవంశానికి గొప్ప పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టినవాడు. గొప్పదాత. వివేకమే సంపదగా కలవాడు. మంచి కీర్తి వైభవాలు కలవాడు. ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. సముద్రమంత దయగలవాడు. సర్వశాస్త్రాలు తెలిసినవాడు. సత్యవాక్పరిపాలకుడు. ఆడినమాట తప్పనివాడు. వశిష్ఠుడు చెప్పినట్లు బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతము కుంగిపోయినా, ఆకాశం ఊడి కింద పడినా, సముద్రం ఎండినా, భూగోళం తలకిందులయినా హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు.

ఆ) ద్విపద రూపంలోని ఈ పాఠాన్ని లయబద్ధంగా రాగంతో పాడండి.
జవాబు:
విద్యార్థి కృత్యము

ఇ) సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
ఒకసారి దేవేంద్రుడు కొలువుదీర్చి “ముల్లోకాలలో బొంకనివారు ఎవరైనా ఉన్నారా ? ఇప్పుడు జీవించి ఉన్నవారిలో కానీ, గతకాలం వారిలో కానీ అసత్యమాడని వారున్నారా ? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారా ?” అని త్రికాలజ్ఞులైన మునీశ్వరులను అడిగాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. కొంతమంది విన్నా విననట్లు ఊరుకున్నారు. అప్పుడు వశిష్ఠుడు అటువంటి ఉత్తమ లక్షణాలు కలవాడు హరిశ్చంద్రుడని సభలో ప్రకటించాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుని గొప్పదనం, గుణగణాలను గురించి దేవేంద్రునితో ఇలా చెప్పాడు.

“దేవేంద్రా ! హరిశ్చంద్ర మహారాజు ఈ ప్రపంచంలో మహా పరాక్రమవంతుడు. షోడశమహాదానాలు చేసినవాడు. వినయ వివేకాలు గలవాడు. విద్యావంతుడు. కీర్తిశాలి. దయాసముద్రుడు. గాంభీర్యము గలవాడు. పుణ్యాత్ముడు. పండితులచే పొగడదగ్గవాడు. సర్వశాస్త్ర పండితుడు. శత్రుభయంకరుడు. షట్చక్రవర్తులలో పేరుపొందినవాడు. త్రిశంకుని పుత్రుడు. సత్యసంధుడు. సూర్యవంశీయుడు. అతడు ఆడి బొంకనివాడు. ఆదిశేషువు కూడా హరిశ్చంద్రుని గుణగణాలను కీర్తింపలేడు. అబద్ధం ఆయన నాలుక నుండి రాదు.

బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరువు కుంగినా, ఆకాశం ఊడి కింద పడినా, భూగోళం తలకిందైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రమహారాజు మాత్రం ఆడినమాట తప్పడు.”

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. కింది భావాలున్న ద్విపద పాదాలను పాఠంలో వెతికి రాయండి.

అ) హరిశ్చంద్రుడు వినయమే అలంకారంగా గలవాడు. వివేకం సంపదగా గలవాడు.
జవాబు:
వినయభూషణుఁడు వివేకసంపన్నుడు

ఆ) హరిశ్చంద్రుడు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంటాడు. నీతిగా పరిపాలన చేస్తాడు.
జవాబు:
నిత్యప్రసన్నుండు నీతిపాలకుడు.

ఇ) త్రిశంకుని కుమారుడు సత్యాన్నే పలికేవాడు.
జవాబు:
సత్యసంధుండు త్రిశంకునందనుఁడు

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది పద్యం చదవండి. భావంలో ఖాళీలు ఉన్నాయి. పూరించండి.
నుతజల పూరితంబులగు నూతులు నూటిటికంటె సూనృత
వ్రత! యొక బావివేలు, మరి బావులు నూటిటికంటె నొక్క స
త్క్రతువది మేలు, తత్రతు శతంబున కంటె సుతుండుమేలు, త
త్సుతశతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్

పై పద్యం శకుంతల దుష్యంతునితో చెప్పింది. సత్యవ్రతం యొక్క గొప్పదనాన్ని తెలిపే పద్యం ఇది.
భావం :
స్వచ్ఛమైన జలం ఉన్న నూరునూతులకన్నా ఒక …………….. మేలు. అలాంటి వందబావులకన్నా ఒక ……….. మేలు. అలాంటి వంద ………..ల కన్నా ఒక ………….. ఉండటం మేలు. అలాంటి వందమంది ……………… ఉండటం కన్నా ఒక ……….. మేలు.
జవాబు:
భావం :
స్వచ్ఛమైన జలం ఉన్న నూరునూతులకన్నా ఒక బావి మేలు. అలాంటి వందబావులకన్నా ఒక మంచియజ్ఞం మేలు. అలాంటి వంద మంచియజ్ఞముల కన్నా ఒక కుమారుడు ఉండటము మేలు. అలాంటి వందమంది కుమారులు ఉండటం కన్నా ఒక సత్యవాక్యం మేలు.

3. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.

అ) హరిశ్చంద్రుని గుణగణాలను కవి ఏ విధంగా వర్ణించాడు?
జవాబు:
హరిశ్చంద్రుడు సూర్యవంశస్థుడు. నీతిపాలకుడు. నిత్య ప్రసన్నుడు. మహా పరాక్రమవంతుడు. షోడశమహాదానాలు చేస్తూ ఆనందించేవాడు. వినయ వివేక సంపన్నుడు. కీర్తిమంతుడు. ధనుర్విద్యావేత్త. కరుణాపయోనిధి. గంభీరుడు. పుణ్యాత్ముడు. సర్వశాస్త్రాలసారం తెలిసినవాడు. పండితుల స్తోత్రములకు పాత్రుడు. శత్రుజన భయంకరుడు. షట్చక్రవర్తులలో ఒకడు. సత్యసంధుడు. త్రిశంకు మహారాజు యొక్క కుమారుడు. విజ్ఞాన నిధి. అబద్ధం ఎరుగనివాడు. రెండువేల నాలుకలు ఉన్న ఆదిశేషుడికి కూడా హరిశ్చంద్రుని గుణములను కీర్తించడం అసాధ్యము.

ఆ) హరిశ్చంద్రుని గొప్పతనం గురించి వశిష్ఠుడు ఎవరితో చెప్పాడు? ఎందుకు చెప్పాడు?
జవాబు:
ఒకసారి దేవేంద్రుడు కొలువుదీర్చి ఉన్న సమయంలో మూడులోకాలలో ఎవరైనా బొంకని వారున్నారా? ఇప్పుడు జీవించి ఉన్నవారిలో కాని, గతకాలం వారిలో కాని, అసత్యమాడని వారున్నారా? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారా? అని అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వశిష్ఠుడు దేవేంద్రునితో హరిశ్చంద్రుని గొప్పతనం గురించి చెప్పాడు.

ఇ) హరిశ్చంద్రునికి ఉన్న విశిష్టతలు ఏవి?
జవాబు:
హరిశ్చంద్రుడు సూర్యవంశుడైన త్రిశంకుని కుమారుడు. సూర్యవంశమనే పాలసముద్రంలో పుట్టిన చంద్రుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. రెండు వేల నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతడు సత్యస్వరూపుడు. బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలకిందులైనా హరిశ్చంద్రుడు మాత్రం ఆడినమాట తప్పడు- ఇవి అతనిలోని విశిష్టతలు.

ఈ) అసాధారణాలైనవి కూడా సంభవించవచ్చని కవి వేటిని పేర్కొన్నాడు? వీటిని ఏ సందర్భంలో పేర్కొన్నాడు?
జవాబు:
అసాధారణాలైనవి కూడా సంభవించవచ్చునని కవి ఈ కింది వాటిని పేర్కొన్నాడు.

బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం కింద ఊడిపడినా, భూగోళం తలకిందులైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్ర మహారాజు మాత్రం అబద్దమాడడని కవి చెప్పాడు.

ఎంతటి వైపరీత్యాలూ, అసాధారణాలు సంభవించినా హరిశ్చంద్రుడు అబద్ధమాడడని చెప్పే సందర్భంలో కవి వాటిని పేర్కొన్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

4. కింది వాక్యాలకు సమానార్థాన్నిచ్చే వాక్యాలు గుర్తించండి.

అ) హరిశ్చంద్రుడు వివేకసంపన్నుడు, వినయభూషణుడు.
i) హరిశ్చంద్రుడు కేవలం వివేకసంపన్నుడు.
ii) హరిశ్చంద్రుడు వినయభూషణుడే.
iii) హరిశ్చంద్రునికి వివేకసంపదకన్న వినయభూషణం అధికం.
iv) హరిశ్చంద్రునిలో వివేకసంపద, వినయభూషణం రెండూ సమానమే.
జవాబు:
iv) హరిశ్చంద్రునిలో వివేకసంపద, వినయభూషణం రెండూ సమానమే.

ఆ) మేరువు గ్రుంకినా, మిన్ను వ్రాలినా హరిశ్చంద్రుడు అసత్యం పలకడు.
i) మేరువు కుంగినా, ఆకాశం ఊడిపడ్డా హరిశ్చంద్రుడు అబద్దం ఆడడు.
ii) మేరువు కుంగి, మిన్ను వాలినా, సత్యం పలుకుతాడు హరిశ్చంద్రుడు.
iii) మేరువు కుంగినా, మిన్ను వాలకున్నా హరిశ్చంద్రుడు అబద్ధం ఆడడు.
iv) మేరువు కుంగినా మిన్ను వాలినా హరిశ్చంద్రుడు సత్యం పలకడు.
జవాబు:
i) మేరువు కుంగినా, ఆకాశం ఊడిపడ్డా హరిశ్చంద్రుడు అబద్దం ఆడడు.

III. స్వీయరచన

1) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “హరిశ్చంద్రుణ్ణి షోడశ మహాదాన వినోది” అని వశిష్ఠుడు ఎందుకు అన్నాడు?
జవాబు:
పదహారు రకాల దానాలను చేస్తూ ఆనందించేవాడు షోడశ మహాదాన వినోది. హరిశ్చంద్రునికి ఇతరులకు దానం చేయడం వినోదం అన్నమాట. గో-భూ-తిల-హిరణ్య-రత్న-కన్యా-దాసీ-శయ్యా-గృహ-అగ్రహార-రథ-గజ-అశ్వభాగ-మహిషీ దానాలను షోడశ మహాదానాలు అంటారు. హరిశ్చంద్రుడు ఎవరికైనా, ఏదైనా ఇస్తానంటే తప్పక ఇస్తాడనీ, ఆడినమాట తప్పడనీ, దానగుణం అన్నది ఆయనకు ఒక వినోదక్రీడ వంటిదనీ చెప్పడానికే వశిష్ఠుడు హరిశ్చంద్రుని “షోడశ మహాదాన వినోది” అని చెప్పాడు.

ఆ) హరిశ్చంద్రునిలో మిమ్మల్ని ఆకట్టుకునే అంశాలేవి?
జవాబు:
హరిశ్చంద్రునిలోని షోడశ మహాదాన వినోదిత్వం, వినయభూషణత్వం, వివేక సంపన్నత, అపారమైన కరుణ, మహాజ్ఞాని కావడం, ధనుర్వేద విద్యాధికత, ధర్మతత్పరత, సత్యసంధత, ప్రియభాషణ, నిత్యప్రసన్నత, నీతిపాలకత అనే గుణాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

ఇ) ‘హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు’ అని తెలుసుకున్నారు కదా ! ఆడినమాట తప్పనివారు ఎలా ఉంటారో రాయండి.
జవాబు:
ఆడిన మాట తప్పనివారు అంటే సత్యసంధులు. వారు ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడరు. సత్యవాక్యం గొప్పతనాన్ని వారు గుర్తించినవారు. భార్యను అమ్మవలసి వచ్చినా, తానే అమ్ముడుపోయినా హరిశ్చంద్రుడు అబద్ధమాడలేదు. వామనునికి మూడు అడుగుల నేల దానం చేస్తే బలిచక్రవర్తికే ప్రమాదం వస్తుంది అని ఆయన గురువు శుక్రుడు చెప్పినా బలి తాను అన్నమాటను తప్పలేదు. శిబి చక్రవర్తి తన శరీరంలోని మాంసాన్నే కోసి ఇచ్చి పావురాన్ని రక్షించాడు. ఆడినమాట తప్పనివారు బలి చక్రవర్తిలా, హరిశ్చంద్రునిలా, శిబిచక్రవర్తిలా ఉంటారు.

ఈ) ‘మిన్ను వ్రాలినా’ అని వశిష్ఠుడు హరిశ్చంద్రుని పరంగా ఉపయోగించాడు కదా ! ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?
జవాబు:
‘మిన్ను వ్రాలటం’ అంటే ఆకాశం వంగిపోవటం అని అర్థం. ఆకాశం వంగిపోవటం అనేది సృష్టిలో ఎప్పుడూ జరగనిది. అందువలన ఎన్నటికీ జరగని విషయం అని చెప్పే సందర్భంలో ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) ‘హరిశ్చంద్రుడు’ పాఠ్యభాగ సారాంశం సొంతమాటల్లో రాయండి.
(లేదా)
వశిష్ఠుడు వివరించిన ‘హరిశ్చంద్రుని సద్గుణాలేమిటో’ రాయండి.
(లేదా)
పర్వతాలు కుంగిన, ఆకాశం నేలమీద పడినా మాట తప్పనివాడైన హరిశ్చంద్రుడి గురించి కవి ఏ విధంగా వ్యక్తపరచారో రాయండి.
జవాబు:
దేవేంద్రుడు ఒక రోజు కొలువుదీర్చి ఉన్నాడు. ఆ సభలో వశిష్ఠ మహాముని హరిశ్చంద్రుని గుణగణాలను వర్ణించాడు.

“ఓ దేవేంద్రా! ఈ ప్రపంచంలో హరిశ్చంద్రుడు గొప్ప పరాక్రమవంతుడు. పదహారు రకాల దానాలు చేస్తూ వినోదిస్తూ ఉంటాడు. వినయం, వివేకం ఉన్నవాడు. గొప్ప కీర్తి, భాగ్యం కలవాడు. విలువిద్యా పండితుడు. దయాసముద్రుడు. పాపం చేయనివాడు. సర్వశాస్త్రార్థములు తెలిసినవాడు. మహాజ్ఞాని. శత్రుభయంకరుడు. షట్చక్రవర్తులలో మొదటివాడు. నీతిగలవాడు. త్రిశంకుని కుమారుడు. సూర్యవంశంలో పుట్టినవాడు. సత్యవాక్పరిపాలకుడు.

హరిశ్చంద్రుని గుణగణాలను ఆదిశేషుడు సైతం వర్ణించలేడు. హరిశ్చంద్రుడు సత్యసంధుడు. ఆయన పనులు ధర్మము. ఆయన మాట ప్రియము. బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పు వాలినా, మేరువు కుంగినా, భూమి తలకిందులయినా, ఆకాశం కిందపడినా, సముద్రాలు ఇంకినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు.” అని వశిష్ఠుడు చెప్పాడు.

ఆ) వివేక సంపన్నుడు, సత్యసంధుడు, విద్యాధికుడు, కరుణాపయోనిధి, విజ్ఞాననిధి అని హరిశ్చంద్రుణ్ణి కీర్తించారు కదా ! మన సమాజంలోని వ్యక్తులు అందరూ ఈ గుణాలతో ఉంటే ఈ సమాజం ఎలా ఉంటుందో ఊహించి రాయండి.
(లేదా)
సమాజంలో ఉన్న అందరూ హరిశ్చంద్రుడిలా ఉంటే మన సమాజం ఎలా ఉంటుందో ఊహించి రాయండి.
జవాబు:
సమాజం. అంటే ‘సంఘం’. మన సంఘంలో హరిశ్చంద్రుని వంటి గుణగణాలు గల వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారు. అందరూ హరిశ్చంద్రునిలా వివేకం కలిగి ఉండి, నిజమే మాట్లాడుతూ, దయ గలిగి, అందరూ విద్యావిజ్ఞానములు కలిగి ఉంటే చాలా బాగుంటుంది. అందరూ వివేకం గలవారు కాబట్టి తగవులూ, యుద్ధాలూ ఉండవు. అధర్మ ప్రవర్తనలూ, వాటికి శిక్షలూ, కోర్టులూ ఉండవు. అందరూ చదువుకున్నవారే కాబట్టి ప్రజలు సంస్కారం కలిగి న్యాయధర్మాలతో ఉంటారు.

మళ్ళీ కృతయుగం వచ్చినట్లు అవుతుంది. మనం అంతా స్వర్గంలో ఉన్నట్లు ఉంటుంది. అటువంటి మంచి కాలం రావాలని అందరూ కోరుకోవాలి. అందరూ హరిశ్చంద్రునివంటి గుణాలు గలవారు అయితే విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు అకారణంగా వారిని హింసించే ప్రమాదం లేకపోలేదు. కానీ చివరకు న్యాయం, ధర్మం జయిస్తాయి.

IV. పదజాలం

1. కింది పట్టికను పరిశీలించండి. అందులో హరిశ్చంద్రుని గుణగణాలకు సంబంధించిన పదాలున్నాయి. అయితే . ఒక్కొక్క పదం రెండుగా విడిపోయింది. వాటిని కలిపి రాయండి. ఆ పదాల ఆధారంగా సొంతవాక్యాలు రాయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు 1

ఉదా : నీతినిధి – నీతికి నిధియైన సర్పంచ్ వల్ల గ్రామానికి మేలు జరుగుతుంది.
జవాబు:
పై పట్టికలోని పదాలు ఇవి :

  1. భాగ్యశాలి
  2. విజ్ఞాన నిధి
  3. బొంకనివాడు
  4. శరధిచంద్రుడు
  5. వినయభూషణుడు
  6. వివేక సంపన్నుడు
  7. కరుణాపయోనిధి
  8. నీతిపాలకుడు
  9. దాన వినోది
  10. సత్యసంధుడు

వాక్యప్రయోగములు:

1) భాగ్యశాలి : దానధర్మములు చేస్తే భాగ్యశాలి కీర్తి మరింత వృద్ధి అవుతుంది.

2) విజ్ఞాన నిధి : అబ్దుల్ కలాం గొప్ప ‘విజ్ఞాన నిధి’.

3) బొంకనివాడు : ప్రాణం పోయినా బొంకనివాడే యోగ్యుడు.

4) శరధిచంద్రుడు : శ్రీరాముడు సూర్యవంశ శరథి చంద్రుడు.

5) వినయభూషణుడు : ధర్మరాజు చక్రవర్తులలో వినయ భూషణుడు.

6) వివేక సంపన్నుడు : ఎంత విజ్ఞానం ఉన్నా వివేక సంపన్నుడు అయి ఉండాలి.

7) కరుణాపయోనిధి : శ్రీరాముడిని ‘కరుణాపయోనిధి’ అని రామదాసు కీర్తించాడు.

8) నీతిపాలకుడు : నీతిపాలకుడైన రాజు కీర్తి విస్తరిస్తుంది.

9) దాన వినోది : కర్ణుడు దానవినోదిగా పేరుపొందాడు.

10) సత్యసంధుడు : శిబి చక్రవర్తి సత్యసంధుడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది పదాలు చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాక్యంలో ప్రయోగించండి.

అ) అడవికి కంఠీరవం రాజు.
జవాబు:
కంఠీరవం = సింహము
వాక్యం :
మృగరాజు అయిన కంఠీరవం మిగిలిన జంతువులు చేసిన ప్రతిపాదనకు అంగీకరించింది.

ఆ) త్రిశంకు నందనుడు హరిశ్చంద్రుడు.
జవాబు:
నందనుడు = కుమారుడు
వాక్యం :
శ్రీరాముడు దశరథ నందనుడు.

ఇ) ఆంజనేయుడు శరధి దాటాడు.
జవాబు:
శరధి = సముద్రము
వాక్యం :
శ్రీరాముడు వానరుల సాయంతో శరధిపై సేతువు నిర్మించాడు.

ఈ) దేవతలకు రాజు సురేంద్రుడు.
జవాబు:
సురేంద్రుడు = దేవేంద్రుడు
వాక్యం :
గౌతముడు సురేంద్రుని శపించాడు.

ఉ) భానుడు ప్రపంచానికి వెలుగును, వేడిని ఇస్తున్నాడు.
జవాబు:
భానుడు = సూర్యుడు
వాక్యం :
భానుడు నిత్యము తూర్పున ఉదయిస్తాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3. కింది వాక్యాలు పరిశీలించండి. పర్యాయపదాలతో ఇలాంటి వాక్యాలు రాయండి.

అ) భానుకిరణాలు చీకట్లు పోగొడతాయి. ఆదిత్యుడు వెలుగుతో పాటు వేడిమినిస్తాడు. రవి మొక్కలకూ, జంతువులకూ ప్రాణాధారం. సూర్యుడు లేకపోతే ఈ సమస్తజీవులు ఉండవు.
జవాబు:
భానుడు – ఆదిత్యుడు, రవి, సూర్యుడు

ఆ) వానరులు లంకను చేరడానికి సముద్రాన్ని దాటాలి. ఇందుకోసం ఆ శరధి పై వారధి కట్టాలి. దీనికి నలుణ్ణి వినియోగించారు. నలుని నేతృత్వంలో వానరవీరుల సహాయంతో. అంబుధిపై వారధి తయారయింది. శ్రీరాముని వెంట వానరులు కడలి దాటి వెళ్ళారు. సంద్రంలో ఆ వారధి ఈనాటికీ కనిపిస్తుంది.
జవాబు:
సముద్రం – శరధి, అంబుధి, కడలి, సంద్రం

పై వాక్యాలను పోలిన మరికొన్ని వాక్యాలు :
జవాబు:
1) తల్లిదండ్రులు తమకు కొడుకు పుట్టినప్పుడు సంతోషిస్తారు. ‘పుత్రుడు‘ పున్నామ నరకం పోగొడతాడని, వృద్ధాప్యంలో సుతుడు ఆదుకుంటాడనీ అనుకుంటారు. కానీ ఈనాడు తనయుడు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. కుమారుడు తన భార్య చుట్టూ తిరుగుతున్నాడు.

2) నీవు కుక్కను పెంచుతావు. నాకు జాగిలము అంటే ఇష్టము కాదు. మా ఇంట్లో వెనుక శునకము ఉండేది. ఆ శ్వానము బిస్కట్లు తినేదికాదు.

3) నేను ఈశ్వరుడు అంటే ఇష్టపడతాను. మహేశ్వరుడు దయగలవాడు. శివుడు పార్వతిని పెళ్ళాడాడు. పార్వతికి కూడా శంకరుడు అంటే మక్కువ ఎక్కువ. ఈశ్వరుడు చంద్రశేఖరుడు. ఆయన త్రిలోచనుడు. గంగను ధరించి గంగాధరుడు అయ్యాడు.

4) ఈ రోజు మన ఉపాధ్యాయుడు రాడు. మన గురువు నగరానికి వెళ్ళాడు. మన అధ్యాపకుడు రేపు రావచ్చు. ఒజ్జ పాఠం విననిదే నాకు నిద్ర పట్టదు.

V. సృజనాత్మకత

* మహాభాగ్యశాలి, ధనుర్వేద విద్యాధికుడు, సర్వశాస్త్రార్థ కోవిదుడు, నీతిపాలకుడు, ధర్మపరాయణుడు, మహా సత్యవంతుడు అయిన హరిశ్చంద్రుని పాత్రకు ఏకపాత్రాభినయం తయారుచేయండి. ప్రదర్శించండి.
జవాబు:
ఏకపాత్రాభినయం

హరిశ్చంద్రుడు :
అయ్యో ! హతవిధీ ! ఎంత కష్టము ! ఆడినమాట తప్పనివాడనే ! అయోధ్యాపతినే ! త్రిశంకునందనుడినే! ధర్మమూ, సత్యమూ నాలుగు పాదాలా నడిపిస్తూ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నందుకా ఇంత కష్టము ! దైవమా! నీ లీలలు ఎవరికీ అర్థం కావు కదా !

(భార్యను అమ్మడానికి వేలం పెడుతూ)
అయ్యలారా ! ఈ దౌర్భాగ్యుడు హరిశ్చంద్రుడు, భార్యను అమ్ముకుంటున్నాడు. క్షమించండి. ఈమె పరమ పతివ్రతా శిరోమణి. ఎండ కన్నెరుగని ఇల్లాలు. ఆడి తప్పని హరిశ్చంద్ర మహారాజు భార్య. అయోధ్యా నగర చక్రవర్తి హరిశ్చంద్రుని సతీమణి. పూజ్య విశ్వామిత్రులకు బాకీపడిన సొమ్ముకై ఈ చంద్రమతిని వేలానికి పెడుతున్నా. కన్న తండ్రులారా ! ఈ అసూర్యం పశ్యను, మీ సొంతం చేసుకోండి.

(భార్యను అమ్మాడు. కాటికాపరిగా మారాడు)
అయ్యో ! చివరకు హరిశ్చంద్రుడు కాటికాపరి అయ్యాడు. ఎంత దౌర్భాగ్యము ? షోడశ మహాదానములు చేసిన చేయి. మహాపరాక్రమంతో శత్రువులను చీల్చి చెండాడిన చేతులివి – నేను దశదిశలా మారుమ్రోగిన కీర్తికెక్కిన చరిత్ర కలవాడిని. ధనుర్వేద పండితుడిని. పండిత స్తోత్రపాఠములు అందుకున్నవాడిని. షట్చక్రవర్తులలో గొప్పవాడిగా కీర్తికెక్కిన వాడిని. ఏమి నాకీ దుర్గతి ! హతవిధీ ! ఏమయ్యా ! నీ లీలలు !

ఏమైన నేమి ? ఈ హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు. బ్రహ్మ తలరాత తప్పుగాక ! ఆ సూర్యుడు తూర్పున అస్తమించుగాక ! మేరువే నేల కుంగిన కుంగుగాక ! ఆకాశం ఊడిపడుగాక ! భూమి తలక్రిందులగు గాక ! సప్త సముద్రములూ ఇంకుగాక ! నక్షత్రములు నేల రాలు గాక ! ఆడను గాక ఆడను. అబద్ధమాడను. దైవమా ! త్రికరణ
శుద్ధిగా నేను చెపుతున్న మాట ఇది. (కింద కూలి పడతాడు)

(లేదా)

* హరిశ్చంద్రుని గుణగణాలను తెలిపే విశేషణాలను తెలుసుకున్నారు కదా ! ఇలాంటి విశేషణాలను ఉపయోగించి ఎవరైనా ఒక గొప్ప నాయకుడి గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
(అటల్ బిహారీ వాజపేయి)
మన మాజీ భారత ప్రధానులలో “వాజపేయి” భారతీయ జనతా పార్టీ ప్రాభవానికీ, దేశ సౌభాగ్యానికి కృషి చేసిన మహోన్నతుడు. ఈయన నిత్య ప్రసన్నుడు. ముఖాన చెరగని చిరునవ్వు ఈయనకు అలంకారము. ఈయన నీతిపాలకుడు. నిరుపమ విజ్ఞాన నిధి. మహాకవి. అతులసత్కీర్తి. దురిత దూరుడు. బుధస్తోత్ర పాత్రుడు.

గొప్ప రాజకీయవేత్త. ఆడి తప్పనివాడు. అన్యాయాన్నీ, దుర్మార్గాన్ని సహింపనివాడు కళంక రహితుడు. వినయ భూషణుడు. వివేక సంపన్నుడు. భారతదేశ కీర్తిని దశదిశలా చాటిన మహోన్నత గుణశీలుడు.

ఈయన విద్యాధికుడు. సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు. విశ్వనాయకులలో వినుతి కెక్కినవాడు. ఇతడు కరుణాపయోనిధి. గాంభీర్యఘనుడు. సత్యసంధుడు. ఆడి తప్పని నాయకుడు. ఈయన తనువెల్లా సత్యము. ఈయన తలపెల్లా కరుణ. ఈయన పలుకెల్లా ప్రియము. ఈయన పనులెల్లా ధర్మము.

మన దేశ ప్రధానులలో చెరిగిపోని, వాడిపోని, సత్కీర్తిని సంపాదించిన న్యాయ ధర్మవేత్త ఈయనయే.

VI. ప్రశంస

* ఆడినమాట తప్పకుండా తను చేస్తున్న వృత్తిలో నిజాయితీపరులైన వారివల్ల ప్రజలకు కలిగే మేలును ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి.
జవాబు:

రాజమహేంద్రవరం,
x x x x x x x

పత్రికా సంపాదకులు,
సాక్షి,
లబ్బీపేట,
విజయవాడ.
ఆర్యా,
విషయం : ప్రజల మేలు కోరే వారి పట్ల ప్రశంస.

నమస్కారములు.
నేను ఇటీవల కాలంలో కొంతమంది నిజాయితీపరులైన నాయకులను చూశాను. వారు ప్రజలకు తమవంతు సాయం చేస్తున్నారు. ప్రజలు వారి వద్ద తమ సమస్యలను విన్నవించుకుంటారు. నాయకులు వెంటనే పరిష్కరిస్తామని మాట ఇస్తున్నారు. అలాగే నిజాయితీగా, ధర్మబద్ధంగా ఆ పనులను చేస్తున్నారు. అదే విధంగా దేశంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఇలాగే స్పందించి అందరికీ సహాయ సహకారాలు అందిస్తే దేశం బాగుపడుతుందని భావిస్తున్నాను. ఆడినమాట తప్పకుండా వృత్తిలో నిజాయితీపరులైన వారికి ఈ పత్రికా ముఖంగా అభినందనలను తెలుపకోరుచున్నాను.

మీ విశ్వసనీయుడు,
xxxxxx,
8వ తరగతి,
టాగూర్ ఉన్నత పాఠశాల,
రాజమహేంద్రవరం.
తూ.గో. జిల్లా.

చిరునామా :
సంపాదకులు,
సాక్షి, దిన పత్రిక,
లబ్బీపేట,
విజయవాడ.

VII. ప్రాజెక్టు పని

* సత్యం గొప్పతనం తెలుసుకున్నారు కదా ! సత్యాన్ని తెలిపే కథలను, పద్యాలను సేకరించండి. మీ పాఠశాలలో ప్రదర్శించండి.
జవాబు:
కథ :
( సత్యమేవ జయతే)
ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా, యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది.

ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైనది. అది గమనించిన ఆవు భయపడక “పులిరాజా ! కొంచెం ఆగు. నేను చెప్పే మాటలు విను ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేతదూడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు” అన్నది దీనంగా ఆవు.

ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి “ఆహా ! ఏమి, మాయమాటలు. ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా ? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనకు నేం వెర్రిబాగుల నుంచి అనుమతులు అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికే చాసను కాను. ఒక చచ్చి తను కు బయలు ! ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలి గొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే గదా ! ఉపకారం చేసిన దానినవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి, ఆకలి తీర్చి రావాలని నా ఆశ” అన్నది ఆవు.

ఈ ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకొందామని ‘సరే’ అన్నది పులి. ఆవు ఇంటికిపోయి దూడకు కడుపునిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ “నాయనా ! బుద్ధిమంతురాలుగా మంచితనంతో జీవించు. తోటి వారితో స్నేహంగా ఉండు. ఎట్టి పరిస్థితులలోను అబద్దాలాడకు. మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో” అని బిడ్డకు. మంచిబుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవుని చూసిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది ! దీనిని చంపితే తనకే పాపం అనుకొని ఆవును వదిలివేసింది పులి.

నీతి : ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.

పద్యాలు :

1. అసువినాశమైన నానంద సుఖకేళి
సత్యనిష్ఠవరుని సంతరించు
సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు
విశ్వదాభిరామ ! వినురవేమ !

2. రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించురాజుఁ గొల్వకు
పాపపుదేశంబు సొరకు, పదిలము సుమతీ !

3. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద
సమధి గమము, సత్యంబుతో సరియుఁగావు
ఎఱుగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు
భారత – ఆది – 4 ఆ. 96 ప.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

(లేదా)

*హరిశ్చంద్రుని కథను చదివి అతని గొప్పతనాన్ని వర్ణించే వాక్యాలను చార్ట్ పై రాసి ప్రదర్శించండి.
జవాబు:
హరిశ్చంద్రుడు గుణగణాలు
హరిశ్చంద్రుడు – మహావిక్రమోన్నతుడు
హరిశ్చంద్రుడు – షోడశమహాదాన వినోది
హరిశ్చంద్రుడు – సత్యసంధుడు
హరిశ్చంద్రుడు – వినయ వివేక సంపన్నుడు
హరిశ్చంద్రుడు – సత్కీర్తి మహాభాగ్యశాలి
హరిశ్చంద్రుడు – ధనుర్వేద విద్యావిశారదుడు
హరిశ్చంద్రుడు – గాంభీర్యఘనుడు
హరిశ్చంద్రుడు – కరుణాపయోనిధి
హరిశ్చంద్రుడు – సర్వశాస్త్రార్థ విచారకోవిదుడు
హరిశ్చంద్రుడు – షట్చక్రవర్తులలో మేటి
హరిశ్చంద్రుడు – నిరుపమ విజ్ఞాన నిధి
హరిశ్చంద్రుడు – గుణగణాలను ఆదిశేషుడు సైతం, ప్రశంసింపలేడు
హరిశ్చంద్రుడు – ఆడి తప్పనివాడు
హరిశ్చంద్రుడు – మేరువు క్రుంగినా, ధారుణి తలక్రిందయినా మాట తప్పని మహారాజు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది వాటిని పూరించండి.

సంధిపదం విసంధి సంధి పేరు
అ) అన్నదమ్ములు అన్న + తమ్ముడు + లు గసడదవాదేశ సంధి
ఆ) గుణములు వొగడ గుణములు + పొగడ గసడదవాదేశ సంధి
ఇ) విద్యాధికుడు విద్య + అధికుడు సవర్ణదీర్ఘ సంధి
ఈ) సురేంద్ర సుర + ఇంద్ర గుణసంధి
ఉ) తలపెల్ల తలపు + ఎల్ల గుణసంధి
ఊ) నల్ల గలువ నల్ల + కలువ గసడదవాదేశ సంధి
ఋ) వీడుదడి వీడు + తడిసె గసడదవాదేశ సంధి
ఋ) కొలుసేతులు కాలు + చేయి + లు గసడదవాదేశ సంధి

2) కింది పేరాలోని సంధి పదాలను గుర్తించి అవి ఏ సంధులో రాయండి.

విద్యార్థులందరూ ఆడుకుంటూండగా ఎగురుతున్న పక్షి కింద పడింది. ఆ పక్కనే ఉన్న వాళ్ళంతా దానివైపు పరుగెత్తారు. కాని పురుషోత్తముడనే పిల్లవాడు నీళ్ళు తీసుకువెళ్ళి ఆ పక్షి పైన చల్లాడు. అది తేరుకొని లేచి పైకెగిరి వెళ్ళింది. అందరూ అతన్ని మెచ్చుకున్నారు.
పై పేరాలోని సంధులు :
విద్యార్థులు = విద్య + అర్థులు – సవర్ణదీర్ఘ సంధి
వాళ్ళంతా = వాళ్ళు + అంతా – ఉకారసంధి
పురుషోత్తముడు = పురుష + ఉత్తముడు – గుణసంధి
పైకెగిరి = పైకి + ఎగిరి – ఇత్వసంధి
విద్యార్థులందరూ = విద్యార్థులు + అందరూ – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3) అలంకారాలు :
అ) వృత్త్యనుప్రాసాలంకారం :
అలంకారాలు ప్రధానంగా రెండు రకాలు.
1) అర్థాలంకారాలు
2) శబ్దాలంకారాలు

ఉపమాది అలంకారాలు అర్థాలంకారాలు. వీటి గురించి కింది తరగతులలో తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు కొన్ని శబ్దాలంకారాలను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలను చదవండి.
1) “ఆమె కవతో వడిడి అడుగులతో గపను దాటింది”.
2) “చి చినుకులు పమని పడుతున్న వేళ”

మొదటి వాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ట’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి.
ఈ విధంగా

ఒక హల్లును మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తే వినసొంపుగా ఉంటుంది. శబ్దం ద్వారా సౌందర్యం ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఈ విధంగా శబ్దానికి ప్రాముఖ్యం ఇచ్చే అలంకారాలలో వృత్త్యనుప్రాసాలంకారం ఒకటి.

మరికొన్ని ఉదాహరణలు చూడండి.
అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకెళ్ళాడు.
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్షభక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా!

ఒక హల్లుగాని, రెండు, మూడు హల్లులు గాని, వేరుగా నైనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని “వ్యత్యనుప్రాస అలంకారం” అంటారు. “ప్రతిజ్ఞ” పాఠం చదవండి. వృత్త్యనుప్రాస అలంకారానికి చెందిన పదాలు/ వాక్యాలు గుర్తించండి.
జవాబు:
‘ప్రతిజ్ఞ’ పాఠంలోని వృత్త్యనుప్రాసాలంకారానికి చెందిన పదాలు / వాక్యాలు :

  1. పొలాల నన్నీ హలాల దున్నీ ఇలా తలంలో
  2. హేమం పిండగ – సౌఖ్యం నిండగ
  3. ఘర్మజలానికి, ధర్మజలానికి
  4. నిలో వనిలో కార్యానాలో
  5. నా వినిపించే నా విరుతించే నా వినిపించే నా విరచించే
  6. త్రిలోకాలలో త్రికాలాలలో
  7. బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ
  8. విలాపాగ్నులకు విషాదాశ్రులకు
  9. పరిష్కరించే, బహిష్కరించే – మొ||వి.

ఆ) ఛేకానుప్రాసాలంకారం :
కింది వాక్యం చదవండి.
నీకు వంద వందనాలు

పై వాక్యంలో ‘వంద’ అనే హల్లుల జంట వెంటవెంటనే అర్థభేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ సంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’నాలు – నమస్కారాలు అనే అర్థాన్నిస్తుంది. ఈ విధంగా – హల్లుల జంట అర్థభేదంతో వెంటవెంటనే వస్తే దానిని ‘ఛేకానుప్రాస అలంకారం’ అంటారు. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు రాయండి.
జవాబు:

  1. పాప సంహరుడు “హరుడు”
  2. మహాహీ భరము
  3. కందర్పదర్పము
  4. కానఁగాననమున ఘనము ఘనము

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

వారిధి : సముద్రం, అంబుధి, ఉదధి
భానుడు : సూర్యుడు, రవి, ప్రభాకరుడు\
ఘనము : మేఘము, పయోధరం
గిరి : పర్వతం, కొండ, అది
జిహ్వ : నాలుక, రసన, కకుత్తు
మిన్ను : ఆకాశం, గగనము, నభము
నందనుడు : కుమారుడు, పుత్రుడు, ఆత్మజుడు
కంఠీరవం : సింహం, కేసరి, పంచాస్యం
సురలు : దేవతలు, అనిమిషులు, నిర్జరులు
ధరణి : భూమి, వసుధ, అవని
బొంకు : అబద్దం, అసత్యం
రాజు : నృపతి, నరపతి, క్షితిపతి
నుతి : పొగడ్త, స్తోత్రము, స్తుతి
వారిజగర్భుడు : బ్రహ్మ, విధాత, విరించి

వ్యుత్పత్యర్థాలు

భానుడు – కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
వారిజగర్భుడు – పద్మము గర్భముగా కలవాడు (బ్రహ్మ)
వారిజము – నీటి నుండి పుట్టినది (పద్మం)
నందనుడు – సంతోషమును కలుగజేయువాడు (కుమారుడు)
ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
శరధి – శరములకు (నీళ్ళకు) నిధి (సముద్రం)
రాజు – రంజింపచేయువాడు (నరపతి)
కంఠీరవం – కంఠంలో ధ్వని కలది (సింహం)

నానార్థాలు

రాజు = ప్రభువు, చంద్రుడు
బుద్ధుడు = పండితుడు, బుధగ్రహం, వేల్పు, వృద్ధుడు
గుణము = స్వభావం, దారము, వింటినారి
పాకం = వంట, పంట, కార్యపాకాలు
జిహ్వ = నాలుక, వాక్కు జ్వాల
నందనుడు = కొడుకు, సంతోష పెట్టువాడు
ధర్మం = పుణ్యం, న్యాయం, ఆచారం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.
విద్యాధికుండు = విద్యా + అధికుండు – సవర్ణదీర్ఘ సంధి
శాస్త్రార్థం = శాస్త్ర + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
వారిజాప్తుడు = వారిజ + ఆప్తుడు – సవర్ణదీర్ఘ సంధి
వజ్రాయుధంబు = వజ్ర + ఆయుధంబు – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైన వానికి క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.
సురేంద్ర = సుర + ఇంద్ర – గుణసంధి
విక్రమోన్నతుడు = విక్రమ + ఉన్నతుడు – గుణసంధి
దేవేంద్ర = దేవ + ఇంద్ర – గుణసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
వానికైన = వానికిన్ + ఐన – ఇత్వసంధి
వినుతికెక్కిన = వినుతికిన్ + ఎక్కిన – ఇత్వసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
తరమిడి = తరము + ఇడి – ఉత్వసంధి
తనువెల్ల = తనువు + ఎల్ల – ఉత్వసంధి
తలపెల్ల = తలపు + ఎల్ల – ఉత్వసంధి
మున్నెన్నన్ = మున్ను + ఎన్నన్ – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పురుషములకు గసడదవలు బహుళంబుగానుగు.
ధారదప్పిన = ధార + తప్పిన – గసడదవాదేశ సంధి
కాలుసేతులు = కాలు + చేతులు – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
మహాదానం గొప్పదైన దానం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాభాగ్యం గొప్పదైన భాగ్యం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విద్యధికుండు విద్యచేత అధికుండు తృతీయా తత్పురుష సమాసం
వినయభూషణుడు వినయము చేత భూషణుడు తృతీయా తత్పురుష సమాసం
వివేక సంపన్నుడు వివేకము చేత సంపన్నుడు తృతీయా తత్పురుష సమాసం
బుధస్తోత్ర పాత్రుండు బుధస్తోత్రమునకు పాత్రుండు షష్ఠీ తత్పురుష సమాసం
శాస్త్రార్థము శాస్త్రముల యొక్క అర్థము షష్ఠీ తత్పురుష సమాసం
భానువంశం భానువు యొక్క వంశం షష్ఠీ తత్పురుష సమాసం
విజ్ఞాననిధి విజ్ఞానమునకు నిధి షష్ఠీ తత్పురుష సమాసం
రెండువేల నాల్కలు రెండు వేల సంఖ్య గల నాలుకలు ద్విగు సమాసం
సత్కీర్తి గొప్పదైన కీర్తి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విచారకోవిదుడు విచారమునందు కోవిదుడు సప్తమీ తత్పురుష సమాసం
వారిజగర్భుడు వారిజము గర్భము నందు కలవాడు బహున్రీహి సమాసం
రిపుగజము రిపువు అనే గజము రూపక సమాసం
వారిజాప్తుడు వారిజములకు ఆప్తుడు షష్ఠీ తత్పురుష సమాసం
దేవేంద్రుడు దేవతలకు ఇంద్రుడు షష్ఠీ తత్పురుష సమాసం
దురితదూరుడు దురితములను దూరం చేయువాడు తృతీయా తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

నిత్యము – నిచ్చలు
వంశము – వంగడము
అద్భుతము – అబ్బురము
విజ్ఞానము – విన్నానము
సత్యము – సత్తు
భాగ్యము – బాగేము
రాట్టు – ఱేడు
గుణము – గొనము
విద్య – విద్దె / విద్దియ
గర్వము – గరువము
శాస్త్రము – చట్టము
కీర్తి – కీరితి

కవి పరిచయం

పాఠము : ‘హరిశ్చంద్రుడు’

కవి : గౌరన

నివాసస్థలం : నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం

దేని నుండి గ్రహించబడింది : గౌరన కవి రచించిన “హరిశ్చంద్రోపాఖ్యానం” అనే ద్విపద కావ్యం నుండి గ్రహించబడింది.

కవి కాలము : 15వ శతాబ్దానికి చెందినవాడు.

రచనలు :
1) హరిశ్చంద్రోపాఖ్యానం
2) నవనాథ చరిత్ర
3) సంస్కృతంలో ‘లక్షణ దీపిక’ రచించాడు.

బిరుదు :
సరస సాహిత్య విచక్షణుడు.

రచనాశైలి : మనోహరమైనది. సామెతలు, జాతీయాలతో కవిత్వం అలరారుతుంది. అచ్చతెలుగు పలుకుబళ్ళు కవిత్వం నిండా రసగుళికల్లా జాలువారుతాయి. పదప్రయోగాలలో నైపుణ్యం అడుగడుగునా కనబడుతుంది.

ద్విపద పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1-2 పంక్తులు
నిరుపమ విజ్ఞాననిధి వశిష్ఠుండు
పురుహూతు తోడ నద్భుతముగాఁ బలికె
ప్రతిపదార్ధం :
నిరుపమ విజ్ఞాననిధి; నిరుపమ = సాటిలేని
విజ్ఞాన = విజ్ఞానానికి
నిధి = పాతర (ఆశ్రయమైన) ;
వశిష్ఠుండు = వశిష్ఠ మహర్షి
పురుహూతుతోడన్ = దేవేంద్రునితో (పెక్కు మందిచే పిలువబడువాడు పురుహూతుడు)
అద్భుతముగాన్ = ఆశ్చర్యకరముగా (వింతగా)
పలికెన్ = ఇలా చెప్పాడు

భావం :
సాటిలేని విజ్ఞాన నిధియైన వశిష్ఠ మహర్షి, ఆశ్చర్యం కలిగే విధంగా దేవేంద్రునితో ఇలా చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3వ పంక్తి నుండి 10వ పంక్తి వరకు
వినుము సురేంద్ర యీ విశ్వంబునందు
వినుతి కెక్కిన మహావిక్రమోన్నతుఁడు
వినయభూషణుఁడు వివేకసంపన్నుఁ
డతుల సత్కీర్తి మహాభాగ్యశాలి
వితత ధనుర్వేద విద్యాధికుండు
కరుణాపయోనిధి గాంభీర్యఘనుఁడు
దురితదూరుఁడు బుధస్తోత్రపాత్రుండు
ప్రతిపదార్ధం :
సురేంద్ర = ఓ దేవేంద్రా
వినుము = విను
ఈ విశ్వంబునందు = ఈ ప్రపంచంలో
వినుతికెక్కిన ; (వినుతికిన్ + ఎక్కిన) = ప్రసిద్ధి కెక్కిన
మహావిక్రమోన్నతుడు ; మహా = గొప్ప
విక్రమ = పరాక్రమం చేత
ఉన్నతుడు = గొప్పవాడు
తనరు = ప్రసిద్ధి పొందిన
షోడశ మహాదాన = పదహారు గొప్పదానములచే
వినోది = వినోదంగా ప్రొద్దుపుచ్చేవాడు
వినయ భూషణుడు = వినయమే అలంకారంగా గలవాడు
వివేక సంపన్నుడు = “మంచి చెడ్డలు తెలిసికోడం” అనే వివేకముతో కూడినవాడు
అతుల = పోలిక చెప్పడానికి వీలుకాని
సత్మీర్తి = మంచి కీర్తి గలవాడు
మహాభాగ్యశాలి = గొప్ప ఐశ్వర్యంచే ప్రకాశించేవాడు తనరు షోడశమహాదాన వినోది
వితత = విరివియైన (విస్తారమైన)
ధనుర్వేద విద్యా = ధనుర్వేద విద్య యందు (విలు విద్యలో)
అధికుండు = గొప్పవాడు
కరుణాపయోనిధి = దయకు సముద్రుని వంటివాడు
గాంభీర్యఘనుడు = మేఘము వలె గంభీరుడు
దురితదూరుడు = పాపానికి దూరంగా ఉండేవాడు (పుణ్యాత్ముడు)
బుధస్తోత్ర పాత్రుండు = పండితుల యొక్క ప్రశంసలకు యోగ్యుడు

భావం :
ఓ దేవేంద్రా ! ఈ ప్రపంచంలో మహా పరాక్రమ వంతుడు హరిశ్చంద్రుడు. అతడు పదహారు రకాల దానాలు చేస్తూ ఆనందిస్తాడు. వినయమే అలంకారంగా కలవాడు. వివేకమే సంపదగా కలవాడు. సాటిలేని కీర్తి కలవాడు. గొప్ప భాగ్యవంతుడు. విస్తారమైన ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. దయకు సముద్రుని వంటివాడు. పుణ్యాత్ముడు పండితులను గౌరవించేవాడు.

విశేషాంశం :
షోడశమహాదానములు :
1. గోదానము 2. భూదానము 3. తిలదానము 4. హిరణ్యదానము 5. రత్నదానము 6. విద్యాదానము 7. కన్యాదానము 8. దాసీదానము 9. శయ్యాదానము 10. గృహదానము 11. అగ్రహార దానము 12. రథదానము 13. గజదానము నిధి 14. అశ్వదానము 15. ఛాగ (మేక) దానము 16. మహిష (దున్నపోతు) దానము.

11వ పంక్తి నుండి 18వ పంక్తి వరకు
సర్వ శాస్త్రా విచారకోవిదుఁడు
గర్వితరిపుగజ కంఠీరవుండు
వరుస నార్వురు చక్రవర్తులలోనఁ
దరమిడి మున్నెన్నఁదగు చక్రవర్తి
నిత్యప్రసన్నుండు నీతిపాలకుఁడు
సత్యసంధుండు త్రిశంకు నందనుఁడు
నిరుపమ విజ్ఞాననిధి భానువంశ
శరధిచంద్రుఁడు హరిశ్చంద్రుఁడా రాజు
ప్రతిపదార్థం :
సర్వ శాస్త్రార్థ విచారకోవిదుఁడు; సర్వశాస్త్ర = అన్ని శాస్త్రముల
అర్థ = అర్థాన్ని
విచార = పరిశీలించడంలో
కోవిదుడు = పండితుడు
గర్వితరిపుగజ కంఠీరవుండు ; గర్విత = గర్వించిన
రిపు = శత్రువులు అనే
గజ = ఏనుగులకు
కంఠీరవుండు – సింహము వంటివాడు (శత్రువులను మర్ధించేవాడు)
వరుసన్ = వరుసగా
ఆర్వురు చక్రవర్తులలోన్ = ప్రసిద్ధులైన షట్ చక్రవర్తులలో
తరమిడి = తారతమ్యము ఎంచి
మున్ను = ముందుగా
ఎన్నదగు = లెక్కింపదగిన (గ్రహింపదగిన)
చక్రవర్తి = మహారాజు
నిత్య, ప్రసన్నుండు = ఎల్లప్పుడు నిర్మలమైనవాడు (నిత్య సంతుష్టుడు)
నీతిపాలకుఁడు = నీతివంతమైన పాలన చేసేవాడు
సత్యసంధుడు = సత్యమును పాటించేవాడు
త్రిశంకునందనుడు = త్రిశంకుమహారాజు కుమారుడు
నిరుపమ విజ్ఞాన నిధి ; నిరుపమ = పోలిక చెప్పరాని
విజ్ఞాన = విజ్ఞానానికి
నిధి = రాశి (సాటిలేని విజ్ఞానం కలవాడు)
భానువంశ శరధి చంద్రుడు ;
భానువంశ = సూర్య వంశము అనే
శరధి = సముద్రములో పుట్టిన
చంద్రుడు = చంద్రుని వంటివాడు
హరిశ్చంద్రుఁడా రాజు = హరిశ్చంద్రుడు అనే రాజు

భావం :
అన్ని శాస్త్రాల సారం తెలిసినవాడు. గర్వించిన శత్రురాజులనే ఏనుగుల పాలిటి సింహం వంటివాడు. షట్చక్ర వర్తులలో ఒకడు. సత్యం వదలనివాడు. నీతిమంతమైన పాలన చేసేవాడు. గొప్ప జ్ఞాని. సత్యవాక్పరిపాలకుడు. సూర్యవంశస్థుడైన త్రిశంకుని కుమారుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. సూర్య వంశమనే సముద్రంలో పుట్టిన చంద్రుడు.

విశేషాంశం :
షట్చక్రవర్తులు :
1) హరిశ్చంద్రుడు 2) నలుడు 3) పురుకుత్సుడు 4) పురూరవుడు 5) సగరుడు 6) కార్తవీర్యార్జునుడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

19వ పంక్తి నుండి 26వ పంక్తి వరకు
పోండిమి మదిఁ దలపోసి చూచినను
వాఁడెపో బొంకనివాఁడు దేవేంద్ర
అల రెండువేల జిహ్వల వానికైనఁ
గొలఁదె హరిశ్చంద్రు గుణములు వొగడఁ
దను వెల్ల సత్యంబు తలఁ పెల్లఁగరుణ
పను లెల్ల ధర్మంబు పలు కెల్లఁ బ్రియము
బొంకు నాలుకకుఁ జేర్పుట కాని వావి
ప్రతిపదార్థం :
పోడిమిన్ = చక్కగా
మదిన్ = మనస్సులో
తలపోసి చూచినను = ఆలోచించి చూసినట్లయితే
దేవేంద్ర = ఓ దేవేంద్రా
బొంకనివాడు = అబద్దం ఆడనివాడు
వాడెపో = వాడే సుమా (ఆ హరిశ్చంద్రుడే)
అల = ప్రసిద్ధమైన
రెండువేల జిహ్వలవానికైనన్; = రెండువేల నాలుకలు గల ఆదిశేషునికైనా
హరిశ్చంద్రు = హరిశ్చంద్రుని యొక్క
గుణములు + పొగడన్ = గుణాలను పొగడుటకు
కొలదె; (కొలది + ఎ) = శక్యమా (కాదు)
తనువు + ఎల్లన్ = ఆయన శరీరమంతా
సత్యంబు = సత్యము
తలపు + ఎల్లన్ = హృదయము అంతా
కరుణ = జాలి, దయ
పనులు + ఎల్లన్ = ఆయన పనులు అన్నీ
ధర్మంబు = ధర్మము
పలుకు + ఎల్లన్ = మాట అంతయూ
ప్రియము = ఇంపుగా ఉంటుంది
బొంకు = అబద్ధము
నాలుకకున్ = నాలికవద్దకు
చేర్పుట = చేర్చడం
కాని = లేని
వాయి = నోరు

భావం :
ఓ దేవేంద్రా ! చక్కగా మనస్సులో ఆలోచించి ఆ రాజు చూస్తే హరిశ్చంద్రుడే అబద్ధం ఆడనివాడు. రెండువేలు నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతడు సత్యస్వరూపుడు. అతని ఆలోచనలు కరుణతో నిండి ఉంటాయి. హరిశ్చంద్రుడు ధర్మగుణం కలవాడు. ఆయన ఎప్పుడూ నిజాలే మాట్లాడతాడు. ఆబద్ధమనేది అతనికి తెలియదు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

27వ పంక్తి నుండి 33వ పంక్తి వరకు
యింక నన్నియుఁ జెప్ప నేమి కారణము
వారిజ గర్భుని వ్రాంత దప్పినను
వారిజాప్తుఁడు దూర్పువంకఁ గ్రుంకినను
మేరువు గ్రుంగిన మిన్ను వ్రాలినను
ధారుణీ చక్రంబు తలక్రిందు వడిన
వారిధు లింకిన వజ్రాయుధంబు
ధార దప్పిన మాటతప్పఁడా రాజు.
ప్రతిపదార్థం :
ఇంకన్ = ఇంకా
అన్నియున్ = అన్ని గుణాలనూ
చెప్పడన్ = చెప్పడానికి
ఏమి కారణము = కారణము ఏముంది (చెప్పడం ఎందుకు)
వారిజ గర్భుని = పద్మమున పుట్టిన బ్రహ్మ యొక్క
వ్రాత + తప్పి న = రాత తప్పినా
వారిజాప్తుడు = పద్మబంధువైన సూర్యుడు
తూర్పు వంకన్ = తూర్పు దిక్కున
క్రుంకినను = అస్తమించినా
మేరువు = మేరు పర్వతము
క్రుంగినన్ = భూమిలోకి దిగిపోయినా
మిన్ను = ఆకాశము
వ్రాలినను = ఊడి కిందపడినా
ధారుణీ చక్రంబు = భూమండలము
తలక్రిందు + పడినన్ = తలక్రిందులుగా పడినా
వారిధులు = సముద్రములు
ఇంకినన్ = ఎండిపోయినా
వజ్రాయుధంబు = దేవేంద్రుని వజ్రాయుధము
ధారతప్పినిన్ = పదును తగ్గినా
ఆరాజు = ఆ హరిశ్చంద్ర మహారాజు
మాట తప్పడు = ఆడిన మాట తప్పడు

భావం : ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు? బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలక్రిందులైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రుడు మాత్రము ఆడినమాట తప్పడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 6th Lesson ప్రకృతి ఒడిలో

8th Class Telugu 6th Lesson ప్రకృతి ఒడిలో Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 1

ప్రశ్న 1.
చిత్రంలో ఏమేమి ఉన్నాయి?
జవాబు:

  1. చిత్రంలో ఒక చెట్టు ఉంది. చెట్టు కింద పిల్లలు ఆడుతున్నారు.
  2. ఇద్దరు పిల్లలు కాలువలో కాగితం పడవలు వదలి పెడుతున్నారు.
  3. ఇద్దరు స్త్రీలు ఇంటికి కడవలతో నీరు తీసుకువెడుతున్నారు.
  4. పక్షులు గూళ్ళకు ఎగిరి వస్తున్నాయి.
  5. మూడు గుడిసెలు ఉన్నాయి.
  6. కాలువపై వంతెన ఉంది.
  7. ఆవులు, కుక్క పరుగు పెడుతున్నాయి.

ప్రశ్న 2.
ఏం జరుగుతూంది?
జవాబు:
చిత్రంలో వర్షం పడుతూ ఉంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

ప్రశ్న 3.
చిత్రంలోని పిల్లలు ఏం మాట్లాడుతుండవచ్చు? ఊహించి చెప్పండి.
జవాబు:

  1. చిత్రంలో పిల్లలు కొందరు కాగితపు పడవలు కాలువలో వేస్తూ, ఎదుటివారి పడవ కంటె తమ పడవ ముందుకు వేగంగా వెడుతూందని మాట్లాడుతూ ఉండవచ్చు.
  2. వర్షం వస్తుంది. ఇంటికి వేగంగా వెడదాం రండి అని ఒక బాలిక పక్కవారిని పిలుస్తూ ఉండవచ్చు.
  3. చెమ్మ చెక్క ఆడదాం రమ్మని బాలబాలికలు ఒకరిని ఒకరు పిలుస్తూ ఉండవచ్చు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
మనం చేయలేనివి జంతువులు చేయగలిగేవి ఏవి? మాట్లాడండి.
జవాబు:

  1. మనిషి వినలేని ధ్వనులు కూడా కుక్కలకు వినిపిస్తాయి.
  2. చీకట్లో గాలిలోకి విసరిన వస్తువులలో, అది పురుగో, బంతో, కర్రో సులువుగా గ్రహించేశక్తి గబ్బిలాలకు ఉంది.
  3. ఆకారాలను బట్టి ఒకే పరిమాణంలో ఉన్న ఆకులూ, పురుగులు వంటి వాటిని, గబ్బిలాలు గుర్తించగలవు.
  4. తిమింగలాలకు, గబ్బిలాలకన్నా ఎక్కువగా ఇకోలొకేషన్ శక్తి, విశ్లేషణ శక్తి ఉన్నాయి.
  5. పాములూ, ఎలుకలూ మన కంటే ముందుగా భూకంపాలను గుర్తించగలవు.
  6. ఏనుగులు సునామీని 250 కి||మీ దూరంలో ఉండగానే గుర్తిస్తాయి.

ప్రశ్న 2.
శాస్త్రజ్ఞానం అభివృద్ధి చెందడం అంటే ఏమిటి? దీనివల్ల గతంతో పోలిస్తే, నేడు దేంట్లో ఏమి మార్పులు వచ్చాయి?
జవాబు:
శాస్త్రజ్ఞానం అన్ని రంగాలలోనూ అభివృద్ధి అయ్యింది. ముఖ్యంగా సమాచార రంగంలో, అణుశక్తి రంగంలో, విద్యుచ్ఛక్తి సాధనాల తయారీలో, కంప్యూటర్ రంగంలో, ఇంటర్నెట్ రంగంలో, ప్రయాణ సాధనాల్లో, ఎన్నో మార్పులు వచ్చాయి. వైద్య రంగంలో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందడం వల్ల కేన్సర్, గుండెపోటు, మోకాలు మార్పిడి వంటి అసాధ్యమైన రోగాలకు చికిత్సలు సాధ్యమవుతున్నాయి. శాస్త్రజ్ఞులు నిత్యం పరిశోధనలు చేస్తున్నారు. రోదసీ విజ్ఞానంలో చంద్రుడి వద్దకు మనిషిని పంపగలుగుతున్నాము. విమానాలు, రైళ్ళు, బస్సులు, మోటారు సైకిళ్ళు వచ్చాయి.

ప్రశ్న 3.
నిత్యజీవితంలో మీరు గమనించిన ప్రకృతి వింతలను గురించి చెప్పండి.
జవాబు:
నేను గమనించిన ప్రకృతి వింతలు ఇవి.

  1. నిప్పు ఎప్పుడు తాకినా కాలుతుంది.
  2. నీరు పల్లానికే ఎప్పుడూ ప్రవహిస్తుంది.
  3. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది.
  4. చలికి నీరు గడ్డకడుతుంది.
  5. చలికి నెయ్యి, నూనె పేరుకుంటాయి.
  6. గోడ మీద బల్లి జారిపోకుండా పాకుతుంది. ఇవన్నీ నేను గమనించిన ప్రకృతి వింతలు.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

ప్రశ్న 1.
పాఠం చదవండి. కింది భావం వచ్చే పేరాలను గుర్తించండి. వాటికి పేరు పెట్టండి.
అ) ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. దీన్ని చూస్తే చాలా ఆనందం కలుగుతుంది.
జవాబు:
పాఠంలో మొదటి పేరా ఈ భావాన్ని ఇస్తుంది. “కాటారం బడిలో ………….. ప్రకృతిలో ఎన్ని రహస్యాలున్నాయో” ……… ఈ పేరాకు “ప్రకృతి అందాలు” అని పేరు పెట్టవచ్చు.

ఆ) మనం ఎన్నో విషయాలను తెలుసుకోడానికీ, పరిశీలించడానికి మనకున్న జ్ఞానేంద్రియాలు ఉపయోగపడుతున్నాయి.
జవాబు:
పాఠంలో 2వ పేరా పై భావాన్ని ఇస్తుంది. “ప్రకృతి రహస్యాలను …………. నీటిని మళ్ళించవచ్చు. ……… అనే పేరా, జ్ఞానేంద్రియాల గురించి చెపుతోంది. ఈ పేరాకు “ప్రకృతి ధర్మాలు – మానవుని గుర్తింపు” అని పేరు పెట్టవచ్చు.

ఇ) మానవుడు తనకున్న బలాలను, బలహీనతలను తెలుసుకున్నాడు. కాబట్టి ఉన్నదానితో తృప్తి చెందక, ఎన్నో విషయాలను కనుక్కున్నాడు.
జవాబు:
పాఠంలో 66వ పేజీలోని 12వ పంక్తి నుండి 18వ పంక్తి వరకు ఉన్న పేరా పై భావాన్ని ఇస్తుంది. “ఇంద్రియ జ్ఞానం మీదనే …………. రాడార్ వగైరాలు” – అనే పేరా పై భావాన్ని తెలుపుతుంది. ఈ పేరాకు “శాస్త్రజ్ఞులు – నూతన ఆవిష్కరణలు” – అని పేరు పెట్టవచ్చు.

ప్రశ్న 2.
జట్లు జట్లుగా కూర్చొని పాఠంలోని పేరాలను చదవండి. ఒక్కొక్క పేరాకు ఒక ప్రశ్నను తయారుచేయండి. అంటే అదే ప్రశ్నకు, పేరాలోని విషయం జవాబుగా రావాలి.
జవాబు:
1వ పేరా : “కాటారం బడిలో ………….. ఇలాంటివి కొన్ని చూద్దామా ?”
ప్రశ్న : ప్రకృతిలో కనిపించే అందాలను పేర్కొనండి.

2వ పేరా : “ప్రకృతి రహస్యాలను ……….. మళ్ళించవచ్చు”.
ప్రశ్న : ప్రకృతి ధర్మాలను మానవుడు తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నాడు?

3వ పేరా : “ఆధునిక శాస్త్రవేత్త ………… తరంగాలు అంటారు”.
ప్రశ్న : శాస్త్రవేత్తలు కనుగొన్న జ్ఞాన సంపాదన గూర్చి తెలపండి.

4వ పేరా : కొన్ని పరిస్థితులలో ………. జిల్లు మంటుంది.
ప్రశ్న : శాస్త్రవేత్తలు జ్ఞానేంద్రియ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు?

5వ పేరా : “ఇంద్రియ జ్ఞానం మీదనే …………. రాడార్ వగైరాలు”
ప్రశ్న : శాస్త్రజ్ఞులు జ్ఞాన సంపాదనకు కనుగొన్న సాధనాలను తెలపండి.

6వ పేరా : శాస్త్రజ్ఞానం …………. సిద్ధాంతంగా ఆమోదం పొందుతుంది.
ప్రశ్న : శాస్త్రజ్ఞానం ఎప్పుడు సిద్ధాంతంగా రూపొందుతుంది?

7వ పేరా : “దృష్టి, వినికిడి ………. గబ్బిలాల కన్నా ఎక్కువ”.
ప్రశ్న : “ఇంద్రియ జ్ఞానంలో కొన్ని జంతువులు మానవులను మించాయి” వివరించండి.

8వ పేరా : “ప్రకృతి వైపరీత్యాలను ……….. శాస్త్రజ్ఞులు నిరూపించారు”.
ప్రశ్న : ప్రకృతి వైపరీత్యాలను కనిపెట్టడంలో జంతువులలో గల ప్రత్యేకత ఎట్టిది?

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి ? వాటివల్ల మనం ఏం చేయగలుగుతున్నాం?
జవాబు:
ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి, మనిషికి ఉన్న మూలసాధనాలు జ్ఞానేంద్రియాలు. మనకు జ్ఞానం కలిగించే ఐదు ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలు అంటాము.

  1. కన్ను దృశ్య జ్ఞానాన్ని ఇస్తోంది.
  2. చెవి శ్రవణ జ్ఞానాన్ని కల్గిస్తుంది.
  3. చర్మం స్పర్శ జ్ఞానాన్ని కల్గిస్తుంది.
  4. ముక్కు వాసనను తెలియజేస్తుంది.
  5. నాలుక రుచిని తెలుపుతుంది.

ఆ) ఇంద్రియజ్ఞానానికే పరిమితం కాకపోవడం వల్ల ఏం జరిగింది?
జవాబు:
మనం ఇంద్రియ జ్ఞానానికే పరిమితం కాకపోవడం వల్లనే, మనకు నేడు రేడియోలు వచ్చాయి. విద్యుచ్ఛక్తి వచ్చింది. ఆకాశంలోని నక్షత్రాలలో ఏ పదార్థాలు ఉన్నాయో తెలిశాయి. ఇంద్రియ జ్ఞానాన్ని విస్తరించడానికి శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు. టెలిస్కోపులు, మైక్రోస్కోపులు, ఫోటోగ్రఫీ, ఎక్స్ రేలు, చీకట్లో చూడటానికి వీలైన సాధనాలూ, రాడార్ వంటి వాటిని కల్పించారు.

ఇ) చూపు, వినికిడి, వాసనలను తెలుసుకోవడం అన్నవాటి విషయంలో మనకు, జంతువులకు ఉండే తేడాలు ఏమిటి? దీని వలన మీరు ఏం గ్రహించారు?
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 2 AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 3

ఈ) ఈ పాఠంలోని మొదటి పేరాకు, మిగతా పేరాలకు మధ్య ఉన్న భేదమేమిటి?
జవాబు:
ఈ పాఠంలో మొదటి పేరా ప్రకృతిని వర్ణిస్తూ సాగింది. అది వర్ణనాత్మకంగా ఉంది. చిన్న సైజు అక్షరాలలో ఉంది. రెండవ పేరా నుండి శాస్త్ర విజ్ఞానం గురించి విశ్లేషణ ఉంది. కాబట్టి మిగిలిన పేరాలు విశ్లేషణాత్మకంగా సాగాయి. అవి పెద్ద టైపు అక్షరాలలో అచ్చయ్యా యి.

III. స్వీయరచన

1. ఈ కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో మీ సొంతమాటలలో జవాబులు రాయండి.

అ) “ప్రకృతి రహస్యాలు అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు” దీని మీద మీ అభిప్రాయం ఐదు వాక్యాలలో రాయండి.
జవాబు:
మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అన్నవి జ్ఞానేంద్రియాలు. మనము ఏ విషయాన్ని గురించి తెలిసికోవాలని ఉన్నా, ఈ ఐదు ఇంద్రియాల వల్లనే సాధ్యం అవుతుంది. మనం కంటికి కనబడే కాంతి తరంగాల ద్వారానే వస్తువులను చూడగలం. చెవికి వినబడే ధ్వని తరంగాల ద్వారానే శబ్దాలు వినగలం. చర్మానికి తగిలిన స్పర్శ వల్లే అది వేడో, చలో గుర్తించగలం. నాలుకతో రుచి చూస్తేనే, పదార్థం రుచి తెలుస్తుంది. ముక్కుతో వాసన చూస్తేనే పరిమళం తెలు ,కోగలం.

ఆ) శాస్త్రజ్ఞులు జ్ఞానేంద్రియాల హద్దులను తెలుసుకోవడం వల్ల ఏం జరిగింది?
జవాబు:
శాస్త్రజ్ఞులు జ్ఞానేంద్రియాలు గుర్తించలేని విషయాలను తెలుసుకోడానికి, సాధనాలు తయారుచేశారు. వారు మైక్రోస్కోపులు, టెలిస్కోపులు, రాడార్లు , ఎక్స్ రేలు, ఫొటోగ్రఫీ, చీకట్లో చూడగల సాధనాలు తయారుచేశారు. గామా కిరణాలు, రేడియోతరంగాలు వంటి వాటిని తయారుచేశారు.

2. ఈ కింది ప్రశ్నలకు పదివాక్యాలలో సొంతమాటలలో జవాబులు రాయండి.

అ) సాధారణ దృష్టి, శాస్త్ర దృష్టి రెండూ ఒకటేనా? కాదా? ఎందుకు?
జవాబు:
సాధారణ దృష్టి, శాస్త్ర దృష్టి ఒకటి కాదు. సాధారణ దృష్టి కలవాడు ప్రతి సంఘటనకూ వెనుక ఉన్న కారణాన్ని గూర్చి ఆలోచించడు. సూర్యుడు తూర్పు దిక్కులోనే ఎందుకు ఉదయిస్తున్నాడు ? ఆటలమ్మ ఎందుకు వచ్చింది ? అని శాస్త్ర దృష్టి కలవాడు ఆలోచిస్తాడు. వేంకటేశ్వరస్వామి కోపం వల్ల తలనొప్పి వచ్చిందంటే, శాస్త్ర దృష్టి కలవాడు అంగీకరించడు. శాస్త్ర దృష్టి కలవాడు మూఢనమ్మకాలను నమ్మడు. శాస్త్ర దృష్టితో విషయాన్ని పరీక్షించి చూచి, సత్యాన్నే నమ్ముతాడు.

ఆ) ప్రకృతి అందాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ప్రకృతి అందాలు :
భగవంతుడు ప్రకృతిలో ఎన్నో అందాలు సమకూర్చాడు. అందమైన సూర్యోదయం, ఆకాశంలో ఎర్రని సంధ్యారాగం, కోయిలల కూతలు, ఆకాశంలో పక్షుల బారులు, కొండలు, కోనలు, పచ్చని వనాలు, పూలతోటలు, ఆవులు, గేదెలు, అనేక రకాల జంతువులు ప్రకృతిలో ఉంటాయి.

వర్షం వచ్చే ముందు ఇంద్రధనుస్సు ఆకాశంలో కనబడుతుంది. వసంతం వస్తే చెట్లు అన్నీ చిగిర్చి పూలు పూస్తాయి. గాలికి కొమ్మలు రెపరెపలాడుతూ మనలను దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉంటాయి. కోకిలలు కుహూకుహూ అంటూ కూస్తాయి. చిలుకలు మాట్లాడుతాయి. సాయం సంధ్యలో ఆకాశంలో కుంకుమ అరబోసినట్లు ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను అందించిన దైవానికి మనం కృతజ్ఞతగా ఉండాలి.

IV. పదజాలం – వినియోగం

1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.

అ) శాస్త్ర దృష్టి మానవుడి కృషికి ఒక మార్గం చూపిస్తుంది. (త్రోవ)
ఆ) కొండలను పగలగొట్టినప్పుడు భూప్రకంపనలు వస్తాయి. (ఎక్కువ కదలికలు)
ఇ) ఎండమావులను చూసి నీరు అని భ్రమపడతాము. (భ్రాంతి)

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను ఎంపిక చేసుకొని వాటితో వాక్యాలు రాయండి.
ఉదా :
పార్వతికి అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు.
i) కొందరికి పొగడ్తలు ఇష్టం ఉండవు.
ii) ప్రశంసలకు లొంగకపోవడం గొప్పవారి లక్షణం.

అ) బొమ్మలలో రకరకాల ఆకృతులు ఉంటాయి.
జవాబు:
i) నగరంలో పలురకాల ఆకారాల ఇండ్లు ఉంటాయి.
ii) మానవుల్లో రకరకాల రూపాలు గలవాళ్ళు ఉంటారు.

ఆ) బుద్ధి కొన్ని సత్యాలను ప్రతిపాదిస్తుంది.
జవాబు:
i) విద్యార్థులు ఎల్లప్పుడు నిజం పలకాలి.
ii) మహాత్ములు సదా యథార్థం పలికి తీరుతారు.

ఇ) మన కన్ను చూసే కాంతి తరంగాలు చాలా తక్కువ.
జవాబు:
i) జ్ఞానేంద్రియాల్లో నయనం ప్రధానం.
ii) మనం ఎల్లప్పుడు చక్షువును రక్షించుకోవాలి.

ఈ) మానవుని కంటే జంతువులు తొందరగా వాసనలను పసిగడతాయి.
జవాబు:
i) పశువులు మానవులకు ఉపకారం చేస్తాయి.
ii) మృగాలు అరణ్యంలో సంచరిస్తాయి.

ఉ) చైనాలో ఒకసారి కలుగులలోంచి ఎన్నో పాములు బయటకు వచ్చాయి.
జవాబు:
i) ఇంటిలోని రంధ్రం నుంచి సర్పము వచ్చింది.
ii) పొలంలోని బిలంలో ఫణి చేరింది.

3. కింద గీత గీసిన పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.
అ) పుష్పాలు సున్నితమైనవి.
ఆ) మన దమ్మం మనం పాటించాలి.
ఇ) శాస్త్రాన్ని అతిక్రమించగూడదు.
ఈ) కొందరికి చిత్తరువులు గీయడంలో నైపుణ్యం ఉంటుంది.
ఉ) ఎవరి ప్రాణం వారికి తీపి.

ప్రకృతి – వికృతి

పుష్పం – పూవు
శాస్త్రం – చట్టం
ప్రాణం – పానం
ధర్మం – దమ్మం
చిత్రము – చిత్తరువు

V. సృజనాత్మకత

ఈ కింది వాక్యాలు చదవండి.

1) “చప్పట్ల చప్పుడు విని, సీతాకోక చిలుకలు పైకి లేచాయి” – సాధారణ వాక్యం.

“ఆ చప్పట్ల ప్రకంపనలకు, ఆ పరిసరాలలో చెట్ల మీద ఉన్న రంగురంగుల సీతాకోకచిలకలు గుంపులు గుంపులుగా రెక్కలు రెపరెపలాడిస్తూ పైకి లేచాయి” – పై వాక్యాన్నే వర్ణిస్తూ రాసిన వాక్యం ఇది. వాక్యంలోని కర్త, కర్మ, క్రియ పదాలలో దేన్ని గురించి అయినా గొప్పగా / అందంగా వివరించేలా సరైన పదాలను జోడిస్తూ రాస్తే మామూలు వాక్యాలు కూడా వర్ణనాత్మక వాక్యాలుగా మారుతాయి. మీరు కూడా మీకు నచ్చిన కథను / సన్నివేశాన్ని / సంఘటనను లేదా ఏదైనా ఒక అంశాన్ని గురించి వర్ణిస్తూ రాయండి.
జవాబు:
ఆ గ్రామంలో అందం మాట వస్తే, అంతా వసంతసేన గురించే చెప్పుకొనేవారు. వసంతసేన ముఖం ముందు, చంద్రుడు వెలవెల పోయేవాడు. తోటలో పువ్వులు వసంతసేన ముఖాన్ని చూసి తెల్లపోయేవి. వసంతసేన ఆకుపచ్చ పట్టుచీర కట్టుకొని గుడికి రాజహంసలా వెడుతూంటే, ఆ గ్రామంలో పెద్దలూ, చిన్నలూ ఆమె కేసే కళ్ళు తిప్పకుండా చూసేవారు. వసంతసేన అందం ముందు అప్సరసలు కూడా దిగదుడుపే.

ఆ ఊరిలో హరిహరస్వామి ఆలయం ఉంది. వసంతసేనకు అమ్మమ్మ నృత్యగానాలలో మంచి శిక్షణను ఇప్పించింది. వసంతసేనకు వయస్సు రాగానే ఆమె అమ్మమ్మ రాగమాలిక దేవాలయంలో అరంగేట్రం చేయించింది. ఆ రోజు కోడెగారు పిల్లలంతా వసంత సేన కనుసన్నల కోసం పడిగాపులు కాశారు. ఆ సమయంలోనే దేవాలయానికి వచ్చిన ఆ దేశపు రాజు మదనసింహుడి దృష్టి వసంతసేన మీద పడింది. రాజు తన దృష్టిని వసంతసేన నుండి మరలించుకోలేకపోయాడు. వసంత సేన కూడా రాజును కన్ను ఆర్పకుండా చూసింది. ఆ తొలిచూపుల సమ్మేళన ముహూర్తం, వారి వివాహానికి నాంది పలికింది.

VI. ప్రశంస

1) భూమిమీద ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, మానవులు ……….. ఇలా ప్రతి ఒక్కదాంట్లో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. మీ మిత్రులతో చర్చించి దేంట్లో ఏ ఏ గొప్పదనాలున్నాయో రాయండి.
జవాబు:
1) చెట్లు గొప్పదనం :
మనకు పనికిరాని కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గుపులుసు) వాయువును గ్రహించి, మనకు ప్రాణవాయువును ఇస్తాయి.

2) పక్షులు గొప్పదనం :
పక్షులకు గొప్ప దిశా జ్ఞానం ఉంటుంది. అవి ఎక్కడకు ఎగిరి వెళ్ళినా, తిరిగి తమ గూటికి అవి వస్తాయి.

3) జంతువులు :
కొన్ని జంతువులు ప్రకృతి వైపరీత్యాలను మానవుల కంటే ముందే గుర్తిస్తాయి. దృష్టి, వినికిడి, వాసనలను పసిగట్టే విషయంలో జంతువులు మానవుని కన్నా ముందున్నాయి.

4) మానవులు :
మానవులు బుద్ధిజీవులు, మానవులకు ఆలోచనా శక్తి, వివేచనా శక్తి, నిర్ణయాత్మక శక్తి ఉంటాయి. జంతువులకు వివేచనా శక్తి ఉండదు.

ప్రాజెక్టు పని

* ప్రకృతిని గురించిన చిత్రాలను సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 4

VII. భాషను గురించి తెలుసుకుందాం !

1) కింది పదాలను విడదీయండి. సంధి పేరు రాయండి.
ఉదా :
అందమైన = అందము + ఐన – ఉత్వ సంధి
(అ) సూక్ష్మమైన – సూక్ష్మము + ఐన – ఉత్వ సంధి
(ఆ) పైకెత్తు = పైకి + ఎత్తు – ఇత్వ సంధి
(ఇ) అయిందంటే = అయింది + అంటే – ఇత్వ సంధి

2) క్రింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.
ఉదా :
మూడయిన రోజులు మూడు రోజులు
(అ) రెండయిన రోజులు – రెండు రోజులు
(ఆ) వజ్రమూ, వైఢూర్యమూ – వజ్రవైఢూర్యాలు
(ఇ) తల్లీ, బిడ్డా – తల్లీబిడ్డలు

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

3) కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా :
పార్వతికి అభినందనలను తెలుపుతూ అందరూ చప్పట్లు కొట్టారు.
పార్వతికి అభినందనలు తెలుపుతూ అందరిచేతా చప్పట్లు కొట్టబడ్డాయి.

అ) కర్తరి : జ్ఞానేంద్రియాలు మనిషికి అనుభవాలను కలిగిస్తాయి.
కర్మణి : జ్ఞానేంద్రియాలచేత మనిషికి అనుభవాలను కలిగింపజేస్తాయి.

ఆ) కర్తరి : చలికి నెయ్యి, నూనె పేరుకుంటాయి.
కర్మణి : చలిచేత నెయ్యి, నూనె పేరుకొనబడతాయి.

ఇ) కర్తరి : శాస్త్రజ్ఞానము కొన్ని ప్రతిపాదనలను చేస్తుంది.
కర్మణి : శాస్త్రజ్ఞానముచేత కొన్ని ప్రతిపాదనలు చేయబడుతుంది.

4) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) కర్మణి : శాస్త్రజ్ఞులచేత అనేక వేల సాధనాలు కల్పించబడినవి.
కర్తరి : శాస్త్రజ్ఞులు అనేక సాధనాలను కల్పించారు.

ఆ) కర్మణి : ఈ ప్రతిపాదన శాస్త్రముచేత పరమ సత్యంగా పరిగణింపబడదు.
కర్తరి : ఈ ప్రతిపాదనను శాస్త్రము పరమసత్యంగా పరిగణిస్తుంది.

ఇ) కర్మ : అది సిద్ధాంతముగా ఆమోదము పొందబడుతుంది.
కర్తరి : అది సిద్ధాంతంగా ఆమోదం పొందింది.

5) తత్పురుష సమాసం.

1. మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా! కింది వాటిలో గీత గీసిన విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి.

అ) విద్యను అర్థించేవాళ్ళు = విద్యార్థులు – ద్వితీయా తత్పురుష సమాసం
ఆ) గుణాల చేత హీనుడు = గుణహీనుడు – తృతీయా తత్పురుష సమాసం
ఇ) సభ కొరకు భవనం = సభాభవనం – చతుర్థి తత్పురుష సమాసం
ఈ) దొంగ వల్ల భయం = దొంగభయము – పంచమీ తత్పురుష సమాసం
ఉ) రాముని యొక్క బాణం = రామబాణం – షష్ఠీ తత్పురుష సమాసం
ఊ) గురువులలో శ్రేష్ఠుడు = గురుశ్రేష్ఠుడు – షష్ఠీ తత్పురుష సమాసం
ఋ) దేశము నందు భక్తి = దేశభక్తి – సప్తమీ తత్పురుష సమాసం

(పై వాక్యాల్లో వేర్వేరు విభక్తులను గమనించారు కదా!)
పై విగ్రహవాక్యాలకు సమాస పదాలు రాయండి.

2. కింది సమాస పదాలను పరిశీలించి విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లను రాయండి.
ఉదా :
విద్యార్థి – విద్యను అర్థించేవాడు – ద్వితీయా తత్పురుష సమాసం

పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. ధనహీనుడు ధనము చేత హీనుడు ద్వితీయా తత్పురుష సమాసం
2. పొట్టకూడు పొట్ట కొరకు కూడు చతుర్థి తత్పురుష సమాసం
3. రాక్షసభయం రాక్షసుల వలన భయం పంచమీ తత్పురుష సమాసం
4. నాపుస్తకం నా యొక్క పుస్తకం షష్ఠీ తత్పురుష సమాసం
5. రాజశ్రేష్ఠుడు రాజుల యందు శ్రేష్ఠుడు సప్తమీ తత్పురుష సమాసం

3. అతిశయోక్తి అలంకారం
కింది వాక్యాన్ని చదవండి.

ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై వాక్యంలో గమనిస్తున్నాం.

ఈ విధంగా గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని ‘అతిశయోక్తి అలంకార’మంటారు.

అతిశయోక్తి అలంకారానికి సంబంధించిన కొన్ని వాక్యాలు రాయండి.
1) మా ఊర్లో పంటలు బంగారంలా పండుతాయి.
2) మా తోటలోని మామిడిపండ్లు అమృతం వలె ఉంటాయి.
3) మా అన్నయ్య తాటిచెట్టంత పొడవున్నాడు.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

ప్రశంస : పొగడ్త, అభినందన
కలుగు : రంధ్రం, బిలం
నిప్పు : అగ్ని, చిచ్చు
పార్వతి : గౌరి, ఉమ
ఆకాశం : నింగి, నభం
సముద్రం : జలధి, వారిధి
ఆమోదం : అంగీకారం, సమ్మతి
లోకం : విశ్వం, జగము
గాలి : వాయువు, మారుతం
తరంగము : భంగము, అల
నక్షత్రం : తార, చుక్క

వ్యుత్పత్యర్థాలు

అగ్ని : మండెడి స్వభావం కలది
జలధి : నీటిని ధరించునది
సాగరం : సగర కుమారుల చేత త్రవ్వబడినది
ఉదధి : నీటిని ధరించునది

నానార్థాలు

అంబరం = గగనం, వస్త్రం, శూన్యం
వర్షం = వాన, సంవత్సరం
కన్ను = నేత్రం, బండి చక్రం
శక్తి = సామర్థ్యం, పార్వతి

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
జ్ఞానాభివృద్ధి = జ్ఞాన + అభివృద్ధి – సవర్ణదీర్ఘ సంధి
ధనాశ = ధన + ఆశ – సవర్ణదీర్ఘ సంధి
నిజానందం = నిజ + ఆనందం – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
జ్ఞానేంద్రియం = జ్ఞాన + ఇంద్రియం – గుణసంధి
సర్వోన్నత = సర్వ + ఉన్నత – గుణసంధి

ఆమ్రేడిత సంధి :
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితంబు పరమగునపుడు సంధి తరచుగానగు.
అప్పుడప్పుడు = అప్పుడు + అప్పుడు = ఆమ్రేడిత సంధి
ఔరౌర = ఔర + ఔర = ఆమ్రేడిత సంధి

లులనల సంధి :
సూత్రం : లు, ల, న లు పరమగునపుడు మువర్ణమునకు లోపమును, తత్పూర్వ స్వరమునకు దీర్ఘమును, బహుళముగా వచ్చును.
తరంగాలు = తరంగము + లు – లులనల సంధి
సముద్రాలు = సముద్రము + లు – లులనల సంధి
భూకంపాలు = భూకంపము + లు – లులనల సంధి
రహస్యాలు = రహస్యము + లు – లులనల సంధి

ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
ఊరెల్ల = ఊరు + ఎల్ల – ఉత్వసంధి
ముందున్నాయి = ముందు + ఉన్నాయి – ఉత్వసంధి
పరుగెత్తి = పరుగు + ఎత్తి – ఉత్వసంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
ప్రార్థనా సమావేశం ప్రార్థన కొఱకు సమావేశం చతుర్థీ తత్పురుష సమాసం
భూకంపాలు భూమి యొక్క కంపాలు షష్ఠీ తత్పురుష సమాసం
ప్రకృతి రహస్యాలు ప్రకృతి యొక్క రహస్యాలు షష్ఠీ తత్పురుష సమాసం
ప్రకృతి ధర్మము ప్రకృతి యొక్క ధర్మము షష్ఠీ తత్పురుష సమాసం
శాస్త్ర ప్రతిపాదనలు శాస్త్రము నందు ప్రతిపాదనలు సప్తమీ తత్పురుష మాసం
కళాదృష్టి కళయందు దృష్టి సప్తమీ తత్పురుష సమాసం
ఇంద్రియజ్ఞానము ఇంద్రియముల యొక్క జ్ఞానము షష్ఠీ తత్పురుష సమాసం
కాంతి తరంగాలు కాంతి యొక్క తరంగాలు షష్ఠీ తత్పురుష సమాసం
అద్భుత ప్రాణులు అద్భుతమైన ప్రాణులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
వంద సంవత్సరాలు వంద (100) సంఖ్యగల సంవత్సరాలు ద్విగు సమాసం
ఐదు కిలోమీటర్లు ఐదు (5) సంఖ్యగల కిలోమీటర్లు ద్విగు సమాసం
మూడు గంటలు మూడు (3) సంఖ్యగల గంటలు ద్విగు సమాసం

రచయిత పరిచయం

పాఠము పేరు : ‘ప్రకృతి ఒడిలో

రచయిత పేరు : కొడవటిగంటి కుటుంబరావుగారు

దేని నుండి గ్రహింపబడింది : రచయిత రాసిన “తాత్త్విక వ్యాసాల నుండి”

రచయిత జననం : అక్టోబరు 28, 1909 (28.10.1909)

మరణం : ఆగస్టు 17, 1980 (17.08.1980)

జన్మస్థలం : తెనాలి, గుంటూరు జిల్లా

రచనలు :
1) ‘జీవితం’, ‘చదువు’ – అనే నవలలు
2) ‘అద్దెకొంప’, ‘షావుకారు సుబ్బయ్య’ మొదలైన కథానికలు
3) సినిమా వ్యాసాలు
4) సైన్సు వ్యాసాలు, సంస్కృతి వ్యాసాలు, తాత్త్విక వ్యాసాలు మొ||నవి.

కొత్త పదాలు – అర్థాలు

అంశము = విషయము
అభినందన = ప్రశంస, పొగడ్త
అన్వేషించు = వెదకు, పరిశీలించు
అక్కఱ = అవసరమైన పని
ఆమోదం = అంగీకారం
ఆస్వాదించు = అనుభవించు
ఆకృతులు = రూపాలు
ఆధునికము = క్రొత్తది
కలుగు = రంధ్రం, బొరియ
గండి = రంధ్రము, సందు
చలన చిత్రాలు = సినిమాలు
జ్ఞానేంద్రియాలు = జ్ఞానమును కల్గించే అవయవాలు. ఇవి ఐదు. 1) కన్ను 2) ముక్కు 3) చెవి 4) నాలుక 5) చర్మం

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

దృశ్యము = చూడదగినది, కనబడు వస్తువు
నిరూపించు = నిర్ణయించు
పసిగట్టుట = వాసన ద్వారా గుర్తించుట
పాటించు = ఆదరించు, కావించు
ప్రతిపాదించు = నిరూపించి తెలుపు
పరిమాణము = కొలత
ప్రకంపన = కదలిక
భ్రమలు = భ్రాంతి; లేనిది ఉన్నట్లుగా తోచడం
ఋజువు చేయు = నిరూపించు
విశ్లేషించు = విషయాన్ని విభజించి చూచు
వైపరీత్యము = విపరీతము
విధిగా = ఏర్పాటుగా (తప్పనిసరిగా)
సామ్యము = సాటి, పోలిక
శాస్త్రవేత్త = శాస్త్రం తెలిసినవాడు

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 5 ప్రతిజ్ఞ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 5th Lesson ప్రతిజ్ఞ

8th Class Telugu 5th Lesson ప్రతిజ్ఞ Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ 1

ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి.
జవాబు:
పై చిత్రంలో కుమ్మరివాడు కుండలను తయారుచేస్తున్నాడు. కమ్మరి కొలిమిలో ఇనుప పనిముట్లు తయారుచేస్తున్నాడు. రైతు ఎద్దులతో పొలం దున్నుతున్నాడు. చేనేత కార్మికుడు మగ్గం నేస్తున్నాడు. ఒకామె కడవతో నీరు పట్టుకెడుతోంది. మరొకామె గంపతో సరుకులు తీసుకువెడుతోంది. పాలేరు గడ్డిమోపు మోస్తున్నాడు. కార్మికులు మరమ్మతుపని చేస్తున్నారు. జాలరి చెరువులో వల విసురుతున్నాడు.

ప్రశ్న 2.
ఆహారోత్పత్తి వెనుక ఉన్న కష్టాన్ని గురించి చెప్పండి.
జవాబు:
పంటలు పండించాలంటే, రైతులు ఎంతో కష్టపడాలి. ముందుగా పొలాల్ని నాగలితో దున్నాలి. చేనుకు నీరు పెట్టాలి. నారుమడి వేయాలి. నారును పెంచాలి. నారు తీసి పొలంలో నాటాలి. నీరు పెట్టాలి. కలుపు తీయాలి. పురుగు మందులు కొట్టాలి. ఎరువులు వేయాలి. చేను కోయాలి. ఆరబెట్టాలి. ధాన్యాన్ని నూర్చాలి. ధాన్యం ఎగురపోయాలి. సంచులలో ధాన్యం పోసి అమ్మాలి. దాన్ని మరల ద్వారా ఆడించాలి. ఇంత చేస్తే కాని బియ్యం, గోధుమ పిండి వంటివి మనకు లభించవు.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ప్రశ్న 3.
మనం వాడే ప్రతి వస్తువు తయారీ వెనుక ఉన్న శ్రమను గురించి చెప్పండి.
జవాబు:
మనం అనేక రకాల పనిముట్లు ఉపయోగిస్తాం. వాటి వెనుక ఎందరో కష్టజీవుల శ్రమ ఉంది. కమ్మరి కొలిమిలో ఇనుమును కాల్చి సమ్మెటపై బాది సాగదీసి కత్తి, కొడవలి, గొడ్డలి, గునపం, పార, నాగలి కొట్టు వగైరా తయారుచేస్తాడు. కుమ్మరి కుండలు, వంట పాత్రలు చేస్తాడు. సాలె మగ్గంపై మనకు బట్టలు వేస్తాడు. వడ్రంగి, ఇళ్ళకు గుమ్మాలూ, తలుపులూ వగైరా చేస్తాడు. ఇంకా ఎందరో కార్మికులు కార్యానాలలో, యంత్రాల దగ్గర పనిచేసి మనం వాడుకొనే వస్తువులు తయారుచేస్తున్నారు. ఇలా మనం వాడుకొనే ప్రతి వస్తువు వెనుక కార్మికుల శ్రమ, కష్టం, కృషి ఉంది.

ప్రశ్న 4.
కర్షకుడు, కార్మికుడు లేకపోతే ఏమౌతుందో ఆలోచించి చెప్పండి.
జవాబు:
కర్షకుడు, కార్మికుడు వీరిద్దరూ దేశానికి వెన్నెముకలాంటివారు. కర్షకుడు లేకపోతే మనకు తిండిలేదు. కార్మికుడు లేకపోతే, మనం వాడుకోవడానికి ఏ రకమైన పనిముట్లు, నిత్యావసర వస్తువులు, సైకిళ్ళు, కార్లు, విమానాలు, రైళ్ళు కూడా ఉండవు. ప్రతి వస్తువు వెనుక కార్మికుని కష్టం దాగి ఉంది.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
కార్మికుల, కర్షకుల సౌభాగ్యం అంటే ఏమిటి ? మాట్లాడండి.
జవాబు:
కార్మికులు వారి శ్రమకు తగినట్టుగా ప్రతిఫలాన్ని పొందలేక బాధపడుతున్నారు. కర్షకులు కూడా ఎంతో శ్రమతో, చమటోడ్చి పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలవుతున్నాడు.

వీరికి ‘సౌభాగ్యం’ అంటే వారికి చేతినిండా పని ఉండి వారు, వారి భార్యాబిడ్డలతో సుఖంగా జీవించగలగడం. పారిశ్రామిక కార్మికులకు యజమానులు శ్రమకు తగిన జీతాలు ఇవ్వడం, కార్మికుల పిల్లలకు విద్యాసదుపాయాలు కలుగజేయడం, కార్మికులకు వైద్యసదుపాయాలు కలుగజేయడం వంటి వాటిని వారి సౌభాగ్యంగా భావించాలి.

ఇక వ్యవసాయ కార్మికులకు సంవత్సరమంతటా పని ఉండదు. ఆ పని లేని రోజుల్లో కూడా వారి జీవితం సుఖంగా నడిచే ఏర్పాట్లు అనగా ‘పనికి ఆహార పథకం, రోజ్ గార్ పథకం’ వంటివి ఏర్పాటు చేయడం జరగాలి.

ప్రశ్న 2.
‘కర్షకుడు, కార్మికుడు’ చేస్తున్న సేవను గురించి చర్చించండి.
జవాబు:
కర్షకులు, విరామ మెరుగని కష్టజీవులు. మూడువందల అరవై రోజులూ శ్రమించి వ్యవసాయం పనులు చేసి, మనకు ఆహారానికి కావలసిన ఆహార ధాన్యాలను పండిస్తున్నారు. వారు పశువులను మేమే, మనకు కావలసిన పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక కార్మికులు, మనకు కావలసిన నిత్యావసర వస్తువుల్నీ వ్యవసాయ పనిముట్లనూ ఉత్పత్తి చేస్తున్నారు. యంత్రాల ద్వారా వస్తువులు తయారవుతున్నా, అక్కడ కార్మికులు లేనిదే యంత్రాలు నడవవు. వస్తువులు ఉత్పత్తి కావు.

కార్మికులు, కర్షకులు తమ పనిని మానివేస్తే, మనకు తిండి ఉండదు. వాడుకోవడానికి వస్తువులు ఉండవు. మన సుఖజీవనానికి వారే ప్రాణాధారం అని గుర్తించాలి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదరి, తాపీమేస్త్రీ ఇలా వీరందరూ పని చేయకపోతే ప్రపంచమే స్తంభించిపోతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ప్రశ్న 3.
శ్రీశ్రీ రాసిన కవిత విన్నారు కదా ! ఇలాంటి కవితను ఆయన ఎందుకు రాసి ఉంటారు ? ఊహించి చెప్పండి.
జవాబు:
మానవ సుఖజీవనానికి కార్మికులు, కర్షకులే ప్రాణాధారమని, దేశ సౌభాగ్యం కోసం వారు ఎనలేని సేవలందిస్తున్నారని, సకల వృత్తులకు సమ ప్రాధాన్యం గలదని, శ్రమైక జీవనంలోనే మాధుర్యం నిండి ఉందని తెలపడానికి శ్రీశ్రీ ఈ కవిత రాశాడు. కార్మికులూ, కర్షకులూ మానవ జీవిత గమనానికి అతిముఖ్యులని, వారు సౌఖ్యంగా జీవించేలా చూడవలసిన బాధ్యత ధనిక స్వాములపై ఉందనీ, సమాజంపై ఉందని చెప్పడానికే శ్రీశ్రీ ఈ కవిత రాశాడు. రష్యాలో వచ్చిన కార్మిక విప్లవం ప్రభావంతో, స్పందించిన శ్రీశ్రీ ఈ కవిత రాశాడు.

కేవలం రాజులూ, రాణులూ వారి ప్రేమ పురాణాలూ మాత్రమే కవితా వస్తువులు కావనీ, శరీర కష్టాన్ని తెలిపే గొడ్డలి, రంపం వంటి పనిముట్లు, వాటితో పనిచేసే కర్షక, కార్మికులు కూడా కవితా వస్తువులే అని, చెప్పడానికి అభ్యుదయ భావాలతో శ్రీశ్రీ ఈ కవిత రాశాడు.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. పాఠం చదవండి. కింది పట్టికను పూరించండి. వృత్తులు

వృత్తులు వాడే పనిముట్లు
ఉదా : జాలరి పగ్గం
1. …………………… ……………………
2. …………………… ……………………
3. …………………… ……………………
4. …………………… ……………………

జవాబు:

వృత్తులు వాడే పనిముట్లు
ఉదా : జాలరి పగ్గం
1. సాలెలు మగ్గం
2. కుమ్మరి చక్రం
3. కమ్మరి కొలిమి
4. కంసాలి సుత్తి

2. కింది కవితను చదివి, నాలుగు ప్రశ్నలు తయారుచేయండి.
పర్వతం ఎవడికీ వంగి సలాం చేయదు
సముద్రం ఎవడికాళ్ళకిందా మొరగదు
నేనింతా పిడికెడు మట్టే కావచ్చు
కానీ కలమెత్తితే నాకు
ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.
జవాబు:
ప్రశ్నలు:
1) ఎవరికీ వంగి సలాం చేయనిది ఏది?
2) ఎవడి కాళ్ళ కిందా మొరగనిది ఏది?
3) చివరికి నేను ఏమవుతాను?
4) కలమెత్తితే నాకు ఏమవుతుంది?

3. పాఠం చదవండి. పాఠంలో కొన్ని ప్రాసపదాలు ఉన్నాయి. వాటి కింద గీత గీయండి. చదవండి.
ఉదా : పొలాలనన్నీ – హలాలదున్నీ – హేమం పిండగ – సౌఖ్యం నిండగ
జవాబు:
పరిశ్రమించే – బలికావించే
కురిపించాలని – వర్ధిల్లాలని
కళ్యాణానికి – సౌభాగ్యానికి
వినుతించే విరుతించే
ఘర్మజలానికి – ధర్మజలానికి
పరిక్లమిస్తూపరిప్లవిస్తూ
సంధానిస్తూ – సంరావిస్తూ
నవీనగీతికి – నవీనరీతికి

4. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.
అ) రైతు తన జీవితాన్ని ఎందుకు ధారపోస్తున్నాడు?
జవాబు:
రైతు నాగలిని నమ్ముకొన్నవాడు. అతడు పొలాలకు తన జీవితాన్ని ధారపోసి భూమిలో బంగారుపంటలు పండించాలనీ, లోకానికి అంతా సౌఖ్యం నిండుగా ఉండాలనీ, పొలాలను నాగళ్ళతో దున్నుతున్నాడు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాడు. తన బలాన్ని అంతా, నేల తల్లికి ధారపోస్తున్నాడు.

ఆ) శ్రీశ్రీ తన నవ్య కవిత్వాన్ని ఎవరికి సమర్పిస్తానన్నాడు?
జవాబు:
శ్రీశ్రీ తన నవ్య కవిత్వాన్ని, కార్మికుల కల్యాణానికీ, శ్రామికుల సౌభాగ్యానికి సమర్పిస్తానన్నాడు. ముల్లోకాలలో, మూడు కాలాల్లో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని, తెలుపుతానన్నాడు. కష్టజీవులూ, కర్మవీరులూ అయిన కార్మికులకు, నిత్యమంగళం నిర్దేశిస్తానన్నాడు. వారికి స్వస్తి వాక్యములు పలుకుతానన్నాడు. స్వర్ణ వాద్యములు మ్రోగిస్తూ, ఆర్త జీవుల వేదనలే పునాదిగా, భావివేదములు లోకానికి వినిపిస్తానన్నాడు.

ఇ) శ్రీశ్రీ దేనికి ఖరీదు కట్టలేమన్నాడు?
జవాబు:
ఆరుగాలం శ్రమించి తమ బలాన్ని భూమికి ధారపోసే కర్షక వీరుల శరీరంపై ప్రవహించే ఘర్మజలానికి, ఖరీదు కట్టలేమన్నాడు. గనుల్లో, అడవుల్లో, కార్యానాల్లో పనిచేస్తూ, ధనవంతులైన యజమానులకు దాస్యం చేస్తూ, యంత్రాలతో పనిచేసే కార్మికుల కళ్ళల్లో కణ కణ మండే విలాపాగ్నులకూ, గల గలా తొణకే విషాదపు కన్నీళ్లకూ ఖరీదు కట్టలేమన్నాడు.

ఈ) కార్మిక వీరుల కన్నులను కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
కార్మిక వీరుల కన్నుల నిండా, కణ కణ మండే విలాపాగ్నులు ఉంటాయనీ, గల గలా ప్రవహించే దుఃఖపు కన్నీళ్ళు ఉంటాయనీ కవి వర్ణించాడు.

ఉ) శ్రీశ్రీ వేటిని పాటలుగా రాస్తానన్నాడు?
జవాబు:
లోకంలో జరిగే అన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యములు, దౌర్జన్యములు, పరిష్కరించే, బహిష్కరించే – దారులు తీస్తాననీ, ఆ విషయాన్ని పాటలుగా రాస్తాననీ శ్రీ శ్రీ అన్నాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) కర్షకుల శ్రమను గురించి రాయండి.
జవాబు:
విరామమంటే తెలియని కష్టజీవి కర్షకుడు. నాగలిని నమ్ముకొని బతికేవాడు. పంటపొలాలకే తన జీవితాన్ని ధారపోసి పంటను పండిస్తాడు. చేలు దున్నడం, నీరు పెట్టడం, గట్టు లంకలు కొట్టడం, తొరేలు వేయడం, నారుమళ్ళు పోయడం, నారు తీయడం, ఊడ్చడం, ఎరువులు వేయడం, పంట పండాక కోత కోయడం, మోపులు కట్టడం, ధాన్యం నూర్చడం, ఎగుర పోయడం, బస్తాలకు కట్టడం, బళ్ళపై ఇళ్ళకు చేర్చడం, వాటిని అమ్మడం – ఇలా కర్షకులు నిత్యం ఎంతో శ్రమపడతారు.

ఆ) కార్మికులంటే ఎవరు? వారి జీవన విధానం ఎలా ఉంటుందో ఆలోచించి రాయండి.
జవాబు:
కార్మికులు అంటే చేతివృత్తుల వారు. అలాగే పరిశ్రమలలో యంత్రాల వద్ద పనిచేసే సహాయకులు. ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే వారు రోజుకు 8 గంటలు పనిచేయాలి. భోజనానికి మాత్రం విరామం ఇస్తారు. వీరు పరిశ్రమల్లో రసాయనిక పదార్థాల గాలులను పీలుస్తూ, పరిశ్రమల ముడిపదార్థాలను యంత్రాల వద్దకు చేరుస్తూ, వాటిని ఎత్తుతూ కష్టపడాలి. సామాన్యంగా వీరికి ఆ వాతావరణం పడక అనారోగ్యం వస్తూ ఉంటుంది.

ఇళ్ళ వద్ద పనిచేసే కమ్మరి, కుమ్మరి, మేదరి వంటి వారు తమకు పని ఉన్నంత సేపూ పని చేస్తారు. తాపీ, వడ్రంగి, ఇనుప పనివారలు రోజుకు ఏడు, ఎనిమిది గంటలు ఎండల్లో నిలబడి పనిచేయాలి.

ఇ) ప్రపంచమంతా భాగ్యంతో ఎప్పుడు వర్ధిల్లుతుంది?
జవాబు:
కర్షకులు, కార్మికులు సుఖసంతోషాలతో ఉంటే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది. సకాలంలో వర్షాలు కురిసి, వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.

పరిశ్రమలలో కార్మికులు సమ్మెలు, బండ్లు లేకుండా యజమానులతో సామరస్యంగా ఉండి మంచి ఉత్పత్తిని సాధిస్తే, ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.

ప్రభుత్వమూ, పారిశ్రామికవేత్తలూ, కర్షకుల, కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి. వ్యవసాయ కూలీలకు 365 రోజులూ పని చూపించాలి. కార్మికులకూ, కర్షకులకూ పెన్షనులు ఏర్పాటు చేయాలి. కార్మిక, కర్షకుల పిల్లలకు విద్యా, వైద్య సదుపాయాలు, స్కాలర్ షిప్పులూ ఇవ్వాలి. అప్పుడే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.

ఈ) అభాగ్యులను, అనాథలను చూస్తే మీకేమనిపిస్తుందో రాయండి.
జవాబు:
అభాగ్యులను, అనాథలను చూస్తే, నాకు బాధ కలుగుతుంది. నా మిత్రులతో, నా తల్లిదండ్రులతో చెప్పి, వారికి సాయం చేద్దామనిపిస్తుంది. అభాగ్యులకు, అనాథలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తే బాగుండుననిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయంలో చొరవ చూపితే మేలనిపిస్తుంది. ధనవంతులు అభాగ్యులు, అనాథల కన్నీళ్ళు తుడవాలనీ, వారికి అండగా నిలిచి ఆదుకోవాలని అనిపిస్తుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటలలో రాయండి.
జవాబు:
‘రైతు విరామ మెరుగని కష్టజీవి. ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని కోరేవాడు అతను. నాగలిని చేతపట్టి పొలాలను దున్ని బంగారాన్ని పండిస్తాడు. తన శరీరంలోని ప్రతి చెమట బొట్టును దేశానికే ధారపోయాలనుకుంటాడు. లోకానికి సుఖం కలిగేందుకు విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న రైతుల చెమటకు విలువ కట్టలేము.

కార్మికుడు ప్రపంచమంతా సంపదలతో తులతూగాలని కోరుకుంటాడు. తమ నరాల చేతుల సత్తువతో, వరహాల వర్షం కురిపించాలని, ప్రపంచ సౌభాగ్యం కోసం, గనుల్లో, అడవుల్లో, కార్యానాల్లో కష్టపడుతూ, ధనవంతులకు దాస్యం చేసే కార్మికుల కళ్ళల్లో మండే దుఃఖాగ్నికి, కారే కన్నీళ్ళకూ ఖరీదు కట్టలేము.

కాబట్టి లోకంలో అన్యాయాలు, ఆకలి, బాధ, దరిద్రం, దౌర్జన్యం పోయే విధంగా పాటలు రాస్తాను. నా కొత్త కవిత్వం కార్మికుల, శ్రామికుల సౌభాగ్యానికి సమర్పిస్తాను. ముల్లోకాల్లో శ్రమైక జీవన సౌందర్యానికి సాటిలేదని చెపుతూ కార్మికులకు స్వస్తి వాక్యాలు పలుకుతాను. బంగారు వాద్యాలు మ్రోగిస్తాను. ఆర్తుల జీవితం పునాదిగా, భావి వేదాలు లోకానికి చవిచూపిస్తాను.

వేలకొలదీ వృత్తుల చిహ్నాలే, నేను పలికే కొత్త పాటకూ, కొత్త రీతికీ, భావం, భాగ్యం, ప్రాణం, ఓంకారం” అంటున్నాడు శ్రీశ్రీ.

ఆ) మీ పరిసరాల్లో ఉన్న కష్టజీవుల జీవన విధానాన్ని రాయండి.
(లేదా)
మీ పరిసరాల్లో ఉన్న ఎవరైనా ఇద్దరి కష్టజీవుల జీవన విధానాన్ని రాయండి.
జవాబు:
మా పరిసరాలలో చాలా మంది కష్టజీవులు ఉన్నారు. వారు ఉదయం వేకువజామునే లేచి తమతమ వృత్తులలోనికి వెళతారు. వారు ప్రతిరోజూ ఎటువంటి. అవరోధాలు వచ్చినా తమ బ్రతుకును వెళ్ళదీస్తుంటారు. వారిలో కొందరు ఆటోరిక్షాలు నడుపుతూ జీవిస్తారు. కొందరు అద్దె టాక్సీలు నడుపుతారు. కొందరు దుకాణాల్లో పనిచేస్తారు. వారి ఆడవాళ్ళు పాచిపని, అంట్లు తోమడం వగైరా పనులు చేసి జీవిస్తారు.

అందులో మగవారు పగలంతా కష్టపడి పని చేయడంవల్ల, ఆ శ్రమ పోతుందనే భ్రాంతితో తాగుడుకు అలవాటు, పడ్డారు. తాగి చిందులు తొక్కుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు తిండి తిప్పలు లేక, పస్తులు పడుకుంటారు. ఇందులో కొందరు పొరుగూరు వెళ్ళి వ్యవసాయం పనులు చేస్తారు. ఆ పనులు అన్ని రోజులూ ఉండవు. కాబట్టి పనులు దొరకని రోజుల్లో వీరికి జీవితం నడవడం కష్టమవుతోంది.

వీరి పిల్లలు చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారు. కొద్దిమంది కాన్వెంట్ లో చదువుతారు. అక్కడ ఫీజులు కట్టలేక బాధపడుతూ ఉంటారు. వీరు అప్పులు తెచ్చుకొంటూ ఉంటారు. అప్పులు ఇచ్చినవాళ్ళు బాకీ తీర్చలేని వార్ని తిడుతూ ఉంటారు. దాంతో తగవులు వస్తూ ఉంటాయి.

3. విత్తు నాటింది మొదలు పంట చేతికందే వరకు రైతు పడే కష్టాలు అనేకం. అటువంటి రైతుపడే కష్టాన్ని గురించి సొంత మాటల్లో రాయండి.
జవాబు:
విత్తు నాటింది మొదలు పంట చేతికందే వరకు రైతు పడే కష్టాలు ఇన్నీ అన్నీ అని చెప్పలేము. రైతు కష్టజీవి. విరామమంటే తెలియని శ్రామికుడు కర్షకుడు. నాగలిని నమ్ముకొని బతికేవాడు. పంట పొలాలకే తన జీవితాన్ని ధారపోసి పంటను పండిస్తాడు. చేను దున్ని, నీరు పెట్టి, నారుమళ్ళు పోసి, నారు తీసి, నాటు వేసి, ఎరువులు చల్లి, కోత కోసి, మోపులు కట్టి, కుప్పవేసి, పంట నూర్చి, తూర్పార పట్టి, బస్తాల కెత్తి, ధాన్యం బస్తాల కెత్తి ఇంటికి చేర్చి, అమ్మడం మొదలైన పనులు కర్షకుల శ్రమను తెలుపుతాయి.

అందుకే శ్రీ.శ్రీ. “ఆరుగాలం శ్రమించి భూమికి ధారపోసే కర్షక వీరుల శరీరంపై ప్రవహించే ఘర్మ జలానికి ఖరీదు కట్టలేమ”న్నాడు.

రైతు నాగలిని నమ్ముకొన్నాడు. పొలాలకే తన జీవితాన్ని ధారపోసి, భూమిలో బంగారు పంటలు పండించాలనీ కోరుకుంటున్నాడు. లోకమంతా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే పొలాలను నాగళ్ళతో దున్నుతున్నాడు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాడు.

IV పదజాలం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అ) మనం కష్టపడితే గాని ఘర్మజలం విలువ తెలియదు.
జవాబు:
ఘర్మజలం = చెమట
పరుగు పెడితే శరీరం అంతా ఘర్మజలంతో నిండుతుంది.

ఆ) జీవులెన్నో ధరిత్రి మీద జీవిస్తున్నాయి.
జవాబు:
ధరిత్రి = భూమి
ఈ పుణ్యధరిత్రి ఎందరో మహామహులకు కన్నతల్లి.

ఇ) సీత హేమా భరణాలు ధరించింది.
జవాబు:
హేమం = బంగారు
ఇటీవల కాలంలో హేమం ధర చుక్కలనంటుతోంది.

ఈ) జలం తాగితేనే దాహం తీరుతుంది.
జవాబు:
జలం = నీరు
కృష్ణానదిలోని జలం మురికి అయిపోతున్నది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

2. కింది వాక్యాలు పరిశీలించండి.
అ) ఉగాది తెలుగువారి నూతన వర్మం.
ఆ) వర్షం పడుతుందని గొడుగు తీసుకువచ్చాను.

పై వాక్యాల్లో వర్షం అనే పదానికి సంవత్సరం, వాన అనే రెండు అర్థాలు ఉన్నట్లు తెలుస్తోంది కదా ! ఇలా ఒక మాటకు అనేక అర్థాలు వస్తే వాటిని నానార్థాలు అంటారు.

కింది పదాలకు నానార్థాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.

ఇ) భూతం :
జవాబు:
భూతం (నానార్థాలు) : పిశాచము, జరిగిపోయిన కాలం, ప్రాణి

వాక్యప్రయోగములు :

  • నిన్ను బహుశః భూతం పట్టుకొంది. (పిశాచము)
  • ఈ విషయము నేటిది కాదు భూతమునకు సంబంధించినది. (జరిగిపోయిన కాలం)
  • పంచ భూతములలో వాయువు ముఖ్యమైనది.

ఈ) కరం :
జవాబు:
కరం : చెయ్యి, తొండము, మిక్కిలి, కిరణము

వాక్యప్రయోగములు :

  • నీ కరములు మురికిగా ఉన్నాయి. (చేతులు) .
  • ఏనుగు కరము సహాయంతో నీరు త్రాగుతుంది. (తొండము)
  • సూర్య కరములు నేడు తీక్షణముగా ఉన్నాయి. (కిరణములు)
  • వానికి తల్లిదండ్రులపై కరము ప్రియము. (మిక్కిలి)

3. కింది వాక్యాలను చదవండి.

బంగారం ధర బాగా పెరిగింది. అయినా ఆ పుత్తడి అంటే అందరికీ మక్కువే. కానీ మనసు బంగారమైతే ఈ స్వర్ణ మెందుకు?

పై వాక్యాల్లో బంగారం, పుత్తడి, స్వర్ణం అనే పదాలకు ఒకటే అర్థం అని గ్రహించారు కదా ! ఇలా ఒకే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయపదాలు అంటారు. కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.
అ) హలం ఆ) జగం ఇ) జలం – ఈ) ధ్వని ఉ) అగ్ని
జవాబు:
అ) హలం : నాగలి, లాంగలము, సీరము

వాక్యప్రయోగములు :

  • కర్షకుడు ఎప్పుడూ హలంను నమ్ముకుంటాడు.
  • నాగలితో పొలమును దున్ని పంటలను పండిస్తాడు.
  • రైతుకు అతిముఖ్యమైన పనిముట్టు సీరము.
  • ఇప్పుడు రైతులు లాంగలముతో దున్నడం మాని, ట్రాక్టర్లతో పొలాలను దున్నుతున్నారు.

ఆ) జగం : లోకము, జగత్తు, భువనము
వాక్యప్రయోగములు :

  • జగం అంతా మోసాల మయం.
  • లోకములో దైవభక్తులు ఎందరో ఉన్నారు.
  • జగత్తులో జిత్తులమారులు ఎక్కువయ్యారు.
  • ఈ విశ్వములో చతుర్దశ భువనములూ ఉన్నాయి.

ఇ) జలం : నీరు, ఉదకము, తోయము
వాక్యప్రయోగములు :

  • వేసవి రాగానే జలానికి కొరత ఏర్పడింది.
  • ఎక్కువగా నీరు తాగితే ఆరోగ్యం బాగుంటుంది.
  • గంగ ఉదకము మహాపవిత్రమైనది.
  • నీవు పాలల్లో తోయము ఎక్కువగా కలుపుతున్నావు.

ఈ) ధ్వని : శబ్దము, చప్పుడు, నాదము, నినాదము

వాక్యప్రయోగములు :

  • తరగతిలో పిల్లల ధ్వని వినబడడం లేదు.
  • నీ మోటారు సైకిలు ఎక్కువ శబ్దము చేస్తోంది.
  • నీవు చప్పుడు చేయకుండా కూర్చో.
  • గాన విద్వాంసుని నాదము మారుమ్రోగుతోంది.
  • కార్మికులు వ్యతిరేక నినాదములు ఇస్తున్నారు.

ఉ) అగ్ని : పావకుడు, వహ్ని, అనలము, దహనుడు

వాక్యప్రయోగములు :

  • పంచభూతాలలో అగ్ని ఒకటి.
  • ఇళ్ళన్నీ పావకుని విజృంభణంతో దగ్ధమయ్యాయి.
  • వహ్ని శిఖలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
  • అనిలుని ప్రేరేపణతో అనలము పెచ్చుమీరుతోంది.
  • పొయ్యిలో దహనుడు మండకపోతే, వంట పూర్తి కాదు.

4. గీత గీసిన పదాలకు వికృతులు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.
అ) శారీరకమైన పనులు చేయడానికి శక్తి అవసరం.
ఆ) కష్టపడితే జీవితంలో మంచి ఫలితాలు పొందవచ్చు.
ఇ) ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది.
ఈ) ప్రాణమున్నంత వరకూ నిజాయితీగా బతకాలి.
జవాబు:
అ) ఆహారం మనకు సత్తి నిస్తుంది. శక్తి (ప్ర) – సత్తి (వి)
ఆ) ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో పేదల జీతాలు అతలాకుతలమవుతున్నాయి. జీవితం (ప్ర) – జీతం (వి)
ఇ) రాములవారి పాలనలో దమ్మం నాలుగుపాదాల నడిచింది. ధర్మం (ప్ర) – దమ్మం (వి)
ఈ) నేను పానం పోయినా అసత్యమాడను. ప్రాణము (ప్ర) – పానం (వి)

V. సృజనాత్మకత

* రైతు / కార్మికుడు ఏ విధంగా కష్టపడుతున్నారో తెలుసుకొని అతని జీవనశైలిని ఆత్మకథగా రాయండి.
జవాబు:
నేను చిన్నరైతుని. నా పేరు రామయ్య. నాకు రెండు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. నాకు పెళ్ళాం, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాకు పొలం మీద వచ్చే ఆదాయం ఏ మూలకూ చాలదు. నా పిల్లలను చదివించలేకపోతున్నా. మా ఆవిడికి సరైన బట్టలు కొనలేకపోతున్నా. కడుపునిండా సరిపడ తిండి లేదు.

పక్క రైతు దగ్గర 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయాయి. అప్పులు దొరకటల్లేదు. తెచ్చిన అప్పులు తీర్చలేకపోతున్నా. ఇల్లంతా వర్షం. నేయించుకోవడానికి డబ్బులు లేవు. పండిన ధాన్యం, కౌలు రైతుకు ఇచ్చాను. బాకీలు మిగిలాయి. నా పిల్లకూ, పిల్లవాడికీ పెళ్ళిళ్ళు చేయాలి. కట్నాలు ఇవ్వలేను. నా పిల్లవాడికి రైతుబిడ్డ అని, ఎవరూ పిల్లను ఇవ్వడంలేదు. కట్నం ఇవ్వలేనని మా పిల్లను ఎవరూ పెళ్ళి చేసుకోవడం లేదు.

రైతు గొప్పవాడని అందరూ అంటారు. చూస్తే నా బ్రతుకు ఇలా ఉంది. ఇవన్నీ చూశాక, నాతోటి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో అర్థం అవుతోంది. ప్రభుత్వమే మా రైతులను ఆదుకోవాలి.

(లేదా)

* తన కవితలో శ్రీశ్రీ కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి అనే వాటిని ఆయా వృత్తులకు చిహ్నాలుగా పేర్కొన్నారు. వీటిలో మీకు నచ్చిన వస్తువును ఎన్నుకొని చిత్రం గీయండి. దాన్ని గురించి రాయండి.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ 2
ప్రక్క చిత్రంలో కుమ్మరి తన దగ్గర ఉన్న చక్రం(ఆవం)తో అందమైన కుండలను తయారుచేస్తున్నాడు. మొదట బంకమట్టి లేక ఎర్రమట్టిని తెచ్చి వాటిని బాగా కలిపి ముద్దగా చేస్తాడు. ఆ ముద్దను చక్రంపై పెట్టి తిప్పుతాడు. అప్పుడు ఆ మట్టిముద్ద అతని హస్తకళా నైపుణ్యంతో చక్కటి ఆకృతులను సంతరించుకుంటుంది. కుమ్మరి ఈ విధంగా కుండలు, ప్రమిదలు, పాలికలు, పూలకుండీలు మొదలగునవి తయారుచేస్తాడు. కానీ ప్రస్తుత కాలంలో ప్రజలు ఆధునిక పరికరాలు వాడకం వైపు మొగ్గు చూపుతుండటంతో కుమ్మరి జీవితం ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.

VI. ప్రశంస

* శ్రీశ్రీ కవితా శైలి ఎలాంటిది ? ఆయన చేసిన పద ప్రయోగం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
“ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం”

అని కొత్తగా గళమెత్తి సంచలనం రేకెత్తించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అనే రెండక్షరాలు తెలుగు కవిత్వంలో విప్లవం సృష్టించాయి. కలం పేరు శ్రీశ్రీ కాగా, అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. “కష్టజీవి”కి ఇరువైపులా నిల్చేవాడే కవి అని కొత్త నిర్వచనం ఇచ్చిన కవి శ్రీశ్రీ. ఆకాశమార్గాన పయనించే తెలుగు కవితారథాన్ని భూమార్గం పట్టించి, భూకంపం పుట్టించి “అనితరసాధ్యం నా మార్గం” అని చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. భావకవిత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తర్వాత విప్లవ కవిత్వోద్యమానికి స్ఫూర్తినిచ్చాడు.

కవితా శిల్పరచనలో ప్రవీణుడు శ్రీశ్రీ. ఈయన సారవంతమైన మహాభావ తరంగాల సంగమ స్థానము. శ్రీశ్రీ అక్షరాక్షర శిల్పి. ఈయన గేయరచనలో ఒక నవ్యత, పరాకాష్ట పొందిన లయ ఉన్నాయి. శ్రీశ్రీ యొక్క శబ్దాలంకారాలు, పదప్రయోగం విశిష్టమైనవి.

శ్రీశ్రీ కవితలో అంత్యానుప్రాసలు, అలవోకగా, అర్థవంతంగా సాగుతాయి. “హేమం పిండగ – సౌఖ్యం నిండగ”, “గనిలో, వనిలో, కార్యానాలో”, “పరిక్లమిస్తూ – పరిప్లవిస్తూ”, “విలాపాగ్నులకు – విషాదాశ్రులకు”, “బాటలు తీస్తూ – పాటలు వ్రాస్తూ”, “సంధానిస్తూ – సంరావిస్తూ”, “జాలరి పగ్గం – సాలెల మగ్గం”, “నా వినుతించే – నా విరుతించే, నా వినిపించే – నా విరచించే వంటి అనుప్రాసలు, పదప్రయోగం అర్థవంతంగా ఈ కవితలో ఉన్నాయి. అవి అద్భుతమైన లయతో, శ్రుతి మనోహరంగా ఉన్నాయి.

కార్మికుల శ్రమైక జీవన సౌందర్యానికి, వారి ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడని శ్రీశ్రీ యథార్థాన్ని చెప్పాడు. శ్రీశ్రీ ఆవేశంగా చెప్పేటప్పుడు సంస్కృత సమాసబంధుర శబ్దాలు ప్రయోగిస్తాడు. స్వస్తి వాక్యములు సంధానిస్తూ, స్వర్ణ వాద్యములు సంరావిస్తూ, వ్యధార జీవిత యథార్ధ దృశ్యం, శ్రామిక లోకపు సౌభాగ్యానికి” వంటి సంస్కృత సమాసాలు అందుకు ఉదాహరణం.

శ్రీశ్రీ పదాలతో బంతులాటలాడతాడు. “దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ”, “త్రిలోకాలలో, త్రికాలాలలో,” “భావివేదముల, జీవనాదములు” వంటివి ఇందుకు ఉదాహరణలు.

శ్రీశ్రీ అన్యాయాలు, ఆకలి, వేదన, దరిద్రము పోయే మార్గంలో నవ్యకవిత్వం రాస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కార్మికుల వృత్తుల చిహ్నాలను తన కవితకు భావంగా, ప్రాణంగా, ప్రణవంగా స్వీకరించాడు.

సమాజాన్ని చైతన్యపరిచి, అభ్యుదయ కవిత్వానికి యుగకర్తగా వుండి, కొత్త తరానికి బాటలు వేసి, తనవాణిని జాతి జనులు పఠించే మంత్రంగా విరచించి, ప్రపంచ పీడిత జనానికి బాటసగా నిల్చి, వేమన, గురజాడల బాటలో నడిచి, తెలుగు కవిత్వంలో నిలువెత్తు సంతకంగా నిలిచిన శ్రీశ్రీ ప్రజాకవి. సమాజకవి.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

(లేదా)

* మన గ్రామాల్లో, పట్టణాల్లో రకరకాల వృత్తుల వాళ్ళుంటారు. వాళ్ళంతా రెక్కల కష్టం మీద ఆధారపడ్డవాళ్ళే. వాళ్ళ దగ్గరకు వెళ్ళండి. తాము చేస్తున్న పనిలో వాళ్ళు పొందే ఆనందాన్ని గమనించండి. వాళ్ళను ప్రశంసించండి. వాళ్ళను ఏ విధంగా అభినందించారో రాయండి.
జవాబు:
వృత్తి పని చేసే పెద్దలారా ! మీరు నిజంగా మన సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. మీకు ఈ వృత్తుల వల్ల వచ్చే సంపాదన మీ భార్యాబిడ్డలను పోషించడానికి సరిపోదు. అయినా మీరు మీ కులవృత్తులను కొనసాగిస్తున్నారు. గ్రామ, నగర సంస్కృతిని మీరు రక్షిస్తున్నారు.

మీ వడ్రంగులు వారి పని చేయకపోతే, ఇళ్ళకు తలుపులు, కిటికిలూ లేవు. మీ తాపీవారు ఇళ్ళు కట్టకపోతే, మాకు ఇళ్ళే లేవు. మీ రైతులు పంటలు పండించకపోతే మాకు తిండి లేదు.

మీ కమ్మర్లు కత్తులు, కొడవళ్ళు చేయకపోతే మాకు ఆ సాధనాలే ఉండేవి కావు. మీ కుమ్మర్లు ప్రమిదలు, కుండలు, పాలికలు తయారుచేయకపోతే దీపావళికి దీపాలు లేవు. పెళ్ళిళ్ళలో అయిరేణికుండలు లేవు. అంకురార్పణలకు పాలికలు లేవు.

మీరు కడుపులు మాడ్చుకుని, అర్ధాకలితో మీ తోటివారికి సాయం చేస్తున్నారు. మీకు నా అభినందనలు. మీరు మన దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు. పెద్దలారా ! సెలవు.

ప్రాజెక్టు పని

* శ్రీశ్రీ రాసిన కవితలను / గీతాలను సేకరించండి.
వాటిలో ఏదైనా ఒకదాన్ని రాసి రాగ భావయుక్తంగా పాడి వినిపించండి
జవాబు:
శ్రీశ్రీ గేయము :
మహాప్రస్థానం

1. మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి

2. కదం తొక్కుతూ
పదం పాడుతూ
హృదంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం

3. దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు
బాటలు నడచీ
పేటలు కడచీ
కోటలన్నిటిని దాటండి
నదీనదాలూ
అడవులు, కొండలు,
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి

4. ఎముకలు క్రుళ్ళిన
వయస్సు మళ్ళిన
సోమరులారా ! చావండి
నెత్తురు మండే
శక్తులు నిండే
సైనికులారా ! రారండి
హరోం హరోం హర
హరహర హరహర
హరహర హరహర
హరోం హరా అని కదలండి
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది.

VII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది పదాలను విడదీసి, సంధుల పేర్లను రాయండి.

అ) విరామమెరుగక = విరామము + ఎరుగక – ఉత్వసంధి
ఆ) జగానికంతా = జగానికి + అంతా – ఇకారసంధి
ఇ) విలాపాగ్నులు = విలాప + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
ఈ) అనేకులింకా = అనేకులు + ఇంకా = ఉత్వసంధి
ఉ) విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు = సవర్ణదీర్ఘ సంధి

2) కింది విగ్రహవాక్యాలను సమాసపదాలుగా కూర్చండి. సమాసాల పేర్లను రాయండి.

అ) ముగ్గురైన దేవతలు = ముగ్గురు దేవతలు – ద్విగు సమాసం
ఆ) రెండైన గంటలు = రెండు గంటలు – ద్విగు సమాసం

3) కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి. ఏ సమాసమో రాసి కారణాలు చర్చించండి.

అ) నాలుగు వేదాలు = నాలుగైన వేదాలు – ద్విగు సమాసం
ఆ) రెండు చేతులు = రెండైన చేతులు – ద్విగు సమాసం
ఇ) త్రికరణాలు = మూడైన కరణాలు – ద్విగు సమాసం
ఈ) కోటిరత్నాలు = కోటి సంఖ్య గల రత్నాలు – ద్విగు సమాసం
ఉ) ముప్ఫైరోజులు = ముప్ఫై అయిన రోజులు – ద్విగు సమాసం
ఊ) మూడు జిల్లాలు = మూడైన జిల్లాలు – ద్విగు సమాసం
ఋ) నూరుపద్యాలు = నూరైన పద్యాలు – ద్విగు సమాసం

పైన తెలిపిన విగ్రహవాక్యాలకు అన్నింటికి సంఖ్యావాచక విశేషణాలు పూర్వపదంలో ఉన్నాయి. కాబట్టి వీటిని ద్విగు సమాసాలు అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

4) ఈ కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) రుకియా బజారుకు వెళ్ళింది. రుకియా కూరగాయలు కొన్నది.
జవాబు:
రుకియా బజారుకి వెళ్ళి, కూరగాయలు కొన్నది.

ఆ) కృష్ణ బొబ్బిలి వెళ్ళాడు. కృష్ణ ఇల్లు కట్టాడు.
జవాబు:
కృష్ణ బొబ్బిలి వెళ్ళి, ఇల్లు కట్టాడు.

ఇ) తాతగారు ఇంటికి వచ్చారు. తాతగారు కాఫీ తాగారు.
జవాబు:
తాతగారు ఇంటికి వచ్చి, కాఫీ తాగారు.

ఈ) మాధురి తోటకి వెళ్ళింది. మాధురి పువ్వులు కోసింది.
జవాబు:
మాధురి తోటకి వెళ్ళి, పువ్వులు కోసింది.

ఉ) చిన్నా సినిమాకి వెళ్ళాడు. చిన్నా ఐస్ క్రీమ్ తిన్నాడు.
జవాబు:
చిన్నా సినిమాకి వెళ్ళి, ఐస్ క్రీమ్ తిన్నాడు.

5) కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా ? ఆజాద్ డేవిడ్ కంటే చిన్నవాడా?
జవాబు:
ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా? చిన్నవాడా?

ఆ) జయ ఇంటికి వెళ్ళింది. విజయ బడికి వెళ్ళింది.
జవాబు:
జయ ఇంటికి, విజయ బడికి వెళ్ళారు.

ఇ) స్వప్న అన్నం తిన్నది. పద్మ పండ్లు తిన్నది.
జవాబు:
స్వప్న అన్నం, పద్మ పండ్లు తిన్నారు.

ఈ) రమ అందమైనది. రమ తెలివైనది.
జవాబు:
రమ అందమైనదీ, తెలివైనది.

ఉ) పావని సంగీతం నేర్చుకుంది. పావని నృత్యం నేర్చుకుంది.
జవాబు:
పావని సంగీతమూ, నృత్యమూ నేర్చుకుంది.

ఊ) రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
జవాబు:
రైలు వచ్చింది కాని చుట్టాలు రాలేదు.

6) కింది పేరా చదవండి. సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాలను గుర్తించండి. రాయండి.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పశ్చిమబెంగాల్ లో జన్మించాడు. ఈయన సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నేర్చుకున్నారు. చదువు పూర్తయింది. ఈశ్వరచంద్రుడు ఉద్యోగంలో చేరాడు. ఈయన ప్రధానోపాధ్యాయునిగా, ప్రత్యేక తనిఖీ అధికారిగా పనిచేశాడు. ఈ ఉద్యోగం అతనికి రుచించలేదు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి, అనేక బాలికా పాఠశాలలు స్థాపించాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. అంతేగాక తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించి, సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడయ్యాడు.
సామాన్య వాక్యాలు :

  • ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పశ్చిమ బెంగాల్ లో జన్మించాడు.
  • విద్య పూర్తయింది.
  • ఈశ్వరచంద్రుడు ఉద్యోగంలో చేరాడు.
  • ఈ ఉద్యోగం అతనికి రుచించలేదు.
  • ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
  • వితంతు వివాహాలు ప్రోత్సహించాడు.

సంక్లిష్ట వాక్యాలు :

  • స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి, అనేక బాలికా పాఠశాలలను స్థాపించాడు.
  • అంతేగాక తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించి, సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడైనాడు.

సంయుక్త వాక్యాలు :

  • ఈయన సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నేర్చుకున్నాడు.
  • ఈయన ప్రధానోపాధ్యాయునిగా, ప్రత్యేక తనిఖీ అధికారిగా పనిచేశాడు.

7) గసడదవాదేశ సంధి :
అ) కింది పదాలను ఏ విధంగా విడదీశారో గమనించండి.
గొప్పవాడుగదా = గొప్పవాడు + కదా (డు + క)
కొలువుసేసి = కొలువు + చేసి (వు + చే)
వాడుడక్కరి = వాడు + టక్కరి (డు + ట)
నిజముదెలిసి = నిజము + తెలిసి (ము + తె)
పొలువోయక = పాలు + పోయక (లు + పో)

పై ఉదాహరణలు గమనించారు కదా ! పూర్వపదం చివర ప్రథమావిభక్తి ప్రత్యయాలున్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప లున్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీది ప్రత్యయాలకు క, చ, ట, త, పలు పరమైతే వాటిస్థానంలో గ, స, డ, ద, వలు ఆదేశంగా వస్తాయి. అంటే –
క → ‘గ’ గా మారుతుంది
చ → ‘స’ గా మారుతుంది
ట → ‘డ’ గా మారుతుంది
త → ‘ద’ గా మారుతుంది
ప → ‘వ’ గా మారుతుంది.
(క చ ట త ప లకు గ స డ ద వలు ఆదేశంగా వస్తాయి.)
పాలు

కింది పదాలను విడదీసి రాయండి. వివరించండి.

అ) నిక్కముదప్పదు
నిక్కము + తప్పదు = నిక్కము దప్పదు (ము + త)

పూర్వ పదం చివర ‘ము’ అనే ప్రథమావిభక్తి ప్రత్యయము ఉన్నది. పరపదము మొదట ‘త’ అనేది పరమైనపుడు ‘ద’ అనే పదం వచ్చింది. త, దగా మారింది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ఆ) ప్రాణములుగల్లి – ప్రాణములు + కల్గి
ఇ) పొడగానరాక – పొడ + కానరాక
ఈ) నోరసూపు – నోరు + చూపు
ఉ) నీరుద్రావి – నీరు + త్రావి
ఊ) పాలుదాగి + తాగి

ద్వంద్వ సమాస పదాల విషయంలో కూడా గసడదవాదేశసంధి కనిపిస్తుంది.

ఆ) కింది పదాలను గమనించండి.

కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి → చేతు + లు
టక్కుడెక్కులు టక్కు + టెక్కు + లు
తల్లిదండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు = ఊరు + పల్లె + లు

పై పదాలు ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు.

ద్వంద్వ సమాసంలో కూర + కాయ అన్నప్పుడు ‘క’ స్థానంలో ‘గ’ వచ్చింది. ఈ విధంగా కచటతపలకు, గసడదవలు రావడాన్నే గసడదవాదేశం అంటారు. సూత్రం : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి. కింది పదాలను కలపండి.

అ) అక్క + చెల్లెలు = అక్కాచెల్లెలు
ఆ) అన్న + తమ్ముడు = అన్నాదమ్ములు

8. తత్పురుష సమాసం :
అ) కింది పదాలు చదవండి. వాటికి విగ్రహవాక్యాలు చూడండి.
అ) రాజభటుడు
ఆ) తిండిగింజలు
ఇ) పాపభీతి

‘రాజభటుడు’ లో ‘రాజు’ పూర్వపదం, “భటుడు” ఉత్తరపదం. అట్లే తిండిగింజలు – తిండి కొఱకు గింజలు – ‘తిండి’ పూర్వపదం ‘గింజలు’ ఉత్తరపదం. పాపభీతి – పాపం వల్ల భీతి – ‘పాపం’ పూర్వపదం, ‘భీతి’ ఉత్తర పదం.

రాజభటుడుకు విగ్రహవాక్యం రాస్తే ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో ‘యొక్క’ అనేది షష్ఠీవిభక్తి ప్రత్యయం. భటుడు రాజుకు చెందినవాడని చెప్పడానికి షష్ఠీవిభక్తి ప్రత్యయాన్ని వాడాం. ఇలా విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు :

తత్పురుష సమాసం రకాలు విభక్తులు ఉదాహరణ
ప్రథమా తత్పురుష సమాసం డు,ము,వు, లు మధ్యాహ్నం – అహ్నము మధ్య భాగం
ద్వితీయా తత్పురుష సమాసం ని,ను,ల,కూర్చి, గుఱించి జలధరము – జలమును ధరించినది
తృతీయా తత్పురుష సమాసం చేత,చే, తోడ,తో బుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు
చతుర్టీ తత్పురుష సమాసం కొఱకు, కై వంటకట్టెలు వంట కొఱకు కట్టెలు
పంచమీ తత్పురుష సమాసం వలన, కంటె, పట్టి దొంగభయం – దొంగ వలన భయం
షష్ఠీ తత్పురుష సమాసం కి,కు, యొక్కలో, లోపల రామబాణం – రాముని యొక్క బాణం
సప్తమీ తత్పురుష సమాసం అందు,న దేశభక్తి – దేశమునందు భక్తి
నఞ్ తత్పురుష సమాసం నఞ్ అంటే వ్యతిరేకార్థం అసత్యం – సత్యం కానిది

ఆ) కింది పదాలు చదవండి. విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో రాయండి.
అ) రాజపూజితుడు = రాజు చేత పూజితుడు (తృతీయా తత్పురుషం)
ఆ) ధనాశ = ధనము నందు ఆశ (సప్తమీ తత్పురుషం)
ఇ) పురజనులు = పురము నందలి జనులు (సప్తమీ తత్పురుషం)
ఈ) జటాధారి = జడలను ధరించువాడు (ద్వితీయా తత్పురుషం)
ఉ) భుజబలం = భుజము యొక్క బలం (షష్ఠీ తత్పురుషం)
ఊ) అగ్నిభయం = అగ్ని వలన భయం (పంచమీ తత్పురుషం)
ఋ) అన్యాయం న్యాయం కానిది. (నః తత్పురుషం)

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

బాట : దారి, మార్గం, పథం
స్వామి : ప్రభువు, దొర, యజమాని
కళ్యాణం : పెండ్లి, పరిణయం, ఉద్వాహం
హేమం : బంగారం, సువర్ణం, కాంచనం
జగం : లోకం, ప్రపంచం
ఖరీదు : మూల్యం , వెల
పాట : గీతం, గేయం
కాయం : శరీరం, దేహం, తనువు, మేను
దాస్యం : సేవ, ఊడిగం
ఇల : భూమి, ధరిత్రి, ధరణి

వ్యుత్పత్యర్థాలు

ధర్మము – ధరించబడేది.
అశ్రువులు – దుఃఖంతో కన్నుల నుండి కారే నీరు

నానార్థాలు

బలం – తావు, సామర్థ్యం, శక్యం
కాలం – సమయం, మరణం
భాగ్యం – అదృష్టం, సంపద
వర్షం – వాన, సంవత్సరం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.
విలాపాగ్నులు = విలాప + అగ్నులు – సవర్ణదీర్ఘ సంధి
విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు – సవర్ణదీర్ఘ సంధి
వృధార్తి = వృధ + ఆర్తి – సవర్ణదీర్ఘ సంధి

వృద్ధి సంధి
సూత్రం : ఆకారమునకు ఏ, ఐ లు పరమగునుపుడు ‘ఐ’ కారమును; ఓ, ఔలు పరమగునపుడు ‘ఔ కారమును ఏకాదేశమగును.
శ్రమైక – శ్రమ + ఏక – వృద్ధి సంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి యగును.
సమానమైనది = సమానము + ఐనది – ఉత్వసంధి
జగత్తు అంతా = జగత్తుకు + అంతా – ఉత్వసంధి
చవులిస్తాను = చవులు + ఇస్తాను – ఉత్వసంధి
విరామమెరుగక = విరామము + ఎరుగక – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ఇత్వసంథి
సూత్రం : మధ్యమ పురుష క్రియలయందు ఇత్తునకు సంధియగు.
జగానికంత = జగానికి + అంతా – ఇత్వసంధి
వర్ధిల్లాలని = వర్ధిల్లాలి + అని – ఇత్వసంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
విషాదాశ్రువులు విషాదం అనే అశ్రువులు రూపక సమాసం
విలాపాగ్నులు విలాపం అనెడి అగ్నులు రూపక సమాసం
యంత్రభూతములు యంత్రములు అనెడి భూతములు రూపక సమాసం
ఘర్మజలము ఘర్మము అనెడి జలము రూపక సమాసం
సహస్రవృత్తులు సహస్త్ర సంఖ్య గల వృత్తులు ద్విగు సమాసం
నరాల బిగువు నరాల యొక్క బిగువు షష్ఠీ తత్పురుష సమాసం
కరాల నృత్యం కరాల యొక్క నృత్యం షష్ఠీ తత్పురుష సమాసం
కుమ్మరి చక్రం కుమ్మరి యొక్క చక్రం షష్ఠీ తత్పురుష సమాసం
సాలె మగ్గం సాలెల యొక్క మగ్గం షష్ఠీ తత్పురుష సమాసం
కార్మిక లోకం కార్మికుల యొక్క లోకం షష్ఠీ తత్పురుష సమాసం
వ్యధార్తి వ్యధతో ఆర్తి తృతీయా తత్పురుష సమాసం
నవ్యకవిత్వం నవ్యమైన కవిత్వం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
భావివేదం భావియైన వేదం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సమస్త చిహ్నాలు సమస్తమైన చిహ్నాలు విశేషణ పూర్వనద కర్మధారయ సమాసం
నవీన గీతి నవీనమైన గీతి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నవీనరీతి నవీనమైన రీతి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జీవన సౌందర్యం జీవనమందలి సౌందర్యం సప్తమీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

కష్టం – కస్తి
ప్రాణం – పానం
భాగ్యము – బాగెము
మంత్రం – జంత్రము
ఆకాశం – ఆకసం
అగ్ని – అగ్గి
రత్నము – రతనము
ప్రతిజ్ఞ – ప్రతిన
శ్రీ – సిరి
ధర్మము – దమ్మము

కవి పరిచయం

పూర్తి పేరు : శ్రీరంగం శ్రీనివాసరావు

జననం : 1910 వ సం||

జన్మస్థలం : విశాఖపట్టణం

తొలి రచన : పద్దెనిమిదేళ్ళ నాటికే “ప్రభవ” అనే భావకవితా సంపుటి.

మహాకవిగా : ఈయన రచించిన అభ్యుదయ కవితా సంపుటి ‘మహాప్రస్థానం’తో మహాకవి అయ్యారు.

విప్లవకవిగా : ఖడ్గసృష్టి, మరోప్రస్థానం గీతాలు రాశారు.

ఇతర రచనలు : మూడు యాభైలు పేరిట వ్యంగ్య కవితలు, కార్టూను కవితలు, 1+1= 1 లేక డిసెంబరు 31, 1999 పేరిట రేడియో నాటికలు.

రచనా శైలి : ‘చరమరాత్రి’ కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు. సృజనకు, ప్రతిభకు, తాత్త్విక మార్గాన్వేషణకు పేరుగన్నవాడు. నూతన పదప్రయోగాల మార్గదర్శకుడు.

కవితా వస్తువులు : కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలే శ్రీశ్రీ కవితావస్తువులు.

మరణం : 15-6-1983 వ సంవత్సరం

గేయాలు- అర్ధాలు- భావాలు

1వ గేయం

పొలాల నన్నీ,
హలాల దున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం. ధరిత్రికి బలి కావించే,
కర్షకవీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ !
అర్థాలు :
పొలాల నన్నీ = అన్ని పొలాలనూ ; (భూములనూ)
హలాల దున్నీ = నాగళ్ళతో దున్ని
ఇలా, తలంలో = భూమి ప్రదేశంలో (భూమిపై)
హేమం, పిండగ = బంగారాన్ని పిండడానికి (బంగారు పంటలు పండించడానికి)
జగానికంతా = లోకాని కంతా
సౌఖ్యం నిండగ = నిండుగా సౌఖ్యం కలగడానికి
విరామ మెరుగక = విశ్రాంతి లేకుండా
పరిశ్రమించే = ఎక్కువగా శ్రమించి అలసిపోయే
బలం ధరిత్రికి = తన బలాన్ని భూమికి (ధారపోసే)
బలి కావించే = బలి ఇచ్చే
కర్షకవీరుల = రైతు వీరుల
కాయం నిండా = శరీరం నిండా
కాలువకట్టే = కాలువలా ప్రవహించే
ఘర్మజలానికి = చెమటకు
ఘర్మజలానికి = చెమట నీటికి
ఖరీదు లేదోయ్ – విలువ కట్టలేము

భావం :
విరామమే తెలియని కష్టజీవి రైతన్న. ప్రపంచమంతా సుఖంగా ఉండాలని కోరేవాడు అతను. నాగలిని నమ్ముకొని జీవించే కష్టజీవి. పొలాలకు జీవితాన్ని ధారపోసి బంగారాన్ని పండిస్తాడు. ఈ రైతు శరీరమంతటినుంచి అంతటా స్రవించే చెమట ధర్మజలం. ఆ ధర్మజలానికి ఖరీదు కట్టలేము.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

2వ గేయం

నరాల బిగువూ,
కరాల సత్తువ
వరాలవర్షం కురిపించాలని,
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని –
గనిలో, వనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ,
పరిప్లవిస్తూ,
ధనికస్వామికి దాస్యం చేసే,
యంత్రభూతముల కోరలు తోమే,
కార్మికవీరుల కన్నుల నిండా
కణకణ మండే,
గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబు లేడోయ్ !
అర్థాలు :
నరాల బిగువూ = (తన) నరముల బింకాన్నీ (సత్తువను)
కరాల సత్తువ = (తన) చేతుల బలమునూ
వరాలవర్షం కురిపించాలని = వరహాలు వర్షంగా కురిపించాలని (సిరులు కురిపించాలని)
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని = (తాను పండించిన పంటలతో) ప్రపంచంలో ఐశ్వర్యం వృద్ధి చెందాలని
గనిలో = గనులలో
వనిలో = అడవులలో
కార్ఖానాలో = కర్మాగారాలలో
పరిక్లమిస్తూ – ఎక్కువగా శ్రమిస్తూ
పరిప్లవిస్తూ = తేలియాడుతూ (గంతులు వేస్తూ) (పనిలో గాఢంగా నిమగ్నమవుతూ)
ధనికస్వామికి = ధనవంతుడైన యజమానికి
దాస్యం చేసే = బానిసత్వాన్ని చేసే
యంత్రభూతముల = దయ్యాలవంటి పరిశ్రమలలోని యంత్రముల
కోరలు తోమే = పళ్ళు తోమే (యంత్రముల మధ్య పనిచేసే)
కార్మిక వీరుల = వీరులైన కార్మికుల
కన్నుల నిండా = కండ్ల నిండుగా
కణకణ మండే = నిప్పుల్లా కణ కణమని మండే
విలాపాగ్నులకు (విలాప + అగ్నులకు) = దుఃఖముతో కూడిన మాటలనే అగ్నులకు
విషాదాశ్రులకు (విషాద + అశ్రులకు) = దుఃఖపుకన్నీళ్ళకు
ఖరీదు కట్టే = విలువను నిర్ణయింప గల
షరాబు లేడోయ్ = బంగారపు వ్యాపారి లేడు

భావం :
కార్మికుడు ఎప్పుడూ ప్రపంచమంతా సంపదలతో తులతూగాలని కోరుకుంటాడు. దానికోసం తన శక్తినంతా పణంగా పెడుతున్నాడు. గనులలో కాని, అడవులలో కాని, కర్మాగారాలలో కాని అడుగడుగునా యజమానులకు సేవ చేయటానికి అంకితము అవుతున్నాడు. కార్మికుని జీవితం యంత్రాలలో చిక్కుకుపోయింది. కార్మిక వీరుల కష్టసుఖాలలో పాలు పంచుకునేవారు ఎవరూ లేరు. కార్మికుని దుఃఖానికి, అగ్నిగోళాల వంటి కళ్ళనుండి కారుతున్న కన్నీటికి ఖరీదు కట్టలేము.

3వ గేయం

కావున – లోకపుటన్యాయాలూ,
కాల్చే ఆకలి, కూల్చే వేదన,
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ
నాలో కదలే నవ్యకవిత్వం
కార్మికలోకపు కళ్యాణానికి,
శ్రామికలోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని
అర్ధాలు :
కావున = కాబట్టి
లోకపుటన్యాయాలు (లోకము + అన్యాయాలు) = లోకంలో జరిగే అన్యాయాలు
కాల్చే ఆకలి = కడుపును మండించే ఆకలి
గలగల తొణకే – గల గల మని ధ్వని చేస్తూ పొంగే
కూల్చే వేదన = మనిషిని పడగొట్టే మానసిక బాధ
దారిద్య్రాలూ – దరిద్రములూ
దౌర్జన్యాలూ = దుర్మార్గాలూ
పరిష్కరించే = చక్కపెట్టే (పోగొట్టే)
బహిష్కరించే = వెలివేసే (పై చెప్పిన అన్యాయాలను దూరం చేసే)
బాటలు తీస్తూ = దారులు తొక్కుతూ
పాటలు వ్రాస్తూ = గేయాలు రాస్తూ
నాలో కదలే నవ్య కవిత్వం = నాలో నుండి వచ్చే కొత్త కవిత్వం
కార్మికలోకము + కల్యాణానికి = కార్మికుల శుభానికి
శ్రామికలోకము + సౌభాగ్యానికి = శ్రమించే రైతుల, కార్మికుల, పనివారల, మంగళానికి (వైభవానికి)
సమర్పణంగా = భక్తితో అర్పించడానికి
సమర్చనంగా = విశేషమైన పూజగా అందించడానికి
త్రిలోకాలలో = మూల్లోకాలలో (స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలలో)
త్రికాలలో = భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో
శ్రమైక జీవన సౌందర్యానికి = శ్రమించి బ్రతకడంలో గల అందానికి
సమానమైనది = సమానమైనది
లేనేలేదని = లేదని

భావం :
“ఈ లోకంలో జరిగే అన్యాయాలను, ఆకలిని వేదనను, దారిద్ర్యాన్ని, దౌర్జన్యాలను నిరసిస్తున్నాను. వాటిని పరిష్కరించాలని, బహిష్కరించాలని ఈ పాటలను రాస్తున్నాను. నాలో కదిలేది కొత్త కవితావేశం. ఇది కార్మికుల కళ్యాణానికి, శ్రామికుల సౌభాగ్యానికి అంకితం. ఎందుకంటే ముల్లోకాలలో ఈ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదు.” అని శ్రీశ్రీ చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

4వ గేయం

కష్టజీవులకు కర్మ వీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తివాక్యములు సంధానిస్తూ,
స్వర్ణవాద్యములు సంరావిస్తూ –
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్ !
అర్థాలు :
కష్టజీవులకు = కష్టపడి జీవించే రైతులకూ, కార్మికులకూ, చేతివృత్తుల వారికీ
కర్మవీరులకు = కష్టపడి పట్టుదలతో పని చేసేవారికి
నిత్యమంగళం = నిత్యమూ శుభాన్ని
నిర్దేశిస్తూ = చూపిస్తూ
స్వస్తి వాక్యములు = మంగళ వాక్యములు (శుభము కలగాలని ఆశీర్వదించే వాక్యములు)
సంధానిస్తూ = కూరుస్తూ
స్వర్ణవాద్యములు = బంగారు వాయిద్యములు
సంరావిస్తూ = మ్రోగిస్తూ
వ్యధార జీవిత (వ్యధా + ఆర్త, జీవిత) = బాధచే పీడింపబడిన జీవితము యొక్క
యథార్థ దృశ్యం = నిజమైన దృశ్యము
పునాదిగా = మూలంగా
జనించబోయే = పుట్టబోయే
భావివేదముల = రాబోయే కాలంలోని వేదాల
జీవనాదములు = జీవధ్వనులు
జగత్తుకంతా = ప్రపంచానికంతా
చవులిస్తానోయ్ = రుచి చూపిస్తాను

భావం :
బంగారు వాద్యాలతో, స్వస్తి మంత్రాలతో, కష్ట జీవులకూ, కర్మవీరులకూ హారతులిస్తాను. శ్రామికుల బాధలు కళ్ళకు కట్టినట్లుగా రాబోయే తరాలవారికి చెప్తాను. నా మాటలు భావిభారత తరాలకు వేదాలు, జీవనాదాలు అంటాడు శ్రీశ్రీ.

5వ గేయం

కమ్మరి కొలిమి, కుమ్మరిచక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల, సమస్త చిహ్నలు-
నా వినుతించే పునాదిగా ఇక జనించబోయే
నా విరుతించే,
నా వినిపించే నవీనగీతికి,
నా విరచించే నవీనరీతికి,
భావం
భాగ్యం !
ప్రాణం !
ప్రణవం !
అర్థాలు :
కమ్మరి కొలిమి = ఇనుప పనిచేసే కమ్మరివాని కొలిమి (నిప్పు గుంట)
కుమ్మరి చక్రం = కుమ్మరి కుండల తయారీకి వాడే చక్రం
జాలరి పగ్గం = చేపలు పట్టేవాని వలతాడు
సాలెల మగ్గం = బట్టలు నేసేవాని మగ్గం
శరీర కష్టం స్ఫురింపజేసే = శరీర కష్టాన్ని తెలిపే
గొడ్డలి, రంపం = గొడ్డలి, రంపం
కొడవలి, నాగలి = కొడవలి, నాగలి వంటి
సహస్ర వృత్తుల = వేలకొలదీ వృత్తి పనివారల
సమస్త చిహ్నాలు = అన్ని గుర్తులూ
నా వినుతించే = నేను కొనియాడే
నా విరుతించే – నేను ధ్వనించే
నా వినిపించే నవీనగీతికి = నేను వినిపించే కొత్త పాటకు
నా విరచించే : నేను రచించే
నవీన రీతికి = కొత్త పద్ధతికి
భావం = భావము
భాగ్యం = భాగ్యము
ప్రాణం = ప్రాణము
ప్రణవం = ఓంకార నాదము

భావం :
ఈ దేశంలో శరీర కష్టం చేసేవారు చాలామంది ఉన్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి మొదలైన పనిముట్లు వివిధ వృత్తులకు గుర్తులు. ఆ గుర్తులే నా కవితా వస్తువులు. నేను వారి కొరకే గీతాలు రాస్తాను. ఆ శ్రామికులు, కార్మికులు నా కవిత్వంలో నాయకులు. అదే భావం, భాగ్యం, నా కవితకు ప్రాణం, ఓంకారం.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 4 అజంతా చిత్రాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 4th Lesson అజంతా చిత్రాలు

8th Class Telugu 4th Lesson అజంతా చిత్రాలు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు 1

ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
పై చిత్రంలో అంబర్ పేట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు బస్సులో విహారయాత్రకు వెళ్ళడానికి బస్సు ఎక్కుతున్నారు. కొందరు పిల్లలు బస్సు ఎక్కారు. మరి కొందరు ఎక్కుతున్నారు. వారి ఉపాధ్యాయులూ, ఉపాధ్యాయినులూ దగ్గరుండి, పిల్లలను బస్సు ఎక్కిస్తున్నారు.

ప్రశ్న 2.
విహారయాత్ర అంటే ఏమిటి? ఎందుకు వెళతారు?
(లేదా)
యాత్రల వల్ల దేశాన్ని చూడవచ్చు, విజ్ఞానాన్ని సంపాదించవచ్చు – అని రచయిత అన్నారు కదా ! యాత్రల వల్ల ఇంకా ఇతర ప్రయోజనాలేమిటి ?
జవాబు:
వినోదం ప్రధానంగా చేసుకొని, చేసే యాత్రను విహారయాత్ర అంటారు. పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది. విజ్ఞానయాత్రల వలన మానసికోల్లాసంతోపాటు, విజ్ఞానం పెరుగుతుంది. ప్రసిద్ధమైన పరిశ్రమలు, ప్రాజెక్టులు, తీర్థయాత్ర స్థలములు, అందమైన దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ విహారాలు, శిల్పకళా క్షేత్రములు మొదలయిన వాటిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
ఒక అందమైన ప్రదేశాన్నో, దృశ్యాన్నో చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది?
జవాబు:
ఒక అందమైన ప్రదేశాన్నో, దృశ్యాన్ని చూసినపుడు మనసుకు ఆనందం కలుగుతుంది. ఆ దృశ్యము ఎప్పటికీ మరవకూడదని మన వెంట తెచ్చుకున్న కెమేరాలలో బంధిస్తాము. తరువాత అప్పుడప్పుడు వాటిని చూస్తూ ఉంటే మన , తిరిగిన ఆ ప్రదేశాలు అన్నీ గుర్తుకు వచ్చి, మనసుకు మధురానుభూతి కలుగుతుంది.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
మీరు ఏదైనా ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళారా? ఆ ప్రదేశాన్ని గురించి చెప్పండి.
జవాబు:
మేము సంక్రాంతి సెలవులలో మా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మా తరగతిలోని విద్యార్థులమంతా కలసి ‘నాగార్జున సాగర్’ విహారయాత్రకు వెళ్ళాం. నాగార్జున సాగర్ చేరాక స్టీమర్ ద్వారా నాగార్జున కొండకు బయలుదేరాము. స్టీమర్ లో ప్రయాణిస్తున్నంత సేపు చల్లని గాలి, కనుచూపు మేర కృష్ణా నది, దూరంగా కొండలు మాలో సంతోషాన్ని నింపాయి. ఆ నాగార్జున కొండలో పూర్వం ఒక గొప్ప విశ్వవిద్యాలయం ఉన్నట్లుగా ఇప్పటికీ ఆధారాలు కన్పిస్తున్నాయి. అక్కడ ఆచార్య నాగార్జునుడనే ఒక గొప్ప తత్త్వవేత్త, ఆయుర్వేద పండితుడు ఉండేవాడని మా ఉపాధ్యాయులు చెప్పారు. అంతేగాక అక్కడి మ్యూజియంలో ఉన్న బుద్ధుని పాలరాతి శిల్పాలను చూశాం. బౌద్ధమత విశిష్టతను గురించి తెలుసుకున్నాం. తర్వాత మేము నాగార్జున సాగర్ ఆనకట్ట వద్దకు చేరాం. జల విద్యుత్ తయారయ్యే విధానాన్ని స్వయంగా చూసి తెలుసుకున్నాం. తిరుగు ప్రయాణంలో ఎత్తిపోతల జలపాతాన్ని, మాచర్ల చెన్నకేశవాలయాన్ని, వీరభద్రాలయాన్ని చూశాం.
ఈ విహారయాత్ర మాలో ఆనందంతో పాటు విజ్ఞానాన్ని కూడా నింపింది.

ప్రశ్న 2.
పాఠంలోని ఒక అంశాన్ని గ్రహించి అది మీకు ఎందుకు నచ్చిందో చెప్పండి.
జవాబు:
ఈ పాఠంలో ఏడవ పేరా నాకు నచ్చింది. ఆ పేరాలో అజంతా గుహలలోకి ప్రవేశించే దారిని నార్లవారు వర్ణించారు. అక్కడ ప్రకృతి వర్ణన నాకు నచ్చింది. అక్కడ నాలుగువైపులా కొండలే ఉన్నాయట. ఇక కొండ పక్కన నది. ఆ నదిలో నీళ్ళు నీలంగా ఉన్నాయి. పైన ఆకాశము నీలమే. ఆ పక్కనే పచ్చని చెట్లు ఉన్నాయట. ఆ చెట్ల పూలు కమ్మని వాసనలను ఇస్తున్నాయి. నిజంగానే అక్కడికి వెళ్ళి చూస్తున్నట్లు నార్లవారు వర్ణించారు. వారు చెప్పినట్లు అది ఒక కలల లోకం. అది నిజంగానే భూలోకంలోని స్వర్గం. వారు చెప్పినట్లు అది నిజంగా మరో ప్రపంచం – అందుకే నాకు ఆ అంశం నచ్చింది.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
పాఠం చదువుతుంటే మీకు వచ్చిన ఆలోచనలను, అనుభూతిని వివరించండి.
జవాబు:
అజంతా గుహలు పాఠం చదువుతూ ఉంటే, పెద్ద అయ్యాక తప్పకుండా వెళ్ళి ఒకసారి ఆ గుహల అందాన్ని చూసి రావాలనిపించింది. అక్కడ బుద్ధుని చిత్రాలను, నెహ్రూగారిని సైతం ఆకర్షించిన అక్కడి అందమైన స్త్రీల చిత్రాలనూ చూడాలని అనిపించింది. ఆ కొండల వరుస గూర్చి చదువుతూ ఉంటే, నిజంగానే ఏదో కలలో కొండలమీద నేను తిరుగుతున్నట్టు అనిపించింది. అజంతా గుహల సౌందర్యాన్నీ, అక్కడి చిత్రాలనూ, తప్పక వీలయినంత త్వరలో మా కుటుంబ సభ్యులతో కలిసి చూద్దామని ఉంది.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

ప్రశ్న 1.
పాఠం చదవండి. వర్ణనతో కూడి ఉన్న ఐదు వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి. చదివి వినిపించండి.
జవాబు:
1. మీ పైన నీలాకాశం, మిమ్ము అలరిస్తూ అడవి పువ్వులు, మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు. గుహలను చేరే వరకు రెండు, మూడు మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలో అడుగుపెడితే, దానికి అదే ఒక ప్రపంచం.

2. ఇటు కొండ-అటు కొండ, ముందు కొండ వెనుక కొండ-పైన కొండ, పక్కనే నది – నీలాకాశం – నీలాల నీళ్ళు – పచ్చని చెట్లు – కమ్మని తావులు, అది వేరే ప్రపంచం – అదొక స్వాప్నిక జగత్తు. భూలోక స్వర్గము.

3. రాళ్ళ గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ, నది పాడుకొనే పాటలను వింటూ, నది అంచు వెంట కాలినడకన, గుహలకు చేరాలి.

4. గుహలను సమీపిస్తూంటే ఇటు పచ్చని కొండ, అటు పచ్చని కొండ ఈ రెండు కొండల మధ్య వాఘోరా నది.

5. కొలను నుంచి కొలనుకు జాలువారుతూ, 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది.

ప్రశ్న 2.
కింద సూచించిన పదాలతో మొదలయ్యే పేరాలు చదివి, సరిపోయే శీర్షికలను సూచించండి.

పేరా శీర్షిక
ఇటీవలనే …….. అవ్యక్తానుభూతి
వాఘోరానది పుట్టి ………. వ్యూపాయింట్ – మేజర్ గిల్
గుహల గోడలకు ………… శిథిలావస్థలో అజంతా చిత్రాలు
అజంతా గుహల నిర్మాణం ……….. సర్వోత్తమ కృషి
ఇక్కడ అందాలొలుకు ……….. అందాలొలుకు అజంతా స్త్రీలు

ప్రశ్న 3.
కింది పేరా చదివి పట్టికను పూరించండి.
అజంతా గుహలు మొత్తం 29. వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే మిగిలిన బౌద్ధ విహారాలు. మొత్తం 29లో మూడింటిని ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపివేశారు. ఇవి తప్ప మిగిలిన అన్నింటినీ చిత్రాలతో నింపివేశారు. కాని ఈనాడు పదమూడు గుహలలో మాత్రమే ఆ చిత్రాల శిథిలాలు కానవస్తున్నాయి. చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది ఒకటవ, రెండవ, తొమ్మిదవ, పదవ, పదహారవ, పదిహేడవ గుహలలోనే. అజంతా గుహలలోని కొన్ని చిత్రాలకు నకళ్ళు వేయించి హైదరాబాదు పబ్లిక్ గార్డెన్స్ లోని అజంతా పెవిలియన్లో భద్రపరిచారు.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు 2

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అ) నార్ల వేంకటేశ్వరరావు గురించి రాయండి.
(లేదా)
అజంతా చిత్రాలు పాఠ్యభాగ రచయిత గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
నార్ల వేంకటేశ్వరరావు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని ‘కవుతరం’ అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు (అనువాద రచన), నరకంలో హరిశ్చంద్రుడు (నాటకం), నార్లవారి మాట (పద్య కావ్యం) మొదలైన గ్రంథాలను రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషిచేసిన మేధావి. ఈయన రచన సరళంగా సొగసైన భావాలతో సుందర శైలిలో నడుస్తుంది.

ఆ) అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి ? వాటి విశిష్టతను తెలపండి.
జవాబు:
అజంతా గుహలు జల్గామ్ కు దక్షిణంగా 35 మైళ్ళ దూరంలో, ఔరంగాబాదు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన ఉన్నాయి. అజంతా గుహలలోని భారతీయ చిత్రకళ, అంతకు ముందుగాని, ఆ తర్వాత గాని అందుకోనంతటి మహోన్నత శిఖరాలను అందుకొంది. వాఘోరా నది పుట్టిన చోటుననే అజంతా గుహలున్నాయి. బౌద్ధభిక్షువులు అక్కడ చిత్రాలను చిత్రించారు. అజంతా గుహలు మనల్ని స్వాప్నిక జగత్తులోకి తీసుకొని వెడతాయని చెప్పి నెహ్రూ గారు అజంతా చిత్రకళను మెచ్చుకోవడం వాటి విశిష్టతను వెల్లడిస్తోంది.

ఇ) వాఘోరానది గురించి రాయండి.
జవాబు:
అజంతా గుహలు వాఘోరానది పుట్టిన చోటనే ఉన్నాయి. అజంతా గుహలను సమీపిస్తుంటే, రెండు వైపులా పచ్చని కొండలుంటాయి. ఆ రెండు కొండల మధ్య వాఘోరానది ఉంది. కొండలు అక్కడ ఎన్ని కనిపించినా, అవన్నీ ఒకే కొండ, ఆ కొండ చివర మెలికే వాఘోరానది జన్మస్థానం. కొండపైన ఏడు కొలనులు ఉన్నాయి. ఒక కొలను నుండి మరో కొలనులోకి ప్రవహిస్తూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది. దూకిన తరువాత కొండతో పాటు తాను కూడా మెలికలు తిరిగి, సమతల ప్రదేశానికి చేరి, కొన్ని వందల మైళ్ళు ప్రవహించి, ‘తపతి’ నదిలో కలుస్తుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ఈ) నేడు అజంతా గుహలు ఏ స్థితిలో ఉన్నాయి?
జవాబు:
నేడు అజంతా గుహల గోడలు శిథిలావస్థలో ఉన్నాయి. గుహల గోడలకు మట్టి గిలాబా వేసి, దానిపై పలుచగా సున్నం పూసి తడి ఆరకముందే చిత్రాలను వేసినందువలన, అవి వానతేమకు పొడిపొడిగా వూడిపోయాయి. బందిపోటు దొంగలు పెట్టిన పొగకు కొన్ని చిత్రాలు మసిబారాయి. ఇటీవల కాలంలో కొంతమంది తమ కీర్తి సంపాదన కోసం గోళ్ళతో బొమ్మలపై తమ పేర్లను వ్రాసినారు. మరికొన్ని చిత్రాలు శిథిలావస్థలో ఉన్నాయి. అజంతా గుహలు మొత్తం 29. వీటిలో మూడింటిని ప్రారంభించి, పూర్తిచేయకుండానే ఆపివేశారు. ఈనాడు 13 గుహల్లోనే చిత్రాల శిథిలాలు కనిపిస్తున్నాయి. 1, 2, 9, 10, 11, 17 గుహల్లోనే చెక్కుచెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలున్నాయి. మొత్తం మీద నూటికి ఒకటవ వంతో, రెండవ వంతో చిత్రాలు మాత్రమే అజంతా గుహలలో నేడు మిగిలాయి.

ఉ) అజంతా శిల్పాలలో ఏమేమి ప్రతిబింబిస్తాయి?
జవాబు:
అజంతా చిత్రాలు భారతీయ జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఇవి ఒక విశాల ప్రపంచాన్ని, ఆశ నిరాశలతో, రాగ విద్వేషాలతో, ప్రేమ ద్వేషాలతో, సంతోష విషాదాలతో, కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. గౌతమ బుద్ధుని కారుణ్య సందేశం, మనుష్యులకే కాక, పశుపక్ష్యాదుల జీవితాన్ని సయితం ఎంత పవిత్రం చేసిందో, తేజోవంతం చేసిందో అనేదాన్ని, ఈ అజంతా శిల్పాలు ప్రతిబింబిస్తాయి. ప్రాచీన కాలంలోని భారత సాంఘిక వ్యవస్థ, ఏ రూపంలో ఉండేదో, ఆనాటి వృత్తులేవో, వ్యాసంగాలేవో, వినోదాలేవో తెలిసికోవాలనుకునేవారు అజంతా గుహలకు వెళ్ళి దర్శించాలి.

III. స్వీయరచన

1) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) మేజర్ గిల్ వేటకు వెళ్ళి తొలిసారిగా అజంతా గుహలను దర్శించినట్టు చదివారు కదా ! దీనివలన మనదేశానికి జరిగిన మేలు ఏమని భావిస్తున్నారో రాయండి.
జవాబు:
మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి ఒక జంతువును తరుముకుంటూ కొండపైకి పోయి, ఎదురుగుండా గుబురు చెట్ల సందు నుంచి సాహసించి కొండ దిగాడు. వాఘోరా నదిని దాటి కొండలపై నుంచి చూశాడు. అల్లంత దూరంలో మేజర్ గిల్, వ్యూపాయింట్ ని చూశాడు.

ఆనాడు మేజర్ గిల్ అజంతా గుహలను దర్శించి మనకు వాటిని గూర్చి తెలపడం వల్ల మనకు ఎంతో మేలు జరిగింది. ప్రాచీనకాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది ? అప్పటి వృత్తులేవి ? వ్యాసంగాలేవి ? ఇలాంటి ప్రశ్నలన్నిటికి సమాధానాలు ఈ చిత్రాల వల్ల లభిస్తున్నాయి. ఒకప్పుడు మనదేశంలో రాణ్మందిరాలు, రాణులు, రాజులు వారి వేషభాషలూ ఎలా ఉండేవో, వారు రాజసభలను ఎలా తీర్చేవారో అజంతా చిత్రాల వలన మనం తెలుసుకోగలుగుతున్నాము.

ఆ) జవహర్ లాల్ నెహ్రూ “అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళుతుంది” అన్నాడు. ఆయన ఈ మాట ఎందుకు అన్నాడో రాయండి.
జవాబు:
అజంతా గుహలను, మన తొలి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు దర్శించి, ఆ చిత్రాలను చూస్తే మన మనస్సు కలల ప్రపంచంలోకి వెడుతుంది అన్నారు.

అజంతా గుహల్లో అందమైన స్త్రీల చిత్రాలు అనేకం ఉన్నాయి. రాకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు మొదలయిన అనేక స్త్రీల చిత్రాలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్న స్త్రీల చిత్రాలలో కొందరు స్త్రీలు కూర్చున్నారు. కొందరు నిలబడి ఉన్నారు. మరి కొందరు ముస్తాబు చేస్తున్నారు. కొందరు ఊరేగింపుగా వెడుతున్నారు. ఈ అజంతా స్త్రీల చిత్రాలు, ఎంతో పేరు పొందాయి. అలాగే అక్కడ బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాలు ఉన్నాయి. అక్కడ చిత్రకారులు బుద్ధుని చిత్రాలను ఎంత శ్రద్ధతో అందంగా తీర్చిదిద్దారో, అంతే శ్రద్ధతో స్త్రీల చిత్రాలను సైతం, అందాలొలికేలా గీశారు.

అటువంటి అపురూప చిత్రాలను మనం కేవలం కలల్లోనే చూడగలం. వాస్తవిక లోకంలో చూడలేం. అందుకే నెహ్రూగారు, ఆ చిత్రాలు మనల్ని స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడతాయి అని ప్రశంసించారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ఇ) “ప్రాచీన కాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది? అప్పటి వృత్తులేవి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కోరితే అజంతా గుహలకు వెళ్ళాలి” ఇలా అనడం వెనుక నార్ల వేంకటేశ్వరరావు గారి భావం ఏమై ఉంటుందో రాయండి.
జవాబు:
అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతున్నాయి. వాటి ద్వారా వివిధ భారతీయ జీవితాల్ని గురించి, సంస్కృతి గురించి, వారి వృత్తులు మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలుగుతున్నాం. అజంతా చిత్రాల ద్వారా మన ప్రాచీన సాంఘిక వ్యవస్థ గురించి తెలుసుకోవచ్చు.

ఆ అజంతా చిత్రాలలో ఒకప్పుడు మనదేశంలో రాజమందిరాలు ఏ విధంగా ఉండేవో, రాజులు, రాణులు వేషభాషలు ఎలా ఉండేవో, వారు రాజసభలను ఎలా తీర్చుకొనేవారో తెలుస్తుంది. రాజుల సైనిక బల నిర్మాణం, వారి ఆయుధాలు, ఎలా ఉండేవో ఆ చిత్రాల వల్ల తెలుసుకోవచ్చు. అక్కడ చిత్రాలలో మన భారత సాయుధ దళాలు సింహళ దండయాత్ర చేసిన నౌకాదళ చిత్రాలున్నాయి. వీరశివాజీ, రాజ్యానికై సముద్రాలు దాటి వెళ్ళిన భారతదేశ వ్యక్తుల చిత్రాలున్నాయి. పర్ష్యన్ రాయబారులకు దర్శనం ఇచ్చిన మన భారతీయ రాజుల చిత్రాలు ఉన్నాయి. అందువల్లనే, నార్లవారు అజంతా చిత్రాల ద్వారా ఆనాటి భారత సాంఘిక వ్యవస్థ రూపం వెల్లడి అవుతుందని చెప్పారు.

ఈ) “అజంతా గుహలను చూడడానికి రెండు కళ్ళు చాలవు” అని రచయిత అన్నాడు కదా ! ఇలా “రెండు కళ్ళు చాలవు” అనే మాటను ఇంకా ఏయే సందర్భాలలో వాడతారు? కొన్నింటిని తెలపండి.
జవాబు:
ఎంత గొప్ప అందాన్ని అయినా, మనం మన రెండు కళ్ళతోనే చూడగలం. బాగా అందమైన వస్తువును ఎంత చూచినా, ఎంతగా చూచినా తృప్తి కలగదు. అలాంటప్పుడు ఆ అందాలను చూడ్డానికి రెండు కళ్ళూ చాలలేదు అని అంటారు.

నార్ల వేంకటేశ్వరరావుగారు అజంతా చిత్రాల అందం చూడ్డానికి మనకు ఉన్న రెండు కళ్ళూ చాలవు అన్నారు. అలాగే కింది సందర్భాల్లో కూడా రెండు కళ్ళూ చాలలేదు అంటూ ఉంటాము.

1. వేంకటేశ్వరస్వామిని గుడిలో ఆభరణాలతో అలంకరించినపుడు ఆ సొగసులను చూడ్డానికి మన రెండు కళ్ళూ చాలలేదని అంటాము.

2. చంటి పిల్లవాడిని చక్కగా అలంకరించి, తొట్టెలో వేసి ఊపుతాము. ఆ పిల్లవాడు బోసినవ్వులు నవ్వుతాడు. అప్పుడు కూడా, ఆ పిల్లవాడి బోసి నవ్వుల అందాలను చూడ్డానికి రెండు కళ్ళూ చాలలేదని అంటాము.

3. పెళ్ళి దుస్తులలో ఆకర్షణీయమైన అలంకరణలతో ధగధగా మెరిసిపోయే వధూవరులను చూడటానికి రెండు కళ్ళూ చాలవు అంటాము.

4. అతిలోక సౌందర్యరాశి అయిన స్త్రీని వర్ణించే సందర్భాల్లో ఆమె అందం చూసేందుకు రెండు కళ్ళూ చాలవు అంటాము.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

2. కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

అ) ప్రస్తుత పాఠ్యభాగం ద్వారా అజంతా గొప్పతనాన్ని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
“అజంతా, మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళుతుంది” అన్న నెహ్రూ మాటలను సమర్థిస్తూ అజంతా గొప్పదనాన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
అజంతా గుహలు “జల్గామ్”కు దక్షిణంగా, 35 మైళ్ళదూరంలో, “ఔరంగాబాద్’కు ఉత్తరంగా 55 మైళ్ళ దూరంలో ఉన్నాయి. ఈ గుహలు వాఘోరా నది పుట్టిన చోటుననే ఉన్నాయి. నాల్గు పక్కలా కొండలు, పచ్చని చెట్లు, నీలాకాశం, అదొక కలలలోకం, భూలోక స్వర్గం. ‘మేజర్ గిల్’ అనే మిలటరీ ఆఫీసర్, 1819లో వేటకు వెళ్ళి, ఈ గుహలను మొదటగా చూశాడు. 30 సంవత్సరాలు కష్టపడి ఎన్నో చిత్రాలను కాపీ చేసుకొని వాటిని అతడు ‘లండన్ క్రిస్టల్ ప్యాలెస్’లో పెట్టాడు.

ఈనాడు మిగిలిన అజంతా చిత్రాలు, నూటికి రెండు మాత్రమే. అన్ని చిత్రాలూ మిగిలి ఉంటే, అజంతా గుహలు చూడ్డానికి మన రెండు కళ్ళూ చాలేవి కావు. అజంతా చిత్రాలలో సిద్ధార్థుని జాతక కథలే ఎక్కువ. జాతక కథలతో సంబంధం లేనివి కూడా ఉన్నాయి. ఆ కళా తపస్వులు, తమ కుంచెతో సౌందర్య సృష్టిని చేశారు.

అజంతా గుహలు మొత్తం 29. గుహల నిర్మాణం ప్రథమ శతాబ్దిలో మొదలై, ఏడవ శతాబ్ది వరకూ సాగింది. 14వ శతాబ్ది నాటి వరకూ మన అజంతా చిత్రాలంత అందమైన చిత్రాలు యూరప్ ఖండంలో లేనే లేవట. అజంతాలో ఎన్నో స్త్రీల అందమైన చిత్రాలున్నాయి. బుద్ధుని సుందర చిత్రాలున్నాయి.

అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతుంది. ఇంత అందమైన చిత్రాలు, ఏ విదేశీ చిత్రకారుడూ గీయలేడు. ఈ అజంతా చిత్రాలు ప్రాచీన కాలంలో మన భారతీయ సాంఘిక వ్యవస్థ స్వరూపాన్ని తెలుపుతాయి. ఆనాటి రాజుల మందిరాలు, వారి వేషభాషలూ, సైనిక వ్యవస్థను గూర్చి తెలుపుతాయి.

“అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడుతుంది” అని నెహ్రుగారిచే ప్రశంసించబడిన అజంతా గుహలను చిత్రకారులే కాదు భారతీయ సంస్కృతి, చరిత్ర, విజ్ఞానం మొదలైన విషయాల పట్ల శ్రద్ధాభక్తులు ఉన్న వారందరూ తప్పక దర్శించాలి.

ఆ) రచయిత అజంతా చూసి అక్కడి విశేషాలు రాశాడు కదా ! అలాగే మీరు చూసిన లేదా తెలుసుకొన్న ఒక దర్శనీయ స్థలానికి సంబంధించిన విషయాలు రాయండి.
(లేదా)
మనం కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో చాలా ప్రదేశాలకు వెళుతుంటాం. మీరు చూసిన / తెలుసుకొన్న పర్యాటక స్థలం గురించి రాయండి.
జవాబు:
నేను ఇటీవల మా కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌లో పర్యటించాను. రాజస్థాన్ రాజధాని జైపూర్. తొలుత డబుల్ డెక్కర్ బస్సులో బయలుదేరి నగరాన్ని సందర్శించాం.

ముందుగా 1799లో మహారాజు సవాయి ప్రతాప్ సింగ్ కట్టించిన హవామహల్ కు వెళ్లాం. నెమలిపింఛంలా కనిపించే ఈ భవనాన్ని పునాదులు లేకుండా నిర్మించారు. పగలు గులాబీ రంగులోనూ రాత్రి బంగారు వర్ణంలోనూ శోభిల్లే ఈ ఐదంతస్తుల భవనంలో 300 గదులు, 953 కిటికీలు ఉన్నాయి. తరవాత బిర్లాలు నిర్మించిన లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్లాం. దీనికి ఓ పక్కనే జైపూర్ కోట కనిపిస్తుంటుంది.

తరవాత రాజస్థాన్ సాంస్కృతిక వైభవాన్ని జీవన విధానాన్ని ప్రతిబింబించే సిటీ మ్యూజియానికి వెళ్లాం. విశాలమైన జైపూర్ నగరంలో అన్ని కట్టడాలకూ గులాబీరంగే. అందుకే దీన్ని ‘పింక్ సిటీ’ అని పిలుస్తారు. జైపూర్ కోటలోపల భవంతులు, గదులు…. నాటి రాజవైభవాన్ని కళ్ళకు కడతాయి. బలమైన శత్రుదాడుల్ని ఎదుర్కొన్నప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఆ ప్రాచీన కట్టడాల నిర్మాణశైలిని మెచ్చుకోకుండా ఉండలేం.

జలమహల్ గా ప్రాచుర్యం పొందిన చమేలీ బాగ్ ను కూడా సందర్శించాం. జైపూర్ నుంచి రాజస్థాన్ లో అతి పెద్ద రెండో పట్టణంగా పేరొందిన జోధ్ పూర్ కి వెళ్ళాం. నగరం నవీన రాజప్రాసాదాలకు నిలయం. కళాఖండాలకూ, తోలు వస్తువులకూ ప్రసిద్ధిచెందిన ఈ నగరం మొత్తం నీలం రంగులో ఉన్న భవంతులే. అందుకే దీనికి ‘బ్లూ సిటీ’ అని పేరు.

మేము జైసల్మేర్ ను కూడా సందర్శించాం. మహారాజ్ జైసాల్ సింగ్ 1156లో నిర్మించిన ఈ నగరం, మనదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం. పాకిస్థాన్ కి మనకీ మధ్య గీతలు గీసుకున్న పట్టణం ఇదే. ఈ నగరంలో ఎటు చూసినా బంగారు వర్ణంలో మెరిసే భవంతులే. అందుకే దీన్ని ‘గోల్డెన్ సిటీ’ అంటారు. ఈ రోజుకీ రాజప్రాసాదం ప్రాంగణంలో 400 కుటుంబాలు నివసించడం ఈ కోట ప్రత్యేకత.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలున్నాయి. రాజస్థాన్ యాత్ర ఒక గొప్ప అనుభవం. నాకు ఎన్నో అవ్యక్త మధురానుభూతులను కలిగించింది. ఈ యాత్ర ద్వారా నేను అనేక విజ్ఞానదాయకమైన విషయాలను తెలుసుకున్నాను.

IV. పదజాలం

1. కింది వాక్యాలలోని జాతీయాలకు సరిపోయే అర్థం గ్రహించి సరైన సమాధానం కింద గీత గీయండి.

అ) అజంతా గుహలోని కుడ్యచిత్రాలు నేటికీ చెక్కుచెదరలేదు. .
i) చెదిరిపోలేదు
ii) ఏమీ పాడుకాలేదు
iii) చెక్కబడలేదు
iv) శిథిలం కాలేదు
జవాబు:
ii) ఏమీ పాడుకాలేదు

ఆ) దొంగలు అజంతా గుహల్లో తలదాచుకున్నారు.
i) తలను దాచుకున్నారు
ii) వస్తువులను దాచుకున్నారు
iii) ఆశ్రయం పొందారు
iv) నివసించారు
జవాబు:
iii) ఆశ్రయం పొందారు

ఇ) అజంతా చిత్రాలు భారతీయ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.
i) కళ్ళకు కట్టుకున్నట్టు చూపుతున్నాయి
ii) కళ్ళముందు నిజంగా ఉన్నట్టు చూపుతున్నాయి
iii) చాలా మంచి విషయాలు చూపుతున్నాయి
iv) కళ్ళు చెదిరేట్టుగా ఉన్నాయి.
జవాబు:
iii) చాలా మంచి విషయాలు చూపుతున్నాయి

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాన్ని మరో సందర్భానికి అన్వయించి వాక్యాలు తిరిగి రాయండి.

1. ఉదా : అనంతాకాశంలోని నక్షత్రాలను పరిశీలించి ఆ అనుభూతిని చెప్పగలమా?
మంచి కథను చదివితే గొప్ప అనుభూతి కలుగుతుంది.
జవాబు:
తాజ్ మహల్ ను సందర్శించినప్పుడు కలిగిన అనుభూతిని నేనెన్నటికీ మరువలేను.

అ. భారతీయ చిత్రకళ మహోన్నత శిఖరాలను అధిరోహించింది.
జవాబు:
సంగీతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రతిభ, మహోన్నత శిఖరాలను తాకింది.

ఆ. చెక్కడపు పని మేజర్ గిల్ దృష్టిని ఆకర్షించింది.
జవాబు:
అనాథశరణాలయ విద్యార్థుల ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇ. కాలగతిలో కొన్ని చిత్రాలు నశించాయి.
జవాబు:
అతడు తనకు కల్గిన దుఃఖాన్ని, కాలగతిలో మరచిపోయాడు.

ఈ. ఈ కుడ్యచిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షువులు.
జవాబు:
విజయనగర చక్రవర్తుల గృహాలలోని కుడ్యచిత్రాలలో లక్ష్మీనారాయణుల విగ్రహాలున్నాయి.

3. కింది వాక్యాలలోని పర్యాయపదాలను గుర్తించి వాటి కింద గీత గీయండి.
అ) హృదయాన్ని కదిలించే అనుభూతిని, ఆ ఎదలోని భావాలను సులభంగా వర్ణించలేం.
జవాబు:
హృదయం – ఎద

ఆ) వాఘోరానది కొండల చుట్టూ తిరుగుతూ ప్రవహించింది. ఆ వాహిని ప్రవహించే దృశ్యం మనోహరం.
జవాబు:
నది – వాహిని

ఇ) పడమటి గాలి సన్నగా వీస్తూంది. పశ్చిమ దిశ వైపు ఒక సుందరమైన తోట ఉంది.
జవాబు:
పడమర – పశ్చిమము

V. సృజనాత్మకత

* అజంతా చిత్రాల పాఠంలో అజంతా గుహల చరిత్ర, దాని విశేషాలూ చదివారు కదా ! అలాగే ప్రతి గ్రామానికీ ఒక చరిత్ర కానీ, విశేషం కానీ ఉండవచ్చు. మీ గ్రామానికి గల ప్రత్యేకతను లేదా మీకు దగ్గరలోని ఇతర గ్రామాల ప్రత్యేకతను వర్ణిస్తూ రాయండి. ఆ వివరాలతో ఒక బ్రోచర్ తయారుచేయండి.
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లాలో అల్లవరంలోని ‘కొంగరగిరిపట్టణం’ – ఇది కోరుకొండ రాజధానిగా ‘కుమారగిరి రాయలు’ పరిపాలించినపుడు ఆయన పేర వెలసిన గ్రామం. ఇది సముద్ర తీరంలోని గ్రామం. ప్రక్కన బంగాళాఖాతం ఉంది. పూర్వం సముద్రంలో ప్రయాణించే ఓడలు ఇక్కడ ఆగేవి. ఇప్పటికీ దాన్ని ‘ఓడలరేవు’ అంటారు. ఈ గ్రామం గుండా రామలక్ష్మణులు ప్రయాణించారు. అందులో రాముడు ‘నత్తా రామేశ్వరం’ అనే ప్రాంతంలో ఈశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట. రాముడు ప్రతిష్ఠించడం వల్ల దాన్ని రామేశ్వరం అని పిలుస్తారు. మహాశివరాత్రికి మా చుట్టుపట్ల పల్లె గ్రామాల ప్రజలు సముద్రంలో స్నానం చేసి రామేశ్వరునికి అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.

అలాగే లక్ష్మణుడు మా గ్రామంలోనే ఒక ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దాన్ని ‘లక్ష్మణేశ్వరం’ అని పిలుస్తారు. సంక్రాంతికి ధనుస్సమయంలో ప్రజలు లక్ష్మణేశ్వరునికి అభిషేకాదులు చేస్తారు. ఇక్కడ సంక్రాంతి, కనుమనాడు ప్రభలతీర్థం చాలా వేడుకగా జరుగుతుంది. మా గ్రామ ప్రజలంతా వేడుకగా ఆ తీర్థంలో పాల్గొంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు
(లేదా)
* చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల నుండి జలజల జాలువారే జలపాతాలు, పచ్చని ప్రకృతి శోభ, పక్షుల కిలకిలా రావాలతో ఆ ప్రదేశం ఎంతో సుమనోహరంగా ఉంది …….. ఇలా ఏదైనా ఒక ప్రాంతాన్ని వర్ణిస్తూ రాయండి.
జవాబు:
కోస్తా ప్రాంతములోని నెల్లూరు జిల్లాలో రావూరు ఒక చెప్పుకోదగిన తాలూకా. ఈ రావూరుకు సమీపంలో ఎత్తైన కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్య నుంచి ఒక దారి ఉంది. కొండల మధ్యదారి మలుపులు తిరిగి మెలికలుగా ఉంటుంది. కొండల పైకి వెళ్ళిన తరువాత ఒక సుప్రసిద్ధమైన క్షేత్రం ఉంటుంది. దీనినే “పెంచలకోన” అని కూడా అంటారు. ఈ కోనలో కొండల మధ్య నుండి ఒక జలపాతం జాలువారుతూ ఉంటుంది. చుట్టూ కంటికింపైన పచ్చదనం, పక్షుల కిలకిల రావాలతో ఆ కొండ ప్రాంతమంతా చాలా ఆహ్లాదంగా, రమణీయంగా ఉంటుంది. ఇక్కడి పెంచలకోనలో నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయానికి సందర్శకుల సందడి ఎక్కువగా ఉంటుంది.

VI. ప్రశంస

* మీరు చూసిన ఒక దర్శనీయ స్థలాన్ని కొనియాడుతూ ‘నీవు కూడా తప్పక చూడవలసింది’గా తెలుపుతూ మీ మిత్రుడికి లేఖ రాయండి.
జవాబు:

శ్రీకాకుళం,
x x x x x x x

ప్రియమైన స్నేహితుడు శ్రీనాథ్ కు,

నీ మిత్రుడు భరత్ సింహా వ్రాయునది. ఇక్కడ క్షేమము, అక్కడ క్షేమమని తలుస్తున్నాను. మేము ఇటీవల తీర్థయాత్రలకు వెళ్ళాము. అనేక ప్రదేశాలను దర్శించుకున్నాము. వాటిలో నాకు నచ్చినది కాణిపాక వరసిద్ధి వినాయకుల వారి ఆలయం. దాని గురించి ఈ లేఖలో వివరిస్తున్నాను.

ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని తిరుపతికి దగ్గరగా రేణిగుంట సమీపాన ఉన్నది. ఇందు గణపతి శిల ఆకారంలో ఉంటాడు. ఈ వినాయకుడు మొదట ఒక రాయేనట. ఊరికి దగ్గరలోని ఒక పాడుబడిన బావిలో వినాయకుని ఆకారంలో వెలిసినాడట. తరువాత ఆ శిలావిగ్రహం కొంచెం పెద్దదిగా అయిందట. అప్పుడే ఆ గ్రామ ప్రజలు అందరూ ఆ విగ్రహానికి ఒక గుడి కట్టించి పూజలు చేయటం ప్రారంభించారట. అప్పటి నుండి కాణిపాకం చాలా ప్రసిద్ధి చెందినదట. ఇక్కడ ఎవరైనా కోరికలు కోరినట్లయితే తప్పక నెరవేరుతాయని ఇక్కడి ప్రజల యొక్క నమ్మకం. మా కుటుంబంలోని వారందరమూ ఈ ఆలయాన్ని దర్శించుకున్నాము. చాలా ఆనందించాము. నీవు కూడా తప్పకుండా ఇటువంటి దర్శనీయ ప్రాంతాన్ని దర్శించవలెను. తిరిగి లేఖ వ్రాయుము. మీ అమ్మా, నాన్నగార్లకు నా నమస్కారాలు.

ఇట్లు
మీ మిత్రుడు,
భరత్ సింహా.

చిరునామా :
కె. శ్రీనాథ్,
S/O కె. వెంకటేశ్వర్లు,
డోర్ నెం. 8/64-7,
బ్రాడీపేట,
గుంటూరు.

ప్రాజెక్టు పని

1. మీ జిల్లాలోని దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రదేశాల చిత్రాలు సేకరించండి. వీటి వివరాలు రాయండి. వీటన్నిటితో ఒక సంకలనం తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లా.
దర్శనీయ స్థలాలు :

  1. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయము.
  2. ద్రాక్షారామం , సామర్లకోట భీమేశ్వరాలయాలు.
  3. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయము.
  4. రాజమండ్రి “గోదావరి కమ్ రైల్ బ్రిడ్జి”.
  5. కోనసీమ ప్రకృతి దృశ్యాలు.
  6. సముద్ర తీరం బీచు.
  7. రాజోలు తాలూకా ‘ఆదుర్రు’ బౌద్ధ స్తూపం – మొ||నవి.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు 3

VII. భాషను గురించి తెలుసుకుందాం!

1) కింది వాక్యాలను పరిశీలించి, మార్పులను గమనించండి.
అ) సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
ఆ) సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.
పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కాని వాక్య నిర్మాణంలో భేదం ఉందని గమనించారు కదా !
రెండు వాక్యాల మధ్య భేదం ఏమిటి?

అ) సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు – అనే ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ కర్తను సూచిస్తుంది. కర్మకు ద్వితీయా విభక్తి ప్రత్యయం చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం’ అంటారు.

ఆ) ఇక సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. – అనే రెండవ వాక్యంలో (i) కర్తకు తృతీయా విభక్తి ప్రత్యయం ఉంది. (ii) క్రియకు “బడు” చేరింది. (iii) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.

వాక్యంలో క్రియకు ‘బడు’ చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని “కర్మణి వాక్యం” అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

2) కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
రామాయణం వాల్మీకి చేత రచించబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
శాంతి ప్రజలచేత కోరబడింది. (కర్మణి వాక్యం)

3) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నాచేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాన్ని చదివాను. (కర్తరి వాక్యం)

ఆ) నాచే రచించబడిన గ్రంథం నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను నేతాజీ చరిత్ర గ్రంథాన్ని రచించాను. (కర్తరి వాక్యం)

4) కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు తెలపండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
ఉదా : నదిగట్టు నది యొక్క గట్టు షష్ఠీ తత్పురుష
అ) అజంతా స్త్రీలు అజంతా యొక్క స్త్రీలు షష్ఠీ తత్పురుష
ఆ) ప్రకృతి సౌందర్యం ప్రకృతి యొక్క సౌందర్యం షష్ఠీ తత్పురుష
ఇ) నదీ ప్రవాహం నది యొక్క ప్రవాహం షష్ఠీ తత్పురుష
ఈ) మానవ సమాజం మానవుల యొక్క సమాజం షష్ఠీ తత్పురుష

5) కింది విగ్రహవాక్యాలకు సమాస పదాలు రాసి దాని పేరును తెలపండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) గుహల యొక్క గోడ గుహల గోడ షష్ఠీ తత్పురుష
ఆ) కొండ యొక్క మలుపు కొండ మలుపు షష్ఠీ తత్పురుష

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

సముద్రం : సాగరం, జలధి
నక్షత్రం : తార, చుక్క
పువ్వు : కుసుమం, సుమం
కెరటం : అల, తరంగం, భంగం
కన్ను : నేత్రం, నయనం, చక్షువు
స్త్రీ : మహిళ, వనిత, మగువ
తావి: పరిమళం, సువాసన, సుగంధం
ఆకాశం : గగనం, నింగి
పాట : గీతం, గేయం
కొండ : అద్రి, పర్వతం
నది : వాహిని, స్రవంతి, కూలంకష
చంద్రుడు : సోముడు, అమృతాంశుడు
నీరు : జలం, వారి, ఉదకం

వ్యుత్పత్యర్థాలు

మిత్రుడు : అన్ని ప్రాణుల యందు సమభావన కలవాడు (సూర్యుడు)
తార : దీనిచే నావికులు తరింతురు (చుక్క)
పక్షి : పక్షములు గలది (పిట్ట)
సాగరం : సగర కుమారుల చేత త్రవ్వబడినది (సముద్రం)
మహీపాలుడు : భూమిని పాలించువాడు (రాజు)

నానార్థాలు

కోటి : నూరులక్షలు, అంచు, గుంపు
వర్షం : వాన, సంవత్సరం, మబ్బు
కన్ను : నేత్రం, బండి చక్రం
చిత్రం : బొమ్మ, ఆశ్చర్యం
దక్షిణ : దిక్కు సంభావన
తార : నక్షత్రం, వాలి భార్య, కంటిపాప, ఓంకారం
కుడ్యం : గోడ, పుంత
ఉత్తరం : జాబు, సమాధానం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు దాని దీర్ఘము ఏకదేశమగును.
నీలాకాశం = నీల + ఆకాశం – సవర్ణదీర్ఘ సంధి
కళాభిజ్ఞులు = కళ + అభిజ్ఞులు – సవర్ణదీర్ఘ సంధి
చంద్రాకారం = చంద్ర ఆకారం – సవర్ణదీర్ఘ సంధి
శతాబ్దం = శత + అబ్దం – సవర్ణదీర్ఘ సంధి
సిద్ధార్థ = సిద్ధ + అర్థ – సవర్ణదీర్ఘ సంధి
న్యత్యాంగన = నృత్య + అంగన – సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
మహోన్నత = మహా + ఉన్నత – గుణసంధి
గజేంద్రుడు = గజ + ఇంద్రుడు – గుణసంధి
సర్వోత్తమం = సర్వ + ఉత్తమం – గుణసంధి

ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
సులభమేమో = సులభము + ఏమో – ఉత్వ సంధి
అపారమైన = అపారము + ఐన – ఉత్వ సంధి
వచ్చినావని = వచ్చినావు + అని – ఉత్వ సంధి
మలుపులన్నీ = మలుపులు + అన్ని – ఉత్వ సంధి
లోతైనా = లోతు + ఐనా – ఉత్వ సంధి
చైత్యా లైతే = చైత్యాలు + ఐనా – ఉత్వ సంధి
అటొక = అటు + ఒక – ఉత్వ సంధి
పేరొందు = పేరు + ఒందు – ఉత్వ సంధి

ఆత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
నిలిచినప్పుడు = నిలిచిన + అప్పుడు – అత్వ సంధి
పోయినందున = పోయిన + అందున – అత్వ సంధి
అల్లంత = అల్ల + అంత – అత్వ సంధి
దక్కకుండు = దక్కక + ఉండు – అత్వ సంధి

ఇత్వగుంధి (అ):
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
దారైనా = దారి + ఐనా – ఇత్వ సంధి
అదొక = అది + ఒక – ఇత్వ సంధి

ఇత్వసంధి (ఆ) :
సూత్రం : క్రియా పదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
లేనట్టు = లేని + అట్టు – ఇత్వ సంధి
వచ్చేదట = వచ్చేది + అట – ఇత్వ సంధి
ఉండేదేమో = ఉండేది + ఏమో – ఇత్వ సంధి

యణాదేశ సంధి :
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా య, వ, రలు ఆదేశమవుతాయి.
పక్ష్యాదులు = పక్షి + ఆదులు – యణాదేశ సంధి
ప్రత్యుత్తరం = ప్రతి + ఉత్తరం – యణాదేశ సంధి

పుంప్వాదేశ సంధి :
సూత్రం : కర్మధాయంలో మువర్ణకానికి పుంపులు అవుతాయి.
సముద్రపు అంచు = సముద్రపు + అంచు – పుంప్వాదేశ సంధి
చెక్కడపుపని = చెక్కడము + పని – పుంప్వాదేశ సంధి

గసడదవాదేశ సంధి :
సూత్రం : ప్రథమమీది పురుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
చెట్టుగాని = చెట్టు + కాని – గసడదవాదేశ సంధి
చరిత్రలుగా = చరిత్రలు + కా – గసడదవాదేశ సంధి
సరిగదా = సరి + కదా – గసడదవాదేశ సంధి

యడాగమ సంధి :
సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం అవుతుంది.
ఆయన యెత్తినట్లు = ఆయన + ఎత్తినట్లు – యడాగమ సంధి
తలయెత్తు = తల + ఎత్తు – యడాగమ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
వేషభాషలు వేషమును, భాషయును ద్వంద్వ సమాసం
భక్తిశ్రద్ధలు భక్తియును, శ్రద్ధయును ద్వంద్వ సమాసం
శ్రద్ధాభక్తులు శ్రద్ధయును, భక్తియును ద్వంద్వ సమాసం
ఆశనిరాశలు ఆశయును, నిరాశయును ద్వంద్వ సమాసం
ప్రకృతి సౌందర్యం ప్రకృతి యందలి గల సౌందర్యం సప్తమీ తత్పురుష సమాసం
అజంతా గుహలు అజంతా యొక్క గుహలు షష్ఠీ తత్పురుష సమాసం
రాణ్మందిరాలు రాణుల యొక్క మందిరాలు షష్ఠీ తత్పురుష సమాసం
రాజసభ రాజు యొక్క సభ షష్ఠీ తత్పురుష సమాసం
జీవిత చరిత్ర జీవితము యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం
చంద్రాకారం చంద్రుని యొక్క ఆకారం షష్ఠీ తత్పురుష సమాసం
– నదిగట్టు నది యొక్క గట్టు – షష్ఠీ తత్పురుష సమాసం
అగ్నిప్రమాదం అగ్ని వలన ప్రమాదం పంచమీ తుత్పురుష సమాసం
పచ్చని చెట్లు పచ్చనైన చెట్లు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
శాశ్వత కీర్తి శాశ్వతమైన కీర్తి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అనంతాకాశం అనంతమైన ఆకాశం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ముప్పది సంవత్సరాలు ముప్పదైన సంవత్సరాలు ద్విగు సమాసం
పదమూడు గుహలు పదమూడైన గుహలు ద్విగు సమాసం
వాఘోరానది వాఘోర అను పేరుగల నది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రకృతి – వికృతులు

హృదయం – ఎద, డెందము
ఆకాశం – ఆకసం
యాత్ర – జాతర
కథ – కత
పుష్పం – పూవు
చంద్రుడు – చందురుడు
దూరం – దవ్వు
సముద్రము – సంద్రము
రూపం – రూపు
గృహము – గీము
స్త్రీ – ఇంతి
దక్షిణం – దక్కినం

రచయిత పరిచయం

పాఠం పేరు : “అజంతా చిత్రాలు”

వ్యాస రచయిత : “నార్ల వేంకటేశ్వరరావు”

జననం, జన్మస్థలం : నార్ల వారు, 1908 డిశంబరు ఒకటవ తేదీన (1-12- 1908)న కృష్ణా జిల్లాలోని “కవుతరం” అనే గ్రామంలో జన్మించారు.

రచనలు :
1. “రష్యన్ కథలు” (అనువాద రచన)
2. “నరకంలో హరిశ్చంద్రుడు” (నాటకం)
3. “నార్లవారి మాట” (పద్యకావ్యం) మొదలయిన గ్రంథాలు రాశారు.

మేధావి : ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి.

రచనాశైలి : నార్లవారి రచన సరళమైన శబ్దాలతో సొగసైన భావాలతో సుందరశైలిలో సాగుతుంది.

కఠిన పదాలకు – అర్థాలు

దృశ్యము = కంటికి ఇంపయినది (చూడదగినది)
అనుభూతి = సుఖ దుఃఖాదులను పొందడం (ప్రత్యక్షజ్ఞానం)
అపారము = అధికమైనది (అవధిలేనిది)
బస్తీ = పట్టణము
దిశ్చక్రాన్ని = దిక్కుల యొక్క చక్రమును
నెత్తావులు (నెలు + తావులు) = నిండు పరిమళములు
తావులు = సువాసనలు
జగత్తు = లోకము
ఆదిలో = మొదటిలో
శిరోభాగము (శిరః + భాగము) = పై భాగము
వ్యవధి = గడువు
ఘట్టం = సమయం
పరికించు = చూచు
బయలు = స్థలము
అస్తిత్వాన్ని = ఉనికిని
సభ్యలోకం = ఉత్తమ సమాజం

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

విస్మరించింది = మరచింది
కుడ్యచిత్రాలు = గోడ బొమ్మలు
స్వాప్నిక జగత్తు = కలల లోకము
గాయనీమణులు = శ్రేష్ఠులైన పాటకత్తెలు
నృత్యాంగనలు = నాట్యం చేసే స్త్రీలు
అలౌకిక సుందర విగ్రహము = లోక సహజం కాని, అందమైన విగ్రహము
బౌద్ధచైత్యాలు = బౌద్ధస్తూపములు
కుడ్యాన్ని = గోడను
మట్టిగిలాబా = మట్టితో పూత
దగ్గము = కాలినది
రాగవిరాగాలు = అనురాగము, అనురాగం లేకపోవడం
కళాతపస్వులు = ఉత్తమ కళాకారులు
సౌందర్యసృష్టి = అందాన్ని సృష్టించడం
కళాభిజ్ఞులు (కళా + అభిజ్ఞులు) = కళలలో నేర్పరులు
తొణికిసలాడుతున్న = చిందుతున్న
విజాతీయ చిత్రకారులు = ఇతర జాతి చిత్రలేఖకులు
ప్రజాసాధకులు = ప్రజ్ఞను సాధించినవారు
వ్యాసంగము = ఎక్కువ కృషి
రాణ్మందిరాలు రాట్ + మందిరాలు = రాజమందిరాలు
వణిక్కులు = వర్తకులు
మహీపాలకులు = రాజులు
కారుణ్య సందేశం = దయతో కూడిన ఆజ్ఞ
పునీతం = పవిత్రము

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 3 నీతి పరిమళాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 3rd Lesson నీతి పరిమళాలు

8th Class Telugu 3rd Lesson నీతి పరిమళాలు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

1. మీకు తెలిసిన నీతి వాక్యా లు తెలపండి.
2. నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి?
3. వందకుపైగా పద్యాలుండే ప్రక్రియను ఏమంటారు?
4. మకుటం అంటే ఏమిటి?
5. మకుటం ఏ రకంగా ఉండవచ్చు?
6. మీకు తెలిసిన నీతిశతకాల పేర్లు చెప్పండి.
7. మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి.
8. శతకాలలో కేవలం నీతిని బోధించేలే ఉంటాయా? వివరించండి.
9. ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాల్లో ఏయే శతకాల పద్యాలున్నాయి?

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మీకు తెలిసిన నీతివాక్యాలు తెల్పండి.
జవాబు:
1) ఖలునకు నిలువెల్ల విషము ఉంటుంది.
2) విద్యలేనివాడు వింతపశువు.
3) కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగదు.
4) సదౌష్టియె పాపములను చెఱచును.
5) పడతులు మర్యాదలేటిగి బ్రతుకవలెను.
6) చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
7) ఆలస్యంగా తింటే అమృతం కూడా విషం అవుతుంది.
8) ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.

ప్రశ్న 2.
నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి?
జవాబు:
నీతులను భర్తృహరి పది రకాలుగా విభజించారు –
1) మూర్ఖ పద్ధతి
2) విద్వత్పద్ధతి
3) మానశౌర్య పద్ధతి
4) అర్థ పద్ధతి
5) దుర్జన పద్ధతి
6) సుజన పద్ధతి
7) పరోపకార పద్ధతి
8) ధైర్య పద్ధతి
9) దైవ పద్ధతి
10) కర్మ పద్ధతి.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 3.
వందకు పైగా పద్యాలుండే ప్రక్రియను ఏమంటారు?
జవాబు:
వందకు పైగా పద్యాలుండే ప్రక్రియను శతకం అంటారు.

ప్రశ్న 4.
మకుటం అంటే ఏమిటి?
జవాబు:
మకుటం అనగా పద్యం చివర ఉండేది. ఇది పదంగా కాని, అర్ధపాదంగా కాని, పాదంగా కాని, పాద ద్వయంగా కాని ఉండవచ్చు.

ప్రశ్న 5.
మకుటం ఏ రకంగా ఉండవచ్చు?
జవాబు:
మకుటం పద్యరూపంలోగాని, గద్యరూపంలోగాని ఏ రకంగానైనా ఉండవచ్చు.

ప్రశ్న 6.
మీకు తెలిసిన నీతిశతకాల పేర్లు చెప్పండి.
జవాబు:
తెలుగులో పెక్కు నీతిశతకాలు ఉన్నాయి. తెలుగులో మొదటి నీతి శతకం బద్దెన రచించిన సుమతి శతకం. మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం చక్కని నీతి శతకం. అట్లే వేమన రచించిన ‘వేమన శతకం’ చక్కని నీతి పద్యాల సంకలనం. ఏనుగు లక్ష్మణకవి రచించిన సుభాషిత రత్నావళిలో చక్కని నీతిపద్యాలున్నాయి. ఇంకా ఫక్కి అప్పల నరసయ్య రచించిన కుమారీ శతకం, కుమార శతకం, జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి తెలుగుబాల పద్యాలు, నార్లవారి పద్యాలు, నాళం కృష్ణారావుగారి పద్యాలు మొదలైన అనేక నీతి శతకాలు తెలుగులో వచ్చాయి.

ప్రశ్న 7.
మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి.
జవాబు:

1) బద్దెన సుమతి శతకం
2) ఫక్కి అప్పల నరసయ్య కుమారీ శతకం, కుమార శతకం
3) వేమన వేమన శతకం
4) ఏనుగు లక్ష్మణకవి సుభాషిత రత్నావళి
5) గువ్వల చెన్నడు/పట్టాభిరామకవి గువ్వల చెన్న శతకం
6) మారద వెంకయ్య భాస్కర శతకం
7) కంచర్ల గోపన్న దాశరథీ శతకం

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 8.
శతకాలలో కేవలం నీతిని బోధించేవే ఉంటాయా? వివరించండి.
జవాబు:
శతకాలలో కేవలం నీతిని బోధించేవే కాకుండా భక్తిని బోధించేవి, వైరాగ్యాన్ని బోధించేవి, ధర్మాలను బోధించేవి, శృంగారాన్ని తెలిపేవి కూడా ఉంటాయి. తత్త్వ శతకాలు, అధిక్షేప శతకాలు, వ్యాజోక్తి శతకాలు మొదలైనవి కూడా ఉంటాయి.

ప్రశ్న 9.
ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాల్లో ఏయే శతకాల పద్యాలున్నాయి?
జవాబు:

  1. గువ్వల చెన్న శతకం
  2. కుమార శతకం
  3. తెలుగు పూలు శతకం
  4. వేమన శతకం
  5. సుమతి శతకం
  6. నరసింహ శతకం
  7. కృష్ణ శతకం
  8. దాశరథీ శతకం
  9. కాళహస్తీశ్వర శతకం
  10. సుభాషిత రత్నావళి.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను అర్థవంతంగా, రాగయుక్తంగా చదవండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

ప్రశ్న 2.
పద్యాల్లోని నీతిని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
1. గుణవంతుడు లోకానికి మేలు చేకూర్చే కార్యము ఎంత భారమైనా చేయడానికి సిద్ధపడతాడు.
2. ఉప్పులేని వంటలూ, రసజ్ఞత లేని చదువు వ్యర్థం.
3. సంస్కారవంతమైన మాటయే మనిషికి నిజమైన అలంకారం.
4. మానవుణ్ణి ఇంద్రియ చాపల్యం నుండి భగవంతుడే కాపాడాలి.
5. ఓర్పు కలవారు అన్ని పనుల్లోనూ సమర్థులు అవుతారు.
6. మానవులు రాజును ఆశ్రయించడం వ్యర్థం.
7. ఎదుటి వాడి బలాన్ని గుర్తించకుండా పోరాటం చేసేవాడు అవివేకి.
8. జీర్ణం కాని చదువు, తిండి చెరుపు చేస్తాయి.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 3.
‘చదువు జీర్ణం’ కావటాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారో చెప్పండి.
జవాబు:
చదువు జీర్ణం అవడం అంటే చదివిన దాన్ని గ్రహించి ఆచరణలో పెట్టగలగడం. చదివిన విషయాన్ని ఆధారంగా చేసికొని దాని తరువాత విషయాలను నేర్చుకోగలగడం, చదివిన విషయం జ్ఞప్తిలో ఉంచుకోవడం – అని అర్థం చేసుకున్నాను.

II చదవడం, అవగాహన చేసుకోవడం

1. పాఠంలోని పదాల ఆధారంగా కింద తెలిపిన వాటిని వేటితో పోల్చారో రాయండి.
అ) రసజ్ఞత ఆ) అవివేకం ఇ) వాక్కు
జవాబు:
అ) రసజ్ఞత : కూరలో వేసే ‘ఉప్పు’ తో పోల్చారు.
ఆ) అవివేకం : ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగడం ‘అవివేకం’ అని చెప్పారు.
ఇ) వాక్కు : సంస్కారవంతమైన మాటను అలంకారంతో పోల్చారు.

2. కింద ఇచ్చిన భావానికి తగిన పద్యపాదం గుర్తించి రాయండి.
అ) గొప్పవారు లోకానికి మేలు జరిగే పనులను ఎంత కష్టమైనా చేస్తారు.
జవాబు:
ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మేలనుకొని పూను

ఆ) పొట్టేలు కొండతో ఢీకొంటే, దాని తల పగులుతుంది.
జవాబు:
కొండతోఁ దగరు ఢీకొని యెంత తాఁకినఁ దల ప్రక్కలగుఁగాక దాని కేమి

ఇ) తిన్నతిండి జీర్ణమైతే బలం కలుగుతుంది.
జవాబు:
తిండి జీర్ణమైన నిండు బలము

ఈ) రసజ్ఞత లేకపోతే గొప్పవాళ్ళు మెచ్చుకోరు.
జవాబు:
రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

3. సభారంజన శతకం’లో క్షమ అనే పదాన్ని ప్రతి పాదంలోనూ వాడటం కనిపిస్తున్నది కదా ! క్షమను ఏ ఏ అర్థాలలో ఉపయోగించారో చెప్పండి.
జవాబు:
మొదటి పాదంలో క్షమను “ఓరిమి” అనే అర్థంలోను,
రెండవ పాదంలో క్షమను “భూమి” అనే అర్థంలోను,
మూడవ పాదంలో క్షమను “సహనం” అనే అర్థంలోను
నాలుగవ పాదంలో క్షమను “సమర్థత” అనే అర్థంలోను వాడారు.

4. పాఠంలోని పద్యాలు ఆధారంగా తప్పు-ఒప్పులు గుర్తించండి.
అ) రత్నహారాలు మనిషికి నిజమైన అలంకారం. (తప్పు)
ఆ) ఉప్పులేని కూరైనా రుచిగా ఉంటుంది. (తప్పు)
ఇ) సూర్యుని పైకి దుమ్ము ఎత్తి పోస్తే అది పోసినవాడి మీదే పడుతుంది. (ఒప్పు)
ఈ) తిండి జీర్ణం కాకపోతే మనకు ఆరోగ్యం. (తప్పు)

5. పాఠం ఆధారంగా జవాబులు రాయండి.

అ) గొప్పవారి వల్ల ప్రజలకు కలిగే మేలు ఏమిటి?
జవాబు:
గొప్పవారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేటందుకే ప్రయత్నం చేస్తారు. ఎదుటివారి నుండి ఎటువంటి లాభాలను ఆశించరు. లోకానికి మేలు కలిగించే పని ఎంతటి భారమైనప్పటికీ చేయడానికి పూనుకుంటారు.

ఆ) రాజులను ఎందుకు ఆశ్రయించకూడదని కవి భావించాడు?
జవాబు:
రాజులను ఆశ్రయించవలసిన పనిలేదని ధూర్జటి కవి, తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఇలా చెప్పాడు
1) తినడానికి తిండి కావాలని అడిగితే ఎవరైనా భిక్షం పెడతారు.
2) నివసించడానికి కావలసివస్తే గుహలు ఉన్నాయి.
3) వస్త్రాలు కావాలంటే వీధుల్లో దొరుకుతాయి.
4) త్రాగడానికి నదుల్లో తియ్యని నీరు ఉంది.

కాబట్టి రాజులను కూటికీ, ఇంటికీ, బట్టకూ ఆశ్రయించనక్కరలేదని కవి చెప్పాడు.

ఇ) “ఎలాంటి చదువు వ్యర్థమని” మీరు తెలుసుకున్నారు?
జవాబు:
ఎంత చదువు చదివినా దానిలోని అంతరార్థాన్ని, రసజ్ఞతను గ్రహించలేని చదువు వ్యర్థమని తెలుసుకున్నాను.

ఈ) ఏవేవి అవివేకమైన పనులని ఈ పాఠం ద్వారా తెలుసుకున్నారు? వీటివల్ల కలిగే ఫలితాలు ఏమిటి?
జవాబు:
సూర్యుని మీద దుమ్మెత్తి పోయడం, పొట్టేలు కొండతో ఢీకొనడం, మిడతలు మంటపైకి ఎగిసిపడడం, వలలో చిక్కుకున్న చేప పొరలాడడం, అలాగే ఎదుటివాడి బలం తెలియకుండా వాడితో యుద్ధానికి దిగడం – అనే పనులు అవివేకమైన పనులని నేను తెలిసికొన్నాను.

వీటి వల్ల కలిగే ఫలితాలు :
సూర్యుడి మీద దుమ్మెత్తి పోస్తే, పోసినవాడి నెత్తిమీదే పడుతుంది. పొట్టేలు కొండతో ఢీకొంటే పొట్టేలు తల బద్దలౌతుంది. మిడతలు మంటపైకి దూకితో అవే మాడిపోతాయి. వలలో చిక్కిన చేప పొరలాడితే అది మరింతగా బందీ అవుతుంది. ఎదుటివాడి బలం తెలియకుండా పోరాటానికి దిగితే దిగినవాడే ఓడిపోతాడు.

ఉ) నిజమైన అలంకారం ఏది?
జవాబు:
బంగారు హారాలు ధరించడం, సిగలో పువ్వులు అలంకరించుకోవడం, సుగంధ ద్రవ్యాలు వాడటం, పన్నీటి ‘స్నానం, మొదలైనవి మానవుడికి అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటయే, పురుషుడికి నిజమైన అలంకారం.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ఊ) ఏ ఏ బలహీనతల వల్ల ఏవేవి ఎలా నశిస్తాయి?
జవాబు:
మానవుడు ఎన్నో బలహీనతలకు లోను అవుతున్నాడు. ఏనుగు తన దురదను పోగొట్టుకొనడానికి, చేప నోటి రుచిని ఆశించి, పాము రాగానికి వశపడి, జింక అందానికి బానిస అయి, తుమ్మెదలు పూల వాసనలకు మైమరచి బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క బలహీనత వల్ల నశించిపోతున్నాయి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో మీరు ఊహించి రాయండి.
జవాబు:
‘పరోపకారార్థం ఇదం శరీరం’ అనగా ఇతరులకు మేలు చేయడం కోసమే ఈ శరీరం అని అర్థం. గొప్పవాళ్ళు అంటే, స్వార్థం విడిచి ఇతరులకు మేలు చేసేవారు. గొప్పవాళ్ళు కీర్తిని కోరుకుంటారు. స్వలాభాన్ని ఆశించరు. అటువంటి గొప్పవారు లోకానికి మేలు కలిగించే పని, అది ఎంత భారమైనా చేయడానికి పూనుకుంటారు. ఆదిశేషుడు తాను గాలిని మాత్రమే పీలుస్తాడు. కానీ తన వేయిపడగల మీద పెద్ద భూభారాన్ని ఏ మాత్రం కదలకుండా మోస్తాడు. స్వార్థ రాహిత్యం , కీర్తికాంక్ష కారణంగా, గొప్పవాళ్ళు లోకహిత కార్యాలు చేస్తారు.

ఆ) వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు?
జవాబు:
సంస్కారవంతమైన వాక్కే, మనిషికి నిజమైన అలంకారం. బంగారు హారాలు ధరించడం, సిగలో పూలు పెట్టుకోవడం, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించడం, పన్నీటితో స్నానం చెయ్యడం మొదలైన పనులు, మానవుడికి అలంకారాలు కావు. ఒక్క పవిత్రమైన వాక్కే, మానవుని అలంకరిస్తుంది. వాక్కు అనే అలంకారమే నిజమైన మంచి అలంకారము. మిగిలిన కేయూరములు వంటి భూషణాలు అన్నీ నశించేవే.

ఇ) సమర్థులు అంటే ఎవరు ? సామర్థ్యం ఎలా వస్తుంది?
జవాబు:
ఎవరైతే ఓర్పుతో, సహనంతో అన్ని పనులను తమంత తాము నిర్వర్తించగలుగుతారో వారిని “సమర్థులు” అంటారు. ఎవరు ప్రయత్నం చేసి ఓరిమిని కాపాడుకుంటారో, వారే భూమిని కాపాడగలరు. అంటే క్షమాగుణం గల ప్రభువులే, రాజ్యమును రక్షింపగలరు. ఎవరిలో సహనగుణం నిశ్చలంగా ఉంటుందో వారే అన్ని పనుల్లోనూ సమర్థులై ఉంటారు. క్షమాగుణం గలవారే సమర్థులు. క్షమాగుణం వల్లనే సామర్థ్యం వస్తుంది.

ఈ) చదువును మంచికూరతో కవి ఎందుకు పోల్చాడు?
జవాబు:
చాలామంది చదువుకుంటారు. ఎంతో పాండిత్యాన్ని సంపాదిస్తారు. ఎంత చదువు చదివినా వారిలో కొంచెం రసజ్ఞత లేకపోతే ఆ చదువు వ్యర్థం. చదువును మంచికూరతో కవి పోల్చాడు. కూరలో తక్కిన దినుసులు అన్నీ వేసి చక్కగా నలభీమపాకం చేసినా, అందులో కొంచెం ఉప్పు వేయకపోతే ఆ కూర రుచిగా ఉండదు. అందుకే రసజ్ఞత లేని చదువుకు దృష్టాంతంగా ఉప్పులేని కూరను, కవి చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) మంచితనమంటే ఏమిటి? కొంతమందిలో మీరు గమనించిన మంచితనాన్ని గూర్చి రాయండి.
జవాబు:
ఎదుటివారిని నొప్పించకుండా, బాధ పెట్టకుండా, ఇతరులకు తన చేతనైన సహాయం చేస్తూ, సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా జీవించటాన్నే ‘మంచితనం’ అంటారు.

భారతంలో “సక్తుప్రస్థుడి” కథ ఉంది. కురుక్షేత్రంలో ‘సక్తుప్రస్థుడు’ అనే గృహస్థుడు ఉండేవాడు. ఆయనకు భార్య, కొడుకు, కోడలు ఉండేవారు. వారు ఆ పరిసరాల్లోని చేలల్లో తిరిగి, అక్కడ రాలిన ధాన్యం గింజలను ఏరి తెచ్చుకొని, వాటిని దంచి పిండి చేసికొని, దాన్ని వండుకొని సమంగా పంచుకొని తినేవారు.

ఒక రోజు వాళ్ళు తినడానికి సిద్ధంగా ఉండగా, ఒక ముసలివాడు ఆకలి అంటూ వచ్చాడు. వారు తమకు ఉన్నదంతా ఆ ముసలివాడికి తృప్తిగా పెట్టారు. ఆ వృద్దుడు సంతోషించాడు. సక్తుప్రస్తుడి కుటుంబం ఆకలితో ఉన్నా అతిథి ఆకలి తీర్చడమే ముఖ్యమని వారు భావించారు. అదే మంచితనం అని నా అభిప్రాయం.

ప్రస్తుత సమాజంలో నేను చాలా మందిలో ఈ మంచితనాన్ని గమనించాను. కొందరు తమ మంచితనంతో ఎదుటివారికి ధనరూపంలో సాయం చేస్తారు, వస్తురూపంలో సాయం చేస్తారు. కొందరు అనాథలైన పిల్లలను చేరదీసి వారి కోసం ఒక ట్రస్టును ఏర్పాటుచేసి దానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. కొందరు వృద్ధులకు, పెద్దవారికి ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారిని చేరదీస్తున్నారు. ఇంకా అనేక మంది తమ మంచితనంతో పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శప్రాయమైన జీవనం సాగిస్తున్నారు.

ఆ) ‘సమర్థులకు క్షమ అవసరం’ వివరించండి.
జవాబు:
సమర్థులకు ‘ఓర్పు’ చాలా అవసరం. దీనికి భారత కథలో ధర్మరాజు చక్కని ఉదాహరణ. ధర్మరాజు గొప్ప పరాక్రమం గలవాడు. ఆయనకు కోపం వస్తే సప్త సముద్రాలూ ఏకం అవుతాయని కృష్ణుడు చెప్పాడు. ధర్మరాజుకు భీమార్జునుల వంటి తమ్ముళ్ళు ఉన్నారు. దుర్యోధనుడు ధర్మరాజుకు ఎన్నో ఆపదలు కల్గించాడు. ద్రౌపదిని అవమానించాడు. పాండవులను లక్క ఇంటిలో పెట్టి దహనం చేయాలని చూశాడు. వారిని అడవులకు పంపాడు. ఘోషయాత్ర పేరుతో వారిని అవమానించాలని చూశాడు. పాండవుల అజ్ఞాతవాసాన్ని భంగం చేయాలని విరాటుడి గోవులను పట్టించాడు. ఇన్ని చేసినా ధర్మరాజు క్షమాగుణంతో సహించాడు. కృష్ణుణ్ణి రాయబారిగా పంపాడు. విధిలేక యుద్ధం చేశాడు. జయించాడు. ఏకచ్ఛత్రాధిపతిగా రాజ్యం పాలించాడు.

దీనంతటికీ ధర్మరాజు క్షమాగుణమే కారణం.

IV. పదజాలం

1. కింది వాక్యాల్లో సమానమైన అర్థాన్నిచ్చే పదాలున్నాయి. వాటిని గుర్తించి, వాటి కింద గీతలు గీయండి.

అ) హృదయం మంచిదైతే అతడు మంచి మనిషి. అతని డెందములో అందరి పట్ల అభిమానమే ఉంటుంది. ఎదలో కల్మషం లేకుండా మాట్లాడితే అందరి చిత్రాలు సంతోషిస్తాయి.
జవాబు:
హృదయం మంచిదైతే అతడు మంచి మనిషి. అతని డెందములో అందరి పట్ల అభిమానమే ఉంటుంది. ఎదలో కల్మషం లేకుండా మాట్లాడిన అతని మాటలకి అందరి చిత్తాలు సంతోషిస్తాయి.
హృదయం, డెందము, ఎద, చిత్తము

ఆ) మిడుతలు చిచ్చుపైకి ఎగిసిపడ్డాయి. అడవిలో వహ్ని రగులుకొన్నది. అగ్నిలో చేయిపెడితే కాలుతుంది.
జవాబు:
మిడుతలు చిచ్చు పైకి ఎగిసిపడ్డాయి. అడవిలో వహ్ని రగులుకొన్నది. అగ్నిలో చేయిపెడితే కాలుతుంది.
చిచ్చు, వహ్ని, అగ్ని

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2. కింది పదాలకు వ్యతిరేకార్థకం రాసి, ఈ రెండు పదాలతోనూ సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
కీర్తి – అపకీర్తి
మంచిపనులు చేస్తే కీర్తి వస్తుంది. చెడ్డపనులు చేస్తే అపకీర్తి వస్తుంది.

అ) అహితం – హితం
అహితం చేకూర్చే మాటలు వినకూడదు. హితం చేకూర్చే మాటలే వినాలి.

ఆ) బాగుపడు – చెడిపోవు
కొందరు బాగా చదువుకొని బాగుపడతారు. మరికొందరు పెద్దల మాటలు వినకుండా చెడిపోతున్నారు.

ఇ) నిస్సారం – సారం
నా సారం గల మాటలు, నీకు నిస్సారంగా తోచాయి.

ఈ) ఫలం – నిష్ఫలం
మంచివానికి నీతి చెపితే ఫలం ఉంటుంది. కాని మూర్ఖునికి ఎన్ని నీతులు ఉపదేశించినా అది నిష్ఫలం అవుతుంది.

3. కింది పదాలు చదవండి. ఏవైనా రెండేసి పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.
అ) చదువు
ఆ) చెడిపోవు
ఇ) హారాలు
ఈ) ధనం
ఉ) దుష్టుడు
ఊ) బలం
ఎ) మార్గం
ఏ) చంచల స్వభావం
ఉదా :
చదువు జీవితానికి మార్గం చూపుతుంది.
జవాబు:

  1. చదువు మనకు మార్గం చూపుతుంది.
  2. ధనం చంచల స్వభావం కలది.
  3. దుష్టుడు చెడిపోవుట తథ్యము.
  4. మనిషికి చదువు ధనంతో సమానం.
  5. దుష్టుడు మంచి మార్గంలో సంచరించడు.
  6. హారాలు, ధనం ఎప్పటికైనా పోయేవే.
  7. దుష్టుడు చంచల స్వభావం కలవాడు.
  8. ధనం, బలం ఉన్నవాడికి గర్వం వస్తుంది.

V. సృజనాత్మకత

* పాఠశాలలో పిల్లలకు ‘పద్యాలతోరణం’ అనే పోటీ పెట్టారు. ఈ పోటీలో పిల్లలందరూ పాల్గొనాలని తెలియజేయడానికి ప్రకటన రాయండి. ప్రకటనలో నిర్వహించే తేదీ, స్థలం, సమయం మొదలగు వివరాలు ఉండాలి.
జవాబు:

ప్రకటన

విజయవాడ నగరంలోని ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులందరకూ ఒక శుభవార్త. దివి. xxxxxవ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సత్యనారాయణపురం, మహాత్మాగాంధీ మునిసిపల్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో ‘పద్యాలతోరణం’ పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో నగరంలోని విద్యార్థినీ విద్యార్థులందరూ పాల్గొనవచ్చు. తెలుగు పద్యాలు మాత్రమే చదవాలి. విజేతలకు ‘ఆంధ్ర మహాభారతం’ పూర్తి సెట్ బహుమతిగా ఇవ్వబడుతుంది. పాల్గొనే బాలబాలికలు తాము ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నట్లు తమ ప్రధానోపాధ్యాయుల నుండి ధృవీకరణ పత్రం దాఖలు చేయాలి. పోటీలో పాల్గొనేందుకు రుసుము లేదు. పోటీ నియమాలు గంట ముందు తెలుపుతారు.

ఇట్లు,
రసభారతి కళాపీఠం, విజయవాడ.

x x x x x,
విజయవాడ.

VI. ప్రశంస

* పాఠంలోని పద్యాలలో మీ మనసుకు హత్తుకున్న పద్యాలను గురించి, మీ మిత్రులతో చర్చించండి. మీరు చర్చించిన విషయాలు పది వాక్యాల్లో రాయండి.
జవాబు:
నేను, నా మిత్రులతో నేను చదివిన పద్యాలలో నుంచి కొన్నింటిని గూర్చి చర్చించాను. నాకు ‘చదువది ఎంత గలిగిన ….’ అనే పద్యంలోని విషయాలు, నీతి బాగా నచ్చాయని చెప్పాను. అలాగే ‘క్షమను కడఁక …..’ అనే పద్య సారము కూడా నాకు బాగా నచ్చిందని చెప్పాను. నా మిత్రుడు సాయి తనకు ‘ఊరూరం జనులెల్ల ….’ అనే పద్యం, దాని భావం బాగా నచ్చిందని చెప్పాడు. ఇంకొక మిత్రుడు ‘వనకరి చిక్కె ….’ అను పద్యసారం, ‘చదువు జీర్ణమైన …’ అను పద్యసారం బాగా నచ్చాయని చెప్పాడు. మేము ముగ్గురము ఈ పద్యాలలోని సారాన్ని, నీతిని ఎప్పటికీ మరువకుండా పాటించాలని నిర్ణయించుకున్నాము.

నాకు నచ్చిన పద్యములో చదువుకున్న విషయంలో ‘చదువది యెంతగల్గిన’ పద్యం ఎందుకు నచ్చిందంటే కవి చదువుకు వున్న ప్రాధాన్యతను చక్కగా చెప్పారు.

నా స్నేహితుడు సాయి తనకు ఊరూరం జనులెల్ల పద్యంలో కవి చెప్పిన నీతివాక్యాలు బాగా నచ్చాయని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తీర్చడానికి భగవంతుడు ఉన్నాడని చెప్పిన మాటలు బాగా నచ్చాయని చెప్పాడు.

ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క పద్యాన్ని గురించి వివరంగా ‘చర్చించుకున్నాము.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

(లేదా)

* చక్కని నీతులు చెప్పిన శతకకవుల గొప్పతనాన్ని వర్ణిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
‘శతకం’ అంటే నూరు పద్యాల చిన్న గ్రంథం. శతక పద్యాలకు సామాన్యంగా చివర మకుటం ఉంటుంది. శతకాలలో సుమతీ శతకం, వేమన శతకం, భాస్కర శతకం, దాశరథీ శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, కృష్ణ శతకం మొదలయిన శతకాలున్నాయి.

శతకకవులు నీతిని, భక్తిని, వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ గొప్ప శతకాలు రాశారు. వేమన శతకం, సుమతీ శతకాలలోని పద్యాలు రాని, తెలుగువాడుండడు. వేమన చెప్పిన “గంగిగోవుపాలు”, ‘ఉప్పు కప్పురంబు’, “తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు”, “నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు” వంటి పద్యాలు, గొప్ప జ్ఞానాన్ని బోధిస్తాయి. ఇక సుమతీ శతకకారుడు బద్దెన చెప్పిన ‘కనకపు సింహాసనమున’, “తన కోపమె తన శత్రువు”, “ఎప్పుడు సంపద కలిగిన”, “వినదగు నెవ్వరు సెప్పిన” మొదలైన కంద పద్యాలు, జీవితం అంతా గుర్తుంచుకోదగినవి. కృష్ణ శతకం, దాశరథీ శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం భక్తిని ప్రబోధించి వైరాగ్యాన్ని కల్గిస్తాయి. శేషప్పకవి రచించిన నరసింహ శతకం కూడా భక్తినీ, నీతిని బోధిస్తుంది. కుమార కుమారీ శతకాలు బాలబాలికలకు చక్కని నీతులనూ, ధర్మాలనూ, కర్తవ్యాన్ని బోధిస్తాయి. ఏనుగు లక్ష్మణకవి భర్తృహరి సుభాషితాలను అనువదించి, మూడు గొప్ప శతకాలను తెలుగువారికి అందించాడు.

మన తెలుగు శతకకర్తలు మన తెలుగువారికీ తెలుగుభాషకూ మహోన్నతమైన సేవచేసి ధన్యులయ్యారు.

ప్రాజెక్టు పని

* శతకపద్యాలలో చెప్పిన నీతులకు సరిపోయే కథలను సేకరించి, వాటికి నీతిపద్యాలను జోడించి ఆల్బమ్ తయారుచేయండి.
జవాబు:
ఉదా :
(నీతిపద్యాలు – కథలు)
1. సీ. దుష్టు సూర్యుని దెస దుమ్మెత్తి జల్లినఁ
దనపైనె పడుఁగాక దానికేమి
కొండతోఁ దగరు ఢీకొని యెంత తాఁకినఁ
దల ప్రక్కలగుఁగాక దాని కేమి
మిడతలు చిచ్చుపై వడి నెంతయెగసినఁ
దామె పొక్కెడుఁ గాక దానికేమి
వలఁ బడ్డ మీ నెంత వడి దాఁక బొరలిన
దనుఁజుట్టు కొనుఁగాక దానికేమి

తే.గీ. యెదిరి సత్త్వంబు తన సత్త్వమెఱుఁగలేక
పోరువాఁడెందున వివేకబుద్ధి యండ్రు
కలిత లక్ష్మీశ, సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ ! (వేంకటేశ శతకం)

2. బలవంతులకు గుణపాఠం

అనగనగా ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో చాలా చీమలు నివసిస్తూ ఉండేవి. వాటిల్లో కొన్ని చీమలు కలిసి పెద్ద పుట్టను నిర్మించుకున్నాయి. అందులోనే జీవించసాగాయి. కొన్నాళ్ళకు ఆ పుట్టలో పెద్దపాము ప్రవేశించింది. దానితో చీమలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చీమలు కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుని ఆ పుట్టలో దాచి పెట్టుకున్నాయి. అదంతా ఆ పామువలన పాడైపోతున్నది. తనకు బలం ఉన్నది గదా ! అని పాము గర్వంతో ప్రవర్తిస్తున్నది.

చీమలు ఆలోచించాయి. “తాము కలిసికట్టుగా దాడిచేస్తే పాము ఏమీ చేయలేదు” అని అనుకున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న తమతోటి చీమలకు తమ బాధను తెలుపుకున్నాయి. దానితో అవి అన్నీ కలసి వచ్చాయి. పెద్ద దండు తయారయ్యింది. అదను చూసి అన్నీ కలిసి పాము మీద దాడి చేశాయి. చీమల గుంపులో పాము కూరుకుపోయింది. ఏమీ చేయలేని నిస్సహాయురాలయ్యింది పాము. ఊపిరాడక కొంత సేపటికి ప్రాణాలు కోల్పోయింది. చీమలకు పాము పీడ విరగడయ్యింది.

నీతి : బలహీనులు అందరూ కలిస్తే బలవంతుల గర్వం అణగక తప్పదు.

VII. భాషను గురించి తెలుసుకుందాం!

1) కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
అ) చాలకున్న = చాలక + ఉన్న – (అ + ఉ) – (ఉత్వసంధి)
ఆ) అదేమిటి = అది + ఏమిటి – (ఇ + ఏ) – (ఇత్వసంధి)
ఇ) వెళ్ళాలని = వెళ్ళాలి + అని – (ఇ + అ) – (ఇత్వసంధి)
ఈ) ఒకింత = ఒక + ఇంత -(అ + ఇ) – (అత్వసంధి)

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2) కింది పదాలు చదవండి. పదంలోని చివరి అక్షరం కింద గీత గీయండి.
పూచెను, వచ్చెను, తినెను, చూచెన్, ఉండెన్

పై పదాలను గమనిస్తే, పదాల చివర ‘ను’, ‘న్’లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉన్నది.

ఈ ‘న’ కారాన్ని ద్రుతం అంటారు. ఈ చివరన ‘న’ కారం గల పదాలను ద్రుతప్రకృతికాలు అంటారు. పూచేను, వచ్చెను, చూచెన్ మొదలైనవి ద్రుతప్రకృతికాలే.

మరికొన్ని ద్రుతప్రకృతికాలను రాయండి.
కాచెను, వ్రాసెను, తినెను, త్రాగెన్, చదివెన్ మొదలగునవి.

3) కింది వాటిని గమనించండి.
ఉదా :
అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు

అభ్యాసం :
పైన తెల్పిన ఉదాహరణల్లాగా కింది వాటిని వివరించండి.
1) చేసెను + తల్లీ : చేసెను + దల్లీ
2) దెసను + చూసి = దెసను + జూసి

గమనిక :
మొదటి ఉదాహరణలో ద్రుత ప్రకృతికానికి ‘క’ పరమైతే, దానికి ఆదేశం (దాని స్థానంలో) ‘గ’ వచ్చింది.

రెండవ ఉదాహరణలో ద్రుత ప్రకృతికానికి ‘చూ’ పరమైతే దానికి ఆదేశంగా ‘జూ’ వచ్చింది. అలాగే ‘ట’ కు ‘డ’, ‘క’ కు ‘గ’, ‘చ’ కు ‘జ’ ఆదేశంగా వచ్చా యి.
అంటే
‘క’ కు – గ ; ‘చ’ కు + జ ; ‘ట’ కు – డ;

గమనిక :
1) ‘క, చ, ట, త, ప’ లకు ‘పరుషాలు’ అని పేరు.
2) ‘గ, జ, డ, ద, బ, లకు ‘సరళాలు ‘ అని పేరు.
పై ఉదాహరణలలోని భావాన్ని బట్టి సూత్రీకరిస్తే, ద్రుత ప్రకృతిక సంధి లేక సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉండాలి.

1. సూత్రం :
ద్రుత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి.
గమనిక :
కింది ఉదాహరణలు చూడండి.

పూచెఁగలువలు – ద్రుతం అరసున్న (C) గా మారింది.
ఉదా :
పూచెను + కలువలు
1) పూచెంగలువలు – ద్రుతం పూర్ణబిందువుగా (0) గా మారింది.
2) పూచెన్గలువలు – ద్రుతం సంశ్లేషగా మారింది అంటే ద్రుతం మీది హల్లుతో కలిసింది.
3) పూచెనుగలువలు – ద్రుతం ఏ మార్పూ చెందకుండా ఉంది.

పై ఉదాహరణల ఆధారంగా, ద్రుత ప్రకృతిక సంధి జరిగిన తీరును సూత్రీకరిస్తే ఇలా ఉంటుంది.

2. సూత్రం :
ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. అనగా ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.

ఛందస్సు :

1) ఒకే అక్షర గణాలు :
ఒకే అక్షరం గణంగా ఏర్పడితే అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.

2) రెండు అక్షరాల గణాలు :
రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువు, లఘువులుంటాయి. ఇవి నాలుగు రకాలు
అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అని అంటారు.

ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిసి గణంగా ఏర్పడితే, అది ‘లగం’ లేదా ‘వ’ గణం అని అంటారు.

ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.

ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.

అభ్యాసం :
రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.

3) మూడు అక్షరాల గణాలు :
మూడేసి అక్షరాలు గల గణాలు ఎనిమిది. పట్టికలో చూడండి, మరికొన్ని పదాలు రాయండి.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

కరి : ఏనుగు, హస్తి, గజము, ఇభము
భూరి : బంగారం, హేమం, సువర్ణం
మిత్రుడు : స్నేహితుడు, సఖుడు, చెలికాడు
పుష్పము : పూవు, సుమము, కుసుమము
ధనము : సంపద, ఐశ్వర్యము, డబ్బు
కొండ : అద్రి, పర్వతం, నగము
భాస్కరుడు : రవి, సూర్యుడు, ప్రభాకరుడు
మర్త్యుడు : మానవుడు, నరుడు
వాణి : వాక్కు మాట
జలము : నీరు, వారి, ఉదకము
లక్ష్మి : శ్రీ, రమ, కమలాలయ

వ్యుత్పత్యర్థాలు

కేశము – శిరస్సున ఉండేది. (వెంట్రుక)
ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
భాస్కరుడు – కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
కరి – తొండము గలది (ఏనుగు)
దాశరథి – దశరథుని కుమారుడు (శ్రీరాముడు)
మిత్రుడు – సర్వప్రాణులందు సమభావన కలవాడు (సూర్యుడు)
మర్త్యుడు – మరమున (భూ లోకమున) పుట్టినవాడు (నరుడు)

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

నానార్థాలు

ఎద = హృదయం, భయం
ఫలము = పండు, ప్రయోజనం
గుణము = స్వభావము, అల్లెత్రాడు
అమృతం = పాలు, నీరు, సుధ
మిత్రుడు = సూర్యుడు, స్నేహితుడు
సుధ = అమృతం, పాలు, నీరు
చీరము = వస్త్రము, గోచి, రేఖ
రాజు = ప్రభువు, చంద్రుడు
శ్రీ = సంపద, లక్ష్మి, సాలెపురుగు
సత్త్వము = బలము, సామర్థ్యము, శక్యము
ఇనుడు = సూర్యుడు, ప్రభువు, పోషకుడు
కోటి = సమూహం, వందలక్షలు, అగ్రభాగం
చవి = రుచి, సౌఖ్యము, దీవి

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.
భూరిమయాంగద = భూరిమయ + అంగద – సవర్ణదీర్ఘ సంధి
లక్ష్మీశ = లక్ష్మి + ఈశ – సవర్ణదీర్ఘ సంధి
జలాభిషేకం = జల + అభిషేకం – సవర్ణదీర్ఘ సంధి
శీతామృత = శీత + అమృత – సవర్ణదీర్ఘ సంధి
కాళహస్తిశ్వర = కాళహస్తి + ఈశ్వర – సవర్ణదీర్ఘ సంధి
చీరానీకం = చీర + నీకం – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును.
వేంకటేశ = వేంకట + ఈశ – గుణసంధి
వీధులందు = వీధులు + అందు -గుణసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి.
సంయుతులెవ్వరు = సంయుతులు + ఎవ్వరు – ఉత్వసంధి
భారమైన = భారము + ఐన – ఉత్వసంధి
జనులెల్ల = జనులు + ఎల్ల – ఉత్వసంధి

సరళాదేశ సంధి
సూత్రం :1) ద్రుతప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందుసంశ్లేషలు విభాషనగు.
తనఁజుట్టు = తనన్ + చుట్టు – సరళాదేశ సంధి
కీర్తిఁగోరు = కీర్తిన్ + గోరు – సరళాదేశ సంధి

ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.
ఊరూర = ఊరు + ఊరు – ఆమ్రేడిత సంధి

అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
చాలకున్న = చాలక + ఉన్న – అత్వసంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
ఘనగుణము ఘనమైన గుణము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పవిత్రవాణి పవిత్రమైన వాణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సుభూషణము మంచిదైన భూషణము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సర్వ కార్యములు సమస్తములైన కార్యములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మంచికూర మంచిదైన కూర విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మృదు పుష్పము మృదువైన పుష్పము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
లోకహితం లోకము కొరకు హితం చతుర్థి తత్పురుష సమాసం
గుణసంయుతుడు గుణములతో సంయుతుడు తృతీయా తత్పురుష సమాసం
జలాభిషేకము జలముతో అభిషేకము తృతీయా తత్పురుష సమాసం
లక్ష్మిశ లక్ష్మికి ఈశుడు షష్ఠీ తత్పురుష సమాసం
సహస్ర ముఖములు సహస్ర సంఖ్యగల ముఖములు ద్విగు సమాసం
వాగ్భూషణము వాక్కు అనెడి భూషణము రూపక సమాసం
కేశపాశము కేశముల యొక్క పాశము షష్ఠీ తత్పురుష సమాసం
నలపాకము నలుని యొక్క పాకము షష్ఠీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

పుష్పం – పూవు
కార్యం – కర్జం
శ్రీ – సిరి
లక్ష్మి – లచ్చి
రాజు – రాట్టు
కార్యం – కర్జము
గుణము – గొనము
చరిత్ర – చరిత
గౌరవం – గారవం
ముఖం – మొగము
వీధి – వీది
కీర్తి – కీరితి

శతక కవుల పరిచయం

కవుల పేర్లు కాలం శతకం
మారద వెంకయ్య 17వ శతాబ్ది భాస్కర శతకం
మూలం – భర్తృహరి 7వ శతాబ్ది సుభాషిత త్రిశతి
అనువాదం-ఏనుగు లక్ష్మణకవి 18వ శతాబ్ది సుభాషిత రత్నావళి
కంచర్ల గోపన్న (రామదాసు) 17వ శతాబ్ది దాశరథీ శతకం
మూలం – నీలకంఠ దీక్షితులు 17వ శతాబ్ది సభారంజన శతకం
అనువాదం -ఏలూరిపాటి అనంతరామయ్య 20వ శతాబ్ది
ధూర్జటి 16వ శతాబ్ది శ్రీకాళహస్తీశ్వర శతకం
తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు 16వ శతాబ్ది వేంకటేశ శతకం
కొండూరు వీర రాఘవాచార్యులు 20వ శతాబ్ది మిత్ర సాహఠి

పద్యాలు – ప్రతి పదార్థాలు – భావాలు

1వ పద్యము (కంఠస్థ పద్యం)

*చ. తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తిఁ గోరు నా
ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను శేషుఁడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవఁడే మణి మహాభరమైన ధరిత్రి భాస్కరా !
(భాస్కర శతకం)
ప్రతిపదార్థాలు:
భాస్క రా = సూర్య భగవానుడా !
కీర్తిన్ = యశమును
కోరు = అపేక్షించునట్టి
ఆ ఘనగుణశాలి = ఆ గొప్ప గుణములచే ఒప్పువాడు
తనకున్ = తనకు
ఫలంబు = లాభము
లేదు + అని = లేదని
ఎదన్ = మనస్సులో
తలపోయడు = ఆలోచింపడు
లోకహిత కార్యము; లోక = లోకమునకు
హిత = మేలయిన
కార్యము = పని
మిక్కిలి భారము + ఐనన్ = చాలా కష్టమైనా
మేలు = మంచిది అని
అనుకొని = భావించి
పూనున్ = ప్రయత్నిస్తాడు
శేషుడు = ఆదిశేషుడు
సహస్రముఖంబులన్ = (తన) వేయినోళ్ళతోనూ
గాలి = గాలిని
క్రోలి = పీల్చి (మేసి)
తాన్ = తాను
మహాభరము = మిక్కిలి బరువు
ఐన = అయిన
ధరిత్రిన్ = భూమిని
అనిశమున్ = ఎల్ల కాలమును
మోవడే (మోవడు + ఏ) : మోయడం లేదా ! (మోస్తున్నాడు)

భావం :
భాస్కరా ! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని, మనోజ్ఞతను గ్రహించే శక్తి లేనప్పుడు ఆ చదువు వ్యర్ధము. దాన్ని గుణవంతులు ఎవరూ మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి నలపాకంగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా !

నీతి : గుణవంతుడు ఎపుడూ లోకానికి మేలు జరిగే పనులు చేస్తాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2వ పద్యము – (కంఠస్థ పద్యం)

*చ. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం
బదనుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టఁగ నేర్చునటయ్య భాస్కరా!
(భాస్కర శతకం)
ప్రతిపదార్థాలు:
భాస్కరా = ఓ సూర్య భగవానుడా !
చదువు = చదువు
అది = అది
ఎంత కల్గినన్ = ఎంత ఉన్నప్పటికీ
రసజ్ఞత = అందులోని సారాన్నీ, మనోజ్ఞతనూ గ్రహించే నేర్పు
ఇంచుక = కొంచెము
చాలకున్నన్ (చాలక + ఉన్నన్) : లేకపోతే
ఆ చదువు = ఆ పాండిత్యము
నిరర్ధకంబు = పనికిమాలినది అవుతుంది
ఎచ్చటన్ = ఎక్కడైనా
గుణసంయుతులు = మంచి గుణములు గలవారు
ఎవ్వరు = ఎవరూ
మెచ్చరు = ఆ చదువును మెచ్చుకోరు
(ఎట్లన) = (అదెలా గంటే)
మంచికూరన్ = మంచి కూరను
నలపాకము = నల చక్రవర్తి చేసే పాకము వంటి పాకమును
చేసినన్ = చేసినప్పటికీ
అందున్ = ఆ కూరలో
ఇంపు + ఒదవెడు = చక్కని రుచిని పుట్టించే
ఉప్పు లేక = ఉప్పు లేకపోతే
రుచి = (ఆ కూరకు) రుచి
పుట్టగన్ + నేర్చును + అటయ్య = కలుగుతుందా ? (కలుగదు)

భావం :
భాస్కరా ! కీర్తిని కోరే గుణవంతుడు తనకు ఎలాంటి లాభాలు కావాలని ఆశించడు. లోకానికి మేలు జరిగే పని ఎంత భారమైనా ఆ పనిని చేయడానికి పూనుకుంటాడు. సర్పరాజయిన ఆదిశేషుడు తన వేయి పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని ఎప్పుడూ మోస్తున్నాడు కదా !

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

3వ పద్యము (కంఠస్థ పద్యం)

*ఉ. భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితుఁ జేయుఁ బవిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించు నన్నియున్
(సుభాషిత రత్నావళి)
ప్రతిపదార్థాలు:
మర్త్యులకున్ = మానవులకు
భూరిమయాంగద తారహారముల్ ; భూరిమయ = బంగారు వికారమైన
అంగద = కేయూరములునూ
తారహారముల్ = ముత్యాల హారాలునూ
భూషలు + కావు = అలంకారములు కావు
భూషిత కేశపాశ ………. జలాభిషేకముల్; భూషిత = అలంకరింపబడిన
కేశపాశ = వెంట్రుకల సమూహమునూ
మృదుపుష్ప = మంచి పుష్పములునూ
సుగంధ, జల + అభిషేకముల్ సుగంధ జల = మంచి వాసనగల నీటితో (పన్నీటితో)
అభిషేకముల్ = స్నానములునూ
భూషలు + గావు = అలంకారములు కావు
పూరుషునిన్ = మనుష్యుని
పవిత్రవాణి = పవిత్రమైన వాక్కు
భూషితున్ + చేయున్ = అలంకరిస్తుంది
వాగ్భూషణమే ; వాక్ + భూషణము + ఏ= వాక్కు అనెడి అలంకారమే
సుభూషణము = మంచి అలంకారము
భూషణముల్ = మిగిలిన అలంకారములు
అన్నియున్ = అన్నీ
నశియించున్ = నశిస్తాయి.

భావం :
బంగారు ఆభరణాలు ధరించడం, కొప్పులో పువ్వులు పెట్టుకోవటం, సుగంధ ద్రవ్యాలను వాడటం, పన్నీరుతో స్నానాలు చేయటం మొదలైనవి మానవులకు నిజమైన అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటయే నిజమైన అలంకారం. మిగిలిన అలంకారాలు అన్నీ నశించిపోయేవే.

4వ పద్యము (కంఠస్థ పద్యం)

*చ. వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికికిఁజిక్కెఁజిల్వ గనువేదురుఁ జెందెను లేళ్ళు, తావినో
మనికి నశించెఁ దేటి, తరమా యిరుమూటిని గెల్వ వైదుసా
ధనముల నీవె గావఁదగు దాశరథీ కరుణాపయోనిధీ ! (దాశరథీ శతకం)
ప్రతిపదార్థాలు :
దాశరథీ = దశరథుని పుత్రుడవైన రామా!
కరుణాపయోనిధీ ! = కరుణకు సముద్రము వంటివాడా!
వనకరి = అడవి ఏనుగు
మైనసకున్ = శరీరపు దురదకు (దేహము నందలి చాపల్యమునకు)
చిక్కెన్ = చిక్కుపడింది
మీను = చేప
వాచవికిన్ = నోటివాపిరితనమునకు ; (నోటి రుచికి) గాలమునందు గుచ్చిన ఎఱ్ఱ రుచికి
బిల్వ = పాము
తాన్ = తాను
వినికికిన్ = వినడానికి (పాములవాడు ఊదే స్వరాన్ని వినడానికి)
చిక్కెన్ = చిక్కుపడుతుంది
లేళ్ళు = లేళ్ళు
కనువేదురున్ = కంటి పిచ్చిని
చెందున్ = పొందుతాయి (చక్షురింద్రియానికి లోనయి చిక్కువడుతాయి)
తేటి = తుమ్మెద
తావిలో = వాసనలో
మనికిన్ = ఉండడం చేత
నశించెన్ = నశించింది
ఇరుమూటిని = ఐదింటినీ (ఐదు ఇంద్రియాలనూ)
గెల్వన్ = జయించడానికి
తరమా = శక్యమా
ఐదు సాధనములన్ = పంచవిధములైన ఉపాయాల చేత
నీవె = నీవే
కావదగున్ = రక్షించాలి

భావం :
తన దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటి రుచిని ఆశించి చేప, రాగానికి లొంగి పాము, అందానికి బానిసయై జింక, పూల వాసనలకు మైమరచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణీ ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్లనే నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను ఎలా బయటపడగలను? ఓ రామా ! కరుణా సాగరా ! నీవే నన్ను కాపాడాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

5వ పద్యము – (కంఠస్థ పద్యం)

*ఆ.వె. క్షమను కడఁక నెవరు గాపాడుకొందులో
క్షమను చిరము వారు కావ గలరు
కదలకుండ నెవరికడ క్షమయుండునో
సర్వకార్యములకు క్షములు వారు
(సభారంజన శతకం)
ప్రతిపదార్థాలు :
ఎవరు = ఎవరు
కడకన్ = ప్రయత్నంతో
క్షమను = ఓర్పును (ఓరిమిని)
కాపాడుకుందురో = కాపాడుకుంటారో
వారు = వారు
క్షమను = భూమిని
చిరము = చాలాకాలము
కావగలరు = రక్షింపగలరు
కదలకుండ = నిశ్చలంగా
దుమ్ము = ధూళిని (దుమ్మును)
ఎత్తి = పైకి ఎత్తి
చల్లినన్ = చల్లితే
తనపైనే = తన మీదనే
పడుగాక = పడుతుంది కాని
దానికేమి = దానికిన్ + ఏమి = సూర్యునికి ఏమవుతుంది?
కొండతోన్ = కొండతో (పర్వతంతో)
తగరు = పొట్టేలు
ఢీకొని = ఎదుర్కొని
ఎంత తాకినన్ = ఎంతగా పోరాడినా
తల = పొట్టేలు తల
ప్రక్కలు + అగున్ + కాక = ముక్కలు ఔతుంది కాని
దానికిన్ + ఏమి = ఆ కొండకు ఏమవుతుంది? (ఏమీకాదు)
మిడతలు = ‘మిడతలు’ అనే ఎగిరే పురుగులు
చిచ్చుపై = నిప్పుపై
వడిన్ = వేగంగా
ఎంత + ఎగసినన్ = ఎంతగా ఎగిరినా (వ్యాపించినా)
తామె (తాము + ఎ) = తామే (మిడతవే మాడిపోతాయి)
పొక్కెడున్ + కాక = పరితపిస్తాయి కాని
దానికిన్ + ఏమి = ఆ నిప్పుకు ఏమి బాధ ఉంటుంది?
వలన్ + పడ్డ = వలలో చిక్కుపడిన
మీను = చేప
ఎంత వడిదాక = ఎంత సేపటి వరకు
పొరలిన = అటునిటూ దొర్లినా
చుట్టుకొనున్ + కాక = చుట్టుకుపోతుంది కాని
దానికేమి (దానికిన్ + ఏమి) : ఆవలకు ఏమౌతుంది? (ఏమీకాదు)
ఎదిరిసత్త్వంబు = ఎదుటి వాడి బలము
తన సత్త్వము = తన బలము
ఎఱుగలేక = తెలిసికోలేక
పోరువాడు = యుద్ధానికి దిగేవాడు
అవివేకబుద్ధి = వివేకములేని బుద్ధిగలవాడని
= అంటారు

భావం :
ఓ వేంకటేశ్వరా ! నీవు లక్ష్మీ సమేతుడవు. లోకమంతటా నిండియున్నవాడవు. కోటి సూర్యుల తేజస్సు కలవాడవు. లోకంలో ఎవరైనా దుర్మార్గుడై సూర్యుని మీద దుమ్మెత్తి పోస్తే అది వాడి మీదే పడుతుంది. కొండతో పొట్టేలు ఢీకొంటే దాని తలే బద్దలౌతుంది. మిడతల గుంపు మంటలపైకి ఎగిసిపడితే అవే మాడిపోతాయి. వలలో చిక్కుకున్న చేప ఎంత పొరలాడినా మరింతగా బందీ అవుతుంది. ఇలా ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగితే వాడిని అవివేకి అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

8వ పద్యము

ఆ.వె. చదువు జీర్ణమైన స్వాంతంబు పండును
తిండి జీర్ణమైన నిండు బలము
చెఱుపు గూర్చు రెండు జీర్ణముల్ గాకున్న
విశ్వహితచరిత్ర వినర మిత్ర -(మిత్ర సాహఠి)
ప్రతిపదార్థాలు :
మిత్ర = లోకక్షేమాన్ని కోరే మిత్రమా ! (స్నేహితుడా !)
విను = ఒక మాట విను
చదువు = చదువు
జీర్ణమైన (జీర్ణము + ఐన) = జీర్ణించుకుంటే (ఆకళింపు చేసుకుంటే)
స్వాంతంబు = మనస్సు
పండును = పరిపక్వము అవుతుంది
తిండి = తిన్న తిండి
జీర్ణమైన (జీర్ణము + ఐన)= జీర్ణించుకుంటే = తనను
బలము, నిండున్ = బలం, అతిశయిస్తుంది
జీర్ణముల్ + కాకున్నన్ = జీర్ణములు కాకపోతే (ఒంట బట్టకపోతే)
రెండు = చదివిన చదువు, తిన్న తిండి అనే రెండూ కూడా
చెఱుపు = కీడు
కూర్చున్ = కలిగిస్తాయి

భావం :
లోకక్షేమాన్ని కోరే మిత్రమా ! ఒక మాట విను. చదివిన చదువును జీర్ణించుకుంటే మనస్సు పరిపక్వమవుతుంది. తిన్న తిండి జీర్ణమైతే బలం కలుగుతుంది. ఆ రెండూ జీర్ణం కాకపోతే చెరుపు చేస్తాయి.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు

8th Class Telugu 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మొదటి చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం జరుగుతున్నది? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
ఇంట్లో తాతగారు, మనవరాలికి పుస్తకం చూసి, పాఠం చెబుతున్నారు. మనవడు తాతగారితో ఆడుకుంటున్నాడు. తాతగారి అబ్బాయి, తాతగారి కోడలికి ఇంటి పనులలో సాయం చేస్తున్నాడు. వాళ్ళు తమ ఇంటి విశేషాల గురించి మాట్లాడుతున్నారు.

ప్రశ్న 2.
రెండవ చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం జరుగుతున్నది? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
రెండవ చిత్రంలో ఇంటి యజమాని లోపలకు వచ్చే వేళకు, అతని భార్య సోఫాలో కూర్చుని, టి.వి. చూస్తోంది. వారి పిల్లవాడు కంప్యూటర్ లో ఆటలు ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడు పుస్తకాల సంచి ఒక ప్రక్కన పడవేశాడు. వాళ్ళు టి.వి.లో చూస్తున్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 3.
మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు?
జవాబు:
మా కుటుంబంలో నేను, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య ఉంటాము.

ప్రశ్న 4.
మీ ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది?
జవాబు:
మా ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంటి ముందు పూలమొక్కలు, ఆకుకూరలు, కూరగాయల మొక్కలు ఉన్నాయి. మా నాన్నగారు హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు. మా అమ్మగారు గృహిణి. నేను జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని. మా అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మా నాన్నగారు పొరుగూరు స్కూలుకు బండిమీద వెళ్ళాలి. మా అమ్మ మా అందరికీ వంట చేసి పెట్టాలి. నేనూ అన్నయ్యా ఇంటి పనులలో సహాయం చేస్తాము.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
కుటుంబం ఎలా ఉండాలి? మీ కుటుంబం గురించి చెప్పండి.
జవాబు:
“ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన సంబంధాలు ఉన్న స్త్రీ, పురుషులు, వారి పిల్లలూ ఉన్న ఈ సమూహాన్నే “కుటుంబం” అంటారు.

కుటుంబం ఒక హరివిల్లులా, అంటే ఇంద్రధనుస్సులా ఉండాలి. ఆ హరివిల్లులో తల్లి, తండ్రి, పిల్లలు, తాతయ్య నాన్నమ్మలు ఒక భాగం. అప్పుడు ఆనందం తాండవిస్తుంది. కుటుంబం అనే భావన తియ్యనిది. ఆ మాట గుర్తుకు రాగానే, ఏదో తియ్యని, తెలియని హాయి కలగాలి. తీపి జ్ఞాపకాలు గుర్తుకు రావాలి.

మా ఇంట్లో అమ్మా, నాన్న, నేనూ, మా అన్నయ్య కలిసి ఉంటాము.

ప్రశ్న 2.
మీకు తెలిసిన సమష్టి కుటుంబాన్ని గురించి మాట్లాడండి.
జవాబు:
మా చిన్న తాతగారు పల్లెటూళ్ళో ఉంటారు. వారి ఇంట్లో తాతగారు, మామ్మ, బాబాయి, పిన్ని ఉంటారు. మా బాబాయికి ఒక ఆడపిల్ల, ఒక అబ్బాయి ఉన్నారు. ఆడపిల్ల ఇంటరు చదువుతోంది. పిల్లవాడు 8వ తరగతి చదువుతున్నాడు.

వాళ్ళు ఆరుగురే కలిసి ఉంటారు. వారికి వ్యవసాయం ఉంది. పాడి పశువులు ఉన్నాయి. కొబ్బరి తోటలున్నాయి. – మా తాతగారు, బాబాయి పౌరోహిత్యం చేసి సంపాదిస్తారు. అందరూ కలిసి అన్ని పనులూ చేసుకుంటారు.

వారిది పెద్ద ఇల్లు, పెద్ద ఖాళీస్థలం. వారి ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలు పండిస్తారు. నాలుగు గేదెలను పెంచుతారు. కావలసిన పాలు వాడుకొని, మిగిలినవి అమ్ముతారు. వారి జీవితం ఆనందంగా సాగుతోంది.

ఒకరి అవసరానికి మరొకరు సంతోషంగా సాయపడతారు. వారిది చక్కని సమష్టి కుటుంబం.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 3.
కుటుంబంలో ‘మన’ అనే భావన లేకపోతే ఎలా ఉంటుంది?
జవాబు:
కుటుంబంలో ‘మన’ అనే భావన కుటుంబ సభ్యులందరికీ ఉండాలి. అప్పుడే అందరూ కలసిమెలసి, కుటుంబం అభివృద్ధికి పాటుపడతారు. అందరూ సంపాదిస్తారు. ఒకరి అవసరాలకు మరొకరు సాయపడతారు.

‘మన’ అనే భావన లేకపోతే సమష్టి కుటుంబం అనేది సక్రమంగా నడువదు. స్వార్థపరత్వం పెరుగుతుంది. పరస్పరం పోటీ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, తగవులు వస్తాయి. అప్పుడు అందరూ కలసిమెలసి ఉండలేరు. ఎవరిమట్టుకు వార్కి తమకు, తమ పిల్లలకు అనే భావనలు వస్తాయి.

II. చవదవడం, అవగాహన చేసుకోవడం

1. కింది పదాలను పాఠంలో గుర్తించండి. ఆ వాక్యాలను చదవండి. వాటి గురించి చెప్పండి.

ఆశ్రమధర్మాలు, గృహస్థాశ్రమం, జీవితపథం, గార్హస్య జీవితం, సమాజ స్థితిగతులు, సంఘీభావం, సమష్టి వ్యవస్థ, ఆర్థిక స్వాతంత్ర్యం, విశ్వసనీయత, సమగ్రత.
జవాబు:
ఆశ్రమధర్మాలు :
‘గృహస్థాశ్రమ ధర్మం ద్వారా ఇతర ఆశ్రమధర్మాలు సక్రమంగా కొనసాగుతాయి. ” ఆశ్రమాలు నాలుగు రకాలు –
1. బ్రహ్మచర్యాశ్రమం
2. గృహస్థాశ్రమం
3. వాసప్రస్థాశ్రమం
4. సన్యాసాశ్రమం

గృహస్థాశ్రమం :- “అంతేగాక, ఆనాటి సమాజంలో ఉన్న నాలుగు ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.”

గృహస్థాశ్రమం అంటే పెళ్ళి చేసుకొని భార్యాబిడ్డలతో సంసారం చేసుకుంటూ, సుఖంగా జీవించే కాలం.

జీవితపథం :
“ఈ విధమైన జీవన విధానం వల్ల జీవితపథ నిర్దేశం జరిగేది”

జీవితపథం అంటే జీవనమార్గం. అంటే ఎలా జీవించాలో తెలిపే పూర్గం. పెద్దలను చూసి వారిలాగే పిల్లలు జీవించే పద్ధతి.

గార్హస్య జీవితం :
“అందుకే ‘గార్హస్థ జీవితం’ అతిసుందరమని వారి భావన.”

గార్హస్య జీవితం అంటే, పెళ్ళి చేసుకొని పిల్లలతో సుఖంగా జీవించడం. అతిథులకు, అభ్యాగతులకు కావలసిన సదుపాయాలు చేయడం, తల్లిదండ్రులను సేవించుకుంటూ దైవారాధన చేయడం.

సమాజ స్థితిగతులు :
“సమాజ స్థితిగతులనూ, ఆచారవ్యవహారాలనూ, సంస్కృతి సంప్రదాయాలనూ పిల్లలు ప్రత్యక్షంగా విని ఆకళింపు చేసుకోనేవారు.”

సమాజ స్థితిగతులు అంటే, సంఘంలోని నేటి పరిస్థితులు, మంచి చెడ్డలు.

సంఘీభావం :
“ఈ సంఘీభావమే, దేశానికి వెన్నెముక అయ్యింది. ”

సంఘీభావం అంటే సంఘంలో ఉండే ప్రజలంతా ఏకమై తామంతా ఒకటే అన్న భావం. కలిసిమెలసి కష్టసుఖాలు పంచుకోవడం.

సమష్టి వ్యవస్థ :
“మన ఇతిహాసాలైన రామాయణ భారతాలు ఈ సమష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి.”

‘సమష్టివ్యవస్థ’ అంటే కలసిమెలసి జీవించడం. – రామాయణంలో రాముని సోదరులు, లక్ష్మణభరతశత్రుఘ్నులు రామునితోనే కలసి ఉన్నారు. అలాగే పాండవులూ, కౌరవులూ సోదరులంతా సమష్టి కుటుంబంగానే జీవించారు.

ఆర్థిక స్వాతంత్ర్యం :
“ఉమ్మడి కుటుంబం, వ్యష్టి కుటుంబాల మేలు కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛలకు భంగం కలగకుండా … ఒక కొత్త కుటుంబవ్యవస్థ రూపుదిద్దుకోవాలి.”

‘ఆర్థిక స్వాతంత్ర్యం’ అంటే డబ్బును స్వేచ్ఛగా వాడుకొనే హక్కు కలిగియుండడం, తనకు కావలసిన ధనాన్ని తాను ఇతరులను అడగకుండానే ఖర్చు పెట్టుకోగలగడం.

విశ్వసనీయత :
“విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది.”

‘విశ్వసనీయత’ అంటే ఒకరిపై మరొకరికి నమ్మకం. కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం చాలా ముఖ్యం. కుటుంబం చక్కగా నడవడానికి కావలసిన వాటిలో విశ్వసనీయత ఒకటి.

సమగ్రత :
“విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూల స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది.”

‘సమగ్రత’ అంటే ‘సంపూర్ణత’ – సమష్టి కుటుంబానికి కావలసిన మూడింటిలో ‘సమగ్రత’ ఒకటి.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. పాఠం చదివి సరైన సమాధానాలను గుర్తించండి.
1) ఇల్లు అంటే ఇలా ఉండాలి.
అ) అందమైన భవనం
ఆ) అంతస్తుల భవనం
ఇ) ప్రేమానురాగాల నిలయం
ఈ) ఇవేవీ లేనిది
జవాబు:
ఇ) ప్రేమానురాగాల నిలయం

2) వేదకాలం అంటే
అ) రామాయణ భారతాల తరువాతికాలం
ఆ) రామాయణ భారతాల మధ్యకాలం
ఇ) రామాయణ భారతాల ముందుకాలం
ఈ) కలియుగ కాలం
జవాబు:
ఆ) రామాయణ భారతాల మధ్యకాలం

3) ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఉండాల్సింది.
అ) భార్యాభర్తలకు సమప్రాధాన్యం
ఆ) భార్యకే ఎక్కువ ప్రాధాన్యం
ఇ) భర్తకే ఎక్కువ ప్రాధాన్యం
ఈ) పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యం
జవాబు:
అ) భార్యాభర్తలకు సమప్రాధాన్యం

4) సంస్కృతి సంప్రదాయాలు ఎలా అలవడతాయి?
అ) కుటుంబం ద్వారా
ఆ) సమాజం ద్వారా
ఇ) పాఠశాల ద్వారా
ఈ) వీటన్నిటి ద్వారా
జవాబు:
అ) కుటుంబం ద్వారా

5) “అందరి సుఖంలో నా సుఖం ఉంది” దీనిలో ఏ భావన ఉంది?
అ) స్వార్థ భావన
ఆ) నిస్స్వా ర్థ భావన
ఇ) విశాల భావన
ఈ) సంకుచిత భావన
జవాబు:
ఆ) నిస్స్వా ర్థ భావన

3. కింది ప్రశ్నలకు పాఠం చదివి జవాబులు రాయండి.

అ) కుటుంబమంటే ఏమిటి?
జవాబు:
ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన ‘ సంబంధాలు ఉన్న స్త్రీ, పురుషులు, వారి పిల్లలూ ఉన్న ఈ సమూహాన్నే “కుటుంబం” అంటారు.

కుటుంబం అనేది ఒక హరివిల్లు. ఆ హరివిల్లులో అమ్మానాన్నలు, పిల్లలతో పాటు తాతయ్య నానమ్మలు ఒక భాగం. అలాంటి కుటుంబం అందంగా ఉండి ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఇల్లే ఇలలో స్వర్గం అవుతుంది. సమాజానికి కుటుంబం వెన్నెముక వంటిది.

ఆ) భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చారు? ఎందుకు?
జవాబు:
కుటుంబంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైనది. గౌరవప్రదమైనది. అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. “ఇంటికి దీపం ఇల్లాలు” అనే నానుడిని బట్టి భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చారు.

పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణ, సంతానాన్ని కనడం, గృహస్థాశ్రమ నిర్వహణ అనే వాటిలో స్త్రీకే ప్రాధాన్యం. అందువల్లే మన సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఇచ్చారు.

ఇ) వృష్టి కుటుంబం అంటే ఏమిటి? ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి?
జవాబు:
‘వ్యష్టి కుటుంబం’ అంటే భార్యాభర్తలూ, పిల్లలు మాత్రమే ఉన్న చిన్న కుటుంబం. ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటి పైనే, ‘వ్యష్టి కుటుంబం’ ఆధారపడి వుంటుంది. వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయించుకొనే అధికారం లభిస్తాయి.

ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకూ, ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడంవల్ల, స్వార్థం పెరిగిపోవడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. చిన్న కుటుంబం అనే భావం బలపడింది. అందువల్లనే వ్యష్టి కుటుంబాలు ఏర్పడుతున్నాయి.

ఈ) కుటుంబ వ్యవస్థకు మూల స్తంభాలేమిటి?
జవాబు:
1) విశ్వసనీయత 2) సమగ్రత 3) ఏకత అనే మూడు మూల స్తంభాల మీదనే మన కుటుంబవ్యవస్థ ఆధారపడి ఉంది. ‘అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారి కోసమే మన జీవితం’ అనే త్యాగ భావన, భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.

ఉ) తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సిందేమిటి?
జవాబు:
తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా పిల్లల సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా, ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, పరోపకారం వంటి గుణాలు ఇవ్వాలి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక” అనడానికి కారణాలు రాయండి.
జవాబు:
దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక. మంచి కుటుంబం, మంచి సమాజం నుంచి మంచి దేశం ఏర్పడుతుంది. దేశం అంటే చక్కని కుటుంబాల సమాహారమే. కుటుంబాలు అన్నీ చక్కగా సిరిసంపదలతో ఉంటే, దేశం బాగా ఉన్నట్లే. కుటుంబ వ్యవస్థ వల్లే, దేశీయ జీవన సంస్కృతులు నిలుస్తున్నాయి. కాబట్టి దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక.

ఆ) “అసలు కంటే వడ్డీయే ముద్దు” ఈ సామెతను పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
ఉమ్మడి కుటుంబాలలో ఎప్పుడూ ఒకరి కష్టాలను ఒకరు పంచుకోవటం జరుగుతుంది. శుభకార్యాలకు ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా ఉంటారు. అందరూ పెద్దవారి పట్ల భయభక్తులతో ఉంటారు. పిల్లలు ఏదైనా అల్లరి చేసినపుడు తల్లిదండ్రులు మందలించిన వెంటనే వారు తమ అమ్మమ్మ, నాయనమ్మల చెంత చేరతారు. వారు పిల్లలను ప్రేమతో దగ్గరకు తీసుకొని ముద్దాడతారు.

అందుకే “అసలు కంటె వడ్డీ ముద్దు” అనే సామెత పుట్టింది. అసలు అంటే తమకు పుట్టిన పిల్లలు, వడ్డీ అంటే తమ పిల్లలకు పుట్టిన పిల్లలన్నమాట. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కూడా, ఎక్కువ వడ్డీ ఇచ్చేవాళ్ళకే అప్పునిస్తారు. వాళ్ళకు అసలు కంటే వడ్డీయే ముద్దు ” తాము ఇచ్చిన అసలు అప్పు తీసుకున్నవాడు తీర్చగలడా? లేదా? అని కూడా చూడకుండా, వడ్డీపై ప్రేమతో వడ్డీ ఎక్కువ ఇస్తానన్నవాడికే వాళ్ళు అప్పు ఇస్తారు. అలాగే కుటుంబంలో పెద్దలు, కన్న పిల్లల కంటె, మనవల్నే ఎక్కువగా లాలిస్తారు అని భావం.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ఇ) ‘కలిసి ఉంటే కలదు సుఖం’ దీన్ని వివరించండి.
జవాబు:
ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం చిన్న కుటుంబాలలో ఉండదు. చిన్న కుటుంబంలో సభ్యులందరూ సంతోషాలను, బాధలను ఒకరివి ఒకరు పరస్పరం పంచుకోలేరు. కుటుంబం అనే హరివిల్లులో అమ్మా నాన్నలు, పిల్లలతోపాటు తాతయ్య, నాన్నమ్మ కూడా కలిసి ఉంటే ఆనందం వెల్లివిరుస్తుంది. కలిసి ఉంటే పిల్లలకు మన సమాజ స్థితిగతులు, ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. వారు కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థనే కోరుకుంటారు. కలసిమెలసి తిరిగినపుడే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోగలరు. అలాగే ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా, సందడిగా ఉంటుంది. మన అనే బంధం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు సంఘీభావంతో మెలుగుతారు. స్వార్థపరతకు తావు తక్కువగా ఉంటుంది. సత్ సాంప్రదాయాలు, కుటుంబపరమైన వారసత్వ భావనలు తరువాతి తరం వారికి అందుతాయి.

ఈ) యాంత్రిక జీవనం అంటే ఏమిటి?
జవాబు:
‘యాంత్రిక జీవనం’ అంటే మన జీవన విధానంలో మనం నిత్యం చేసుకొనే పనులకు యంత్రాలను ఉపయోగించడం. ఇప్పుడు వ్యష్టి కుటుంబ పద్దతిలో తమ పనులు తామొక్కరే పూర్తి చేసుకోలేకపోతున్నారు. అందువల్ల యంత్రశక్తి వినియోగం రోజు రోజుకీ పెరుగుతోంది.

నేడు బట్టలు నేయడం, నూనెలు తీయడం వంటివి లేవు. బట్టలు ఉతకటానికి, పిండి రుబ్బటానికి, నగల తయారీకి, నీళ్ళు తోడడానికి, పొలం దున్నటానికి, చెప్పులు కుట్టడానికి, గిన్నెలు కడగటానికి, కడిగిన చేతులు ఆరటానికి కూడా యంత్రశక్తినే వాడుతున్నారు. యంత్రశక్తి వాడటం వల్ల మనిషి బద్ధకస్తుడౌతున్నాడు. చలాకీతనాన్ని పోగొట్టుకొని రోగాలపాలు అవుతున్నాడు. ఈ యాంత్రిక జీవన విధానం వల్ల అందాలు, ఆనందాలు హరించిపోతున్నాయి.

ఉ) పిల్లలు సమాజంలో నిలదొక్కుకోవడానికి కుటుంబ నేపథ్యం ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
మంచి కుటుంబంలో పెరిగిన పిల్లలు, తల్లిదండ్రుల నుండి క్రమశిక్షణ, ఇంట్లో పెద్దల నుండి ప్రేమానురాగాలు, నీతి, చక్కని నడవడి నేర్చుకుంటారు. వారు చక్కగా చదువుకొని, బాధ్యతతో పెరిగి పెద్దవారవుతారు. దేశ పౌరులుగా తమ తల్లిదండ్రుల పట్ల, దేశంపట్ల, సంఘం పట్ల, మంచి బాధ్యతతో క్రమశిక్షణ గలిగి, దేశభక్తితో నడచుకుంటారు. దేశపౌరులుగా తమ విధులను నెరవేరుస్తారు. ఈ విధంగా పిల్లలు సమాజంలో నిలదొక్కుకోవడానికి కుటుంబ నేపథ్యం ఉపయోగపడుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) సమష్టి కుటుంబానికీ, వ్యష్టి కుటుంబానికీ మధ్య వ్యత్యాసమేమిటి? దాని పరిణామాలెలా ఉన్నాయి?
జవాబు:
సమష్టి కుటుంబంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇంట్లో సభ్యులందరూ కలిసి ఉంటారు. సమష్టి కుటుంబంలో కష్టసుఖాల్ని అందరితో పంచుకొంటారు. ఆ విధంగా వారికి ఓదార్పు లభిస్తుంది.

ప్రతి పనిలోనూ సహాయ సహకారాలు, సూచనలూ లభిస్తాయి. ఒకరికి ఒకరు, చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఆనందాలను అందరూ పంచుకొంటారు. పిల్లలు పెద్దల ఆలనాపాలనలో వాళ్ళ కమ్మని కబుర్లతో, కథలతో ఆరోగ్యంగా పెరుగుతారు. ఇంట్లో అందరికీ పెద్దలపట్ల భయభక్తులుంటాయి. తల్లిదండ్రుల సేవ, భగవంతుని సేవగా భావిస్తారు. ఈ జీవన విధానం వల్ల జీవిత మార్గం నిర్దేశింపబడుతుంది. పిల్లలు సమాజ స్థితిగతులనూ, ఆచార వ్యవహారాలనూ సంస్కృతీ సంప్రదాయాలనూ ప్రత్యక్షంగా ఏని, అర్థం చేసుకుంటారు.

కాని, ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకూ, ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికి ప్రాధాన్యం ఉండదు. స్వార్థం పెరిగిపోతుంది. అందువల్ల మార్పులు వచ్చాయి. చిన్నకుటుంబం అన్న భావన బలపడి వ్యష్టి కుటుంబవ్యవస్థగా మారింది.

ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటిపైనే, వృష్టి కుటుంబం ఆధారపడింది. ఈ వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయాధికారం లభిస్తాయి. ఈ

కాని వ్యష్టి కుటుంబంవల్ల, వారసత్వ భావనలు అందవు. దేశీయ సాంస్కృతిక జీవన సంప్రదాయాలు నిలువవు. పిల్లలకు కంప్యూటర్లే ఆటపాటలవుతాయి. భావాలు సంకుచితమై, అనుభూతులు లోపిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై తగిన శ్రద్ధ చూపడం లేదు. అది, పిల్లల మనస్తత్వంపై విపరీత ప్రభావాన్ని చూపుతోంది. పెద్దవారు, వృద్ధాశ్రమాల్లో చేరవలసి వస్తోంది. యంత్రశక్తి వినియోగం పెరిగిపోతోంది. కుటుంబ సభ్యులు ఎవరికి వారే యమునా తీరేగా మెలుగుతున్నారు.

ఆ) కుటుంబవ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి?
జవాబు:
ఉమ్మడి కుటుంబం, వృష్టి కుటుంబం మేలు కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం రాని ఏడంగా, ఆధిపత్యాల పోరులేని విధంగా, ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు అంతస్సూత్రంగా గల ఒక కొత్త కుటుంబ వ్యవస్థను తీర్చిదిద్దుకోవాలి.

ఏ కుటుంబంలో ఉన్నప్పటికీ కుటుంబ భావనలు, పిల్లలకు వివరించి చెప్పాలి. పెద్దల బలాన్ని పొందాలి. బలగాన్ని పెంపొందించుకోవాలి. యాంత్రికత తగ్గాలి. మానవ శక్తి, యుక్తి నైపుణ్యాలు మన వారసత్వ సంపదను పెంచేలా ఉపయోగపడాలి. సమస్యలను పరస్పరం ఆలోచించుకొని పరిష్కరించుకోవాలి. బాధ్యతలు పంచుకోవడం వల్ల యజమాని భారం తగ్గుతుంది. యంత్రశక్తి మీద ఆధారపడి బద్ధకస్తులు కాకూడదు.

కుటుంబ సభ్యులు సుఖాల్నీ, సంతోషాల్నీ, కష్టాల్నీ, బాధల్నీ పరస్పరం పంచుకోవాలి. ఆర్థిక సంబంధాలు, వ్యక్తిగత స్వార్థం, హక్కులు కంటె, మన బాధ్యతలు, మానవ సంబంధాలు ముఖ్యమనీ, అవి మన మనుగడకు ఆధారమనీ తెలుసుకోవాలి.

మనం చేసే పని ఏదయినా, మన సంస్కృతిని, వారసత్వాన్ని, దేశ ఔన్నత్యాన్నీ, ఇబ్బడి ముబ్బడిగా పెంచి, వారసులను ఉత్తేజితులను చేసే విధంగా ఉండాలి. అందుకు సమష్టి లేదా వ్యష్టి కుటుంబ వ్యవస్థలు దోహదం చేయాలి. ‘ఇల్లే ఇలలో స్వర్గం’ అని గుర్తించాలి. సమాజానికి కుటుంబం వెన్నెముక. మంచి కుటుంబ వ్యవస్థకై అందరూ కృషి చేయాలి.

IV. పదజాలం

1. కింది పదాలకు సాధారణ అర్థాలు ఉంటాయి. కాని పాఠంలో ఏ అర్థంలో ఉపయోగించారో వివరించండి.
( అ) పునాది ఆ) పెద్దమలుపు ఇ) అవధానం ఈ) మరుగునపడిపోవడం ఉ) కనుమరుగవడం )

ఆ) పునాది :
పిల్లల సమస్త సద్గుణాలకూ, గుర్గుణాలకూ ఇల్లే పునాది అన్నారు. అంటే ఇక్కడ మూలస్తంభం అనే అర్థంలో ఈ పునాడి పదాన్ని ఉపయోగించారు.

ఆ) పెద్దమలుపు :
నాగరికత మారిన తరువాత మానవుడు గుహల నుంచి గృహంలోకి మారాడు. అదే ఒక పెద్ద మలుపు అనే సందర్భంలో ఇది వాడారు. పెద్ద మలుపు అంటే పెద్ద మార్పు.

ఇ) అవధానం :
ఉమ్మడి కుటుంబాలలో పిల్లలందరికి ఒకేసారి భోజనాలు వడ్డించటం స్త్రీలకు అవధానం అవుతున్నది అని చెప్పు సందర్భంలో వాడతారు.
అవధానం = ఒకేసారి అన్నిటికి సమాధానాలు చెప్పటం

ఈ) మరుగునపడిపోవడం :
వ్యక్తి ప్రాధాన్యత పెరిగి సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది మరుగున పడిపోయింది అని చెప్పు సందర్భంలో వాడారు.
మరుగునపడిపోవడం = కనిపించకుండా మాయమైపోవడం

ఉ) కనుమరుగవడం :
సద్గుణాలకూ, దుర్గుణాలకూ ఇల్లే పునాది, కాని ఈ ఇల్లే ఇప్పుడు కనపడకుండా పోతోంది అనే సందర్భంలో వాడారు.
కనుమరుగవటం = కనిపించకుండా పోవడం

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. కింది జంట పదాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) తల్లి-తండ్రి
జవాబు:
తల్లిదండ్రులు మనకు దైవాంశ సంభూతులు.

ఆ) ప్రేమ-అనురాగం
జవాబు:
వృద్ధాప్యంలో మనము పెద్దవారిపట్ల ప్రేమ-అనురాగాలు కలిగి ఉండాలి.

ఇ) అమ్మమ్మ-నాన్నమ్మ
జవాబు:
మేము ప్రతి పండుగరోజు అమ్మమ్మ-నాన్నమ్మలతో కలిసి ఆనందంగా గడుపుతాము.

ఈ) అందం – ఆనందం
జవాబు:
ఇంటి పెరట్లో పూల మొక్కలు పూస్తూ ఉంటే, అదే ‘అందం – ఆనందం’.

ఉ) అవస్థ – వ్యవస్థ
జవాబు:
మన అవస్థలు మారాలంటే, మన కుటుంబ వ్యవస్థలో మార్పులు రావాలి.

ఊ) హక్కులు – బాధ్యతలు
జవాబు:
ప్రతివ్యక్తి, తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలిసికోవాలి.

3. కింది మాటలకు వ్యతిరేక అర్థాన్నిచ్చే పదాలు గళ్ళల్లో ఉన్నాయి. వాటిని వెతికి, వాటినుపయోగించి వాక్యాలు రాయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 2
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 3

అ. సహాయత × నిస్సహాయత
ఎందరో అనాథలు తమను పట్టించుకొనేవారు లేక నిస్సహాయతతో కాలం గడుపుచున్నారు.

ఆ. ఐక్యత × అనైక్యత
భారతీయ రాజుల అనైక్యత వల్లనే బ్రిటిష్ వారు మనదేశాన్ని స్వాధీనం చేసుకోగలిగారు.

ఇ. సమానత్వం × అసమానత్వం
ప్రపంచ దేశాల మధ్య ఆర్థికంగా అసమానత్వం ఉంది.

ఈ. ఉత్సాహం × నిరుత్సాహం
కొంతమంది ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటారు.

ఉ. ప్రాధాన్యం × అప్రాధాన్యం
మనం అప్రాధాన్య విషయాలపై సమయాన్ని వృథా చేయరాదు.

V. సృజనాత్మకత

* వేసవి సెలవుల్లో మీరు మీ స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబం మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇంటికి తిరిగి వచ్చాక మీ స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు అఖిల్ కు,

నీ స్నేహితుడు వ్రాయు ఉత్తరం. ఇక్కడ నేను క్షేమం. అక్కడ నీవు కూడా అలాగే ఉంటావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా ఉత్తరం వ్రాయుట ఏమనగా నేను ఇటీవల వేసవి సెలవులలో మీ ఇంటికి వచ్చాను కదా ! అప్పుడు మీ కుటుంబంలోని వారందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నన్ను మీలో ఒకరిగా చూశారు. ముఖ్యంగా మీ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు నన్ను ఆదరించిన విధానం నాకు చాలా నచ్చింది. నన్ను దిగుడు బావి దగ్గరకు తీసుకువెళ్ళి మీ మామయ్య చక్కగా 15 రోజులు ఈత నేర్పించారు. అలాగే మీ మామయ్య వాళ్ళ పిల్లలు, మనం కలిసి క్రికెట్, కబడ్డీ మొదలగు ఆటలు చక్కగా ఆడుకున్నాము. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియచేయవలసినదిగా కోరుకుంటున్నాను. ఈసారి వేసవి సెలవులకు నీవు మా ఊరికి తప్పక రావాలి.

ఇట్లు,
మీ మిత్రుడు,
అఖిలేశ్వర్.

చిరునామా :
బి. అఖిల్,
S/0 బి. రంగనాథం,
7-8-63, 8/4,
నైనవరం, పశ్చిమగోదావరి జిల్లా.

(లేదా)
* తాతయ్య, నాన్నమ్మ, అమ్మానాన్నలు, పిల్లలూ అంతా కలిసి ఉంటేనే కుటుంబం అంటారు. కాని నేటికాలంలో ఎంతోమంది వృద్ధులను, వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఇది సరికాదని ప్రజలందరికీ తెలియజేయడానికి కరపత్రం తయారుచేయండి.
(లేదా)
వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం మంచిది కాదని తెలియజేస్తూ ప్రజలందరికీ తెలియజేయడానికి “కరపత్రం” తయారు చేయండి.
జవాబు:
కన్నవారిని కళ్ళల్లో పెట్టి చూసుకుందాం

సోదరసోదరీమణులారా! ఒక చిన్న విన్నపం. మనం ఇలా పెరిగి పెద్దవారమై, విద్యాబుద్ధులు నేర్చుకొని, ఉద్యోగాలు చేస్తూ, ఆస్తిపాస్తులు సంపాదించుకొని, సుఖంగా ఉండడానికి వెనుక కారణం ఎవరో, ఒకసారి ఆలోచించండి. గట్టిగా ఆలోచిస్తే, మనలను చేతులు పట్టుకు నడిపించి, బడిలో చేర్పించి, చదువులు చెప్పించి, గోరుముద్దలు తినిపించి, అవసరానికి ఆదుకొని, మనకోసం వారి సుఖ సంతోషాలన్నీ త్యాగం చేసిన, మన తల్లిదండ్రులే అని, మీకు గుర్తు వస్తుంది.

ఈ మధ్య చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. అక్కడ తిండి పెడతారు. వినోదాలు కూడా ఉండవచ్చు. కానీ అక్కడ తమ పిల్లలతో మనవలతో, కోడళ్ళతో తిరిగిన సుఖ సంతోషాలు, మమతానురాగాలు మన తల్లిదండ్రులకు దొరకవు. తమ పిల్లలు తమను పట్టించుకోవడంలేదనే బెంగతో, వారు క్రుంగిపోతారు.

మీ పిల్లలకు మంచి పురాణ కథలు చెప్పి ఆదరంగా చేరదీసే తాతామామ్మలు వారికి దొరకరు. కనుక మిమ్మల్ని కనిపెంచిన తల్లిదండ్రుల్ని ఆదరించండి. మీ ఇంట్లోనే వీరిని ఉంచుకోండి. నిరాదరణకు గురిచేసి, వృద్ధాశ్రమాలకు పంపకండి. మరువకండి. లేదా మీకు మీ పెద్దల గతే, అని గుర్తుంచుకోండి.
ఇట్లు,
జె.ఎమ్.ఎస్.యువజన చైతన్య సమితి.

VI. ప్రశంస

మీరు చూసిన లేదా మీకు తెలిసిన ఒక మంచి కుటుంబాన్ని గురించి మీ భావనలను తెలుపుతూ మీ స్నేహితుడికి/ తాతయ్యకు ఉత్తరం రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు రాకేష్ కు,

నేను క్షేమం, నీవు కూడా క్షేమమని తలుస్తాను. నేను ఇటీవల సెలవులలో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ మా అమ్మమ్మ కుటుంబం మొత్తం ఉమ్మడి కుటుంబం. నాకు అలాగే అందరూ కలిసి ఉండటం చాలా నచ్చింది. అక్కడ అందరూ పెద్దవారి మాటను అనుసరించి నడచుకుంటున్నారు. పెద్దల మాటలకు బాగా గౌరవం ఇస్తున్నారు. అలాగే పిల్లలపై పెద్దవారు చూపే ప్రేమాభిమానాలు, వారి మధ్యగల అనురాగాలు నాకు బాగా నచ్చాయి. అక్కడ నేను వారందరి మధ్య సంతోషంగా గడిపాను. నీవు కూడా మీ తాతయ్య వాళ్ళింటికి వెళ్ళావు కదా ! అక్కడి విషయాలు వివరిస్తూ లేఖ వ్రాయవలెను. ఉమ్మడి కుటుంబం వలన కలిగే ప్రయోజనాలు మనము మన స్నేహితులందరికి తెలియజేయాలి. అమ్మ, నాన్నగార్లకు నా నమస్కారాలు తెలుపవలెను.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజేష్,

చిరునామా :
కె.రాకేష్,
S/o కె. రామ్మూర్తి,
9/83-78-6,
తోట్లవారి వీధి,
వైజాగ్.

ప్రాజెక్టు పని

* ఈనాటి మానవ సంబంధాలపై వార్తా పత్రికల్లో అనేక వార్తలు, కథనాలు వస్తుంటాయి. వాటిని సేకరించి తరగతిలో వినిపించండి.
జవాబు:
వార్తలు :
1. 90 ఏళ్ళ వయస్సున్న అన్నపూర్ణమ్మను ఇద్దరు కొడుకులు ఇంటి నుండి పంపివేశారు. అన్నపూర్ణమ్మ చెట్టు కింద ఉంటోంది. గ్రామస్థులు పెట్టింది తింటోంది.

2. భుజంగరావు తన తలిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఆ తల్లిదండ్రులు మనమల కోసం బెంగపెట్టుకున్నారు. అతని భార్య మాత్రం అత్తామామల రాకకు ఒప్పుకోలేదు.

VII. భాషాంశాలు

1) కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.
ఉదా :
శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది.
శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది.

అ. మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది.
జవాబు:
మహతి ఆట ఆడి, అన్నం తిన్నది.

ఆ. శ్రీనిధి జడవేసుకుంది. శ్రీనిధి పూలు పెట్టుకుంది.
జవాబు:
శ్రీనిధి జడవేసుకుని, పూలు పెట్టుకుంది.

ఇ. మాధవి పాఠం చదివింది. మాధవి పద్యం చెప్పింది.
జవాబు:
మాధవి పాఠం చదివి, పద్యం చెప్పింది.

ఈ. శివాని కళాశాలకు వెళ్ళింది. శివాని పాటల పోటీలో పాల్గొన్నది.
జవాబు:
శివాని కళాశాలకు వెళ్ళి, పాటల పోటీలో పాల్గొన్నది.

ఉ. నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు.
జవాబు:
నారాయణ అన్నం తిని, నీళ్ళు తాగుతాడు.

ఊ. సుమంత్ పోటీలకు వెళ్ళాడు. సుమంత్ మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు.
జవాబు:
సుమంత్ పోటీలకు వెళ్ళి, మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2) కింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా రాయండి.
ఉదా :
శరత్ ఇంటికి వచ్చి, అన్నం తిన్నాడు.
శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు.

అ. కందుకూరి రచనలు చేసి సంఘ సంస్కరణ చేశాడు.
జవాబు:
కందుకూరి రచనలు చేశాడు. కందుకూరి సంఘ సంస్కరణ చేశాడు.

ఆ. రంగడు అడవికి వెళ్ళి కట్టెలు తెస్తాడు.
జవాబు:
రంగడు అడవికి వెళ్తాడు. రంగడు కట్టెలు తెస్తాడు.

ఇ. నీలిమ టి.వి. చూసి నిద్రపోయింది.
జవాబు:
నీలిమ టి.వి. చూసింది. నీలిమ నిద్రపోయింది.

ఈ. రజియా పాటపాడుతూ ఆడుకుంటున్నది.
జవాబు:
రజియా పాట పాడుతున్నది. రజియా ఆడుకుంటున్నది.

3) సంయుక్త వాక్యం
కింది వాక్యాలను గమనించండి.
విమల తెలివైనది. విమల అందమైనది.
విమల తెలివైనది, అందమైనది.
“ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం” అంటారు.

4) సంయుక్త వాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మార్పులను గమనించండి.
అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది, అందమైనది – రెండు నామపదాల్లో ఒకటి లోపించడం.

ఆ) అజిత అక్క శైలజ చెల్లెలు.
అజిత, శైలజ అక్కాచెల్లెళ్ళు – రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది.

ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
ఆయన డాక్టరా, ప్రొఫెసరా? – రెండు సర్వనామాలలో ఒకటి లోపించడం.

మరికొన్ని సంయుక్త వాక్యాలను రాయండి.

  1. ఆయనా, ఈయనా పెద్దవాళ్ళు.
  2. రవి కవిత్వమూ, కథలూ రాస్తాడు.
  3. అంబేద్కర్ కార్యవాది, క్రియాశీలి.
  4. శ్రీనిధి, రామూ బుద్ధిమంతులు.
  5. రాజా, గోపాలు అన్నాదమ్ములు.
  6. సీత యోగ్యురాలు, బుద్ధిమంతురాలు.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

అమ్మ : మాత, జనని, తల్లి
వివాహం : వివాహం, పరిణయం, ఉద్వాహం
స్వర్గం : త్రిదివం, నాకం, దివి
స్త్రీ : పడతి, స్త్రీ, ఇంతి
పక్షి : పిట్ట, పులుగు, విహంగం
వ్యవసాయం : సేద్యం, కృషి
సౌరభం : సువాసన, పరిమళం, తావి
నాన్న : జనకుడు, పిత, తండ్రి
ఇల : భూమి, వసుధ, ధరణి
పథం : దారి, మార్గం, త్రోవ
గృహం : ఇల్లు, సదనం, నికేతనం
భార్య : ఇల్లాలు, సతి, కులస్త్రీ

వ్యుత్పత్యర్థాలు

ఇతిహాసం – ఇలా జరిగిందని చెప్పేది (చరిత్ర)
మానవుడు – మనువు వల్ల పుట్టినవాడు (నరుడు)
పక్షి – పక్షములు కలది (పిట్ట)

నానార్థాలు

తాత = తండ్రి, తండ్రి తండ్రి, తల్లితండ్రి, బ్రహ్మ
గుణం = స్వభావం, అల్లెత్రాడు, ప్రయోజనం
వేదం = వెలివి, వివరణం
పాలు = క్షీరం, భాగం, సమీపం
సౌరభం = సువాసన, కుంకుమ, పువ్వు
వ్యవసాయం = కృషి, ప్రయత్నం , పరిశ్రమ
కాలం = సమయం, మరణం, నలుపు
దక్షిణం = ఒక దిక్కు సంభావన
ధర్మం = న్యాయం, ఆచారం, యజ్ఞం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకదేశమగును.

గృహస్థాశ్రమం = గృహస్థ + ఆశ్రమం – సవర్ణదీర్ఘ సంధి
స్వావలంబన = స్వ + అవలంబన – సవర్ణదీర్ఘ సంధి
దేవాలయం = దేవ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
వృద్ధాశ్రమం = వృద + ఆశ్రమం – సవర్ణదీర్ఘ సంధి
నిర్ణయాధికారం = నిర్ణయ + అధికారం – సవర్ణదీర్ఘ సంధి
కాలానుగుణం = కాల + అనుగుణం – సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
పరోపకారం = పర + ఉపకారం – గుణసంధి
భావోద్వేగాలు = భావ + ఉద్వేగాలు – గుణసంధి

యణాదేశ సంధి :
సూత్రం : ఇ, ఉ, ఋలకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు య, వ, ర లు ఆదేశమగును.
అత్యంత = అతి + అంత – యణాదేశ సంధి
అత్యున్నత = అతి + ఉన్నత – యణాదేశ సంధి
ప్రత్యక్షం = ప్రతి + అక్షం – యణాదేశ సంధి

వృద్ధి సంధి :
సూత్రం : అకారమునకు ఏ, ఐలు పరమగునపుడు ఐ కారమును, ఓ, ఔలు పరమగునపుడు ఔ కొరమును ఏకాదేశమగును.
మమైక = మమ + ఏక = వృద్ధి సంధి
దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం – వృద్ధిసంధి

అత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
అమ్మమ్మ = అమ్మ + అమ్మ – అత్వసంధి
నాన్నమ్మ = . నాన్న + అమ్మ – అత్వసంధి
తాతయ్య = – తాత + అయ్య – అత్వసంధి
పెద్దయిన = పెద్ద + అయిన = అత్వసంధి

ఇత్వసంధి (అ) :
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
మరెక్కడ = మరి + ఎక్కడ – ఇత్వసంధి
మనయ్యేది = పని + అయ్యేది – ఇత్వసంధి
ఏదైనా = ఏది + ఐనా – ఇత్వసంధి

ఇత్వసంధి (ఆ) :
సూత్రం : క్రియాపదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
సాగిపోయిందని = సాగిపోయింది + అని – ఇత్వసంధి
ఉండేవని = ఉండేవి + అని – ఇత్వసంధి
ఉండేదని = ఉండేది + అని – ఇత్వసంధి

ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
ఆకాశమంత =ఆకాశము + అంత – ఉత్వ సంధి
ఇల్లు + అంటే – ఉత్వసంధి
ఇల్లంటే = ఇల్లాలు = ఇల్లు – ఉత్వసంధి
వెన్నెముక = వెన్ను + ఎముక – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి :
సూత్రం : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి.
తల్లిదండ్రులు = తల్లి + తండ్రి – గసడదవాదేశ సంధి
అన్నదమ్ములు = అన్న + తమ్ముడు – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అక్కాచెల్లెళ్ళు అక్కయును, చెల్లెలును ద్వంద్వ సమాసం
తల్లిదండ్రులు తల్లియును, తండ్రియును ద్వంద్వ సమాసం
రామాయణ భారతాలు రామాయణమును, భారతమును ద్వంద్వ సమాసం
ప్రేమానురాగాలు ప్రేమయును, అనురాగమును ద్వంద్వ సమాసం
సిరిసంపదలు సిరియును, సంపదయును ద్వంద్వ సమాసం
స్త్రీ, పురుషులు స్త్రీయును, పురుషుడును ద్వంద్వ సమాసం
సహాయసహకారాలు సహాయమును, సహకారమును ద్వంద్వ సమాసం
ఆచార వ్యవహారాలు ఆచారమును, వ్యవహారమును ద్వంద్వ సమాసం
భారతదేశం భారతము అను పేరుగల దేశము సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ఆశ్రమధర్మాలు ఆశ్రమము యొక్క ధర్మాలు షష్ఠీ తత్పురుష సమాసం
కుటుంబ వ్యవస్థ కుటుంబము యొక్క వ్యవస్థ షష్ఠీ తత్పురుష సమాసం
జీవనవిధానం జీవనము యొక్క విధానం షష్ఠీ తత్పురుష సమాసం
కుటుంబ జీవనం కుటుంబము యొక్క జీవనం షష్ఠీ తత్పురుష సమాసం
మంత్రశక్తి మంత్రము యొక్క శక్తి షష్ఠీ తత్పురుష సమాసం
మనోభావాలు మనస్సు యొక్క భావాలు షష్ఠీ తత్పురుష సమాసం
రైతు కుటుంబాలు రైతుల యొక్క కుటుంబాలు షష్ఠీ తత్పురుష సమాసం
మంచి సమాజం మంచిదైన సమాజం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
చిన్నపిల్లలు చిన్నవైన పిల్లలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఉన్నతశ్రేణి ఉన్నతమైన శ్రేణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మధురక్షణాలు మధురమైన క్షణాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రాథమిక లక్షణం ప్రాథమికమైన లక్షణం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రత్యక్షము అక్షము యొక్క సమూహము అవ్యయీభావ సమాసం
శ్రామికవర్గం శ్రామికుల యొక్క వర్గం షష్ఠీ తత్పురుష సమాసం
దుర్గుణములు దుష్టములైన గుణములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సద్గుణములు మంచివైన గుణములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆత్మీయబంధం ఆత్మీయమైన బంధము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
కొత్తధోరణులు కొత్తవైన ధోరణులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నాలుగు గోడలు నాలుగు సంఖ్య గల గోడలు ద్విగు సమాసం

ప్రకృతి – వికృతులు

పక్షి – పక్కి
ఆకాశం – ఆకసం
కార్యం – కర్ణం
సహజం – సాజము
వృద్ధ – పెద్ద
గర్వం – గరువము
శాస్త్రము – చట్టము
మర్యాద – మరియాద
నియమం – నేమం
గుణం – గొనం
విజ్ఞానం – విన్నానం
యంత్రం – జంత్రము
స్తంభము – కంబము
దీపము – దివ్వె
చరిత్ర – చారిత
స్త్రీ – ఇంతి
శాస్త్రం – చట్టం
రూపం – రూపు
అద్భుతము – అబ్బురము
గృహము – గీము
సంతోషం – సంతసము
ధర్మము – దమ్మము
దక్షిణం – దక్కనం
సుఖం – సుకం
త్యాగం – చాగం
స్తంభం – కంబం
భాష – బాస

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

పదాలు – అర్దాలు

లోగిలి = ಇಲ್ಲು
ఆమోదయోగ్యము = అంగీకారమునకు తగినది
వ్యవస్థ = ఏర్పాటు
ప్రాతిపదిక = మూలము
త్యాగభావన = విడిచిపెడుతున్నామనే ఊహ
కీలకము = ప్రధాన మర్మము
పునరుత్పత్తి = తిరిగి పుట్టించుట
విచక్షణ = మంచిచెడుల బేరీజు
సంస్కృతి = నాగరికత
సౌరభం = సువాసన
మక్కువ = ఇష్టము
వివేచన = మంచి చెడులను విమర్శించి తెలిసికోవడం
ఆదర్శం = ఇతరులు చూసి నేర్చుకోదగిన గుణం
నియమబద్ధం = నియమములతో కూడినది
నానుడి = సామెత
గృహస్థ + ఆశ్రమం = భార్యాభర్తలు పిల్లలతో తల్లిదండ్రులతో నివాసం
గార్హస్థ్య జీవితం = గృహస్తుగా జీవించడం
ఆలనా పాలనా = వినడం, కాపాడడం
జీవితపథ నిర్దేశం = జీవించే మార్గాన్ని చెప్పడం
ఆకళింపుచేసుకొను = అర్ధం చేసికొను
అవధానం = ఏకాగ్రత
అక్కర = అవసరం
స్వార్థపరత = తన బాగే చూసుకోవడం
తావు = స్థలము

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

సంఘీభావం = ఐకమత్యం
ఇతిహాసాలు = భారత రామాయణాలు (పరంపరగా చెప్పుకొనే పూర్వకథలు)
నమూనా = మాదిరి
స్వార్థం = స్వప్రయోజనం
అనివార్యము = నివారింపశక్యము కానిది
జీవన సరణి = జీవించే పద్ధతి
అనూహ్యము = ఊహింపరానిది
ధోరణులు = పద్దతులు
స్వావలంబన = తనపై తాను ఆధారపడడం
సంకుచితము = ముడుచుకున్నది
అనుభూతి = సుఖదుఃఖాదులను పొందడం
కనుమరుగు = కంటికి కనబడకుండా పోవుట
కేర్ టేకింగ్ సెంటర్లు = జాగ్రత్త తీసికొనే కేంద్రాలు
నేపథ్యం = తెరవెనుక ఉన్నది
అధిగమించి = దాటి
మనుగడ = జీవనం
విచ్ఛిన్నం = నాశనం
ఇబ్బడి ముబ్బడి = రెట్టింపు, మూడురెట్లు