AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

SCERT AP 10th Class Physics Study Material Pdf 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Physical Science 5th Lesson Questions and Answers మానవుని కన్ను-రంగుల ప్రపంచం

10th Class Physical Science 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
హ్రస్వదృష్టి లోపాన్ని మీరెలా సవరిస్తారు?
(లేదా)
కన్ను యొక్క హ్రస్వ దృష్టిని మీరు ఏ విధంగా సవరిస్తారు?
జవాబు:
1) ఒక వ్యక్తి గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువును చూడలేకపోవు దోషాన్ని “హ్రస్వదృష్టి” అంటారు.

2) ఏ దూరం వద్ద నున్న బిందువుకు లోపల గల వస్తువుకు మాత్రమే కంటి కటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచుకోగలదో ఆ బిందువును గరిష్ఠ దూర బిందువంటారు.

3) గరిష్ఠ దూరబిందువుకు, స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువుకు మధ్య వస్తువు ఉన్నప్పుడు కంటి కటకం రెటీనా పై ప్రతిబింబమును ఏర్పరచగలదు.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 1

|4) గరిష్ఠ దూరబిందువు ఆవల ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కంటి కటకం రెటీనా కంటే ముందు ఏర్పరుస్తుంది.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 2

5) కావున ఒక కటకంను ఉపయోగించి గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూర బిందువు మరియు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువుల మధ్యకు తేగలిగితే ఆ ప్రతిబింబం కంటి కటకానికి వస్తువులా పని చేస్తుంది.

6) హ్రస్వదృష్టిని నివారించేందుకు అనంతదూరంలో ఉండే వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూర బిందువు వద్ద ఏర్పరచగలిగే కటకాన్ని ఎంచుకోవాలి.

7) దీని కొరకు ద్విపుటాకార కటకమును వాడాలి.

8) ఈ ద్విపుటాకార కటకం ఏర్పరిచే ప్రతిబింబం కంటి కటకానికి వస్తువు వలె పనిచేసి, చివరకు వస్తు ప్రతిబింబంను రెటీనా పై ఏర్పరచును.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 3

ప్రశ్న 2.
దీర్ఘదృష్టి లోపాన్ని సవరించే విధానాన్ని వివరించండి.
(లేదా)
కన్ను యొక్క దీర్ఘదృష్టిని మీరు ఏ విధంగా సవరిస్తారు?
జవాబు:
1) దీర్ఘదృష్టి గల వ్యక్తి దూరంలో వున్న వస్తువులను స్పష్టంగా చూడగలడు. కానీ దగ్గరి వస్తువులను చూడలేడు.
2) దీనికి గల కారణము కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కన్నా ఎక్కువగా ఉండడమే.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 4
3) పై పటంలో చూపినట్లుగా ఈ సందర్భంలో దగ్గరలోని వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా వక్రీభవనం చెంది ప్రతిబింబం రెటీనాకు ఆవల ఏర్పడుతుంది.
4) వస్తువు కనిష్ఠ దూర బిందువుకు ఆవల ఉంటే, కంటి కటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 5
5) కనుక దీర్ఘదృష్టిని నివారించడానికి ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించాలి.
6) ఈ కటకం వలన ఏర్పడే ప్రతిబింబం కంటి కటకానికి వస్తువుగా పనిచేస్తుంది.
7) అందువలన చివరకు కంటి కటకం వలన ఏర్పడే ప్రతిబింబం పటంలో చూపినట్లుగా రెటీనా పై ఏర్పడును.

ప్రశ్న 3.
పట్టక పదార్థ వక్రీభవన గుణకాన్ని ప్రయోగపూర్వకంగా ఎలా కనుగొంటారు?
(లేదా)
పట్టకపు వక్రీభవన గుణకమును కనుగొను కృత్యంను వ్రాయుము. (ప్రయోగశాల కృత్యం)
జవాబు:
ఉద్దేశ్యం : పట్టక వక్రీభవన గుణకాన్ని కనుగొనడము.

కావలసిన వస్తువులు :
పట్టకం, తెల్లని డ్రాయింగ్ చార్ట్ (20 X 20 సెం.మీ.), పెన్సిల్, గుండుసూదులు, స్కేలు మరియు కోణమానిని.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 6

నిర్వహణ పద్దతి :

  1. ఒక గాజు పట్టకాన్ని తీసుకొని, దాని త్రిభుజాకార పతనకిరణం, AM ఆధారం డ్రాయింగ్ చార్ట్ పై ఉండే విధముగా అమర్చుము.
  2. పట్టక ఆధారం చుట్టూ పెన్సిల్ తో గీత గీసి పట్టకాన్ని తీసివేయాలి.
  3. త్రిభుజ భుజం PQ పై ఒక బిందువు ‘M’ ను గుర్తించుము.
  4. M వద్ద PQ కు లంబాన్ని గీయాలి.
  5. M వద్ద PQ తో 30° కోణాన్ని గుర్తించి, ఒక రేఖను గీయుము. ఇదియే పతన కిరణం అగును.
  6. ఈ కోణమును “పతన కోణము” అంటారు.
  7. పట్టకాన్ని తిరిగి దాని స్థానంలో ఉంచి పతన కిరణం AB పై రెండు గుండు సూదులను నిలువుగా గుచ్చుము.
  8. పట్టకం రెండోవైపు నుండి గుండుసూదుల ప్రతిబింబాలతో ఒకే వరుసలో ఉండునట్లు C, D బిందువుల వద్ద మరో రెండు గుండు సూదులను గుచ్చుము.
  9. ఇప్పుడు C, D లను కలుపుము. ఇది బహిర్గత కిరణమును సూచించును.
  10. పతన కిరణం, బహిర్గత కిరణాలను వెనుకకు పొడిగించిన అవి రెండూ ‘O’ వద్ద ఖండించుకుంటున్నాయి.
  11. ‘O’ బిందువు వద్ద ఈ రెండు కిరణాల మధ్య కోణమును కొలిచిన, అది విచలన కోణం (d) అగును.
  12. ఈ విధంగా వివిధ పతన కోణాలకు, విచలన కోణాల విలువలను తెలుసుకొని, వాటిని నమోదు చేయుము.
  13. ఈ ప్రయోగం ద్వారా పతన కోణం పెరుగుతున్న కొలదీ కొంతమేర విచలన కోణం విలువ తగ్గి తర్వాత పతన కోణంతో పాటుగా పెరగడం గమనించవచ్చును.
    AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 7
  14. పతన కోణంను X-అక్షం వెంబడి, విచలన కోణంను Y-అక్షం వెంబడి తీసుకొని గ్రాఫును గీసిన సున్నిత వక్రం ఏర్పడుతుంది.
  15. ఈ వక్రం ద్వారా కనిష్ట విచలన కోణం ‘D’ ను కనుగొనవచ్చును.
  16. ‘పట్టక కోణం ‘A’ కనిష్ఠ విచలన కోణం ‘D’ అయితే పట్టక వక్రీభవన గుణకము \(n=\frac{\sin \left[\frac{(A+D)}{2}\right]}{\sin \frac{A}{2}}\) అగును.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 4.
ఇంద్రధనుస్సు ఏర్పడే విధానాన్ని వివరించండి. (కృత్యం – 5)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 8

  1. ప్రకృతిలోని తెల్లని సూర్యకాంతి, అనేక లక్షల నీటి బిందువుల చేత విక్షేపణం చెందడం వల్ల ఇంద్రధనుస్సు ఏర్పడును.
  2. పటంలో చూపినట్లుగా నీటి బిందువు పై ప్రాంతం నుండి సూర్యుని కాంతికిరణం లోపలికి ప్రవేశించును.
  3. అక్కడ జరిగే మొదటి వక్రీభవనంలో తెల్లని కాంతి వివిధ రంగులుగా విక్షేపణం చెందును.
  4. అన్ని రంగులు నీటి బిందువు రెండో వైపుకు చేరాక, సంపూర్ణాంతర పరావర్తనం వల్ల నీటి బిందువులోనే వెనుకకు పరావర్తనం చెందుతాయి.
  5. ఫలితముగా నీటి బిందువు మొదటి ఉపరితలాన్ని చేరాక, ప్రతీ రంగు మరలా గాలిలోకి వక్రీభవనం చెందును.
  6. నీటి బిందువులోకి ప్రవేశించే కిరణాలు, బయటకు వెళ్ళే కిరణాల మధ్య కోణం (0° నుండి 42° మధ్య ఎంతైనా ఉండవచ్చు.
  7. ఆ కోణం 42° లకు దాదాపు సమానంగా ఉన్నప్పుడు ప్రకాశవంతమైన ఇంద్రధనుస్సును మనం చూడగలము.
  8. ప్రతి నీటి బిందువు కాంతిని ఏడు రంగులలోకి విడగొట్టినా, ఒక పరిశీలకుడు తాను ఉన్న స్థానాన్ని బట్టి, ఒక నీటి బిందువు నుండి వచ్చే రంగులలో ఏదో ఒకదానిని మాత్రమే చూడగలడు.
  9. సూర్యకాంతి పుంజానికి, నీటి బిందువుచే వెనుకకు పంపబడిన కాంతికి మధ్యకోణం 42° ఉన్నప్పుడే మనకు ఎరుపు రంగు కనబడుతుంది.
  10. 40° ల నుండి 42°ల మధ్య కోణంలో VIBGYOR లోని మిగిలిన రంగులు కనిపిస్తాయి.
    AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 9
  11. ఈ విధముగా ప్రకృతిలో ఇంద్రధనుస్సు ఏర్పడును.

ప్రశ్న 5.
ఆకాశం నీలి రంగులో కనబడటానికి గల కారణాన్ని క్లుప్తంగా వివరించండి.
(లేదా)
మనకు ఆకాశము నీలముగా కనబడుటకు గల కారణమును వివరింపుము.
జవాబు:

  1. ఆకాశం నీలిరంగుగా ఉండుటకు కారణము కాంతి యొక్క పరిక్షేపణము.
  2. కాంతి పరిక్షేపణమనగా ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశలలో వివిధ తీవ్రతలతో విడుదల చేయడాన్ని “కాంతి పరిక్షేపణం” అంటాము.
  3. వాతావరణంలో వివిధ పరిమాణాలు గల కణాలుంటాయి.
  4. వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువు పరిమాణం నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధముగా ఉంటుంది.
  5. ఈ అణువులు నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.
  6. వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ అణువులు ఎక్కువగా వుండటం వల్ల, అవి నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేయడం వల్ల ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది.

ప్రశ్న 6.
అంశం (A) : కాంతి పరిక్షేపణం వలన ఆకాశం నీలిరంగులో కనబడుతుంది.
కారణం (R) : తెల్లని కాంతిలోని వివిధ కాంతులలో నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యం తక్కువ.
a) A, R రెండూ సరియైనవి. మరియు A కు R సరైన వివరణ.
b) A, R రెండూ సరియైనవి. కానీ A కు R సరైన వివరణ కాదు.
c) A సరియైనది. కానీ R సరియైనది కాదు.
d) A మరియు R సరైనవి కావు.
e) A సరియైనది కాదు కానీ R సరైనది.
జవాబు:
a) A, R లు రెండూ సరియైనవి. మరియు A కు R సరైన వివరణ.

కారణము :
ఆకాశం నీలిరంగుకు కాంతి పరిక్షేపణమే కారణము. తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతికి, అధిక తరంగదైర్ఘ్యం గల కాంతితో పోల్చితే పరిక్షేపణ సామర్థ్యం ఎక్కువ.

ప్రశ్న 7.
తరగతి గదిలో ఇంద్రధనుస్సును ఏర్పరిచేందుకు ఒక ప్రయోగాన్ని తెల్పండి. ప్రయోగ విధానాన్ని వివరించండి. (కృత్యం-4)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 10

  1. ఒక లోహపు పళ్ళాన్ని తీసుకొని; నీటితో నింపుము.
  2. నీటి ఉపరితలంతో కొంతకోణం చేసే విధంగా ఒక సమతల దర్పణమును పటంలో చూపిన విధంగా ఉంచుము.
  3. పటంలో చూపినట్లుగా నీటి గుండా అద్దం పై తెల్లని కాంతిని ప్రసరింపజేయుము.
  4. ఈ అమరికకు కొంత ఎత్తులో తెల్లటి కార్డుబోర్డుపై వివిధ రంగులతో ఇంద్రధనుస్సు ఏర్పడుటను గమనించవచ్చును.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 8.
కొన్ని బైనాక్యులర్లందు పట్టకాలను వినియోగిస్తారు. బైనాక్యులర్లలో పట్టకాలు ఎందుకు వినియోగిస్తారో తెలియజేసే – సమాచారాన్ని సేకరించండి.
(లేదా)
పట్టకములకు సంబంధించిన సమాచారాన్ని సేకరించుము. వాటిని బైనాక్యులలో ఎందుకు వాడుతారో వివరింపుము.
జవాబు:

  1. పరిశీలకునికి దూరపు వస్తువులను పరీక్షించుటకు సమాంతరంగా కదిలే విధంగా రెండు కటకాలను అమర్చుతారు.
  2. అధిక -పరావర్తనం కోసం బైనాక్యులర్లలో పట్టకాలను ఉపయోగిస్తారు.
  3. పట్టకాలను ఉపయోగించి బైనాక్యులర్ యొక్క పరిమాణంను తగ్గిస్తారు.
  4. పట్టకములను ఉపయోగించి వస్తు పరిమాణం మరియు దృక్ తీవ్రతలను పెంచవచ్చును.
  5. సాధారణంగా బైనాక్యులర్లలో లంబకోణ పట్టకం లేదా ద్విపట్టకాలను ఉపయోగిస్తారు.
  6. బైనాక్యులలో పట్టకాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతోనే వాటి పరావర్తన సామర్థ్యాన్ని 95% వరకు పెంచవచ్చును.

ప్రశ్న 9.
పటంలో పట్టక తలం AB పై పడిన పతన కిరణాన్ని, పట్టక తలం AC నుండి వచ్చే బహిర్గత కిరణాన్ని చూపడం జరిగింది. పటంలో లోపించిన వాటిని గీయండి.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 11
జవాబు:
AB, AC లు వక్రీభవన తలాలు మరియు BC పరావర్తన తలము.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 12

ప్రశ్న 10.
ఆకాశం నీలిరంగులో కనబడడానికి కారణమైన వాతావరణంలోని అణువుల పాత్రను మీరెలా అభినందిస్తారు?
(లేదా)
ఆకాశం నీలి రంగులో కనబడుటకు కారణం ఏమిటి ? ఈ విషయంలో వాతావరణంలోని అణువుల పాత్రను మీరెలా అభినందిస్తారు?
జవాబు:

  1. ఆకాశం నీలిరంగులో ఉండుటకు ముఖ్యకారణము కాంతి పరిక్షేపణమే.
  2. వాతావరణంలోని N2, O2 అణువుల పరిమాణం నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధముగా ఉంటుంది.
  3. ఈ అణువులు నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.
  4. వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ అణువుల శాతము ఎక్కువగా ఉండటం వలన, అవి నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేయడం వలన ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది.
  5. ఈ విధమైన ఆకాశపు నీలిరంగుకి కారణమైన వాతావరణంలోని N2 మరియు O2ల పాత్రను నేను అభినందించుచున్నాను.

ప్రశ్న 11.
కంటిలోని సిలియరి కండరాల పనితీరును మీరెలా అభినందిస్తారు?
(లేదా)
సిలియరి కండరాల పనితీరు మన కంటికి ఏ విధమైన అవసరమో అభినందించుము.
జవాబు:
కంటిలోని సిలియరి కండరాల పనితీరు కంటిపై ప్రతిబింబంను ఏర్పరుచుటలో ఎంతో అభినందనీయమైనది. ఎందుకనగా

  1. కంటిలోని కటకానికి ఆనుకొని ఉన్న ఈ కండరాలు కటక వక్రతా వ్యాసార్ధాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరమును మార్చుకోవడానికి దోహదపడతాయి.
  2. దగ్గరలో వున్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు, సిలియరి కండరాలు ఒత్తిడికి గురికావడం వల్ల కంటి కటక నాభ్యంతరం తగ్గుతుంది.
  3. దూరంలో ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు, సిలియరి కండరాలు విశ్రాంత స్థితిలో ఉండటం వల్ల కంటి కటక నాభ్యంతరం గరిష్ఠమవుతుంది.
  4. ఈ విధమైన సర్దుబాటును సిలియరి కండరాలు చేస్తాయి.

ప్రశ్న 12.
కొన్ని సందర్భాలలో ఆకాశం తెలుపురంగులో కనబడుతుంది. ఎందుకు?
(లేదా)
అప్పుడప్పుడు ఆకాశం తెలుపు రంగులో కనబడుటకు వెనుకన గల కారణాలేమిటో వ్రాయుము.
జవాబు:

  1. వాతావరణంలో వివిధ పరిమాణాలు గల కణాలుంటాయి.
  2. ఆ కణాలు వాటి పరిమాణాలకనుగుణంగా వివిధ తరంగదైర్ఘ్యాలు గల కాంతిని పరిక్షేపణం చేస్తాయి.
  3. వేసవి రోజుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల వాతావరణంలోకి నీటి ఆవిరి చేరుతుంది.
  4. దీని ద్వారా వాతావరణంలో నీటి అణువులు ఇతర పౌనఃపున్యాలు గల కాంతులను పరిక్షేపణం చేస్తాయి.
  5. N2, O2 ల పరిక్షేపణం వల్ల వచ్చే నీలిరంగు కాంతి, నీటి అణువుల పరిక్షేపణం వల్ల వచ్చే ఇతర రంగుల కాంతులన్నీ కలిసి మన కంటిని చేరినప్పుడు తెలుపురంగు కాంతి కనబడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 13.
తెల్లకాగితానికి నూనె పూస్తే, అది పాక్షిక పారదర్శకంగా పనిచేస్తుంది. ఎందుకు?
(లేదా)
కాగితం (లేదా) న్యూస్ పేపర్ కు నూనెను పూసిన అది పాక్షిక పారదర్శకంగా పని చేయుటకు గల కారణాలను వ్రాయుము.
జవాబు:

  1. తెల్లని కాగితం కాంతినిరోధములా ప్రవర్తించును.
  2. తెల్లని కాగితానికి నూనె పూస్తే అది పాక్షిక పారదర్శక పదార్థంగా పనిచేయును.
  3. కాగితము మరియు నూనెల వక్రీభవన గుణకాలు సమానమైతే, దానిమీద పడిన కాంతి సమాన వక్రీభవన గుణకాల వలన కాగితం నుండి నూనెలోనికి ప్రవేశించునపుడు ఎటువంటి పరిక్షేపణం చెందకుండా ప్రయాణించును.
  4. ఈ కారణం చేత నూనె పూసిన కాగితము పాక్షిక పారదర్శకముగా పనిచేయును.

ప్రశ్న 14.
“దీర్ఘదృష్టి” గల ఒక వ్యక్తికి 100 సెం.మీ. నాభ్యంతరం గల కటకాన్ని వాడమని డాక్టర్ సలహా ఇచ్చారు. కనిష్ఠ దూరబిందువు యొక్క దూరాన్ని, కటక సామర్థ్యాన్ని కనుగొనండి. (జవాబు : 33.33 సెం.మీ., 1D)
జవాబు:
వస్తు దూరము u =- 25 సెం.మీ. –
ప్రతిబింబదూరం V = కనిష్ఠ దూరము = -d
నాభ్యంతరము f = 100 సెం.మీ.
కనిష్ఠ దూరము ‘d’ మరియు నాభ్యంతరం ‘f అయిన
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 13

ప్రశ్న 15.
ఒక వ్యక్తి దూరంలో ఉన్న వస్తువును చూస్తున్నాడు. అతని కంటిముందు కేంద్రీకరణ కటకాన్ని ఉంచితే, అతనికి వస్తువు పెద్దదిగా కనబడుతుందా? కారణాన్ని తెల్పండి.
(లేదా)
రావు, అతనికి దూరంగా గల వస్తువును చూస్తున్నప్పుడు అతని స్నేహితుడు శ్రీను ఒక కుంభాకార కటకంను అతని కంటి ముందు ఉంచిన అది అతనికి వస్తువును పెద్దదిగా కనబడేటట్లు చేస్తుందా? దీనికి గల కారణాలను వ్రాయుము.
జవాబు:

  1. ఒక వ్యక్తి దూరంలో వున్న వస్తువును చూస్తున్నప్పుడు, అతని కంటి ముందు కేంద్రీకరణ కటకాన్ని ఉంచిన, వస్తు ప్రతిబింబం మసకబారుతుంది.
  2. కేంద్రీకరణ (లేక) కుంభాకార కటకపు ప్రతిబింబ విషయం వస్తు స్థానంపై ఆధారపడును.
  3. దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూస్తున్నపుడు కుంభాకార కటకం వలన అవి మసకగా కనిపిస్తాయి.
  4. ఒకవేళ వస్తువును కుంభాకార కటకపు విషయంలో కటకనాభి, కటక కేంద్రముల మధ్య ఉంచినపుడు నిటారైన, వృద్ధీకరణ చెందిన ప్రతిబింబం ఏర్పడును.

ప్రశ్న 16.
కృత్రిమ ఇంద్రధనుస్సును పొందే విధానాన్ని రెండు కృత్యాల ద్వారా వివరించండి. (AS1)
(లేదా)
మీ ఉపాధ్యాయుడు నిన్ను ఒక ఇంద్రధనుస్సును ఏర్పరచమన్న నీవు ఏ విధంగా ఏర్పరచెదవో ఒక కృత్యంను వ్రాయుము. (కృత్యం : 1)
జవాబు:

  1. తెల్లని గోడకు దగ్గరగా ఒక టేబుల్ ను ఉంచుము.
  2. ఒక కార్డ్ బోర్డు షీట్ కు మధ్యలో సన్నని రంధ్రం చేసి, దానిని టేబుల్ పై నిలువుగా అమర్చుము.
  3. కార్డ్ బోర్డుకు, గోడకు మధ్యలో ఒక పట్టకాన్ని ఉంచుము.
  4. తెలుపురంగు కాంతినిచ్చే కాంతి జనకాన్ని కార్డ్ బోర్డ్ కు దగ్గరగా ఉంచి, దాని రంధ్రం గుండా కాంతిని ప్రసరింపజేయుము.
  5. ఈ కాంతి సన్నని పుంజంగా ఉంటుంది. దీనిని పట్టకం యొక్క ఏదో ఒక దీర్ఘచతురస్రాకార తలంపై పడే విధముగా పట్టుకొని పట్టకాన్ని త్రిప్పుతూ ఉంటే, గోడపై ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది.

కృత్యం : 2
జవాబు:
7వ ప్రశ్న జవాబు చూడుము.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 17.
పట్టక వక్రీభవన గుణక సూత్రాన్ని ఉత్పాదించండి. (AS1)
(లేదా)
పట్టకపు వక్రీభవన గుణకంను కనుగొను సూత్రంను వ్రాసి, రాబట్టుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 15
1) పటంలో PQR అను పట్టకం యొక్క పట్టక కోణము ‘A’, పట్టక పదార్థపు వక్రీభవన గుణకము ‘n’, PQ, PRలు వక్రీభవన తలాలు.
2) AB పతన కిరణము, CD బహిర్గామి కిరణము పతన కోణము i1 బహిర్గామి కోణం i2 అనుకొనుము.

3) త్రిభుజము OMN నుండి,
d= i1 – r1 + i2 – r2
∴ d = (i1 + i2) – (r1 + r2) ………. (1)

4) త్రిభుజము PMN నుండి,
A + (90° = r1) + (90° – r2) = 180°
r1 + r2 = A ……………… (2)
5) (1), (2) సమీకరణాల నుండి
=d = (i1 + i2) – A
= A+ d = i1 + i2 ……………………… (3)

6) పతన కోణం, బహిర్గత కోణం, విచలన కోణము మరియు పట్టక కోణాల మధ్య సంబంధమును సమీకరణం- (3) తెలియజేస్తుంది.

7) స్నెల్ నియమం n1 sin i = n2 sin r కనుక, M బిందువు వద్ద, గాలి వక్రీభవన గుణకము n1 = 1, పట్టక వక్రీభవన గుణకము n2 = n, పతన కోణము i = i1, వక్రీభవన కోణం r = r1 లను స్నెల్ నియమంలో ప్రతిక్షేపించగా
sin i1 = n sin r1 ………. (4)

8) అదే విధముగా N బిందువు వద్ద, పట్టక వక్రీభవన గుణకము n1 = n, గాలి వక్రీభవన గుణకము n2 = 1, పతన కోణం i = r2, వక్రీభవన కోణం r= i2, స్నెల్ నియమంలో ప్రతిక్షేపించగా
n sin r2 = sin i2 ………. (5)

9) కనిష్ఠ విచలన కోణం (D) వద్ద పతన కోణం, బహిర్గామి కోణాల విలువలు సమానం. అనగా i1 = i2

10) సమీకరణం (3) నుండి కనిష్ఠ విచలన కోణంకు A + D = i + i
⇒ A + D = 2i1
∴ \(\mathrm{i}_{1}=\frac{\mathrm{A}+\mathrm{D}}{2}\)
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 16

ప్రశ్న 18.
λ1 తరంగదైర్ఘ్యం గల కాంతి n1 వక్రీభవన గుణకం గల యానకం నుండి n2 వక్రీభవన గుణకం గల యానకంలోకి ప్రవేశించింది. రెండవ యానకంలో ఆ కాంతి తరంగదైర్ఘ్యం ఎంత? (AS1)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 17
2) రెండు యానకాలలో తరంగదైర్ఘ్యాలు వరుసగా λ1 మరియు λ2 అనుకొనుము.

3) రెండు యానకాల వక్రీభవన గుణకాలు వరుసగా n1 మరియు n2 అనుకొనుము.

4) ఒక యానకపు వేగము (v), తరంగదైర్ఘ్యం (λ) మరియు పౌనఃపున్యాల (υ) మధ్య సంబంధము v = υλ.

5) కాంతి ఒక యానకం నుండి వేరొక యానకంలోకి ప్రవేశించినపుడు, దాని పౌనఃపున్యంలో మార్పు ఉండదు.

6) కావున v1 = υλ1 మరియు v2 = υλ2 అగును.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 18

ప్రశ్న 19.
అంశం (A) : పట్టక వక్రీభవన గుణకం, ఆ పట్టక తయారీకి వాడిన గాజురకంపై మరియు కాంతి రంగుపై మాత్రమే ఆధారపడుతుంది. (AS2)
కారణం (R) : పట్టక వక్రీభవన గుణకం, పట్టక వక్రీభవన కోణంపై మరియు కనిష్ఠ విచలన కోణంపై ఆధారపడుతుంది.
a) A, R రెండూ సరియైనవి. మరియు A కు R సరైన వివరణ.
b) A, R రెండూ సరియైనవి. కానీ Aకు R సరైన వివరణ కాదు.
c) A సరియైనది. కానీ R సరియైనది కాదు.
d) A మరియు R సరైనవి కావు.
e) A సరియైనది కాదు కానీ R సరైనది.
జవాబు:
b) ‘A, R’ లు రెండూ సరియైనవే, కాని A కు R సరైన వివరణ కాదు.
కారణము :
పట్టక వక్రీభవన సూత్రము ప్రకారం వక్రీభవన గుణకము, పట్టకం తయారీకి వాడిన గాజురకంపై మరియు కాంతి రంగుపై ఆధారపడుతుంది.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 19

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 20.
మన చుట్టూ ఉన్న రంగుల ప్రపంచాన్ని మనం చూడడానికి ఉపయోగపడేది కన్ను. కంటి కటకానికి గల సర్దుబాటు లక్షణం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఈ విషయంపై మీ స్పందనను తెలియజేసే విధంగా ఆరు వాక్యాల పద్యాన్ని రాయండి. (AS6)
జవాబు:
ఇంద్రియాలన్నింటిలో కన్నే మిన్నరా
అది లేకపోతే బ్రతుకే సున్నరా
సృష్టిని చూడగల్గడమే మహాభాగ్యంరా
దృష్టిని కల్గి ఉండడమే గొప్ప అదృష్టంరా
మన్నువంటి ఆధారం లేదురా
కన్నువంటి ప్రకాశం లేదురా
‘A’ విటమిన్ లోపిస్తే అంధత్వమేరా
అంధులైతే జీవితమే వృధారా
అందుకే కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలిరా.

ప్రశ్న 21.
గాజు పారదర్శక పదార్థం. ఒక తలం గరుకుగా చేయబడిన గాజు పాక్షిక పారదర్శకంగానూ, తెలుపురంగులోనూ కనబడుతుంది. ఎందుకు?
(లేదా)
సమరీతి, నునుపైన గాజు పారదర్శక పదార్థంగానూ, గరుకు చేయబడిన గాజు పాక్షిక పారదర్శకంగానూ, తెలుపు రంగులో కనబడుటకు గల కారణాలను వ్రాయుము.
జవాబు:

  1. గాజు ఒక పారదర్శక పదార్థం. ఇది తన గుండా కాంతిని ప్రసారం చేయును.
  2. గాజును ఒక తలం గరుకుగా చేయడం వల్ల ఆ ఉపరితలంలో అనేక ఎత్తు పల్లాలు అనగా అసమతలం ఏర్పడుతుంది.
  3. ఇటువంటి అసమతలం క్రమరహిత పరావర్తనమును ఏర్పరుస్తుంది.
  4. దీనివల్ల కొంతి ప్రసారం జరుగదు.
  5. దీని ప్రభావం వలన గాజు పాక్షిక పారదర్శకముగా పని చేస్తుంది.
  6. అందుకనే గరుకుతలం తెలుపురంగులో కనబడుతుంది.

ప్రశ్న 22.
పట్టకం యొక్క ఒక తలంపై 40° కోణంతో పతనమైన కాంతి కిరణం, 30° కనిష్ఠ విచలనాన్ని పొందింది. అయిన పట్టక కోణాన్ని, ఇచ్చిన తలం వద్ద వక్రీభవన కోణాన్ని కనుగొనండి. (జవాబు : 50°, 25°) (AS7)
జవాబు:
పట్టకపు తలంపై పతనమయ్యే కాంతి పతన కోణము = i = 40°
కనిష్ఠ విచలన కోణము = D = 30°
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 20

ఖాళీలను పూరించండి

1. స్పష్ట దృష్టి కనిష్ఠ దూరం విలువ …………. (25 సెం.మీ.)
2. రెటీనా, కంటి కటకాల మధ్య దూరం ………….. (2.5 సెం.మీ.)
3. కంటి కటకం యొక్క గరిష్ఠ నాభ్యంతరం విలువ …………… (2.5 సెం.మీ.)
4. మానవుని కంటి యొక్క నాభ్యంతరం మారటానికి దోహదపడే కండరాలు ………………. (సిలియరి)
5. కటకం యొక్క సామర్థ్యం 1D అయిన, ఆ కటక నాభ్యంతరం …………….. (100 సెం.మీ.)
6. హ్రస్వ దృష్టిని నివారించేందుకు ………………….. కటకాన్ని వాడుతారు. (పుటాకార)
7. దీర్ఘదృష్టిని నివారించేందుకు ……………… కటకాన్ని వాడుతారు. (కుంభాకార)
8. పట్టకం కనిష్ఠ విచలన స్థానంలో ఉన్నప్పుడు పతన కోణం ………………….. కు సమానం. (బహిర్గామికోణం)
9. తెల్లని కాంతి వివిధ రంగులుగా (VIBGYOR) విడిపోవడాన్ని ………………… అంటాం. (కాంతి విక్షేపణం)
10. వక్రీభవనం జరిగినప్పుడు కాంతి ………………….. లో మార్పు రాదు. (పౌనఃపున్యం)

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. మానవుని కన్ను గ్రహించే వస్తు పరిమాణం ప్రాథమికంగా …. పై ఆధారపడుతుంది.
A) వస్తువు నిజ పరిమాణం
B) కన్ను నుండి వస్తువుకు గల దూరం
C) నల్లగుడ్డు రంధ్రం
D) రెటీనాపై ఏర్పడ్డ ప్రతిబింబ పరిమాణం
జవాబు:
B) కన్ను నుండి వస్తువుకు గల దూరం

2. వివిధ దూరాలలో గల వస్తువులను చూస్తున్నప్పుడు కింది వాటిలో ఏది స్థిరంగా ఉంటుంది?
A) కంటి కటక నాభ్యంతరం
B) కంటి కటకం నుండి వస్తువుకి గల దూరం
C) కంటి కటక వక్రతా వ్యాసార్ధం
D) కంటి కటకం నుండి ప్రతిబింబ దూరం
జవాబు:
D) కంటి కటకం నుండి ప్రతిబింబ దూరం

3. కింది వాటిలో వక్రీభవన సమయంలో మారని విలువ
A) తరంగదైర్ఘ్యం
B) పౌనఃపున్యం
C) కాంతివేగం
D) పైవన్నీ
జవాబు:
B) పౌనఃపున్యం

4. పటంలో చూపిన విధంగా టేబుల్ పై ఉంచిన ఒక సమద్విబాహు పట్టకంపై కాంతి పతనమైంది. కనిష్ఠ విచలనానికి సంబంధించి కింది వాటిలో ఏది సరియైనది?
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 14
A) ఆధారానికి సమాంతరరేఖ PQ
B) ఆధారానికి సమాంతరరేఖ QR
C) ఆధారానికి సమాంతరరేఖ RS
D) ఆధారానికి సమాంతర రేఖ PQ లేదా RS
జవాబు:
B) ఆధారానికి సమాంతరరేఖ QR

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

5. హ్రస్వదృష్టితో బాధపడే వ్యక్తి యొక్క గరిష్ఠ దూరం 5 మీ. దీనిని నివారించి సాధారణ దృష్టి వచ్చేట్లు చేయాలంటే …. ను వినియోగించాలి.
A) 5 మీ. నాభ్యంతరం గల పుటాకార కటకం
B) 10 మీ. నాభ్యంతరం గల పుటాకార కటకం
C) 5 మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకం
D) 2.5 మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకం
జవాబు:
A) 5 మీ. నాభ్యంతరం గల పుటాకార కటకం

6. సూర్యకాంతిని శోషించుకున్న అణువు వివిధ కాంతి తీవ్రతలతో అన్ని దిశలలోనూ కాంతిని విడుదల చేయడాన్ని …….. అంటాం.
A) కాంతి పరిక్షేపణం
B) కాంతి విక్షేపణం
C) కాంతి పరావర్తనం
D) కాంతి వక్రీభవనం
జవాబు:
A) కాంతి పరిక్షేపణం

10th Class Physical Science 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Textbook InText Questions and Answers

10th Class Physical Science Textbook Page No. 90

ప్రశ్న 1.
విమానంలో ప్రయాణించే వ్యక్తికి ఇంద్రధనుస్సు ఏ ఆకారంలో కనిపిస్తుందో ఊహించగలరా? మీ స్నేహితులతో చర్చించండి. సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
విమానంలో ప్రయాణించే వ్యక్తికి ఇంద్రధనుస్సు పూర్తిగా వృత్తాకారంలో కన్పించును.

10th Class Physical Science Textbook Page No. 90

ప్రశ్న 2.
మన కంటిముందున్న అన్ని వస్తువులనూ మనం స్పష్టంగా చూడగలమా?
జవాబు:
మన కంటి ముందు 25 సెం.మీ. దూరానికి అవతల ఉన్న అన్ని వస్తువులను మనం స్పష్టంగా చూడగలం.

10th Class Physical Science Textbook Page No. 91

ప్రశ్న 3.
స్పష్ట దృష్టి యొక్క సరాసరి దూరం విలువ ఎంత?
జవాబు:
స్పష్ట దృష్టి యొక్క కనీస దూరం 25 సెం.మీ.

ప్రశ్న 4.
మీ కంటికి 25 సెం.మీ. దూరంలో ఉంచిన వస్తువు ఆకారం ఎలా ఉన్నా, దానిని పై నుండి కింది వరకు మీరు చూడగలరా?
జవాబు:
చూడలేము. ఎందుకనగా స్పష్ట దృష్టి కనీస దూరం విలువ వయస్సుపై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా కంటి వద్ద 60° కోణంతో కనబడే వస్తుభాగం మాత్రమే మనం చూడగలం.

10th Class Physical Science Textbook Page No. 92

ప్రశ్న 5.
స్పష్ట దృష్టి కనీస దూరం, దృష్టికోణం విలువలు వ్యక్తినిబట్టి, వయసునుబట్టి ఎందుకు మారతాయి?
జవాబు:
ఈ విలువలన్నీ కంటి నిర్మాణం మరియు సిలియరి కండరాల పనితీరుపై ఆధారపడి ఉంటాయి కాబట్టి.

10th Class Physical Science Textbook Page No. 93

ప్రశ్న 6.
వివిధ వస్తుదూరాలకు ఒకే ప్రతిబింబదూరం ఉండడం ఎలా సాధ్యం?
జవాబు:
కటకనాభ్యంతరం విలువను మారుస్తూ ఉంటే వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండటం సాధ్యపడుతుంది.

ప్రశ్న 7.
కటకాల గుండా వక్రీభవనం గురించి మీకున్న అవగాహనతో పై ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?
జవాబు:
చెప్పగలము. వస్తుదూరం మారినప్పుడు ప్రతిబింబ దూరం స్థిరంగా ఉండాలంటే కటక నాభ్యాంతరం మారాలి.

10th Class Physical Science Textbook Page No. 94

ప్రశ్న 8.
కన్ను తన నాభ్యంతరాన్ని ఎలా మార్చుకుంటుంది? కనుగుడ్డులో ఈ మార్పు ఎలా జరుగుతుంది?
జవాబు:
కనుగుడ్డులోని కటకానికి ఆనుకుని ఉన్న సిలియరి కండరాలు కటక వక్రతా వ్యాసార్థాన్ని మారుస్తాయి. ఈ మార్పు ద్వారా కన్ను తన నాభ్యంతరాన్ని మార్చుకుంటుంది.

ప్రశ్న 9.
కంటి కటకం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా? మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా?
జవాబు:
కంటి కటకం వస్తువు నిజ ప్రతిబింబాన్ని రెటీనా పై తలక్రిందులుగా ఏర్పరుస్తుంది.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 10.
కంటి కటక నాభ్యంతరం మార్పుకు ఏదైనా హద్దు ఉందా?
జవాబు:
అవును. కటక నాభ్యంతరానికి గరిష్ఠ, కనిష్ఠ విలువలుంటాయి.

10th Class Physical Science Textbook Page No. 95

ప్రశ్న 11.
కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోలేకపోతే ఏం జరుగుతుంది?
జవాబు:
కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోలేకపోతే వస్తువును సులభంగా, స్పష్టంగా చూడలేము.

ప్రశ్న 12.
కంటి కటక నాభ్యంతరం 2.27 – 2.5 సెం.మీ.లకు మధ్యస్థంగా లేకపోతే ఏమవుతుంది?
జవాబు:
కంటి కటక నాభ్యంతరం 2.27 – 2.5 సెం.మీ. లకు మధ్యస్థంగా లేకపోతే కంటి దోషాలు ఏర్పడతాయి.

10th Class Physical Science Textbook Page No. 97

ప్రశ్న 13.
‘కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కంటే ఎక్కువైతే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కంటే ఎక్కువైతే దీర్ఘదృష్టి ఏర్పడుతుంది.
  2. అంటే ఆ వ్యక్తి దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలదు కాని దగ్గరి వస్తువులను చూడలేదు.

10th Class Physical Science Textbook Page No. 98

ప్రశ్న 14.
దీర్ఘదృష్టిని సవరించడానికి ఏం చేయాలి?
జవాబు:
దీర్ఘదృష్టి సవరణ :

  1. వస్తువు కనిష్ఠదూర బిందువుకు ఆవల ఉంటే, కంటికటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు.
  2. కనుక కనిష్ఠదూర బిందువు (H) కు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (L) కు మధ్యనున్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కనిష్ఠదూర బిందువుకు ఆవల ఏర్పరచగలిగే కటకాన్ని అంటే ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించాలి.
  3. ద్వికుంభాకార కటకాన్ని వాడటం వల్ల ఇది సాధ్యపడుతుంది.

10th Class Physical Science Textbook Page No. 99

ప్రశ్న 15.
కంటి డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ లోని వివరాలను మీరెప్పుడైనా పరిశీలించారా?
జవాబు:
కంటి డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్లోని వివరాలను పరిశీలించాను. అవి +, – గుర్తులతో సూచింపబడి ఉంటాయి.

ప్రశ్న 16.
సైట్ పెరగడం లేదా తగ్గడం అంటే ఏమిటి?
జవాబు:
కంటి చూపులోని పెరుగుదల లేదా తగ్గుదల.

ప్రశ్న 17.
కటక సామర్థ్యం అంటే ఏమిటి?
జవాబు:
కటక సామర్థ్యం :
ఒక కటకం కాంతికిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయిని కటక సామర్థ్యం అంటాం. (లేదా) కటక నాభ్యంతరం యొక్క విలోమ విలువను కటక సామర్థ్యం అంటాం.

ఒక కటక నాభ్యంతరం గ అనుకుంటే,
కటక సామర్థ్యం P = 1/f (మీటర్లలో) ; P = 100/f (సెం.మీ.లలో)
కటక సామర్థ్యానికి ప్రమాణం డయాప్టర్ (Dioptre). దీనిని D తో సూచిస్తాం.

10th Class Physical Science Textbook Page No. 100

ప్రశ్న 18.
పట్టకం అంటే ఏమిటి?
జవాబు:
ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసరయానకం నుండి వేరుచేయబడి ఉన్న పారదర్శక యానకాన్ని “పట్టకం” అంటారు.

10th Class Physical Science Textbook Page No. 105

ప్రశ్న 19.
తెల్లని కాంతి రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్ధాంతంతో వివరించగలమా?
జవాబు:
తెల్లని కాంతి రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్ధాంతంతో వివరించలేము.

ప్రశ్న 20.
వివిధ రంగులు గల కొంతుల వేగాలు వేర్వేరుగా ఉంటాయా?
జవాబు:
శూన్యంలో వివిధ రంగులు గల కాంతుల వేగాలు స్థిరంగా ఉంటాయి. యానకంలో వివిధ రంగులు గల కాంతుల వేగాలు వేర్వేరుగా ఉంటాయి.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 21.
పట్టకం గుండా తెలుపురంగు కాంతిని పంపితే అది వివిధ రంగులుగా ఎందుకు విడిపోతుందో ఇప్పుడు మీరు ఊహించగలరా?
జవాబు:
శూన్యంలో అన్ని రంగుల కాంతి వేగాలు ఒకటే అయినప్పటికీ, ఒక యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతివేగం దాని తరంగదైర్యంపై ఆధారపడును. అందువల్ల కాంతి వివిధ రంగులుగా విడిపోతుంది.

10th Class Physical Science Textbook Page No. 106

ప్రశ్న 22.
పట్టకం గుండా తెలుపురంగు కాంతిని పంపితే అది వివిధ రంగులుగా ఎందుకు విడిపోతుందో ఇప్పుడు మీరు ఊహించగలరా?
జవాబు:
యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతి వేగం దాని తరంగదైర్ఘ్యంపై ఆధారపడుతుంది. అందువల్ల కాంతి వివిధ రంగులుగా విడిపోతుంది.

ప్రశ్న 23.
కృత్యం – 3లో చూసినట్లు ప్రకృతిలో మీరు రంగులు చూడగలిగే సందర్భానికి ఒక ఉదాహరణ ఇవ్వగలరా?
జవాబు:
ప్రకృతిలో రంగులు చూడగలిగే సందర్భం ఇంద్రధనుస్సు.

10th Class Physical Science Textbook Page No. 108

ప్రశ్న 24.
ఆకాశం నీలిరంగులో ఎందుకు కనిపిస్తుంది?
జవాబు:
వాతావరణంలోని N2, O2 అణువులు సూర్యుని కాంతిలోని నీలం రంగు కాంతిని పరిక్షేపణం చెందించడం వల్ల ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది.

10th Class Physical Science Textbook Page No. 109

ప్రశ్న 25.
పరిక్షేపణం అంటే ఏమిటి?
జవాబు:
ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశలలో వివిధ తీవ్రతలతో విడుదల చేయడాన్ని “కాంతి పరిక్షేపణం” అంటారు.

ప్రశ్న 26.
స్వేచ్ఛా పరమాణువు లేదా అణువుపై నిర్దిష్ట పౌనఃపున్యం గల కాంతి పతనం చెందితే ఏం జరుగును?
జవాబు:
పరమాణువులు లేదా అణువులపై కాంతి పతనం చెందినపుడు అవి కాంతి శక్తిని శోషించుకుని, అందులో కొంత భాగాన్ని వివిధ దిశల్లో ఉద్గారం చేస్తాయి. ఇదే కాంతి పరిక్షేపణంలోని ప్రాథమిక నియమము.

10th Class Physical Science Textbook Page No. 94

ప్రశ్న 27.
వస్తువు ఆకారం, పరిమాణం మరియు రంగులలో ఏ మార్పు లేకుండా వస్తువును మనం గుర్తించే విధంగా రెటీనాపై ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది?
జవాబు:

  1. రెటీనా అనేది ఒక సున్నితమైన పొర.
  2. దీనిలో దండాలు (rods) మరియు శంఖువులు (cones) అనబడే దాదాపు 125 మిలియన్ల గ్రాహకాలు (receptors) ఉంటాయి.
  3. ఇవి కాంతి సంకేతాలను (signals) గ్రహిస్తాయి. శంఖువులు రంగును గుర్తిస్తాయి. దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి.
  4. ఈ సంకేతాలు దాదాపు 1 మిలియన్ దృక్ నాడుల (optic – nerve fibres) ద్వారా మెదడుకు చేరవేయబడతాయి.
  5. వాటిలోని సమాచారాన్ని మెదడు విశ్లేషించడం ద్వారా వస్తువు ఆకారం, పరిమాణం మరియు రంగులను మనం గుర్తిస్తాం.

ప్రశ్న 28.
కంటి కటకం యొక్క కనిష్ఠ, గరిష్ఠ నాభ్యంతరాలు ఎంత? వాటిని మనం ఎలా కనుగొంటాము?
జవాబు:
గరిష్ఠ నాభ్యంతరం

  1. పటంలో చూపినట్లు అనంతదూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే
    సమాంతర కాంతి కిరణాలు కంటి కటకంపై పడి వక్రీభవనం చెందాక
    రెటీనా పై ఒక బిందురూప ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి.
  2. ఈ సందర్భంలో కంటి కటక నాభ్యంతరం గరిష్టంగా ఉంటుంది.
  3. దీని విలువ fగరిష్ఠ = 2.5 సెం.మీ. ఉండును.

కనుగొనే విధానం :
వస్తుదూరం = µ = α
ప్రతిబింబ దూరం = v = 2.5 సెం.మీ (కంటికటకం నుండి రెటీనాకు దూరం)
నాభ్యంతరం = f = ?
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 21

కనిష్ఠ నాభ్యంతరము :

  1. పటంలో చూపినట్లు కంటి ముందు 25 సెం.మీ. దూరంలో వస్తువు ఉందనుకొనుము.
  2. ఈ సందర్భంలో కంటి కటక నాభ్యంతరం కనిష్ఠంగా ఉంటుంది.
  3. దీని విలువ fకనిష్ఠ = 2.27 సెం.మీలుగా ఉండును.

కనుగొనే విధానం :
వస్తు దూరం = u = 25 సెం.మీ.
ప్రతిబింబ దూరం = v = 25 సెం.మీ. (కంటి కటకం నుండి రెటీనాకు గల దూరం)
నాభ్యంతరం = f = ?
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 22

10th Class Physical Science Textbook Page No. 96

ప్రశ్న 29.
హ్రస్వదృష్టిని సవరించడానికి ఏం చేయాలి?
జవాబు:
హ్రస్వదృష్టికి సవరణ :

  1. గరిష్ఠదూర బిందువుకు, స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువుకు మధ్య వస్తువు ఉన్నప్పుడు కంటికటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు.
  2. కాబట్టి ఒక కటకాన్ని ఉపయోగించి గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూరబిందువు (M) మరియు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (L) ల మధ్యకు తేగలిగితే, ఆ ప్రతిబింబం కంటి కటకానికి వస్తువులా పనిచేస్తుంది.
  3. పుటాకార కటకాన్ని వాడడం వల్ల ఇది సాధ్యపడుతుంది.

10th Class Physical Science Textbook Page No. 97

ప్రశ్న 30.
హ్రస్వదృష్టిని నివారించడానికి వాడవలసిన పుటాకార కటక నాభ్యంతరం ఎంత ఉండాలనేది ఎలా నిర్ణయిస్తాం?
జవాబు:

  1. హ్రస్వదృష్టిని నివారించడానికి, అనంతదూరంలో ఉండే వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూరబిందువు వద్ద ఏర్పరచగలిగే కటకాన్ని అంటే ద్విపుటాకార కటకాన్ని ఎంచుకోవాలి.
  2. ఈ కటకం ఏర్పరచే ప్రతిబింబం కంటి కటకానికి వస్తువులా పనిచేసి చివరగా ప్రతిబింబం రెటీనాపై ఏర్పడుతుంది.
  3. ఈ సందర్భంలో వస్తుదూరం (u) అనంతం. ప్రతిబింబదూరం (v) గరిష్ఠ దూర బిందువుకు గల దూరానికి సమానం. కావున
    u = – ∞, v = -D (గరిష్ఠ దూరబిందువుకు, కంటికి గల దూరం)
  4. ద్విపుటాకార కటక నాభ్యంతరం గ అనుకుంటే..
    1/f = 1/v – 1/4 సూత్రాన్ని ఉపయోగించినపుడు 1/f = 1/-D ⇒ f = -D
  5. ఇక్కడ f కు ‘ఋణ విలువ’ రావడమనేది పుటాకార కటకాన్ని తెలియజేస్తుంది.

10th Class Physical Science Textbook Page No. 108

ప్రశ్న 31.
వాననీటి బిందువులతో విక్షేపణం చెందిన కాంతి అర్ధవలయాకారంలో ఎందుకు కన్పిస్తుంది?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 23

  1. ఇంద్రధనుస్సు అనునది మనకు కనబడే విధంగా పలుచని ద్విమితీయ చాపం కాదు.
  2. ఇంద్రధనుస్సు అనేది మీ కంటి వద్ద తన కొనభాగాన్ని కల్గి వున్న త్రిమితీయ శంఖువు.
  3. పటంలో చూపినట్లు శంఖువు అక్షం వెంబడి మనం భాగం భూమి పైని వాతావరణంలోని కణాల నుండి, శంఖువు కింది సగ భాగం నేలపైని వస్తువుల నుండి వచ్చే కాంతులను మన కంటికి చేరవేస్తున్నాయి.
  4. కావున గాలిలోని నీటి బిందువుల నుండి వచ్చే కాంతి (శంఖువు పై సగం) మనకు ఇంద్రధనుస్సును అర్ధ చంద్రాకారంలో ఏర్పరుస్తుంది.
  5. మనం భూమి నుండి నిర్ణీత ఎత్తుకు వెళ్తే ఇంద్ర ధనుస్సును పూర్తి వలయంగా చూడవచ్చు.

10th Class Physical Science Textbook Page No. 110

ప్రశ్న 32.
వేసవి రోజుల్లో (ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో) ఒక నిర్దిష్ట దిశలో చూస్తున్నపుడు కొన్ని సందర్భాలలో ఆకాశం తెలుపురంగులో కనిపిస్తుంది. ఎందుకు?
జవాబు:

  1. వాతావరణంలో వివిధ పరిమాణాలు గల కణాలుంటాయి. వాటి పరిమాణాల కనుగుణంగా అవి వివిధ తరంగదైర్యాలు గల కాంతిని పరిక్షేపణం చేస్తాయి.
  2. ఉదాహరణకు N2, O2 అణువుల కన్నా నీటి అణువు పరిమాణం ఎక్కువ. కాబట్టి అది నీలిరంగుకాంతి కంటే తక్కువ పౌనఃపున్యాలు (ఎక్కువ తరంగదైర్యాల) గల కాంతులకు పరిక్షేపణ కేంద్రంగా పనిచేస్తుంది.
  3. వేసవి రోజుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల వాతావరణంలోకి నీటి ఆవిరి చేరుతుంది.
  4. తద్వారా వాతావరణంలో నీటి అణువులు అధిక స్థాయిలో ఉంటాయి.
  5. ఈ నీటి అణువులు ఇతర పౌనఃపున్యాలు (నీలిరంగు కానివి) గల కాంతులను పరిక్షేపణం చేస్తాయి.
  6. N2, O2, ల పరిక్షేపణం వల్ల వచ్చే నీలిరంగుకాంతి, నీటి అణువుల పరిక్షేపణం వల్ల వచ్చే ఇతర రంగుల కాంతులు అన్నీ కలిసి మన కంటిని చేరినప్పుడు తెలుపు రంగు కాంతి కనబడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

10th Class Physical Science Textbook Page No. 111

ప్రశ్న 33.
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలలో సూర్యుడు ఎర్రగా కనబడడానికి గల కారణం మీకు తెలుసా?
జవాబు:

  1. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో సూర్యుని నుండి వెలువడే కాంతి మీ కంటిని చేరడానికి భూ వాతావరణంలో అధిక దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.
  2. ఎరుపు రంగు కాంతి తప్ప మిగిలిన అన్ని రంగుల కాంతులు అధికంగా పరిక్షేపణం చెంది కాంతి మీ కంటిని చేరే లోపే ఆ రంగులన్నీ కనుమరుగవుతాయి.
  3. ఎరుపు రంగు కాంతి తక్కువగా పరిక్షేపణం చెందడం వల్ల అది మీ కంటిని చేరును.
  4. ఫలితంగా సూర్యుడు, సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలలో ఎరుపుగా కన్పిస్తాడు.

ప్రశ్న 34.
మధ్యాహ్న వేళల్లో సూర్యుడు ఎర్రగా ఎందుకు కనబడడో ఊహించగలరా?
జవాబు:

  1. ఉదయం, సాయంత్రం వేళల కంటే మధ్యాహ్నం సమయంలో వాతావరణంలో సూర్యకాంతి ప్రయాణించే దూరం తక్కువ.
  2. కాబట్టి కాంతి ఎక్కువగా పరిక్షేపణం చెందక పోవడం వల్ల అన్ని రంగులూ మీ కంటిని చేరతాయి.
  3. కాబట్టి మధ్యాహ్న వేళల్లో సూర్యుడు తెల్లగా కనబడతాడు.

10th Class Physical Science Textbook Page No. 98

ప్రశ్న 35.
దీర్ఘదృష్టిని నివారించడానికి వాడవలసిన కుంభాకార కటక నాభ్యంతరం ఎంత ఉండాలనేది ఎలా నిర్ణయిస్తాం?
జవాబు:
1) కటక నాభ్యంతరాన్ని కనుగొనడానికి, స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (L) వద్ద ఒక వస్తువు ఉన్నదని ఊహించవలెను.

2) పటంలో చూపినవిధంగా L వద్ద ఉన్న వస్తువు ప్రతిబింబాన్ని కనిష్ఠదూర బిందువు (H) వద్ద ఏర్పరచగలిగే ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగిస్తే దృష్టిదోషం సవరించబడుతుంది.

3) ఆ ప్రతిబింబం కంటికటకానికి వస్తువుగా పనిచేస్తుంది.

4) కనుక చివరగా కంటి కటకం వలన ఏర్పడే ప్రతిబింబం రెటీనా పై ఏర్పడుతుంది.

5) ఈ సందర్భంలో, వస్తుదూరం
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 5
(u) = -25 సెం.మీ.
ప్రతిబింబం దూరం (v) = – d
(కంటికి, కనిష్ఠ దూరబిందువుకు గల దూరం)
మనం వాడే ద్వికుంభాకార కటక నాభ్యంతరం f అనుకుంటే.
1/f = 1/v – 1/4 సూత్రాన్ని ఉపయోగించినపుడు :
1/f = 1/-d – 1/(-25) ⇒ 1/f = -1/d + 1/25
1/f = (d – 25)/25d ⇒ f = 25d(d – 25)
d > 25 కాబట్టి గ విలువ ధనాత్మకం అవుతుంది. అనగా కుంభాకార కటకం వాడాలని తెలుస్తుంది.

పరికరాల జాబితా

పొడవైన కర్ర లేదా పివిసి పైపు ముక్కలు (20, 30, 35, 40, 50 సెం.మీ.,) అడ్డు కడ్డీ, రిటారు స్టాండు, కంటి నిర్మాణం ప్రదర్శించే నమూనా, డ్రాయింగ్ షీట్, పెన్సిల్, గుండుసూదులు, స్కేలు, కోణమానిని, పట్టకం, చిన్న రంధ్రం కలిగిన కార్డుబోర్డు, తెల్లని కాంతి జనకం (టార్చిలైటు), లోహపు పళ్లెం, అద్దం, నీరు, గాజుబీకరు, సోడియం’
థయో సల్ఫేట్, సల్ఫూరికామ్ల ద్రావణాలు

10th Class Physical Science 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
స్పష్ట దృష్టి కనీస దూరమును కనుగొనుటకు ఒక కృత్యాన్ని వ్రాయుము.
జవాబు:

  1. ఒక పుస్తకాన్ని తెరచి మీ కంటి ముందు కొంతదూరంలో పట్టుకొని చదవడానికి ప్రయత్నించండి.
  2. నెమ్మదిగా ఆ పుస్తకాన్ని మీ కంటివైపుగా, కంటికి అతి దగ్గరగా చేరే వరకు కదిలించండి.
  3. పుస్తకంలోని అక్షరాలు మసకబారినట్లుగా అనిపిస్తాయి లేదా మీ కన్ను ఒత్తిడికి గురైనట్లు అనిపిస్తుంది.
  4. పుస్తకంలోని అక్షరాలను మీ ‘కన్ను ఏ ఒత్తిడి లేకుండా చూడగలిగే స్థానం వరకు నెమ్మదిగా పుస్తకాన్ని వెనుకకు . జరపండి.
  5. ఈ సందర్భంలో పుస్తకానికి, మీ కంటికి గల దూరాన్ని కొలిస్తే అది దాదాపు 25 సెం.మీ. ఉంటుంది.
  6. ఈ దూరం వ్యక్తికి, వ్యక్తికీ వయస్సును బట్టి మారుతుంది.
  7. మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా, స్పష్టంగా ఒక వస్తువును మనము చూడాలంటే ఉండవలసిన కనీస దూరాన్ని “స్పష్ట దృష్టి కనీస దూరం” అంటారు.

కృత్యం – 2

ప్రశ్న 2.
“దృష్టికోణం” ను కనుగొనేందుకు ఒక కృత్యాన్ని తెల్పుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 24 AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 25

  1. బట్టలషాప్ లో బట్టల చుట్టలకు వచ్చే కర్రలను లేదా PVC పైపులను సేకరించుము.
  2. ఈ వస్తువులను 20 సెం.మీ., 30 సెం.మీ., 35 సెం.మీ., 40 సెం.మీ., 50 సెం.మీ. పొడవు గల ముక్కలుగా ఆ కత్తిరించుము.
  3. ఒక రిటార్ట్ స్టాండును బల్లపై ఉంచి, రిటార్ట్ స్టాండు నిలువు కడ్డీ ప్రక్కన మీ తల ఉండే విధముగా బల్ల దగ్గర నిలబడండి.
  4. మీ కంటి నుండి 25 సెం.మీ. దూరంలో రిటార్టు స్టాండ్ అడ్డుకడ్డీకి క్లాంప్ ను బిగించి, 30 సెం.మీ. పొడవు గల కర్రను కట్టమని మీ స్నేహితునికి చెప్పుము.
  5. ఇప్పుడు అడ్డుకడ్డీ వెంబడి మీ దృష్టి సారిస్తూ, కర్రముక్కను పై అంచు నుండి క్రింది అంచు వరకు మొత్తంగా చూడడానికి ప్రయత్నించుము.
  6. కర్రముక్క 25 సెం.మీ. దూరంలో ఉన్నప్పుడు దాని రెండు చివరలను మీరు స్పష్టంగా చూడలేకపోతే, అడ్డుకడ్డీ వెంబడి కర్రముక్కను వెనుకకు జరుపుము.
  7. ఏ కనీస దూరం వద్ద మీరు దానిని పూర్తిగా చూడగలరో అక్కడ దానిని అడ్డుకడ్డీకి ఇంప్ సహాయంతో బిగించండి.
  8. వస్తువు యొక్క చివరి బిందువుల నుండి వచ్చే కిరణాలు కంటి వద్ద కొంత కోణం చేస్తాయి.
  9. ఈ కోణం 60° కంటే తక్కువగా ఉంటే ఆ వస్తువును పూర్తిగా మనము చూడగలము.
  10. ఈ కోణం 60° కంటే ఎక్కువగా ఉంటే ఆ వస్తువులో కొంతభాగం మాత్రమే మనము చూడగలము.
  11. ఏ గరిష్ఠ కోణము వద్ద మనము పూర్తిగా చూడగలమో, ఆ కోణాన్ని “దృష్టికోణం” అంటారు.
  12. ఈ విధముగా దృష్టికోణమును కనుగొంటారు.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

కృత్యం – 6

ప్రశ్న 3.
కాంతి పరిక్షేపణాన్ని ప్రయోగ పూర్వకముగా వ్రాయుము.
జవాబు:

  1. ఒక బీకరులో సోడియం థయోసల్ఫేట్ (హైపో) మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లాల ద్రావణాన్ని తీసుకొనుము.
  2. ఈ గాజు బీకరును ఆరుబయట సూర్యుని వెలుగులో ఉంచుము.
  3. బీకరులో సల్ఫర్ స్పటికాలు ఏర్పడటాన్ని గమనించుము.
  4. రసాయన చర్య జరుగుతున్న కొలదీ సల్ఫర్ అవక్షేపం (precipitation) ఏర్పడటం గమనించవచ్చును.
  5. ప్రారంభంలో సల్ఫర్ స్పటికాలు చాలా చిన్నవిగానూ చర్య జరిగే కొలదీ వాటి పరిమాణం పెరుగును.
  6. మొదట సల్ఫర్ స్పటికాలు నీలిరంగులో ఉం, వాటి పరిమాణం పెరుగుతున్నకొలదీ తెలుపు రంగులోకి మారును. దీనికి కారణం కాంతి పరిక్షేపణము.
  7. ప్రారంభంలో సల్ఫర్ స్పటికాల పరిమాణం చాలా తక్కువగా ఉండి, అది నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చడానికి వీలైనదిగా ఉంటుంది. కావున అపుడు అవి నీలిరంగులో కనబడతాయి.
  8. సల్పర్ స్పటికాల పరిమాణం పెరుగుతున్న కొలదీ వాటి పరిమాణం ఇతర రంగు కాంతుల తరంగదైర్యాలతో పోల్చడానికి వీలయ్యేదిగా ఉంటుంది.
  9. అప్పుడు ఆ స్పటికాలు ఇతర రంగుల కాంతులకు పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.
  10. ఈ అన్ని రంగులూ కలిసి తెలుపు రంగులా కనబడుతుంది.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

SCERT AP 10th Class Social Study Material Pdf 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social Studies 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది కథనం ఆధారంగా సమాచార హక్కు చట్టం నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల, పౌరుల పాత్రలను వివరించండి. సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వ పని మరింత పారదర్శకంగా ఎలా అవుతుందో రాయండి. (AS2)
కింద పేర్కొన్న ఘటన మెదక్ జిల్లాలోని చిన్న శంకరం పేటలో జరిగింది. స్వయం సహాయక బృందాల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ పథకాలైన అభయహస్తం, ఆమ్ ఆద్మీలలో చేరారు. ఈ పథకం కింద 9 నుంచి 12 తరగతులు చదువుతున్న పిల్లలకు 1200 రూపాయల స్కాలర్షిప్ పొందడానికి అర్హత ఉంది. అయితే 2008-11 మధ్య మూడు సంవత్సరాల పాటు విద్యార్థులకు స్కాలర్షిప్ మొత్తం అందలేదు. విద్యార్థులు ఇందిరా క్రాంతి పథకం (IKP) కార్యాలయానికి వెళ్లి అడిగారు. కానీ అక్కడి అధికారులు వాళ్లను పట్టించుకోలేదు.

ఇది స్థానిక దినపత్రికల దృష్టికి వచ్చింది. ఆమోదించిన స్కాలర్షిప్పుల వివరాలు ఇవ్వమంటూ వాళ్లు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేశారు. 2008-09, 2009-10, 2010-11 సంవత్సరాలలో లబ్ధిదారుల సంఖ్య, మంజూరు చేసిన మొత్తం ఎంత అని అడిగారు. వాళ్లకు ఒక వారంలోపు సమాచారం వచ్చింది. మొత్తం ఏడు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. సమాచార హక్కు ద్వారా అందిన వివరాలను బట్టి డబ్బు మంజూరయ్యింది కానీ, దానిని పంచలేదని తెలిసింది. ఈ విషయం వార్తాపత్రికలలో ప్రచురితం కాగానే 15 రోజుల లోపు 1167 విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు.
జవాబు:
సమాచార హక్కు చట్టం ప్రయోజనాలు ప్రజలకు అందాలంటే రెండు పాత్రలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి.

  1. ప్రభుత్వ శాఖలు
  2. పౌరులు

ఏ ప్రజాస్వామిక వ్యవస్థలోనైనా ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించి వారికి జవాబుదారీగా ఉండాలి.

1) ప్రభుత్వశాఖల పాత్ర :
పై ఘటనలో ఉన్న ప్రభుత్వ శాఖలు – రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ పథకాలైన అభయహస్తం, ఆమ్ ఆద్మీ, ఇందిరా క్రాంతి పథం. ఈ సంస్థలు వాటి యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించాలి. అంటే 9 నుండి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు 1200 రూపాయల స్కాలర్షిప్ అందజేయాలి. కాని 2008-11 మధ్య మూడు సంవత్సరాలపాటు పిల్లలకు స్కాలర్షిప్ అందచేయలేదు. ఆ విషయాలు పట్టించుకోలేదు. చివరికి విద్యార్థులే సమాచారహక్కును ఉపయోగించి వివరాలు కనుక్కోవలసి వచ్చింది. ఈ విషయమంతా వార్తాపత్రికలలో కూడా వచ్చింది. దీనితో 15 రోజులలోపు 1167 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందచేశారు. అయితే ఈ సంస్థల నిర్లక్ష్యం, జాప్యం అనేవి ప్రజలు, వార్తాపత్రికల దృష్టికి వెళ్ళింది. ప్రభుత్వ సంస్థలు సక్రమంగా పనిచేయట్లేదంటూ మాట్లాడారు. కావున ప్రభుత్వ సంస్థలు నిరంతరం మెలకువతో ఉండి, తమ వద్ద ఏ ఫైల్ను ఆపకుండా సకాలంలో పనిచేయాలి.

2) పౌరుల పాత్ర :
అభయహస్తం, ఆమ్ ఆద్మీ, ఇందిరా క్రాంతి పథం వంటి సంస్థలు వాటి విధులు మరిచిపోయాయి. కాని విద్యార్థులు వదలకుండా సమాచార హక్కు చట్టంను ఉపయోగించి వాస్తవాలు తెలుసుకున్నారు. ఈలోగా ఈ విషయాలన్నీ వార్తాపత్రికలో వచ్చాయి. అప్పుడు హడావుడిగా ఆ సంస్థలు విద్యార్థులకు డబ్బును అందించారు. ఇందులో పౌరులు వారి విధులను సక్రమంగా నిర్వర్తించినారని తెలుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 2.
సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వం పనిని మెరుగుపరచటం, పర్యవేక్షించటం ఎలా సాధ్యమవుతుంది? (AS4)
జవాబు:
మెరుగుపరచటం :
1) ప్రజాస్వామిక వ్యవస్థలలో ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించి వారికి జవాబుదారీగా ఉండాలి. ఏ విషయం మీదైనా ప్రజలు సమాచారం అడగవచ్చు. కనుక ఎల్లప్పుడూ ప్రభుత్వ సంస్థలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి.
2) ప్రతి ప్రభుత్వ శాఖ కొన్ని నియమ నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది. కొన్ని రికార్డులను నిర్వహించాలి. తీసుకున్న నిర్ణయాల వివరణ ఉండాలి. దీని కొరకు రికార్డులను, రిజిష్టర్లను, నివేదికలను, డాక్యుమెంట్లను నిర్వహించాలి.
3) ప్రతి వ్యవస్థ, తన విధి నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత వహించాలి. విధులను సక్రమంగా నిర్వర్తించాలి.
4) సమాచార హక్కు చట్టం వలన ఇప్పుడు ప్రతి ప్రభుత్వశాఖ రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.

పర్యవేక్షణ :
5) ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార అధికారి ఉంటాడు. అదే శాఖలో ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు.
6) అన్ని శాఖల అప్పిలేట్ అధికారులు, పౌర సమాచార అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
7) రాష్ట్ర సమాచార కమిషనర్లు ఉంటారు. కేంద్ర సమాచార కమిషనర్లు ఉంటారు.

మనం సమాచారం కొరకు దరఖాస్తు చేసినపుడు ఆయా సమాచార అధికారులు సమాచారం ఇవ్వని పక్షంలో రాష్ట్ర, కేంద్ర సమాచార కమిషనర్లు జవాబుదారీగా ఉంటారు. అవసరం అయితే వీరు ఆ సమాచార అధికారికి జరిమానా కూడా విధించవచ్చు.

ప్రశ్న 3.
సమాచారం అని దేనిని అంటారు? ఇది ప్రభుత్వ శాఖలలో ఎలా ఉత్పన్నమవుతుంది? పై అధికారి, కింది అధికారి మధ్య జరిగే మౌఖిక సంభాషణ సమాచారం అవుతుందా? (AS1)
జవాబు:
ప్రతి ప్రభుత్వ శాఖ కొన్ని నియమనిబంధనల ఆధారంగా పనిచేస్తుంది.
ఉదా :

  1. ఆరోగ్యశాఖలో ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సుల ఎంపిక, నియామకం, బదిలీలకు సంబంధించి లేదా మందుల కొనుగోలు, పంపిణీలకు సంబంధించి నియమనిబంధనలు ఉంటాయి.
  2. అందువల్ల ప్రతి సంస్థ కొన్ని రికార్డులను నిర్వహించాలి. తీసుకున్న నిర్ణయాల వివరణ ఉండాలి. వీటి కారణంగా వ్యవస్థలో అనేక రాత పత్రాలు రూపొందుతాయి. ఇవి ఈ క్రింది రూపాలలో ఉండవచ్చు.
  3. రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, పత్రాలు, నమూనాలు, మోడల్స్ వంటి రూపాలలో ఉన్న మెటీరియల్, ఏ ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉన్న గణాంకాలు, అమలులో ఉన్న ఇతర చట్టాల కింద ప్రభుత్వ అధికారి అనుమతి పొందిన ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారం.
  4. సమాచార హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వ శాఖకు రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.
  5. పై అధికారి, కింది అధికారి మధ్య జరిగే మౌఖిక సంభాషణ సమాచారం అవదు.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 4.
రాష్ట్ర, కేంద్ర సమాచార కార్యాలయాలకు స్వయంప్రతిపత్తి ఎందుకు ఇచ్చారు? (AS4)
జవాబు:

  1. ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార అధికారి ఉంటారు. అదే శాఖలో ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు.
  2. అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
  3. దీనికి రాష్ట్ర సమాచార కమిషనర్లు ఉంటారు. ఏదైనా ప్రభుత్వశాఖ కేంద్రప్రభుత్వం కిందికి వస్తే కేంద్ర సమాచార కమిషనర్లతో కూడిన సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
  4. ఈ సమాచార కార్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఎందుకనగా మనం ఏదైనా ఒక కార్యాలయంలో సమాచారం కోసం దరఖాస్తు చేస్తే, వారు మనల్ని వేరే కార్యాలయం నుండి సమాచారం పొందమని చెప్పడానికి లేదు.
  5. ఒకవేళ మనమడిగిన సమాచారం వారి దగ్గర లేనట్లయితే సమాచారం ఉన్న అధికారి నుంచి సమాచారం పొంది దానిని అందజేయటం వాళ్ళ బాధ్యత.
  6. ఈ అంశాల మూలంగా ఈ సమాచార కార్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయని తెలుస్తుంది. మరియు ఇతరుల ప్రభావానికి లోను కాకుండా ఉండాలంటే స్వయంప్రతిపత్తి ఉండాలి.

ప్రశ్న 5.
సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి ఉన్న అసలైన స్ఫూర్తిని తెలియచేస్తుంది. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు? (AS6)
జవాబు:

  1. ప్రజాస్వామ్యమంటేనే ప్రజల ప్రభుత్వమని అర్థం. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులచే ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తారు. కావున ప్రభుత్వ కార్యక్రమాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ప్రభుత్వమే కల్పించింది.
  2. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు శ్రేయో రాజ్యాలు. ప్రజల కొరకు అనేక సంస్కరణలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు చేసే పనులు ప్రజలకు తెలియచేయడానికే ఈ సమాచార హక్కును కల్పించింది.
  3. ప్రజలు ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నులు మరియు ఇతర రుసుములన్నింటిని ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగిస్తుందో తెలుసుకునే అవకాశం ఈ సమాచార హక్కు కల్పిస్తుంది.
  4. సమాచారంలో పారదర్శకత ఉండాలి. ఇది ప్రభుత్వ సంస్థలలో అవినీతిని అరికట్టడానికి దోహదపడుతుంది.
  5. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఒక పౌరునికి కూడా జవాబుదారీగా ఉంటాయి.
  6. ఈ సమాచార హక్కు ద్వారా ప్రభుత్వ అధికారులను, ప్రజా ప్రతినిధులను, వారి విధులను, కార్యకలాపాలను నియంత్రణ చేయవచ్చు.
  7. ఈ సమాచార హక్కును ప్రజాస్వామ్య రాజ్యాలే ఇచ్చాయి. ఇది వ్యక్తి యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది.
  8. ప్రభుత్వ ఆఫీసులలోని కార్యక్రమాల పట్ల ఇంతకుముందున్న అస్పష్టత ఈ హక్కు మూలంగా పోయింది.

కావున ఈ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి ఉన్న అసలైన స్ఫూర్తిని తెలియచేస్తుంది.

ప్రశ్న 6.
దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఏ పౌరుడికైనా సమాచారం అందుబాటులో ఉండేలా చెయ్యటానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? (AS4)
జవాబు:
సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం ప్రభుత్వ సంస్థలు
అ) కంప్యూటరైజ్డ్ రూపంలో సమాచారాన్ని భద్రపరచాలి,
ఆ) దానికి సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగానే వెల్లడి చెయ్యాలి. సమాచార హక్కు చట్టం ఇలా పేర్కొంటోంది:

1) ప్రతి ప్రభుత్వ సంస్థ :
అ) తనకు సంబంధించిన అన్ని రికార్డులను… ఇటువంటి రికార్డులను తేలికగా బయటకు తీయటానికి వీలుగా వర్గీకరించి, సూచికలతో నిర్వహించాలి.
ఆ) ప్రతి సంస్థ ఈ దిగువ సమాచారాన్ని ప్రచురించాలి.
i) సంస్థ వివరాలు, విధులు, బాధ్యతలు.
ii) సంస్థలోని అధికారులు, ఉద్యోగస్తుల అధికారాలు, విధులు :
iii) నిర్ణయాలు తీసుకోవటంలో అనుసరించే విధానం, పర్యవేక్షణ, జవాబుదారీ విధానాలను కూడా పేర్కొనాలి.
iv) సంస్థకు ఉండే లేదా దాని నియంత్రణలో ఉండే లేదా తమ విధులను నిర్వర్తించటంలో ఉద్యోగస్తులు ఉపయోగించే నియమాలు, నిబంధనలు, ఆదేశాలు, మార్గదర్శకాలు, రికార్డులు.
v) సలహా ఇవ్వటం కోసం ఏర్పాటు చేసి …. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు ఉన్న బోర్డులు, సమితులు, సంఘాలు, ఇతరాల వివరాలు:
vi) ఆ కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగస్తుల వివరాలు :
vii) అధికారులు, ఉద్యోగస్తులకు ఇస్తున్న నెలసరి జీతం, నియమాల ప్రకారం చేసే ఇతర చెల్లింపులు
viii) తన ప్రతి ఒక్క ఏజెన్సీకి కేటాయించిన బడ్జెటు
ix) సబ్సిడీ పథకాల అమలు విధానం దానికి కేటాయించిన నిధులు.
x) దాని ద్వారా రాయితీలు, పర్మిట్లు, లేదా అధీకృత పత్రాలు పొందిన వాళ్ల వివరాలు
xi) పౌర సమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతర వివరాలు.

ఇ) ముఖ్యమైన విధానాలు రూపొందించేటప్పుడు లేదా ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు సంబంధిత అన్ని వాస్తవాలను వెల్లడి చేయాలి.
ఈ) ప్రభావిత వ్యక్తికి పరిపాలన సంబంధ లేదా న్యాయ స్వరూపం గల నిర్ణయాలకు కారణాలను తెలియచెయ్యాలి.

2) పై సమాచారమంతటినీ ఎవరూ అడగకుండానే ప్రభుత్వ సంస్థలు వెల్లడి చేయాలి.
3) ఇది అందరికీ తేలికగా అందుబాటులో ఉండాలి.
4) ఇది స్థానిక భాషలో ఉండాలి, దీనికి ఏదైనా డబ్బు చెల్లించాల్సి ఉంటే అది ప్రజలకు భారం కాకుండా ఉండాలి.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 7.
న్యాయ సహాయం ఆశించే ప్రజలకు న్యాయ సేవల ప్రాధాన్యత సంస్థ ఏ విధంగా దోహదపడుతుంది? (AS1)
జవాబు:

  1. ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందించటానికి మన దేశంలో ఒక విధానం ఉంది.
  2. న్యాయసేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టం, 2002 ప్రకారం సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించటానికి న్యాయ సేవా పీఠాలను ఏర్పాటు చేస్తారు.
  3. ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరుడికి కూడా న్యాయం లభించకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు.
  4. దీనివల్ల న్యాయవ్యవస్థ సమాన అవకాశాల ప్రాతిపదికన అందరికీ న్యాయాన్ని అందిస్తుంది.

ప్రశ్న 8.
లోక్ అదాలత్ ఉద్దేశం ఏమిటి? (AS1)
జవాబు:

  1. సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి లోక్ అదాలలను ఏర్పాటుచేశారు.
  2. లోక్ అదాలత్ లను “న్యాయసేవల పీఠాల చట్టం 1987″ని 1994లోను తిరిగి 2002లోను సవరించారు. ఈ సవరణ ప్రకారం లోక్ అదాలలను ఏర్పాటుచేశారు.
  3. లోక్ అదాలత్ అంటే ప్రజాస్వామ్య పీఠాలు. వీటి ద్వారా న్యాయకోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో, సుహృద్భావ వాతావరణంలో పరస్పర అంగీకారంతో తగాదాలు, వివాదాలు పరిష్కరించుకోవచ్చు.
  4. ఖర్చు లేకుండా, త్వరితగతిన న్యాయం పొందటానికి లోక్ అదాలలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి.
  5. కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోటానికి లోక్ అదాలత్ సహాయపడుతుంది.

ప్రశ్న 9.
ఈ చట్టం కింద చేపట్టే కేసులు, ఉచిత న్యాయసేవలు పొందటానికి పేర్కొన్న అర్హతలపై మీ అభిప్రాయం ఏమిటి? (AS2)
జవాబు:
I. ఉచిత న్యాయసేవలు పొందటానికి అర్హతలు :

  1. షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ జాతులకు చెందిన వ్యక్తులు ఉచిత న్యాయ సహాయానికి అర్హులు.
  2. అక్రమ రవాణా బాధితులైన వ్యక్తులు, బిక్షాటకులు.
  3. స్త్రీలు, పిల్లలు.
  4. మతిస్థిమితం లేనివారు లేదా అంగవైకల్యం ఉన్నవారు.
  5. పెను విపత్తు, జాత్యాహంకార హింస, కుల వైషమ్యాలు, వరదలు, కరవులు, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులకు గురైనవారు.
  6. పారిశ్రామిక కార్మికులు.
  7. వ్యభిచార వృత్త (నివారణ) చట్టం, 1956లో సెక్షన్ 2, క్లాజు (జి) ప్రకారం రక్షణ గృహం, లేదా బాల నేరస్తుల న్యాయ చట్టం, 1986లోని సెక్షన్ 2, క్లాజు (జె) ప్రకారం బాల నేరస్తుల గృహం లేదా మానసిక ఆరోగ్య చట్టం 1987లో సెక్షన్ 2, క్లాజు (జి) ప్రకారం మానసిక వ్యాధి చికిత్సాలయం లేదా మానసిక రోగుల సంరక్షణాలయంలో నిర్బంధంలో ఉన్న వ్యక్తులు.
  8. లక్ష రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు.

పైన పేర్కొన్న వారిలో ఏ వ్యక్తులైనా సహాయం పొందటానికి అర్హులని సంబంధిత న్యాయమూర్తి సంతృప్తి చెందితే వారు తగిన న్యాయ సేవలు పొందవచ్చు.

II. లోక్ అదాలత్ పరిధిలోకి వచ్చే కేసులు :

  1. వైవాహిక విభేదాలు.
  2. భరణానికి సంబంధించిన కేసులు.
  3. భర్త, అత్తవారింటి వేధింపులకు సంబంధించిన కేసులు.
  4. గృహ హింస కేసులు.
  5. అన్ని రకాల సివిల్ కేసులు భూ వివాదాలు.
  6. చట్టరీత్యా రాజీకి అర్హమైన అన్ని రకాల క్రిమినల్ కేసులు వంటి వాటిని ఇది చేపట్టవచ్చు.

III.నా అభిప్రాయం :
సమాజంలో వెనుకబడినవారు, పేదవారు, ఏ విధమైన సహాయ సహకారాలు లభించని వారికి ఈ లోక్ అదాలత్ సహాయపడుట చాలా మంచిదని నా అభిప్రాయం. స్త్రీలకు సంబంధించిన కేసులలో సరైన న్యాయం లభించుటలేదు. ఇటువంటి నేపథ్యంలో లోక్ అదాలత్ లు స్త్రీల వేధింపులకు సంబంధించిన కేసులను విచారించి, పరిష్కరించడమనేది అభినందనీయమే.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 10.
గ్రామ పెద్దలు, కోర్టులు వివాదాలు తగాదాలను పరిష్కరించే విధానాలను పోల్చండి. మీరు దేనిని ఇష్టపడతారు, ఎందుకు? (AS2)
జవాబు:

గ్రామ పెద్దలు కోర్టులు
1) గ్రామాలలో ప్రజల తగాదాలను తీర్చడానికి అన్ని విషయాలను, అంశాలను గ్రామ/తెగ పెద్దల ముందు చర్చించి ప్రశాంతంగా అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించటం మనదేశంలో అనాదిగా జరుగుతోంది. 1) కోర్టులు ముఖ్యంగా లోక్ అదాలత్ ల ద్వారా న్యాయ కోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో, సుహృద్భావ వాతావరణంలో, పరస్పర అంగీకారంతో తగాదాలు వివాదాలను పరిష్కరించుకోవచ్చు.
2) తగాదాలు, వివాదాల స్వభావం వాటి మూలాలు సాధారణంగా స్థానిక ప్రజలకు, గ్రామ పెద్దలకు తెలుస్తాయి. 2) ఖర్చులేకుండా, త్వరితగతిన న్యాయం పొందటానికి ప్రజలకు ఇప్పుడు లోక్ అదాలత్ లు ఉపయోగపడుతున్నాయి.
3) దీనివల్ల ఆ తగాదాలను, వివాదాలను గ్రామ ప్రజలు చర్చించటానికి వీలు కలిగి, పారదర్శక పద్ధతిలో అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారాన్ని కనుగొనటం సాధ్యమవుతుంది. 3) కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోటానికి లోక్ అదాలత్ లు సహాయపడుతున్నాయి.

నా అభిప్రాయం :
ప్రస్తుత ప్రజాస్వామ్య దేశాలలో జరిగే కార్యక్రమాలన్నింటికి రికార్డులు, రుజువులు, సాక్ష్యాలు ఉండాలి. తీసుకున్న నిర్ణయాల వివరాలను రికార్డు చేయాలి. కోర్టుల తీర్పులను ఎవరైనా పాటించకపోతే న్యాయస్థానాలు వారి మీద చర్యలు తీసుకొని, వాటిని పాటించేలా చేస్తాయి.

కాని గ్రామాలలో జరిగే తీర్పులను ప్రజలు అమలుచేయకపోతే అటువంటి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం గ్రామపెద్దలకు ఉండదు. కావున గ్రామాలలో నిర్వహించే కార్యక్రమాల కంటే కోర్టుల ద్వారా వచ్చే తీర్పులే మంచివని నా అభిప్రాయం.

10th Class Social Studies 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.320

ప్రశ్న 1.
కోర్టు ఫీజులు, ఇతర ఖర్చులు భరించలేని పేద ప్రజలకు మనదేశంలో ఉచిత న్యాయసేవలకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి?
జవాబు:

  1. ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందించటానికి మన దేశంలో ఒక విధానం ఉంది.
  2. న్యాయ సేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టం, 2002 ప్రకారం సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించటానికి న్యాయ సేవా పీఠాలను ఏర్పాటు చేస్తారు.
  3. ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరుడికి కూడా న్యాయం లభించకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటుచేశారు.
  4. దీనివల్ల న్యాయవ్యవస్థ సమాన అవకాశాల ప్రాతిపదికన అందరికీ న్యాయాన్ని అందిస్తుంది.

10th Class Social Textbook Page No.320

ప్రశ్న 2.
ఉచిత న్యాయసేవల ద్వారా ఎటువంటి కేసులు, తగాదాలను చేపట్టవచ్చు?
జవాబు:

  1. లోక్ అదాలల ద్వారా న్యాయ సేవల ప్రాధికార సంస్థ దీర్ఘకాలంగా కోర్టుల్లో ఉన్న కేసులను తక్కువ కాలంలో, ఎటువంటి ఖర్చు లేకుండా పరిష్కరిస్తుంది.
  2. వైవాహిక విభేదాలు, భరణానికి సంబంధించిన కేసులు, భర్త, అత్తవారింటి వేధింపులకు సంబంధించిన కేసులు, గృహ హింస కేసులు.
  3. అన్ని రకాల సివిల్ కేసులు భూ వివాదాలు, చట్టరీత్యా రాజీకి అర్హమైన అన్ని రకాల క్రిమినల్ కేసులు వంటి వాటిని ఇది చేపట్టవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social Textbook Page No.320

ప్రశ్న 3.
కోర్టుల బయట తగాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ విధానం ఏదైనా ఉందా?
జవాబు:
ప్రాచీన కాలం నుండి ఒక విధానం అమలులో ఉంది. అదేమనగా :

  1. గ్రామాలలో ప్రజల తగాదాలను తీర్చడానికి అన్ని విషయాలను, అంశాలను గ్రామ/తెగ పెద్దల ముందు చర్చించి ప్రశాంతంగా అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించటం మన దేశంలో అనాదిగా జరుగుతోంది.
  2. తగాదాలు, వివాదాల స్వభావం, వాటి మూలాలు సాధారణంగా స్థానిక ప్రజలకు, గ్రామ పెద్దలకు తెలుస్తాయి.
  3. దీనివల్ల ఆ తగాదాలను / వివాదాలను గ్రామ ప్రజలు చర్చించటానికి వీలు కలుగుతుంది.
  4. పారదర్శక పద్దతిలో అందరికీ ఆమోదయోగ్య పరిష్కారాన్ని కనుగొనటం సాధ్యమవుతుంది.

10th Class Social Textbook Page No.316

ప్రశ్న 4.
టీచరుకు హెడ్ మాష్టారు ఇచ్చే మౌఖిక ఆదేశం సమాచారం కాకపోవటానికి కారణం ఏమిటో చర్చించండి.
జవాబు:
సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న ప్రకారం సమాచారం ఈ క్రింది వాటి రూపంలో ఉండాలి.

  1. రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, పత్రాలు, నమూనాలు, మోడల్స్ వంటి రూపాలలో ఉన్న మెటీరియల్.
  2. ఏ ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉన్న గణాంకాలు, అమలులో ఉన్న ఇతర చట్టాల కింద ప్రభుత్వ అధికారి అనుమతి పొందిన ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారం.
  3. కావున మౌఖిక ఆదేశాలు సమాచారంలోకి రావని తెలుస్తుంది.
  4. హెడ్ మాష్టారు ఆదేశాలను రాత పూర్వకంగా ఇవ్వలేదు. కావున హెడ్ మాష్టారు టీచరుకు ఇచ్చిన మౌఖిక ఆదేశాలు సమాచారం క్రిందకు రావని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.316

ప్రశ్న 5.
సిఫారసు చేసిన విధంగా నియమ, నిబంధనలను పాటించినట్లయితే ప్రభుత్వ శాఖలు మరింత జవాబుదారీతనాన్ని ఎలా కనబరుస్తాయో ఊహించండి.
జవాబు:

  1. ప్రతి ప్రభుత్వశాఖ కొన్ని నియమ నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది. మరియు సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని తయారుచేసి తయారుగా పెట్టుకోవాలి.
  2. ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ శాఖలు ప్రజలకు బాధ్యత వహిస్తాయి. కావున ప్రభుత్వ సంస్థలన్నీ నిరంతరం మెలకువగా ఉండి, తమ విధులను నిర్వర్తించాలి.
  3. ప్రతి ప్రభుత్వ శాఖ నియమ నిబంధనలకు లోబడి పని చేసినప్పుడు పనిలో పారదర్శకత ఏర్పడి ప్రజల నియంత్రణలో ఉంటుంది.
  4. ఎవరైనా వ్యక్తులు, ఏదైనా విషయం మీద, ఏ సంస్థనైనా సమాచారం అడగవచ్చు. కావున ప్రతి సంస్థ తన విధి నిర్వహణలో అవినీతికి పాల్పడకుండా ఈ చట్టం నియంత్రిస్తుంది.
  5. ఈ సమాచార హక్కు చట్టం అనేది అన్ని ప్రభుత్వ శాఖల మీద పర్యవేక్షణ అధికారిగా పనిచేస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social Textbook Page No.318

ప్రశ్న 6.
ఈ చట్టం ప్రకారం ఏ సమాచార అధికారి అయినా సమాచారం ఇవ్వకపోతే వాళ్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీరు దీనితో ఏకీభవిస్తారా? ఎందుకని?
జవాబు:
ఏకీభవిస్తాను. ఎందుకనగా :

  1. సమాచార అధికారులు పౌరులు అడిగిన సమాచారాన్ని అందివ్వని పక్షంలో జరిమానా కట్టవలసిందే.
  2. ఎప్పుడైతే ఆ అధికారి జరిమానా చెల్లిస్తాడో, తాను చేసిన పని పట్ల సిగ్గుపడతాడు. ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయకూడదని భావిస్తాడు.
  3. ఒక అధికారి జరిమాన చెల్లించడం ద్వారా ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదని భావించి, మరింత బాధ్యతగా పనిచేస్తాడు. పనిలో పారదర్శకత ఉండేలా చూసుకుంటాడు.
  4. జరిమానా కట్టుట మూలంగా, ఆ విషయం ఆ కార్యాలయంలో అందరికి తెలిసిపోతుంది. దీని పట్ల అతను సిగ్గుపడడమే కాకుండా అవినీతికి పాల్పడకుండా జాగ్రత్తగా ఉంటాడు.
  5. సమాచారాన్ని అందివ్వకపోతే జరిమానా కట్టవలసి వస్తుంది. కావున ఇంకెప్పుడు అటువంటి పొరపాటు చేయకుండా సమాచారాన్ని అడిగిన వారందరికి అందిస్తాడు.

10th Class Social Textbook Page No.318

ప్రశ్న 7.
ఏ రకమైన సమాచారం ప్రజలకు అందుబాటులో లేదు? దీనికి మద్దతు తెలిపిన వాదన ఏది?
జవాబు:
కొంత సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడి చేయకుండా ఉండే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఆ అంశాలు :

  1. భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతలను ప్రభావితం చేసే సమాచారం, విదేశీ శక్తుల సందర్భంలో కీలక ఆర్థిక, శాస్త్రీయ ప్రయోజనాలు కలిగి ఉండే అంశాలు.
  2. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కలిగించే సమాచారం.
  3. గోప్యంగా ఉంచుతారన్న భావనతో విదేశ ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం.
  4. ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం.
  5. (అంతిమ నిర్ణయం తీసుకోటానికి ముందు) మంత్రుల లేదా సెక్రటరీల బృందం ముందు ఉంచే క్యాబినెట్ పత్రాలు లేదా రికార్డులు.
  6. మన సైనిక దళాలు, భద్రతా సంస్థలు చాలా వరకు సమాచార కమిషన్ల పరిధిలోకి రావు.

ఈ చట్టానికి మద్దతుగా చేసిన వాదన :
ఈ చట్టం చేసిన తరువాత దీనిలోని పలు అంశాలను అనేక సందర్భాలలో వివిధ శాఖలు ప్రశ్నించాయి. అవసరమనిపిస్తే ఈ చట్టానికి పార్లమెంటు సవరణలు చేయవచ్చు. అయితే రాజ్యాంగం అర్థం చేసుకుని నిర్వచించిన దానికి మద్దతుగా, సమాచారానికి ఉన్న మౌలిక హక్కుకు భంగం కలిగించేలా ఇది ఉండకూడదు.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social Textbook Page No.320

ప్రశ్న 8.
లోక్ అదాలత్ ను మీరు సమర్థిస్తారా?
జవాబు:
అవును సమర్థిస్తాను. ఎందుకనగా :

  1. సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి లోక్ అదాలత్ లను ఏర్పాటు చెయ్యటం జరిగింది.
  2. ఖర్చు లేకుండా లోక్ అదాలత్ న్యాయాన్ని అందిస్తుంది.
  3. త్వరితగతిన న్యాయం పొందటానికి ప్రజలకు లోక్ అదాలత్ ఉపయోగపడుతుంది. విధానాలలో వెసులుబాటు ఉంటుంది.
  4. కోర్టులలో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని కేసులకు లోక్ అదాలత్ లో పరిష్కారం దొరుకుతుంది.
  5. ఎటువంటి కోర్టు రుసుము ఉండదు, ఒకవేళ కోర్టు రుసుము అప్పటికీ చెల్లించి ఉంటే లోక్ అదాలత్ లో కేసు పరిష్కరింపబడినప్పుడు నియమాలకు లోబడి రుసుమును తిరిగి చెల్లిస్తారు.
  6. తమ సలహాదారు ద్వారా వివాదంలోని కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించవచ్చు. ఇది సాధారణ న్యాయ స్థానాలో సాధ్యంకాదు.
  7. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పును వాది, ప్రతివాదులు గౌరవించాలి. సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుకి ఉండే విలువ దీనికి కూడా ఉంటుంది.
  8. అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయసలహా అందిస్తారు. కోర్టులలో కేసును వాదించటానికి అడ్వకేట్లను నియమిస్తారు. ఉచిత న్యాయ సేవలు, మద్దతుకి అర్హులైన వ్యక్తులకు సంబంధించిన కోర్టు కేసులలో కోర్టు ఖర్చులను భరిస్తారు, తీర్పు నకళ్లను ఉచితంగా అందచేస్తారు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

SCERT AP 10th Class Social Study Material Pdf 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Studies 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
విభిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. (AS1)
ఎ) స్వాతంత్ర్య పోరాట అనుభవాల నుంచి భారత రాజ్యాంగం ఏర్పడింది.
బి) అప్పటికే ఉన్న రాజ్యాంగాల నుంచి భారత రాజ్యాంగం రూపొందింది.
సి) ముసాయిదా రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదించారు.
డి) దేశాన్ని పాలించటానికి రాజ్యాంగ సూత్రాలను, అంశాలను పేర్కొంది.
జవాబు:
సి) ముసాయిదా రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదించారు.

ప్రశ్న 2.
తప్పు వాక్యాలను సరిదిద్దండి : (AS1)
ఎ) రాజ్యాంగ సభ చర్చలలో కొన్ని అంశాలపై అందరూ ఒకటే భావాన్ని వ్యక్తం చేశారు.
బి) రాజ్యాంగ నిర్మాతలు దేశంలోని కొన్ని ప్రాంతాలకే ప్రాతినిధ్యం వహించారు.
సి) రాజ్యాంగంలోని అధికరణాలను సవరించటానికి అది అవకాశం కల్పించింది.
డి) రాజ్యాంగంలోని మౌలిక అంశాలను కూడా సవరించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.
జవాబు:
డి) రాజ్యాంగంలోని మౌలిక అంశాలను ఎట్టి స్థితిలో సవరించకూడదని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది. కావున రాజ్యాంగంలోని మౌలిక అంశాలను ఎట్టి స్థితిలో మార్చకూడదు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ప్రశ్న 3.
రాజ్యాంగ సభ చర్చల నుంచి భారత ప్రభుత్వ ఏకీకృత, సమాఖ్య సూత్రాలను వివరించండి. (AS1)
జవాబు:
సమాఖ్య సూత్రాలు:

  1. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి.
  2. ఆ రాష్ట్రాలకు సర్వసత్తాక అధికారాలు ఉంటాయి.
  3. రాజ్యాంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ చేస్తుంది.

ఏకీకృత సూత్రాలు :

  1. కేంద్ర ప్రభుత్వం సర్వసత్తాకమైనది.
  2. రాష్ట్ర ప్రభుత్వాలు ఉండకపోవడం.
  3. ఒకే ప్రభుత్వం ఉంటుంది. కావున అధికార విభజన ఉండదు.

ప్రశ్న 4.
ఆనాటి రాజకీయ ఘటనలను రాజ్యాంగం ఎలా ప్రతిబింబిస్తోంది ? స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించి ఇంతకు ముందు అధ్యాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. (AS1)
జవాబు:
ముందుగా భారతదేశంలో వివిధ రకాల ప్రజలు మెరుగైన సమాజాన్ని కోరుతూ చేసిన పోరాటాలు రాజ్యాంగ నిర్మాణానికి స్పూర్తినిచ్చాయి.

రాజ్యాంగంలో ప్రతిబింబించే వివిధ సంఘటనలు :

  1. దేశంలో అధికభాగం రాచరిక పాలనలో ఉండేది. సామాజిక, సాంస్కృతిక వైవిధ్యతలే కాకుండా ధనిక-పేద మధ్య, అగ్ర-కింది కులాల మధ్య, స్త్రీ-పురుషుల మధ్య చాలా తేడాలున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి మన రాజ్యాంగంలో అందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి.
  2. దీని ప్రకారం చట్టం ముందు ప్రజలందరూ సమానులుగా ఉంటారు. లింగ, కుల, మత, జాతి, సంపద భేదం లేకుండా “సార్వజనీన వయోజన ఓటు హక్కు” ద్వారా ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది.
  3. ఫ్రెంచి విప్లవం ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంను, అమెరికాలోని హక్కుల చట్టంను, రష్యా, చైనాలలో సోషలిస్ట్ విప్లవం ప్రకారం పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపు, సమన్యాయం వంటివి మన రాజ్యాంగంలో పొందుపరచడానికి కారణం అయ్యాయి. ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలను పొందుపరుచుకున్నాం.
  4. పాశ్చాత్య ఉదార సంస్థలైన గణతంత్ర, ప్రజాస్వామ్య, ‘లౌకిక, సమాఖ్య, స్వతంత్ర్య న్యాయశాఖల వంటి సంస్థలను, ఎంతోకాలం వీటిని కొనసాగించిన బ్రిటిష్ పాలన మన దేశానికి తీసుకొచ్చింది.
  5. గాంధేయ ,తత్వాలు ఆదేశ సూత్రాల రూపంలో రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి.
  6. భారతదేశం మత ప్రాతిపదికన విభజింపబడినప్పటికి ఇంకా భారతదేశంలో అనేక మతాల ప్రజలు ఉన్నందున భారతదేశంలో “లౌకిక” అనే భావనను 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చినారు.
  7. భారతదేశంలో అల్పసంఖ్యాక ప్రజల రక్షణ కొరకు ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచినారు.
  8. రైతులు, భూస్వాములకు వ్యతిరేకంగా వారి హక్కుల కొరకు చేసిన ఉద్యమాల నేపథ్యంగా ‘సామ్యవాదం’ అనే అంశాన్ని 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చుట జరిగింది.

ప్రశ్న 5.
రాజ్యాంగ సభను సార్వత్రిక వయోజన ఓటు హక్కుతో ఎన్నుకుని ఉంటే రాజ్యాంగాన్ని రూపొందించటంలో అది ఎటువంటి ప్రభావాన్ని చూపించి ఉండేది? (AS1)
జవాబు:

  1. రాజ్యాంగ సభకు రాష్ట్రాలకు, రాజసంస్థానాలకూ జనాభా ప్రాతిపదిక మీద ప్రాతినిధ్యం కల్పించారు. అదే విధంగా అనేక రంగాలలో నిష్ణాతులైన వారు రాజ్యాంగ సభకు ఎన్నికైనారు. అల్పసంఖ్యాక వర్గాల నుండి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నుండి కూడా సభ్యులు రాజ్యాంగ సభకు ఎన్నికైనారు. చైతన్యవంతులైనటువంటి నాయకులు రాజ్యాంగ సభకు ఎన్నికవడం మూలంగా, దేశంలోని ఏ వర్గ ప్రజలకు అన్యాయం జరగకుండా దేశ ప్రజలందరిని పరిగణనలోకి తీసుకొని ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారు.
  2. రాజ్యాంగ సభకు, వయోజన ఓటుహక్కు ద్వారా సభ్యులను ఎన్నుకున్నట్లయితే నిష్ణాతులైన, చైతన్యవంతులైన వారు ఎన్నిక కాకపోవచ్చు. తద్వారా అందరి ప్రయోజనాలకు అనుగుణమైన రాజ్యాంగం తయారై ఉండేది కాదు.
  3. వయోజన ఓటు హక్కు ద్వారా అన్ని వర్గాల నుండి, అన్ని ప్రాంతాల నుండి మరియు వయోజనులందరు ఎన్నికలో పాల్గొనే అవకాశం వచ్చేది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ప్రశ్న 6.
భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల గురించి చిన్న వ్యాసం రాయంది. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు :
1) సార్వభౌమత్వం :
భారతదేశం అంతర్గతంగా, బాహ్యంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కలిగి ఉన్నదని తెల్పుతున్నది.

2) సామ్యవాదం :
రాజ్యం క్రమేణా అవసరం అయిన మార్పులను తెచ్చి సమసమాజాన్ని స్థాపించడం అని అర్థం. ఈ సామ్యవాదం అనే పదంను 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.

3) పార్లమెంటరీ, ప్రజాస్వామ్య విధానం :
శాసన, కార్యనిర్వాహక శాఖల అధికారాల సమన్వయంపై ఆధారపడి ప్రభుత్వం ఉంటే అది “పార్లమెంటరీ విధాన”మని అంటాం. ప్రజలచేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.

4) సమాఖ్య విధానం :
ప్రభుత్వాధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధంగా పంపిణీ అయి ఉన్న ప్రభుత్వ విధానమే సమాఖ్య ప్రభుత్వం.

5) న్యాయం :
భారత రాజ్యాంగంలోని ఈ న్యాయం అనేది పౌరులకు రాజకీయ న్యాయం, ఆర్ధిక న్యాయం, సాంఘిక న్యాయం వంటి న్యాయాలను అందచేస్తుంది.

6) స్వేచ్ఛ, స్వాతంత్ర్యం :
ప్రతి వ్యక్తికి ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం, మత స్వేచ్ఛ, ధర్మం మొదలైన స్వేచ్ఛలను రాజ్యాంగం కల్పిస్తుంది.

7) సమానత్వం :
అసమానత్వాన్ని రూపుమాపకుండా వ్యక్తుల హక్కులకు హామీ ఇవ్వడం నిరర్ధకం. ప్రతి వ్యక్తి తన్ను తాను పూర్తిగా అభివృద్ధి చేసుకొనుటకు సమానహోదా, అవకాశాలు కల్పించడం జరిగింది.

8) సంక్షేమ రాజ్యం :
ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలే. ప్రజల సంక్షేమానికి అవసరమైన చట్టాలను చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తుంది.

ప్రశ్న 7.
దేశంలోని రాజకీయ వ్యవస్థలను రాజ్యాంగం ఎలా నిర్వచించింది, వాటిని ఎలా మార్చింది? (AS1)
జవాబు:
రాజకీయ వ్యవస్థలకు సంబంధించి ఇతర దేశాల అనుభవాలను తీసుకొని, వాటిని మనదేశ పరిపాలనకు అనుగుణంగా మార్చుకొనుట జరిగింది. అవి :

1) పార్లమెంటరీ వ్యవస్థ :
ఈ పార్లమెంటరీ విధానాన్ని మనం బ్రిటిష్ పరిపాలన నుండి నేర్చుకున్నాం. దాదాపు 200 సంవత్సరాలు వారిచే పరిపాలించబడుట వలన ఆ విధానం మనదేశానికి అనుకూలంగా ఉంటుందని రాజ్యాంగం భావించి, పార్లమెంటరీ విధానాన్ని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం.

2) సమాఖ్య విధానం :
సమాఖ్య విధానం ప్రకారం అధికారాల విభజన అనేది మనం ‘కెనడా’ దేశం నుండి తీసుకున్నప్పటికీ, ఈ ‘అధికారాల విభజనకు మూలం అనేది “1935 భారత ప్రభుత్వ చట్టం” లోనే ఉంది. సమాఖ్య విధానం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగింది. ఈ రెండు కూడా వాటి పరిధిలో సర్వసత్తాకమైనవి. అయినప్పటికి భారత రాజ్యాంగం, ఈ సమాఖ్య విధానంలో కేంద్రాన్ని బలమైన సంస్థగా మార్చింది.

3) సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటాడు. ఈ అధ్యక్ష విధానం, అమెరికా అధ్యక్ష విధానానికి వేరుగా ఉంటుంది. ” అమెరికా అధ్యక్షుడు వాస్తవాధికారి, కాని భారత అధ్యక్షుడు ఇంగ్లాండు రాజువలె నామమాత్ర అధ్యక్షుడు. వాస్తవాధికారిగా ప్రధానమంత్రి, అతని ఆధ్వర్యంలో ఇతర మంత్రులు ఉంటారు.

4) అధికారాల విభజనలో కెనడా రాజ్యాంగాన్ని మూలంగా తీసుకొని, మన దేశానికి అనుకూలంగా మార్చుకున్నాం. ఏ విధంగా అంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగాక మిగిలిన “అవశేషాధికారాలను” రాజ్యాంగం కేంద్రానికే కట్టబెట్టి బలమైన కేంద్రంగా తయారవడానికి ప్రయత్నించింది.

5) అమెరికాలో వలె మనదేశంలో ద్వంద్వ పౌరసత్వం లేదు. భారతదేశంలో ఎక్కడ పుట్టినా, దేశ పౌరసత్వం లభిస్తుంది.

6) అమెరికాలో ద్వంద్వ న్యాయవ్యవస్థలున్నాయి. కాని మన సమాఖ్యలో ఏకీకృత న్యాయవ్యవస్థ మాత్రమే ఉంది.

ఈ విధంగా మన రాజ్యాంగం రాజకీయ వ్యవస్థలను నిర్వచించి, మన దేశానికి అనుగుణంగా వాటిని మార్చిందని చెప్పవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ప్రశ్న 8.
రాజ్యాంగంలో, మౌలిక సూత్రాలు ఉంటాయి. అయితే ప్రజలు వ్యవస్థతో తలపడినప్పుడే సామాజిక మార్పు వస్తుంది. ఈ . వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
ఏ దేశ రాజ్యాంగంలో అయిన కొన్ని మౌలిక సూత్రాలు ఉంటాయి. అయితే ప్రజలు వ్యవస్థతో తలపడినప్పుడే సామాజిక మార్పు వస్తుందనే వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.

కారణాలు:
1) భారతదేశం మత ప్రాతిపదికన 1947లో భారత్, పాలుగా విడిపోయింది. అయితే భారతదేశంలో వివిధ మతాల ప్రజలు ఉన్నారు. ముస్లిం దేశంగా పాకిస్థాన్ విడిపోయినప్పటికి ఇంకా ముస్లిం జనాభా భారత్ లో అధికంగానే ఉంది. యూరోపియన్లు పరిపాలించుట మూలంగా క్రైస్తవమతం, సిక్కులు, పార్శీలు అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు. మత ఘర్షణల మూలంగా వస్తున్న ధన, ప్రాణ నష్టాలను అధిగమించడానికి “లౌకిక” వాదంను మన రాజ్యాంగంలోని ప్రవేశికలో చేర్చినాము. దీని మూలంగా భారతదేశం మత ప్రమేయం లేని దేశం అయింది.

2) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ మతాలు, బడుగు, బలహీనవర్గాలు అనాదిగా ఎదుర్కొంటున్న అన్యాయాలను ఎదుర్కొనుటకు చేసిన పోరాటాల ఫలితంగా “సామ్యవాదం” ను 1976 లో రాజ్యాంగంలోని ప్రవేశికలో చేర్చినాము. అయినప్పటికి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలగదు. సంక్షేమ రాజ్యమే ఆధునిక దేశాల లక్ష్యం. కాబట్టి సామ్యవాదాన్ని మన రాజ్యాంగంలో చేర్చుకొనుట జరిగింది.

3) తరతరాలుగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ మతాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలను పరిష్కరించటానికి వారికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించుట జరిగింది. ప్రాథమిక హక్కులను అందరూ పొందే విధంగా న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించినారు.

4) ‘అంటరానితనం’ కు ప్రజలు బలికాకూడదని, అంటరానితనం నేరమని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో 17వ ప్రకరణలో దానిని చేర్చినారు. ప్రాథమిక హక్కులలో చేర్చుట మూలంగా అంటరానితనం కొంతవరకు కనుమరుగైందని చెప్పవచ్చు.

5) భారత రాజ్యాంగం కల్పించిన అన్ని ప్రాథమిక హక్కులలో ఎక్కువ వివాదాస్పదమైనది ఆస్తి హక్కు. ఆస్తి హక్కును కొనసాగిస్తే సమానత్వాన్ని సాధించడం అసాధ్యమవుతుందని, దానిని తొలగించాలని సామ్యవాదులు భావించారు. ఆస్తి హక్కును పూర్తిగా తొలగించాలని కమ్యూనిస్టులు భావించారు. నిజమైన సామ్యవాద వ్యవస్థను స్థాపించడంలో ఆస్తి హక్కు అడ్డంకి కాకూడదని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా చేయుట జరిగింది.

10th Class Social Studies 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం InText Questions and Answers

10th Class Social Textbook Page No.232

ప్రశ్న 1.
భారత రాజ్యాంగానికి …………………………. ……… ప్రధానంగా దోహదం చేశారు.
జవాబు:
డా॥ బి.ఆర్. అంబేద్కర్, డా॥ బాబు రాజేంద్రప్రసాద్, మోతిలాల్ నెహ్రూ, బి.ఎన్.రావు.

10th Class Social Textbook Page No.233

ప్రశ్న 2.
లింగం అన్న పదాన్ని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది?
జవాబు:
“లింగం” అన్న పదాన్ని “నేపాల్” దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది.

10th Class Social Textbook Page No.233

ప్రశ్న 3.
శాంతి కాముకతను ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక కనబరిచింది?
జవాబు:
జపాన్ “శాంతి కాముకత”ను ఆ దేశ రాజ్యాంగ ప్రవేశికలో కనబరిచింది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 4.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సుమారు ………… రోజులకు ముసాయిదా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
జవాబు:
14 (ఆగస్టు 29, 1947)

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 5.
రాజ్యాంగ సభ ముందుగా …………………., ……….. …………………., …………………. వంటి ముఖ్యాంశాలపై ప్రత్యేక సంఘాలను నియమించింది.
జవాబు:

  1. యూనియన్ రాజ్యాంగ కమిటీ,
  2. కేంద్ర అధికారాల సంఘం,
  3. స్టీరింగ్ కమిటీ,
  4. రాష్ట్రాల రాజ్యాంగ సంఘం,
  5. ప్రాథమిక హక్కుల సంఘం.

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 6.
ఈ కమిటీల నివేదికలను డా॥ అంబేద్కర్ అధ్యక్షతన ఉన్న …………………… చర్చించి, కీలకమైన నిర్ణయాలను తీసుకుంది.
జవాబు:
ముసాయిదా సంఘం

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 7.
డా॥ అంబేద్కర్ అధ్యక్షతన …… కమిటీ తీసుకున్న నిర్ణయాలను ముసాయిదా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.
జవాబు:
డ్రాఫ్టింగ్,

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 8.
బ్రిటిష్ ప్రభుత్వం చేసిన …………….. అంశాలను కూడా ముసాయిదా తీసుకుంది.
జవాబు:
1935 భారత ప్రభుత్వ చట్టంలోని

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 9.
ఆ తరువాత విమర్శలకు, సూచనలకు దీనిని ……… నెలల పాటు ప్రజల ముందు ఉంచారు.
జవాబు:
8 నెలలు

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 10.
ముసాయిదా రాజ్యాంగంలో ……………. అధికరణలు, …………… షెడ్యూళ్లు ఉన్నాయి.
జవాబు:
315, 8

10th Class Social Textbook Page No.238

ప్రశ్న 11.
భారత అధ్యక్షునికి ఇచ్చిన అధికారాలు ……………. కి చెందిన ……………. కంటే …………….. కి చెందిన …………… అధికారాలకు దగ్గరగా ఉన్నాయి.
జవాబు:
అమెరికా, అధ్యక్షుడు, ఇంగ్లాండ్, రాజు

10th Class Social Textbook Page No.238

ప్రశ్న 12.
భారత అధ్యక్షుడు ………….. సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ రూపొందించింది.
జవాబు:
తన మంత్రుల

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 13.
సమాఖ్య రాజ్యతంత్రంలో ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వాలు ఉంటాయి, భారతదేశ విషయంలో అవి ….. – స్థాయిలలో ఉన్నాయి. మీరు …………. రాష్ట్రానికి, …………. దేశానికి చెందుతారు.
జవాబు:
కేంద్ర ప్రభుత్వం కేంద్రస్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, భారత

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 14.
ఏ రకమైన రాజ్యాంగం కింద కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి?
జవాబు:
ఏకీకృత రాజ్యాంగం కింద కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలుంటాయి.

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 15.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కచ్చితమైన అధికారాలను ఏ రకమైన రాజ్యాంగం ఇస్తుంది?
జవాబు:
సమాఖ్య విధాన రాజ్యాంగం,

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 16.
భారతదేశ రాష్ట్రాలు ఏ విధంగా “కేంద్ర ప్రభుత్వ పాలనా అంగాల శాఖలు కావు”?
జవాబు:
భారతదేశంలో రెండు రకాలైన ప్రభుత్వాలు ఉంటాయి. అవి 1) కేంద్ర ప్రభుత్వం 2) రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండింటికి రాజ్యాంగం కేటాయించే రంగాలలో అవి సర్వసత్తాక అధికారాలను కలిగి ఉంటాయి. కావున భారతదేశ రాష్ట్రాలు కేంద్రప్రభుత్వ పాలన అంగాల శాఖలు కావు.

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 17.
రాష్ట్రాలు తమ సొంత సివిల్ సర్వెంట్లను (అధికారులను) కలిగి ఉండే అధికారాన్ని భారత రాజ్యాంగం కల్పిస్తుందా?
జవాబు:
కల్పించుట లేదు. అఖిల భారత సివిల్ సర్వెంట్లను కేంద్రప్రభుత్వమే నియమిస్తుంది. రాష్ట్రాలకు ఆ అవకాశం రాజ్యాంగం కల్పించలేదు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 18.
ఒక రాష్ట్రంలోని అధికారులందరూ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుండి నియమింపబడిన వాళ్లేనా?
జవాబు:
కాదు. రాష్ట్రంలోని అధికారులందరూ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుండి నియమింపబడిన వారు కాదు. కొందరిని కేంద్ర ప్రభుత్వం నియామకం చేస్తుంది. అవి అఖిల భారత సర్వీస్ కమిషన్ ద్వారా.

10th Class Social Textbook Page No.232

ప్రశ్న 19.
భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ ఏ మౌలిక ఆదర్శాలు పొందుపరచబడ్డాయి?
జవాబు:
భారత రాజ్యాంగ ప్రవేశికలో ఈ క్రింది మౌలిక ఆదర్నాలు పొందుపరచబడ్డాయి. ఇవి పౌరులందరికి సమానంగా వర్తిస్తాయి.

1) న్యాయం :
“పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడం.”

2) స్వాతంత్ర్యం :
“ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని అందరికి అందించడం.”

3) సమానత్వం :
“అంతస్తుల్లోను, అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చటం.”

4) స్వేచ్ఛ :
“పౌరులు స్వేచ్ఛాయుత జీవనం గడుపుటకు, ప్రతి వ్యక్తికి ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటన, సంఘాలు, పార్టీలుగా ఏర్పడటం వంటి స్వేచ్ఛలు అందరికీ అందించడం.

5) సౌభ్రాతృత్వం :
“పౌరులందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సఖ్యత నేర్పరచుటకు సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం.

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 20.
రాజ్యాంగ ప్రవేశికలో ప్రజా ఉద్యమాలు ఎలా ప్రతిబింబించాయి?
జవాబు:
1) నేపాల్ రాజ్యాంగ ప్రవేశికలో, ఇప్పటివరకు ప్రజలు చేపట్టిన ఉద్యమాలు, చారిత్రక పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యం, శాంతి, ప్రగతిలకు అనుకూలంగా ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ వర్గ, జాతిమూలాలు, ప్రాంత, లింగ వంటి సమస్యలను పరిష్కరించి దేశాన్ని ప్రగతిశీలంగా పునః నిర్మించటానికి పూనుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

2) జపాన్ ప్రజా ఉద్యమాల మూలంగా ప్రజలకు శాంతి, సహకారాలు, స్వేచ్ఛ, యుద్ధభూములు లేని దేశాన్ని, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందని తెలియచేస్తూ రాజ్యాంగాన్ని ప్రకటించారు.

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 21.
రాజకీయ వ్యవస్థ స్వరూపానికి సంబంధించి ఏ ఏ వాగ్దానాలు చేశారు?
జవాబు:

  1. భారతదేశంలో వయోజన ఓటుహక్కు ద్వారా రాజకీయ న్యాయం పొందవచ్చు. 18 సం||లు నిండిన ప్రతి పౌరుడు ఆస్తి, విద్య మరియు ఏ ఇతర అర్హతలతో నిమిత్తం లేక రాజ్యవ్యవస్థ నిర్మాణ ప్రక్రియలో పాల్గొనవచ్చు.
  2. నేపాల్ దేశంలో వయోజనులకు ఓటు హక్కు క్రమం తప్పకుండా ఎన్నికలు, రాచరిక పాలన రద్దు వంటి వాగ్దానాలు చేయబడినవి.
  3. రాజకీయ నైతికతకు సంబంధించిన చట్టాలు విశ్వజనీనమైనవి, తమ సర్వసత్తాకతను కొనసాగిస్తూ, ఇతర దేశాలతో సర్వసత్తాక సంబంధాలను సమర్థించుకుంటూ అన్ని దేశాలు ఈ చట్టాలను గౌరవించాలి. ప్రభుత్వ చర్యల ద్వారా ఎన్నడూ యుద్ధభయాలు తిరిగి దేశాన్ని కమ్ముకోవని జపాన్ దేశంలో వాగ్దానాలు చేశారు.

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 22.
ఈ దేశాల పౌరులకు ఏ ఏ వాగ్దానాలు చేశారు?
జవాబు:
ఈ దేశాల పౌరులకు ఈ క్రింది వాగ్దానాలు చేశారు :
భారతదేశ పౌరులకు :
ప్రజలందరికి అన్ని రకాలైన న్యాయం, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, సమానత్వాలు, సౌభ్రాతృత్వం మొదలైనవి ప్రజలందరు అనుభవించుటకు వీలుగా “థమిక హక్కులను” కల్పించారు.

నేపాల్ పౌరులకు :
ప్రజలందరికి పౌరస్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, వయోజనులకు ఓటుహక్కు, పత్రికా రంగానికి పూర్తి స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ వంటి వాగ్దానాలు నేపాల్ వారి పౌరులకు చేసింది.

జపాన్ పౌరులకు :
శాంతియుత సహకార ఫలాలు, యుద్ధభయం రాదని, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందని జపాన్, వారి పౌరులకు వాగ్దానం చేసింది.

10th Class Social Textbook Page No.236

ప్రశ్న 23.
“భారతదేశ ప్రజలమైన మేము….” అన్న పదాలతో భారతదేశ రాజ్యాంగం మొదలవుతుంది. భారతదేశ ప్రజలందరికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకోవటం సమర్ధనీయమేనా?
జవాబు:
సమర్థనీయమే, ఎందుకనగా “భారత ప్రజలమైన మేము” అనే భావన రాజ్యాంగానికి ప్రజలే ఆధారమని తెల్పును. రాజ్యాంగాన్ని “చర్చించి, శాసనం చేసుకొని, మాకు మేము” సమర్పించుకుంటున్నాము అనే భావన రాజ్యాంగ పరిషత్తు – ప్రజలకు ప్రాతినిధ్యం వహించిందని తెలియచేస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.236

ప్రశ్న 24.
పాఠశాల మొత్తానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటే ఎవరెవరు అందులో భాగస్వాములు కావాలి, ఎలా భాగస్వాములు కావాలి?
జవాబు:
1) భాగస్వాములుగా ఉండాల్సిన వారు :
పాఠశాల మొత్తానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయవలసి వస్తే, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ వర్గం నుండి కొంతమంది, ఉపాధ్యాయేతర సిబ్బంది నుండి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉండి రాజ్యాంగాన్ని రూపొందించాలి.

2) భాగస్వామ్యం :
ఎ) ప్రధానోపాధ్యాయుడు
బి) సబ్జెక్టువారీగా, ప్రతి సబ్జెక్టు నుండి ఒక ఉపాధ్యాయుడు’
సి) ఉపాధ్యాయేతర సిబ్బంది నుండి ఒకరు చొప్పున భాగస్వాములుగా ఉండి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

10th Class Social Textbook Page No.238

ప్రశ్న 25.
బ్రిటన్ రాజు, భారత అధ్యక్షుడి స్థానాలలో తేడా ఏమిటి?
జవాబు:

భారత అధ్యక్షుడు బ్రిటన్ రాజు
1) భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటారు. 1)రాజ్యా నికి అధిపతి, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.
2) అధ్యక్షుని కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు. 2) కార్యనిర్వాహక వర్గానికి అధిపతి కాదు. దేశాన్ని పాలించడు. అతడి స్థానం అలంకారప్రాయం.
3) భారత అధ్యక్షుడు తన మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటాడు. 3)రాజు ముద్ర ద్వారా దేశ నిర్ణయాలను తెలియచేసారు.

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 26.
భారత రాజ్యాంగ రూపకర్తలు ద్వంద్వ పౌరసత్వ (దేశ, రాష్ట్ర విధానాన్ని ఎందుకు తిరస్కరించారు?
జవాబు:
భారత రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థను మనం రూపొందించుకున్నప్పటికి కేంద్రానికి, రాష్ట్రానికి వేరువేరుగా రాజ్యాంగాలు లేవు. దేశానికంతటికి ఒకే రాజ్యాంగం, అదే విధంగా ఒకే పౌరసత్వాన్ని కల్పించుట జరిగింది. ఒకే పౌరసత్వం మూలంగా ప్రజలందరిలో ఐకమత్యం పెంపొందించడానికి వీలుంటుంది. దేశ సమగ్రత, దేశ సమైక్యత కూడా పటిష్ఠంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లయితే ప్రజలు దేశ పౌరసత్వానికంటే తన రాష్ట్ర పౌరసత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకని రాజ్యాంగ రూపకర్తలు ద్వంద్వ పౌరసత్వాన్ని తిరస్కరించినారు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 27.
పై చర్చల్లో ఏ అభిప్రాయ భేదాలు వ్యక్తమయ్యా యి?
జవాబు:

  1. పై చర్చలో అంటరానితనానికి సంబంధించి భేదాలు వ్యక్తమయ్యాయి.
  2. ‘అంటరానితనం’ అనగా కొన్నిసార్లు ‘హరిజనులకు’ ఆలయ ప్రవేశం కల్పించటం అన్న అర్థంలో వాడతారు. కొన్నిసార్లు ‘ అది అన్ని కులాలు కలిసి భోజనం చెయ్యటంగా పరిగణించబడుతుంది.
  3. అంటరానితనం అనేది కులవ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే.
    ఈ విధమైన అభిప్రాయ భేదాలు వ్యక్తమయ్యాయి.

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 28.
ఈ చర్చలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తే, మీరు ఏ పరిష్కారాన్ని సూచిస్తారు?
జవాబు:
ఈ చర్చలో పాల్గొనే అవకాశం నాకు లభిస్తే, ‘అంటరానితనం’ అనే పదం ఏ రూపంలో ఉన్నా నేరమని చెపుతాను. – అంటరానితనం, కులం అనే పదాలను సమూలంగా తొలగించాలంటాను. అంటరానితనం అనే దురాచారం తరతరాలుగా సమాజం నుండి అనేకమంది వెలివేయబడుతున్నారు. ఇది సమానత్వ హక్కుకు గొడ్డలిపెట్టు. కావున ఈ పదాలను పూర్తిగా నిర్మూలించాలి.

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 29.
ఈ పదాన్ని రాజ్యాంగంలో నిర్వచించకుండా పొందుపరచడం ఒక మంచి ఆలోచన అని మీరు భావిస్తున్నారా ? మీ వాదనకు కారణాలను తెల్పండి.
జవాబు:
‘అంటరానితనం’ అనే పదాన్ని రాజ్యాంగంలో నిర్వచించకుండా, దానిని పొందుపరచడం మంచిదే అని నేను భావిస్తున్నాను. ఎందుకనగా విశాలమైన భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రకరకాలైన అర్థాలున్నాయి. కావున అంటరానితనాన్ని నిర్వచించకపోవడమే సమంజసం. అయితే రాజ్యాంగంలోని 17వ ప్రకరణ- అంటరానితనం నేరమని తెలియచేస్తుంది.

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 30.
‘కేవలం అంటరానితనమే కాకుండా రాజ్యాంగం కులవ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలకు అంతం పలికుండాల్సింది’ అనే విషయంతో మీరు ఏకీభవిస్తారా ? ఇది ఏ విధంగా చేసి ఉండాల్సిందని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
కేవలం అంటరానితనమే కాకుండా రాజ్యాంగం కులవ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలకు అంతం పలికుండాల్సింది అనే విషయంతో నేను ఏకీభవిస్తాను. కులాల ప్రసక్తి లేకుండా వ్యక్తుల యొక్క ఆర్ధిక స్థితిగతుల ఆధారంగా ప్రజలను విభజించినట్లయితే బాగుండేదని నా అభిప్రాయం. దీనివల్ల సమాజం కులాల ప్రాతిపదికన విభజింపబడేది కాదు. కులాల ప్రసక్తి వచ్చేది కాదు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.232

ప్రశ్న 31.
భారతదేశ రాజ్యాంగ ప్రవేశికతోపాటు కింద ఇచ్చిన రెండు దేశాల ప్రవేశికలను చదివి వాటిల్లో పోలికలు, తేడాలు పేర్కొనండి. తమ దేశం ఏర్పడటానికి దారితీసిన రాజకీయ ఘటనలను ప్రతిబింబించటానికి ప్రతి రాజ్యాంగమూ ప్రయత్నిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రాజ్యాంగంలో చోటు చేసుకున్న వాటిని ప్రభావితం చేసిన రాజకీయ ఘటనలను గుర్తించటానికి ప్రయత్నించండి. జపాన్ నేపథ్యాన్ని అర్థం చేసుకోటానికి 13వ అధ్యాయంలో జపాను గురించి మరొకసారి చదవండి. నేపాల్ నేపథ్యాన్ని అర్థం చేసుకోవటానికి 234వ పేజీ చూడండి.
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్ రాజ్యాంగాలలోని పోలికలు :
1) ప్రాథమిక హక్కులు, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉండడం, పౌర స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, దేశ సమగ్రత, పౌరులకు స్వాతంత్ర్యం, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రకటించడం వంటి లక్షణాలు భారతదేశం మరియు నేపాల్ రాజ్యాంగాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. జపాన్ రాజ్యాంగంలో సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందనే లక్షణం మాత్రమే సారూష్యంగా కనిపిస్తుంది.

తేడాలు :

భారత రాజ్యాంగం నేపాల్ రాజ్యాంగం జపాన్ రాజ్యాంగం
భారత రాజ్యాంగం వ్యక్తికి స్వేచ్ఛ, న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాలను అన్ని రంగాలలో ఇస్తుంది. ప్రజలకు జాతి, వర్గ, ప్రాంత, లింగం అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, రాచరిక పాలన రద్దు వంటివి నేపాల్ రాజ్యాంగం తెలుపుతుంది. జపాన్ రాజ్యాంగం, రానున్న తరాలకు వంటి యుద్ధ భయంలేని దేశాన్ని, శాంతిని, వాటి ఫలాలను అందించడానికి కృషి చేస్తామని తెలియచేస్తుంది.

10th Class Social Textbook Page No.233

ప్రశ్న 32.
ఈ దేశాల రాజకీయ నేపథ్యాలలో పోలికలు, తేడాలు ఏమిటి? అంతకు ముందు ఘటనలు ఏమిటి? అంతకు ముందు పాలకులు ఎవరు?
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్ దేశాల రాజకీయ నేపథ్యంలో ఈ క్రింది పోలికలు, తేడాలు కనిపిస్తున్నాయి.
తేడాలు :

  1. భారతదేశం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసి స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నది.
  2. నేపాల్ రాజరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల నిరంతర పోరాట ఫలితంగా రాచరికం రద్దయి, ప్రజాస్వామిక ప్రభుత్వం వచ్చింది.
  3. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జపాన్, సామ్రాజ్యకాంక్షతో యూరోపియన్ దేశాలతో పోటీ పడుతూ ఇతర స్వతంత్ర దేశాలను ఆక్రమించుకోవడానికి అనేక యుద్ధాలు చేసింది. జపాన్ ప్రజలకు యుద్ధభయాన్ని కలుగచేసింది. ఇటువంటి నేపథ్యంలో జపాన్, జపాన్ ప్రజలకు శాంతిని, యుద్ధభయం లేనటువంటి వాతావరణాన్ని కల్పించుకుంటామని జపాన్ రాజ్యాంగం తెల్పుతుంది.

పోలికలు:

  1. “ఈ మూడు దేశాల రాజ్యాంగాలను, ఆ దేశ ప్రజలు తమకు తామే ఇచ్చుకున్నాం” అనే పోలిక భారత్, నేపాల్, జపాన్ రాజ్యాంగాలలో కనిపిస్తుంది.
  2. భారత్, నేపాల్, జపాన్ దేశాలలోని ప్రజలు అనేక భయాలకు, కష్టాలకు, సమస్యలకు లోనయి ఉన్న నేపథ్యం కనిపిస్తుంది.

అంతకు ముందు ఘటనలు :

  1. 1947కు ముందు భారతదేశం బ్రిటీషు వారి పరిపాలనలో ఉంది. స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలు జరిగాయి.
  2. నేపాల్ 2007కు ముందు రాచరికపాలనలో ఉంది. ప్రజాస్వామ్యం కొరకు అనేక ఉద్యమాలు జరిగాయి.
  3. 1945కు పూర్వం రాచరిక ప్రభుత్వాల వలన జపాన్ రెండు ప్రపంచయుద్ధాలలో పాల్గొని అపార నష్టాన్ని చవిచూసింది. – 1945లో రెండవ ప్రపంచయుద్ధం తరువాత జపాన్ ప్రజాస్వామ్య దేశమైనది.

అంతకు ముందు పాలకులు :
రాజ్యాంగాలను రూపొందించుకోవడానికి ముందు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన ఉంది. నేపాల్ లో నిరంకుశ రాచరికం ఉంది. జపాన్లో సామ్రాజ్యకాంక్ష ఉన్న నాయకత్వం ఉంది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 33.
గతం పట్ల సమీక్షలో వివిధ ప్రవేశికలలోని పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్ ప్రవేశికలలోని పోలికలు, తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పోలికలు :
భారతదేశం, నేపాల్, జపాన్ దేశాలలోని ప్రజలు తరతరాలుగా రాజరికం నిరంకుశ పాలనతో విసిగిపోయి ఉన్నారు. అయితే భారతదేశంలో రాచరికాలకు తోడు బ్రిటిష్ వలస పాలన కూడా తోడైంది. జపాన్లో షోగునేట్ పాలన అంతమవడంతో కొంత అభివృద్ధి జరిగింది.

తేడాలు :

  1. భారత్, నేపాల్, దేశాలలో రాచరికాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. భారతదేశంలో అయితే వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది.
  2. జపాన్ “మిజి”ల పరిపాలనలో అభివృద్ధి సాధించినప్పటికీ జపాన్ చేసిన యుద్దాల మూలంగా ప్రజలలో యుద్ధభయం, 2వ ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన అణుబాంబులు భయాన్ని పుట్టించాయి.

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 34.
మూడు దేశాల్లో భవిష్యత్తు సమాజం గురించి ఎటువంటి వాగానాలు చేశారు?
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్లలో భవిష్యత్తు సమాజం గురించి చేసిన వాగ్దానాలు :

1) భారతదేశం :
సార్వజనీన అక్షరాస్యత, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఆదాయ అసమానతలను తగ్గించటం, ప్రాథమిక హక్కులను అందరికి వర్తింపచేయటం. “న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటివి ప్రజలందరికి వర్తిస్తాయని వాగ్దానం చేసింది భారత ప్రభుత్వం.

2) నేపాల్ :
పౌరుల హక్కులు, బాధ్యతలు, ప్రభుత్వం దాని అంగాలైన కార్యనిర్వాహక, శాసన, న్యాయశాఖల వంటివాటి నిర్మాణం, అధికారాలను పేర్కొనటం, ప్రభుత్వమూ, సమాజమూ కలిసి నిర్మించాల్సిన భవిష్యత్తు సమాజ స్వభావాన్ని సూచించటం వంటి వాటిని నేపాల్ దేశం ప్రకటించింది.

3) జపాన్ :
రానున్న తరాలకు అన్ని దేశాలతో శాంతియుత సహకారం లభించాలని, ప్రభుత్వ చర్యల ద్వారా సహకారం లభించాలని, ప్రభుత్వ చర్యల ద్వారా ఎన్నడూ యుద్ధభయాలు తిరిగి దేశాన్ని కమ్ముకోవని, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందని జపాన్ తెలియచేస్తూ రాజ్యాంగాన్ని ప్రకటించింది.

10th Class Social Textbook Page No.236

ప్రశ్న 35.
దేశం మొత్తానికి రాజ్యాంగాన్ని రూపొందించటంలో భారతదేశ ప్రజలందరూ పాల్గొనగలరా ? ఈ ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనాల్సిన అవసరం ప్రజలందరికీ ఉందా లేక కొంతమంది విజ్ఞులకు ఈ బాధ్యత అప్పగిస్తే సరిపోయేదా?
జవాబు:

  1. రాజ్యాంగ సభను వయోజనులందరికీ కల్పించిన సార్వత్రిక వయోజన ఓటుహక్కు ద్వారా ఎన్నుకోలేదు. అప్పట్లో జనాభాలో 10% ప్రజలకే ఓటుహక్కు ఉండేది.
  2. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని ప్రజలు లేక వారి ప్రతినిధులు రూపొందిస్తారు. కావున మనదేశంలో ప్రజా ప్రతినిధులు రూపొందారు.
  3. ప్రజలందరూ రాజ్యాంగ రూపకల్పనలో క్రియాశీలంగా పాల్గొనవలసిన అవసరం లేదు. ప్రజలందరికి విద్య లేదు. విజ్ఞానం కూడా అందరికి ఉండదు. ఇటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు శాస్త్ర, విజ్ఞాన, విద్యా రంగాల నిష్ణాతులుగా ప్రాతినిధ్యం వహిస్తారు. కావున ఇటువంటి విజ్ఞులు కొంతమందికి రాజ్యాంగ రూపకల్పన బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 36.
భారతీయ సమాఖ్య వ్యవస్థకూ, అమెరికా సమాఖ్య వ్యవస్థకూ మధ్యగల ముఖ్యమైన తేడాలను పేర్కొనండి.
జవాబు:
భారత్, అమెరికాల సమాఖ్య వ్యవస్థలో ఈ క్రింది తేడాలున్నాయి.

భారత సమాఖ్య వ్యవస్థ అమెరికా సమాఖ్య వ్యవస్థ
1) పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తుంది. 1) అధ్యక్ష వ్యవస్థ ప్రభుత్వం అంటారు.
2) కేంద్రరాష్ట్రాలతో కూడిన ద్వంద్వ ప్రభుత్వాల విధానం ఉంటుంది. కార్యనిర్వాహక శాఖ శాసనశాఖలో అంతర్భాగం. 2) ఫెడరల్ ప్రభుత్వమని, రాష్ట్ర ప్రభుత్వమని ద్వంద్వ ప్రభుత్వాలుంటాయి. కార్యనిర్వాహకశాఖ అనగా అధ్యక్షుడు, అతని సలహాదారులు. శాసననిర్మాణం శాఖలో అంతర్భాగం కాదు.
3) భారత సమాఖ్యలో అధ్యక్షుడు, రాజ్యా నికి అధిపతి, కాని పరిపాలన బాధ్యత ఉండదు. 3) పరిపాలన బాధ్యత అంతా అధ్యక్షుడి క్రింద ఉంటుంది.
4) అధ్యక్షుని కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు. 4) అధ్యక్షుని కింద వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ సెక్రటరీలు ఉంటారు.

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 37.
అమెరికాలో కేంద్ర ప్రభుత్వ న్యాయవ్యవస్థ, రాష్ట్ర న్యాయవ్యవస్థ వేరు వేరు. భారతదేశంలో కేంద్ర, రాష్ట్రాల న్యాయవ్యవస్థలు సమగ్ర న్యాయవ్యవస్థలో ఒక భాగం – వివరించండి.
జవాబు:
అమెరికాలో సమాఖ్య న్యాయవ్యవస్థ, రాష్ట్ర న్యాయవ్యవస్థ రెండూ వేరు, వేటికవి స్వతంత్రమైనవి. అయితే భారత సమాఖ్యలో రాజ్యాంగం రెండు స్థాయిలలో న్యాయస్థానాలను ఏర్పాటు చేయలేదు. మనది ఏకీకృత, సమగ్ర న్యాయవ్యవస్థ.

  1. సుప్రీంకోర్టు విచారణ పరిధి కిందకు యావత్ దేశం వస్తుంది. కేంద్ర పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన చట్టాల రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తుంది.
  2. రాష్ట్రస్థాయిలో పనిచేసే హైకోర్టుకు కూడా శాసనసభ కార్యనిర్వాహక చర్యల రాజ్యాంగబద్ధతను పరిశీలించే అధికారం ఉంది.
  3. సుప్రీంకోర్టు, హైకోర్టులకు ‘రిట్’ లను జారీ చేసే అధికారం ఉంది.
  4. సుప్రీంకోర్టు, హైకోర్టు వాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు.
  5. సుప్రీంకోర్టు నిర్ణయాలు యావత్ భారతదేశానికి వర్తిస్తాయి. అన్ని న్యాయస్థానాలు ఈ తీర్పులను పాటించాలి.
  6. హైకోర్టులు కింది న్యాయస్థానాలపై అజమాయిషీ చేస్తాయి.
  7. అదే విధంగా ఏ న్యాయస్థానం తీర్పునైనా తాత్కాలిక నిలుపుదల ఉత్తరువు ఇవ్వవచ్చు. దానిని పరిశీలించి తిరిగి విచారణ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది.

ఉన్నత న్యాయవ్యవస్థ నిర్మాణం హైకోర్టులతో సహా కేంద్ర ప్రభుత్వ పరిధి కిందకు వస్తుంది. పార్లమెంటు హైకోర్టు అధికార పరిధిని పెంచవచ్చు. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచే అధికారం ఒక్క పార్లమెంటుకే ఉంది. వీటిని బట్టి మనకర్ధమవుతున్నదేమిటంటే భారత రాజ్యాంగం న్యాయవ్యవస్థ నిర్మాణంలో ఏకీకృత పద్ధతిని అనుసరించింది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 38.
సేథ్ అభిప్రాయాలు, ముసాయిదా రాజ్యాంగానికి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
సేథ్ అభిప్రాయాలు, ముసాయిదా రాజ్యాంగానికి మధ్య పోలికలు :

  1. రాజ్యాంగ సభ సభ్యులు వయోజన ఓటుహక్కు ద్వారా ఎన్నుకోబడలేదని సేథ్ వాదించారు. ముసాయిదా రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు వయోజన ఓటుహక్కు ద్వారా ఎన్నుకోబడలేదు.
  2. ముసాయిదా రాజ్యాంగం సమాఖ్య విధానాన్ని ప్రతిపాదిస్తుంది. సేథ్ కూడా అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు. అధికార కేంద్రీకరణ జరిగితే ఫాసిస్ట్ ఆదర్శాల వైపు నిరంకుశ అధికారంగా మారుతుందని అన్నాడు. మన రాజ్యాంగం కేంద్రరాష్ట్రాల మధ్య అధికారాన్ని వికేంద్రీకరించింది.
  3. గ్రామ పంచాయితీల గురించి ప్రస్తావన లేదని సేథ్ విమర్శించారు. ముసాయిదా రాజ్యాంగంలో గాంధీజీ కలలు కన్న గ్రామాల గురించి విస్మరించినారు.

తేడాలు :

  1. సేథ్ అధికార కేంద్రీకరణ జరిగిందని వాదించారు. వాస్తవానికి ముసాయిదా రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారం అనేది పంచబడింది.
  2. అధికార కేంద్రీకరణ ఎక్కువైతే ఫాసిజం వైపు మళ్ళుతుందని సేథ్ అన్నాడు. అయితే ముసాయిదా రాజ్యాంగంలో పార్లమెంటరీ సమాఖ్య విధానంతో ప్రజాస్వామ్యం వైపు వెళుతున్నామని తెలుస్తుంది.

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 39.
రాజ్యాంగానికి 73వ సవరణ చేసిన తరువాత గ్రామాలకు ఎటువంటి స్వయంప్రతిపత్తి కల్పించారో తెలుసుకోండి.
జవాబు:
1992లో రాజ్యాంగానికి 73వ సవరణ చేయుట జరిగింది.

73వ సవరణతో గ్రామాలకు స్వయంప్రతిపత్తి :

  1. గాంధీజీ ఆశించిన గ్రామాలకు రాజ్యాంగంలో సరైన ప్రాతినిధ్యం దొరకలేదు. 1992లో రాజ్యాంగానికి 73వ సవరణ చేసి ఆర్టికల్ 40లో ఈ గ్రామపంచాయితీలను చేర్చారు.
  2. ఆర్టికల్ 40 నిర్దేశిక నియమాలలోనిది. గాంధీజీ ఆశించినట్లు ప్రతి గ్రామం “ఒక రామరాజ్యం ” కావాలని ఈ సవరణ చేసి గ్రామపంచాయితీలకు ప్రాధాన్యత కల్పించారు.
  3. ఈ 73వ సవరణ ప్రకారం గ్రామ పంచాయితీ సభ్యులు, అధ్యక్షుడు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కావాలి.
  4. గ్రామ పంచాయితీకి అవసరం అయిన నిధులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి.
  5. సర్పంచ్ వయోజనులచే ప్రత్యక్షంగా ఎన్నిక కావాలి.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 40.
AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం 1
1950, జనవరి 26 నాటి వార్తాపత్రిక. ఈ పేజీలో ఏ ఏ అంశాలు ఉన్నాయో వ్యాఖ్యానించండి.
జవాబు:
ది స్టేట్స్మ న్ అనే వార్తాపత్రికలో క్రింది అంశాలు కనిపిస్తున్నాయి.

  1. భారతదేశం ఈ రోజు గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రజలందరు ఓర్పు, సహనాలను కలిగి ఐకమత్యంగా ఉండాలని నెహ్రూ ప్రజలకు పిలుపునిచ్చాడు. అన్ని దేశాలను స్నేహ సంబంధాల కొరకు ఆహ్వానించాడు.
  2. సుకర్నో భారత ఎం.పి.లను ఉద్దేశించి మాట్లాడినాడు. భారతదేశం కొత్త గణతంత్రదేశంగా ఆవిర్భవించినందుకు శుభాకాంక్షలు తెలిపినారు.
  3. భారత రాజ్యాంగంలోని “ప్రవేశిక” ను ప్రచురించినారు.
  4. కలకతాలో ఈ రోజు ప్రోగ్రాం అనే వార్తతో ఆ రోజు కార్యక్రమాలను ఇచ్చినారు.
  5. ఇరు దేశాల మధ్య సరిహద్దులను ఏర్పాటు చేసుకున్నారు.
  6. “హౌర” గ్రామంలో గన్‌మెన్, ఇద్దరు పోలీసులను చంపినాడు.
  7. “కలకతా నుండి గౌహతి” వెళుతున్న విమాన ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది మరణించినారు.
  8. “ఇంపీరియల్ కెమికల్ ఇండియా” వారి ఫర్నీచర్‌కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ప్రచురించబడింది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.246

ప్రశ్న 41.
భారత రాజ్యాంగంలోని మౌలిక అంశాలకు సంబంధించి మీరు గుర్తించిన ఉదాహరణలు, వివరణలు పేర్కొనండి.
జవాబు:
రాజ్యాంగంలోని మౌలిక అంశాలకు సంబంధించి నేను గుర్తించిన అంశాలు :
1) వయోజనులందరికి ఓటుహక్కు ఉండడం, వారి ఓటుతో తమకు కావలసిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం అనే సార్వభౌమాధికారం ప్రజలలో ఉందని తెలుపుతుంది.

2) “సామ్యవాదం” :
ప్రజలందరూ, సమానత్వాన్ని అనుభవించాలంటే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి, దానిని సాధారణ, చట్ట హక్కుగా చేసినారు. ఇదంతా సామ్యవాద సమాజాన్ని స్థాపించుట కొరకే.

3) న్యాయం :
ప్రతి వ్యక్తికి రాజకీయ, ఆర్థిక, సాంఘిక న్యాయాలను రాజ్యాంగం కల్పించింది. దీని ప్రకారం ఏ వ్యక్తి అయిన వయోజనుడైతే ఎన్నికలలో పోటీచేయవచ్చు. పేదరిక నిర్మూలన సమాన ప్రాతిపదికపై సంపద పంపిణీ, కుల, మత, వర్గ, స్త్రీ, పురుష, అల్పసంఖ్యాకులనే భేదం లేకుండా అందరికి సమాన న్యాయం కల్పించబడింది.

4) స్వేచ్ఛ :
ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. ప్రతి వ్యక్తికి భావప్రకటన తన ఇష్టం వచ్చిన మతాన్ని ఆరాధించడానికి స్వేచ్ఛ ఉన్నది.

5) ప్రాథమిక హక్కులు :
ప్రతి వ్యక్తి రాజ్యాంగం తనకు కల్పించిన ప్రాథమిక హక్కులు అనుభవించవచ్చు. ఏ కారణాల వలన అయిన తమ హక్కులకు భంగం కలిగినట్లైతే న్యాయస్థానానికి ఫిర్యాదు చేయవచ్చు.

న్యాయస్థానాలు వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తాయని నేను గమనించాను.

AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

SCERT AP 10th Class Social Study Material Pdf 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు

10th Class Social Studies 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సామాజిక ఉద్యమాలపై ఒక పట్టిక తయారు చెయ్యటానికి ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. వీటి ఆధారంగా పట్టిక తయారుచేసి వివిధ ఉద్యమాల మధ్య పోలికలు, తేడాలను గుర్తించండి.
ఉద్యమం దృష్టి పెట్టిన ప్రధాన అంశం; ఎక్కడ జరిగింది; ప్రధాన కోరికలు; నిరసన తెలియచేసిన పద్ధతులు; ముఖ్యమైన నాయకులు, ప్రభుత్వం స్పందించిన తీరు; సమాజంపై ఉండే ప్రభావం. (AS3)
జవాబు:

ప్రశ్న 2.
కన్నయ్య, రమ్య, సల్మా ఒక విషయాన్ని చర్చిస్తున్నారు. వాళ్ల కోరికలు వేరు. మానవ హక్కుల కోణం నుంచి మీరు ఎవరితో ఏకీభవిస్తారో పేర్కొని మీ కారణాలను తెలియచెయ్యండి.
ప్రజలు పేదరికంలో మగ్గకుండా చూడాలి, అందుకు అవసరమైతే పత్రికా స్వేచ్ఛను కొంతవరకు నియంత్రించినా ఫర్వాలేదని రమ్య అంటుంది. ఆహారం ఒక్కటే ఉంటే చాలదని, పత్రికా స్వేచ్ఛ కూడా ఉండటం ముఖ్యమని లేకపోతే దేశ వివిధ ప్రాంతాలలో మానవ హక్కులు ఎక్కడైనా ఉల్లంఘింపబడుతున్నాయేమో తెలిసే మార్గమే ఉండదన్నది సల్మా వాదన. పత్రికలు ధనికులు, శక్తిమంతుల చేతుల్లో ఉన్నప్పుడు ప్రయోజనం ఏమిటి, అవి సాధారణ ప్రజలకు సంబంధించిన అంశాలను ఎందుకు ప్రచురిస్తాయని కన్నయ్య అంటాడు. (AS2)
జవాబు:
నేను సల్మా వాదనతో ఏకీభవిస్తాను. ఎందుకనగా

  1. ప్రతివ్యక్తికి ఆహారం ముఖ్యమే, అయినా స్వేచ్ఛ కూడా ముఖ్యమే.
  2. పత్రికా స్వేచ్ఛ అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. పత్రికా స్వేచ్ఛ అనగా, భావ ప్రకటన స్వేచ్ఛ. ఇది ఒక ప్రాథమిక హక్కు
  3. ప్రతీ వ్యక్తికి ప్రాథమిక హక్కులు అవసరం. ప్రజలకు ఆహారం ఒక్కటే ముఖ్యం కాదు. పత్రికా స్వేచ్ఛతో ప్రపంచం నలుమూలలా ఏం జరిగినా తెలుసుకోగలుగుతారు. అదే విధంగా మానవ హక్కులు ఎక్కడైనా ఉల్లంఘించ బడుతున్నాయేమో తెలుసుకోవచ్చు.
  4. ప్రపంచీకరణ జరుగుతున్న నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా అవసరం.
  5. సమాజంలో జరిగే విషయాలు తెలుసుకొని, పాల్గొనడానికి పత్రికా స్వేచ్ఛ ఉండాలి.
  6. మానవ హక్కులకు రక్షణ చాలా అవసరం.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 3.
సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలు ఏమిటి?
జవాబు:

  1. వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించడం.
  2. ప్రజలకు స్వేచ్ఛాపూరిత, భావ ప్రకటన వంటివి.
  3. పర్యావరణ ఉద్యమాలలో – నష్టపరిహారం, పునరావాసం.
  4. సారా వ్యతిరేక ఉద్యమాలు.
  5. మైరా పైబీ ఉద్యమంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరటం జరిగింది.
  6. సామాజిక ఉద్యమాలన్నీ రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం పనిచేస్తాయి.
  7. కొన్ని సందర్భాలలో తమపై రుద్దిన మార్పులను ఈ ఉద్యమాలు ప్రతిఘటించాయి.
  8. మార్టిన్ లూథర్ కింగ్, మైరా పైబీ వంటి కొన్ని ఉద్యమాలు మార్పును కోరుకున్నాయి.

ప్రశ్న 4.
పైన ఇచ్చిన ఉదాహరణలో సాధారణ ప్రజల పాత్రను ఎలా పేర్కొన్నారు?
జవాబు:

  1. సాధారణ ప్రజలు ముందుగా వారి సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తారు.
  2. ప్రభావిత ప్రజలు, వారి సమస్యలను తీర్చే నాయకుల వద్ద వెలిబుచ్చుతారు.
  3. ప్రజలు, వారి అభిప్రాయాలను ప్రజా ప్రతినిధుల ద్వారా వినిపిస్తారు.
  4. ప్రజలు వారి నాయకులు ప్రారంభించిన ఉద్యమాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, పికెటింగ్ వంటి వాటిలో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు.
  5. ఈ మధ్యకాలంలో ప్రజలు, ఇంటర్నెట్, సాంఘిక ప్రచార సాధనాల వల్ల చైతన్యవంతులవుతున్నారు. వారి సమస్యల సాధన కొరకు పోరాడుతున్నారు.
  6. ప్రస్తుత కాలంలో ప్రజలు వారి సమస్యలే కాకుండా సమాజ సమస్యలు అనగా పర్యావరణం, కాలుష్యం, పునరావాసం, నష్టపరిహారం వంటి సమస్యల పట్ల మరియు మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్న ప్రజలకు కూడా సహకారం అందిస్తూ, ఆయా ఉద్యమాలలో భాగస్వాములు అవుతున్నారు.
  7. సామాన్య ప్రజల సహకారం, భాగస్వామ్యం లేనిదే సాంఘిక ఉద్యమాలు విజయం సాధించలేవు.

ప్రశ్న 5.
అమెరికాలోని నల్లజాతీయులు, మైరా పైబీ ఉద్యమాల మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
అమెరికాలోని నల్లజాతీయులు, మైరా పైబీ ఉద్యమాల మధ్య ఉన్న తేడాలు :

అమెరికాలోని నల్లజాతీయులు మైరా పైబీ ఉద్యమం
1) ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి. 1) సాయుధ ధళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చెయ్యాలని మైరా పైబీ ఉద్యమం కోరుతుంది.
2) మంచి గృహ వసతి. 2) మహిళలు మాత్రమే ఉద్యమంలో పాల్గొన్నారు.
3) స్త్రీ, పురుషులందరూ పాల్గొన్నారు. 3) ఎన్నికలను బహిష్కరించారు.
4) ఓటు హక్కు 4) వీరు కేవలం కిరోసితో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉపయోగించారు.
5) శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే విద్యా సదుపాయాలు వంటివి నల్లజాతీయుల కోరికలు. 5) రాత్రిళ్లు కాపలా కాసేవారు.
6) ప్రదర్శనలు, నిరసనలు, ఊరేగింపుల ద్వారా ఉద్యమాన్ని నడిపారు.

పోలికలు:

అమెరికాలోని నల్లజాతీయులు మైరా పైబీ ఉద్యమం
1) పౌరహక్కుల చట్టాన్ని చేయవల్సిందిగా కోరారు. 1) మానవ హక్కుల ఉద్యమంగా మారింది.
2) తమను పట్టించుకొనుటలేదని మహిళలు భావించారు. 2) మహిళలు మాత్రమే ఉద్యమం చేశారు.
3) మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. 3) మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది.

ప్రశ్న 6.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక రాజకీయ వ్యవస్థలుగా ప్రజాస్వామ్యాలే ఉన్నాయి. ఇవి ప్రజల ఆకాంక్షలకు పూర్తి న్యాయం చేశాయా? ఈ అధ్యాయంలో ఇచ్చిన ఉదాహరణల ఆధారంగా ‘ప్రజాస్వామ్యం సామాజిక ఉద్యమాలు’ అన్న అంశంపై చిన్న వ్యాసం రాయండి. (AS4)
AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 1
జవాబు:
“ప్రజాస్వామ్యం – సామాజిక ఉద్యమాలు” :
ప్రపంచంలో చాలా దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలే ఉన్నాయి. ఇవి ప్రజల ఆకాంక్షలను పూర్తిగా న్యాయం చేయలేదనడానికి నిదర్శనమే సామాజిక ఉద్యమాలు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలే ప్రజలను వివక్షతతో చూస్తున్నాయి. కొందరికి మానవ హక్కులను – ఉల్లంఘిస్తున్నాయి, సామాజిక న్యాయాన్ని చేకూర్చుట లేదు.
ఉదా :
అమెరికా పౌరహక్కుల ఉద్యమం. (నల్లజాతి వారిని ప్రభుత్వం వివక్షతతో చూడడం) దక్షిణాఫ్రికాలోని జాతి వివక్షత చాలాకాలం సమాన హక్కులకు దూరంగా ఉన్నవారు సామాజిక ఉద్యమాలను లేవనెత్తుతారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వలస పాలన నుండి అనేక దేశాలు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాయి. ఇటువంటి దేశాల ప్రజలు వలస పాలనతో ఇబ్బందులను అనుభవించి, తమ కష్టాలను తీర్చే ప్రభుత్వాలను ఆశించారు. కాని ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ప్రజల ఆశలను పరిగణనలోకి తీసుకోకుండా అణుయుద్ధాలు చేశాయి. ఆయుధసమీకరణ చేసి, ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేశాయి. ప్రచ్ఛన్న యుద్ధం తరువాత అణ్వాయుధాలను నిషేదించినప్పటికి ప్రజలకు శాంతి, భద్రతలను కల్పించలేకపోయాయి. ఇటువంటి తరుణంలోనే ప్రజలు ప్రభుత్వాలను వ్యతిరేకించారు. అనేక ఉద్యమాలను లేవదీశారు. ముఖ్యంగా పర్యావరణ కాలుష్యం, సామాజిక న్యాయం కల్పించకపోవడం, వివక్షతను పాటించటం వంటి సమస్యలు ఉద్యమాలకు కారణాలని చెప్పవచ్చు. ఇటువంటి సమస్యల సాధనలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విఫలం అయ్యాయని చెప్పవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 7.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి వాటి నేపథ్యంలో నిరసనలు, ఉద్యమాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఎలా సమీకరిస్తారో తెలుసుకుని, చర్చించండి. (AS3)
జవాబు:
వివిధ ఉద్యమాలలో ప్రజలను వివిధ రకాలుగా సమీకరించుట జరిగింది. వాటిలో నుండి కొన్ని :
1) భోపాల్ గ్యాస్ దుర్ఘటన చాలా తీవ్రమైనది. ఇది భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ కంపెనీ తరువాత దీనిని ‘డౌ’ కంపెనీకి అమ్మేశారు. ఏమీ తెలియని ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతుంటే ఒకరాత్రి కంపెనీ నుండి విషవాయువు వెలువడి వేలాదిమంది చనిపోయారు. దాని ప్రభావం వల్ల ఇప్పటికి వేలాది మంది బాధపడుతున్నారు. అయితే ఈ కంపెనీ బహుళజాతి కంపెనీ. ఇది అమెరికాలో ఉంది. ఈ దుర్ఘటనలో బాధితులకు సరైన నష్టపరిహారం, వైద్య సదుపాయాలు కల్పించలేదు. ఈ కంపెనీ మీద పోరాటానికి అంతర్జాతీయ చట్టాలను ఉపయోగిస్తున్నారు. లండన్ ఒలింపిక్స్ క్రీడలకు ‘ఔ’ కంపెనీ స్పోన్సరు చెయ్యటానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతకాలు సేకరిస్తున్నారు.

2) ‘నర్మదా బచావో’ ఉద్యమంలో నిర్వాసితులైన ప్రజలకోసం ఉద్యమ నాయకులు. ‘బావా మహలియా’, మేధాపాట్కర్ వంటి నాయకులు పోరాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమంలోకి భాగస్వాములను చేశారు. దీని కొరకు తీవ్ర నిరసనలు, ప్రదర్శనలు, నిరాహారదీక్షలు అంతర్జాతీయ ఉద్యమాల ద్వారా ప్రజలను సమీకరించారు.

3) కేరళలోని ‘సైలెంట్ వ్యాలీ’ ఉద్యమం విషయంలో అరుదైన జంతువులు, మొక్కలు అంతరించిపోతాయని అనేకమంది విద్యావంతులు గ్రహించారు. వీటి రక్షణ కొరకు పెద్ద ఉద్యమం ఏర్పడింది. ప్రజలలో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికీ, విద్యకోసం పనిచేస్తున్న కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ (కెఎఎపి) రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించింది.

4) అమెరికా పౌరహక్కుల ఉద్యమంలో వివక్షతకు గురి అవుతున్న నల్లజాతీయులే ఈ ఉద్యమాన్ని లేవదీసారు.

5) యూరపులో గ్రీన్ పీస్ ఉద్యమంలో అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ గ్రీన్ పీస్ ఉద్యమం ప్రారంభమైనది. దీనిలో స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఉద్యమం 40 దేశాలకు విస్తరించింది.

6) సారా వ్యతిరేక ఉద్యమంలో పేదవారు, ఈ సమస్యకు ప్రభావితమవుతున్నా మహిళలు పాల్గొన్నారు. ‘సాక్షరతా’ పుస్తకాల ద్వారా ఉద్యమ విషయాలు తెలుసుకుని అనేక గ్రామాలలోని మహిళలు ఈ ఉద్యమంలోకి వచ్చారు.

7) మైరా పైబీ ఉద్యమం తీసుకువచ్చింది మణిపూర్ మహిళలు. సాయుధ దళాలకు ఉన్న ప్రత్యేక అధికారాల చట్టం మూలంగా తరచు మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. మహిళలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. ఇందుకు నిరసనగా సాయుధ దళాలకు ప్రత్యేక అధికార చట్టాలను రద్దుచేయాలని మహిళలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు.

8) ప్రస్తుత కాలంలో నిరసనలు, ఉద్యమాలకు ప్రజలను ఫేస్ బుక్, ట్విట్టర్, ఇ-మెయిల్, ఇంటర్నెట్, వార్తాపత్రికలు వంటి వాటి ద్వారా సమీకరిస్తున్నారు.

10th Class Social Studies 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 1.
గ్రీన్‌పీస్ ఉద్యమం వెబ్ సైట్ చూసి (http:/www.greenpeace.org/international) అది పనిచేస్తున్న అంశాల గురించి, ఎంచుకున్న పోరాట పద్ధతుల గురించి తెలుసుకోండి. ఈ ఉద్యమంపై ఉన్న చర్చలు, విమర్శల గురించి కూడా తెలుసుకోండి.
జవాబు:

10th Class Social Textbook Page No.302

ప్రశ్న 2.
పెంటగావ్ వద్ద కాపలా ఉన్న సైనికుడికి నిరసనకారులలోని ఒక మహిళ ఒక పువ్వు ఇస్తోంది. ఈ బొమ్మలోని భావనలను చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 2
జవాబు:
అమెరికా, వియత్నాంతో అన్యాయంగా యుద్ధం చేస్తుందనే భావన అమెరికా సైనికులలో, ప్రజలలో ఉంది. ఆ యుద్ధాన్ని నిరసిస్తూ ప్రజలు ఉద్యమం కూడా చేశారు. అయితే అమెరికా చేస్తున్న యుద్ధం పట్ల వ్యతిరేకత సైనికులలో గమనించిన, నిరసన తెలియజేయడానికి వచ్చిన వారిలో నుండి ఒక మహిళ ఆ సైనికుడిని అభినందిస్తూ ఒక పువ్వును ఇస్తుందని పై చిత్రం ద్వారా తెలుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.299

ప్రశ్న 3.
డా|| మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ దా! కింగ్ ఇచ్చిన ఈ ప్రఖ్యాత ఉపన్యాసాన్ని చదివి, అమెరికా సమాజానికి అతడు.. ఉంచిన ఆదర్శాల గురించి, వాటిని సాధించటానికి అతడు రూపొందించుకున్న ప్రణాళిక గురించి ఒక వ్యాసం రాయంది.
AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 3
జవాబు:
ఉద్యమాలలో అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం చాలా ముఖ్యమైనది. ఈ ఉద్యమాన్ని డా|| మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డా॥ కింగ్ ముందుకు నడిపించారు. అయితే ఈ ఉద్యమమనేది “పౌర నిరాకరణ” ధ్యేయంగా నడిచింది. (వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం). డా॥ కింగ్ అమెరికా సమాజంపై ఉంచిన ఆదర్శాలు. పాఠశాలల్లో, బస్సుల్లో, బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వారిని వేరుగా ఉంచడానికి, ఉద్యోగాలలో, గృహవసతిలో, ఓటు హక్కులలో నల్లవారిని వివక్షతతో చూడకుండా వీరికి కూడా తెల్లవారితో సమానంగా హక్కులు కల్పించాలి.

ఒక సంవత్సరం పాటు డా॥ కింగ్ అధ్యక్షతన మాంటగోయెరిలో నల్లజాతీయులు బస్సులను బహిష్కరించారు. ఈయన పౌరహక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు కావాలని కోరాడు. మనుషులను శరీర రంగును బట్టి కాకుండా వాళ్ల వ్యక్తిత్వ లక్షణాలను బట్టి అంచనావేసే దేశంగా అమెరికా మారాలని డా॥ కింగ్ తన ఉపన్యాసంలో తెలియచేశాడు.

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 4.
పౌర హక్కుల ఉద్యమ కోరికల జాబితా తయారుచేసి, వాటికి మీరు సూచించే పరిష్కారాలు ఏమిటో రాయండి.
జవాబు:
పౌరహక్కుల ఉద్యమంలోని కోరికలు, వాటికి నేను సూచించే పరిష్కారాలు

పౌరహక్కుల ఉద్యమ కోరికలు పరిష్కార సూచనలు
1) ఉపాధి కల్పనకు కార్యక్రమాలు 1) ప్రభుత్వమే వివిధ పరిశ్రమలను స్థాపించాలి, సమానత్వాన్ని పాటించాలి.
2) పూర్తి న్యాయమైన ఉపాధి కల్పించడం. 2) తెల్లవారు, నల్లవారు అనే విచక్షణ చూపించకుండా అందరికీ సమాన ఉపాధి కల్పించాలి.
3) మంచి గృహవసతి 3) ప్రభుత్వం గృహవసతి కల్పించాలి. లేదా నల్లవారు ఇళ్లు కట్టుకోవడానికి సహాయం చేయాలి.
4) ఓటు హక్కు కల్పించాలి. 4) తెల్లవారితో సమానంగా నల్లవారందరికీ ఓటు హక్కు కల్పించాలి.
5) శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు. 5) నల్లవారు కూడా తెల్లవారితో కలిసి చదువుకునేలా చట్టాలు చేయాలి. వాటిని సక్రమంగా అమలుచేయాలి.
6) పౌర హక్కుల చట్టాన్ని చేయాలి. 6) పౌరహక్కుల ఉద్యమంలోని కోరికలు అమలు జరగాలంటే పౌరహక్కుల చట్టాన్ని చేయాలి, చట్టం అమలు కొరకు యంత్రాంగాన్ని కూడా నియమించాలి.

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 5.
ప్రజాస్వామిక దేశమని అమెరికా చెప్పుకుంటుంది. కానీ గత శతాబ్దం మధ్యకాలం వరకు కొంతమంది ప్రజలను వేరుగా ఉంచింది. భారతదేశ నేపథ్యంలో ప్రజాస్వామ్య భావన అందరినీ కలుపుకునేలా ఎలా ఉండాలో చర్చించండి.
జవాబు:
భారతదేశ నేపధ్యంలోని ప్రజాస్వామ్యం వలె అమెరికాలో ప్రజాస్వామ్యం అమలు కావాలంటే ఈ క్రింది విధంగా చేయాలి.

  1. జాతి, మత, వర్గ విచక్షణ, పేద, ధనిక అనే తారతమ్యాలు ప్రత్యేకించి నల్లవారు, తెల్లవారు అనే విచక్షణ చూపకుండా అందరినీ సమాన ప్రాతిపదికన చూడాలి.
  2. మన దేశంలో స్త్రీ, పురుష, జాతి, వర్గ, కుల, మత, భాషా తారతమ్యాలు పాటించకుండా అందరికీ ఓటు హక్కును కల్పించినట్లు అమెరికా కూడా దేశంలోని ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించాలి.
  3. మనదేశంలో అల్పసంఖ్యాకులకు రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించినట్లు అమెరికా కూడా అల్పసంఖ్యాకులైన నల్లవారికి కూడా రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాలి.
  4. భారత రాజ్యాంగం ప్రకారం మనదేశ పౌరులందరికీ పౌరసత్వం ఉన్నట్లే అమెరికాలో కూడా నల్లవారనే తేడాలు లేకుండా అందరికీ పౌరసత్వం ఇవ్వాలి.
  5. భారత ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఉన్నట్లు అమెరికాలో కూడా ప్రతి పౌరునికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కల్పించాలి.
  6. మనదేశంలో పౌరుల శరీర రంగుకు ప్రాధాన్యత లేనట్లే అమెరికాలో కూడా నల్లవారిని రంగును బట్టి విచక్షణ చూపరాదు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 6.
ఒక ఉద్యమంలో భిన్న గొంతుకలు ఎందుకు వినపడుతుంటాయి ? వాటిల్లోని అభిప్రాయభేదాలను గుర్తించండి.
జవాబు:
అమెరికాలో పౌరహక్కుల చట్టం కోసం ఉద్యమం బలపడుతున్న సమయంలో భిన్నభిన్న అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో కొన్ని :

  1. చాలామంది శాంతియుత మార్గాల ద్వారా ప్రజలందరికి సమానత్వం సాధించటం వీలవుతుందని అన్నారు. అందుకు అవసరం అయిన చట్టాలు ప్రభుత్వం చేసేలా చెయ్యవచ్చని అనేకమంది మరియు డా|| కింగ్ కూడా అన్నారు.
  2. “మాల్కం ఎక్స్” వంటి వారు అనేకమంది నల్లవాళ్లు వేరేజాతి అని శ్వేత జాతీయుల పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడాలని భావించారు.
  3. అధికారాన్ని చేజిక్కించుకోటానికి సాయుధ ఘర్షణలతో సహా అన్ని మార్గాలను వినియోగించుకోవాలని ‘మాల్కం ఎక్స్’ వంటివారు భావించారు.
  4. ఈ ఉద్యమంలో పురుషుల ఆధిపత్యం ఉందని, తమని ఎవరూ పట్టించుకోవటం లేదని నల్లజాతి మహిళలు భావించసాగారు.
    ఈ విధంగా అభిప్రాయభేదాలు వెలువడ్డాయి.

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 7.
అమెరికా, యుఎస్ఎస్ఆర్‌లోని రాజకీయ వ్యవస్థలో పోలికలు, తేడాలు గుర్తించండి. ప్రజల హక్కులకు అవి ఎలా స్పందించాయి?
జవాబు:
అమెరికా, యుఎస్ఎస్ఆర్‌లోని రాజకీయ వ్యవస్థలోని పోలికలు, తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
తేడాలు :

అమెరికా రాజకీయ వ్యవస్థ యుఎస్ఎస్ఆర్ లోని రాజకీయ వ్యవస్థ
1) సెన్సారు లేని స్వేచ్ఛాపూరిత పత్రికలున్నాయి. 1) సెన్సారులేని స్వేచ్ఛాపూరిత పత్రికలు లేవు.
2) స్వేచ్ఛాపూరిత ప్రసార సాధనాలను అనుమతించారు. 2) స్వేచ్ఛాపూరిత ప్రసారసాధనాలను అనుమతించలేదు.
3) సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటనలను అనుమతించలేదు. 3) సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటనలను అనుమతించారు.
4) ప్రజల కదలికలు, చర్యల మీద పూర్తి స్వేచ్చ ఉంది. నియంత్రణ లేదు. 4) ప్రజల కదలికలు, చర్యల మీద స్వేచ్ఛ లేదు. నిరంతరం ప్రజల చర్యల మీద నియంత్రణ ఉంది.
5) ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది. 5) సోషలిస్ట్ ప్రభుత్వం ఉంది.
6) నల్లవారు, తెల్లవారనే విచక్షణ చాలాకాలం పాటించారు. 6) ఎటువంటి విచక్షణ లేదు. అందరూ సమానమే అనే భావన ఉంది.
7) పౌరహక్కుల చట్టంను అనుమతించారు. సక్రమంగా అమలుచేయుట జరుగుతుంది. 7) గోర్బచేవ్ ప్రజలకు స్వేచ్ఛను కల్పించటానికి “గ్లాస్ నోస్” అనే సంస్కరణలు చేశాడు.

పోలికలు :
ఈ రెండు దేశాలలో మానవ హక్కుల కోసం ఉద్యమాలు జరిగాయి.

10th Class Social Textbook Page No.301

ప్రశ్న 8.
వీళ్లు దేశభక్తి లేని వాళ్లని కొంతమంది భావించగా, అన్యాయమైన యుద్ధంలో పాల్గొనాలనుకోకపోవటం సమర్ధనీయమే అని మరికొంతమంది భావించారు. ఈ రెండు దృష్టి కోణాలను తరగతిలో చర్చించి మీ దృష్టికోణంతో పాటు రెండు వైపుల వాదనలను క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. అమెరికాలోని చట్టం ప్రకారం సైన్యంలో చేరే వయసున్న యువకులందరూ కొంతకాలం సైన్యంలో పనిచేయాలనేది చట్టం. చట్టంను అందరూ పాటించాలి. అయినప్పటికీ వారు, మేము సైన్యంలో చేరం, అని సైన్యంలో చేరడానికి నిరాకరించడమనేది చట్ట వ్యతిరేకం అవుతుంది.
  2. వియత్నాం ‘ యుద్ధంలో వియత్నాంకి చెందిన 8,00,000 సైనికులు, 30,00,000 పౌరులు కాకుండా అధిక సంఖ్యలో కంబోడియన్లు, లావోషియన్లు చనిపోయారు. అమెరికాకు ఎటువంటి పౌరనష్టం జరగలేదు.
  3. అమాయకులైన వియత్నాం ప్రజలపై బాంబులు వేసి, చంపడం అనేది అన్యాయం, అమానుషం. ఇటువంటి అన్యాయానికి పూనుకున్న అమెరికా సైన్యంలో చేరకపోవడం సమర్థనీయమే అని చాలామంది భావించారు.

అమాయకులైన వియత్నాం ప్రజల చావుకు కారణమవుతున్న అమెరికా సైన్యంలో యువకులు చేరకపోవడం సమర్థనీయమే అని నా అభిప్రాయం.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.303

ప్రశ్న 9.
ఆయుధీకరణకు వివిధ రకాల స్పందనలు ఏమిటి?
జవాబు:
అమెరికా, యుఎస్ఆర్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు ఇతర దేశాలు అణుబాంబులను ఉపయోగించకుండా నిరోధిస్తుందన్న నమ్మకంతో అణ్వాయుధాల నిల్వలను పెంచుకుంటూ పోయాయి. ఈ విధంగా పెంచుకోవడానికి ఆ – దేశాలు రకరకాల కారణాలు తెలియచేశాయి.

  1. అణ్వాయుధాల నిల్వలలో పోటీ తీవ్రరూపం దాల్చింది.
  2. ఆయుధాలను ఉత్పత్తిచేసే కంపెనీలు (వీటిని సైనిక పారిశ్రామిక కంపెనీలంటారు). ప్రభుత్వాలు సాధారణ ప్రజలలో యుద్ధ భయాన్ని కలిగించి, అణ్వాయుధాల మీద డబ్బును మరింతగా ఖర్చు పెట్టటానికి మద్దతు పొందేవి.
  3. ప్రజా నిరసనల మూలంగా అమెరికా 1975లో వియత్నాంతో యుద్ధాన్ని ఆపేసి, వియత్నాం నుంచి బయటకు వచ్చేసింది.
  4. యూరపులో అనేకమంది ప్రజలు యుద్ధం గురించి భయపడసాగారు.
  5. ఆయుధపోటీ వల్ల ప్రపంచమంతా ముప్పులో పడుతుందని, ప్రపంచమంతా నాశనమయ్యే యుద్ధం సంభవించవచ్చని గుర్తించసాగారు.
  6. పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు చోటుచేసుకున్నాయి.
  7. ఇతర దేశాల ప్రభుత్వాలతో అణ్వాయుధాల నిల్వలను తగ్గించుకోవటానికి, శాంతి దిశగా కృషి చెయ్యటానికి చర్చలు ప్రారంభించవలసిందిగా ప్రజలు ఒత్తిడి చెయ్యసాగారు.

10th Class Social Textbook Page No.303

ప్రశ్న 10.
పరస్పర విధానాలను ఆయా దేశాల ప్రభుత్వాలు నిర్ణయించటం మాత్రమే కాక వివిధ దేశాల ప్రజలు ఒకరినొకరు కలుస్తుంటే యుద్ధ అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో మీరు ఏకీభవిస్తారా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.
జవాబు:
దీంతో నేను ఏకీభవించను. కారణాలేమిటనగా …… .

  1. ప్రతి దేశానికి స్వంత ప్రభుత్వ విధానం ఉంటుంది.
  2. వివిధ దేశాల ప్రజలు ఒకరినొకరు కలుస్తుంటే సంస్కృతి వ్యాప్తి చెందుతుంది. అంతేకాని ప్రజలు యుద్ధాలు జరగకుండా ఆపలేరు.
  3. ప్రపంచంలోని చాలా దేశాలు ప్రజాస్వామ్య దేశాలు, కావున ప్రజాస్వామ్యబద్దంగా కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
  4. అణుశక్తిని ఉపయోగించటంలోని ప్రమాదాలు ప్రజలకు తెలిశాయి. ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశాలు నిరాయుధీకరణకు ముందుకు వచ్చి, యుద్ధ భయాన్ని తగ్గించాయి.

10th Class Social Textbook Page No.303

ప్రశ్న 11.
అణు కర్మాగారాలను, కాలుష్య పరిశ్రమలను ఎక్కడ పెట్టాలన్న నిర్ణయాలతో సంబంధం లేని దేశాల ప్రజలు కూడా పర్యావరణ కాలుష్య ప్రభావానికి ఎలా గురవుతారో వివరించండి. ఇటువంటి పరిస్థితులను ఎలా పరిష్కరించాలి?
జవాబు:
కాలుష్య ప్రభావం:

  1. కొన్ని సమయాలలో అణు కర్మాగారాలలో ప్రమాదాలు జరిగి కార్మికులు పెద్ద సంఖ్యలో చనిపోతారు.
    ఉదా : రష్యాలోని చెర్నోబిల్ అణుకర్మాగార ప్రమాదం.
  2. యూరప్లో అణు కర్మాగారాలు ఎక్కువవటం వలన యూరప్లో అధిక ప్రాంతం అణు కాలుష్యానికి కారణమయి, ప్రజలను కాలుష్యానికి గురిచేశాయి.
  3. కాలుష్య పరిశ్రమల స్థాపన మూలంగా అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
    ఉదా : భోపాల్ లో ఒకరాత్రి యూనియన్ కార్బైడ్ కంపెనీ నుండి విషవాయువు వెలువడింది. దీనివల్ల వేలాదిమంది చనిపోయారు. చాలా మంది ఇంకా బాధపడుతున్నారు.
  4. కాలుష్యం మూలంగా ఓజోను పొర దెబ్బతింటుంది.
  5. భూగోళం వేడెక్కుతుంది. తద్వారా ధృవాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్రాలలోని నీటిమట్టం పెరిగి తీరప్రాంతాలు ముంపుకు గురి అవుతాయి.

కాలుష్య పరిస్థితుల పరిష్కారానికి సూచనలు :

  1. అణు కర్మాగారాలను ప్రభుత్వాలు నిషేధించాలి. ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అణు కాలుష్యానికి గురైన ప్రజలకు ప్రభుత్వాలు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలి.
  2. పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వం మెలకువగా ఉండి, కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకూడదు.
  3. కాలుష్యానికి గురయ్యే ప్రజలకు ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించి, ఆయా పరిశ్రమల నుండి ప్రజలకు పరిహారాలు ఇప్పించాలి.
  4. ఆయా పరిశ్రమలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.307

ప్రశ్న 12.
రైతులను, గిరిజనులను నిర్వాసితులను చెయ్యకుండా కర్మాగారాలు కట్టడం, గనుల తవ్వకం, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను చేపట్టడం సాధ్యంకాదా? ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? ఈ అంశాలపై మీ ఇంటిలోనూ, తరగతిలోనూ చర్చించండి.
జవాబు:

  1. కర్మాగారాలు నిర్మించడానికి అనువైన పరిస్థితులు ఉన్నప్పుడు అనగా ముడిసరుకులు అందుబాటులో ఉన్న ప్రాంతాలలోనే కర్మాగారాలు నిర్మిస్తారు. ఈ పరిస్థితులలో ప్రజల గురించి ఆలోచించలేకపోతున్నారు.
  2. గనుల తవ్వకం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది మరియు గనులు ఉన్నచోటులో ఉన్న ప్రజలకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలి.
  3. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు కూడా ముడి సరుకులు (నీరు, బొగ్గు) లభించే ప్రాంతాలలోనే, నిర్మించవలసి వస్తుంది.
  4. అయితే ఆనకట్టల నిర్మాణంలో మాత్రం, ఆనకట్టల నిర్మాణం మూలంగా వచ్చే ఉపయోగం, నష్టాలను అంచనా వేసుకుని ఆనకట్టలను నిర్మించవచ్చు. లేదా ఆపివేయవచ్చు.
    ఉదా : కేరళలోని సైలెంట్ వ్యాలీలోని ఆనకట్ట (1973-83)

10th Class Social Textbook Page No.308

ప్రశ్న 13.
సామాజిక ఉద్యమాలు ఉపయోగించిన వివిధ’ వ్యూహాలను పేర్కొనండి.
జవాబు:

  1. అమెరికా పౌరహక్కుల ఉద్యమంలో నల్లజాతి ప్రజలు నిరసన తెలుపుతూ ఒక సంవత్సరం పాటు ‘బస్సులను’ బహిష్కరించారు.
  2. యుఎస్ఎస్ఆర్ లో గోర్బచేవ్, ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పించటానికి “గ్లాస్ నోస్తే” అన్న సంస్కరణల ప్రక్రియను ఆరంభించాడు.
  3. వియత్నాంతో యుద్ధం చేస్తున్న అమెరికా సైన్యంలోకి అమెరికా పౌరులు చాలామంది “మేము వెళ్లం” అని సైన్యంలో చేరడానికి నిరాకరించి, నిరసన తెలియచేశారు.
  4. అణ్వాయుధాల ఉత్పత్తిని తగ్గించుకొమ్మని, శాంతి దిశగా ప్రయాణం చేయమని అనేకమంది సైంటిస్టులు, ప్రజలు, అధికారులు చేసిన ఒత్తిడి కారణంగా అణ్వాయుధాలను తగ్గించుకోవడానికి స్ట్రాటెజిక్ ఆర్ట్స్ రిడక్షన్ ట్రీటి (START) మీద సంతకాలు చేశారు.
  5. గ్రీన్ పీస్ ఉద్యమం అనగా అలస్కా దగ్గర సముద్రంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా నిరసనకర్తలు ఒక చిన్న పడవలో ప్రయోగశాలకు బయలుదేరినారు. ఆ పడవ పేరు “గ్రీన్ పీస్”. ఆ పడవ పేరు మీదుగా ఆ ఉద్యమానికి గ్రీన్ పీస్ అని పేరు వచ్చింది.
  6. సమానత్వం కోసం అమెరికాలో మహిళలు ఉద్యమం చేశారు.
  7. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో నష్టపోయిన కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చెయ్యటానికి అంతర్జాతీయ చట్టాలను ఉపయోగించవలసి వచ్చింది.
  8. ‘నర్మదా బచావో’ ఆందోళనలో ఆనకట్టల నిర్మాణాన్నే వ్యతిరేకించారు.
  9. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణ సమయంలో చేసిన ఉద్యమంలో తీవ్ర నిరసనలు, ప్రజల సమీకరణ, ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, అంతర్జాతీయ ఉద్యమాలు చేయుట జరిగింది.
  10. “నర్మదా బచావో” ఉద్యమంలో – మూలవాసీ ప్రజల ఉద్యమం, సయా – ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం, పట్టణీకరణకు ఆనకట్టలు, పరిశ్రమలు, గనులు వంటి వాటికోసం భూములు లాక్కోబడుతున్న నేపధ్యంలో తమ భూములు కాపాడుకొనుటకు రైతులు చేస్తున్న ఉద్యమాలు మొదలైన వ్యూహాలు ఉపయోగించబడ్డాయి.

10th Class Social Textbook Page No.308

ప్రశ్న 14.
పునరావాసాన్ని కల్పిస్తామన్న వాగ్దానాలను ఉద్యమంలోని ప్రజలు ఎలా పరిగణిస్తున్నారు?
జవాబు:
పథకాల వల్ల నిర్వాసితులయ్యే ప్రజలు సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు. అయితే త్వరలోనే ప్రజలు కొన్ని విషయాలు గుర్తించారు. అవి :

  1. భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారంగా భూమిని ఇవ్వటానికి తగినంత భూమి లేదు.
  2. నిర్వాసితులైన ప్రజలందరికీ సరైన పునరావాసం కల్పించటం సాధ్యం కాదు అని తెలుసుకున్నారు.
  3. ఇది నష్టపరిహారం, పునరావాసానికి సంబంధించిన సమస్యకాక అభివృద్ధికి సంబంధించిన లోపభూయిష్ట దృక్పథమని ప్రజలు గుర్తించసాగారు.
  4. ఈ రకమైన అభివృద్ధి వ్యవసాయాన్ని, గిరిజన ప్రజలను పణంగా పెట్టి పరిశ్రమలు, వాణిజ్య వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయటం, సహజ వనరులను సుస్థిరంకాని పద్ధతులలో వినియోగించటం పైన ఆధారపడి ఉంది.
  5. ఇది పేద రైతులు, గిరిజనుల జీవన ప్రమాణాన్ని ఏ రకంగాను మెరుగుపరచకుండా వాళ్లని నైపుణ్యం లేని కూలీలుగా మారుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.310

ప్రశ్న 15.
ఇటీవల కాలంలో పశ్చిమబెంగాల్ (నందిగ్రాం), ఒడిశా (నియమగిరి), ఆంధ్రప్రదేశ్ (పోలవరం, సోంపేట, మొదలైనవి)లో జరిగిన ఇటువంటి పోరాటాల గురించి మరింత తెలుసుకోండి. ఈ పోరాటాల్లో ముఖ్యమైన అంశాలను వివరిస్తూ ఒక పోస్టరు తయారు చేయండి
జవాబు:
ఇటీవల కాలంలో కట్టబడిన ఆనకట్టల సందర్భాలలో ఎన్నో పోరాటాలు జరిగాయి. అటువంటి పోరాటాలలో కొన్ని నందిగ్రాం – పశ్చిమ బెంగాల్, నియమగిరి – ఒడిశా, పోలవరం, సోంపేట – ఆంధ్రప్రదేశ్,

1. నందిగ్రాం (పశ్చిమ బెంగాల్) :
ఎ) ఇది హాల్దియాలోది. కోల్ కతాకు దూరంగా ఉంటుంది.
బి) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2001 మార్చిలో ఈ స్థలాన్ని ప్రత్యేక ఆర్థిక స్థలంగా ప్రకటించింది.
సి) నందిగ్రాం ప్రజలకు కోపం వచ్చి ఊరేగింపులు నిర్వహించారు. పోరాటం చేశారు. ఈ పోరాటంలో 14 మంది చనిపోయారు.

2. నియమగిరి (ఒడిశా):
ఎ) ఒడిశాలో ఈ నియమగిరి కొండలు బాక్సైట్ నిల్వలకు ప్రఖ్యాతిగాంచాయి.
బి) బ్రిటిష్ మైనింగ్ కంపెనీకి, ఒడిశా ప్రభుత్వం బాక్సైట్ ను వెలికి తీయడానికి అనుమతినిచ్చింది.
సి) ప్రజలు ఆగ్రహించి ముఖ్యంగా గిరిజనులు అనేక ఊరేగింపులు నిర్వహించారు. కోర్టుకు కూడా ఫిర్యాదు చేసినారు. న్యాయస్థానం స్పందించి బ్రిటిష్ కంపెనీకి ఇచ్చిన అనుమతిని జనవరి, 2014లో రద్దు చేసింది.

3. సోంపేట (శ్రీకాకుళం – ఆంధ్రప్రదేశ్) : .
ఎ) సోంపేట అనేది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని మండలం.
బి) ఇక్కడ ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించుటకు ప్రభుత్వం “నాగార్జున కంపెనీ లిమిటెడ్”కు అనుమతినిచ్చింది.
సి) రాజకీయ పార్టీల అండతో ప్రజలు దీనిని వ్యతిరేకించి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

4. పోలవరం (ఆంధ్రప్రదేశ్) :
ఎ) పోలవరం ప్రాజెక్టు గోదావరి నదిమీద నిర్మించబడుతుంది.
బి) ఈ ప్రాజెక్టు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు ఖమ్మం జిల్లాలకు వ్యాపించి ఉంది.
సి) ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 2006లో అనుమతినిచ్చింది.
డి) దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఛత్తీస్ గఢ్, ఒడిశాలలోని ప్రాంతాలు కూడా ముంపుకు గురి అవుతాయి. అందువల్ల ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.310

ప్రశ్న 16.
మానవ హక్కులలోని కొన్ని అధికరణాలు కింద ఉన్నాయి. ఈ భాగాన్ని రెండుసార్లు చదవంది. మొదటిసారి అంతా చదివి మానవులందరికీ, ఉండాల్సిన మానవ హక్కులను గుర్తించండి. తరువాత కింద ఇచ్చిన మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఏ పేరా, ఏ వాక్యంలో ఉందో గుర్తించండి. (ప్రతిదానికి దొరకక పోవచ్చు, దానిని ఖాళీగా ఉంచెయ్యండి.)
అధికరణం 3 : ప్రతి ఒక్కరికీ జీవితం, స్వేచ్ఛ, వ్యక్తిగత భద్రతలకు హక్కు ఉంది. పేరా …………. వాక్యం ………….
అధికరణం 5 : ఎవరిని హింసకు లేదా క్రూర, అమానవీయ, అవమానకర వ్యవహారానికి లేదా శిక్షకు గురిచేయ్యకూడదు. పేరా ………….. వాక్యం ………….
అధికరణం 7 : చట్టం ముందు అందరూ సమానులే, ఎటువంటి వివక్షతకు లోనుకాకుండా అందరికి చట్టం ద్వారా సమాన రక్షణ లభించాలి. ఈ ప్రకటనకు భంగం కలిగిస్తూ వివక్షతకు గురికాకుండా అందరికీ సమాన రక్షణ లభించాలి, ఇటువంటి వివక్షతకు రెచ్చగొట్టబడటం నుంచి కూడా రక్షణ లభించాలి. పేరా ………. వాక్యం …………..
అధికరణం 9 : ఎవరినీ అకారణంగా అరెస్టు చెయ్యకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించగూడదు. పేరా ………….. వాక్యం ……………….
అధికరణం 10 : ఒక వ్యక్తిపై మోపబడిన నేరాలకు అతడు / ఆమె హక్కులు, బాధ్యతలు నిర్ణయించటానికి స్వతంత్ర, నిష్పక్షపాత ట్రిబ్యునల్ ద్వారా బహిరంగ విచారణకు పూర్తి సమానతతో కూడిన హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. పేరా – ………….. వాక్యం ………..
అధికరణం 12 : అకారణంగా ఎవరి ఏకాంతానికి, కుటుంబానికి, నివాసానికి లేదా ఉత్తర ప్రత్యుత్తరాలకు అడ్డుపడకూడదు, జోక్యం చేసుకోకూడదు, వ్యక్తి పరువు, మర్యాదలకు భంగం కలిగించకూడదు. ఈ విధమైన దాడుల, జోక్యం చేసుకోవడాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికీ చట్టం ద్వారా రక్షణ పొందే హక్కు ఉంటుంది. పేరా ……………. వాక్యం …………..
అధికరణం 13 : (1) దేశ సరిహద్దులకు లోబడి ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా సంచరించే హక్కు, నివాసం ఏర్పరుచుకునే హక్కు ఉంటాయి. పేరా …………… వాక్యం …………..
(2) ప్రతి ఒక్కరికీ సొంత దేశంతో సహా ఏ దేశాన్నైనా వీడే హక్కు తిరిగి సొంత దేశానికి చేరే హక్కు ఉంటాయి. పేరా ……….. వాక్యం ……………
జవాబు:
అధికరణం 3 : ప్రతి ఒక్కరికీ జీవితం, స్వేచ్ఛ, వ్యక్తిగత భద్రతలకు హక్కు ఉంది. పేరా 3 వాక్యం 13
అధికరణం 5 : ఎవరిని హింసకు లేదా క్రూర, అమానవీయ, అవమానకర వ్యవహారానికి లేదా శిక్షకు గురిచెయ్యకూడదు. పేరా 3 వాక్యం 6 మరియు 7.
అధికరణం 9 : ఎవరినీ అకారణంగా అరెస్టు చెయ్యకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించగూడదు. పేరా 3 వాక్యం 4.
అధికరణం 12 : అకారణంగా ఎవరి ఏకాంతానికీ, కుటుంబానికి, నివాసానికి లేదా ఉత్తర ప్రత్యుత్తరాలకు అడ్డుపడకూడదు, జోక్యం చేసుకోకూడదు, వ్యక్తి పరువు, మర్యాదలకు భంగం కలిగించకూడదు. ఈ విధమైన దాడుల, జోక్యం చేసుకోవడాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికీ చట్టం ద్వారా రక్షణ పొందే హక్కు ఉంటుంది. పేరా 3 వాక్యం 10.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

SCERT AP 10th Class Social Study Material Pdf 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Studies 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రచ్ఛన్న యుద్ధం గురించి కింద ఉన్న వ్యాఖ్యావాలలో ఏది సరైనది కాదు?
అ) అమెరికా, యుఎస్ఎస్ఆర్ మధ్య విరోధం.
ఆ) అమెరికా, యుఎస్ఎస్ఆర్లు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనటం
ఇ) ఆయుధ పోటీకి కారణం అవ్వటం
ఈ) రెండు అగ్రరాజ్యాల మధ్య సైద్ధాంతిక పోరు (AS1)
జవాబు:
ఆ) అమెరికా, యుఎస్ఎస్ఆర్లు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనటం

ప్రశ్న 2.
కింద పేర్కొన్న వాటిల్లో ఏది పశ్చిమ ఆసియా సంక్షోభంలో లేదు? అ) ఈజిప్టు ఆ) ఇండోనేషియా ఇ) బ్రిటన్ ఈ) ఇజ్రాయెల్ (AS1)
జవాబు:
ఆ) ఇండోనేషియా

ప్రశ్న 3.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికారంలో ఎటువంటి మార్పులు వచ్చాయి? (AS1)
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికారంలో చాలా మార్పులు వచ్చాయి.

  1. యుద్ధరంగాలకు దూరంగా ఉన్నందున అమెరికా శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించింది.
  2. అన్ని దేశాలలో శాంతి, అభివృద్ధి వెల్లివిరిసేలా ఒక ప్రపంచసంస్థ అనగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు.
  3. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ వలస పాలనలను వదులుకోవలసి వచ్చింది. ఇవి రాజకీయంగా ఆర్థికంగా బలహీనమయ్యాయి.
  4. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో రెండు ప్రధాన సైద్ధాంతిక, రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. అవి యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం; అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక – పెట్టుబడిదారీ శిబిరం. ప్రపంచం మొత్తం ఈ రెండు కూటాలుగా విడిపోయింది. ఈ రెండు కూటాల మధ్య చాలాకాలం ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 4.
ప్రపంచంలో శాంతి నెలకొల్పటానికి ఐక్యరాజ్య సమితి నిర్వహించే వివిధ పాత్రలు ఏమిటి? (AS1)
జవాబు:
ఐక్యరాజ్య సమితి 1945, అక్టోబరు 24న ఏర్పడింది. ఇది ఆరు వేరు వేరు సంస్థల ద్వారా పనిచేస్తుంది.

ఐక్యరాజ్యసమితి నిర్వహించే విధులు:

1) శాంతి భద్రతలను కాపాడటం :
అంతర్జాతీయ శాంతిని, ప్రాదేశిక సమగ్రతలను పరిరక్షిస్తుంది. దీని కొరకు “భద్రతా మండలి” అనే సంస్థను ఏర్పాటు చేసింది.

2) విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచటం :
ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక సమస్యలను చర్చిస్తుంది. ఈ అంశాలపై పరిశోధనలు చేసి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఆరోగ్య సంబంధమైన విధానాలను సిఫారసు చేస్తుంది. ఈ విధుల నిర్వహణ కోసం ఐక్యరాజ్య సమితి, ఆర్థిక, సామాజిక మండలిని ఏర్పాటు చేసింది. ఆర్థిక సంఘం జెనీవాలో ఉంది.

3) పేదరికాన్ని నిర్మూలించటం :
ప్రపంచ దేశాలలోని పేదరికాన్ని నిర్మూలించాలని సంకల్పించి, దీని కొరకు ఆర్థిక, సామాజిక మండలిని స్థాపించింది.

4) అంతర్జాతీయ నేరాల నేపథ్యంలో న్యాయాన్ని అందించటం వంటి విధులను ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. దీని కొరకు అంతర్జాతీయ న్యాయస్థానం “హేగ్”లో ఉంది.

5) ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞానశాస్త్ర, సాంస్కృతిక సంస్థ పారిలో ఉంది.

6) బాలల కొరకు ఒక అత్యవసర నిధి సంస్థను న్యూయార్క్ లో స్థాపించింది.

ప్రశ్న 5.
ప్రజాస్వామ్య భావన నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవటంలో కొన్ని దేశాలకు ప్రత్యేక అధికారాలు ఉండటం సరైనదేనా? (AS2)
జవాబు:
ప్రపంచమంతా ప్రజాస్వామ్య భావనలోకి వెళుతున్న నేపథ్యంలో ప్రపంచసంస్థ అయిన ఐక్యరాజ్య సమితిలో కొన్ని దేశాలకు మాత్రమే ప్రత్యేక అధికారాలు ఉండటం సరైనది కాదని చెప్పవచ్చు. ఇది ప్రజాస్వామ్య భావనకు వ్యతిరేకం.

ప్రశ్న 6.
సైనిక ఒప్పందాలతో అగ్రరాజ్యాలు ఎలా లాభపడ్డాయి? (AS1)
జవాబు:
సైనిక ఒప్పందాల ద్వారా అగ్రరాజ్యాల పరిధి పెరిగి వాటికి కింద పేర్కొన్నవి అందుబాటులోకి వచ్చి లాభపడ్డాయి.

  1. చమురు, ఖనిజాలు వంటి కీలక వనరులు
  2. తమ ఉత్పత్తులకు మార్కెటు, తమ పెట్టుబడులు పెట్టటానికి ప్రమాదంలేని ప్రదేశాలు
  3. తమ సైనికులను, ఆయుధాలను ఉపయోగించటానికి సైనిక స్థావరాలు
  4. తమ భావజాల వ్యాప్తి
  5. పెద్ద మొత్తంలో సైనిక ఖర్చుకి ఆర్ధిక మద్దతు.

ప్రశ్న 7.
ప్రచ్ఛన్న యుద్ధం వల్ల ఆయుధ పోటీ, ఆయుధ నియంత్రణ రెండూ ఎలా జరిగాయి? (AS1)
జవాబు:
1) ఆయుధ పోటీ :
ఆయుధ పరిశోధనల పైనా, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వలపైనా అమెరికా, రష్యాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. ఈ రెండు దేశాలలో ఒక్కొక్క దాని దగ్గర ప్రపంచాన్ని పలుమార్లు మట్టుపెట్టగల అణ్వాయుధాలు ఉన్నాయి. కాలక్రమంలో వాటి మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు కూడా అణ్వాయుధాలను సమకూర్చుకున్నాయి. గూఢచర్యంలోనూ, క్షిపణులను నిర్దేశించటంలోనూ ఉపగ్రహాలు . దోహదం చేయటంతో ఇప్పుడు పోటీ అంతరిక్షంలోకి కూడా విస్తరించింది.

2) ఆయుధ నియంత్రణ :
కాలం గడుస్తున్న కొద్దీ ఆయుధ పోటీని తగ్గించి, అణ్వాయుధాలను నాశనం చేయవలసిందిగా యుఎస్ఎస్ఆర్, అమెరికాలపై ప్రజలు తీవ్ర ఒత్తిడి చేయసాగారు. దీని ఫలితంగా ఈ రెండు దేశాలు సంప్రదింపులు జరిపి ఆయుధ పోటీని, నిల్వలను తగ్గించుకోవలసి వచ్చింది. చివరికి 1985-1991 మధ్య అణు పరీక్షలపై నిషేధం విధించారు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 8.
ప్రపంచంలో ఘర్షణలకు కేంద్రంగా పశ్చిమ ఆసియా ఎందుకు మారింది? (AS1)
జవాబు:
పశ్చిమ ఆసియా ఘర్షణలకు ముఖ్య కారణాలు :
1) యూరపు, ఆసియా మధ్య ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అంటారు. ఇదే ప్రాంతాన్ని మధ్యప్రాచ్యం అని కూడా అంటారు. అరబ్బులు, యూదుల మధ్య ఏర్పడిన ఘర్షణలను పశ్చిమ ఆసియా సంక్షోభమని అంటారు. ఇది ప్రధానంగా పాలస్తీనా ఆక్రమణకు సంబంధించినది. అరబ్బులు నివాసముంటున్న పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది. అక్కడ ఉన్న జెరూసలెం యూదులు, క్రైస్తవులు, ముస్లిములందరికీ పవిత్రస్థలం.

2) యూదులు పాలస్తీనాని తమ ‘వాగ్రత్త భూమి’గా పరిగణిస్తారు. ప్రాచీన కాలంలో అక్కడి నుంచి వాళ్లను నిర్వాసితులను చేయడంతో వారు యూరపు, ఆసియా అంతటా వలసలు పోయారు.

3) ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి, తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది, యూడులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికి యూదులలో ‘జియానిస్ట్ ఉద్యమం’ మొదలయ్యింది. 1945లో దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది. అయితే అప్పటికే పాలస్తీనియన్లు (వీళ్లల్లో ఎక్కువమంది అరబ్బు ముస్లిములు) అక్కడ నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం ఇరు ప్రజల మధ్య ఘర్షణ మొదలయ్యింది.

4) మధ్య ప్రాచ్యంలో, ప్రత్యేకించి అరబ్బు ద్వీపఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొనటంతో సమస్య మరింత సంక్లిష్ట రూపం దాల్చింది. అమెరికా, రష్యాలు ఈ ప్రాంతాన్ని తమ ప్రాభవంలోకి తీసుకోవాలని ప్రయత్నించాయి. ఇతర దేశాలు దానిపై నియంత్రణ సాధించకుండా అడ్డుకున్నాయి.

ప్రశ్న 9.
20వ శతాబ్దం చివరి నాటికి ఒక్క దేశమే ప్రపంచం మీద పెత్తనం వహిస్తోంది. ఈ నేపథ్యంలో అలీనోద్యమం పాత్ర ఏమై ఉంటుంది? (AS1)
జవాబు:
ప్రస్తుత కాలంలో అలీనోద్యమం నిర్వహిస్తున్న పాత్ర :

  1. ప్రపంచం ఏకధృవంగా ఉన్న నేపథ్యంలో చైనా కూడా మరో ధృవంగా ఎదుగుతోంది. రష్యా తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండు దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితిలో తమ వీటో అధికారం ద్వారా అమెరికాను నియంత్రిస్తున్నాయి.
  2. ఇటీవలి సంవత్సరాలలో పోర్టారికో మరియు పశ్చిమ సహారా ప్రాంతాల గురించి అమెరికా వైఖరిని తప్పుబట్టాయి. ఈ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి అలీనోద్యమం కృషి చేస్తుంది.
  3. మానవ హక్కుల పరంగా బాగా వెనుకబడిన తమ సభ్య దేశాలలో మానవ హక్కుల ఉద్దరణకు అలీనోద్యమం కృషి చేయవలసిన అవసరం ఉంది.
  4. అగ్ర దేశాలు కలుగచేసుకోలేని కొన్ని సమస్యలున్న దేశాల సమస్యలను అలీనోద్యమం పరిష్కరించవచ్చు.
    ఉదా : పాలస్తీనా, సోమాలియా, సూడాన్.
    ఈ విధంగా అలీనోద్యమం తన పాత్రను నిర్వహించవచ్చు.

ప్రశ్న 10.
“కేవలం సైనిక ఒప్పందాల నేపథ్యంలోనే కాకుండా ఆర్థిక విధానాల నేపథ్యంలో కూడా అలీనోద్యమం ఏర్పడింది”. దీనిని సమర్ధించండి. (AS1)
జవాబు:
ఆసియా, ఆఫ్రికా, ఆ తరువాత లాటిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించటానికి అంతర్జాతీయ సంస్థగా అలీనోద్యమం రూపొందింది. అలీన రాజ్యాల శిఖరాగ్ర సమావేశాలలో ఆర్థిక సమస్యల గురించి చర్చించడం జరిగింది.

  1. 1961 బెల్ గ్రేడ్ సమావేశంలో ప్రతి దేశానికి ఆర్థిక సమానత్వం ఉండాలని సూచించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం కోసం ఐక్యరాజ్య సమితి ఒక ప్రత్యేక ద్రవ్యనిధిని ఏర్పాటుచేయాలని సూచించింది.
  2. 1970 లుసాకా సమావేశంలో రాజకీయ విషయాలతో బాటు ఆర్థిక విషయాలకు కూడా ప్రాముఖ్యం ఇవ్వాలని, త్వరితగతిని ఆర్థికాభివృద్ధికి సహకరించే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పాలని, ఆర్థికాభివృద్ధిని అంతర్జాతీయ సమతాదృక్పథంతో పరిశీలించాలని ఐక్యరాజ్య సమితి కోరింది.
  3. 1973 అల్జీర్స్ సమావేశంలో అలీన దేశాల ఆర్థికాభివృద్ధికి, పునర్నిర్మాణానికి, ఐదు రకాల విధులు ఏర్పాటు చేయడానికి తీర్మానం జరిగింది.
  4. 1979 హవానా సమావేశంలో ధనిక, పేద దేశాల మధ్య అంతరాలను తగ్గించాలని సూచించింది.
  5. 1992 జకార్తా సమావేశం అలీనోద్యమం తన దృష్టిని G7 మరియు యూరోపియను యూనియన్ల వైపు దృష్టి సారించాయి.

ఈ విధంగా అనేక అలీనరాజ్యా ల శిఖరాగ్ర సమావేశాలలో ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు వివిధ సూచనలను చేసింది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 11.
భారతదేశానికి పొరుగుదేశాలతో ఈ దిగువ అంశాలతో సంబంధాన్ని చూపటానికి ఒక పట్టిక తయారుచెయ్యండి. ఘర్షణకు కారణమైన అంశాలు; యుద్ధ సంఘటనలు; సహాయ, సహకార ఘటనలు. (AS3)
జవాబు:
భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలతో ఘర్షణలు, యుద్ధ సంఘటనలు, సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ క్రింది పట్టికలో చూపబడినాయి.

మన పొరుగు దేశాలతో ఘర్షణకు కారణమైన అంశాలు యుద్ధ సంఘటనలు సహాయ, సహకార ఘటనలు
1) టిబెట్లో జరిగిన తిరుగుబాటును చైనా అణిచివేసింది. ఆ సమయంలో దలైలామాతో సహా వేలాది టిబెటన్లు భారతదేశంలో ఆశ్రయం తీసుకున్నారు. దీంతో భారత్-చైనాల మధ్య వైరుధ్యం మొదలైంది. లడక్ ప్రాంతంలోని ఆక్సాయ్-చిన్ సరిహద్దు వివాదం, అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతం తమదని చైనా పేర్కొంది. 1) 1962 అక్టోబరులో భారతదేశంపై చైనా దండెత్తింది. భారతదేశం తీవ్ర నష్టాలు ఎదుర్కొవలసి వచ్చింది. 1) శాంతిపట్ల తన నిబద్ధతను చాటటానికి జవహర్‌లాల్ నెహ్రూ తన పంచశీల సూత్రాలను ప్రతిపాదించాడు. ఈ పంచశీల ఒప్పందంపై చైనా-భారత్లు 1954 ఏప్రిల్ 29న సంతకాలు చేశాయి.
2) పాకిస్తాన్-భారతదేశం మత ప్రాతిపదికన విడిపోయాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య కాశ్మీర్‌కు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. సరిహద్దు రాష్ట్రాలలో వేర్పాటు ఉద్యమాలకు పాకిస్తాన్ సహకరిస్తుందనే ఆరోపణలున్నాయి. 2) కాశ్మీర్ కోసం, పాక్-భారత్ ల మధ్య మొదటిసారి 1947-48 మధ్య జరిగింది. రెండోసారి 1965లో పాక్-భారత్ ల మధ్య యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ కు సహకారంగా 1971లో భారతదేశం పాకిస్తాన్ తో యుద్ధం చేసింది. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం అయింది. కార్గిల్ యుద్ధం ఇరుదేశాల మధ్య జరిగింది 2) 1966లో తాష్మెంట్ లో భారత్-పాకు ఒక ఒప్పందం చేసుకున్నాయి. 1971లో కూడా సిమ్లా ఒప్పందం చేసుకున్నాయి. ప్రస్తుతం వాణిజ్యం, క్రీడలు, సినిమాలు, పర్యటన, సాంస్కృతిక అనుసంధానాల ద్వారా స్నేహ సంబంధాలు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు.
3) బ్రహ్మపుత్ర, గంగానదీ జలాల పంపకం వంటి అంశాలపై బంగ్లాదేశ్ భారత మధ్య విభేదాలున్నాయి. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చట్ట విరుద్దంగా భారతదేశంలోకి రాకుండా తీసుకున్న భారతదేశ చర్యలు బంగ్లాదేశ్ అభ్యంతర పెట్టింది. 3) 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో యుద్ధానికి దిగినపుడు భారతదేశం సహాయపడుతూ, పాకిస్తాన్ తో యుద్ధం చేయవలసి వచ్చింది. 3) 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం కావటానికి – భారత్ సహకరించింది. 25 సంవత్సరాల శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఆర్థిక రంగంలో ఈ రెండు దేశాలు సహకరించు కుంటున్నాయి.
4) శ్రీలంకలో తమిళం మాట్లాడే అల్ప సంఖ్యాక ప్రజల పట్ల శ్రీలంక ప్రభుత్వం వ్యవహరించిన తీరు భారత్-శ్రీలంకల మధ్య ముల్లు మాదిరి తయారయ్యింది. శ్రీలంక తమిళ కాందిశీకులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి రావటం ప్రత్యేక సమస్యగా మారింది. 4) శ్రీలంకలో శాంతి నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపింది. దీనికి ప్రతీకారంలో తమిళ తీవ్రవాదులు మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని చంపినారు. 4) క్రీడలు, పర్యాటక రంగం వాణిజ్యం ద్వారా భారత్, శ్రీలంకల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి.

ప్రశ్న 12.
“శ్రీలంకలో జాతి వైరుధ్యాలు భారతదేశంతో దాని సంబంధాలను ప్రభావితం చేశాయి.” వివరించండి. (AS1)
జవాబు:

  1. పురాణ కాలం నుండి భారతదేశానికి, శ్రీలంకకు మధ్య ఆర్థిక, సాంస్కృతిక, జాతిపరమైన సంబంధాలున్నాయి.
  2. శ్రీలంకలో అల్పసంఖ్యాకులైన తమిళం మాట్లాడే ప్రజలపట్ల ప్రభుత్వం అవలంబించిన వైఖరియే ఈ రెండు జాతుల మధ్య వైరుధ్యానికి కారణం.
  3. వీరిలో చాలామంది భారతదేశానికి శరణార్థులుగా రావడంతో భారతదేశానికి అది సమస్యగా పరిణమించింది.
  4. ఈ సమస్య పరిష్కారం కోసం భారతదేశం ఒక అడుగు ముందుకు వేసి శ్రీలంకతో ఒక ఒప్పందం చేసుకొన్నది. దాని ప్రకారం ఈ సమస్య పరిష్కారం కోసం “భారత శాంతి సేన” ను శ్రీలంకకు పంపింది.
  5. ఈ చర్యకు ప్రతిగా తమిళ తీవ్రవాదులు ఎట్టిఇ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హతమార్చారు.

ఈ కారణంగా సింహళీయులు, తమిళుల మధ్య ప్రారంభమైన పౌర సంఘర్షణలు ఒక వైపు రక్తపాతానికి దారితీయగా మరోవైపు శ్రీలంక భారత సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

10th Class Social Studies 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం InText Questions and Answers

10th Class Social Textbook Page No.294

ప్రశ్న 1.
దలైలామాకి, అతని టిబెట్ అనుచరులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వటం సరైనదేనా?
జవాబు:
దలైలామాకి, అతని టిబెట్ అనుచరులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వటం సరైనదే.

10th Class Social Textbook Page No.294

ప్రశ్న 2.
టిబెట్ ని నియంత్రించాలని చైనా అనుకోవటం సరైనదేనా?
జవాబు:
టిబెట్ ని నియంత్రించాలని చైనా అనుకోవటం సరైనది కాదు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.283

ప్రశ్న 3.
వలసపాలన నుంచి విముక్తి అంటే ఏమిటి?
జవాబు:
సామ్రాజ్యకాంక్ష కలిగిన బలవంతమైన దేశాలు వెనుకబడిన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను ఆక్రమించి వారి ఆధిపత్యంలో ఉంచుకున్నారు. ఈ దేశాలలోని ప్రజలు జాతీయోద్యమాలు చేసి వారి పాలిత దేశాల నుండి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొనుటనే వలసపాలన నుంచి విముక్తి అంటారు.

10th Class Social Textbook Page No.283

ప్రశ్న 4.
రెండు అగ్రరాజ్యాల మధ్య పోటీతో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు ఏ విధంగా ప్రభావితం అయ్యాయి?
జవాబు:

  1. కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు పెట్టుబడిదారీ విధానం – కమ్యూనిజం మధ్య (అమెరికా – రష్యాల మధ్య) విభజింపబడిన ప్రపంచాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది.
  2. ఈ దేశాలు తమ అభివృద్ధికి సొంతమార్గం అనుసరించనివ్వకుండా ఏదో ఒక శిబిరాన్ని ఎంచుకోమని ఒత్తిడి చేయసాగాయి.
  3. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య విభేదాలను కొన్ని దేశాలు తమకు సానుకూలంగా వాడుకున్నాయి.

10th Class Social Textbook Page No.284

ప్రశ్న 5.
యుద్ధాలకూ, పేదరికం, సమాన అభివృద్ధి లేకపోవటం, దేశాల మధ్య సాంస్కృతిక అనుసంధానానికీ మధ్య సంబంధం. ఏమైనా ఉందా?
జవాబు:
బలవంతమైన దేశాలు సామ్రాజ్య కాంక్షతో అనేక చిన్న దేశాలపై దాడులు చేశాయి. అధికార కాంక్షతో కూడా దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. అనేక దేశాలలో పేదరికం మరియు దేశాలన్నీ సమాన అభివృద్ధి సాధించకుండా కొన్ని దేశాలు ఆర్థికంగా, సాంస్కృతికంగా వెనకబడి ఉండడం వంటి కారణాలతో అభివృద్ధిని సాధించిన దేశాలు, అభివృద్ధి చెందని దేశాలపై దాడిచేసి, యుద్ధాలు చేసి ఆ దేశాలను వలసలుగా ఏర్పరచుకున్నాయి.

10th Class Social Textbook Page No.284

ప్రశ్న 4.
అయిదు దేశాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలు అప్రజాస్వామికం కాబట్టి వాటిని రద్దు చేయాలని కొంతమంది వాదిస్తుంటారు. అయితే ఈ దేశాలకు ప్రత్యేక అధికారాలు లేకపోతే ఐక్యరాజ్య సమితి సాఫీగా పనిచేయలేదని కొంతమంది అంటారు. చర్చించండి.
జవాబు:
ప్రపంచంలో చాలా దేశాలు ప్రజాస్వామిక దేశాలు, ఇటువంటి నేపథ్యంలో కొన్ని దేశాలకు ప్రత్యేక అధికారాలు ఉండడం సరైనది కాదు. మరియు ఈ ప్రత్యేక వీటో అధికారంతో ఆ దేశాలు ఐక్యరాజ్య సమితి విధులకు అడ్డు పడుతున్నాయి.. ఐక్యరాజ్య సమితి నిష్పక్షపాతంగా పనిచేయకుండా ఈ వీటో అధికారం ఉన్న దేశాలు అంతరాయం కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.289

ప్రశ్న 5.
1955 బాండుంగ్ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమిటి?
జవాబు:
అగ్రరాజ్యాల మధ్య పోటీ వల్ల ఇటీవల వలసపాలన నుంచి విముక్తి పొందిన దేశాల సమస్యలేవీ పరిష్కారం కాలేదు. మరియు కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల అభద్రతాభావంతో కూడిన పరిస్థితుల నుంచి మార్పు కావాలని కోరుకున్నాయి. ఇదే 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్ సమావేశ ముఖ్య ఉద్దేశం.

10th Class Social Textbook Page No.289

ప్రశ్న 6.
అలీనోద్యమ సూత్రాలకు అగ్రరాజ్యాలు ఎలా స్పందించాయి?
జవాబు:

  1. రెండు అగ్రరాజ్యాలు అలీనోద్యమాన్ని అనుమానపు దృష్టితో చూశాయి.
  2. అంతర్జాతీయ అంశాలపై అలీనోద్యమం రష్యాకి దగ్గరగా ఉందని అమెరికా భావించేది.
    ఉదా : ఆఫ్ఘనిస్థాన్ పై నిష్పక్ష సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని అమెరికా విమర్శించింది.

10th Class Social Textbook Page No.289

ప్రశ్న 7.
అలీనోద్యమ దేశాలను మూడవ ప్రపంచ దేశాలని ఎందుకంటారు?
జవాబు:

  1. రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచం రెండు అధికార కూటములుగా విడిపోయింది. అవే రష్యా, అమెరికాలు. ఆ దేశాలు ప్రపంచంలో అగ్రశ్రేణి శక్తులుగా అవతరించాయి.
  2. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చాలా ఆసియా, ఆఫ్రికా దేశాలు స్వాతంత్ర్యం సంపాదించుకొని, ఈ రెండు అగ్రరాజ్యాల శక్తి కూటములలో చేరలేదు. ఈ దేశాలు చాలావరకు అలీనోద్యమ విధానాన్ని స్వీకరించాయి.
  3. ఈ దేశాలు పెద్ద రాజ్యాల విధానాల మీద తమదైన రీతిలో ప్రభావం చూపాయి. వీటి విస్తీర్ణం, జనాభా వ్యూహాత్మకమైన, కీలకమైన స్థానాల కారణంగా ఇవి మూడవ ప్రపంచదేశాలని పేరు తెచ్చుకున్నాయి.

10th Class Social Textbook Page No.291

ప్రశ్న 8.
ఘర్షణలలో పాలస్తీనియన్లకు ఈజిప్టు ఎందుకు మద్దతు నిచ్చింది?
జవాబు:

  1. పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్ దేశం అవలంబించిన విధానాలు విద్వేషాలను మరింత రెచ్చగొట్టాయి. అరబ్బులు తమ ఆస్తులు, ఇళ్లు వదిలి వెళ్లి ఇతర అరబ్బు దేశాలలో కాందిశీకులుగా ఆశ్రయం పొందారు. ఈ అరబ్బులందరినీ ఏకం చేయాలని ఈజిప్టు అధ్యక్షుడు గమల్ అబ్జెల్ నాసర్ ప్రయత్నించి పాలస్తీనియన్లకు మద్దతు ఇచ్చాడు.
  2. ఈజిప్టుకు ఇజ్రాయెల్ కు మధ్యన ఉన్న వైరం మూలంగా ఇజ్రాయెల్ శత్రుదేశమైన ‘పాలస్తీనాకు ఈజిప్టు మద్దతు ఇచ్చిందని అనుకోవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.290

ప్రశ్న 9.
శరణార్థుల శిబిరాలలో ఉంటూ నిరంతరం యుద్ధభయమూ, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాలస్తీనియన్ల జీవన పరిస్థితుల గురించి తెలుసుకోండి.
జవాబు:

  1. ప్రజలందరూ పేదవారు. నిరక్షరాస్యులు ఎక్కువ.
  2. నిరంతర యుద్ధాల వల్ల ప్రజలు శరణార్థుల శిబిరాలలో నివసించవలసి వచ్చింది.
  3. నిరంతరం యుద్ధభయం కారణంగా ప్రజలు ప్రశాంత జీవితాన్ని కోల్పోయారు.
  4. ఇతర జీవనాధారాలు లేక ప్రజలు పేదరికంలో మగ్గిపోసాగారు.

ఈ విధంగా ఆనాడు పాలస్తీనియన్లు దుర్భర జీవితాన్ని గడపవలసి వచ్చింది.

10th Class Social Textbook Page No.294

ప్రశ్న 10.
సరిహద్దులకు సంబంధించి గత వైరుధ్యాలను మరచి రెండు దేశాలు ఎంత వరకు అర్థవంత సహకారాన్ని, మిత్రత్వాన్ని సాధించగలవని అనుకుంటున్నారు?
జవాబు:
ప్రస్తుతం రెండు దేశాలు ఆసియాలో బలపడుతున్న శక్తులుగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవిగా గుర్తింపబడుతున్నాయి. ఈ ప్రపంచంలోనే ముఖ్య ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదగాలన్న కోరిక ప్రస్తుతం రెండు దేశాలకూ ఉంది. దాంతో ఇవి ఒకదానిని ఒకటి రాజకీయ, ఆర్థిక పోటీదారుగా కూడా పరిగణిస్తున్నాయి. సరిహద్దుల వద్ద చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ శాంతి, సామరస్యాలు నెలకొనేలా ఇరు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

10th Class Social Textbook Page No.291

ప్రశ్న 11.
అరబ్బులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణలకు కారణాలు ఏమిటి?
జవాబు:
అరబ్బులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణలకు ఇవి కారణాలు :

  1. పాలస్తీనా యూదులు, క్రైస్తవులు, ముస్లిములందరికీ పవిత్ర స్థలం, అరబ్బులు, ఇజ్రాయెల్ ని చట్టబద్ద దేశంగా గుర్తించటానికి తిరస్కరించారు.
  2. యూదులు పాలస్తీనాని తమ వాగత భూమిగా పరిగణిస్తారు.
  3. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి, తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది, యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికి యూదులలో ‘జిమానిస్ట్ ఉద్యమం’ మొదలయ్యింది. దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది.
  4. అయితే అప్పటికే పాలస్తీనియన్లు (ఎక్కువమంది అరబ్బు, ముస్లిములు) అక్కడ నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం అరబ్బులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణ మొదలయ్యింది.
  5. అరబ్బు ద్వీపఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలు కనుగొనటంతో ఇరువర్గాల మధ్యే కాకుండా అమెరికా, రష్యాలు కూడా ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించడం ఘర్షణలకు కారణాలయ్యాయి.

10th Class Social Textbook Page No.291

ప్రశ్న 12.
కొంతమంది పాలస్తీనియన్లు ఉగ్రవాద పంథాని ఎందుకు ఎంచుకున్నారు? దాని ఫలితాలు ఏమిటి?
జవాబు:
1964లో జోర్డాన్లో “పాలస్తీనా విముక్తి సంఘం” (పిఎల్‌ఓ) ఆవిర్భవించింది. దీని ముఖ్య ఉద్దేశం అరబ్బు బృందాలన్నింటిని ఏకం చేయడం, కోల్పోయిన భూమిని శాంతియుతంగా తిరిగిపొందటం. దీని నాయకుడు “యాసర్ అరాఫత్”.

ఇది ఉగ్రవాద పంథాని ఎంచుకోవడానికి కారణం :

  1. 1967లో పాలస్తీనా విముక్తి సంఘం (పిఎల్ఓ)- ఇజ్రాయెల్ పై దాడి చెయ్యాల్సిందిగా అరబ్బు దేశాలపై ఒత్తిడి పెట్టసాగింది. దీనికి అయితే అరబ్బు దేశాలు అంత ఉత్సాహం చూపలేదు.
  2. అరబ్బు దేశాల సహకారం లేకపోవడంతో పాలస్తీనా విముక్తి సంఘంలో నుంచి ఒక వర్గం అరాఫత్ నేతృత్వంలో చీలి ఉగ్రవాద పంథాని ఎంచుకున్నది.

దీని వల్ల ఫలితాలు :

  1. దాడులు, ప్రతిదాడులతో నిత్యం యుద్ధ వాతావరణంతోటి, ఉగ్రవాదుల దాడులతోటి ఉండేది.
  2. పిఎల్‌ఓ పరస్పరం ఘర్షణకు పాల్పడే అనేక చిన్న వర్గాలుగా చీలిపోయింది.
  3. చివరకు అరాఫత్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి ఇజ్రాయెల్‌ను గుర్తించటం ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనటానికి అంగీకరించాడు.
  4. దీర్ఘకాల యుద్ధాన్ని ముగించటానికి అతడు ఇజ్రాయెల్ తో సంప్రదింపులు జరిపి పాలస్తీనియన్ల స్వయం పాలనకు సంబంధించి అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.292

ప్రశ్న 13.
అరబ్బు సోషలిస్టు జాతీయతావాదానికీ, మతపర జాతీయతావాదానికీ మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:
అరబ్బు సోషలిస్టు జాతీయవాదానికీ, మతపర జాతీయవాదానికీ మధ్య తేడాలు.

సోషలిస్టు జాతీయవాదం మతపర జాతీయవాదం
1) సోషలిజం అంటే అరబ్బుల ఉద్దేశంలో చమురు వనరుల జాతీయకరణ చేయడం. 1) అనేక ప్రాంతాలలో అమెరికాకు, అమెరికా మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలకు వ్యతిరేకత, మతపరమైన రంగు సంతరించుకుంది.
2) చమురు నుంచి వచ్చే ఆదాయాన్ని పౌరుల సంక్షేమ చర్యల కోసం ప్రభుత్వం ఖర్చుచేయటం. 2) సంపదను, అవకాశాలను అందరికీ సమంగా పంచాలన్న భావనకు జాతీయవాద శక్తులు రాకుండా ఆయా దేశాలలో మత ఛాందసవాదులు అధికారంలోకి రావడానికి మద్దతునిచ్చాయి.
ఉదా : ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ సైనికులు తిరిగి వెళ్లిపోయిన తరువాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

10th Class Social Textbook Page No.292

ప్రశ్న 14.
ఇరాన్ లోనూ, తాలిబన్ల కింద ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లోనూ సంభవించిన పరిణామాలను తెలుసుకుని మతపర ప్రభుత్వాలు పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోండి.
జవాబు:
1) ఇరాన్ :
1979లో ఇరాన్లో విప్లవం సంభవించి, ఇరాన్ రాజుని తొలగించి, షియా ఇస్లామిక్ మత గురువులు, ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకులు కలసి నిర్వహించే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

2) ఆఫ్ఘనిస్తాన్ :
ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైనికులు తిరిగి వెళ్లిపోయిన తరువాత ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

మతపర ప్రభుత్వాల పని విధానం :

  1. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మత గ్రంథాలలో ఉన్న నియమాలను కచ్చితంగా పాటించాలని ప్రజలను బలవంతం చేయసాగారు.
  2. దీని మూలంగా మహిళలకు, మతపర అల్ప సంఖ్యాక ప్రజలకు మౌలిక స్వేచ్ఛ, సమానత్వం లేకుండా పోయాయి.
  3. అరబ్బులలో అసంతృప్తి పెరిగింది. ఫలితంగా మతపర ఉగ్రవాదం అధికమైంది. కొంత మంది అరబ్బు ఉగ్రవాదులు అమెరికాకు చెందిన రెండు విమానాలను హై జాక్ చేసి వాటితో న్యూయార్క్ లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంలోకి దూసుకెళ్ళడంతో ఆ భవనాలు కూలి కొన్ని వేలమంది మరణించారు. ఈ విధంగా మతపరప్రభుత్వాల మూలంగా అనేక విధ్వంపాలు జరుగుతున్నాయని అర్థం అవుతుంది.

10th Class Social Textbook Page No.293

ప్రశ్న 15.
రెండు ధృవాల, ఏకధృవ ప్రపంచం అన్న పదాలను వివరించండి.
జవాబు:
1) రెండు ధృవాల ప్రపంచం :
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలో రెండు ప్రధాన సైద్ధాంతిక, రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్ట్ శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక పెట్టుబడిదారి శిబిరం. ఈ రెండు దేశాలను ‘రెండు ధృవాల’ ప్రపంచమని అంటారు.

2) ఏకధృవ ప్రపంచం :
1991 అధ్యక్ష ఎన్నికలలో గోర్బచెవ్ గెలుపొంది, యుఎస్ఎస్ఆర్ ని రద్దుపరుస్తున్నట్లు ప్రకటించాడు. పాత యుఎస్ఎస్ఆర్ లోని రాజ్యాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి. యుఎస్ఎస్ఆర్’ కుప్పకూలటంతో ప్రపంచ రాజకీయాలలో కొత్త యుగం ఆరంభమయ్యింది. దీనినే ఏకధృవ ప్రపంచం అని అంటాము.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 16.
రెండు దేశాల మధ్య శాశ్వత శాంతి నెలకొనటానికి భారతదేశం, పాకిస్తాన్లు ఏ చర్యలు తీసుకోవాలి?
జవాబు:
భారతదేశం, పాకిస్తాన్ల మధ్య శాంతి నెలకొనడానికి ఈ కింది చర్యలు తీసుకోవచ్చు.

  1. పాకిస్తాన్ కూడా లౌకిక రాజ్యం కావాలి. మతతత్వ భావనను విడనాడాలి.
  2. పాకిస్తాన్ మత ఛాందసవాదాన్ని విడిచి పెట్టి ప్రజలకు స్వేచ్ఛను కలిగించాలి. దీని వల్ల ఇరు రాజ్యా లూ మత ప్రసక్తి లేని వాతావరణంలో సంప్రదింపులు జరుపుకోవచ్చు.
  3. రెండు దేశాల మధ్య రవాణా సౌకర్యాలు పెంచాలి.
  4. రెండు దేశాల ప్రజలలో సామరస్య దోరణులు కలిగేలా చర్యలు తీసుకోవాలి.
  5. తాము ఉపఖండ దేశాలమని, భారతదేశం, పాకిస్తాన్ దేశాలు కలసి కొన్ని వందల సంవత్సరాలు సహజీవనం సాగించామని గుర్తుకు తెచ్చుకోవాలి.
  6. క్రీడలు, సినిమాలు, వాణిజ్యం, పర్యటన, సాంస్కృతిక సంబంధాలు, వివాహ సంబంధాలతో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంచవచ్చు.

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 17.
భారతదేశం, పాకిస్తాన్ల అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి అవసరం ఏమిటి?
జవాబు:
భారతదేశం, పాకిస్తాన్‌ అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి అవసరమే. ఎందుకనగా………
1) యుద్ధ ఖర్చు :
ఈ రెండు దేశాల మధ్య నిరంతరం ఘర్షణలు కొనసాగుతుండడంతో ఇరు దేశాలు ఆయుధాలను, సైనికసంపత్తిని సమీకరించుకొనుటకు అధిక ధనాన్ని వెచ్చిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటే యుద్ధ ఖర్చు తగ్గుతుంది.

2) ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది :
ఇరు దేశాల మధ్య యుద్ధ భయం లేకపోతే ఇరు దేశాల ప్రజలు శాంతి, సుఖ సంతోషాలతో జీవిస్తారు.

3) సరిహద్దు రాష్ట్రాలలో యుద్ధభీతి తగ్గుతుంది :
సరిహద్దు రాష్ట్రాల వాళ్లు యుద్ధ భయం లేకుండా ప్రశాంత జీవనం సాగించవచ్చు.

4) సంస్కృతి, నాగరికతలను పంచుకున్న సుదీర్ఘ చరిత్ర ఇరుదేశాలకూ ఉండటంతో ఇరు దేశాల మధ్య స్నేహం, శాంతి నెలకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది.

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 18.
పొరుగునున్న పెద్ద దేశాలు ‘పెద్దన్న లాగా’ వ్యవహరిస్తున్నాయని అనేక దేశాలు ఆరోపిస్తూ ఉంటాయి. దీని అర్థం ఏమై ఉంటుంది?
జవాబు:

  1. భారతదేశపు పొరుగు దేశాలలో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి పెద్ద దేశాలు, నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి చిన్న దేశాలు ఉన్నాయి.
  2. భారతదేశం విశాలమైన దేశమైనందున పొరుగు దేశాలు మన పట్ల అపోహలు పెంపొందించుకోవడం, మన చర్యలను అపార్థం చేసుకోవడం జరుగుతుంది.
  3. చిన్న దేశాలు, పెద్ద దేశమైన భారతదేశం తమ మీద ఆధిపత్యం చేస్తుందని, భారతదేశం “పెద్దన్న పాత్ర” పోషిస్తుందని అంటున్నాయి.
    ఉదా : బంగ్లాదేశ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చట్ట విరుద్ధంగా భారతదేశంలోకి రాకుండా కొన్ని సరిహద్దు ప్రాంతాలలో భారతదేశం కంచె నిర్మించటాన్ని బంగ్లాదేశ్ అభ్యంతర పెట్టింది. తీరప్రాంతాలలో భారతదేశం ‘పెద్దన్న పాత్ర’ పోషిస్తుందని బంగ్లాదేశ్ భావిస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 19.
భారతదేశం, బంగ్లాదేశ్ ఉన్న పటం చూసి రెండు దేశాల మధ్య సహకారం ఆ రెండింటికీ ఎందుకు కీలకమైనదో పేర్కొనండి.
జవాబు:
భారత్ – బంగ్లాదేశ్ ల మధ్య సహకారం ఆ రెండు దేశాలకూ చాలా కీలకమైనది. ఎందుకనగా

  1. బంగ్లాదేశ్ చుట్టూ సరిహద్దుగా భారతదేశ రాష్ట్రాలున్నాయి. ఈ సరిహద్దు రాష్ట్రాలలో బంగ్లాదేశ్ ఏమైనా అసాంఘిక చర్యలు చేపట్టినట్లయితే భారతదేశ జాతీయ సమైక్యతకు ముప్పు వాటిల్లుతుంది. కావున ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు అవసరం.
  2. బ్రహ్మపుత్ర, గంగానదీ జలాల విషయం ఇరుదేశాలకు సంబంధించింది. కావున జలాల పంపిణీ సక్రమంగా, సమస్యలు లేకుండా జరగాలన్నా ఇరు దేశాల మధ్య స్నేహ, సహకారాలు అవసరమే.
  3. బంగ్లాదేశ్ తో మనకు స్నేహ, సహకారాలు లోపిస్తే బంగ్లాదేశ్ ఇతర అగ్ర రాజ్యాల ఆధిపత్యంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. తద్వారా మనకు ప్రమాదం పొంచి ఉంటుంది. కావున బంగ్లాదేశ్, భారతదేశాల మధ్య సహకారం చాలా కీలకమైనదని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.297

ప్రశ్న 20.
బంగ్లాదేశ్ కి భారతదేశం ఇచ్చిన మద్దతుని, శ్రీలంకలో దాని పాత్రని పోల్చండి. రెండు దేశాలలో పరిస్థితి ఒకే రకంగా ఉందా, తేడాలు ఉన్నాయా?
జవాబు:
బంగ్లాదేశ్ కి భారతదేశం ఇచ్చిన మద్దతు వేరు. శ్రీలంక పరిస్థితి వేరు.

  1. బంగాదేశ్ భారతదేశ సహాయంతో పాకిస్తాన్ నుంచి విముక్తి పొందింది. భారతదేశంతో 25 సంవత్సరాల శాంతి ఒప్పందం చేసుకుంది.
  2. శ్రీలంక కూడా వలసపాలన నుంచి 1948లో స్వాతంత్ర్యం పొందింది. అయితే శ్రీలంకలో తమిళం మాట్లాడే అల్ప సంఖ్యాక ప్రజల పట్ల శ్రీలంక ప్రభుత్వం చిన్నచూపు మూలంగా తమిళుల్లో తాము వేరు అన్న భావన ఏర్పడింది. దీనికి ప్రభుత్వమే కారణం.
  3. శ్రీలంక తమిళ కాందిశీకులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి రావటం ప్రత్యేక సమస్యగా మారింది. దీంతో శ్రీలంకలో శాంతిని నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపించినందుకు తమిళ తీవ్రవాదులు ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని చంపారు. కావున బంగ్లాదేశ్ కి మనమిచ్చే మద్దతు వేరు. శ్రీలంకకు మనమిచ్చిన మద్దతు వేరు.

AP Board 10th Class Social Solutions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

SCERT AP 10th Class Social Study Material Pdf 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

10th Class Social Studies 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భారతదేశంలో వివిధ బృందాలు, వ్యక్తులు రెండవ ప్రపంచ యుద్ధం పట్ల స్పందించిన విధానాన్ని పోల్చటానికి ఒక పట్టిక తయారు చెయ్యండి. ఈ బృందాలు ఎటువంటి సందిగ్ధతకు లోనయ్యాయి? (AS1)
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం పట్ల వివిధ బృందాలు, వ్యక్తులు స్పందించిన విషయాలు :

కాంగ్రెస్ :
అనేకమంది కాంగ్రెస్ నాయకులు, హిట్లర్ ని, ముస్సోలినిని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు. కాని భారతీయుల అభిప్రాయం కనుక్కోకుండా, రాష్ట్రాలలో భారతీయులచే పరిపాలన జరుగుచుండగా వారి అనుమతి లేకుండా, నిర్బంధంగా భారతీయులు యుద్ధానికి సహాయం చేయవలెనని ఆంగ్లేయులు చెప్పడం భారతీయులను అవమానించడమే అని కాంగ్రెస్ అన్నది.

ముస్లిం లీగు (జిన్నా) :
జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగు కూడా తమ పార్టీని ఆంగ్లేయులు ఆమోదించి, లీగు అనుమతితోనే పరిపాలనా విధానాన్ని రూపొందిస్తామని ఒప్పుకుంటే తమ పక్షం ఆంగ్లేయులకు సహాయం చేస్తుందని హామీ ఇచ్చాడు. అయితే ‘క్రిప్స్” రాయబారం విఫలం అవడంతో ముస్లిం లీగు కూడా తిరస్కరించింది.

గాంధీజీ :
గాంధీజీ యుద్ధానికి విముఖుడే. అహింసయే పరమధర్మం అని నమ్మిన గాంధీజీ ఎన్నడూ యుద్ధానికి సుముఖుడు కాడు. అయినను ఇంగ్లాండు క్లిష్ట పరిస్థితులలో ఉండగా యుద్ధంలో పాల్గొనలేకపోయినా, దానికెటువంటి నష్టం కలిగించకూడదని తలచినాడు.

ఫార్వర్డ్ బ్లాక్ సుభాష్ చంద్రబోస్ :
బోసు, భారతీయులు ఆంగ్లేయులకు ఎటువంటి సహాయం చేయరాదన్నాడు. ఆ దేశానికి సహాయం చేసినట్లయితే, భారతీయులకు ఎన్నటికి స్వతంత్రం రాదని వారందరూ శాసనోల్లంఘనం చేయవలెనని ఉపన్యాసాలు ఇచ్చినాడు.
1) సంస్థానాధీశులు
2) హిందూమహాసభ
3) జస్టీస్ పార్టీ
4) అంబేద్కర్ నాయకత్వంలోని హరిజనులు
5) భారత కమ్యూనిస్టు పార్టీలు యుద్ధంలో ఇంగ్లాండుకు సహాయం చేయాలని నిర్ణయించినాయి. కాంగ్రెస్ కు ఇతర బృందాలు, వ్యక్తులకు ఇతర స్వతంత్ర దేశాలను జయించటానికి ప్రయత్నిస్తున్న నాజీ, ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవాలని ఉన్నా తమకు స్వాతంత్ర్యం ఇస్తామని కనీసం మాట కూడా ఇవ్వని బ్రిటిష్ వారికి ఎందుకు సహాయం చేయాలనే సందిగ్ధతకు లోనయ్యాయి.

AP Board 10th Class Social Solutions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 2.
యూదులు, ఇతర సమూహాల పట్ల జర్మనీ దారుణంగా వ్యవహరించిన నేపథ్యంలో జర్మనీకి గాని, జపానుకి గాని మద్దతు ఇవ్వడం నైతికంగా సరైనదేనా? (AS1)
జవాబు:
సరైనది కాదు. ఎందుకనగా :

  1. జర్మనీ అనేకమంది యూదులను చీకటి గదుల్లో, నేలమాలిగళ్ళో బంధించి చంపింది.
  2. జర్మనీలోని “నాజీ” జాతి ప్రపంచంలోనే గొప్పజాతి అనే జాత్యాహంకారంతో జర్మనీ ఇతర దేశాలను చిన్నచూపు చూసింది.
  3. సామ్రాజ్య కాంక్షతో ఇతర స్వతంత్ర దేశాలను ఆక్రమించుకోవాలని చూసింది.
  4. జపాన్ ఆసియా ఖండానికి చెందిన చిన్నదేశం అయిన, యూరోపియన్ దేశాలతో పోటీపడుతూ దూరప్రాచ్యంలో వలసలను ఏర్పాటు చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది.
  5. సామాజ్య కాంకకు లోనయి ఇతర పెద్ద దేశాలను కవ్విస్తూ అనేక దేశాల మీద దాడులు జరిపింది.

ఇటువంటి నేపథ్యంలో జర్మనీ, జపాన్లకు మద్దతు ఇవ్వడం సరైనది కాదని చెప్పవచ్చు.

ప్రశ్న 3.
భారతదేశ విభజనకు దారితీసిన వివిధ కారణాల జాబితా తయారుచేయండి. (AS1)
జవాబు:
భారతదేశ విభజనకు దారి తీసిన వివిధ కారణాలు :

  1. ముస్లింలకు ప్రత్యేక దేశం అనే భావనకు తొలి ఆధారం కవి “మహ్మద్ ఇక్బాల్” చేసిన ప్రసంగంలో కనిపిస్తుంది.
  2. 1930లో ముస్లిం లీగ్ అధ్యక్షోపన్యాసంలో ఇక్బాల్ వాయవ్య “భారత ముస్లిం దేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సూచించాడు.
  3. వాస్తవానికి కేంబ్రిడ్జిలో చదువుతున్న పంజాబ్ ముస్లిం విద్యార్థి “చౌదరి రెహ్మత్ ఆలీ” వర్గం దేశ విభజన భావనకు ఊపిరిపోసిందని చెప్పవచ్చు. 1933లో ప్రచురించిన ఒక కర పత్రంలో ” రెహ్మత్ ఆలీ” ముస్లిం వర్గానికి ప్రత్యేక జాతీయ ప్రతిపత్తి కల్పించాలనే అభిప్రాయంతో “పాకిస్తాన్” అనే పదానికి రూపకల్పన చేసాడు. (పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీర్, సింద్, బెలూచిస్తాన్స్ ఇంగ్లీష్ అక్షరాల నుంచి పాకిస్తాన్ ఏర్పరచారు.)
  4. 1937 నుంచి ముస్లింలకు ప్రత్యేక దేశం అవసరం అనే భావనపై లీగ్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
    ఎ) 1935 చట్టపు ఫెడరల్ క్లాజులు అమల్లోకి వస్తాయన్న నమ్మకం వారికి సన్నగిల్లింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో తాము హిందూ ఆధిక్యతకు తలవంచక తప్పదనే అభిప్రాయం కూడా వారికి కలిగింది.
    బి) రాష్ట్రాలలో ముస్లిం లీగ్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనే లీగ్ ప్రతిపాదనకు కాంగ్రెస్ వారు నిరాకరించడం జిన్నాకు, ముస్లిం లీగ్ కు అవమానంగా తోచింది. కాంగ్రెస్ మౌలికంగా హిందువుల పార్టీ అని లీగు సృష్టించగలిగింది.
  5. విద్యావంతులైన ముస్లింలు పాకిస్తాన్ ఏర్పాటు కావాలని భావించసాగారు. మొదట విద్యార్థుల పగటి కలగా కొట్టివేసిన “ముస్లింలకు ప్రత్యేక దేశం” అనే భావన చివరికి ముస్లిం లీగ్ ప్రధాన డిమాండ్ గా రూపొందింది.
  6. రెండవ ప్రపంచయుద్ధం తరువాత బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ నాయకులలో అనేకమంది భారతీయులు స్వాతంత్ర్యం పొందడానికి సుముఖంగా ఉన్నారు.
  7. బ్రిటన్ “విభజించి – పాలించు” అనే విధానాన్ని పాటిస్తూ కాంగ్రెస్ ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ, ముస్లిం లీగు ప్రణాళికలకు మద్దతు ఇచ్చి, ముస్లిం లీగు బలపడేలా చేసింది.
  8. హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్, భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కలుగచేసారు.
  9. రెండవ ప్రపంచయుద్ధం తరువాత అగ్రరాజ్యాలుగా రూపొందిన అమెరికా, సోవియట్ యూనియన్లకు భారతదేశ స్వాతంత్ర్య డిమాండ్ ను సమర్ధించాయి.
  10. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలలో ప్రజల ప్రతిపాదన, ప్రత్యేక పాకిస్తాన్ దేశం కావాలని, ఇది కూడా పాకిస్తాన్ ఏర్పాటుకు ఒక కారణం.
  11. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగిన ఎన్నికలలో 569 స్థానాలలో 442 స్థానాలకు కేంద్రంలో 30 స్థానాలను గెలుచుకుంది. అంటే 1946 చివరినాటికి ముస్లిం ఓటర్లలో ప్రధానపార్టీగా ముస్లిం లీగు ఆవిర్భవించి, భారతీయ ముస్లింల “ఏకైక ప్రతినిధి” అన్న తన వాదనను నిజం చేసుకుంది.
  12. చర్చలతో స్వాతంత్ర్యం రాదని లీగు భావించి, ప్రజలను వీధులలోకి రమ్మని పిలుపునిస్తూ ‘ప్రత్యక్ష కార్యాచరణ”కు దిగటానికి నిర్ణయించుకొని 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది. ఇది అనేక అల్లర్లు, హింసకు కారణమైంది.

1947లో “వావెల్” స్థానంలో మౌంట్ బాటెన్ వచ్చి ఆఖరి దఫా చర్చలకు ఆహ్వానించాడు. ఇవి కూడా విఫలం అవడంతో ఆగస్టు 14, 1947న పాకిస్తాన్‌కు, ఆగస్టు 15, 1947న భారత్ కు స్వాతంత్ర్యం ఇస్తామని ప్రకటన చేశాడు. ఈ విధంగా భారత్, పాక్లు విభజింపబడినాయి.

ప్రశ్న 4.
దేశ విభజనకు ముందు వివిధ సమూహాల మధ్య అధికారాన్ని పంచుకోటానికి ఏ ఏ విధానాలను అవలంభించారు? (AS1)
జవాబు:
దేశ విభజనకు ముందు ముస్లిం లీగు, కాంగ్రెస్ మధ్య అధికారాలను పంచుకున్నారు.

1945లో పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ముందుగా వైస్రాయ్, సైనికా దళాల కమాండర్ – ఇన్ – చీఫ్ మినహా కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని భారతీయులతోనే ఏర్పరచటానికి బ్రిటన్ సిద్ధం అయ్యింది. ఈ కార్యనిర్వాహక వర్గంలో ముస్లిం సభ్యులను ఎంపిక చెయ్యటానికి ముస్లిం లీగుకి సంపూర్ణ అధికారం ఉండాలని జిన్నా పట్టుబట్టడంతో అధికార బదిలీకి సంబంధించిన చర్చలు విఫలమయ్యాయి. జాతీయవాద ముస్లిములలో పలువురి మద్దతు కాంగ్రెస్ కు ఉంది. పంజాబ్ లోని యూనియనిస్టు పార్టీలో పలువురు ముస్లింలు సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు ముస్లిం లీగు కోరికను సమర్థించలేదు. 1946 చివరినాటికి ముస్లిం ఓటర్లలో ప్రధాన పార్టీగా ముస్లిం లీగు ఆవిర్భవించి భారతీయ ముస్లిముల ఏకైక ప్రతినిధి’ని అన్న తన వాదనను నిజం చేసుకుంది. ముస్లిం ఓట్లలో 86 శాతానికి పైగా ఆ పార్టీకి వచ్చాయి. 1946లో సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91 శాతంతో అఖండ విజయం సాధించింది.

ప్రశ్న 5.
బ్రిటిష్ వలస పాలకులు తమ విభజించి, పాలించు అన్న విధానాన్ని భారతదేశంలో ఏ విధంగా అమలు చేశారు? నైజీరియాలో అవలంబించిన విధానానికీ, దీనికీ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
బ్రిటిష్ వలస పాలకులు భారతదేశంలో “విభజించి – పాలించు” అన్న విధానాన్ని ఈ క్రింది విధంగా అమలు చేసారు.

  1. హిందూ-ముస్లిం మత వైరుధ్యాన్ని పోషించారు.
  2. కమ్యూనల్ ఎలక్టోరేట్లను ప్రవేశపెట్టడం ద్వారా మొదట విద్యావంతులయిన భారతీయులలోనూ తరువాత సాధారణ ప్రజానీకంలోను ఈ శత్రుత్వాన్ని పెంచి పోషించారు.
  3. హిందీ, ఉర్దూ భాషల విషయంలో ఏర్పడ్డ వివాదాన్ని గోసంరక్షణ ఉద్యమాన్ని సైతం వీరు ఉపయోగించుకున్నారు.
  4. మితవాదులను ప్రోత్సహిస్తూ జాతీయవాదులలో చీలిక తీసుకువచ్చారు. దాదాబాయ్ నౌరోజీ వంటి వారి నుండి ‘జసిస్ రనడే’ వంటి విప్లవనాయకులను వేరు చేయడానికి ప్రయత్నించారు.
  5. అతివాదులకు వ్యతిరేకంగా మితవాదులను ప్రోత్సహించారు.
  6. శీఘ్రంగా పెరిగిపోతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని నిలువరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం విభిన్న విధానాలను అనుసరించింది. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలను ప్రోత్సహించింది.
భారతదేశం నైజీరియా
1) హిందూ-ముస్లిం మత వైరుధ్యాన్ని పోషించారు. 1) బ్రిటిష్ వలసపాలకుల విధానాల వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగాయి.
2) కమ్యూనల్ ఎలక్టోరేట్లను ప్రవేశపెట్టడం ద్వారా మొదట విద్యావంతులయిన భారతీయులలోనూ తరువాత సాధారణ ప్రజానీకంలోను ఈ శత్రుత్వాన్ని, పెంచి పోషించారు. 2) బ్రిటిష్ వలసపాలకులు పశ్చిమ, తూర్పు నైజీరియా ప్రాంతాలను ఏర్పరచి, మొరుబా, ఈబు తెగల మధ్య విభజనలు సృష్టించారు.
3) హిందీ, ఉర్దూ భాషల విషయంలో ఏర్పడ్డ వివాదాన్ని గోసంరక్షణ ఉద్యమాన్ని సైతం వీరు ఉపయోగించు కున్నారు. 3) విద్యావంతులైన ఆఫ్రికావాసులను సివిల్ సేవలకు అనుమతించకపోవడం, ఆఫ్రికా వ్యాపారవేత్తల పట్ల వివక్షత చూపడం జరిగింది.
4) మితవాదులను ప్రోత్సహిస్తూ జాతీయవాదులలో చీలిక తీసుకువచ్చారు. దాదాబాయ్ నౌరోజీ వంటి వారి నుండి “జస్టిస్ రనడే’ వంటి విప్లవనాయకులను వేరు చేయడానికి ప్రయత్నించారు. అతివాదులకు వ్యతిరేకంగా మితవాదులను ప్రోత్సహించారు. 4) ప్రజలపై మరింత నియంత్రణను సాధించటానికి వీలుగా గిరిజన తెగ నాయకులు, సంపన్నులతో సంబంధాలు నెరిపింది.
5) శీఘ్రంగా పెరిగిపోతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని నిలువరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం విభిన్న విధానాలను అనుసరించింది. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలను ప్రోత్సహించింది. 5) జాతీయ ఉద్యమ తీవ్రతకు లోబడి, మూడు ప్రధాన ప్రాంతాల స్వయం ప్రతిపత్తిని గుర్తిస్తూ సంక్లిష్ట సమాఖ్య వ్యవస్థను నెలకొల్పి నైజీరియాన్లకు అధికారాన్ని అప్పగించింది.

ప్రశ్న 6.
దేశ విభజనకు ముందు రాజకీయాలలో మతాన్ని ఏ ఏ విధంగా ఉపయోగించుకున్నారు? (AS1)
జవాబు:
దేశ విభజనకు ముందు రాజకీయాలలో మతం కీలకపాత్ర వహించి, చివరికి దేశ విభజనకు దారి తీసింది.

  1. వర్తకం, పరిశ్రమ, ప్రభుత్వ సర్వీసు, విద్య, వృత్తుల వంటి రంగాలలో హిందువుల ప్రాబల్యం కారణంగా అధిక సంఖ్యాకులయిన హిందూ సముదాయం పట్ల అల్పసంఖ్యాకులయిన ముస్లిం సముదాయం పెంచుకొన్న భేదభావాలే దేశ విభజనకు దారి తీసాయని చెప్పవచ్చు.
  2. 1857 సిపాయిల తిరుగుబాటు కేవలం మహమ్మదీయులు రాజకీయంగా అసంతృప్తి చెంది తెచ్చిన విప్లవమని భావించి బ్రిటిష్ వారు ముస్లింలను ఆ విధంగా వ్యతిరేకభావంతోనే చూశారు.
  3. ‘విభజించి – పాలించు’ విధానాన్ని అనుసరించి బ్రిటిష్ వారు హిందువులను-ముస్లింలను మతాలవారీగా విడదీయటానికి పరోక్షంగా పథకాలు వేశారు.
  4. ముస్లింలలో పాశ్చాత్య విద్యావ్యాప్తి మందకొడిగా సాగిన కారణంగా వారిని ఏదో విధంగా స్వాతంత్ర్యోద్యమానికి దూరంగా ఉంచడానికి ప్రభుత్వం కృషి చేసింది.
  5. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన విద్యాపరమైన అలిఘర్ ఉద్యమం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. రాజకీయ అధికారుల కోసం ముస్లీమ్ మతతత్వాన్ని ప్రోత్సహించారు. ఈయన తన చివరి రోజులలో ముస్లింలను జాతీయోద్యమం నుంచి వైదొలగడమే కాక హిందువులు, మహమ్మదీయులు పరస్పర విరుద్ధ రాజకీయ ప్రయోజనాలున్న వర్గాలని ప్రకటించాడు.
  6. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కృషి వల్ల ‘బిద్రుద్దీన్ త్యాబ్ది’ లాంటివారు విద్యాధికులయ్యారు. వీరు అల్పసంఖ్యాకులైన తమకు ఉద్యోగాలు రావాలంటే బ్రిటిష్ వారికి విధేయులై ఉండాలని ఉద్భోదించారు.
  7. తిలక్, అరబిందు వంటివారు ప్రాచీన హిందూ సంస్కృతికి ప్రాధాన్యమిచ్చి, హిందూమత ప్రాతిపదికకు పిలుపునిచ్చారు.
  8. తిలక్ గణపతి పూజ, శివాజీ ఉత్సవాలకు ప్రాధాన్యమిచ్చి, హిందువులను ఐక్యం చేయడానికి ప్రయత్నించాడు.
  9. ముస్లింలను ప్రోత్సహించడానికి బ్రిటిష్ వారు 1906 లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను వేర్పాటు చేసి, ఏర్పాటు వాదాన్ని పెంచినారు.
  10. హిందువులు కూడా మతతత్వంను పెంచుతూ అనేకమంది హిందూ నాయకులు హిందూ జాతీయతను గురించి చెప్పడం, వారి హక్కుల పరిరక్షణ కొరకు “హిందూ మహాసభ”, ఆర్.ఎస్.ఎస్. వంటి సంస్థలను ఏర్పాటు చేసుకొన్నారు. భారతదేశం హిందువుల మాతృదేశమని, ముస్లింలు విదేశీయులని ప్రచారం చేసారు.

ప్రశ్న 7.
స్వాతంత్ర్య పోరాటం చివరి సంవత్సరాలలో కార్మికులను, రైతాంగాన్ని ఏ విధంగా సమీకరించారు? (AS1)
జవాబు:
భారతీయ కార్మిక వర్గానికి అక్షరాస్యత తక్కువే కాకుండా సాంస్కృతికంగా కూడా వెనుకబడి ఉంది. అందుకే మేధావులు, బూర్జువా వర్గాల కన్నా, వీరిలో జాతీయ, వర్గ చైతన్యం ఆలస్యంగా ప్రారంభమయిందని చెప్పవచ్చు. 1917లో రష్యన్ విప్లవం మూలంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి కార్మికసంఘ ఉద్యమాలకు కారణం అయ్యాయి. కార్మికుల యొక్క పని గంటలు, వేతనాలలో సంస్కరణలు తీసుకురావడం కొరకు అనేక కార్మికసంఘాలు, మద్రాస్ కార్మికసంఘం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ (ఐ.టి.యు.ఎఫ్), ఎ.ఐ.టి.యు.సి., నేషనల్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ల వంటివి ఆవిర్భవించాయి. 1935-39లో కార్మిక కార్యకలాపాలను పునరుద్ధరించడంలో సమ్మెలు కూడా తగ్గినాయి. 1935 చట్టం కార్మిక నియోజకవర్గాలను ఏర్పాటుచేసింది. 1946లో దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేశారు. సమ్మెలు చేశారు. భారత కమ్యూనిస్ట్, సోషలిస్ట్ పార్టీలు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాయి. వివిధ దశల్లో చేసిన వివిధ చట్టాల వల్ల కార్మికుల పని పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి. కార్మికులు తమ • నాయకుల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య పోరాటంలో జాతీయ నాయకులకు పూర్తి మద్దతు ఇచ్చారు.

“చంపారన్” సత్యాగ్రహం బీహార్ రైతులలో చైతన్యాన్ని కలిగించింది. “ఖేరా’ కరవు విషయంలో గాంధీజీ సత్యాగ్రహం చేయడం రైతులకు రక్షణ కలిగించింది. రైతులు తమ కోర్కెల సాధన కొరకు సత్యాగ్రహాన్ని ఉపయోగించుకోవచ్చని రైతులు భావించసాగారు. ఇటువంటి సమయంలో రైతులను రాజకీయాలవైపు ఆకర్షిస్తూ, లక్షలాది రైతులను సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేటట్టు చేయగలిగింది. దశాబ్దాల నుంచి రాజకీయ అంధకారంలో మగ్గుతున్న రైతులను రాజకీయ సుడిగుండంలోకి తీసుకురాగలిగింది. 1917 నుంచి గాంధీజీ ఆయన అనుచరులు భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రైతుల జీవితంలో జాతీయ రాజకీయాలను ప్రవేశపెట్టడంలో విజయం సాధించారు. 1923 లో ప్రముఖ రైతు నాయకుడు “యన్. జి. రంగా” “రైతుల సమాఖ్య”ను ఏర్పాటుచేశాడు. గుంటూరు జిల్లాలో రైతులు ఈయనకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఈ రైతు సమాఖ్యలు పశ్చిమగోదావరి, కృష్ణాలకు విస్తరించినాయి. 1929 లో “ఆంధ్రరైతుల ప్రొవిన్షియల్ సమాఖ్య” యన్.జి.రంగా అధ్యక్షతన సమావేశమై రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను సమర్ధించింది. 1942లో భారత రైతులు ‘శాసనోల్లంఘన’ ఉద్యమం పిలుపుకు వీరోచితంగా స్పందించినారు. బెంగాల్ లోని మిడ్నపూర్‌లో రైతుల తిరుగుబాటు కారణంగా కొన్ని సంవత్సరాలపాటు బ్రిటిష్ వారు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయారు.

ఈ విధంగా భారతదేశంలోని రైతు ఉద్యమాలకు చైనాలోని ‘మావో’ లాగ సరైన నాయకత్వం గనుక లభించి ఉంటే భారతదేశ చరిత్ర మరోలా ఉండేదనడం నిర్వివాదాంశం. హైదరాబాద్లో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణా ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది.

ప్రశ్న 8.
సాధారణ ప్రజల జీవితాలను దేశ విభజన ఏ విధంగా ప్రభావితం చేసింది ? విభజన తరువాత జరిగిన వలసలకు రాజకీయ ప్రతిస్పందన ఏమిటి? (AS1)
జవాబు:
ముస్లిం మత పాకిస్తాన్ ఏర్పాటు కావటంతో చాలామంది ప్రజల ముందు ఊహించని బాధాకరమైన పరిస్థితి ఎదురయ్యింది. కొత్తగా గీసిన సరిహద్దు రేఖకి ఒకవైపున ఉన్న హిందువులలో అభద్రతా భావం ఏర్పడి వలస వెళ్లడం తప్పనిసరి అయ్యింది. ఈ కొత్త సరిహద్దు రేఖకు ఆవలివైపున ఉన్న ముస్లిములలో కూడా ఇదే పరిస్థితి. అందరూ దీనిని కోరుకుని ఉండకపోవచ్చు. ఇది ఎందుకు జరుగుతోందో అందరికీ అర్థం అయి ఉండకపోవచ్చు. తమ ఇళ్లు, ఊళ్లు, పట్టణాలను విడిచి వెళ్లవలసి రావటంతో ఒకరిపట్ల ఒకరికి కోపం, విద్వేషాలు చెలరేగాయి. మొత్తంగా 1.5 కోట్ల హిందువులు, ముస్లిములు నిర్వాసితులయ్యారు. హత్యలు, దోపిడి, దహనాలు యధేచ్ఛగా కొనసాగాయి. హిందువులు, ముస్లిములు కలిపి రెండు నుంచి అయిదు లక్షలమంది చంపబడ్డారు. వాళ్లు కాందిశీకులుగా మారారు, పునరావాస శిబిరాలలో గడిపారు. రైళ్లల్లో కొత్త ఇళ్ల అన్వేషణలో బయలుదేరారు. శాంతి, సౌభ్రాతృత్వ సందేశాలను పంచుతూ గాంధీజీ అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య, ఆసుపత్రులలో గడిపాడు. తను ఇంతగా కష్టపడింది ఇటువంటి స్వేచ్ఛ, స్వరాజ్యాల కోసం కాదు. జాతిపిత మొదటి స్వాతంత్ర్య దినోత్సవంనాడు సంబరాలు చేసుకోకుండా నిరాహారదీక్ష చేశాడు.

గాంధీజీ చొరవతో “అల్పసంఖ్యాక వర్గాల హక్కుల’ పై నెహ్రూ, కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేశాయి. ఆ పార్టీ “రెండు దేశాల సిద్ధాంతాన్ని” ఎప్పుడూ అంగీకరించలేదు. తన ఇష్టానికి వ్యతిరేకంగా దేశవిభజనకు బలవంతంగా ఒప్పుకోవలసి వచ్చినప్పటికీ ‘భారతదేశం అనేక మతాల, జాతుల దేశమనీ, అలాగే కొనసాగాలని’ విశ్వసించింది. పాకిస్తాన్ ఎలా ఉన్నప్పటికీ భారతదేశం ‘ప్రజాస్వామిక లౌకికరాజ్యం ‘ గా ఉంటుంది. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుండి రక్షణ లభిస్తుంది. సమాన హక్కులు ఉంటాయి.

ప్రశ్న 9.
కొత్తగా ఏర్పడిన భారతదేశంలోకి వివిధ సంస్థానాలను విలీనం చేసే ప్రక్రియ ఒక సవాలుగా పరిణమించింది. చర్చించండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ అధికారం కింద వివిధ స్థాయిలలో సర్వసత్తాక పాలనతో సుమారుగా 550 సంస్థానాలు ఉండేవి. 1947 భారత స్వాతంత్ర్య చట్టం ప్రకారం సంస్థానాధీశులు తమ ఇష్ట ప్రకారం తమ భవిష్యత్తును నిర్ణయించుకొనే అధికారం పొందారు. దీని మూలంగా కొంతమంది రాజులు స్వతంత్రంగా ఉంటామని ప్రకటించినారు. భోపాల్ నవాబు కాంగ్రెస్ ప్రభావం ఉన్న భారతదేశం చేరడానికి సుముఖంగా లేక, అతడు భారత ప్రభుత్వ రాజకీయ శాఖతోనూ, ముస్లింలీగుతోను రహస్యంగా కుమ్మక్కవుతున్నాడని తెలిసి, దేశీయాంగ మంత్రి సర్దార్ వల్లభబాయి పటేల్ భోపాల్ పాకిస్తాన్లో కాని చేరినట్లయితే దేశ సమగ్రతకు భంగం కలిగే ప్రమాదం ఉండటంతో పటేల్, భోపాల్ ను భారతదేశంలో కలిపివేసినారు.

1947 ఆగష్టు 15 నుండి బ్రిటిష్ ఆధిపత్యం తొలగుతుందని సంస్థానాధీశులు ఇండియా, పాక్లో దేనిలో అయినా చేరనూవచ్చు లేదా స్వతంత్రంగా ఉండనూవచ్చు అని మౌంట్ బాటెన్ ప్రకటించాడు.

ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్ర్యం, సంస్థానాధీశుల మూలంగా చిన్నాభిన్నం కావడం ఇష్టంలేని పటేల్ స్వతంత్ర రాజులను ఒప్పించడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. దాని ప్రకారం సంస్థానాధీశుల అధికారం బ్రిటిష్ ఆధీనంలో ఉన్నప్పటిలాగానే విదేశీ వ్యవహారాలు, రక్షణ, ప్రయాణ సౌకర్యాలు తప్ప మిగిలిన అధికారాలన్నీ రాజులకు కల్పించబడతాయి అని పటేల్ ప్రకటించగానే బరోడా, బికనీర్, కొచ్చిన్, జైపూర్, జోధ్ పూర్, పాటియాల, రేవా వంటి అనేక సంస్థానాలు భారత్ లో కలిసాయి.

1947 ఆగష్టు 15 నాటికి హైదరాబాద్, కాశ్మీర్, జునాగఢ్ తప్ప తక్కిన సంస్థానాధీశులందరూ భారత్ లో చేరతామని ప్రకటించినారు. ఒక్క రక్తం చుక్క కూడా చిందించకుండా అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి భారతదేశ ఐక్యతకు తోడ్పడినాడు.

జునాగఢ్ :
ఈ సంస్థానంలో 75% ప్రజలు హిందువులు. కాని నవాబు జిన్నాకు అనుకూలుడు. అనేకమంది హిందువులను తరిమికొట్టాడు. జునాగఢ్ పాకిస్తాన్లో కలుస్తుందని ప్రకటించాడు. ప్రజలు తీవ్ర ఆందోళన లేవదీశారు. అందువల్ల సర్దార్ పటేల్ జునాగఢ్ మీదకి సైన్యాలను పంపాడు. ప్రజాభిప్రాయ సేకరణ చేశాడు. ప్రజాభిప్రాయం ప్రకారం జునాగఢ్ భారతదేశంలో విలీనమైంది. నవాబు పాకిస్తాన్ పారిపోయాడు.

హైదరాబాద్ :
నిజాంను ప్రభుత్వం సమానస్థాయి ఉన్న రాజ్యాధినేతగా పరిగణించింది. కాని సంతృప్తి చెందని నిజాం తన రాజ్యానికి సముద్రతీరం ఉండాలని ‘గోవా’ ను పోర్చుగీసు వారి నుండి కొనడానికి సన్నద్ధమయి, పాకిస్తాన్ నుండి సైన్యాన్ని, ఆయుధాలను చేరవేయడం జరిగింది. హైదరాబాదులోని భూస్వాములు, అధికారుల దురాగతాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం బయలుదేరింది. ఇది సాయుధ పోరాటంగా మారింది. దీన్ని ఆసరాగా తీసుకొని కాసిం రజ్వీ’ నాయకత్వంలో రజాకార్లు బయలుదేరి పౌర జీవనాన్ని స్తంభింపచేశారు. జిన్నా, ప్రపంచ ముస్లింలందరూ దీనికి సానుభూతి చూపి భారతను ఎదిరించాలని ప్రకటించాడు. ఈ చర్యల మూలంగా దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందని పటేల్ భావించి 1948 సెప్టెంబరు 13న భారత సైన్యాలను హైదరాబాద్ మీదకి పంపినాడు. కాసీం రజ్వీ, అతని అనుచరులు పారిపోయారు. నిజాం 1948 సెప్టెంబరు 17వ తేదీన భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. భారత ప్రభుత్వం హైదరాబాదును భారతదేశంలో విలీనం చేసి, ఈ చర్యను “పోలీసు చర్య”గా ప్రకటించింది.

కాశ్మీర్ :
కాశ్మీర్ లో ముస్లిం జనాభా ఎక్కువ. కాని రాజు హిందువు. పాకిస్తాన్ సేనలు కాశ్మీర్ లోకి చొచ్చుకొని వచ్చాయి. దీని మూలంగా రాజు, కాశ్మీర్ భారత్ లో చేరిపోతుందని ప్రకటించి, భారత్ సహాయాన్ని కోరినాడు. భారత్, పాకు దాదాపు ఒక సంవత్సరం పోరాటం చేసారు. చివరికి ఐక్యరాజ్యసమితి ఏర్పరచిన కమిషను మూలంగా పోరాటం ఆగింది. కాని కాశ్మీర్ లో కొంత భాగం పాక్ ఆక్రమణలో ఉండిపోయింది.

దేశ సమైక్యతకు భంగం కలిగించే ఈ సంస్థానాధీశులను చాలా చాకచక్యంగా ఎదుర్కొన్నవారు సర్దార్ పటేల్. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరు పొందినాడు.

10th Class Social Studies 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 InText Questions and Answers

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 1.
ప్రభుత్వాలు రాజీనామా చేస్తే రోజు వారీ వ్యవహారాలను ఎవరు నిర్వర్తిస్తారు?
జవాబు:
ప్రభుత్వాలు రాజీనామా చేసినప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. కాబట్టి రోజువారీ కార్యక్రమాలను వారు నిర్వర్తిస్తారు. దైనందిన వ్యవహారాలు స్పందించకుండా ఉద్యోగులు తమ విధులను నిర్వర్తిస్తారు.

10th Class Social Textbook Page No.218

ప్రశ్న 2.
భారతీయులు తమ స్వాతంత్ర్య పోరాటాన్ని పక్కన పెట్టి స్వేచ్ఛాయుత ప్రపంచంపై దృష్టి కేంద్రీకరించాల్సినంతగా హిట్లర్ బలం పుంజుకుని మానవాళి స్వేచ్ఛకు ముప్పు కలిగించేవాదా?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం తరువాత ఆమోదించిన రెహ్మత్ ఆలివర్సయిల్స్ సంధి షరతులు జర్మనీకి అవమానకరంగా ఉన్నాయని హిట్లర్ భావించాడు. ఇతర దేశాల ఆధీనంలో ఉన్న జర్మన్ భూభాగాలను ఏకం చేయాలని ఆశించాడు. సంధి షరతులను ఉల్లంఘించినాడు. పెద్ద దేశాలను ఎదిరించి, దూర ప్రాచ్యంలో తమకు కూడా వలసలు కావాలని ఆశించాడు. జర్మనీని చూసి అగ్రరాజ్యలు భయపడేలా చేసాడు. అయితే మన స్వాతంత్ర్య పోరాటం వదిలి స్వేచ్ఛాయుత ప్రపంచం కొరకు దృష్టి పెట్టవలసినంత అవసరం లేదు. జర్మనీకి భారత జాతీయ పోరాటం మీద సానుభూతి కూడా ఉంది.

10th Class Social Textbook Page No.218

ప్రశ్న 3.
రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ని సమర్ధించటానికి, సమర్థించకపోవటానికి మీ కారణాలను పేర్కొనండి.
జవాబు:

  1. బ్రిటనను సమర్థిస్తాను. ఎందుకనగా జాత్యాహంకారంతో, సామ్రాజ్యకాంక్షతో ఇతర స్వతంత్రదేశాలను ఆక్రమించు కుంటున్న జర్మనీ, జపాన్ వంటి దేశాల ఆటకట్టించడానికి బ్రిటన్ యొక్క ప్రయత్నాన్ని నేను సమర్ధిస్తాను.
  2. భారతీయులను సంప్రదించకుండా, వారితో ప్రమేయం లేకుండా, యుద్ధం తరువాత స్వాతంత్ర్యం ఇస్తామని కనీసం మాట కూడా ఇవ్వకుండా, భారత్ యుద్ధంలో పాల్గొనాలని బ్రిటిష్ ప్రకటించడాన్ని నేను సమర్థించను.

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 4.
బ్రిటన్ దృక్పథం పట్ల నిరసన వ్యక్తపరచటానికి కాంగ్రెస్ ఏ చర్య చేపడితే బాగుండేది?
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటన్ దృక్పథం పట్ల నిరసన వ్యక్తపరచటానికి, భారతీయులు 1937లో జరిగిన ఎన్నికలలో 8 రాష్ట్రాలలో అధికారంలోనికి వచ్చిన ప్రభుత్వాలు రాజీనామా చేయకుండా, అధికారంలోనే ఉండి, బ్రిటిష్ వారికి సహకరించకుండా నిరసన తెలిపితే బాగుండేది.

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 5.
బ్రిటన్ మాట ఇచ్చి భారతీయుల మద్దతు ఎందుకు పొందలేదు? 1939లో భారతీయులు అడిగింది మాటే కదా ! తరగతిలో అందరూ చర్చించండి.
జవాబు:

  1. బ్రిటిష్ వారికి, తాము భారతదేశంలో నిర్మించిన సామ్రాజ్యాన్ని వదులుకోవటం ఇష్టం లేదు.
  2. 2వ ప్రపంచయుద్ధం తరువాత భారత్ కు డొమీనియన్ ప్రతిపత్తి ఇస్తామని చెప్పారు. కాని జాతీయవాదులు సంపూర్ణ స్వరాజ్యం కావాలని కోరినారు. ఇది బ్రిటిష్ కు ఇష్టం లేదు.
  3. కాంగ్రెస్ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం లేదని (ఉదా : ముస్లిం ప్రజలకు) బ్రిటిష్ భావించింది. అనేకమంది భారతీయుల ప్రయోజనాలను కాంగ్రెస్ పట్టించుకోవటం లేదని వాటిని కాపాడాల్సిన బాధ్యత ‘తమపైన ఉన్నదని బ్రిటన్ భావించి, భారతీయులకు 1939లో స్వాతంత్ర్యం ఇస్తామని బ్రిటన్ మాట ఇవ్వలేదని అర్థం అవుతుంది.

10th Class Social Textbook Page No.221

ప్రశ్న 6.
అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి ప్రత్యేక నియోజకవర్గాలు ఒక విధానం. ఈ ఉద్దేశం నెరవేర్చటంలో సహాయపడగల -విధానాలు ఇంకేమైనా ఉన్నాయా? ఉదాహరణకు ముస్లింలకు సంబంధించిన అంశం మీద ఓటు వేయటానికి ముందు ముస్లిమేతర సభ్యులు తమ నియోజక వర్గంలోని ముస్లింలను సంప్రదించాలన్న షరతు పెడితే ఎలా ఉంటుంది? ఇటువంటి పద్ధతి ఎప్పుడు పని , చేస్తుంది? ఎటువంటి పరిస్థితులలో ఇది విఫలం అవుతుంది?
జవాబు:

  1. అల్ప సంఖ్యాక వర్గాల ప్రయోజనాలు కాపాడటానికి ప్రత్యేక నియోజకవర్గాలతో పాటు చట్ట సభల్లో వారికి రిజర్వేషన్లు కూడా కల్పించవచ్చు.
  2. ముస్లిమేతర సభ్యులు తమ నియోజకవర్గంలోని ముస్లింలను సంప్రదించాలన్న షరతు పెడితే బాగుంటుంది. కాని ఈ ఈ పద్ధతి, ముస్లింలు చాలా తక్కువ సంఖ్యలో ఉండి, తమ హక్కులకు రక్షణ లభించగలదని నమ్మే పరిస్థితిలో పనిచేస్తుంది. ముస్లింలకు ఇతర వర్గాల మీద నమ్మకం లేనపుడు, వారి సంఖ్య అధికంగా ఉన్నప్పుడు ముస్లింలు, వారి వర్గ సభ్యులకే ఓటు వేసుకోవాలనుకుంటారు, కాని ఇతరులకు వేయాలనుకోరు.

10th Class Social Textbook Page No.229

ప్రశ్న 7.
తాము బందీలుగా పట్టుకున్న సైనికులను బోస్ తన సైన్యంలోకి తీసుకోవటాన్ని జపనీయులు ఎందుకు అనుమతించారు?
జవాబు:
జపాన్ ఆధ్వర్యంలో ‘గ్రేటర్ ఆసియా’ను స్థాపించడం కోసం స్థానికంగా సంబంధాలు ఏర్పరచుకోవాలనే, స్వార్ధ ప్రయోజనంతోనే జపాన్ వారు ‘భారత జాతీయ సేన’ ఏర్పాటును ప్రోత్సహించారు. తాము బందీలుగా పట్టుకున్న సైనికులతో జాతీయ సేనను ఏర్పాటుచేయుటకు ప్రోత్సహించారు.

10th Class Social Textbook Page No.224

ప్రశ్న 8.
భారత సైనికులు భారత జాతీయ సైన్యంలో ఎందుకు చేరారు?
జవాబు:
బ్రిటిష్ ఇండియా సైన్యంలో భారతీయ సైనికులు కూడా ఉన్నారు. జపాన్ వారు బర్మా, మలయాపై దాడి చేసి అక్కడి, బ్రిటిష్ సైన్యాన్ని ఓడించారు. మలయా కూడా బ్రిటన్ వలస దేశమే. బ్రిటిష్ సైన్యంలోని కెప్టెన్ ‘మోహన్ సింగ్’ తన జట్టు సైనికులతో జపనీయులకు లొంగిపోయాడు. ఈ లొంగిపోయిన యుద్ధ ఖైదీలతో ‘భారత జాతీయ సైన్యం’ ఏర్పడింది.

10th Class Social Textbook Page No.224

ప్రశ్న 9.
యుద్ధంలో ఓడిపోతే బ్రిటిష్ వాళ్ల చేతుల్లో చిక్కుతామన్న భయం భారతీయ సైనికులకు ఎందుకు లేకపోయింది? బ్రిటిష్ వాళ్లు వీరిని ఏమి చేసి ఉండేవాళ్లు?
జవాబు:
భారత జాతీయ సైన్యానికి, యుద్ధంలో ఓడిపోతే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చిక్కుతామన్న భయం లేదు. వారిలో దేశభక్తి మెండుగా ఉంది. తాము చేసే యుద్ధంలో ఇంగ్లాండు ఓడిపోయినట్లయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందని ఆశించారు. భారత సైనికులు కేవలం కిరాయి హంతకులు కాదని, తమ ప్రాణాలను స్వదేశం కోసం పణంగా పెట్టగల దేశభక్తులని నిర్ధారణ అయింది. భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలు భారతీయులందరిలో జాతీయవాద భావనలను పురికొల్పాయి. భారతదేశాన్ని దాని సైన్యంతోనే లొంగదీసుకోవడం ఇకపై సాధ్యంకాదని బ్రిటిష్ వారు గ్రహించారు.

10th Class Social Textbook Page No.225

ప్రశ్న 10.
ఘటనలు ఈ విధమైన మలుపు తీసుకోవటం వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా ప్రభావితమై ఉంటాయి?
జవాబు:
భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులు, రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటన్ చేతిలో జపాన్ ఓడిపోవుట వలన ఓడిపోయారు. అయితే ఈ సైనికులను జైలుపాలు జేసి వారిని శిక్షించాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించినారు. విద్రోహ చర్య క్రింద వారిని విచారించి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించాయి. సైనికులపై విచారణ కొనసాగుతుండగా దేశంలోని పలు ప్రాంతాలలో అశాంతి, అసంతృప్తి చెలరేగసాగాయి.

10th Class Social Textbook Page No.225

ప్రశ్న 11.
నాయకులుగా ఆరాధించిన భారత జాతీయ సైనికులను బ్రిటిష్ వాళ్లు, విద్రోహులుగా పరిగణించి, విచారించి, ఉరి తీయటం ఇతర భారతీయులను ఎలా ప్రభావితం చేసి ఉంటుంది?
జవాబు:
జాతీయ సైనికులను అరెస్టు చేసి, విచారణ సాగుతుండగా చాలా ప్రాంతాలలో గొడవలు, అశాంతి, అసంతృప్తి చెలరేగసాగాయి. జాతీయ చైతన్యంతో చెలరేగిన ఈ ప్రజా తిరుగుబాటులో హిందువులు, ముస్లింల గుర్తింపు, విభజన రాజకీయాలు వంటివి ప్రాముఖ్యత కోల్పోయాయి. ఉదా : భారత జాతీయ సైనికులలో విచారింపబడుతున్న వాళ్ళలో చాలామంది ముస్లింలు, అయితే వాళ్ళ పట్ల ప్రజలలో సానుభూతి వెల్లివిరిసి వాళ్ళ మతం గురించి ఎవరూ ఆలోచించలేదు.

10th Class Social Textbook Page No.226

ప్రశ్న 12.
పైన పేర్కొన్న పలు ప్రజా ఉద్యమాలలో మతపర తేడాలను పట్టించుకోలేదని గమనించాం. ఈ ఉద్యమాలలో ప్రజల ఐకమత్యానికి కారణం ఏమిటి?
జవాబు:
రైతు, కార్మిక, ఉద్యోగస్తుల, నౌకాదళంలోని భారత సైనికుల తిరుగుబాటు, జాతీయ సేనను బ్రిటిష్ వారు విచారించి శిక్షించాలనుకున్నపుడు, ఇటువంటి సందర్భాలలో భారత ప్రజలందరూ తామంతా ఒక్కటే అని కలిసికట్టుగా సమస్యల సాధనకొరకు కృషి చేసారు. వారిలో దేశభక్తి ఉప్పొంగింది. తామందరికీ శత్రువైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు.

10th Class Social Textbook Page No.218

ప్రశ్న 13.
1935 చట్టం ఇచ్చిన అధికారాలకు భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలా?
జవాబు:
1935 చట్టంలోని అంశాలు :

  1. ఈ చట్టం భారతదేశంలో ఫెడరల్ విధానాన్ని ఏర్పాటు చేయాలి.
  2. కేంద్రంలో రెండు సభలతో కూడిన శాసనసభ ఏర్పడింది.
  3. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన రద్దు అయ్యింది. మంత్రులకు అన్ని శాఖలు అప్పగించడం జరిగింది.

అయినప్పటికి 1935 చట్టం జాతీయవాదులను తృప్తి పరచలేదు. ఎందుకనగా :

  1. ఫెడరల్ విధానాన్ని అమలు జరపలేదు.
  2. గవర్నర్ లకు శాసనసభ తీర్మానాలను తోసిపుచ్చే అధికారం ఉండేది.
  3. చాలా తక్కువమంది ప్రజలకు ఓటుహక్కును కల్పించారు. భారతీయులు ఈ చట్టాన్ని ఎదిరించారు. కావున బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండనవసరం లేదు.

10th Class Social Textbook Page No.220

ప్రశ్న 14.
ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను కాంగ్రెస్ తీవ్రతరం చేసి ఉన్నట్లయితే ఏం జరిగి ఉండేది? ఇది స్వాతంత్ర్య పోరాటానికి బలం చేకూర్చి ఉండేదా?
జవాబు:

  1. 1939లో కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసాయి. కాబట్టి అధికారం నాయకుల చేతుల్లో లేదు. బ్రిటిష్ వారి చర్యలను ఎదిరించలేరు.
  2. యుద్ధ సమయంలో శాంతి భద్రతలను కాపాడటానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను పొందింది.
  3. ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఎవరినైనా వెంటనే జైలుకి పంపించి, కోర్టుకి వెళ్ళకుండా కావలసినంత కాలం బందీగా ఉంచవచ్చు.
  4. వాక్ స్వాతంత్ర్యాన్ని కూడా పరిమితం చేశారు. ఇటువంటి గడ్డు పరిస్థితిలో కాంగ్రెస్ నిరసనలను తీవ్రతరం చేసినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వం నాయకులను అరెస్టు చేసి జైలుకి పంపించి ఉండేది. జైలులో ఎంతకాలమైన ఉంచే చట్టాలను చేసింది. కాబట్టి అరెస్టు అయిన జాతీయ నాయకులు ఎప్పుడు విడుదల అవుతారో తెలీదు కావున స్వాతంత్ర్య పోరాటం చేయడానికి నాయకులు లేక పోరాటానికి బలం తగ్గిపోయేదని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.220

ప్రశ్న 15.
అల్ప సంఖ్యాక వర్గాల భయాలు, సమస్యలను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను గురించి చర్చించండి. అధిక ఓట్లతో గెలిచే ఎన్నికలు అల్పసంఖ్యాక వర్గాలకు సహాయపడలేవని ఎందుకు భావించారు?
జవాబు:
భారతదేశంలో అధిక జనాభా హిందువులే. దీని మూలంగా భారతదేశంలో ఉన్న ముస్లింలకు తాము అల్ప సంఖ్యాక వర్గం అనే భావం వచ్చింది. మతరీత్యా కూడా వేరు అగుట మూలంగా కూడా తాము వేరు, హిందువులు వేరు అనే భావం ముస్లింలలో కలిగింది. అదే విధంగా కాంగ్రెస్ అధికారంలో తమకు న్యాయం జరగదని, తమ సమస్యలు పరిష్కరించబడవనే అపోహలకు ముస్లింలు లోనయ్యారని తెలుస్తుంది. అయితే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ – సమానమే అనే భావాన్ని కాంగ్రెస్ వారు ముస్లింలకు కల్పించాలి. వారు భయపడవలసిన అవసరం లేదని వారికి నమ్మకం కలిగించాలి. హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్. వంటి సంస్థల మూలంగా ముస్లింల భయాలు ఎక్కువయ్యాయి. అధిక మెజారిటీతో గెలిచే కాంగ్రెస్ నాయకత్వం ముస్లింలకు సహాయం చేయలేదని ముస్లింలు భావించారు.

10th Class Social Textbook Page No.223

ప్రశ్న 16.
ముస్లిం లీగు రాజకీయాల వల్ల ఒనగూరే ప్రయోజనాలను ప్రజలు ఏ విధంగా అంచనా వేసుకున్నారు? వాళ్లకి ఏమైనా ఆ ప్రశ్నలు తలెత్తాయా? ఏమైనా సందేహాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:
ముస్లిం లీగ్ రాజకీయాల వల్ల జరిగే ప్రయోజనాలను ప్రజలు ఈ క్రింది విధంగా అంచనా వేసుకున్నారు.
1) హిందూ జమీందార్లు, వడ్డీ వ్యాపారస్తులు తమను దోచుకోని పరిస్థితి గురించి కలలు కన్నారు. వ్యాపారస్థులు, ఉద్యోగార్థులు హిందువుల నుంచి పోటీ ఉండదని ఆశించారు. మరింత మత స్వాతంత్ర్యం ఉంటుందని భావించారు.

2) హిందువుల ఆధిపత్యం గురించి ముస్లిం లీగుకు అనేక భయాలున్నాయని చెప్పవచ్చు. ముస్లింల పట్ల కాంగ్రెస్ సున్నితత్వంతో స్పందించటం లేదని అనేక అంశాల పట్ల ముస్లిం లీగుకు సందేహాలున్నాయి.
ఉదా : యునైటెడ్ ప్రావిన్స్ లో ఎక్కువ సీట్లనే గెలుచుకున్న ముస్లిం లీగుతో కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయటాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం తమ సభ్యులు ముస్లిం లీగులో సభ్యత్వం తీసుకోవడాన్ని కాంగ్రెస్ నిషేధించింది. ఈ వ్యవహారాల పట్ల ముస్లిం లీగులో అనేక సందేహాలున్నాయని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.224

ప్రశ్న 17.
1942-45 మధ్య కాలాన్ని సమీక్షించండి. అంతకుముందు కంటే ఇప్పుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల ప్రతిఘటన బలం పుంజుకుందా? వివరించండి.
జవాబు:
1942 – 45 మధ్యకాలాన్ని పరిశీలించినట్లయితే అంతకుముందు కంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల ప్రతిఘటన బలం పుంజుకుందని చెప్పవచ్చు.

  1. రెండవ ప్రపంచయుద్ధంలో భారతీయుల సహకారం కోసం పంపిన క్రిప్స్ రాయబారాన్ని కాంగ్రెస్, లీగులు తిరస్కరించినాయి.
  2. క్రిప్స్ రాయబారాన్ని తిరస్కరించిన తరువాత కాంగ్రెస్ కమిటీ సమావేశమై అనుసరించవలసిన విధానాన్ని ప్రకటించింది. 1942లో గాంధీజీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించాడు. స్వాతంత్ర్య పోరాటాన్ని తీవ్రతరం చేశారు. గాంధీజీ ఉద్యమకారులతో ప్రాణత్యాగాన్నెనా చేసి, స్వరాజ్యాన్ని సంపాదించవలెనని చెప్పినాడు. దానిని ‘Do or die’ అంటారు.
  3. 1942లో భారత జాతీయ సైన్యం ఏర్పడింది. ఇది సుభాష్ చంద్రబోసు నాయకత్వంలో దాదాపు 3 సంవత్సరాలు బ్రిటిష్ యుద్ధం చేసింది. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా చేసింది.
  4. 1946 భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులను బ్రిటిష్ వారు శిక్షించాలని నిర్ణయించినారు. వారి మీద విచారణ జరుగుతుండగా దేశంలోని పలు ప్రాంతాలలో అశాంతి, అసంతృప్తి చెలరేగసాగాయి. జాతీయ చైతన్యంతో చెలరేగిన ఈ ప్రజా తిరుగుబాటులో హిందువు – ముస్లింల గుర్తింపు, విభజన రాజకీయాలు వంటివి ప్రాముఖ్యత కోల్పోయాయి. పై సంఘటనలన్నింటితో జాతీయోద్యమం బలాన్ని పుంజుకుందని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.226

ప్రశ్న 18.
దేశంలోని సాధారణ ప్రజల చర్యలను సమీక్షించండి. వాళ్ల కోరికలు ఏమిటి?
జవాబు:
1) దేశంలోని సాధారణ ప్రజలు కొందరు జీవనాధారం కొరకు మిల్లులు, కర్మాగారాలలో పనిచేసేవారు. మరికొంతమంది వ్యవసాయం చేసేవారు. మొదటి కర్మాగారాలలో పని గంటలు అధికంగా ఉండేవి. పని పరిస్థితులు సరిగ్గా ఉండేవి కావు. వేతనాలు తక్కువ. కార్మికులు ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించేవారు. అనేక కార్మిక సంఘాలు ఆవిర్భవించాయి. భారతీయ కమ్యూనిస్ట్, సోషలిస్ట్ పార్టీలు ఆవిర్భవించి కార్మికుల సమస్యల సాధన కొరకు సమ్మెలలో మద్దతు ఇచ్చారు. 1946లో దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేశారు.

2) దేశంలోని చిన్న, పేద రైతులు ఆందోళన చేయసాగారు. కౌలు వ్యవసాయం చేస్తున్న వారు తమ వాటాని పెంచాలని, తెలంగాణా రైతులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతూ రైతుల రుణాలను మాఫీ చేయాలని, వెట్టిచాకిరిని నిర్మూలించాలని, దున్నే వాడికే భూమి ఇవ్వాలని కోరినారు. రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది. ఉద్యోగస్తులు, వేతనాల పెంపు కొరకు సమ్మెలు చేసారు. ట్రావెన్ కోర్, కాశ్మీరు లాంటి సంస్థానాలలో పెద్ద ఎత్తున సమ్మెలు జరిగినాయి.

10th Class Social Textbook Page No.227

ప్రశ్న 19.
కాంగ్రెస్ కి ఆమోదయోగ్యం కాని ముస్లిం లీగు కోరికలు ఏమిటి ? కాంగ్రెస్ పేర్కొన్న కారణాలతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
1944 లో సి. రాజగోపాలాచారి హిందూ-ముస్లింల మధ్య పరిష్కారం కొరకు ఒక ఫార్ములాను రూపొందించాడు. – అయితే దీనిని కాంగ్రెస్, ముస్లిం లీగులు రెండూ తిరస్కరించాయి.

1945 ‘వావెల్’ పథకంను అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ వావెల్ రాజ్యాంగబద్ధమైన ప్రతిష్ఠంభనను అంతమొందించడానికి ఒక కొత్త పథకం రూపొందించాడు. దాని ప్రకారం “కమాండర్-ఇన్-చీఫ్ విషయంలో తప్ప కార్యనిర్వాహక మండలిని పూర్తిగా భారతీయులకే వదిలి పెట్టాలని, మండలిలో ముస్లింలకు, హిందువులకు సమాన ప్రాతినిధ్యం ఉండాలని ప్రతిపాదించడమైంది.

అయితే, జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్, కార్యనిర్వాహక మండలిలోని ముస్లిం సభ్యులను లీగ్ మాత్రమే ఎన్నుకోవాలని కోరాడు, ఈ పద్ధతిని కాంగ్రెస్ ఆమోదించలేదు. ఇది జిన్నా యొక్క అనుచిత వైఖరి అని, ఇవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయంతో ఏకీభవిస్తాను.

10th Class Social Textbook Page No.227

ప్రశ్న 20.
ప్రజల అభిప్రాయాలను 1946 ఎన్నికలు ఏ విధంగా సూచించాయి? మీ అభిప్రాయాలను పేర్కొనండి.
జవాబు:
1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో రిజర్వు చేసిన 30 స్థానాలనూ, రాష్ట్రంలోని 569 స్థానాలలో 442 స్థానాలనూ ముస్లిం లీగు గెలుచుకుంది. అంటే 1946 చివరినాటికి ముస్లిం ఓటర్లలో ప్రధాన పార్టీగా ముస్లింలీగు ఆవిర్భవించి భారతీయ ముస్లిముల ఏకైక ప్రతినిధి’ ని అన్న తన వాదనను నిజం చేసుకుంది. ముస్లిం ఓట్లలో 86 శాతానికి పైగా ఆ పార్టీకి వచ్చాయి. 1946లో సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91 శాతంతో అఖండ విజయం సాధించింది.

నా అభిప్రాయాలు :

  1. 1946 ఎన్నికల ద్వారా ముస్లిం నియోజక వర్గాలలో వచ్చిన మెజారిటీని చూసినట్లయితే ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ముస్లింలీగ్ అధిక స్థానాలను గెలుచుకుంది.
  2. సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ ముస్లిమేతర ఓట్లలో 91% ఓట్లతో విజయం సాధించింది. దీని మూలంగా కొన్ని ప్రాంతాలలో ముస్లింలకు ఆధిక్యత ఉందని తెలుస్తుంది. లీగు ఏకైక ప్రతినిధి అని తెలుస్తుంది.

10th Class Social Textbook Page No.228

ప్రశ్న 21.
భారతదేశ స్వాతంత్ర్యంపై దినపత్రిక నివేదిక. దీంట్లో ఏ ఏ అంశాలను గుర్తించారు? చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 1
జవాబు:
ఈ క్రింది విషయాలు గమనించాను.

  1. రెండు సార్వ భౌమాధికారం గల దేశాలు ఆవిర్భవించాయి.
  2. బ్రిటతో స్నేహ పూర్వకంగా సంబంధాలు కలిగి ఉంటామని నెహ్రూ, బ్రిటన్ ప్రధాని అట్లికి సమాధానం ఇచ్చారు.
  3. కలకత్తాలోని హిందూ, ముస్లింలు ఆనందంగా ఉన్న సంఘటనలు అని కనిపిస్తుంది.
  4. భారత మొదటి కాబినెట్ జరుపుకొంటున్న ఫంక్షను.
  5. పశ్చిమ బెంగాలకు మొదటి గవర్నర్ గా సి. ఆర్. ప్రమాణ స్వీకారం.
  6. కలకత్తాలో ఎటువంటి అంతరాయాలు, ఇబ్బందులు లేవు.
  7. గాంధీజీ, అంతరాయం లేకుండా మీటింగ్ ను ఆలకిస్తున్నారు.
  8. రాజ్యాంగ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
  9. ప్రక్కన “ఒమెగా” గడియారం ప్రకటన కనిపిస్తుంది – మొదలైన విషయాలు “ది స్టేట్స్మన్” అనే పత్రికలో కనిపిస్తున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

SCERT AP 10th Class Social Study Material Pdf 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Studies 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది వాటిని జతపరచండి. (AS1)
సన్ యెట్-సెన్ దేశాన్ని సైనిక దేశం చేశాడు
చియాంగ్ కై షేక్ పర్యావరణ ఉద్యమం
మావో జెడాంగ్ జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
కెన్ సారో వివా రైతాంగ విప్లవం
జవాబు:
సన్ యెట్-సెన్ – జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
చియాంగ్ కై షేక్ – దేశాన్ని సైనిక దేశం చేసాడు
మావో జెడాంగ్ – రైతాంగ విప్లవం
కెన్ సారో వివా – పర్యావరణ ఉద్యమం

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 2.
దశాబ్దాల కాలంలో చైనాలో మహిళల పాత్రలో వచ్చిన మార్పులను గుర్తించండి. రష్యా, జర్మనీలో సంభవించిన మార్పులకూ, వీటికీ తేడాలు, పోలికలు ఏమిటి? (AS1)
జవాబు:
దశాబ్దాల కాలంలో చైనాలో మహిళల పాత్రలో అనేక మార్పులు సంభవించాయి. ఈ గుయోమిండాంగ్ పార్టీ నాయకుడిగా ఉన్న చియాంగ్ కై షేక్ కాలంలో మహిళల పరిస్థితులు మరీ దారుణంగా ఉండేవి. మహిళలకు తక్కువ వేతనాలు లభించేవి. పనిగంటలు అధికంగా ఉండేవి. చియాంగ్ మహిళల హక్కుల గురించి, సమానత్వం పునాదిపై కుటుంబాలను నిర్మించటం, ప్రేమ వంటి భావనను గూర్చి ఆలోచించడం, చర్చించడం చేసారు. పాతివ్రత్యం, రూపం, మాట, పని అన్న నాలుగు సుగుణాలపై వాళ్ళు శ్రద్ధ పెట్టాలని అతడు భావించాడు. ఆ తదుపరి మావో గ్రామీణ మహిళా సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాడు. విడాకుల విధానాన్ని సరళీకృతం చేస్తూ కొత్త వివాహ చట్టాన్ని చేశాడు.

తేడాలు :

చైనా రష్యా జర్మని
1) కార్మిక సంఘాలలో మహిళలు సంఘటితం అయ్యేవారు. పనిగంటలు ఎక్కువ, దారుణమైన పరిస్థితులు. మహిళా కార్మికులు తరచు తమ తోటి పురుష కార్మికులకు స్ఫూర్తిని ఇచ్చేవారు. మహిళలకు ప్రాధాన్యం లేదు.
2) మహిళల పాత్ర ఇంటికే పరిమితమై ఉండేది. మహిళా దినోత్సవం వంటి సందర్భాలలో ఉత్సవాలు నిర్వహించి, పురుషులకు ఎర్ర మెడ పట్టీలను బహుమతిగా ఇస్తుండేవారు. పురుషుల ప్రపంచంలో మహిళలకు ప్రాధాన్యత లేదు.
3) గ్రామీణ మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. ఉద్యమాలకు ముందుండేవారు. పురుషుల రంగాల్లో మహిళలు జోక్యం చేసుకోకూడదు. మహిళ ఇచ్చే ప్రతీ సంతానం యుద్ధం కోసమే అన్నట్లు ఉండేది.

పోలికలు:

చైనా రష్యా జర్మని
1) చైనాలో అణగదొక్కబడిన మహిళలకు ప్రాధాన్యమిచ్చారు. మహిళలలో వచ్చిన మార్పువల్ల ప్రాధాన్యం పొందారు. రెండో ప్రపంచయుద్ధం తరువాత మహిళలలో చాలా మార్పు కనబడింది.
2) మహిళా సంఘాలుగా ఏర్పడి అభివృద్ధి పథంలో నడిచారు. టెలిఫోన్ భవనం వంటి కర్మాగారాలలో ఉద్యమాల ద్వారా అభివృద్ధి సాధించారు. ఒక జాతిని కాపాడటంలో అన్నిటికంటే స్థిరమైన అంశం మహిళలేనని తెలుసుకుని అభివృద్ధి సాధించారు.
3) పాలకులు ప్రోత్సహించారు. ఫిబ్రవరి విప్లవం ద్వారా మార్పు కనబడింది. నాజీ పార్టీ ప్రోత్సహించింది.

ప్రశ్న 3.
రాచరిక పాలనను పడదోసిన తరువాత చైనాలో రెండు రకాల పాలనలు ఏర్పడ్డాయి. వీటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
రాచరిక పాలనను ప్రజలు తిరస్కరించారు. పాలనాధికారులు, ప్రజలు రాచరిక పాలనపై అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో, అస్తవ్యస్థమైన చైనాలో రెండు రకాల పాలనలు ఏర్పడ్డాయి. వీటి మధ్య పోలికలు, తేడాలు ఉన్నాయి. వీటిలో ఒకటి సయెట్-సెన్ ఆధ్వర్యంలో గల గణతంత్ర రాజ్యం , రెండవది నూతన ప్రజాస్వామ్యం చైనా కమ్యూనిస్టు పార్టీ.

పోలికలు:

గణతంత్ర రాజ్యం చైనా కమ్యూనిస్టు పార్టీ
1) సయెట్-సెన్ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు అమలు. 1) మావో జెడాంగ్ ఆధ్వర్యంలో చైనాలో అనేక విప్లవాత్మక చర్యలు అమలు.
2) మహిళలకు రక్షణ నిచ్చి, ప్రాధాన్యతనందించారు. పురుషులతో పాటు సమాన హోదా. 2) మహిళలకు రక్షణ నిచ్చి, హక్కులపై అవగాహన కల్పించి, అభివృద్ధి పథంలో నడిపించారు.
3) భూమిలేని రైతాంగానికి భూమిని పంచి, భూసంస్కరణలు, సమర్థంగా అమలుచేసారు. 3) భూస్వాముల భూములను జపు చేసి, పేదలకు పంచి, భూసంస్కరణలు వినూత్న రీతిలో అమలుచేశారు.

తేడాలు :

గణతంత్ర రాజ్యం చైనా కమ్యూనిస్టు పార్టీ
1) సామ్యవాదం, జాతీయతావాదం, ప్రజాస్వామ్యం పునాదిగా ఏర్పాటు. 1) భూస్వామ్య విధానం, సామ్రాజ్యవాదం వ్యతిరేకతతో ఏర్పాటు.
2) ప్రజలు కలిసి పనిచేసే సహజాత అలవాటు పెంపొందించుకోవాలని ఆశించారు. 2) శ్రామికవర్గం ద్వారా విప్లవం వస్తుందని భావించారు.
3) పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు విస్తరించారు. 3) రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాపింపచేయటానికి వయోజన రైతాంగ పాఠశాలలు ఏర్పరచారు.
4) సామాజిక మూలాలు పట్టణాలలో ఉన్నాయి. 4) సామాజికాభివృద్ధి ఛాయలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి.
5) సైనిక దేశాన్ని నిర్మించారు. 5) స్వతంత్రంగా ఉండే ప్రభుత్వం, సైన్యాలను ఏర్పరచారు.

ప్రశ్న 4.
ఈ అధ్యాయంలో చర్చించిన దేశాలన్నీ ప్రధానంగా వ్యవసాయం పైన ఆధారపడినవే. అందులోని పద్ధతులు మార్చటానికి , – ఈ దేశాలలో ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి? (AS1)
జవాబు:
చైనా దేశంలో సయెట్-సెన్ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశాడు. రైతాంగాన్ని పట్టించుకోలేదు. దీనివల్ల నేలలు నిస్సారం కావడం, అడవులను నరికివెయ్యటం, వరదల వలన జీవావరణం దెబ్బతినడం వంటివి జరిగాయి. ఆ తదుపరి మావో జెడాంగ్ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ, రైతాంగాన్ని సంఘటితం చేస్తూ రైతాంగ సైన్యాన్ని నిర్మించాడు. భూసంస్కరణలు అమలుచేసి, “పనిబృందాలు” ఏర్పరచి వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించాడు.

అదే విధంగా వియత్నాంలో ఫ్రెంచివారి పాలనలో ఈ దేశాన్ని వరిని ఎగుమతి చేసే దేశంగా చేయడానికి గాను, సాగునీటి సదుపాయాల్ని మెరుగుపరచి, వరి, రబ్బరు వంటి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కి సహకరించారు. నీటి పారుదల వసతులు వ్యవసాయానికి అందించి, అంతర్జాతీయ మార్కెట్లో వరి ఉత్పత్తి ఎగుమతిని పెంచారు. ఈ పద్దతుల వలన వియత్నాం ప్రపంచంలో 3వ అతి పెద్ద బియ్యం ఎగుమతిదారుగా మారింది.

అదే విధంగా నైజీరియాలో కూడా బానిసల వ్యాపారాన్ని నిషేధించిన పిదప, వ్యవసాయరంగానికి ప్రాధాన్యమిచ్చి, ఉత్పత్తులు పెంచడానికి కృషి చేసి అనేక పద్ధతుల ద్వారా “కోకో”, “పామాయిల్” వంటి వ్యవసాయ పంటలకు ప్రాధాన్యత ఇచ్చారు.

చమురు నిల్వల కోసం తవ్వకాల వలన పర్యావరణ జీవావరణం పాడైపోతుందని, కెన్ సారో వివా వంటివారు పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 5.
పైన చర్చించిన దేశాలలో పరిశ్రమలు ఎవరి అధీనంలో ఉన్నాయి? ఈ పద్ధతులను మార్చటానికి ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి? పోల్చటానికి ఒక పట్టికను తయారు చేయండి. (AS1)
జవాబు:
పరిశ్రమల మూలాలు ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో ఉండేవి. పారిశ్రామిక ప్రగతి పరిమితం గానూ, నిదానం గానూ ఉంది. ఆధునిక ప్రగతికి కేంద్రాలుగా మారిన షాంఘై వంటి నగరాలలో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది. ఈ పరిశ్రమలన్నీ శ్రామిక వర్గం ఆధీనంలో నడిచి, అభివృద్ధికి బాటలు వేశాయి. వీరిలో అధిక శాతం “మధ్యతరగతి పట్టణవాసులు”. వీరిలో వ్యాపారస్తులు, దుకాణదారులు ఉండేవారు.

చియాంగ్ కాలంలో ఫ్యాక్టరీ యజమానులను ప్రోత్సహించడానికి, కార్మిక సంఘాలను అణిచివెయ్యడానికి కూడా పూనుకున్నాడు.

వియత్నాంలో పండించిన పంటలు, వాణిజ్య సరుకుల రవాణా కోసం, పారిశ్రామిక ప్రగతి కల్పించడానికి గాను రోడ్డు, రైలు మార్గాలను అభివృద్ధి చేశారు.

నైజీరియాలో చమురు ముఖ్యమైన వనరు. చమురును ఎగుమతి చేసి ఆర్ధికంగా లాభపడింది. అయితే జీవావరణ వ్యవస్థపై పెను ప్రభావం చూపింది. దీనివల్ల తాగునీళ్ళు కలుషితమై ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. దీనికిగాను గిరిజన ప్రజలు తిరుగుబాటు చేసి తమకు నష్టపరిహారం కావాలని కెన్ సారో వివా ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.

ప్రశ్న 6.
భారతదేశం, నైజీరియాలలోని జాతీయ ఉద్యమాలను పోల్చండి. భారతదేశంలో ఇది ఎందుకు బలంగా ఉండింది? (AS1)
జవాబు:
భారతదేశ జాతీయ ఉగ్యమాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. 1600 సం|| నుండి బ్రిటిష్ వలస పాలనలో మ్రగ్గిన దేశాన్ని రక్షించడానికి భారతీయుల ప్రతిఘటన, 1857 తిరుగుబాటు, భారతీయ పునరుజ్జీవనం, భారతీయులలో జాతీయ చైతన్యం తదితర భావాలతో అన్ని వర్గాల ప్రజలు ఏకమైనారు. ఆంగ్లేయులు భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టారు. ఆంగ్లభాష ద్వారా భారతీయులు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం వంటి అంశాలకు సంబంధించిన పాశ్చాత్యభావాలను తెలుసుకోగలిగారు. పాశ్చాత్య విద్యనభ్యసించిన ఈ భారతీయుల వల్లనే జాతీయవాద స్ఫూర్తి పెంపొందింది.

పాశ్చాత్య భావాల వల్ల, విలువల వల్ల ప్రభావితులైన ఆనాటి విద్యావంతులయిన భారతీయులు ప్రారంభించిన అనేక ఉద్యమాలలో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం, ఆలీఘడ్ ఉద్యమం ముఖ్యమైనవి. ఈ సంస్కరణ ఉద్యమాలు – భారతదేశానికి మత మౌఢ్యాల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి భారతదేశానికి విముక్తి , కలిగించడానికి ప్రయత్నించాయి. భారతదేశంలో బ్రిటిష్ వారు విభజించు-పాలించు విధానం అమలుచేయడం ద్వారా భారతీయులలో బ్రిటిష్ వారి పట్ల ద్వేషం పెరిగింది. భారతదేశంలో ముడి పదార్థాలు, సుగంధ ద్రవ్యాల కొరకు పలసలను స్థాపించారు.

నైజర్ నదీ వ్యవస్థ కింద వివిధ తెగలు ఉంటున్న వేరువేరు ప్రాంతాలను ఒకటిగా చెయ్యటం ద్వారా బ్రిటిష్ వారు నైజీరియాను ఏర్పరచారు. ఈ దేశంలో ముస్లింలు అధికం. ఈబో, యెరుబా గిరిజన తెగలు ఉండేవి. నైజీరియాలో దేశ సహజ వనరులపై ప్రత్యేకించి చమురుపై ఆధిపత్య వలసలను స్థాపించారు. భారతదేశంలో (కలకత్తా) పశ్చిమబెంగాల్‌లో లాగోస్ వలస పాలనపై వ్యతిరేకతకు, నైజీరియా జాతీయతావాదానికి ఖండాంతర ఆఫ్రికా వాదానికి కేంద్రంగా ఉంది. మన దేశంలో లాగా ఆధునిక విద్యకు, పరిపాలన ఆధునీకరణకు ప్రోత్సాహం లభించింది. నైజీరియాలో కూడా విభజించు, పాలించు విధానం ద్వారా తమ దోపిడీ విధానాన్ని కొనసాగించారు. భారతదేశంలో జాతీయ కాంగ్రెస్, నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీయైన నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (NNDP) ని 1923లో హెర్బెర్ట్ మకాలే స్థాపించాడు. మీరు తీవ్రవాద దాడులకు కూడా మన దేశ అతివాదుల మాదిరిగా మారారు. గాంధీజీలా అక్కడ ఎన్ నంది అజికివె జాతీయ నాయకుడుగా మారారు. భారతదేశంలో లాగా నైజీరియా జాతీయవాదం ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం , వివిధ తెగల మధ్య ఐకమత్యం.

మన దేశానికి 1947లో స్వాతంత్ర్యం రాగా నైజీరియాకు 1963 అక్టోబర్ 1న స్వాతంత్ర్యం లభించింది. భారతదేశంలో జాతీయ ఉద్యమాలు బలంగా ఉండడానికి కారణం ప్రపంచం మెచ్చే మేధావులైన రాజకీయ నాయకులు, ప్రపంచంలోని మేధావులతో సంబంధాలు గలవారు ఉద్యమాలను నడిపించారు. ఉద్యమాలు 3 దశలుగా ఒక ప్రణాళికాబద్ధంగా నడిచాయి. అంతేకాకుండా అహింసా పద్ధతిలో ప్రజాస్వామ్యం, గణతంత్రం, లౌకిక విధానాలు రూపుదిద్దుకున్నాయి.

ప్రశ్న 7.
స్వతంత్ర నైజీరియా దేశం ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? స్వతంత్ర భారతదేశం ఎదుర్కొన్న వాళ్లతో పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
1963 అక్టోబర్ 1న నైజీరియా స్వాతంత్ర్యం పొందింది. దురదృష్టవశాత్తు ప్రస్వామిక న్యాయపూరిత సమతుల్యం సాధించలేకపోవడం వలన అనతి కాలంలోనే నైజీరియాలో పౌరయుద్ధం చెలరేగింది. ఫలితంగా సైనిక పాలన ఏర్పడింది. పౌర, ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చెయ్యటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా విఫలమైనాయి. సైనిక పాలనలో అవినీతి, మానవహక్కుల ఉల్లంఘన కొనసాగాయి. అవినీతి పాలకులకు మద్దతు ఇచ్చే బహుళజాతి చమురు కంపెనీలు, సైనిక ప్రభుత్వాలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. చమురును వెలికితీయడం వలన వాతావరణ, జల కాలుష్యం పెరిగి ఈ దేశ ప్రజల అనేక నిరసనలకు, ఉద్యమాలకు నైజీరియా కారణమైంది.

పోలికలు

స్వతంత్ర భారతదేశం స్వతంత్ర నైజీరియా
1) 1950 నుండి ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా, లౌకిక రాజ్యంగా రూపొందింది. 1) 1999 నుండి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకుంది.
2) హత్యలు, దోపిడీ, దహనాలు యథేచ్ఛగా కొనసాగాయి. 2) సైనికపాలన ఏర్పడి పౌరయుద్ధం కొనసాగింది.
3) స్వాతంత్ర్య సంపాదన అనంతరం మత ఘర్షణలు ఎక్కువయ్యాయి. 3) ఇక్కడ కూడా బై ఫారియన్ వంటి యుద్ధాలు కొనసాగాయి.
4) పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి. 4) ఇక్కడ కూడా చమురు వల్ల సమస్యలు ఎక్కువయ్యాయి.

తేడాలు

స్వతంత్ర భారతదేశం స్వతంత్ర నైజీరియా
1) స్వాతంత్ర్యానంతరం దేశ అభివృద్ధి కొరకు మేధావులు రాజ్యాంగ రచనకు శ్రీకారం చుట్టారు. 1) సైనిక పాలన వలన రాజ్యాంగ రచన జరగలేదు.
2) స్వాతంత్ర్యం సిద్ధింపచేసిన గాంధీజీ లాంటి జాతిపితను పొట్టన పెట్టుకున్నారు. 2) హింసాకాండ జరిగినా జాతీయ నాయకుల మరణాలు లేవు.
3) స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడం వలన విపరీత పరిణామాలు జరిగాయి. 3) స్వదేశీ సంస్థానాలు లేవు.
4) 1947లో స్వాతంత్ర్యం సిద్ధించింది. 4) 1999 నాటికి 50 సం||ల తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించింది.
5) కోటి, 50 లక్షల మంది, హిందూ – ముస్లింలు నిర్వాసితులయ్యారు. 5) ఇంత పెద్ద సంఖ్యలో జరగలేదు.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 8.
భారతదేశం, వియత్నాంల లాగా స్వాతంత్ర్యం కోసం నైజీరియా మరీ అంత కష్టపడాల్సి రాలేదు. దీనికి కొన్ని కారణాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
పాశ్చాత్య విద్య సొందిన కొంతమంది మేధావులైన నైజీరియన్లు ఉమ్మడి నైజీరియా దేశం అన్న భావనను కలిగించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు. నైజీరియా మొదటి రాజకీయ పార్టీ “నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (NNDP) ని మకాలే స్థాపించిన పిదప, (1923లో) అది, 1923, 1928, 1933లో అన్ని స్థానాలను గెలుచుకుని బ్రిటిష్ వారికి పెను సవాళ్ళు విసిరింది. మకాలే బ్రిటిష్ వలస ప్రభుత్వంపై తీవ్రవాద దాడులను కూడా ప్రోత్సహించాడు. ఖండాంతర ఆఫ్రికా వాదం, ఖండాంతర నైజీరియా వాదం జాతీయ ఉద్యమానికి ప్రేరణ అయింది. దీంతో బ్రిటిష్ వారికి కనువిప్పు కలిగింది. 1945 నుండి సమ్మెలు, ఉద్యమాలతో జాతీయవాద కార్మికుల ఆధ్వర్యంలో ముందుకు నడిచారు.

రెండు లక్ష్యాలతో నైజీరియన్లు ఉద్యమాన్ని నడిపించారు. ఒకటి “బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం”. రెండు “వివిధ తెగల మధ్య ఐకమత్యం”. ఈ క్రమంలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

1950 నాటికి నైజీరియాలోని 3 ప్రాంతాలలో 3 ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఉత్తర ప్రాంతంలో “సాంప్రదాయ భావాలతో కూడిన “ఉత్తర ప్రజల కాంగ్రెస్”, తూర్పు ప్రాంతంలో “నైజీరియా కెమరూన్ల జాతీయ సంఘం, పశ్చిమ ప్రాంతంలో యాక్షన్ గ్రూపు. వీటి ద్వారా నైజీరియా మరీ అంత కష్టపడాల్సి రాకుండా స్వాతంత్ర్యం పొందింది.

ప్రశ్న 9.
పైన చర్చించిన దేశాలలోని జాతీయ ఉద్యమాలలో పాఠశాల విద్య పాత్ర ఏమిటి? (AS6)
జవాబు:
జాతీయ ఉద్యమాలలో పాఠశాల విద్య ప్రముఖ పాత్ర వహించింది. చైనాలో సామాజిక, సాంస్కృతిక మార్పులకు సంధానంగా పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం కల్పించారు. భూసంస్కరణలు సమర్థంగా అమలు చెయ్యడానికి, ఆర్ధిక సంస్కరణ కార్యక్రమంలో యువతకు అవగాహన కలిగించేందుకు గాను రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాపింపజేయటానికి గాను పాఠశాల విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. చైనా నవ చైతన్యానికి సాధించిన అద్భుత విజయాలకు చైనా భవిష్యత్తు ప్రగతికి బలమైన పునాదిగా నిలవడానికి అందరికీ పాఠశాల విద్య ప్రముఖపాత్ర వహించిందని మేధావులందరూ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు.

వియత్నాంలో స్థానికులను నాగరికులుగా చెయ్యటానికి విద్య ఒక మార్గంగా భావించారు. విద్యావంతులైన ‘వియత్నామీయుల వలన ఫ్రెంచి పాలకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి, టీచర్లు, దుకాణదారులు, పోలీసులు వంటి ఉద్యోగాలు పొందడానికి ప్రాథమిక విద్య, పాఠశాల విద్య కీలకమని ఆలోచించారు. ఈ విధంగా కొద్దిమంది మాత్రమే పాఠశాల విద్య పూర్తి చేసి అభివృద్ధి సాధించారు. వియత్నాం నుంచి ఫ్రెంచివాళ్ళను తరిమివేయడానికి, ఉన్నతులుగా వియత్నామీయులు మారడానికి గాను ఉన్నత పాఠశాల విద్య కొరకు జపాన్ వెళ్ళేవారు.

వలస పాలనతో దోపిడీకి గురై విభజించు – పాలించు విధానం ద్వారా, అవినీతి, అక్రమాలు ఎదిరించే క్రమంలో నైజీరియాలో ఆధునిక విద్యకు మరీ ముఖ్యంగా పాఠశాల విద్యకు ప్రాధాన్యమిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం వంటి సూత్రాలను పెంపొందించడానికి గాను పాఠశాల విద్య ప్రధాన భూమిక పోషిస్తుందని తలంచి, నైజీరియాలో ఈ విద్యకు ప్రముఖస్థానం కల్పించారు.

ప్రశ్న 10.
ఈ దేశాల స్వాతంత్ర్య పోరాటాలలో పాలకులపై యుద్ధాలు చేశారు. వాటి ప్రభావాన్ని క్లుప్తంగా వివరించండి. (AS1)
జవాబు:
చైనా గణతంత్ర, నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడి అగ్రదేశంగా మారినప్పటికీ, వలస పాలకుల చర్యల వలన , అనేక ఇబ్బందులకు గురైంది. 1937 – 1945 మధ్యకాలంలో చైనాపై జపాన్ దండెత్తి చాలా భూభాగాన్ని ఆక్రమించింది. క్రూర, వలస, సైనిక పాలనను జపాను అమలు చెయ్యటంతో చైనా సమాజం, ఆర్థిక పరిస్థితి దారుణంగా ప్రభావితమయ్యాయి. జపాన్ ఆక్రమణలను ప్రతిఘటించడానికి గుయోమిండాంగ్, సిసిపి చేతులు కలిపాయి.

వియత్నాంలో దేశభక్తి భావంతో సమాజ ప్రయోజనం కోసం పోరాడారు. వియత్నామీయులు తమ స్థానానికి ముప్పు వాటిల్లుతుందని భయపడే ఫ్రెంచి పాలకులతోను, స్థానిక సంపన్నులతోను పోరాడారు.

ఆగ్నేయ ఆసియాపై తన ఆధిపత్యం సాధించాలన్న సామ్రాజ్యవాద కాంక్షలో భాగంగా జపాను 1940లో వియత్నాంను ఆక్రమించింది. దాంతో జాతీయవాదులు ఫ్రెంచి వాళ్ళనే కాకుండా, జపనీయులతో కూడా తలపడవలసి వచ్చింది.

అప్పటికే రెండవ ప్రపంచయుద్ధంలో హిట్లర్ ఫ్రాన్స్ మొత్తాన్ని ఆక్రమించటం వలన ఫ్రెంచివారు బలహీనపడ్డారు. వియత్నాం స్వాతంత్ర్య సమితి జపనీయుల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడి 1946 సెప్టెంబర్ లో హనాయ్ ని తిరిగి స్వాధీనం చేసుకుంది. తదుపరి అమెరికా యుద్ధంలో జోక్యం చేసుకోవడం వల్ల వియత్నామీయులకే కాకుండా, అమెరికాకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.

రెండవ ప్రపంచయుద్ధం తరువాత నైజీరియా ఆర్థిక పరిస్థితి కష్టాలకు లోనవటంతో నైజీరియా ప్రజలు జాతీయతావాదం తీవ్రవాద భావాలకు గురయ్యారు. బ్రిటన్ తరపున పోరాడి సైనికులు, కార్మిక సంఘ నాయకులు నైజీరియా స్వాతంత్ర్యం కొరకు కృషి చేశారు.

10th Class Social Studies 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు 1900-1950 : భాగం-II InText Questions and Answers

10th Class Social Textbook Page No.203

ప్రశ్న 1.
ఆయా దేశాల సాంప్రదాయ పాలకులు స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉంటే ఎటువంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఉండేవి?
జవాబు:
వలసపాలిత దేశాల సాంప్రదాయ పాలకులుగా ఉన్న రాజులు, చక్రవర్తులు స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉంటే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఉండేవి.

10th Class Social Textbook Page No.210

ప్రశ్న 2.
బియ్యం ధరలు పడిపోవటంతో గ్రామీణ ఋణభారం ఎందుకు పెరిగింది?
జవాబు:
1930 ల నాటి ఆర్థికమాంద్యం వియత్నాంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. బియ్యం ధరలు పడిపోయి, గ్రామీణ ఋణభారం పెరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.203

ప్రశ్న 3.
జాతీయతాభావం అంటే ఏమిటో, అది ఎలా రూపుదిద్దుకుందో అర్థం చేసుకోటానికి 9వ తరగతి పాఠ్యపుస్తకాన్ని మరొకసారి చదవండి.
జవాబు:
తమ దేశ సంస్కృతి, చరిత్ర, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూ దేశ ఐక్యతకు పాటుపడడాన్ని జాతీయతాభావం అంటాం. జనాదరణ పొందిన కుటుంబ సంప్రదాయాలు, బానిసత్వాల రద్దు వంటి వాటివల్ల కూడా జాతీయతాభావం పెరిగింది. కళలు, కవిత్వం, కథలు, సంగీతం వంటివి జాతీయతాభావాన్ని మలచటంలో సహాయపడ్డాయి.

10th Class Social Textbook Page No.203

ప్రశ్న 4.
వలసపాలిత ప్రాంతాలలో ఏ సామాజిక వర్గాలు స్వాతంత్ర్యం కోసం పోరాడాయి ? సమానత్వం, ప్రజాస్వామ్యం అన్న భావనలు వాళ్ళకు ఎందుకు ముఖ్యం అయ్యాయి?
జవాబు:
వలసపాలిత ప్రాంతాలలో మధ్యతరగతివారు, కార్మికవర్గం, యువకులు, మహిళలు, మేధావులు, ఆయా దేశాల సాంప్రదాయ పాలకులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు. కొన్ని దేశాలలోని అనుభవాలను, వలసపాలిత ప్రాంతాల లక్షలాది ప్రజల జీవితాలలో మార్పును అర్థం చేసుకోటానికి సమానత్వం, ప్రజాస్వామ్యం అన్న భావనలు వాళ్లకు చాలా ముఖ్యం అయ్యాయి.

10th Class Social Textbook Page No.204

ప్రశ్న 5.
యువ చైనీయులు పాత సాంప్రదాయాలను, విదేశీ శక్తులను ఎందుకు వ్యతిరేకించసాగారు?
జవాబు:
1919 మే 4న యువ చైనీయులు నిరసన ఉద్యమంగా చేపట్టి, పాత సాంప్రదాయాలను తిరస్కరించి, ఆధునిక విజ్ఞానశాస్త్రం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకు వెళ్ళాలని యువత సంకల్పించింది. దేశ వనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమివెయ్యాలని, పేదరికాన్ని తగ్గించి, అసమానతలను తగ్గించాలని, సాధారణ భాష, లిపులను
అనుసరించడం, వివాహాలలో సమానత్వం, పేదరికాన్ని అంతం చేయటం వంటి వాటి కొరకు ఉద్యమించారు.

10th Class Social Textbook Page No.204

ప్రశ్న 6.
ఇటువంటిది ఏమైనా భారతదేశంలో జరిగిందా?
జవాబు:
భారతదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళ దోపిడీ విధానాన్ని నిరంకుశ పాలనకు, భారతీయుల దౌర్భాగ్యస్థితిని దూరం చేయడానికి అతివాదులుగా పేరొంది హింసామార్గంలో పయనించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, మరెందరో యువకులు వీరోచితంగా పోరాడారు. క్విట్ ఇండియా ఉద్యమకాలం (1942) లో గాంధీజీని అరెస్టు చేయగా, యువకులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఏకమై, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేయించి, సహాయనిరాకరణ, విధ్వంసం వంటి అనేక పద్ధతుల ద్వారా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేపట్టారు.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.205

ప్రశ్న 7.
ఈ కాలంలో ఆవిర్భవించిన ముఖ్యమైన రాజకీయ పార్టీలు ఏవి?
జవాబు:
ఈ కాలంలో ఆవిర్భవించిన ముఖ్యమైన రాజకీయ పార్టీలు – “గుయోమిండాంగ్” (జాతీయ ప్రజాపార్టీ, దీనినే కె.ఎం.టి అనే వాళ్ళు) మరియు చైనా కమ్యూనిస్టు పార్టీ (సిసిపి). ఇవి దేశ ఐక్యత, సుస్థిరత సాధన అనే లక్ష్యాలతో ఏర్పడ్డాయి.

10th Class Social Textbook Page No.205

ప్రశ్న 8.
ఇటువంటి సమీకరణల్లో సభ్యులు ఎవరు?
జవాబు:
ఆధునిక ప్రగతికి కేంద్రాలుగా మారిన షాంఘై వంటి నగరాలలో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది. వీరిలో అధికశాతం మధ్యతరగతి పట్టణవాసులు (సియావో షిమిన్) గా పరిగణింపబడే వ్యాపారస్తులు దుకాణదారులు ఉన్నారు.

10th Class Social Textbook Page No.205

ప్రశ్న 9.
వాళ్ళు ఆశించిన సామాజిక, ఆర్థిక మార్పుల స్వరూపం ఏమిటి?
జవాబు:
వాళ్ళు కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా అన్నవి 4 ప్రధాన అవసరాలుగా గుర్తించారు. స్వేచ్చాభావనలు ఆదరణ పొందటంతో మహిళల హక్కుల గురించి, సమానత్వం పునాదిపై కుటుంబాలను నిర్మించటం, ప్రేమ వంటి వాటి గురించి ఆలోచించడం, చర్చించటం మొదలు పెట్టారు. ఫ్యాక్టరీ యజమానులకు ప్రోత్సాహకంగా కార్మిక సంఘాలను అణగదొక్కారు. పెట్టుబడిని నియంత్రించి, భూమి సమాన పంపిణీకి ప్రాధాన్యం ఇచ్చారు.

10th Class Social Textbook Page No.207

ప్రశ్న 10.
దేశ అభివృద్ధికి, స్వాతంత్ర్యానికి స్త్రీ, పురుషులకు, సమాన అవకాశాలు, వాళ్ల సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
దేశ అభివృద్ధికి, స్వాతంత్ర్యానికి స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు, వాళ్ళ సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో నేను అంగీకరిస్తాను. ప్రస్తుతం, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురుషులతో పాటు స్త్రీలు ప్రధానభూమిక పోషిస్తున్నారు.

దేశ అభివృద్ధిలో స్త్రీలు తమ మేధాశక్తి, యుక్తులతో అపూర్వ సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ దృక్పథంతో నేను ఏకీభవిస్తున్నాను.

10th Class Social Textbook Page No.209

ప్రశ్న 11.
భూమి లేని రైతాంగానికీ, భూమి లేని కార్మికునికీ మధ్య తేడా ఏమిటి?
జవాబు:
కొంతమంది రైతులు తమకు భూమి లేకపోయినా, భూస్వాముల నుంచి భూమి తీసుకొని కౌలు చేసేవారు. వాస్తవానికి భూమి వాళ్ళది కాదు. దీనివలన వారు కౌలు చెల్లించడమే కాకుండా, భూస్వాముల ఇళ్ళల్లోనూ, పొలాల్లోనూ పనిచేసి దుర్భర జీవనం గడిపేవారు.
అదే విధంగా కార్మికులు, యంత్రాలలో వివిధ పరిశ్రమలలో, శ్రమ ద్వారా జీవనం సాగిస్తుంటారు. వాస్తవంగా వాళ్ళ ఆధీనంలో భూమి ఉండదు. వ్యవసాయానికి సంబంధించి అవగాహన తక్కువ.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.210

ప్రశ్న 12.
స్వతంత్ర వియత్నాం ప్రభుత్వం తీసుకున్న మొదటి చర్యలలో భూమి కౌలు తగ్గించటం ఒకటి. ఈ చర్య ఎందుకు చేపట్టారు?
జవాబు:
గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్యం పెరిగి పెద్ద పెద్ద భూస్వాములు చిన్న రైతుల భూములను చేజిక్కించుకుని వారితో కౌలు రైతులుగా పనిచేయించుకునే వాళ్ళు. ఫలితంగా రైతాంగ జీవన ప్రమాణం పడిపోయింది. కౌలు రైతులు అప్పుల విషవలయంలో చిక్కుకుపోయి బయటపడలేకపోయేవారు. అన్నాం అనే ప్రాంతంలో సుమారు 53% కుటుంబాలకు అసలు ఏమాత్రం భూమి లేదు. ఈ కారణాలతో వియత్నాం ప్రభుత్వంవారు అధికంగా ఉన్న కౌలు భూములు మిగతావారికి పంచడానికి కృషి చేశారు. వారి దుర్భర జీవితాలను దూరం చేయ్యడానికి గాను భూమి కౌలు తగ్గించారు.

10th Class Social Textbook Page No.211

ప్రశ్న 13.
ఇటువంటి భూసంస్కరణలు వియత్నాం సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపి ఉంటాయి ? గ్రామీణ ప్రాంతాలలోని వివిధ సామాజిక వర్గాల దృష్ట్యా దీనిని చర్చించండి.
జవాబు:
ఇటువంటి భూసంస్కరణల వలన భూస్వాముల చేతుల్లో ఉన్న వేల ఎకరాలను సేకరించి, పేద, మధ్యతరగతి రైతాంగానికి పునఃపంపిణీ చేయడం జరిగింది. రైతాంగ సంఘాలు ఏర్పడి, గ్రామీణ ప్రాంతాలలో వారు నాయకులుగా మారి మంచి – పాలన అందించడానికి ప్రయత్నం చేశారు. వెట్టిచాకిరి, వెట్టి కార్మికులు పోయి, అప్పుల బాధ తొలగి రైతాంగం ఆనందకర జీవనం కొనసాగించారు. ఏమాత్రం అసలు భూమి లేని 79% ప్రజలు ఈ సంస్కరణల వలన లబ్ధి పొందారు.

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 14.
అమెరికా అంతటి బలమైన దేశాన్ని వియత్నాం వంటి చిన్నదేశం ఎలా ఎదిరించగలిగింది?
జవాబు:
ప్రతిఘటనకి, ఇల్లు, కుటుంబాలను త్యాగం చెయ్యటానికి, దారుణ పరిస్థితులలో జీవించటానికి, స్వాతంత్ర్యం కోసం పోరాడడానికి వీలుగా ప్రజలకు జాతీయతాభావం ఇచ్చిన ప్రేరణ వల్లే అమెరికాను వియత్నాం ఢీకొంది. భూస్వాముల చేతులలో తరాలపాటు దోపిడీకి గురయి, అప్పుడే కొంత భూమిని పొందిన లక్షలాది పేద రైతాంగం నిబద్ధతతో అమెరికాను , ఎదిరించింది. జాతీయతాభావంతో ప్రేరణ భూసంస్కరణలతో ఉత్సాహం పొందిన ఈ పేద రైతాంగం ప్రపంచంలో కెల్లా – మేటి సైన్యాన్ని ఓడించడంలో కీలకపాత్ర పోషించింది.

10th Class Social Textbook Page No.217

ప్రశ్న 15.
నైజీరియాలోని చమురు వనరులలో అధికభాగం ఆగ్నేయ భాగంలో ఉన్నాయి. చమురు లాభాలలోని అధిక భాగం తమకు చెందాలని ఈ బూలు భావిస్తారు. చమురు సంపదతో ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యటాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్యకు సరైన, న్యాయపూరితమైన పరిష్కారం ఏమిటి?
జవాబు:
నైజీరియాలోని చమురు నిల్వలలో అధిక వనరులు ఈబూలకే చెందాలి. ఎందుకంటే ఇక్కడ ఈ తెగవారే అధికులు. మరియు వెనుకబడిన అవిద్యావంతులు, నిరుద్యోగులు, ఉత్తర ప్రాంతంలో ఇంతకు ముందే ముస్లింలు అధికంగా ఉండి, ఉపాధి అవకాశాలు కలిగి ఉన్నారు. కాబట్టి అధికభాగం చమురు లాభాలు ఈబూలకే చెందాలి.

10th Class Social Textbook Page No.202

ప్రశ్న 16.
క్రింది పటాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP Board 10tha Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు 1
1) బ్రిటన్‌కి చెందిన వలసలలో ఆసియాలో ఒక ప్రాంతాన్ని, ఆఫ్రికాలో మరొక ప్రాంతాన్ని గుర్తించండి.
జవాబు:
భారతదేశం, దక్షిణాఫ్రికా

2) హాలెండ్ కి చెందిన ఒక ఆసియా, ఒక ఆఫ్రికా వలస ప్రాంతాన్ని గుర్తించండి.
జవాబు:
ఇండోనేషియా, పశ్చిమ సహారా

3) ఫ్రాన్స్ కి చెందిన ఒక ఆసియా, ఒక ఆఫ్రికా వలస ప్రాంతాన్ని గుర్తించండి.
జవాబు:
కాంబోడియా, మొరాకో.

4) ఏ దేశానికి వలసపాలిత ప్రాంతంగా లేని ఆసియాలో రెండు దేశాలను, ఆఫ్రికాలో ఒక దేశాన్ని గుర్తించండి.
జవాబు:
చైనా, రష్యా, ఇథియోపియా

5) ఆస్ట్రేలియా ఏ దేశానికి వలసపాలిత ప్రాంతంగా ఉంది?
జవాబు:
ఇంగ్లాండ్

10th Class Social Textbook Page No.207

ప్రశ్న 17.
యుద్ధంలో గెలవటానికి సిసిపికి భూసంస్కరణలు ఎలా దోహదపడ్డాయి?
జవాబు:
విదేశీ సామ్రాజ్యవాదంపై పోరాడటానికి, భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకొని పునఃపంపిణీ చెయ్యటం ద్వారా బలమైన రైతాంగ సంఘాలను సిసిపి నిర్మించింది. గ్రామాలలో ఉంటున్న అందరి వర్గాలను గుర్తించడం, తరువాత భూస్వాముల భూమి, ఇతర ఉత్పాదక ఆస్తులను స్వాధీనం చేసుకుని తిరిగి పంచటం వంటివి దీంట్లో ముఖ్యమైన దశలు. దీనికై “భూసంస్కరణల సంఘాన్ని ఏర్పరచారు. దీని ద్వారా స్థానిక నాయకత్వ స్థానాలకు వాటి నుంచి క్రియాశీలక సభ్యులను ఎంపిక చెయ్యటం వాటి ముఖ్య విధుల్లో భాగంగా ఉండేవి. ఇది ప్రధానంగా పేద, మధ్య తరగతి రైతాంగం నుంచి ఏర్పడింది. ఈ విధంగా భూసంస్కరణల కారణంగా అత్యధికుల మన్ననలు పొందడంతో, యుద్ధంలో గెలవటానికి అవకాశం ఏర్పడింది.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.207

ప్రశ్న 18.
భారతదేశంలో అమలు అయిన భూసంస్కరణలను చైనాలో జరిగిన వాటితో పోల్చండి. వాటి మధ్య పోలికలు, తేడాలను పేర్కొనండి.
జవాబు:
భారతదేశంలో అమలు జరిగిన భూసంస్కరణలు లోపభూయిష్టంగా ఉండేవి. జమీందారుల ఆధీనంలో సాగుచేస్తున్న కౌలుదారులను ప్రభుత్వం భూయజమానులుగా గుర్తించింది. కానీ జమీందారులకు పెద్ద మొత్తంలో వెల చెల్లించాల్సి ఉన్నందున దానిని వారు కట్టలేక వారు కౌలుదారులుగా, వ్యవసాయ కూలీలుగానే ఉండిపోయారు. చైనాలో అలా కాకుండా భూస్వాముల భూమి నంతటినీ స్వాధీనం చేసుకొని పునఃపంపిణీ చేశారు.

భారతదేశంలో జమీందారుల ఆధీనంలో ఉన్న మిగులు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అందువలన చాలామంది జమీందారులు తమ బంధువులు, దూరపు బంధువుల పేరున రాయించుకున్నారు. అటవీ, బంజరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిసి, అటవీ భూములలో గల చెట్లు నరికి, అమ్మి అధికాదాయం జమీందారులు పొందగలిగారు.

చైనాలో అలా కాకుండా పేద, మధ్యతరగతి ప్రజలనే భూసంస్కరణ సంఘాలు ఏర్పరచి, వారినే నాయకులుగా గుర్తించి, ‘పని బృందాలు’ ఏర్పరచి, “రైతాంగ సంఘాల” నిర్మాణం ద్వారా ప్రణాళికా బద్ధంగా భూసంస్కరణలు అమలుచేసి ఆ దేశం అద్భుత విజయాలకు నిలయమైంది.

10th Class Social Textbook Page No.209

ప్రశ్న 19.
వియత్నాంలో రైలు మార్గాలను, కాలవలను ఫ్రెంచివాళ్ళు ఎందుకు అభివృద్ధి చేశారు?
జవాబు:
వియత్నాంని వరిని ఎగుమతి చేసే దేశంగా అభివృద్ధి చెయ్యాలని ఫ్రెంచి చాలా ఆసక్తి చూపించింది. ఇందులకై సాగునీటి సదుపాయాల్ని మెరుగుపరచాలని, మెకాంగ్ డెల్టా ప్రాంతంలో సాగు విస్తీర్ణాన్ని పెంచటానికి ఫ్రెంచివాళ్ళు బీడు భూముల నుంచి నీటిని తోడి కాలువల నిర్మాణం చేపట్టారు. తద్వారా వరి ఉత్పత్తి అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతి చెయ్యడం సాధ్యమైంది.

అదే విధంగా 1931 నాటికి వియత్నాం ప్రపంచంలో మూడవ అతి పెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఎదిగింది. దీనితోపాటు వాణిజ్య సరుకుల రవాణా కోసం, సైనిక కేంద్రాలను తరలించటానికి, మొత్తం ప్రాంతాన్ని తమ అదుపులో పెట్టుకోడానికి గాను మౌలిక సదుపాయాలు అనగా రోడ్డు, రైలుమార్గాలను అభివృద్ధి చేశారు.

10th Class Social Textbook Page No.209

ప్రశ్న 20.
బ్రిటిష్ పాలనలోని భారతదేశ రైతాంగ పరిస్థితి గురించి మీరు చదివారు. వియత్నాం రైతాంగ స్థితికీ, దీనికీ పోలికలు ఏమిటి?
జవాబు:
బ్రిటిష్ పాలనలోని భారతదేశ రైతాంగ పరిస్థితి దారుణంగా ఉండేది. వియత్నాంలో కూడా రైతాంగ స్థితిలో అటువంటి ‘ దుర్భర పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి వీటి మధ్య పోలికలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

పోలికలు: భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో భూస్వాములు, జమీందారులు సన్నకారు రైతుల భూములను చేజిక్కించుకొనడం, లేదా నామమాత్రం భూములు ఇచ్చి, దానికి అధికంగా శిస్తులు విధించడంతో వాటిని ఆ చిన్న రైతులు కట్టలేక, పంట ఫలాలు అందక దుర్భర పరిస్థితులు అనుభవించారు.

వియత్నాంలో కూడా పెద్ద భూస్వాములు చిన్న రైతుల భూములను చేజిక్కించుకుని కౌలు రైతులుగా మార్చి జీవనం దిగజార్చారు.

భారతదేశంలో బలవంతపు వ్యవసాయం బ్రిటిష్ వాళ్ళు అమలుచేశారు. ఆహారపంటలకు బదులు వాణిజ్య పంటలు వేసి ఇబ్బందులకు గురి చేయించారు. వియత్నాంలో కూడా బలవంతంగా వరి, రబ్బరు వంటి పంటలను తమ స్వలాభం కోసం వేయించారు.

భారతదేశంలో వ్యవసాయం చేయలేక, అప్పులకు వడ్డీ చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొందరు వెట్టి కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా మారారు, వియత్నాం రైతుల్లో కూడా వ్యవసాయం చేయలేక చనిపోయినవారు, నలిగిపోయినవారు, తిండి లేక అలమటించినవారున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.209

ప్రశ్న 21.
భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విధానాన్ని గుర్తుచేసుకోడానికి ప్రయత్నించండి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు, వియత్నాంలో ఫ్రెంచివాళ్ళు అనుసరించిన వలసపాలన విధానాలను పోల్చండి. వాటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
భారతదేశంలో బ్రిటిష్ వారు, వియత్నాంలో ఫ్రెంచివారు అనుసరించిన వలసపాలనలో పోలికలు తేడాలు ఉన్నాయి. ముందుగా పోలికలు చూద్దాం.

పోలికలు:

బ్రిటిష్ వారు (భారత్) ఫ్రెంచివారు (వియత్నాం)
1) వీరు భారతదేశ రాజులను, చక్రవర్తులను కీలు బొమ్మలుగా మార్చి వ్యాపార రీత్యా వచ్చి స్థిరపడ్డారు. 1) వీరు కూడా వియత్నాం చక్రవర్తిని లోబరుచుకొని తమ దోపిడీ విధానాన్ని అనుసరించారు.
2) భారత్ లో రోడ్డు, రైలు, జల మార్గాలను తమ ఉత్పత్తుల మార్కెట్ కొరకు, వాణిజ్య పంటలకు ఎగుమతుల కొరకు అభివృద్ధి చేశారు. 2) ఫ్రెంచివారు కూడా వరి, రబ్బరు ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేసి ధనాన్ని కూడబెట్టాలని ఆశించారు.
3) వీరు విభజించు – పాలించు విధానం అమలుచేశారు. 3) ఫ్రెంచివారు కూడా ఈ విధానాన్నే అనుసరించారు.
4) ఇక్కడ భూస్వాములు, చిన్న రైతుల భూములను ఆక్రమించి వారిని వ్యవసాయ కూలీలుగా మార్చారు. 4) వియత్నాంలో కూడా ఫ్రెంచివారు రైతుల భూములను ఆక్రమించి వారిని పెట్టి కార్మికులుగా మార్చారు.
5) భారతీయులు అనాగరికులని వీరు భావించారు. మూఢనమ్మకాలు, సంప్రదాయ పద్ధతులకు దూరంగా ఉంచడానికి ప్రయత్నించారు. 5) ఫ్రెంచివారు కూడా వియత్నాం వాసులకు అనాగరికులుగా భావించి, ఆధునిక నాగరికత ఫలాలు అందించడానికి కృషి చేశారు.

తేడాలు :

బ్రిటిష్ వారు (భారత్) ఫ్రెంచివారు (వియత్నాం)
1) సుదీర్ఘకాలం దోపిడీకి గురైంది. 1) ఎక్కువకాలం కొనసాగలేదు.
2) అనేక రాజకీయ, సంస్కరణ ఉద్యమాలు, అనేక సమాజాలు, సంస్థలు ఏర్పడి బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాయి. 2) ఇన్ని సంస్థలు, ఇంత స్థాయిలో జరగలేదు.
3) మహిళలు, యువకులు, విద్యావంతులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రిటిష్ వారిని ఎదిరించారు. 3) మహిళల పాత్ర తక్కువ.
4) ఒక ప్రణాళికాబద్ధంగా 30 దశలుగా ఉద్యమాన్ని నడిపించారు. 4) ఫ్రెంచ్లో అలా జరగలేదు.
5) ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఆంగ్ల విద్యను అభ్యసించారు. 5) ఇక్కడ సంపన్న వియత్నామీయుల పిల్లలే ఫ్రెంచి బడిలో చదివారు.

10th Class Social Textbook Page No.210

ప్రశ్న 22.
వియత్నాం, చైనాలలో జాతీయతావాదం ఏర్పడటంతో యువత, విద్యార్థులు ముఖ్యపాత్ర పోషించారు. వీటి మధ్య పోలికలు, తేడాలను చర్చించండి.
జవాబు:
చైనా యువత, విద్యార్థులు :
చైనాలో యువత 1919 మే 4న వర్సయిల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బ్రిటన్, పక్షాన చైనా ఉన్నప్పటికి జపాన్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు చైనాకు రాలేదు.

పాత సంప్రదాయాలను తిరస్కరించి, ఆధునిక విజ్ఞానం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకు వెళ్ళాలని, దేశ వనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమెయ్యాలని, పేదరికాన్ని తగ్గించి, అసమానతలను తగ్గించాలని యువత కోరుకుంది. సాధారణ భాష, లిపిలను అనుసరించడం, మహిళలపై ఉన్న దురాచారాలను దూరం చెయ్యాలని యువత, విద్యార్థులు సంకల్పించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు విస్తరించడంతో సామాజిక సాంస్కృతిక మార్పులకు ఊతం ఇచ్చింది.

వియత్నాం విద్యార్థులు, యువత :

కార్యాలయాలలో ఉద్యోగాలకు వియత్నామీయులను అనర్హుల్ని చేసేలా ఉన్న వలస ప్రభుత్వ ప్రయత్నాలను విద్యార్థులు ప్రతిఘటించసాగారు. “దేశభక్తి భావంతో సమాజ ప్రయోజనం కోసం పోరాడటం విద్యావంతుల విధి” అన్న నమ్మకంతో వారు ప్రేరణ పొందారు. కనుకనే వారు సంపన్నులతోను, ఫ్రెంచి పాలకులతోను ఘర్షణ పడ్డారు. 1920 ల నాటికి విద్యార్థులు “యువ అన్నాం” పార్టీ వంటి రాజకీయ పార్టీలను ఏర్పాటుచేసి, “అన్నామీస్ స్టూడెంట్” వంటి పత్రికలను ప్రచురించారు. వియత్నాం దేశంలో యువత, విద్యార్థుల ప్రధాన ఉద్దేశం- “వియత్నాం నుండి ఫ్రెంచి వాళ్ళను తరిమివెయ్యడం”. కీలుబొమ్మ చక్రవర్తిని తొలగించి, అంతకుముందు ఫ్రెంచివాళ్ళు పడదోసిన “ఎ గుయెన్” వంశాన్ని తిరిగి అధికారంలోనికి తీసుకురావడం.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.211

ప్రశ్న 23.
చైనా, వియత్నాం , భారతదేశాలలోని భూసంస్కరణల తీరును పోల్చండి.
జవాబు:
1) చైనాలో భూసంస్కరణలు :
చైనాలోని భూసంస్కరణలలో ప్రధానాంశం ఏమనగా …….. గ్రామాలలోని ప్రజలందరి వర్గాలను ముందుగా గుర్తించటం, మరియు భూస్వాముల యొక్క భూమి, ఇతర ఆస్తులను జప్తు చేయుట ద్వారా కాని మరే విధంగానైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి వాటిని ప్రజలకు పంచటం అనేది ముఖ్యమైనది.

2) వియత్నాంలో భూసంస్కరణలు :
భూమి కౌలును 25 శాతానికి తగ్గించారు. భూమిని తిరిగి మళ్లీ (మారు) కౌలుకు ఇవ్వటాన్ని నిషేధించారు. 1945 ఆగష్టు నాటికి ఉన్న కౌలుదార్లు కౌలు బకాయిలన్నింటిని మాఫీ చేశారు. మరియు కౌలుదార్లు భూ యజమానులు అయ్యారు.

3) భారతదేశంలో భూసంస్కరణలు :
చైనా, వియత్నాంలలో అమలైనటువంటి భూసంస్కరణలేవి భారతదేశములో అమలు జరగలేదు. భూ ఒడంబడిక విధానంలో కొన్ని మార్పులు మాత్రమే జరిగాయి.

10th Class Social Textbook Page No.213

ప్రశ్న 24.
పౌరులపైన, అడవుల మీద నాపాలం, ఏజెంట్ ఆరెంజ్ వంటి రసాయనిక ఆయుధాలను అమెరికా ఉపయోగించటం సరైనదేనా?
జవాబు:
పౌరులపైన, అడవుల మీద నాపాలం, ఏజెంట్ ఆరెంజ్ వంటి రసాయనిక ఆయుధాలను అమెరికా ఉపయోగించడం అమెరికా వంటి అగ్రదేశాలకు తగదు. కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతుందన్న ఆందోళనతో అమెరికా ప్రవర్తించిన తీరు దారుణమైంది. అత్యంత శక్తిమంతమైన వైమానిక బాంబర్లు అయిన బి52 విమానం రసాయనిక ఆయుధాల వినియోగంతో – నాపాలం (మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబు), ఏజెంట్ ఆరెంజ్ (చెట్లు, మొక్కలను చంపేసి భూమిని చాలా సం॥లు బీడుగా మార్చివేశాయి), భాస్వరం బాంబులతో అనేక గ్రామాలు ధ్వంసమయ్యాయి. అడవులు నాశనమైనాయి. వేల సంఖ్యలో పౌరులు చనిపోయారు. మానవాళి మనుగడకు తీవ్ర విపత్తులు సంభవించే విధంగా ఉన్నా అమెరికా దుశ్చర్యను ప్రపంచం యావత్తు విమర్శించింది. అమెరికా చర్యలను ఎండగట్టింది.

10th Class Social Textbook Page No.213

ప్రశ్న 25.
వియత్నాం నుంచి అమెరికా ప్రభుత్వం విరమించుకోవటంలో ఆ దేశంలోని శాంతి ఉద్యమం పాత్ర ఏమిటి?
జవాబు:
వియత్నాం నుంచి అమెరికా ప్రభుత్వం విరమించుకోవటంలో ఆ దేశంలోని శాంతి ఉద్యమం ప్రముఖ పాత్ర వహించింది. యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోవడం వల్ల వియత్నామీయులకే కాకుండా అమెరికాకు కూడా చాలా భారంగా పరిణమించింది. తనకు సంబంధం లేని యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకున్నందుకు ప్రభుత్వాన్ని విమర్శించారు. యుద్ధం కోసం యువతను సైన్యంలోకి తీసుకురావడంతో అక్కడ వ్యతిరేకత ఇంకా పెరిగింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగడంతో అమెరికాలో దాని పట్ల బలమైన నిరసనలు వెల్లువెత్తసాగాయి. ప్రభుత్వ విధానాన్ని సర్వత్రా ప్రశ్నించటంతో అంతిమంగా యుద్ధ ముగింపు సంప్రదింపులు చేపట్టేలా చేసింది.

10th Class Social Textbook Page No.215

ప్రశ్న 26.
జాతీయతావాదానికీ, ఖండాంతర ఆఫ్రికా భావానికి మధ్య తేడాలు ఏమిటో చర్చించండి. జాతీయతావాదం అన్నది పరిమితమైన భావమా?
జవాబు:
తమ దేశ సంస్కృతి, చరిత్ర, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూ దేశ ఐక్యతకు పాటుపడడాన్ని “జాతీయతావాదం” అంటారు.

దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చెయ్యటానికి ఖండాంతర ఆఫ్రికా వాదం ప్రయత్నిస్తుంది.

ఆఫ్రికా భావం ముందు జాతీయతావాదం అన్నది పరిమితమైన భావం. ఎందుకంటే ఐకమత్యంతో వలసపాలనను, జాతి వివక్షతను వ్యతిరేకించటమే కాకుండా సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం అన్న సూత్రాల ఆధారంగా ఆఫ్రికా ఖండంలోని అన్ని తెగలు, ప్రజల సమూహాల మధ్య ఐకమత్యం సాధించటానికి ఆఫ్రికా భావం ప్రయత్నిస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.215

ప్రశ్న 27.
ఒక శతాబ్దకాల వలసపాలన వల్ల ప్రాంతాల మధ్య అసమానతలు నెలకొన్నాయి. భారతదేశంలో కూడా బ్రిటిష్ పాలనలో కోస్తా ప్రాంతాలైన బెంగాలు, మద్రాసు, బొంబాయి వంటివి వేగంగా అభివృద్ధి చెందాయి. అభివృద్ధిలో ఇలా అసమానతలు ఎందుకు చోటు చేసుకుంటాయి?
జవాబు:
శతాబ్ద కాల వలసపాలన వల్ల ప్రాంతాల మధ్య అసమానతలు నెలకొన్నాయి. ఎందుకంటే వలస పాలకులు తమ వ్యాపార అభివృద్ధికి, తమ దోపిడీ విధానాన్ని కొనసాగించడానికి తగ్గట్లు పాలించారు. భారతదేశంలో కూడా బెంగాలు, మద్రాసు, బొంబాయి వంటివి వేగంగా అభివృద్ధి చెందాయి. ఎందుకంటే ఈ నగరాలు, రవాణా, రోడ్డు మార్గాలకు అనుకూలంగా ఉండడం వల్ల తమ పరిపాలన కేంద్రాలుగా ఈ నగరాలను అభివృద్ధి చేశారు. ఇటువంటి నగరాలలో విద్యావంతులైన మేధావులు, వివిధ సంస్థలు, సమాజాలు కూడా వలస పాలితులను ఎదిరించడం వలన అభివృద్ధి పథంలో నడిపించక తప్పలేదు.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

SCERT AP 10th Class Social Study Material Pdf 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Studies 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది వాటిని జతపరచండి : (AS1)

1) సరళీకృత ఆర్థిక విధానం a) విదేశీ దిగుమతులపై పన్నుల మీద పరిమితులు
2) ఇష్టమొచ్చినట్లు తొలగించటం b) కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు
3) ఇతరుల తొలగింపు c) తమ కంటే భిన్నంగా ఉన్న ప్రజలకు
4) సమాఖ్య సిద్ధాంతం d) రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత స్వయం ప్రతిపత్తి

జవాబు:

1) సరళీకృత ఆర్థిక విధానం a) విదేశీ దిగుమతులపై పన్నుల మీద పరిమితులు
2) ఇష్టమొచ్చినట్లు తొలగించటం b) కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు
3) ఇతరుల తొలగింపు c) తమ కంటే భిన్నంగా ఉన్న ప్రజలకు
4) సమాఖ్య సిద్ధాంతం d) రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత స్వయం ప్రతిపత్తి

ప్రశ్న 2.
స్వాతంత్ర్యానంతర రెండవ దశలో పార్టీ వ్యవస్థలో ప్రధాన మార్పులను గుర్తించండి. (AS1)
జవాబు:

  1. 1976-85 మధ్యకాలం భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షాకాలం వంటిది.
  2. మౌలిక ప్రజాస్వామిక హక్కులను తిరస్కరించిన అత్యవసర పరిస్థితితో మొదలై, రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక ఎన్నికల విజయంతో ముగిసింది.
  3. ఈ కాలం కాంగ్రెస్ పార్టీ పాలనతోనే మొదలై ముగిసినప్పటికీ కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయాలు రూపొందాయి.
  4. ఈ కాలం భారతదేశం ఏకపార్టీ ప్రజాస్వామ్యంలోకి జారిపోకుండా సమర్థవంతంగా నివారించింది.
  5. పోటీదారు ప్రత్యామ్నాయాలు ఏర్పడటంతో భారతీయ ఓటర్లకు ఎంచుకోవటానికి అవకాశం లభించింది.
  6. దీనివల్ల రాష్ట్ర జాతీయస్థాయి రాజకీయాలలో విభిన్న రాజకీయ దృక్పథాలకు, వర్గ ప్రయోజనాలకు అవకాశం లభించింది.
  7. సోషలిస్టులు, హిందూ జాతీయతావాదులు, కమ్యూనిస్టుల వంటి రాజకీయ దృక్పథాలు, రైతులు, దళితులు, వెనుకబడిన కులాలు, ప్రాంతాల వంటి వర్గ ప్రయోజనాలు కూడా ముందుకు వచ్చి తమ హక్కుల కోసం పోరాడసాగారు.
  8. ఇదే సమయంలో పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం వంటి ఉద్యమాలు మొదలై సామాజిక మార్పునకు బలమైన చోదకశక్తులుగా మారాయి.
  9. రాజకీయ పార్టీలు మారిన పరిస్థితులకనుగుణంగా తమ మ్యానిఫెస్టోలను మార్చుకోవలసి వచ్చింది.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 3.
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో వివిధ ప్రభుత్వాల ప్రధాన ఆర్థిక విధానాలలో వేటిని గురించి ఈ అధ్యాయంలోనూ, ఇంతకు ముందు అధ్యాయాలలోనూ చర్చించారు ? వాటిల్లో పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
పోలికలు:

  1. హరిత విప్లవాన్ని రాష్ట్రాల సహకారంతో కేంద్రం అమలుచేసింది.
  2. వి.పి.సింగ్ ప్రభుత్వం ప్రకటించిన ‘ఓబిసి’లకు రిజర్వేషన్లు అప్పటికే అనేక రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో వివిధ ప్రభుత్వాల ఆర్థిక విధానాల మధ్య తేడాలు :

కేంద్రస్థాయి ఆర్థిక విధానాలు రాష్ట్రస్థాయి ఆర్థిక విధానాలు
1. ప్రణాళికాబద్ధ అభివృద్ధి ద్వారా కులం, మతం, ప్రాంతం వంటి విభజన ధోరణులు తగ్గి భారతదేశం బలమైన దేశంగా ఎదుగుతుందని భావించి నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చింది. 1. పశ్చిమబెంగాల్ :
1977లో సిపిఎంకి చెందిన “జ్యోతిబసు” ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న భూసంస్కరణలను చేపట్టింది.
ఎ) 1978 లో పశ్చిమ బెంగాల్ లో కౌలుదార్ల పేర్లను నమోదుచేసింది.
బి) వాళ్ల హక్కులను కాపాడటానికి “ఆపరేషన్ బర్గా” ను చేపట్టింది. (కౌలుదార్లను బెంగాలీలో బర్గాదార్లు అంటారు.)
సి) ఆపరేషన్ బర్గా ఫలితంగా కౌలుదార్లను భూస్వాములు బలవంతంగా తొలగించటానికి వీలులేకుండా పోయింది.
డి) కౌలుదార్ల హక్కును వారసత్వం చేసి అది కొనసాగేలా చూశారు.
ఇ) పంటలో, పెట్టుబడి కౌలుదారు పెడితే 75%, భూస్వామి పెడితే 50% కౌలుదారుకి దక్కేలా ప్రభుత్వం చూస్తుంది.
2. నెహ్రూ భూసంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు, స్థానిక స్వపరిపాలన అనే మూడు రకాల భూసంస్కరణలను ప్రతిపాదించారు.
3. జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల సంస్కరణ, భూపరిమితి విధానాలను నెహ్రూ ప్రవేశపెట్టారు.
4. 1964-67 మధ్య ఆహార ఉత్పత్తిని పెంచడానికి ‘హరిత విప్లవం’ను మొదలు పెట్టారు.
5. 1971 తరువాత ఇంధిరాగాంధీ ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది.
6. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం సరళీకృత విధానాలవైపు మొగ్గు చూపింది. 2. ఆంధ్రప్రదేశ్ :
1982 లో ఆంధ్రప్రదేశ్ లో “నందమూరి తారక రామారావు” నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చిన్న వర్గ ప్రజలను ఆకర్షించడానికి కొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించింది.
ఎ) రెండు రూపాయలకు బియ్యం
బి) ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం
సి) మద్యపాన నిషేధం.
డి) పేదవారికి, రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు
7. వెనుకబడిన తరగతుల ప్రజలకి కూడా అవకాశాలు కల్పించుటకై ‘పి సింగ్’ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలలోను, విద్యాసదుపాయాలలోను రిజర్వేషన్లు ప్రకటించింది. అనేక సమస్యలను ఎదుర్కొన్నది.
8. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి 1992లో పి.వి. నరసింహారావు’ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధితో సంప్రదింపులు నిర్వహించింది. అది కొన్ని తీవ్ర షరతులతో భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాలను అవలంభించేలా చేసింది.
9. దీనివల్ల విదేశీ కంపెనీలు భారతదేశంలో పరిశ్రమలను నెలకొల్పాయి. వ్యాపారాలు మొదలు పెట్టాయి. స్వదేశీ కర్మాగారాలు మూతపడ్డాయి.
10. భారతదేశం ప్రపంచ మార్కెట్ లోకి లాగబడింది. విద్య, ఆరోగ్యం, రవాణా వంటి అనేక ప్రభుత్వ సదుపాయాలు ప్రైవేటీకరణకు దారితీశాయి.

ప్రశ్న 4.
ప్రాంతీయ ఆకాంక్షలు ప్రాంతీయ పార్టీల ఏర్పాటుకు ఎలా దారితీశాయి ? రెండు దశలలోని పోలికలు, తేడాలను వివరించండి. (AS1)
జవాబు:
ప్రాంతీయ ఆకాంక్షల ఆవిర్భావం :
1) భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం విభిన్న ఉద్యమాలు జరిగాయి.

2) ఆంధ్రప్రదేశ్ :
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులను కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం తరచు మారుస్తుండటం, పై నుంచి నాయకులను రుద్దటం ఇక్కడి ప్రజలకు నచ్చలేదు.

  • జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి తగినంత గౌరవం లభించటం లేదని బావించసాగారు.
  • తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించసాగారు.

3) అసోం :
స్వయం ప్రతిపత్తికి ఇదోరకమైన బలమైన ఉద్యమం.

  • బ్రిటిష్ పాలన నాటి నుండి రాష్ట్ర పాలనలోని కింది, మధ్య స్థాయి ఉద్యోగాలలో బెంగాలీలు ఉండేవారు.
  • బెంగాలీ అధికారులు తమని సమానులుగా కాకుండా 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సోమీయులు భావించేవారు.
  • స్వాతంత్ర్యం తరువాత బెంగాలీ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో అసోంలో సిరపడసాగారు.
  • ఇవన్నీ చాలవన్నట్లు సరిహద్దు ఆవల బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది వలస రాసాగారు.
  • దీంతో స్థానిక ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామనీ, బయటివాళ్ళు ఎక్కువై తమ జనాభా తగ్గుతుందనీ భయపడసాగారు.

4) పంజాబ్ :
ఇక్కడ అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాష, మతము ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది.

  • దేశాభివృద్ధిలో రాష్ట్రం పాత్రను విస్మరిస్తున్నారన్నదే పంజాబ్ ఆరోపణ.
  • రాష్ట్రం ఏర్పడినపుడు వారికి అన్యాయం జరిగిందని, రాజధాని ప్రాంతం చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమకే చెందాలనీ, భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్ళు కావాలనీ, సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలని కోరారు.

పోలికలు :

  1. తమ ఉనికిని గుర్తించాలనీ
  2. తమకు స్వయం ప్రతిపత్తి కల్పించాలనీ
  3. తమ జాతిమీద వేరొకరి ప్రభావం ఉండకూడదనీ
  4. తమకు అన్ని అవకాశాలు కల్పించాలనీ

తేడాలు:

  1. ఆంధ్రప్రదేశ్ లో తమ జాతి అవమానించబడుతోందనీ
  2. అసోంలో తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామనీ, తమ జనాభా తగ్గిపోతుందనీ
  3. పంజాబ్ లో తమకే మేలు జరగాలనీ ప్రాంతీయ ఉద్యమాలు వచ్చాయి.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 5.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలంటే రాజకీయ పార్టీలు సమాజంలోని భిన్న వర్గాల ప్రజలను ఆకర్షించాలి. స్వాతంత్ర్యానంతర రెండవ దశలో ఈ పనిని వివిధ రాజకీయ పార్టీలు ఎలా చేశాయి? (AS1)
జవాబు:

  1. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రాజకీయ పార్టీలు సమాజంలోని భిన్న వర్గాల ప్రజలను ఆకర్షించాలి.
  2. స్వాతంత్ర్యానంతర రెండవ దశలో ఈ పనిని అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయి.
  3. సమాజంలోని రైతులు, దళితులు, వెనుకబడిన కులాలు, ప్రాంతాల వంటి వర్గ ప్రయోజనాలను కాపాడవలసిన అనసరం ఏర్పడింది.
  4. వారి అవసరాలను తీర్చటానికి ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటుచేయడం జరిగింది.
  5. పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు.
  6. స్త్రీ ప్రాధాన్యతను పెంచే చర్యలు.
  7. పౌరహక్కుల పరిరక్షణ కొరకు అనేక చర్యలు.
  8. సాహిత్యాన్ని రక్షించుటకు కొన్ని చర్యలను చేపట్టడం జరిగింది.
  9. పై చర్యలను చేపట్టడానికి, ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి.

ప్రశ్న 6.
భారతీయ పరిపాలనా విధానంలో అందరినీ కలుపుకునే స్వభావం బలహీన పడటానికి కారణమైన పరిణామాలు ఏమిటి? వివిధ ప్రజలను, రాజకీయ ఆకాంక్షలను కలుపుకుని వెళ్లగల సామర్థ్యం ఏ విధంగా దెబ్బతింటోంది? (AS1)
జవాబు:
భారతీయ పరిపాలనా విధానంలో అందరినీ కలుపుకునే స్వభావం బలహీన పడటానికి కారణమైన పరిణామాలు :

  1. అనేక ప్రజా ఉద్యమాలు చెలరేగడం
  2. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం
  3. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయాలని అనుకోవడం
  4. వేర్పాటువాదం తలెత్తడం
  5. ప్రాంతీయ, భాషా మతాభిమానాలు పెరిగిపోవడం
  6. సమర్థవంతమైన నాయకత్వం లోపించడం
  7. ప్రజల మనోభావాలను సంతృప్తి పరచలేకపోవడం
  8. విభిన్న భావాలు గల రాజకీయ నాయకులు సంతృప్తి పడకపోవడం

వివిధ ప్రజలను, రాజకీయ ఆకాంక్షలను కలుపుకుని వెళ్లగల సామర్థ్యం ఏ విధంగా దెబ్బతింటుంది అనగా –

  1. వివిధ ప్రజలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం
  2. వారి ప్రాంతీయ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం
  3. ప్రాంతీయ, కుల, మత ప్రయోజనాలను రెచ్చగొట్టి అత్యధికంగా ఓట్లు పొందాలని చూడటం
  4. స్వలాభం కొరకు జాతీయాభిమానాన్ని తాకట్టుపెట్టడం
  5. రాజకీయ ప్రయోజనాలతో సమాజ ప్రయోజనాలను దెబ్బతీయడం వంటి అంశాల వల్ల వివిధ ప్రజలను, రాజకీయ ఆకాంక్షలను కలుపుకుని వెళ్లగల సామర్థ్యం దెబ్బతింటోంది.

ప్రశ్న 7.
వివిధ ప్రాంతీయ ఆకాంక్షలు సాంస్కృతిక, ఆర్థిక కోణాలను ఏ విధంగా ఉపయోగించుకుంటాయి? (AS1)
జవాబు:
వివిధ ప్రాంతీయ ఆకాంక్షలు సాంస్కృతిక, ఆర్థిక కోణాలను కింది విధంగా ఉపయోగించుకుంటాయి.

  1. సంస్కృతిని, సంప్రదాయాలను పెంపొందిస్తాయి. వాటికి ప్రాధాన్యతను ఇస్తాయి.
    2
  2. భాషాభిమానాన్ని కలిగి ఉండి భాషాభివృద్ధికి దోహదం చేస్తాయి.
    ఉదా : ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించిన ఎన్.టి. రామారావు ప్రాంతీయ పార్టీని స్థాపించాడు.
  3. అంతేకాక పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, మద్యపాన నిషేధం వంటి ఆర్థిక సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
  4. అసోంలోని వ్యాపారం, ఇతర సంస్థలు అస్సోమేతర ప్రజల చేతుల్లో ఉన్నాయని, వాటిని ఇతరుల నుండి తొలగించి తమకు చెందేలా చేసుకోవాలని అసోం ప్రజలు భావించారు.
  5. అలాగే పంజాబ్ ప్రజలు రాజధాని నగరమైన చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలనీ, భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్ళు కావాలని, సైన్యంలోకి ఎక్కువ మంది సిక్కులను తీసుకోవాలని కోరడం మొదలగునవి ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి దోహదం చేశాయి.

ప్రశ్న 8.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి సగంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. రెండవ సగంలో సరళీకృత ఆర్థిక విధానానికి ప్రాధాన్యతను ఇచ్చారు. ఇవి రాజకీయ భావాలను ఎలా ప్రతిబింబించాయో చర్చించండి. (AS1)
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి సగంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడానికి, రెండవ సగంలో సరళీకృత ఆర్థిక విధానానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణాలు :

  1. స్వాతంత్ర్యం వచ్చిన ప్రారంభంలో భారతదేశంలో పేదరికాన్ని తొలగించడానికి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన వలస ఆర్థిక విధానం నుండి మన ఆర్థిక వ్యవస్థను రూపొందించుటకు ప్రణాళికాబద్ద ఆర్థికవ్యవస్థను ప్రవేశపెట్టారు.
  2. వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, సేవారంగాలను అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను అమలుచేశారు.
  3. సుస్థిరంగా, సమర్ధవంతంగా, వేగవంతంగా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించారు.
  4. అయితే వాటి వలన ప్రభుత్వ వ్యయం విపరీతంగా పెరిగిపోవడం వలన రెండవ సగంలో సరళీకృత ఆర్థిక విధానాన్ని అవలంబించారు. ఈ విధానం వలన –
    i) ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవటం అనగా రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత, ప్రజాసేవలు, ఆరోగ్యం వంటి వాటిల్లో ప్రభుత్వ ఖర్చును తగ్గించటం.
    ii) విదేశీ పెట్టుబడులపై పరిమితులను తగ్గించుకోవటం.
    iii) విదేశీ సరుకుల దిగుమతుల మీద పరిమితులను, పన్నులను తగ్గించటం.
    iv) ఆర్థికరంగంలోని అనేక రంగాలలో ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించటం వంటి చర్యల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 9.
సంకీర్ణ ప్రభుత్వం వల్ల విధానాలలో మధ్యేమార్గాన్ని అవలంబించటానికి సంకీర్ణ ప్రభుత్వంలోని వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రాంతీయ కోరికలను సాధించుకునే విధానానికి ఉదాహరణలను వార్తాపత్రికలు, వార పత్రికలు చదవటం ద్వారా గుర్తించండి. (AS3)
జవాబు:

  1. 1990ల కాలంలో స్వాతంత్ర్యానంతర భారతదేశంలో చాలా కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
  2. పోటీతో కూడిన బహుళపార్టీ వ్యవస్థకు మార్పుతో మెజారిటీ స్థానాలు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితి ఏ ఒక్క పార్టీకీ లేదు.
  3. 1989 నుంచి జాతీయస్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ మైనారిటీ ప్రభుత్వాలే.
  4. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలవవలసి వచ్చింది.
  5. అలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలు ఆయా ప్రాంతాలకు, ప్రజలకు అద్దంపడుతూ వాటి అభివృద్ధికి కృషిచేయడం జరుగుతుంది.

10th Class Social Studies 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 InText Questions and Answers

10th Class Social Textbook Page No.272

ప్రశ్న 1.
ఈ రెండు సమస్యలతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు మన ప్రజాస్వామిక రాజతంత్రాన్ని బలపరిచిందా, బలహీన పరిచిందా?
జవాబు:
ఈ రెండు సమస్యలు చాలా జటిలమై, ప్రభుత్వానికే సవాల్ గా నిలిచాయి. అయినప్పటికి ఈ సమస్యలలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు వలన ప్రజాస్వామిక రాజతంత్రాన్ని బలపరచిందనే చెప్పాలి.

10th Class Social Textbook Page No.274

ప్రశ్న 2.
ప్రధానమంత్రి క్షమాపణ

రాజ్యసభలో డా|| మన్మో హన్ సింగ్ ప్రకటన –
………… 1984లో జరిగిన ఈ మహా జాతీయ విపతులో నాలుగు వేలమంది చంపబడ్డారు. ఒకే దేశంగా కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఇటువంటి ఘోర విషాదాలు దేశంలో తిరిగి ఎన్నడూ జరగకుండా కొత్త దారులు కనుక్కోటానికి ప్రయత్నించాలి. ……. ఒక్క సిక్కు ప్రజలకే కాకుండా మొత్తం భారతదేశానికి క్షమాపణలు చెప్పటానికి నేను తటపటాయించను, ఎందుకంటే 1984లో జరిగింది మన రాజ్యాంగంలో పొందుపరిచిన దానికి, జాలి అన్న భావనకు పూర్తి వ్యతిరేకమయినది. మా ప్రభుత్వం తరపున, ప్రజలందరి తరపున ఇటువంటి ఘటన జరిగినందుకు నేను సిగ్గుతో తల వంచుకుంటున్నాను. అయితే దేశ వ్యవహారాల్లో శిఖరాలూ ఉంటాయి, లోయలు ఉంటాయి. గతం మనతో ఉంది, దానిని తిరగరాయలేం. కానీ మానవులుగా మనందరికీ మెరుగైన భవిష్యత్తును రూపొందించగల సామర్థ్యం , దృఢ చిత్తత మనకి ఉన్నాయి.
(pmindia mic co/Rs%20 speech.pdf) – 2005 ఆగస్టు 11.

పై సమాచారాన్ని చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
1) ఈ ఉపన్యాసంలోని ప్రధాన సందేశం ఏమిటి?
జవాబు:

  1. 1984లో జరిగిన ఘోర విషాదాలు దేశంలో తిరిగి ఎన్నడూ జరగకుండా కొత్త దారులు కనుక్కోటానికి ప్రయత్నించాలి.
  2. 1984లో జరిగిన ఘోరానికి నేను క్షమాపణ తెలియచేస్తున్నాను అని మన్మోహన్ సింగ్ ప్రకటించారు.

2) ఈ ఉపన్యాసం ఏ సంకేతాలను పంపిస్తోంది?
జవాబు:

  1. దేశ వ్యవహారాలలో శిఖరాలు ఉంటాయి, లోయలు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని రకాలైన పనులు చేయవలసి వస్తుంది.
  2. గతాన్ని తిరగ రాయలేం. కానీ మానవులం కనుక మెరుగైన భవిష్యత్తును రూపొందించగల సామర్థ్యం, దృఢ చిత్తం మనకున్నాయని సంకేతాలిస్తుంది.

3) ప్రధానమంత్రి ఈ ఉపన్యాసం చెయ్యటంలోని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:

  1. 1984లో జరిగినది మన రాజ్యాంగంలో పొందుపరచిన దానికి, జాతి అన్న భావనకు పూర్తి వ్యతిరేకమయినది.
  2. మా ప్రభుత్వం తరుపున, ప్రజల తరుపున ఇటువంటి ఘటన జరిగినందుకు నేను సిగ్గుపడుతున్నానని తెలియచేశారు.

10th Class Social Textbook Page No.265

ప్రశ్న 3.
పలు పార్టీల ప్రజాస్వామ్యంతో పోలిస్తే ‘ఏక పార్టీ ప్రజాస్వామ్యం’ మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉండేదా?
జవాబు:
పలు పార్టీల ప్రజాస్వామ్యంతో పోలిస్తే ఏక పార్టీ ప్రజాస్వామ్యం మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉండేది కాదు.

ఎందుకనగా:

  1. ఏకపార్టీ ప్రజాస్వామ్యం వలన నియంతృత్వ ధోరణి పెరుగుతుంది.
  2. మార్పులకు అవకాశం ఉండదు.
  3. అందరి క్షేమానికి అవకాశం ఉండేది కాదు.
  4. ఉద్యమాలు తలెత్తవు. ఉద్యమాలు తలెత్తకపోతే భిన్నాభిప్రాయాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండదు.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Textbook Page No.270

ప్రశ్న 4.
ప్రజలు స్వేచ్ఛగా సంచరించే విధానం ఉంటే బయటి నుంచి వచ్చిన ధనిక, శక్తిమంతులైన వాళ్ళు భూమి, వనరులు మొత్తాన్ని కొనేసి అసలు ఆ ప్రాంతంలోని వాళ్లను పేదలు, నిర్భాగ్యులుగా మిగులుస్తారా?
జవాబు:
మిగల్చరు. కారణం భూమి, వనరులు అమ్మితే కొంటారు కాని అమ్మకపోతే కొనరు కదా. ఒకవేళ అమ్మినా ఎక్కువ రేటు వస్తుంది. దానితో పేదవారు ధనికులు కావడానికి అవకాశం ఉంటుంది. మరియు ధనికులు వచ్చి అక్కడ పరిశ్రమల లాంటివి స్థాపించితే దానిలో ఉపాధి లభిస్తుంది. కాబట్టి అక్కడ పేదలు నిర్భాగ్యులుగా మిగలరు.

10th Class Social Textbook Page No.273

ప్రశ్న 5.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే రాజీవ్ గాంధీ దేశానికి ఒనగూర్చిన శాశ్వత ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:

  1. శాంతి ప్రక్రియలు మొదలు పెట్టారు.
  2. పేదవారికి ఉద్దేశించిన పథకాలను వారికి అందేటట్లు ఏర్పాట్లు చేశారు.
  3. అధికార వికేంద్రీకరణకు రాజ్యాంగం ద్వారా చట్టబద్ధత కల్పించారు.
  4. ఆర్థిక రంగంలో సరళీకృత ఆర్థికవ్యవస్థను ప్రవేశపెట్టారు.
  5. సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించాలని ‘టెలికం విప్లవం’ ఆరంభించారు.

10th Class Social Textbook Page No.273

ప్రశ్న 6.
తమకోసం ఉద్దేశించిన పథకాల వల్ల పేద ప్రజలు తరచు ఎందుకు ప్రయోజనం పొందటం లేదో తరగతిలో చర్చించండి. ఇటువంటి ప్రయోజనాలు నిజంగా పేదవాళ్లకు చేరాలంటే ఏ దీర్ఘకాల చర్యలు తీసుకోవాలి?
జవాబు:

  1. ప్రభుత్వ శాఖలలో పేరుకుపోయిన అవినీతి
  2. ప్రజలు నిరక్షరాస్యత మూలంగా ప్రభుత్వం తమకోసం చేపట్టిన పథకాలను పొందలేకపోతున్నారు.
  3. అమాయకత్వం వలన కూడా పేదప్రజలు ప్రయోజనం పొందటం లేదు.

తీసుకోవాల్సిన దీర్ఘకాల చర్యలు:

  1. అక్షరాస్యతను పెంచాలి.
  2. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలిసేలా చేయాలి.
  3. ప్రభుత్వోద్యోగులు నిజాయితీతో పనిచేస్తూ ఈ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలి.

10th Class Social Textbook Page No.273

ప్రశ్న 7.
మీ పాఠశాల విద్యార్థులకు అందవలసిన ప్రయోజనాల జాబితా తయారుచెయ్యండి. ఇవి వాళ్లకు సరిగా అందుతున్నాయా? తరగతి గదిలోనూ, బయట క్రీడా మైదానాలలోనూ, ఇంటివద్ద చర్చించండి.
జవాబు:
పాఠశాల విద్యార్థులకు అందవలసిన ప్రయోజనాలు :

  1. మధ్యాహ్న భోజన పథకం
  2. ఉచిత పుస్తకాల పంపిణీ
  3. ఉచిత యూనిఫారం
  4. స్కాలర్షిప్లు
  5. లైబ్రరరి సౌకర్యాలు
  6. ఆటస్థలం
  7. ప్రయోగశాలలు

వీటన్నింటినీ విద్యార్ధులు పొందేలా చర్యలు తీసుకోవాలి. వీటి మీద విద్యార్ధులకు అవగాహన కలిగించాలి.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Textbook Page No.264

ప్రశ్న 8.
గత అధ్యాయంలో చర్చించిన స్వతంత్ర భారతదేశంలోని రాజకీయ ఘటనల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
స్వతంత్ర భారతదేశంలో రాజకీయ ఘటనలు :

  1. 1952, 1957, 1962లలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలు సాధించింది. ఏకపార్టీ ఆధిపత్యం కొనసాగింది.
  2. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు కొరకు అనేక ఉద్యమాలు ఆవిర్భవించాయి. చివరికి 1956లో భాషాప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
  3. ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యి ప్రపంచమంతా రష్యా కూటమి (USSR) లేదా అమెరికా కూటమి (USA) గా విడిపోయింది. ఇటువంటి నేపథ్యంలో నెహ్రూ, మన దేశం ఈ రెండు శిబిరాలలో చేరకుండా విదేశీ విధానంలో స్వతంత్రంగా ఉంటూ, అలీన విధానమును మన విదేశీ విధానంగా స్వీకరించారు.
  4. చైనాతో నెహ్రూ పంచశీల సూత్రాల ఒప్పందం చేసుకున్నాడు.
  5. 1962లో చైనాతో మన దేశం యుద్ధం చేయవలసి వచ్చింది.
  6. 1965లో భారతదేశం పాకిస్థాన్‌తో యుద్ధం చేసింది.
  7. జాతీయ భాష అయిన హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో ఉద్యమం జరిగింది.
  8. 1967 ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి గురైంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయి, ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.
  9. 1969లో మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది.
  10. దేశంలోని చాలా రాష్ట్రాలలో అనేకాంశాల మీద ఉద్యమాలు లేచాయి.
  11. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంలో భారత్- పాకిస్తాన్ తో ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది.
  12. 1971 ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
  13. 1973లో అరబ్- ఇజ్రాయిల్ మధ్య యుద్ధంతో చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది.
  14. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ఐక్యమైన ప్రతిపక్షాలు దేశంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ కి, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి. ఈ ఉద్యమం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం దేశంలో “అత్యవసర పరిస్థితి”ని విధించింది.

10th Class Social Textbook Page No.265

ప్రశ్న 9.
నిరసన, మార్పులకు సంబంధించి సామాజిక ఉద్యమాలకు అనువైన పరిస్థితులను పలు పార్టీల ప్రజాస్వామ్యం ఎలా దోహదం చేస్తుంది?
జవాబు:

  1. పోటీదారు ప్రత్యామ్నాయాలు ఏర్పడటంతో భారతీయ ఓటర్లకు ఎంచుకోటానికి అవకాశం లభించింది.
  2. దీనివల్ల రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి రాజకీయాలలో విభిన్న రాజకీయ దృక్పథాలకు, వర్గ ప్రయోజనాలకు అవకాశం లభించింది.
  3. సోషలిస్టులు, హిందూ జాతీయతావాదులు, కమ్యూనిస్టుల వంటి రాజకీయ దృక్పథాలు, రైతులు, దళితులు, వెనుకబడిన కులాలు, ప్రాంతాల వంటి వర్గప్రయోజనాలు కూడా ముందుకొచ్చి తమ హక్కుల కోసం పోరాడసాగారు.
  4. ఈ సమయంలో పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం వంటి ఉద్యమాలు మొదలై సామాజిక మార్పునకు బలమైన చోదకశక్తిగా మారాయి.

10th Class Social Textbook Page No.267

ప్రశ్న 10.
రాష్ట్రాలలో వేరే రాజకీయ పార్టీలకు చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్రప్రభుత్వం వాటిని తొలగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజాస్వామిక సూత్రాలకు ఇది ఎలా భంగం కలిగిస్తోందో చర్చించండి.
జవాబు:

  1. ప్రపంచంలోనే విశాలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను తొలగించడమనేది ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధం.
  2. జనతాపార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు సమాఖ్య సూత్రాలను బలహీనపరచి, అధికార కేంద్రీకరణకు మద్దతునిచ్చాయి.
  3. ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న వాగ్దానంతో జనతాపార్టీ అధికారంలోకి వచ్చి, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని నామరూపాల్లేకుండా చేసింది.
  4. ఇటువంటి చర్యలు కేంద్రం యొక్క ఆధికత్యను తెలుపుతూ, ప్రాథమిక హక్కులను భంగకరమవుతాయి.
  5. ఇటువంటి చర్యలు కొనసాగుతూనే ఉన్నట్లయితే భారతదేశం ఏకకేంద్ర రాజ్యంగా మారిపోతుంది.

10th Class Social Textbook Page No.268

ప్రశ్న 11.
ఎన్.టి.ఆర్ రాజకీయాలలో ఈ దిగువ అంశాల ప్రాముఖ్యతను చర్చించండి.
i) సినీ హీరోగా ఉన్న నేపథ్యం
ii) రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాటం
iii) పేదలకు జనాకర్షక సంక్షేమ పథకాలు
iv) ఇతర ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు
జవాబు:
i) సినీ హీరోగా ఉన్న నేపథ్యం :
ఎన్.టి.ఆర్ తెలుగు సినిమారంగంలో అనేక జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించి తన నటనా శైలితో అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని మెప్పించి, వారి అభిమాన నటుడై, ఆదరాభిమానాలు పొందాడు.

ii) రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాటం:

  1. ఎన్.టి.ఆర్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులను కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం తరచూ మారుస్తుండటం చూశారు.
  2. పై నుంచి నాయకులను రుద్దటం ఇక్కడి ప్రజలకు నచ్చలేదు.
  3. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి తగినంత గౌరవం లభించటం లేదని భావించసాగారు.
  4. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించసాగారు.
  5. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తె.దే.పా కృషి చేస్తుందని ఆయన చెప్పారు.

iii) పేదలకు జనాకర్షక సంక్షేమ పథకాలు :
తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు :

  1. పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం.
  2. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం.
  3. మద్యపాన నిషేధం.

iv) ఇతర ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు :

  1. 1984లో ఆపరేషన్ కోసమని అమెరికాకు వెళ్ళినప్పుడు గవర్నర్ ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు.
  2. తె.దే.పా నుంచి కాంగ్రెస్ కి పార్టీ ఫిరాయించిన ఎన్. భాస్కరరావుని ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆహ్వానించారు.
  3. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్.టి.ఆర్ గవర్నర్ చర్యను సవాలుచేస్తూ శాసనసభ్యులలో మెజారిటీ మద్దతు తనకే ఉందని నిరూపించారు.
  4. తన ప్రభుత్వాన్ని అకారణంగా తొలగించటంపై చేసిన పోరాటంలో ఎన్.టి.ఆర్ కి ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సిపిఐ(ఎం), డి.ఎం.కె., ఎస్.ఎ.డి., నేషనల్ కాన్ఫరెన్స్ వంటి అనేక పార్టీలు మద్దతు నిచ్చాయి.

10th Class Social Textbook Page No.270

ప్రశ్న 12.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్.టి.ఆర్ ఉద్యమానికి, అసోం ఉద్యమానికి పోలికలు, తేడాలు ఏవి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో ఎన్.టి.ఆర్ ఉద్యమానికి, అసోం ఉద్యమానికి పోలికలు :

  1. స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకోవడం.
  2. ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకోవడం.

తేడాలు:

  1. తెలుగు ప్రజలు తమ ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించారు.
  2. అసోం ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామనీ, బయటివాళ్ళు ఎక్కువైపోయి జనాభాలో తమ సంఖ్య తగ్గుతుందని భయపడసాగారు.
  3. ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో ఆర్థిక కోణం లేదు. అసోం ఉద్యమంలో ఆర్థిక కోణం కలదు.
  4. ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో మతపరమైన అంశం లేదు. అసోం ఉద్యమంలో మతపరమైన అంశం కలదు.
  5. ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో భారతదేశ వ్యతిరేకత లేదు. అసోం ఉద్యమంలో భారతదేశ వ్యతిరేకత వచ్చింది.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Textbook Page No.270

ప్రశ్న 13.
ఈ అంశాలపై మీ తరగతిలో చర్చ నిర్వహించండి.
ఒక ప్రాంతంలో ఒక సమూహానికి చెందిన ప్రజలు ఉండాలి, అన్ని ఉద్యోగాలు, అన్ని వ్యాపారాలు ఆ సమూహానికి చెందిన ప్రజల చేతిలోనే ఉండాలి. లేదా భారతదేశ ప్రజలందరూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్ళగలగాలి. తాము ఎంచుకున్న ప్రాంతంలో స్థిరపడటానికి, పని చెయ్యటానికి అవకాశం ఉండాలి.
జవాబు:
ఒక ప్రాంతంలో ఒకే సమూహానికి చెందిన ప్రజలు ఉండాలి అనేది అంత సమర్థనీయం కాదు. ఎందువల్ల అనగా భారతదేశం ఏక పౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి, మరియు ఆర్టికల్ 19 ప్రకారం ఆరు రకాల స్వేచ్చలు ఉన్నాయి కాబట్టి అందులో ఒకటి ఏ భారతీయుడైనా భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో స్థానికతకు కొంత ప్రాధాన్యత ఇచ్చినా వ్యాపారం విషయంలో, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్ళే విషయంలో, తాము ఎంచుకున్న ప్రాంతంలో స్థిరపడే విషయంలో, పనిచేసే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉండాలి.

10th Class Social Textbook Page No.272

ప్రశ్న 14.
సిక్కుల వేర్పాటువాదం, తీవ్రవాదాలను ప్రేరేపించటంలో 1984 లో ఢిల్లీలో చోటుచేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్ల పాత్ర ఏమిటి?
జవాబు:

  1. పంజాబ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తికి ఒక ఉద్యమం రూపుదిద్దుకుంది.
  2. ఇక్కడ అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాష, మతమూ ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది.
  3. రాజధాని నగరమైన చండీగఢ్ తమకే చెందాలని, భాక్రానంగల్ నుంచి ఎక్కువ నీరు రావాలని, సైన్యంలోకి ఎక్కువ మంది సిక్కులను తీసుకోవాలని కోరారు.
  4. 1980లో అకాలీ ప్రభుత్వాన్ని రద్దుచేసి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో సిక్కులు వివక్షతకు గురవుతున్నారన్న భావన పెరిగింది.
  5. తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడిగా ఉన్న భింద్రేన్ వాలా వేర్పాటువాదాన్ని ప్రచారం చేస్తూ సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని కోరసాగాడు.
  6. తీవ్రవాదులు సిక్కుల మీదే కాకుండా పంజాబ్ లోని ఇతర మత ప్రజలపై కూడా సంప్రదాయ ఛాందసవాద జీవన విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించారు.
  7. ఈ ఘర్షణ మతపరమైన రంగును కూడా సంతరించుకుంది.
  8. సిక్కు మతానికి చెందని ప్రజలపై దాడులు జరిగాయి.
  9. వీటన్నింటి అంతిమ పర్యవసానంగా సిక్కు వేర్పాటు బృందాలు సిక్కుల పవిత్ర స్థలమైన గోల్డెన్ టెంపుల్ ని అక్రమించుకోగా వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయటానికి సైన్వం జోక్యం చేసుకోవలసి వచ్చింది.
  10. దీంతో తమ పుణ్యస్థలం అపవిత్రమైందని సిక్కులు భావించటంతో వాళ్ల విజాతి భావం మరింత తీవ్రమైంది.
  11. వీటన్నింటి కారణంగా 1984లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యింది.
  12. దీని తరువాత అల్లర్లు చెలరేగి, ప్రత్యేకించి ఢిల్లీలో వేలాదిమంది సిక్కులపై దాడులు చేసి, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేసి, హత్య చేశారు.
  13. ఈ హింసను ఆపటానికి పాలనాయంత్రాంగం స్పందించినట్లు అనిపించలేదు.
  14. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక కొంత శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి.

10th Class Social Textbook Page No.272

ప్రశ్న 15.
అసోం, పంజాబ్ ఉద్యమాల మధ్య పోలికలు, తేడాలను పేర్కొనండి. మన రాజకీయ వ్యవస్థకు అవి ఎటువంటి సవాళ్లను విసిరాయి?
జవాబు:

అసోం ఉద్యమం పంజాబ్ ఉద్యమం
1. బ్రిటిష్ పాలన నాటి నుండి అసోంలో బెంగాలీలు ఉండేవాళ్లు. బెంగాలీ అధికారులు తమని సమానులుగా కాకుండా రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సామీయులు భావించేవాళ్లు. 1. పంజాబ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి కావాలని ఉద్యమం జరిగింది.
2. స్వాతంత్ర్యం తరువాత బెంగాలీ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో అసోంలో స్థిరపడసాగారు. బంగ్లాదేశ్ నుండి ఎంతోమంది వలసవచ్చి స్థానికులకు ఇబ్బంది కలిగించసాగారు. స్థానిక ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామనీ, అంతే కాకుండా ‘బయటివాళ్లు’ ఎక్కువైపోయి జనాభాలో తమ సంఖ్య తగ్గుతుందని భయపడసాగారు. 2. దేశాభివృద్ధిలో రాష్ట్రం పాత్రను విస్మరిస్తున్నారన్నదే పంజాబ్ ఆరోపణ. రాష్ట్రం ఏర్పడినప్పుడు తమకు అన్యాయం జరిగిందని వాళ్లు భావిస్తున్నారు.
3. ప్రజలలో ఉన్న ఈ అసంతృప్తి 1970లలో సామాజిక ఉద్యమంగా మారింది.| 3. చండీగఢ్ తమ రాష్ట్రానికి చెందాలని కోరసాగారు.
4. అఖిల అసోం విద్యార్థి సంఘం (ఎఎఎను) ఈ ఉద్యమానికి ముందు నిలిచింది. 4. ఈ ఉద్యమం కొరకు 1978లో అకాలీదల్ ఏర్పడింది.
5. ఎఎయు ఉద్యమకారుల కోరికలు :
ఎ) బయటివాళ్లను తీసెయ్యాలని చేశారు.
బి) ఉపాధిలో స్థానిక ప్రజలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని
సి) వనరులను స్థానిక ప్రజల ప్రయోజనం కోసం వినియోగించమని కోరారు.
5. అకాలీదళ్ కోరికలు:
ఎ) రాజ్యాంగాన్ని సవరించి అధికార వికేంద్రీకరణ చేయాలి.
బి) రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలి.
సి) భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్లు కావాలని, ఎక్కువ మంది సిక్కులను తీసుకోవాలని కోరసాగారు.
6. ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఇక్కడ శాంతిని నెలకొల్పడానికి ఈ ప్రాంతాలలో సాయుధ బలగాలను కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున నియమిం చింది. దీనితో పౌరహక్కులు, స్వేచ్ఛ రద్దయ్యా యి. సైన్యానికి అసాధారణ అధికారాలు కట్టబెట్టారు. 6. ఉద్యమకారులు సిక్కుల మీదే కాకుండా ఇతరమత ప్రజలపై కూడా ఘర్షణలకు కారణమయ్యారు.
7. తీవ్రవాదులు గోల్డెన్ టెంపుల్ ని ఆక్రమించుకోగా వాళ్లని అక్కడ నుండి ఖాళీ చేయించటానికి సైన్యం జోక్యం చేసుకోవలసి వచ్చింది. వారి పవిత్ర దేవాలయం అపవిత్రమైనదని భావించిన సిక్కుల కారణంగా 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యింది.
8. పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణచివెయ్యటానికి ప్రభుత్వం అనేక కఠినతర పద్ధతులను ఉపయోగించింది. వీటిలో అనేకం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు.

సవాళ్లు :

  1. ఈ రెండు సమస్యలు దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా పరిణమించాయి. పంజాబ్ స్వయం ప్రతిపత్తిని కోరుట అనేది ఏర్పాటు వాదానికి నిదర్శనం.
  2. ఈ సమస్యలు మత ఘర్షణలకు దారితీశాయి.

10th Class Social Textbook Page No.276

ప్రశ్న 16.
సంకీర్ణ రాజకీయాల వల్ల ప్రభుత్వం బలహీనపడిందని కొంతమంది భావిస్తుండగా, దానివల్ల ఏ ఒక్క పార్టీ తన విధానాన్ని దేశం మీద రుద్దకుండా చేసిందని కొంతమంది భావిస్తారు. దీనిని ఉదాహరణలతో చర్చించండి.
జవాబు:

  1. సంకీర్ణ ప్రభుత్వాలలో అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలవవలసి వచ్చేది. దాంతో ఏ ఒక్క పార్టీ తన విధానాలను కొనసాగించటానికి వీలులేకపోతుంది.
  2. దీనివల్ల రాజకీయాలు, విధానాలలో అనేక దృష్టి కోణాల పట్ల కేంద్ర ప్రభుత్వాలు సున్నితత్వంలో వ్యవహరించవలసి వచ్చింది.
  3. సంకీర్ణ ప్రభుత్వాల వల్ల ఎంతో అస్థిరత కూడా నెలకొంది.
  4. చిన్న పార్టీలు కూడా తమ మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పారిపోతుంది కాబట్టి ఎక్కువ ప్రయోజనాలు రాబట్టుకోటానికి ప్రయత్నించాయి.
  5. కొన్నిసార్లు “విధాన పక్షపాతం” అనగా ఏదో ఒక భాగస్వామ్య పార్టీ తన మధతు ఉపసంహరించుకుంటుందన్న భయంతో తీవ్ర మార్పులను తెచ్చే విధానాలను అమలు చెయ్యటానికి సంకీర్ణ ప్రభుత్వం భయపడేది.
    ఉదా: మన్మో హన్‌సింగ్ ప్రభుత్వం

10th Class Social Textbook Page No.277

ప్రశ్న 17.
పశ్చిమ బెంగాల్ లోని భూ సంస్కరణలను చైనాలోని, లేదా వియత్నాంలోని భూసంస్కరణలతో పోల్చండి. వీటిల్లో పోలికలు, తేడాలు గుర్తించండి.
జవాబు:
పోలికలు :

పశ్చిమ బెంగాల్ లోని భూ సంస్కరణలు వియత్నాంలోని భూ సంస్కరణలు
1. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూసంస్కరణలను అమలు చేసింది. 1. కమ్యూనిస్ట్ పార్టీయే భూసంస్కరణలను అమలు చేసింది.
2. ఈ భూసంస్కరణలు ఎంతో కాలం నుండి గ్రామాలలో కొనసాగుతున్న సంప్రదాయాలను రూపుమాపాయి. 2. వియత్నాంలో కూడా సంప్రదాయక వ్యవసాయ విధానాన్ని, భాగస్వామ్య వ్యవస్థను రద్దు చేయడం జరిగింది.

తేడాలు :

పశ్చిమబెంగాల్ వియత్నాం
1. “ఆపరేషన్ బర్గా” ప్రకారం గ్రామాలలో సమావేశాలు నిర్వహించి, భూస్వాముల సమక్షంలోనే కౌలుదారుల జాబితాను తయారుచేసి, సరిచూసేవాళ్లు, అన్ని చట్ట సంబంధ కాగితాలు తయారుచేసి వెంటనే పంచి పెట్టేవాళ్లు. 1. భూమి లేని చిన్న రైతులకు భూమి మీద హక్కు కల్పించటం ముఖ్య ఉద్దేశం.
2. కౌలుదార్లను భూస్వాములు బలవంతంగా తొలగించ టానికి వీలులేదు. కౌలుదార్ల హక్కును వారసత్వం చేశారు. పంటలో, కౌలుదారు పెట్టుబడి పెడితే 75%, భూస్వామి పెడితే 50% కౌలుదారుకు దక్కేలా చట్టం చేశారు. 2. వియత్నాంలో భూస్వాముల నుండి భూమిని సేకరించి భూమిలేని పేద రైతులకు భూమిని పునఃపంపిణీ చేయటం జరిగింది.
3. అన్ని రాష్ట్రాలలో కాకుండా పశ్చిమబెంగాల్ లో మరియు దేశంలో పాక్షికంగా భూసంస్కరణలు అమలయ్యాయి. 3. వియత్నాంలోని ఉత్తర భాగానికి ఈ భూసంస్కరణ లను అమలు చేయడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Textbook Page No.277

ప్రశ్న 18.
కౌలుదార్లకు రక్షణ లభించటం వల్ల ఉత్పత్తి ఎందుకు పెరిగింది?
జవాబు:

  1. కౌలుదార్లకు రక్షణ లభించటం వల్ల తమను కౌలు నుండి తీసేస్తారేమో అనే భయాలు తొలగిపోయాయి. కావున ధైర్యంగా మరియు స్వంత భూమి అనే భావనతో పూర్తి శ్రమను ఉపయోగించి సాగుచేయడం మూలంగా పంట పెరిగింది.
  2. రక్షణ లభించడం మూలంగా పొలం మీద అవసరం అయిన పెట్టుబడి పెట్టి మంచి ఎరువులు, పురుగుమందులను ఉపయోగించడం మూలంగా కూడా పంట పెరిగింది.
  3. కౌలుదార్లు పాత కాలంలో పంటసరిగా పండినా, పండకపోయినా భూస్వాములకు కౌలు మొత్తం చెల్లించవలసి వచ్చేది. కానీ కౌలుదార్లకు రక్షణ లభించటం వల్ల కేవలం పంట పండిన దానిని ఆధారంగా చేసుకొని కౌలు చెల్లించటం వల్ల కూడా ఉత్పత్తి పెరిగింది.
  4. భూసంస్కరణల మూలంగా కౌలుదారు, భూస్వామికి ఎంత పంట చెల్లించాలనేది స్పష్టంగా తెలియటంతో కౌలుదారుకి మిగులు ఎక్కువగా ఉండి, ఇంకా అధికోత్పత్తిని సాధించాలని ఆశపడేవాడు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

SCERT AP 10th Class Social Study Material Pdf 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Studies 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
రష్యన్ విప్లవం ఆ సమాజంలో ఎన్నో మార్పులను తెచ్చింది. అవి ఏమిటి ? వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి? (AS1)
జవాబు:
రష్యన్ విప్లవం సమాజంలో ఎన్నో మార్పులను తెచ్చింది. 1917లో ప్రారంభమైన రష్యన్ విప్లవం ఫలితంగా 1920 నాటికి అనేక మార్పులు జరిగాయి.

  1. జార్ చక్రవర్తుల పాలన దూరమై ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వాళ్ళు పరిపాలన చేపట్టారు.
  2. రష్యాలో “బోల్షివిక్”లు లెనిన్ నాయకత్వంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
  3. షరతులు లేని శాంతిని నెలకొల్పి, భూమినంతటినీ జాతీయం చేసి దానిని రైతులందరికీ పంచిపెట్టడం జరిగింది.
  4. ధరలను నియంత్రించి కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేశారు.
  5. స్టాలిన్ ఆధ్వర్యంలో రష్యాను బలమైన శక్తిగా మార్చి, పంచవర్ష ప్రణాళికలతో ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థను చేపట్టారు.

ఎదుర్కొనే సవాళ్ళు :

  1. భూముల ఏకీకరణ సందర్భంగా పెద్ద రైతులు వ్యతిరేకించగా హింస, మరణశిక్షలు అమలుచేశారు.
  2. 1929-30 లో తీవ్ర కరవు ఎదురై, చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
  3. స్వేచ్ఛా మార్కెట్ కి అనుమతి లేకుండాపోయింది.
  4. ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో కర్మాగారాలు మూతబడి, వేలాదిమంది నిరుద్యోగులుగా మారారు.
  5. సాధారణ ప్రజాస్వామిక స్వేచ్ఛ లేదు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 2.
తీవ్ర మాంద్యానికి కారణాల గురించి భిన్న వాదనలను పోల్చండి. వాటిల్లో దేనితో మీరు ఏకీభవిస్తారు ? కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
1929 చివరలో మొదలైన తీవ్ర ఆర్థికమాంద్యం 1939 వరకు కొనసాగింది.

  1. మొదటి ప్రపంచయుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది.
  2. అమెరికాలో స్టాక్ మార్కెట్ కుప్పకూలడం వలన దాని పరిణామాలు అనతికాలంలోనే అన్ని దేశాలను ప్రభావితం చేశాయి.
  3. నిరుద్యోగం పెరిగి ఆదాయాలు తగ్గి ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలు, ప్రభుత్వాలు కూడా ప్రభావితం అయ్యాయి.
  4. గిరాకీ తగ్గడంతో కర్మాగారాలు మూతబడి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది.

ప్రశ్న 3.
నాజీ జర్మనీల చేతిలో యూదులు ఏ విధమైన వేధింపులకు గురయ్యారు? ప్రతి దేశంలోనూ కొంతమంది తమ ప్రత్యేక గుర్తింపు కారణంగా వేరుగా చూడబడుతున్నారా? (AS4)
జవాబు:
నాజీ జర్మనీల చేతిలో యూదులు అనేక వేధింపులకు గురయ్యారు.

  1. అల్పసంఖ్యాక వర్గ ప్రజలైన యూదులను అరెస్టు చేసి హింసించేవాళ్ళు.
  2. అంతకు ముందెన్నడు లేనంతగా దారుణాలకు ఒడిగట్టారు.
  3. నిర్బంధ శిబిరాలకు తరలించి, వారిని దేశం నుంచి బహిష్కరించారు.
  4. రెండవ ప్రపంచయుద్ధం నీడలో అమాయకులైన ఆరు కోట్ల మంది యూదులను నిర్దాక్షిణ్యంగా చంపించారు.
  5. ఆష్విట్జ్ వంటి హత్యాకేంద్రాలలో యూదులను గదులలోకి పంపి, దాంట్లోకి గ్యాసు పంపించడం ద్వారా చంపేసేవాళ్ళు.

ప్రతి దేశంలోనూ కొంతమంది తమ ప్రత్యేక గుర్తింపు కారణంగా వేరుగా చూడబడుతూ వివక్షతకు, అన్యాయాలకు, బలవంతపు చావులకు బలౌతున్నారు.

ప్రశ్న 4.
తీవ్ర మాంద్య పరిస్థితులలో సంక్షేమ రాజ్యం అన్న భావన కింద చేపట్టిన వివిధ చర్యలను పేర్కొనండి. రష్యాలో చేపట్టిన సంస్కరణలకూ, వీటికీ ఉన్న పోలికలు, తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
తీవ్ర మాంద్య పరిస్థితులలో సంక్షేమ రాజ్యం అనే భావన కింద చేపట్టిన చర్యలు :

  1. సామాజిక భద్రతా విధానాన్ని అమలుచేశారు.
  2. అందరికీ వర్తించే పదవీ విరమణ, పింఛను, నిరుద్యోగ బీమా, వికలాంగులకు సంక్షేమ ప్రయోజనాలు సమకూర్చాయి.
  3. తండ్రిలేని కుటుంబాలలో అవసరమున్న పిల్లలకు ప్రయోజనం చేకూర్చే పనులు చేపట్టారు.
  4. కనీస జీవనస్థాయి, ఆహారం, గృహవసతి, ఆరోగ్యం , విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ వంటి మౌలిక అంశాలకు హామీ ఇచ్చింది.

పోలికలు :
రష్యాలో కూడా రష్యన్ విప్లవం తరువాత

  1. ధరలను నియంత్రించి, కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేశారు.
  2. భూమిని పునః పంపిణీ చేసి
  3. అసమానతలు, పుట్టుక, లింగం, భాష వంటి ప్రాతిపదికన వివక్షతలేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి రష్యా ప్రయత్నించింది.

తేడాలు:

  1. రష్యాలో దీర్ఘ కాలికంగా లాభం చేకూర్చి పథకాలు అమలు చేయగా, సంక్షేమ రాజ్యంలో తక్షణం లబ్ధి చేకూర్చే పథకాలు అమలుచేసారు.
  2. ఫ్యూడల్ భూస్వాములు, రాజులు, పెట్టుబడిదారులు వంటి దోపిడీదారులు లేని దేశాన్ని నిర్మించడానికి రష్యా ఒక బృహత్ ప్రయోగం చేపట్టగా, సంక్షేమ రాజ్యంలో భాగంగా ప్రజలందరికీ కనీస జీవనస్థాయి, మౌళిక అంశాలకు ప్రాధాన్యత.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 5.
తీవ్ర మాంద్యంతో జర్మనీ ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి? నాజీ పాలకులు, హిట్లర్ వాటిని ఎలా ఉపయోగించుకున్నారు? (AS1)
(లేదా)
జర్మనీలో నాజీజం ప్రాబల్యం పెరగడానికి దారితీసిన పరిస్థితులేవి?
జవాబు:
తీవ్ర మాంద్యంతో జర్మనీ అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం అయింది.

  1. పారిశ్రామిక ఉత్పత్తి 40% పడిపోయింది.
  2. నిరుద్యోగుల సంఖ్య ముందెన్నడూ లేని విధంగా 60 లక్షలకు చేరింది.
  3. పురుషులు “ఏ పని చేయడానికైనా సిద్ధం” అనే బోర్డులు మెడలో వేసుకొని తిరిగేవాళ్ళు.
  4. తమ పిల్లల కడుపులు నింపలేని మహిళలు తీవ్ర నిస్పృహకు లోనయ్యారు.
  5. ప్రభుత్వం కుప్పకూలి స్థిరమైన పాలన లేకుండాపోయింది.

పై పరిస్థితులను, నాజీ పాలకులు, హిట్లర్ తమకు అనుకూలంగా మలచుకున్నారు. తీవ్ర నిరాశ, నిస్పృహలతో . ఉన్న దేశ ప్రజలను నాజీలు, హిట్లర్ ఉద్వేగ ప్రసంగాలతో అందరినీ ఆకర్షించారు.

  1. కుదేలైన ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించి తిరిగి యథాస్థితికి తెస్తామని మాట ఇచ్చారు.
  2. పని కావాలి అనుకుంటున్న వాళ్ళకి పని, యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని వాగ్దానం చేశారు.
  3. ప్రజల మధ్య ఐకమత్యం పెంచడానికి, సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ప్రదర్శనల ద్వారా ప్రజలను మంత్రముగ్ధుల్ని చేశారు.

ఈ విధంగా జర్మనీలో నాజీజం ప్రాబల్యం పెరిగింది.

ప్రశ్న 6.
నాజీ పాలనలో తీసుకొచ్చిన రాజకీయ మార్పులు ఏమిటి? ఒక బలమైన నాయకుడు ఉంటే చాలు దేశ సమస్యలు తీరిపోతాయని తరచు ప్రజలు వాదిస్తూ ఉంటారు. నాజీ జర్మనీలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ వాదనకు ఎలా స్పందిస్తారు? (AS4)
జవాబు:
నాజీ, పాలనలో, హిట్లర్ నాయకత్వంలో రాజకీయంగా అనేక మార్పులు తీసుకొచ్చారు.

  1. రాజకీయాలలో నాజీలు ఒక కొత్త శైలిని ప్రవేశపెట్టారు.
  2. పెద్ద ఎత్తున జన సమీకరణ చెయ్యటంలో ఆచారాలు, అద్భుత దృశ్యాల ప్రాముఖ్యతను వివరించారు.
  3. స్వస్తిక్ గుర్తుతో ఎర్ర జెండాలు, నాజీ వందనం, ఉపన్యాసాల తరువాత చప్పట్లు కొట్టడం వంటివెన్నో పెనుమార్పులు చేశారు.
  4. ప్రపంచంపై జర్మనీ ఆర్యజాతి ఆధిపత్యాన్ని నెలకొల్పుతామన్న వాగ్దానంతో ఆకర్షించారు. బలమైన నాయకుడు ఉంటే దేశ సమస్యలు తీరుతాయి అనే ప్రజల వాదనలో వాస్తవముంది.

హిట్లర్ నాయకత్వం పట్ల ప్రజలకు నమ్మకం కలిగి మెరుగైన భవిష్యత్తునాశిస్తూ ఆ పార్టీకి తిరుగులేని నాయకుడిగా అతడిని నిలబెట్టారు. అయితే 1928 లో జర్మనీ పార్లమెంటు రీచ్ స్టాగ్ లో నాజీ పార్టీకి 2.6 శాతం ఓట్లు కూడా రాలేదు. కాని హిట్లర్ ను బలమైన నాయకుడిగా ప్రజలు గుర్తించిన పిదప 1937 నాటికి 37 శాతం ఓట్లతో నాజీ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.

10th Class Social Studies 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II InText Questions and Answers

10th Class Social Textbook Page No.192

ప్రశ్న 1.
సమానత్వం, స్వేచ్ఛ, సంపదలతో కూడిన ప్రపంచాన్ని నిర్మించటంలో సోవియట్ ప్రయోగం ఏ మేరకు విజయం సాధించిందో అంచనా వేయండి.
జవాబు:
సమానత్వం, స్వేచ్ఛ, సంపదలతో కూడిన ప్రపంచాన్ని నిర్మించటంలో సోవియట్ చాలా వరకు విజయం సాధించి బలమైన శక్తిగా ఎదిగింది. భూమినంతటినీ జాతీయం చేసి, దానిని రైతులందరికీ పంచిపెట్టి, బ్యాంకులను జాతీయం చేసి, ఫ్యూడల్ భూస్వాములు, రాజులు, పెట్టుబడిదారులు వంటి దోపిడీదారులు లేని దేశాన్ని నిర్మించటానికి ఒక బృహత్తర ప్రయోగం అమలుచేశారు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 2.
ఇటువంటి ప్రయోగాల కోసం వేలాదిమందిని చంపటం సమర్థనీయమేనా?
జవాబు:
సమర్ధనీయం కాదు. జార్జ్ ఆర్వెల్ అన్న రచయిత “యానిమల్ ఫాం” అన్న తన ప్రఖ్యాత వ్యంగ్య నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను USSR ఎలా నీరు కార్చిందో వివరించాడు. ప్రతిపక్షాన్ని హింసాత్మకంగా నిర్మూలించడం. ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపడం హేతుబద్ధం కాదు. ప్రజలలో మార్పు తెచ్చి, ప్రజలకు విశ్వాసపాత్రులుగా వ్యవహరించాలి.

ప్రశ్న 3.
కమ్యూనిస్టు విధానాలపై వచ్చిన విమర్శలు ఏమిటి?
జవాబు:
సమానత, జాతి స్వేచ్ఛ వంటి ఆదర్శాల పట్ల నిబద్ధత గల ప్రపంచవ్యాప్త ప్రజలందరిలో కమ్యూనిస్టు విధానాలు కొంతకాలం ఆమోదం పొందినప్పటికీ కమ్యూనిస్టులు విప్లవాల కోసం కృషి చేశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను అణచివెయ్యడం, హింసాత్మకంగా నిర్మూలించడం, బహుళపార్టీ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లేకపోవడం వంటి దారుణమైన కమ్యూనిస్టు విధానాలు విమర్శలపాలైనాయి. భూముల ఏకీకరణను వ్యతిరేకించిన పెద్ద రైతులను జైలుపాలు చేసి, విదేశాలకు పంపించడమే కాకుండా, మరణశిక్షలు కూడా వేసి విమర్శలపాలైనారు.

ప్రశ్న 4.
భారతదేశంలో ఈనాడు సంక్షేమ రాజ్యంలోని ఏ ఏ అంశాలు అమలులో ఉన్నాయి?
జవాబు:
భారతదేశంలో ఈనాడు సంక్షేమ రాజ్యంలోని అనేక అంశాలు అమలులో ఉన్నాయి.

  1. అందరికీ వర్తించే పదవీ విరమణ పింఛను.
  2. వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు నెలసరి పింఛను.
  3. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర
  4. ఆరోగ్య పథకాలు
  5. శిశుసంరక్షణ పథకాలు
  6. ఆహారం, గృహవసతి, విద్య, వైద్య సహాయాలు
  7. ప్రజలందరికీ కనీస జీవనస్థాయి

10th Class Social Textbook Page No.197

ప్రశ్న 5.
నాజీ సిద్ధాంతం అధికస్వామ్య సూత్రాలపై ఆధారపడి ఉంది. జర్మనీ జనాభాలో యూదులు 0.75 శాతం మాత్రమే. యూదులనే కాకుండా నాజీలను వ్యతిరేకించే వాళ్ళను కూడా శిక్షించే వాళ్ళు. పాస్టర్ నీ మొల్లర్ తన కవితలో దీనిని ఎలా చూపించాడు?
జవాబు:
నాజీ సామ్రాజ్యంలో పాలకశక్తులు సాధారణ ప్రజలపై, యూదులపై దారుణమైన హింసను, దమనకాండను సాగించాయి. అందుకనే కవితలో పాస్టర్ నీ మొల్లర్ ఇలా చెప్పాడు. “కమ్యూనిస్టులు, సోషల్ డెమోక్రాట్లు, కార్మిక సంఘాలు, యూదులు కోసం వచ్చి, వెతికి చివరకు పైవారెవరు కాని నన్ను కూడా తీసుకెళ్ళారు. పై వారి కోసం వచ్చినపుడు నేను నిరసన తెలియజేశాను. కానీ నా కోసం నాజీలు వచ్చినపుడు నాకు నిరసన తెలిపేవారు మిగలలేదని” రాసుకొచ్చాడు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Textbook Page No.199

ప్రశ్న 6.
జర్మను ప్రజల శత్రువులుగా హిట్లర్ యూదులను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం, ఆర్ధికమాంద్యం వలన జర్మనీ ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కబడింది. జర్మనీలో ఎదురైన అన్ని సమస్యలకు మూలం యూదులని హిట్లర్ ప్రగాఢ నమ్మకం. కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం రెండింటినీ యూదుల కుట్రగా పేర్కొంటూ, ఆ రెండింటినీ తిప్పికొట్టే క్రమంలో యూదులను తుదముట్టించడానికి హిట్లర్ పూనుకొన్నాడు.

ప్రశ్న 7.
హెలోకాస్ట్ గురించి, ఆష్విల్ట్ తరహా శిబిరాల గురించి మరింత తెలుసుకుని వాటి ఆధారంగా ఒక నివేదిక తయారు చేయండి.
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం నీడలో జర్మనీ మానవ మారణహోమాన్ని చేపట్టింది. దీని ఫలితంగా అమాయకులైన ఎంపిక చేయబడ్డ పౌరులు పెద్ద సంఖ్యలో చంపివేయబడ్డారు. ప్రజలను చంపటానికి నాజీలు అంతకు ముందెన్నడూ లేని విధానాలను కనుగొన్నారు. ఉదాహరణకు “ఆష్విట్జ్” వంటి హత్యాకేంద్రాలలో ప్రజలను గదులలోనికి పంపి దాంట్లోకి గ్యాస్ పంపించడం ద్వారా చంపేసే వాళ్ళు.

10th Class Social Textbook Page No.200

ప్రశ్న 8.
యుద్ధం, తీవ్రమాంద్యం తరువాత జాతీయ అభివృద్ధికి అనేక నమూనాలు ముందుకు వచ్చాయి. వాటిని పేర్కొని, వాటి పరిమితులను కూడా పేర్కొనండి.
జవాబు:
నమూనాలు :
యుద్ధం, తీవ్ర మాంద్యం తరువాత జాతీయ అభివృద్ధికి అనేక కొత్త నమూనాలు ముందుకు వచ్చాయి.

అవి:

  1. రాజ్యం, ప్రజలందరూ గౌరవంగా బ్రతకడానికి అవసరం అయిన కనీస మౌలిక అవసారాలను కల్పించాలి.
  2. రాజ్యం, ప్రజల ప్రాథమిక అవసరాలైన ఆహారం, నివాసం, ఆరోగ్యం, పిల్లలు, వృద్ధుల పరిరక్షణ, విద్య వంటి వాటికి ప్రాధాన్యతను ఇవ్వాలి.
  3. రాజ్యం విశాలమైనది. సమర్థులైన పౌరులందరికి ఉద్యోగాలు కల్పించవలసిన బాధ్యత రాజ్యానిదే.

పరిమితులు :
ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సాధారణ పరిస్థితులలో మాత్రమే అమలు చేయుటకు వీలవుతాయి.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Textbook Page No.190

ప్రశ్న 9.
విప్లవం గురించి గ్రామీణ ప్రాంతంలో రెండు పక్షాలను పాఠ్యాంశంలోనిది చదవండి. ఆ ఘటనలకు మీరు కూడా సాక్షిగా ఊహించుకోండి. 1) ఎస్టేట్ యజమాని 2) చిన్న రైతు 3) పత్రికా విలేఖరిగా ఆనాటి ఘటనల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
1) ఎస్టేట్ యజమాని :
గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితులు కానవస్తున్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. ఈ ఆస్తి, భూములు మాకు చెందుతాయో, కోల్పోతామో తెలియడం లేదు. కాని ప్రజల అంతరాత్మ సజీవంగా ఉందని మాకు సంతోషంగా ఉంది.

2) చిన్న రైతు :
నిశ్శబ్దంగా, శాంతియుతంగా ఎటువంటి బాధ లేకుండా తిరుగుబాటు జరిగిపోయింది. మాకు రెండు ఆవులు, రెండు గుర్రాలను ఉంచారు. పనివాళ్ళను ప్రశాంతంగా బ్రతకనివ్వమని, మానవత్వంతో చూడమని వేడుకున్నారు.

3) పత్రికా విలేఖరి :
1917 అక్టోబర్ 25 విప్లవం గ్రామీణ ప్రాంతాలలో పెనుమార్పులకు నాంది పలికింది. ప్రజలు ఉత్సాహంతో స్వాగతించారు. ఉచితంగా భూమి లభించి, ఆనందంగా బ్రతకవచ్చని తలచారు. జార్ భవనాలను కూలగొట్టి శిథిలాలుగా వదిలేశారు.

10th Class Social Textbook Page No.194

ప్రశ్న 10.
ప్రపంచాన్ని జయించాలన్న భావనను హిట్లర్ ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడా? బలం, శక్తి ఉన్న వాళ్ళకే ఈ ప్రపంచం చెందాలని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
బలం, శక్తి ఉన్న వాళ్ళకే ఈ ప్రపంచం చెందాలని నేను అనుకోవడం లేదు. ప్రపంచాన్ని జయించాలన్న ఆలోచన హిట్లర్కు బలీయంగా ఉంది. ఆనాటి పరిస్థితులు, వర్సయిల్స్ సంధి షరతులతో పాటు అన్నిటికంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉందని ఈ సందర్భంగా హిట్లర్ అభిప్రాయం. తన ఉపన్యాసాలతో, నాజీ పార్టీ సిద్ధాంతాలతో పాటు దురహంకారపూరిత జాతీయతావాదం ద్వారా, సైనికవాదం అమలుచేయడం ద్వారా సిద్ధాంత బోధనతో ప్రజలను మైమరపించి, ప్రపంచంలో గల దేశాలను భయపెట్టి ప్రపంచాన్ని జయించాలన్న భావన ఈ సందర్భంగా హిట్లర్ ప్రతిపాదిస్తున్నాడు.

ప్రశ్న 11.
ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయి, కొన్ని సంవత్సరాలపాటు ఉద్యోగం దొరకని కార్మికులుగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీ జీవితంలోని ఒక రోజు గురించి రాయండి.
జవాబు:
ఉద్యోగం కోల్పోయి కొన్ని సంవత్సరాలపాటు ఉద్యోగం దొరకని కార్మికుల జీవనం దుర్భరం. మాటల్లో వర్ణించలేము.

ఒక రోజు :
ఆ రోజు ఉదయం నుండి వెతలే. మంచాన పడిన తండ్రి, నా వంక దీనంగా చూసి, వైద్యం’ చేయించమనే మాటతో నా కళ్ళు చెమర్చాయి. నాన్నా ! స్కూల్ కు ఫీజు కట్టడానికి ఈ రోజు ఆఖరు, అన్న 10 సం||రాల రేవతి ఏడుపు ఓదార్చలేనిది. ఏమండీ ! ఈ రోజు వంటకి దినుసులు లేవన్న భార్య మాటలు ఇంకా చెప్పనలవి కాదు. ఉద్యోగ ప్రయత్నం చేయడానికి బయటకు వెళ్ళడానికి కూడా చార్జీలు లేని స్థితిని నేను చెప్పలేను.

ప్రశ్న 12.
పండించిన పంట ధర సగానికంటే తక్కువకు పడిపోయిన రైతుగా మిమ్మల్ని ఊహించుకోండి. మీ స్పందనను మూడు వందల పదాలలో రాయండి.
జవాబు:
పంట చేతికి రాగానే మార్కెట్లో అప్పటివరకు ఉన్న ధర అమాంతం సగానికి పడిపోగా నా కళ్ళు చెమర్చాయి. అప్పుచేసి వ్యవసాయం చేసి, వడ్డీలకు ఎరువులు, పురుగుమందులు కొన్న నాకు ఈ ధరతో చేసిన రుణం ఎలా తీర్చగలను ? వారికి ఎలా సమాధానం చెప్పగలను? పండిన పంట ధరతో వచ్చిన డబ్బుతో పండగకి పిల్లలకు బట్టలు తీసి, ఆనందంగా జీవితం గడుపుదామనుకుంటే, ఎందుకీ దుస్థితి దాపురించింది ? నేనెవరికి ద్రోహం చేశాను అని మదనపడుతున్నాను. ” వ్యవసాయం జూదంలా పరిణమించడం ఈ పరిస్థితికి కారణం.

10th Class Social Textbook Page No.195

ప్రశ్న 13.
పిల్లల్ని పెంచే శ్రమ, బాధలకే మహిళలు పరిమితం కావాలన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
నేను ఏకీభవించను. సమాజంలో కుటుంబానికి గుర్తింపు, పిల్లల భవిష్యత్తుకై మార్గదర్శకత్వం చేసి వీటికోసం తన శక్తి నంతటినీ ఒడి, భర్తకు చేదోడువాదోడుగా ఉండి, అనునిత్యం కుటుంబ పురోభివృద్ధికి ఆధారంగా ఉండేది మహిళలు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తన కుటుంబ అభివృద్ధికి దిక్సూచి వంటివారు మహిళలు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 14.
పిల్లల పెంపకం, కర్మాగారాలు, కార్యాలయాలు, పొలాల్లో పనిచెయ్యటం వంటి జీవితానికి సంబంధించిన అంశాలలో స్త్రీ, పురుషులు సమానంగా భాగస్వాములు కాగలరని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
పిల్లల పెంపకం, కర్మాగారాలు, కార్యాలయాలు, పొలాల్లో పనిచెయ్యటం వంటి జీవితానికి సంబంధించిన అంశాలలో సీ, పురుషులు సమాన భాగస్వాములు. ఎందుకంటే పిల్లల పెంపకం, అమ్మ ప్రేమ, నాన్న లాలన పిల్లలకు ఎంతో అవసరం. పిల్లల పెంపకంలోనూ, పిల్లలను సన్మార్గంలో నడిపించుటలోను ఇరువురూ బాధ్యులే. కార్యాలయాల్లో స్త్రీ, పురుషులు ఇరువురు తమ మేధాశక్తితో సమానంగా పనిచేయగలరు. కర్మాగారాలు, పొలాల్లో తమతమ శక్తి మేరకు ఇరువురు కూడా పనిచేసి ఆయా పనులకు న్యాయం చేస్తారు.

10th Class Social Textbook Page No.199

ప్రశ్న 15.
హిట్లర్ సిద్ధాంతం, ఆర్థిక విధానాల ఫలితంగా రెండవ ప్రపంచ యుద్ధం సంభవించిందని ఎలా చెప్పవచ్చు?
జవాబు:
హిట్లర్ అద్భుతమైన వక్త. తన పదునైన ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజితులను చేశాడు. మొదటి ప్రపంచయుద్ధం తరువాత యుద్ధ నష్టాల చెల్లింపులు వంటి వాటి భారం వల్ల జర్మనీ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడింది. కార్మికులు ఉపాధి కోల్పోయారు. వేతనాలు తగ్గాయి. జర్మనీ వీధులలో పురుషులు “ఏ పని చేయడానికైనా సిద్ధం” అని రాసి ఉన్న కారులు మెడలో తగిలించుకొనేవారంటే ఆనాటి పరిస్థితిని అంచనా వేయవచ్చు.

ఇటువంటి పరిస్థితులలో హిట్లర్ తన సిద్ధాంతం ద్వారా ఇటు ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంచి, మరో ప్రక్క ప్రపంచ దేశాలలో అభద్రతాభావం, సైనికవాదాలు, జాత్యహంకారాలతో ప్రపంచం భయపడేటట్టు చేసి, పోలెండ్ పై నిర్దాక్షిణ్యంగా దాడి చేసి రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Textbook Page No.200

ప్రశ్న 16.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రష్యా, జర్మనీల అనుభవాలను పోల్చండి. వాటిల్లో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. మొదటి ప్రపంచయుద్ధం తరువాత జర్మనీ, రష్యా రెండు దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి.
  2. రష్యాలో లెనిన్, స్టాలిన్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ రాజ్య కార్యక్రమాలు అమలు జరుగగా, జర్మనీలో కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ప్రజారంజక కార్యక్రమాలు రూపొందించారు.
  3. ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉండడానికి జర్మనీ, రష్యా దేశాలు ప్రయత్నించాయి.

తేడాలు :

  1. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ రెండు దేశాలలో జర్మనీ ఆర్థికంగా మరియు బలీయమైన ప్రాంతాలను రష్యా కంటే – ఎక్కువగా పోగొట్టుకుంది.
  2. రష్యాలో భూముల ఏకీకరణ ద్వారా సామూహిక క్షేత్రాలకు, వ్యవసాయానికి ప్రాధాన్యతనీయగా, జర్మనీ వ్యవసాయ రంగాన్ని విస్మరించింది.
  3. రష్యా ప్రపంచంలో కార్మికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వగా, సౌజీ పార్టీ సిద్ధాంతాలకు జర్మనీ ప్రాధాన్యం ఇచ్చింది.
  4. ఆర్ధికమాంద్యం సమయంలో జర్మనీ కంటే రష్యా బాగా చితికిపోయింది.
  5. జర్మనీ ప్రతీకార చర్యలతో సౌగగా, రష్యాదేశం అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది.
  6. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత రష్యా అగ్రదేశం కాగా, జర్మనీ కుదేలైంది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

SCERT AP 10th Class Social Study Material Pdf 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Studies 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బ్రాకెట్టు ముందున్న వ్యాఖ్యానానికి సంబంధించి అనువైన వ్యాఖ్యానం / వ్యాఖ్యానాలను బ్రాకెట్టు లోపల ఉన్నవాటి నుంచి గుర్తించండి. (AS1)
అ) రాజకీయ సమానత్వాన్ని దీనితో గుర్తించవచ్చు (ఏ పాఠశాలలోనైనా ప్రవేశం పొందే హక్కు, ఒక వ్యక్తి – ఒక ఓటు అన్న సూత్రం, దైవారాధన ప్రదేశంలోకి ప్రవేశించే హక్కు)
ఆ) భారతదేశ విషయంలో అందరికీ వయోజన ఓటు హక్కు అంటే (అందరినీ ఏదో ఒక రాజకీయ పార్టీకి ఓటు వెయ్యటానికి అనుమతించటం, అందరినీ ఎన్నికలలో ఓటు వెయ్యటానికి అనుమతించటం, అందరినీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యటానికి అనుమతించటం)
ఇ) కాంగ్రెస్ ఆధిపత్యం దీని వల్ల సాధ్యమయ్యింది (విభిన్న సిద్ధాంతాలు ఉన్న వాళ్లని ఆకర్షించగలగటం, ఎన్నికల తరువాత అత్యధిక శాసన సభా స్థానాలను గెలుచుకోగలగటం, ఎన్నికలలో పోలీసు బలగాన్ని ఉపయోగించుకోగలగటం)
ఈ) అత్యవసర పరిస్థితి ఫలితంగా (ప్రజల హక్కులకు పరిమితులు విధింపబడ్డాయి. పేదరికం తొలగింపబడింది. అన్ని రాజకీయ పార్టీల ఆమోదం పొందింది)
జవాబు:
అ) ఒక వ్యక్తి – ఒక ఓటు అన్న సూత్రం
ఆ) అందరినీ ఎన్నికలలో ఓటు వెయ్యటానికి అనుమతించటం
ఇ) విభిన్న సిద్ధాంతాలు ఉన్న వాళ్లని ఆకర్షించగలగటం
ఈ) ప్రజల హక్కులకు పరిమితులు విధింపబడ్డాయి.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 2.
స్వాతంత్ర్యం వచ్చిన తొలి సంవత్సరాలలో సామాజిక-ఆర్థిక మార్పు తీసుకురావటానికి ఏ చర్యలు చేపట్టారు? (AS1)
జవాబు:
రాజ్యాంగ సభ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, హోదా, అవకాశాలలో సమానత్వాన్ని కోరుకుంది. కొత్త రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన నెల రోజులకు ప్రణాళికా సంఘాన్ని ఏర్పరిచారు. మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రీకరించి ఆహార ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించబడింది. వ్యవసాయ రంగంలోని మార్పును నెహ్రూ కేవలం ఆర్ధిక అంశంగా చూడలేదు, దానిని గ్రామీణ రంగ రాజకీయ, సామాజిక, ఆర్ధిక మార్పుగా పరిగణించాడు. కావున సామాజిక – ఆర్థిక మార్పు తీసుకురావడానికి నెహ్రూ ఈ క్రింది చర్యలను చేపట్టినాడు. ప్రధానంగా మూడు అంశాలున్నాయి.
అవి :

  1. భూసంస్కరణలు
  2. వ్యవసాయ సహకార సంఘాలు
  3. స్థానిక స్వపరిపాలన

1) భూసంస్కరణలు :
మూడు రకాలైన భూసంస్కరణలను నెహ్రూ ప్రతిపాదించాడు.
ఎ) జమిందారీ వ్యవస్థ రద్దు
బి) కౌలు విధానాల సంస్కరణ
సి) భూ పరిమితి విధానాలు

ఈ మూడు సంస్కరణల ముఖ్య ఉద్దేశం దున్నే వానికి, భూమి చెందేలా చూసి మరింత ఉత్పత్తి చెయ్యటానికి ప్రోత్సహించటం.

2) వ్యవసాయ సహకార సంఘాలు :
సహకార సంఘాల ద్వారా ఆర్థికంగా లాభసాటి పరిమాణాన్ని చేరుకోవటమే కాకుండా విత్తనాలు, ఎరువులు, రసాయనాలు వంటి విలువైన ఉత్పాదకాలను అందించాలి.

3) స్థానిక స్వపరిపాలన :
భూసంస్కరణలు అమలు అయ్యేలా చూసి, గ్రామ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా సహకార సంఘాలు నడిచేలా చూస్తాయి.

మొదటి పంచవర్ష ప్రణాళికలో పెద్ద ఆనకట్టలు కట్టి విద్యుత్తు ఉత్పత్తి, సాగునీటి కల్పనల ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేయుటపై దృష్టి సారించారు. ఆనకట్టల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వృద్ధి చెందాయి. దేశం ప్రగతి సాధించాలంటే పరిశ్రమలను అభివృద్ధి చేసి, ఎక్కువ మంది కర్మాగారాలలోనూ, సేవారంగంలోనూ పనిచేసేలా మళ్లించాల్సిన అవసరం ఉందని ప్రణాళిక కర్తలు గుర్తించి, రెండవ పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రాధాన్యత పరిశ్రమల వైపునకు మళ్లించారు.

ప్రశ్న 3.
ఒక పార్టీ ఆధిపత్యం అంటే ఏం అర్థం చేసుకున్నారు? అది ఎన్నికలలో మాత్రమే ఆధిపత్యమా, లేక సిద్ధాంత భావజాలంలో కూడా ఆధిపత్యమా? మీ కారణాలను పేర్కొంటూ చర్చించండి. (AS1)
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1952, 1957, 1962 లలో జరిగిన మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. భారతదేశానికి జవహర్‌లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయ్యాడు. ఇతర పార్టీలలో ఏ ఒక్క పార్టీకి కూడా 11% మించి ఓట్లు రాలేదు. కాంగ్రెస్ 70% పైగా స్థానాలను గెలుచుకుంది. ఈ విధంగా కాంగ్రెస్ ఆధిపత్యం ఒక ఎన్నికలలోనే కాదు, సిద్ధాంత, భావజాలంలో కూడా కొనసాగుతుంది.

కాంగ్రెస్ ఆధిపత్యానికి కారణాలు :

  1. 1952, 1957, 1962 లలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 45% ఓట్లతో విజయం సాధించి అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
  2. స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ నాయకత్వం మితవాదుల చేతులలో ఉండేది. తరువాత అతివాదులు, చిట్ట చివరికి గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ పనిచేసింది. జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్ లక్ష్యం దేశ స్వాతంత్ర్యం అవటం వల్ల ఈ సంస్థలో విభిన్న సిద్ధాంతాలు ఉన్న వ్యక్తులందరూ పనిచేశారు. అందువల్ల ఈ సంస్థకు బహుతావాద దృక్పథం ఏర్పడింది.
  3. స్వాతంత్ర్యం తరువాత రాజకీయ పార్టీగా మారిన వాతావరణంలో కూడా ఈ బహుతావాద దృక్పథాన్ని కాంగ్రెస్ వదులుకోలేక పోయింది. ఇందులో వామపక్షవాదులు, సంప్రదాయవాదులు, మితవాదులు అందరూ ఉన్నారు. విభిన్న శక్తులకు ఆశ్రయం కల్పించింది.
  4. కాంగ్రెస్ లో ఎల్లప్పుడూ అంతర్గతంగా చిన్నచిన్న బృందాలు ఉండేవి. ఈ బృందాలు నాయకుల మధ్య పోటీ కారణంగా ఏర్పడ్డాయి. పార్టీ లక్ష్యాలతో వీళ్లు ఏకీభవించినప్పటికీ కొన్ని విధానాల విషయంలో విభేదాలు ఉండేవి.
  5. సభ్యుల ప్రయోజనాలను బట్టి ఈ బృందాలు వివిధ అంశాలపై వేరు వేరుగా స్పందించేవి. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ విభిన్న దృక్పథాలు, ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా కనిపించేది. కొన్ని సందర్భాలలో ఈ బృందాలు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి నాయకత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి ప్రయత్నించేవి.
  6. ఏకపార్టీ ఆధిపత్యంలో ఉన్న పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లోపలే రాజకీయ పోటీ ఉంటూ ఉండేది. అయితే ఇతర పార్టీలు పోటీ చేశాయి. కానీ కాంగ్రెస్ ను సవాలు చేయగలిగే సంఖ్యలో స్థానాలను గెలుచుకోలేకపోయాయి.

ఇతర రాజకీయ పార్టీలు క్రమేపి బలం పుంజుకుని రెండు దశాబ్దాల కాలంలో అధికారానికి పోటీదారుగా ఎదిగాయి.

ప్రశ్న 4.
ఐక్యత సాధించే అంశంగానో లేక విభజించే దానిగానో భారతదేశ రాజకీయాలలో భాష కేంద్ర బిందువుగా అనేకసార్లు తెరమీదకు వచ్చింది. ఈ ఘటనలను గుర్తించి వాటిని వివరించండి. (AS1)
జవాబు:
కొత్తగా ఏర్పడిన దేశం ఎదుర్కొన్న మొదటి సవాళ్లలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలన్న కోరిక ఒకటి మరియు 1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీకి వ్యతిరేకంగా తమిళనాడు ఉద్యమాన్ని చేపట్టింది. ఈ విధంగా భాష అనేది భారతదేశంలో అనేక సందర్భాలలో కీలకమైన పాత్ర వహించింది.
1) బ్రిటిష్ కాలంలో దేశం ప్రెసిడెన్సీలు (కలకత్తా, మద్రాస్, బాంబే)గానూ, సెంట్రల్ ప్రావిన్సెస్, బీదర్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలుగానూ విభజింపబడి ఉండేది. దేశంలో అధికభాగం అనేక సంస్థానాల కింద ఉంది. ఈ రాష్ట్రాలలో పలు భాషలు మాట్లాడే ప్రజలు కలసి జీవిస్తున్నారు. ఒకే భాషను మాట్లాడుతూ పక్క పక్క ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలంతా ఒక రాష్ట్రంగా సంఘటితపరచాలంటూ కోరసాగారు. వీటితో సంయుక్త కర్ణాటక (మద్రాసు, మైసూరు, బాంబే, హైదరాబాదులలో కన్నడ మాట్లాడే ప్రజలను కలుపుతూ) సంయుక్త మహారాష్ట్ర, మహా గుజరాత్ ఉద్యమం, ట్రావెన్ కోర్-కొచ్చిన్ సంస్థానాల విలీనం, సిక్కులకు పంజాబ్ రాష్ట్రం వంటి కోరికలు ఉండేవి. అయితే మతం ఆధారంగా దేశ విభజన జరగడంతో నాయకులు ఆ భాషా ప్రాతిపదిక రాష్ట్రాలను పున్వ్యవస్థీకరిస్తే దేశం ముక్కలు కావటానికి దారితీస్తుందని భయపడసాగారు.

2) తెలుగు మాట్లాడే ప్రజలు అన్నిటికంటే తీవ్రంగా ఉద్యమాన్ని చేపట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలకు అనుగుణంగా కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని అమలు చెయ్యాలని వాళ్లు పట్టుపట్టారు. బ్రిటిష్ పాలనలో కూడా ఆంధ్ర మహాసభ క్రియాశీలంగా ఉండి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక్క తాటి కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. ఈ ఉద్యమం స్వాతంత్ర్యం తరువాత కూడా కొనసాగింది. విన్నపాలు, దరఖాస్తులు, వీధులలో కవాతులు, నిరాహారదీక్షలు వంటి పద్ధతులను ఇందుకు ఉపయోగించారు.

3) 1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీని మిగిలిన దేశం మీద రుద్దడానికి ఎత్తుగడగా భావించి, డి.ఎం.కె తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా సమ్మెలు, ధర్నాలు, హర్తాళ్ లు నిర్వహించారు. దిష్టిబొమ్మలు, హిందీ పుస్తకాలు, చివరికి రాజ్యాంగంలోని పేజీలను కూడా తగలబెట్టారు. ‘సైన్ బోర్డులలో హిందీలో ఉన్న దాని మీద చాలా చోట్ల నలుపు రంగు పూశారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఈ అల్లర్లను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది.

ఈ విధంగా జనాదరణ పొందిన ఈ భాషా ఉద్యమాల వల్ల ప్రభుత్వం తన అధికారిక స్థానాన్ని పునః సమీక్షించుకోవలసి వచ్చింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు, హిందీ వ్యతిరేక ఉద్యమాలలో ప్రధానమంత్రులు పరిస్థితులు చేజారిపోకుండా తమ దృక్పథాన్ని మార్చుకున్నారు. సమస్యలను పరిష్కరించడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 5.
1967 ఎన్నికల తరువాత రాజకీయ వ్యవస్థలో వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏవి? (AS1)
జవాబు:
భారతదేశ చరిత్రలో 1967 ఎన్నికలు చాలా కీలకమైనవి. ఎన్నికలను ప్రజలు అత్యంత ప్రధానమైనవిగా పరిగణిస్తున్నారని, వాటికి తమదైన ఉనికి ఉందని ఈ ఎన్నికలు రుజువు చేశాయి.

ముఖ్యమైన మార్పులు:

  1. స్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్ తక్కువ ఆధిక్యత (284 స్థానాలు) తో ఎన్నికయింది. కాంగ్రెస్ పార్టీ అంతకు ముందెన్నడూ చవిచూడని ఫలితాలను చవిచూసింది.
  2. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మద్రాస్, కేరళ శాసనసభలలో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది.
  3. తమిళనాడు, కేరళలో కూడా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. తమిళనాడులో డి.ఎం.కె. ఘనవిజయం సాధించింది. ప్రజాదరణ ఉన్న సినిమా హీరో ఎం.జి. రామచంద్రన్ మద్దతును డి.ఎం.కె. ఉపయోగించుకుంది.
  4. పశ్చిమబెంగాల్, ఒరిస్సాలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది.
  5. ఈ ఓటములతో కాంగ్రెస్ ఆంతరంగికంగా బలహీనపడింది. ఉత్తరాది రాష్ట్రాలలో స్వల్ప విజయాలు పొందిన చోట్ల దాని ప్రతినిధులు ప్రతిపక్షాలకు ఫిరాయించారు. ఫలితంగా కాంగ్రెస్ పడిపోయి ‘సంయుక్త విధాయక దళ్ (ఎస్వీడి) ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
  6. భారత రాజకీయ చరిత్రలో ఈ కొత్త ప్రభుత్వాలు ఒక మైలురాయిగా ఉంటాయి. ఒక విధంగా ప్రజాస్వామిక తిరుగుబాటును ఇది సూచిస్తుంది. మధ్యస్థాయి కులాలు భూసంస్కరణల వల్ల ప్రయోజనం పొంది, ఆర్ధికంగా లాభపడి, మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని పొందాయి.
    ఉదా : హర్యానా, ఉత్తరప్రదేశ్ లో జాట్, బీహార్ లో కుర్మి, ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, కమ్మ. ఈ కులాలు ఆయా రాష్ట్రాలలో ఆధిపత్య కులాలు.
  7. దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ భావాలు తిరిగి ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. దీనికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహించారు.
  8. 1969లో అసోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలలో ‘మేఘాలయ’ అన్న కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.
  9. 1966లో ఏర్పడిన పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా చండీఘర్ ని తమకు ఇమ్మని 1968-69లలో పంజాబ్ ప్రజలు ఆందోళనలు చేశారు.
  10. మహారాష్ట్రలో బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలన్న వింత వాదన మొదలయ్యింది. దీనికి ‘శివసేన’ నాయకత్వం వహించింది.
  11. బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లలో అనేక సమస్యలు తలెత్తాయి.

1967 ఎన్నికల తరువాత, పార్టీ లోపలి, పార్టీ బయట నుండి వచ్చే సమస్యలను ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎదుర్కొంది.

ప్రశ్న 6.
రాష్ట్రాలను ఏర్పరచటానికి మరొక ఆధారం ఏమైనా ఉందా? భాష ఆధారంగా పునఃవ్యవస్థీకరణ కంటే అది ఏ విధంగా మెరుగైనదిగా ఉండేది? (AS1)
జవాబు:
రాష్ట్రాలను ఏర్పరచటానికి భాష కాకుండా “భౌగోళికంగా” పునర్వ్యవస్థీకరిస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకనగా –
1) భాష ఆధారంగా పునర్వ్యవస్థీకరణ మూలంగా ఇటీవలి కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం.
ఉదా : తెలంగాణ ఉద్యమం. భాషా ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికి తెలంగాణా వాదులు మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తున్నారు.

2) భౌగోళికంగా రాష్ట్రాలను విభజించినట్లయితే భాషాపరంగా వచ్చే సమస్యలు వచ్చేవి కావు. భౌగోళికంగా విభజించినప్పుడు ఆ ప్రాంతంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ భాషలు మాట్లాడే ప్రజలుంటారు. కావున ప్రత్యేకంగా ఒక అంశం ఆధారంగా ఉద్యమాలు జరగకపోవచ్చు.

కావున నా అభిప్రాయం ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాషాపరంగా, కులాల, మతాల ప్రాతిపదికగా కాకుంటే, భౌగోళికంగా జరిగివుంటే బాగుండేది.

ప్రశ్న 7.
ఇందిరాగాంధి తీసుకున్న ఏ చర్యలను ‘వామపక్ష పంథా వైపు మళ్లించటం’గా పేర్కొన్నారు? అందుకు ముందు దశాబ్దాల విధానాలతో పోలిస్తే ఇవి ఏ విధంగా భిన్నమైనవి? ఆర్థికశాస్త్ర అధ్యాయాల ఆధారంగా ప్రస్తుత విధానాలకూ, వాటికీ తేడా ఏమిటో పేర్కొనండి. (AS1)
జవాబు:
1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో విజయం సాధించింది. “గరీబీ హటావో” అన్న జనాకర్శక నినాదంతో ఇందిరాగాంధీకి ప్రజాదరణ మరింత పెరిగింది. ప్రతిపక్షం అన్నది లేకుండా పోయింది. కాని ఇందిరాగాంధీ చేపట్టిన కొన్ని చర్యల మూలంగా వామపక్ష పంథావైపు మళ్లించటమనేది జరిగింది.

  1. 1973లో అరబ్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో చమురు ధరలు ఎన్నడూ లేనంతగా పెరగటంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది.
  2. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార కొరత, నిరుద్యోగం వంటివి ప్రభావం చూపసాగాయి.
  3. సామాజిక, ఆర్ధికమార్పు సాధించాలన్న లక్ష్యంతో అనేక ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ, చేసిన చట్టం, రాజ భరణాలను రద్దు చేస్తూ చేసిన చట్టాల విషయంలో, సామాజిక, ఆర్ధిక మార్పు అన్న పేరుతో రాజ్యాంగాన్ని తరచు సవరిస్తున్నారని, అది వాస్తవానికి దాని స్వరూపాన్ని మార్చివేస్తుందని, భిన్న వ్యవస్థాగత నిర్మాణాల మధ్య ప్రస్తుతం ఉన్న సమతౌల్యం దెబ్బతింటోందని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. దీని మూలంగా రాజ్యాంగ సవరణకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలకు కొంతవరకు పరిమితులు విధింపబడ్డాయి.
  4. ప్రజలలో అధికశాతం సంతోషంగా లేరు. దీంతో ప్రతిపక్షాలకు అవకాశం దొరికింది. దేశ వివిధ ప్రాంతాలలోని అసంతృప్తిని ఆసరా చేసుకోసాగారు. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ఐక్యమైన ప్రతిపక్షాలు దేశంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ కి ప్రత్యేకించి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి.

1971 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ రికార్డుస్థాయిలో విజయం సాధించింది. ఇందిరాగాంధీకి ప్రజాదరణ పెరిగింది. పేదలు, అట్టడుగు ప్రజలతో తాను, తమ పార్టీ మమేకం కావటం ద్వారా పార్టీకి కొత్త సామాజిక మద్దతులను కూడగట్టటానికి ఆమె ప్రయత్నించింది. 1971 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తరువాత ఇందిరాగాంధీ అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ అంచెలంచెలుగా అధికార కేంద్రీకరణ గావించింది. ఇది వామపక్షాల ఆవిర్భావానికి కారణమైంది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 8.
భారత ప్రజాస్వామ్యాన్ని అత్యవసర పరిస్థితి ఏ విధంగా వెనక్కి తీసుకుపోయింది? (AS1)
జవాబు:
అత్యవసర పరిస్థితిలో శాంతిని కాపాడే పేరుతో పౌరహక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం అనేక తీవ్రమైన చట్టాలను చేసింది.

  1. దేశంలో శాంతి, భద్రతలకు అవసరమంటూ ప్రభుత్వం అనేక అణిచివేత చర్యలకు పాల్పడింది.
  2. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేశారు.
  3. ఏ కారణం లేకుండా అరెస్టు చెయ్యటం, హింసించటం, పౌర హక్కులకు భంగం కలిగించటం వంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి.
  4. అత్యవసర పరిస్థితి కాలంలో ధరల నియంత్రణ, నల్లబజారు, వెట్టిచాకిరీలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలను ప్రజలు స్వాగతించారు.
  5. ఈ కాలంలో చేపట్టిన మురికివాడల తొలగింపు, జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించటం వంటి కార్యక్రమాలు ప్రజల కోపానికి కారణమయ్యాయి. అయితే పౌరహక్కులు లేనందు వల్ల ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు లేకపోయాయి. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది.

శాంతి, భద్రతలు నెలకొల్పటానికి, దేశ సమగ్రతను కాపాడటానికి అత్యవసర పరిస్థితి అవసరమయ్యిందని ప్రభుత్వం సమర్థించుకుంది.

ప్రశ్న 9.
అత్యవసర పరిస్థితి కాలంలో ఏ విధమైన వ్యవస్థాగత మార్పులు వచ్చాయి? (AS1)
జవాబు:
అత్యవసర పరిస్థితి కాలంలో కొన్ని వ్యవస్థాగత మార్పులు జరిగినాయి. అవి :

1) రాజ్యాంగానికి 42 వ సవరణ జరిగింది. ఈ సవరణ అనేక మార్పులను తీసుకువచ్చింది. ఈ సవరణలోని అంశాలు:
ఎ) ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చెయ్యటం.
బి) రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచటం.
సి) సామాజిక, ఆర్థిక మార్పునకు ఉద్దేశించిన చట్టాలకు న్యాయస్థానాల నుంచి సాధ్యమైనంత రక్షణను కల్పించటం.
డి) న్యాయవ్యవస్థ పార్లమెంటుకు లోబడి ఉండేలా చేయటం.

2) ఈ 42 వ సవరణతో “లౌకిక, సామ్యవాద” అనే పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. తద్వారా భారతదేశం మత ప్రమేయం లేని దేశమని, సామ్యవాద దేశమని ప్రకటించడం జరిగింది.

3) ఈ సవరణ ఉద్దేశాలుగా దేశ సమైక్యతను బలపరచటం, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని న్యాయస్థానాల నుంచి కాపాడటం వంటి వాటిని పేర్కొన్నప్పటికీ వాస్తవంలో దీని వల్ల దేశ ప్రజాస్వామ్య స్వభావం బలహీనపడిందని చెప్పవచ్చు.

10th Class Social Studies 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) InText Questions and Answers

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 1.
ప్రజలందరికీ ఓటు హక్కు లేకపోతే మనది ప్రజాస్వామిక దేశమని చెప్పుకోటానికి వీలు ఉండేదా?
జవాబు:
ప్రజలందరికీ ఓటు హక్కు లేకపోతే మనది ప్రజాస్వామిక దేశమని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి మూలం ఎన్నికలు, అందరికీ ఓటు హక్కు ఉండడం. కావున ఓటు హక్కు లేకపోతే మనది ప్రజాస్వామ్యమని చెప్పలేము.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 2.
భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి?
జవాబు:
భారతదేశంలో ప్రస్తుతం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 3.
మీరు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే 1970 లకి ముందు సహకార సంఘాల వంటి సంస్థలను స్థాపించారేమో తెలుసుకోండి. దాంట్లో సభ్యులుగా ఎవరు ఉన్నారో తెలుసుకోండి.
జవాబు:
మా గ్రామంలో 1970కి ముందు “వ్యవసాయ సహకార సమితి” ఉంది. అందులో సభ్యులుగా గ్రామంలో ఉన్నత కుటుంబాలకు చెందినవారు ఉండేవారని మా తాత గారిని అడిగి తెలుసుకున్నాను.

10th Class Social Textbook Page No.256

ప్రశ్న 4.
జాతీయభాష అవసరం ఉందా?
జవాబు:
అవును. జాతీయ భాష అవసరం ఉంది.

10th Class Social Textbook Page No.256

ప్రశ్న 5.
అన్ని భాషలకు సమాన హోదా ఉండాలా?
జవాబు:
అవును. అన్ని భాషలకూ సమాన హోదా ఉండాలి.

10th Class Social Textbook Page No.248

ప్రశ్న 6.
సామాజిక సమానత్వాన్ని సాధించామని మీరు అనుకుంటున్నారా? సామాజిక సమానత్వాన్ని, అసమానత్వాన్ని సూచించే మీకు ఎదురైన ఉదాహరణలను పేర్కొనండి.
జవాబు:

  1. కుల, మత, వర్గ, స్త్రీ పురుష, ధనిక, పేద వంటి తారతమ్యాలు లేకుండా అందరికి సమాన న్యాయం, స్వాతంత్ర్యం స్వేచ్ఛలను రాజ్యాంగం కల్పించింది. ఇది సమసమాజాన్ని చూపిస్తుంది.
  2. ప్రభుత్వ అవకాశాలలో కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద భేదాలు చూపకుండా అందరికి సమాన అవకాశాలున్నాయి. స్త్రీ, పురుష ఉద్యోగులకు ప్రభుత్వం సమాన వేతనాలు చెల్లిస్తుంది. ఎటువంటి విచక్షణ చూపదు. ఇది సమానత్వాన్ని సూచిస్తుంది.
  3. అయినప్పటికీ కూడా ఇంకా కుల వ్యవస్థకు సంబంధించి గ్రామాలలో వివక్ష ఎక్కువగా కనిపిస్తుంది. లింగ వివక్ష కూడా కొనసాగుతున్నది. ఇది అసమానత్వాన్ని సూచిస్తుంది.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 7.
ఎన్నికలను, ప్రత్యేకించి ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోవటాన్ని నిరక్షరాస్యత ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు?
జవాబు:

  1. పాశ్చాత్య దేశాలలో ప్రజలు ఓటుహక్కును దశలవారీగా పొందారు. మన దేశంలో 1935 లో కేవలం 10% ప్రజలకే “ఓటు హక్కు ఉండేది. అయితే స్వాతంత్ర్యం తరువాత భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించడం జరిగింది.
  2. కానీ నిరక్షరాస్యత మూలంగా మొదటి సాధారణ ఎన్నికలు ప్రభుత్వానికి సవాలుగా పరిణమించాయి.
  3. నిరక్షరాస్యత సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం రాజకీయపార్టీ అభ్యర్థులను సూచించేలా రోజువారీ జీవితం నుండి కొన్ని గుర్తులను ఉపయోగించుట జరిగింది. ప్రజలు తమకు నచ్చిన గుర్తు ఉన్న డబ్బాలో తమ ఓటును వేశారు. ఈ రకంగా ఎన్నికల సంఘం నిరక్షరాస్యతను అధిగమించింది.

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 8.
భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి ఉండకపోతే దేశ ఐక్యతకు మరింత మేలు జరిగి ఉండేదా?
జవాబు:
అవును, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడకపోతే ఆయా ప్రాంతాలలో అనేక భాషలు మాట్లాడేవారు, అనేక కులాలు, మతాల ప్రజలు ఉండేవారు. అందరూ కలసిమెలసి జీవించటం మూలంగా వారిలో ఐకమత్యం కలిగేది. తమకు ప్రత్యేక ప్రాంతం కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని, ప్రత్యేక దేశం కావాలని పోరాటాలు, ఉద్యమాలు జరిగేవి కాదు. తద్వారా దేశ ఐక్యతకు మేలు జరిగేదని నా అభిప్రాయం.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 9.
ఆ సమయంలో గిరిజన భాషలను ఎందుకు పట్టించుకోలేదు?
జవాబు:

  1. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది అనేక భాషోద్యమాల ఫలితంగా జరిగింది. కావున భాషాప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
  2. గోండి, సంథాలి లేదా ఒరావన్ వంటి భాషలను గిరిజన ప్రజలు మాట్లాడతారు. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న గిరిజనుల భాషను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదనుకొని ఉంటారు.
  3. సమాజంలో శక్తిమంత ప్రజానీకం మాట్లాడే తమిళం, తెలుగువంటి భాషలను పరిగణనలోకి తీసుకున్నారు.

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 10.
భారతదేశంలో ఇటీవల ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఏవి, అవి ఎప్పుడు ఏర్పడ్డాయి?
జవాబు:
ఈ మధ్య కాలంలో భారతదేశంలో నాలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అవి –

  1. ఛత్తీస్ గఢ్ : ఇది 01-11-2000 న రాష్ట్రంగా ఏర్పడింది.
  2. ఉత్తరాంచల్ : ఇది 09-11-2000 న రాష్ట్రంగా ఏర్పడింది. (ఇది ప్రస్తుతం ఉత్తరాఖండ్ గా వ్యవహరించబడుతోంది.)
  3. జార్ఖండ్ : ఇది 15-11-2000 న రాష్ట్రంగా ఏర్పడింది.
  4. తెలంగాణ : ఇది 02-6-2014 న 29వ రాష్ట్రంగా ఏర్పడింది.

10th Class Social Textbook Page No.256

ప్రశ్న 11.
భాషా విధానం జాతి ఐక్యత, సమగ్రతలకు ఎలా దోహదపడింది?
జవాబు:
భారతదేశం విశాలమైనది. ఇక్కడ వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ భాషలు మాట్లాడే ప్రజలున్నారు. ఆ కావున వారందరికి, స్వంత సంస్కృతి, స్వంత భాష ఉండడం మూలంగా, తాము ప్రత్యేక జాతి అనే భావన రావచ్చు. కానీ జాతీయ భాష ఉన్నట్లయితే దేశంలో ఉండే ప్రజలందరికి ఆ భాష వర్తిస్తుంది. కాబట్టి తామంతా ఒకటే అని, ఒకే జాతి అనే భావన కలిగి దేశ సమగ్రతకు, ఐక్యతకు దోహదపడుతుంది.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 12.
మహిళలలో అక్షరాస్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్లకు ఓటు హక్కు కల్పించకుండా ఉంటే అది మన విధానాలను – ఎలా ప్రభావితం చేసి ఉండేది?
జవాబు:
మహిళలకు ఓటు హక్కు కల్పించకుండా ఉంటే అది మన విధానాలను చాలా ప్రభావితం చేసి ఉండేది.

అవి :

  1. స్త్రీ, పురుష వివక్ష చూపించినట్లు కనిపించేది. అప్పుడు రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వానికి అర్థంలేదని అన్పించేది.
  2. అందరికీ ఓటు హక్కు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. మనది ప్రజాస్వామ్యమని చెప్పలేము.
  3. స్త్రీలకు ఓటు లేకపోతే వారికి ‘రాజకీయ హక్కు లేనట్లే’ ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలగడమే. మన దేశ పౌరులందరికి, వారి సర్వతోముఖాభివృద్ధికి ప్రాథమిక హక్కులను కల్పించామని చెప్పుకోవడానికి వీలు లేదు.
  4. సామ్యవాద దేశమని చెప్పుకోవడానికి వీలు లేదు.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 13.
క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించటం అన్నది ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పామనటానికి స్పష్టమైన సంకేతం. ఈ వ్యాఖ్యానంతో మీరు ఏకీభవిస్తారా? కారణాలను పేర్కొనండి.
జవాబు:
అవును. ఏకీభవిస్తాను. అందుకు కారణాలు :

  1. మన దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ప్రజాప్రతినిధులు ఎవరైనా రాజీనామా చేసినా లేదా ఇంకే కారణాల వలన అయినా వారి స్థానాలు ఖాళీ అయితే ఆరు నెలల లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించి ఆ స్థానాలను భర్తీ చేస్తున్నారు.
  2. భారతదేశంలో జాతి, మత, కుల, వర్గ, స్త్రీ, పురుష, ధనిక, పేద అనే విచక్షణ లేకుండా వయోజనులైన ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించారు. కాబట్టి మనది ప్రజాస్వామ్యమే.
  3. ఎన్నికల ద్వారా ఎక్కువ మంది మద్దతు ఉన్న ప్రజాప్రతినిధులచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కావున మనది

10th Class Social Textbook Page No.251

ప్రశ్న 14.
రాజకీయ వ్యవస్థలో కాంగ్రెసు ఆధిపత్యానికి దోహదం చేసిన కారణాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. స్వతంత్ర సమర పార్టీ కాంగ్రెస్. స్వతంత్రం తరువాత కూడా కాంగ్రెస్ కు ప్రాధాన్యత కొనసాగింది.
  2. కాంగ్రెస్ లో విభిన్న సిద్ధాంతాలు ఉన్న వ్యక్తులందరూ పనిచేశారు. అందువల్ల కాంగ్రెస్ కు బహుతావాద దృక్పథం ఏర్పడింది.
  3. బహుతావాదం మూలంగా వామపక్షవాదులు, సంప్రదాయవాదులు, మితవాదులు, ప్రతిపక్ష, అధికార పార్టీలు ఉన్నాయి. అందువల్ల అత్యధిక మందిని ఆకర్షించి ఆధిపత్య పార్టీగా కొనసాగింది.
  4. 1952, 1957, 1962 ఎన్నికలలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి, మిగతా పార్టీలను నామమాత్రమైన వాటిగా చేసి, ఏకపార్టీగా నిలిచింది.
  5. మిగతా పార్టీలు కాంగ్రెస్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయాయి. మొదటి మూడు సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ కు 45% ఓట్లు రాగా, ప్రతిపక్షాలకు 11% ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో కాంగ్రెస్ కు ఎదురులేకుండా పోయింది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Textbook Page No.254

ప్రశ్న 15.
తొలి దశాబ్దాల నాటి వయోజన విద్యాతరగతులకు సంబంధించిన ఫోటో. ఈ పథకాలతో సమాజంలో అభివృద్ధి లేదా మార్పులకు సంబంధించిన భావాలు ఎలా వ్యక్తం అవుతున్నాయో చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 1
జవాబు:

  1. నిరక్షరాస్యత యొక్క సమస్యను ఎదుర్కొనుటకు ఆ రోజుల్లోనే ప్రభుత్వం వయోజన విద్యా తరగతులను నిర్వహించేదని తెలుస్తుంది.
  2. మొదటి సార్వత్రిక ఎన్నికలలో నిరక్షరాస్యత మూలంగా ఎదుర్కొన్న సమస్యలు మళ్ళీ ఎదుర్కోకూడదని, తాము చదువు నేర్చుకోవాలి అనే పట్టుదల వారిలో కనిపిస్తుంది.
  3. నిరక్షరాస్యత మూలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమ పిల్లలు ఎదుర్కోకూడదని తమ పిల్లలకు చదువు నేర్పిస్తున్నట్లు తెలుస్తుంది.

10th Class Social Textbook Page No.255

ప్రశ్న 16.
భారతదేశంలో చేపట్టిన భూసంస్కరణలను చైనాలోనూ, వియత్నాంలోనూ చేపట్టిన వాటితో పోల్చండి.
జవాబు:
భారతదేశంలోని భూసంస్కరణలు, వియత్నాంలోని భూసంస్కరణలు ఈ కింది విధంగా ఉన్నాయి.

భారతదేశంలో భూసంస్కరణలు వియత్నాంలో భూసంస్కరణలు
1) భూసంస్కరణలకు సంబంధించిన ప్రస్తావన ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించింది. 1) వియత్నాంలో కూడా భూసంస్కరణలను కమ్యూనిస్ట్ పార్టీయే ప్రారంభించింది.
2) భారతదేశంలో భూసంస్కరణలను అమలుచేసి, అంతకు ముందు ఉన్న పాత విధానాలను (జమీందారీ, కౌలు) రద్దు పరచినారు. 2) ప్రభుత్వం భూసేకరణ చేసి దానిని పేద రైతులకు పునః పంపిణీ చేసింది.
3) భూసంస్కరణలు భారతదేశం అంతటా అమలు జరిగాయి. 3) వియత్నాంలో భూసంస్కరణలు కేవలం ఉత్తరభాగంలో మాత్రమే అమలు జరిగాయి.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

SCERT AP 10th Class Social Study Material Pdf 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social Studies 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
1) 20వ శతాబ్ది ఆరంభంలో ప్రపంచదేశాల మధ్య తేడాలు పాశ్చాత్య దేశాలు, మిగిలిన దేశాలుగా వ్యక్తమయ్యాయి.
2) ప్రజాస్వామ్యం పుంజుకోవటంతో పాటు కొన్ని నియంతృత్వ ధోరణులను, కొత్త సామ్రాజ్యాలు ఏర్పడటాన్ని 20వ శతాబ్దం చూసింది.
3) సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న సిద్ధాంతాల పునాదిపై సోషలిస్టు సమాజాలు ఏర్పడ్డాయి.
4) యుద్ధంలో పాల్గొన్న దేశాల సైనికులే కాకుండా వివిధ దేశాల సైనికులు పోరాటాలలో ఉన్నారు.
5) మొదటి ప్రపంచయుద్ధ కాలంలో, లేదా ఆ తరువాత అనేక దేశాలు రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దేశాలుగా మారాయి.
జవాబు:

  1. 20వ శతాబ్ద ఆరంభంలో ప్రపంచంలోని దేశాలు పాశ్చాత్య దేశాలుగాను, వీటి వలన దోపిడీలతో మరింత వెనుకబడిన దేశాలుగా విభజింపబడ్డాయి.
  2. ప్రజాస్వామ్యం పుంజుకోవటంతోపాటు అందరికీ అక్షరాస్యతాస్థాయి, సగటు జీవితకాలం అపారంగా పెరిగాయి.
  3. సమానత్వం, సౌభ్రాతృత్వ సిద్ధాంతాలతో, రాజకీయ స్వేచ్ఛ, ఉగ్రవాద, సామ్యవాద, పెట్టుబడిదారీ సమాజాలు ఏర్పడ్డాయి.
  4. యుద్ధంలో పాల్గొన్న దేశాల సైనికులే కాకుండా వివిధ దేశాల సైనికులు పోరాడి వీరమరణం పొందారు.
  5. మొదటి ప్రపంచయుద్దాల అనంతరం అనేక దేశాలు రాచరిక, వలస పాలన నుండి విముక్తి పొంది ప్రజాస్వామ్య దేశాలుగా మారాయి.

ప్రశ్న 2.
ప్రపంచ యుద్ధాలలో మిత్ర రాజ్యాల, అక్ష రాజ్యాల, కేంద్ర రాజ్యాల కూటములలో భాగస్వాములైన దేశాలతో కూడిన “పట్టికను తయారుచేయడం : ఆస్ట్రేలియా, యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా), జర్మనీ, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, యు.ఎస్.ఎ. (AS3)
జవాబు:

మిత్రదేశాలు అక్ష/ కేంద్రరాజ్యాల కూటమి
రష్యా జపాన్
ఫ్రాన్స్ జర్మనీ
బ్రిటన్ ఇటలీ
అమెరికా ఆస్ట్రియా
చైనా
సెర్బియా
పోలెండ్

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 3.
ప్రపంచ యుద్ధాలలో జాతీయ రాజ్యాలు, జాతీయతా భావం యుద్ధకాంక్షను ఎలా ప్రభావితం చేశాయి? (AS1)
జవాబు:
జాతీయ రాజ్యాలలో జాతీయతా భావం ఒక ప్రముఖ ప్రేరేపణ. నూతన శక్తికి అంకురార్పణ. ఆధునిక రాజ్యాలు ఏర్పడడానికి, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఏకీకరణ సాధించడానికి ఇది మూలమైంది. జాతీయతా భావం ఆయా దేశాల అహంకారానికి, గర్వానికి పరాకాష్ఠ. అంతేకాకుండా ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగించడానికి కూడా ఈ దేశస్థులు జాతీయభావాన్ని ఉపయోగించుకున్నారు. ఈ ద్వేషం, అహంకారం యూరపులోని దేశాల మధ్య వైరం పెరగడానికి, అభద్రతాభావం ఏర్పడడానికి మూలమైంది.

మరో ప్రక్క ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం రెండూ కూడా విధ్వంసకర రూపంలో దురహంకారపూరిత జాతీయవాదాన్ని రెచ్చగొట్టి, జర్మనీయే ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుందని, విజేతయై ప్రపంచాన్ని పాలిస్తుందని, పుకార్లు షికార్లు చేయించి, ప్రపంచంలోని దేశాల మధ్య ద్వేషాలు, అభద్రతాభావం పెంచి యుద్ధకాంక్షను పురిగొల్పడానికి కారణమైంది.

ప్రశ్న 4.
రెండు ప్రపంచయుద్ధాల కారణాల మీద క్లుప్తంగా రాయండి. ప్రపంచంలో ఏదైనా దేశాలలో ఈనాటికీ ఈ అంశాలు ఏమైనా ఉన్నాయా? ఏ రూపంలో? (AS4)
జవాబు:
రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటన్ పారిశ్రామికంగా అగ్రగామిగా ఉండడమే కాకుండా ప్రపంచమంతటా విశాల వలస సామ్రాజ్యాలు విస్తరింపచేసింది. ముడిపదార్థాల కొరకు, నూతన మార్కెట్ల అన్వేషణ కొరకు, పాశ్చాత్య దేశాలు దోపిడీ పాలనతో వెనుకబడిన దేశాలను తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాయి. ఏకీకరణ భావనతో ఫాసిజం, నాజీయిజం అనుచరులు అహంకారాన్ని ప్రేరేపించడమే కాకుండా ప్రపంచాన్నంత ద్వేషభావంతో చూశారు. పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ వలసపాలిత దేశాలపై ఆధిపత్యం చెలాయించాయి. రానురాను వలసపాలిత దేశాలు స్వాతంత్ర్యం కొరకు పోరాటాలు మొదలు పెట్టాయి. ప్రపంచ ఆధిపత్యం కొరకు పారిశ్రామిక దేశాలు కూడా గొడవలు పడటం ప్రారంభించాయి. దురహంకారపూరిత జాతీయతావాదం, సామ్రాజ్యవాదం, రహస్య ఒప్పందాలు, సైనికవాదం వంటి కారణాలు మొదటి ప్రపంచయుద్ధానికి కారణమవ్వగా, రెండవ ప్రపంచయుద్ధానికి కారణం వర్సయిల్స్ సంధిలో ఉన్న అవమానకర చర్యలు జర్మనీలో ద్వేషాలు పెరగడానికి కారణమయ్యాయి. అభద్రతాభావం విద్వేషాలు, అనుమానాలు యుద్దాలు సంభవించడానికి దోహదం చేశాయి. అయితే ఈ నాటికీ పై అంశాలు ప్రపంచంలో చాలా తక్కువగా కనిపిస్తుండగా పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలలో పై లక్షణాలు, కారణాలు అప్పుడప్పుడూ ప్రస్ఫుటమవుతున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 5.
20వ శతాబ్దపు ప్రథమ అర్ధభాగంలో యుద్ధాల యొక్క వివిధ ప్రభావాలు ఏమిటి? (AS1)
(లేదా)
20 శతాబ్దపు మొదటి సగంలో సంభవించిన ముఖ్యమైన పరిణామాలను పేర్కొని ఏవేని రెండింటిని వివరించండి.
జవాబు:
చరిత్రకారుడైన “ఎరిక్ హాబ్స్ బామ్” పేర్కొన్నట్లు 20వ శతాబ్దం “తీవ్ర సంచలనాల యుగం”. జాతీయతాభావంతో ప్రపంచంలోని ఇతర ప్రజల పట్ల ద్వేషం, అవధులు లేని అధికారంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

1914-18 సం||రాల మధ్య జరిగిన మొదటి ప్రపంచయుద్ధం తదుపరి నాజీ, ఫాసిజం పార్టీలు భావజాలంతో ప్రపంచదేశాలను తక్కువగా చూడనారంభించారు. 1929-30 సం||రాల మధ్య తీవ్ర ఆర్థికమాంద్యం సంభవించి, ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అయింది. రెండు ప్రపంచయుద్ధాలు సంభవించి, లక్షలాదిమంది చనిపోయారు. ఇంకా ఎన్నో లక్షలమంది నిర్వాసితులయ్యారు. ఎన్నో ఆశలు, ప్రయోగాలు, ప్రమాదకర పరిణామాలు సంభవించాయి. ప్రపంచంలో చాలాదేశాలు చిన్నాభిన్నం కాగా, జర్మనీ, జపాన్ దేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రథమార్ధంలో సంభవించిన యుద్ధాల వల్ల ల్యుకేమియా, క్యాన్సర్ వంటి సమస్యలు దశాబ్దాలపాటు కొనసాగాయి. మాయామర్మం తెలియని 60 లక్షల యూదులు, ఒక్క నాగసాకి, హిరోషిమాలపై అమెరికా వేసిన అణుబాంబు వల్ల 1,50,000 నుంచి 2,46,000 మంది పౌరులు చనిపోయారు. మిత్రదేశాలు, కేంద్ర దేశాలుగా విడివడి ఒక దేశం మరో దేశం మీద ద్వేషాలు పెంచుకొనే స్థితికి చేరుకున్నాయి. యుద్ధంలో పాల్గొన్న దేశాలతో పాటు యుద్ధ ప్రభావం ఆర్ధిక సామాజిక రంగాలపై పడింది.

10th Class Social Studies 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I InText Questions and Answers

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 1.
దురహంకారపూరిత జాతీయతావాదం, సామ్రాజ్యవాదం, అధికార కేంద్రాలు, మిలటరీవాదం ఇప్పుడు కూడా ఉన్నాయా ? ఉదాహరణలతో తరగతిలో చర్చించండి.
జవాబు:
పై లక్షణాలు అప్పుడప్పుడూ అగ్రదేశాలలో కనిపిస్తాయి. అమెరికా, ఇంగ్లండ్, రష్యా వంటి దేశాలలో అప్పుడప్పుడూ ప్రస్ఫుటమవుతుంది.

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 2.
గత పది సంవత్సరాలలో జరిగిన కొన్ని యుద్దాల గురించి తెలుసుకొని వాటికి పై నాలుగు కారణాలు ఎంతవరకు దోహదం చేశాయో చూడండి.
జవాబు:
గత 10 సం||లలో యుద్ధాలు సంభవించలేదు.

10th Class Social Textbook Page No.176&177

ప్రశ్న 3.
ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి. వీటికీ పైన పేర్కొన్న అంశాలకీ సంబంధం గుర్తించి వాటి మీద చిన్న వ్యాసం రాయండి.
అ) నర్స్ బెర్గ్ వద్ద 1934లో హిట్లర్ నాజీ పార్టీ ప్రదర్శన. మీరు చూసిన రాజకీయపార్టీల ప్రదర్శనలతో దీనిని పోల్చండి.
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 1
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం తర్వాత జరిగిన అవమానకర ఒప్పందాలతో కృంగిపోయి, ప్రతీకార కాంక్షతో రగిలిపోయే నాజీపార్టీ స్థాపకుడు హిట్లర్, ప్రపంచానికి తమ అవధులు లేని భావజాలం ప్రదర్శిస్తూ నిర్వహించిన ర్యాలీ. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓట్లడిగే క్రమంలో ఇలా ర్యాలీగా వెళ్ళడం చూస్తుంటాం.

ఆ) మాంద్య కాలంలో పోలిష్ వలస కార్మికురాలు ఫ్లోరెన్స్ ఓవెన్స్ ఫోటో, దారితియా లాంజ్ తీసిన ఈ ఫోటో ఎంతో ప్రఖ్యాతి గాంచింది. 1936 మార్చి సమయంలో కాలిఫోర్నియాలో బఠానీ కోసేవాళ్ళ తీవ్ర పరిస్థితిని ఇది సూచిస్తుంది. ఆమె ఏమి ఆలోచిస్తూ ఉంటుంది?
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
జవాబు:
20వ శతాబ్దంలో ప్రపంచంలో పెనుమార్పులు సంభవించాయి. గొప్ప ప్రయోగాలు కూడా చోటు చేసుకున్నాయి. 1929-30 సం||లో తీవ్ర ఆర్థికమాంద్యం సంభవించి ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అయింది. ఫోటోలో కనిపిస్తున్న “ఫ్లోరెన్స్ ఓవెన్స్” ఆలోచిస్తూ నిరుద్యోగం పెరిగి, ఆర్థిక అవకాశాలు లేక, ఆకలితో అలమటించే పిల్లలకు ఆహారం తినిపించే మార్గం ఏదీ లేదా ? పిల్లల రోదనలను ఆపే మార్గం ఎలా ? అని ఆలోచిస్తుంది.

ఇ) నాగసాకి మీద ‘అణుబాంబు : ఈ బాంబు ప్రభావాన్ని తెలియజేసే ఫోటోలు ఈ అధ్యాయం చివరలో ఉన్నాయి.
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 3
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధంలో దూసుకుపోతున్న జపానను అడ్డుకట్ట వేసి, యుద్ధాన్ని ముగించే క్రమంలో అమెరికా జపాన్లోని శక్తివంతమైన, పురోభివృద్ధిలో ముందున్న నాగసాకి, హిరోషిమాపై అణుబాంబులు ప్రయోగించి తునాతునకలు చేయగా, ఆ సందర్భంగా వెలువడు విధ్వంస దృశ్యాలు అవి.

ఈ) రష్యాలో బోల్షివిక్ విప్లవాన్ని సూచిస్తూ 1920 లో కుస్తోదీప్ వేసిన చిత్రం. చిత్రకారుడు ఏం చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు? పెద్ద ఆకారంలో ఉన్న వ్యక్తి ఎవరు?
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 4
జవాబు:
రష్యాలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రష్యా విప్లవంలో భాగంగా జార్ చక్రవర్తులను, వారి కోటల నివాసాలను తుదముట్టించే క్రమంలో “పెట్రోగ్రాడ్” నగరంలో లెనిన్ నాయకత్వం వహిస్తూ విప్లవంలో పాల్గొన్న దృశ్యం చూడవచ్చు.

ఉ) 1929లో జర్మనీలో వెలువడిన వ్యంగ్య చిత్రం. దాని కింద ‘యూదుల నుంచి కొనండి, మీ ప్రజలకు ద్రోహం చెయ్యండి’ అనే వ్యాఖ్యానం ఉంది. ఇది ఏ వివక్షతా ధోరణిని చూపిస్తోంది?
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 5
జవాబు:

  1. యూదుల వద్ద నుండి ఏ రకమైన వస్తువులనైనా, జర్మనీ ప్రజలు కొనుగోలు చేయకూడదనే వివక్షత ధోరణిని ఈ వ్యంగ్య చిత్రం చూపిస్తుంది.
  2. యూదుల నండి ఏ వస్తువునైనా కొన్నట్లయితే అది జర్మనీకి ద్రోహం చేసినట్లుగా భావించబడుతుంది అని ఆ చిత్రం తెలుపుతుంది.
  3. హిట్లర్ కాలంలో జర్మనీ ప్రజల ‘సోర్డిక్ జాతి’ ఆధిక్యతను తెలుపుతుంది.
  4. యూదుల మీద అపరిమితమైన ద్వేషమును పెంచుకున్నారు.
  5. ఆ తరువాత రోజులలో హిట్లరు అనుచరులచే దాదాపు 60 లక్షల యూదులు చంపబడినారు.

10th Class Social Textbook Page No.179

ప్రశ్న 4.
తెలుసుకోండి : భారతదేశం-పాకిస్తాన్ల మధ్య 1971లో యుద్ధం ఎంతకాలం కొనసాగింది? ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు?
జవాబు:

  1. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో ఇండియా – పాకిస్థాన్లు ప్రత్యక్ష సైనిక యుద్ధానికి దిగినాయి.
  2. ఈ యుద్ధం 3-12-1971న ప్రారంభమై 16-12-1971న ముగిసినది.
  3. ఈ యుద్ధం మొత్తం 13 రోజులలో ముగిసినది. ఇది చరిత్రలోని చిన్న యుద్ధాలలో ఒకటిగా భావించబడుతుంది.
  4. ఈ యుద్ధంలో 3,843 భారత సైనికులు, 9,000 పాకిస్థానీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
  5. 9,861 మంది భారత సైనికులు, 4,350 పాకిస్తానీ సైనికులు గాయాలపాలైనారు.
  6. 97,368 పాకిస్థానీ సైనికులు ఈ యుద్ధంలో ఖైదు చేయబడినారు.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 5.
పారిశ్రామికీకరణ ఆధునిక యుద్ధాలకు ఎలా దారి తీసింది?
జవాబు:
ప్రపంచం పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా కీర్తింపబడి, గుర్తింపబడిన బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, అమెరికా, జపాన్, జర్మనీలు పారిశ్రామికీకరణ వలన ముడిపదార్థాల కొరకు, నూతన మార్కెట్ల కొరకు అన్వేషణ చేసి చాలా దేశాలను వలసపాలిత ప్రాంతాలుగా చేసుకొనే క్రమంలో తీవ్ర పోటీ ఏర్పడింది. ఒక దేశం మరో దేశం మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉండటం వలన తరచు గొడవలు జరుగుచుండేవి. తద్వారా అభద్రతాభావం, జాత్యహంకారం, సామ్రాజ్యవాద రూపాలు అత్యున్నత దశకు చేరుకోవడంతో ఆధునిక యుద్ధాలకు దారితీసింది.

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 6.
తమ దేశం పట్ల ప్రజలకు ఉన్న ప్రేమ ఇతర దేశాలతో యుద్ధానికి దారి తీస్తుందా?
జవాబు:
ప్రపంచ ఆధిపత్య క్రమంలో ప్రజలలో తమ దేశం పట్ల ప్రేమ. మితిమీరింది. అభివృద్ధి క్రమంలో, ఆర్ధిక పురోభివృద్ధిలో ముందుండాలనే ఆశతో పాటు, ఇతర దేశాల పట్ల, ప్రజల పట్ల ద్వేషాన్ని రగిల్చింది. తమ దేశం పట్ల ఉన్న ప్రేమ, ఇతర దేశ ప్రజలను రెచ్చగొట్టే విధానంలో ఆలోచనలు ఎక్కువయ్యాయి. తమ దేశమే విశ్వనాయకత్వం వహిస్తుందనే అహంకార పూరిత ప్రేమ యుద్ధాలకు దారితీస్తుంది.

10th Class Social Textbook Page No.183

ప్రశ్న 7.
నానాజాతి సమితిలో ఏర్పడిన అంతర్జాతీయ కార్మిక సంఘం (ILO), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వంటివి ఈ నాటికీ పనిచేస్తున్నాయి. వాటి కార్యక్రమాల గురించి తెలుసుకొని వాటిల్లో ఒకదాని గురించి ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం అనంతరం, మరో ప్రపంచయుద్ధం జరగకుండా, ప్రపంచ శాంతిని నెలకొల్పే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ 1920లో నానాజాతి సమితిని ఏర్పాటుచేసి, అందులో అనుబంధ సంస్థలుగా అంతర్జాతీయ కార్మికసంఘం (ILO), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లను ఏర్పాటు చేయగా అవి ఈనాటికీ అద్భుతంగా పనిచేస్తున్నాయి.

అంతర్జాతీయ కార్మిక సంఘం గూర్చి ఒక నివేదిక : అంతర్జాతీయ కార్మిక సంఘం ఈనాటికీ దిగ్విజయంగా పనిచేస్తుంది. నానాజాతి సమితిలోని సభ్యదేశాలలోని కార్మికుల స్థితిగతులు, జీవన విధానాన్ని మెరుగుపరచింది. చైనా, ఇంగ్లాండ్ దేశాల మధ్య యుద్ధాలకు కారణమైన నల్లమందు రవాణాను ఆపి, స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పింది. కార్మికుల, స్త్రీల స్థితిగతులలో మార్పుచేసి, విదేశాలకు స్త్రీలను ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. బానిసత్వాన్ని, వెట్టిచాకిరీని నిషేధించి, సమానత్వాన్ని అందించి, కార్మికులలో ఆత్మస్టెర్యాన్ని పెంచింది.

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 8.
ఒక దేశం రెండవ దేశంతో దురహంకారపూరితంగా ప్రవర్తిస్తే, రెండవ దేశం కూడా అదే విధంగా స్పందించాలా ? సమస్య పరిష్కారానికి ఇతర మార్గాలు ఏమున్నాయి?
జవాబు:
దురహంకారంతో కూడిన జాతీయతావాదం ప్రమాదకరం. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే దేశాలు అదనుకోసం ఎదురుచూస్తుంటే మరో ప్రక్క విద్వేషాలు పెరిగి, యుద్ధ వాతావరణాన్ని తలపించే ఏర్పాట్లు దేశాల మధ్య అంతరాన్ని సృష్టించాయి. ప్రతీ దేశం కూడా మేమే ప్రపంచ విజేత కాబోతున్నాం, ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించబోతున్నామంటూ ప్రకటించుకున్నాయి. గర్వం, ఇతరుల పట్ల ద్వేషం వీటివల్ల ప్రపంచం యావత్తు అభద్రతాభావంతో మునిగిపోయింది. తద్వారా ప్రతీ దేశం కూడా ఆ దేశం కంటే మేమేం తక్కువ కాదు అన్నట్లు దురహంకారపూరిత చర్యలకు పూనుకున్నాయి.

వేరే పరిష్కార మార్గాలున్నప్పటికీ “ప్రతీకారం” ఒక్కటే సరైన మార్గంగా దేశాలు భావించాయి. నానాజాతి సమితి వంటి అంతర్జాతీయ శాంతి సంస్థ ఉండి కూడా ప్రతీకారాన్ని ఆపి, మరో ప్రపంచయుద్ధాన్ని నివారించలేకపోయింది.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social Textbook Page No.183

ప్రశ్న 9.
1919లో గెలిచిన దేశాలు జర్మనీ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఉండకపోతే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి ఉండేదా?
జవాబు:
1919లో గెలిచిన దేశాలు జర్మనీ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఉండకపోతే రెండవ ప్రపంచయుద్ధం వచ్చి ఉండేది కాదు. బ్రిటన్, ఫ్రాన్లు గెలిచిన పిదప వర్సయిల్స్ శాంతి సమావేశంలో పెట్టిన అవమానకర షరతులు జర్మనీని అథఃపాతాళానికి నెట్టాయి. వర్సయిల్స్ శాంతి సంధికి కూడా విజేతలైన అమెరికా, బ్రిటన్లు, ఫ్రాన్స్, ఇటలీ, జపానులను ఆహ్వానించాయి. కానీ, జర్మనీని ఆహ్వానించలేదు. ప్రపంచ భవిష్యత్తుపై చర్చలు జరుపుతున్న వాళ్ళు జర్మనీ సలహాలు, భావాలను పరిగణనలోకి తీసుకోలేదు. దీనివల్ల వర్సయిల్స్ ఒప్పందం తమపై బలవంతంగా రుద్దబడిందని జర్మనీ భావించింది. జర్మనీ భూభాగాలను ఆక్రమించడమే కాకుండా సైనిక బలగాన్ని తగ్గించి ఆల్వాస్, లోరైన్ వంటి ఐరోపా, ప్రాంతాలను జర్మనీ నుండి ఆక్రమించుకున్నాయి. ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వలన రెండవ ప్రపంచయుద్ధం రావడానికి మూలమైంది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

SCERT AP 10th Class Social Study Material Pdf 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Studies 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీరు తినే ఆహార పదార్థాలలో పదింటిని తీసుకొని, మీ వద్దకు చేరటానికి ఉత్పత్తి అయిన స్థలం నుంచి ఎంతదూరం ప్రయాణించాయో తెలుసుకోండి. (AS3)

ఆహారపదార్థం ప్రయాణించిన దూరం
1. బియ్యం
2. వంటనూనె
3. అరటిపళ్ళు

చాలామంది ఆహారం దూర ప్రాంతాలు రవాణా చెయ్యటం కాకుండా స్థానికంగా ఉత్పత్తి చెయ్యాలని అంటారు. స్థానికంగా ఆహారం ఉత్పత్తి చెయ్యటానికీ, పర్యావరణానికీ సంబంధం ఏమిటి? స్థానికంగా ఆహారాన్ని పండించి, వినియోగించాలన్న ఉద్యమం గురించి మరింత తెలుసుకుని తరగతి గదిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించండి. (మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే యుట్యూబ్ లో కింద లింకులో ఉన్న హెలెనా నార్బెర్గ్ – హాడ్జ్ ఉపన్యాసాన్ని వినండి. https:/www.youtube.comwatch?v=4r06_F2FIRM
జవాబు:

ఆహారపదార్థం ప్రయాణించిన దూరం
1. బియ్యం 50 కి.మీ.
2. వంటనూనె 100 కి.మీ.
3. అరటిపళ్ళు 5 కి.మీ.
4. గోధుమలు 10 కి.మీ.
5. రాగులు 20 కి.మీ.
6. జామపళ్ళు 10 కి.మీ.
7. జొన్నలు 15 కి.మీ.
8. బొప్పాయి 5 కి.మీ.
9. దానిమ్మ 60 కి.మీ.
10. పెసలు 20 కి.మీ.

సానికంగా ఆహారపదారాలను ఉత్పత్తి చేయడం వలన తాజా, నాణ్యమైన పదార్థాలు లభిస్తాయి. అంతేకాకుండా మనం పండించడం వలన పర్యావరణపరంగా సమస్యలు అధిగమించి, సేంద్రియ ఎరువులతో ఆరోగ్యవంతమైన • ఆహారపదార్థాలను పొందవచ్చు.

ప్రశ్న 2.
జలసింధి గ్రామ ప్రజలు తమ ఊరి నుంచి తరలి వెళ్ళటాన్ని ఎందుకు తిరస్కరించారు? (AS1)
జవాబు:
సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్యప్రదేశ్ లో ముంపునకు గురయ్యే మొదటి గ్రామం జలసింధి గ్రామం. తద్వారా ఆ గ్రామ ప్రజలంతా మునిగిపోతారని తెలిసికూడా తరలివెళ్ళడానికి వారు ఇష్టపడలేదు. మైదాన ప్రాంతాలకు వెళితే అభివృద్ధి చెందుతారని, జీవితాలు సుఖపడతాయని చెప్పి వాళ్ళమీద దౌర్జన్యాలు చేసినా వారు అంగీకరించలేదు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు అడవులను నరికారు. దేవతలను పూజించారు. నేలను మెరుగుపరచారు. జంతువులను మచ్చిక చేసుకున్నారు. అక్కడ వ్యవసాయం ఖర్చు లేకుండా, లాభసాటి ఫలసాయాన్ని అందిస్తుంది. మొక్కజొన్న వాళ్ళకు తల్లిలా ఆహారాన్ని అందిస్తుంది. సజ్జలు, జొన్నలు, శనగలు, మినుములు, నువ్వులు వారికి ఆధారంగా లభిస్తున్నాయి. అడవి వలన వాళ్ళకు ప్రవహించే నీళ్ళు, చక్కటి మేత ఉన్నాయి. పశుసంపద ఎక్కువ. రకరకాల జబ్బులకు అడవి నుండి లభించే వనమూలికలే మందులుగా ఉపయోగపడతాయి. నిర్మలమైన సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సంబంధాలతో
సుఖంగా జీవిస్తున్నవాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళడానికి తిరస్కరించారు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 3.
“ఇది మా పూర్వీకుల భూమి. దీనిపై మాకు హక్కు ఉంది. దీనిని కోల్పోతే మా చేతికి పారలు, గడ్డపారలు వస్తాయి తప్ప ఇంకేమీ మిగలదు…….” అన్న బావా మహాలియా మాటలను వివరించండి. (AS1)
జవాబు:
అనాదిగా బావా మహాలియా పూర్వీకులు అడవులను నరికి పోడు వ్యవసాయం ద్వారా చదును చేసి, కష్టించి, అటవీ భూములు తామే సాగుచేస్తున్నందున ఆ భూముల యజమానులుగా తలంచి, దర్జాగా అడవి మీద, వ్యవసాయం మీద ఆధిపత్యం పొందారు. అభివృద్ధి పేరుతో, పునరావాసం పేరుతో అక్కడ నుండి ఖాళీ చేయిస్తే, వ్యవసాయ భూములపై యజమానులుగా ఉన్న వాళ్లు వ్యవసాయ కూలీలుగా మారి, చేతికి పారలు, పలుగులు వచ్చి పేదరికంలో కూరుకుపోతారని, సంతోషం లేని జీవితాలవుతాయని మహాలియా భావన.

ప్రశ్న 4.
“చివరిగా (అంతమాత్రాన దీని ప్రాముఖ్యత తక్కువేమీ కాదు) వ్యర్థ పదార్థాలు, కాలుష్యం తక్కువగా ఉండేలా మన జీవన సరళిని మార్చుకోవటంపైన పర్యావరణ సమస్యల పరిష్కారం ఆధారపడి ఉంది.” (AS4)
ఎ) మన జీవనశైలి పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మీ నేపథ్యం నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకొని దీనిని వివరించండి.
జవాబు:
మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి. మనిషి ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్నాడు కాని, ప్రకృతి మనిషి మీద ఆధారపడి జీవించటం లేదు. చెట్లను నరకకుండా, ప్రతీ పుట్టిన రోజున ఒక మొక్క నాటి పెంచే విధంగా మన జీవన విధానం ఉండాలి. వ్యవసాయంలో రసాయనిక పురుగుమందుల వాడకం తగ్గించడం ద్వారా ఆరోగ్యవంతమైన పంట ఫలాలను పొందవచ్చు. పారిశ్రామిక వ్యర్థాలు, మరల మరల ఉపయోగించడం వలన, కాలుష్యరహిత విధానం వలన పర్యావరణ సమస్యలు తగ్గుతాయి.

బి) ప్రపంచంలో, వివిధ ప్రాంతాలలో చెత్త, కాలుష్య విడుదల సమస్యలను అధిగమిస్తున్న వివిధ పద్ధతులను పేర్కొనండి.
జవాబు:
పర్యావరణంలో సంభవించు పెనుమార్పుల వలన ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. అభివృద్ధి మాటున, అనర్థాలు అధికమవ్వడంతో ఆర్థిక, సామాజిక, శీతోష్ణస్థితులలో చెడు పరిణామాలు సంభవించాయి. దీనికి అనుగుణంగా వివిధ పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలను రీసైక్లింగ్ పద్ధతులు, అదే విధంగా వాటి నుండి మరికొన్ని కొత్త ఆవిష్కరణలు కనుగొనడం జరిగింది. కాలుష్యం అధికంగా విడుదల చేసే పరిశ్రమలకు అనుమతులు రద్దు చేయడమే కాకుండా, జల కాలుష్యం జరగకుండా అనేక కొత్త పద్ధతులు అనుసరించడం జరుగుతోంది. వేస్ట్ మేనేజ్ మెంట్ ద్వారా గ్రామాలు, పట్టణాలు, నగరాలలో ప్రజలను చైతన్యపరుస్తూ, మీడియా ద్వారా ప్రజలలో మార్పు తీసుకురావడానికి ప్రపంచం యావత్తు కృషి చేస్తోంది.

ప్రశ్న 5.
ఖనిజాలు, ఇతర సహజ వనరులను వేగంగా సంగ్రహించడం వల్ల భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. మీరు ఏకీభవిస్తారా? (AS4)
జవాబు:
నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటి సహజ వనరులు, అధికంగా గ్రహించడం వలన భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని నేను ఏకీభవిస్తాను. అదేపనిగా భూగర్భజలాల్ని, ఖనిజాలను వినియోగించడం వలన తరువాత లభించడం దుర్లభం. అడవులను, చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం వలన, జీవావరణం, జీవవైవిధ్యం దెబ్బతిని, భవిష్యత్తు తరాలు అంధకారంలోకి నెట్టబడతాయి. ఆర్థికవ్యవస్థలోని ఇతర రంగాలు కూడా ఖనిజాలు, ఇతర సహజవనరుల మీద ఆధారపడి ఉండడం వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 6.
వాతావరణ మార్పు ప్రభావం అన్ని దేశాలపై ఉంటుందని ఎందుకనుకుంటున్నారు? (AS1)
జవాబు:
ప్రపంచంలోని దేశాల శాస్త్రజ్ఞులు ఎంతోకాలంగా వాతావరణంలోని మార్పుల గురించి వివరాలు సేకరిస్తూనే ఉన్నారు. వాతావరణం అంటే మనచుట్టూ ఉండే తేమ, గాలిపీడనం, ఉష్ణోగ్రత మొదలైన వాటిలో రోజువారీ వచ్చే మార్పులు. వాతావరణం గంట గంటకీ, రోజు రోజుకీ, ఋతువు, ఋతువుకీ మారిపోవచ్చు. వాతావరణ మార్పు ప్రభావం అన్ని దేశాలపై ఉంటుంది. ఈ కారణంగానే ముందుగా టీవీ, రేడియో, వార్తాపత్రికలు మొ||నవి వాతావరణ వివరాలను ప్రతిరోజూ ప్రసారం చేస్తాయి. వాతావరణ మార్పు ప్రభావం గురించి తెలుసుకుంటున్నదానిని బట్టి రాబోయే కాలంలో వాతావరణంలో ఎటువంటి మార్పులు వస్తాయో అన్ని దేశాలు అంచనావేస్తాయి.

ప్రశ్న 7.
భూమి సగటు ఉష్ణోగ్రతలను ప్రజలందరికీ సహజ వనరుగా పరిగణించాలా? (AS1)
జవాబు:
భూమి సగటు ఉష్ణోగ్రతలను ప్రజలందరికీ సహజ వనరుగానే పరిగణించాలి. 1992 సంవత్సరంలో రియోడిజెనీర్ లో ధరిత్రి సదస్సు జరిగింది. అందులో 154 దేశాలు సంతకం చేశాయి. గత 100 సం||లలో భూమి సగటు ఉష్ణోగ్రత 0. 5 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. భూమి సగటు ఉష్ణోగ్రత పర్యావరణ పరంగా జీవవైవిధ్య పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 8.
తెలంగాణలోని జహీరాబాద్ మండలంలోని ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ఏ గుణపాఠాలు నేర్చుకోవచ్చు? (AS4)
జవాబు:
తెలంగాణలోని జహీరాబాద్ మండలంలోని ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి మనం అనేక గుణపాఠాలు నేర్చుకోవచ్చు.

స్థానిక ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ, సుదూర ప్రాంతంలో రసాయనిక పురుగుమందులు, సారవంతం లేని వరి, గోధుమల స్థానంలో అధిక పౌష్టికాహార విలువలు గల చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా అక్కడ ఉండేది. (చిరుధాన్యాలు జొన్న, సజ్జ, రాగి వంటివి) పోషకాహారాన్ని అందించే చిరుధాన్యాలు పండించాక భూముల బీడు పోవడమే కాకుండా, నియంత్రణ కూడా సాధించారు.

ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ విధానం ద్వారా వారు పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ స్థానిక అవసరాలు, కట్టుబాట్లు కొనసాగిస్తూ ఇంకొకరి మీద ఆధారపడకుండా, స్వశక్తితో వారిలో వారే అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. గ్రామాలు స్వయం సంపూర్ణ గ్రామాలుగా మారడానికి ఐక్యత, సామాజిక చైతన్యం, సమష్టి కృషి, విశిష్ట లక్షణాలు అందరికీ ఆదర్శవంతమయ్యాయి.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 9.
“స్థానిక జన జీవనానికి, జీవనోపాధులకు, పరిసరాలతో సహజీవనం చేసే జీవన విధానానికి పర్యావరణం చాలా ముఖ్యమైనది.” వివరించండి. (AS6)
జవాబు:
“నరుని అడుగు సోకని అడవి రమణీయంగా ఉందని” వాల్మీకి అన్నట్లు రామాయణంలో ఒక శ్లోకం ఉందంటారు. వ్యవసాయం కోసమైనా, పశువుల కోసమైనా, కలప కోసమైనా, కారణం ఏదైనా ఫలితం క్షణక్షణం అడవి తల్లిని బుగ్గిపాలు చేయడం జరుగుతోంది. అడవిని ఆధారంగా చేసుకొని ఆదివాసీలు, వివిధ జంతువులు, ఇతర జీవరాసులు జీవన సమరం సాగిస్తున్నాయి. తమ చుట్టూ ఉండే చెట్టు, పు, కొండా, కోన, వ్యవసాయం, మేత ఇలా అణువణువు వారికి ఆధారమే. పర్యావరణాన్ని పాడుచేయడం వలన మానవుడు తాను ఎక్కిన కొమ్మను తానే నరుక్కున్నట్లుంది. ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ పరిసరాల్లోనే, ఈ పర్యావరణంలోనే, ఈ ప్రకృతిలోనే మన శరీరం ఉంది. పర్యావరణంలోనే మనుగడ సాగుతుంది. పర్యావరణాన్ని నాశనం చేశామంటే మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకున్నట్లు. “మనం పర్యావరణాన్ని కలుషితం చేస్తే – పర్యావరణం మనల్ని కలుషితం చేస్తుంది.”

10th Class Social Studies 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి InText Questions and Answers

10th Class Social Textbook Page No.160

ప్రశ్న 1.
పర్యావరణ సమస్యల ద్వారా అభివృద్ధి అనే భావనను ఎలా ప్రశ్నించారో గుర్తించండి.
జవాబు:
అభివృద్ధి పేరుతో, పారిశ్రామికాభివృద్ధి ముసుగులో పర్యావరణం – ప్రజల మధ్య సంబంధాలు అతలాకుతలం అయినాయి. ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ద్వారా అడవులను నరికి, నేలను కోతకు గురిచేసి, కాలుష్యం పెంచి, విచ్చలవిడిగా రసాయనిక పురుగుమందుల వాడకం చేపట్టి, శీతోష్ణస్థితిలో పెనుమార్పునకు పర్యావరణ సమస్యలు మూలమయ్యాయి. అభివృద్ధి జరిగినా సహజ వనరులు అంతరించి, మానవ మనుగడయే దుర్లభమయ్యే రోజులు దాపురించాయి.

10th Class Social Textbook Page No.162

ప్రశ్న 2.
భూగర్భజలాలను ఎక్కువగా తోడటం సుస్థిర పద్దతి ఎందుకు కాదు?
జవాబు:
సంప్రదాయ వ్యవసాయంలో వర్షపు నీటి ద్వారా భూగర్భజలాలు పెరిగే విధంగా చర్యలు తీసుకొనేవారు. 10-15 అడుగులలో నీళ్ళు ఉండేవి. ఆ తర్వాతి కాలంలో విద్యుత్, డీజిలు మోటార్లతో భూగర్భజలాలను తోడటం మొదలైన తర్వాత భూగర్భజలం కొన్ని వందల అడుగుల లోపలకు వెళ్ళిపోయింది. లోపలికి ఇంకే నీటి కంటే తోడే నీళ్ళు ఎక్కువవడం వలన భవిష్యత్తు తరాలు నీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితులు కానవస్తున్నాయి. కాబట్టి భూగర్భజలాలను ఎక్కువగా తోడటం సుస్థిర పద్ధతి కాదు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 3.
పర్యావరణాన్ని ‘సహజ పెట్టుబడి’ అని కూడా అంటారు. 9వ అధ్యాయంలో పెట్టుబడి నిర్వచనాన్ని మరొకసారి చూడండి. పర్యావరణాన్ని సహజ పెట్టుబడి అని ఎందుకు అంటారు?
జవాబు:
పర్యావరణాన్ని ఆధారం చేసుకొని, ఈ భూమి మీద 5 కోట్ల వేర్వేరు జాతులు ఉన్నాయి. మనం వాడుతున్న నీళ్ళు, మనచుట్టూ ఉన్న అడవి, అడవి ఆధారంగా సహజంగా లభించే సహజ అటవీ ఉత్పత్తులు, సెలయేళ్ళు, సహజ వనరులు, (ఇంధన వనరులు, ఖనిజ వనరులు) ఆధారం చేసుకొని మానవజీవితం కొనసాగుతుంది. మానవుడు తనచుట్టూ ఉండే పరిసరాల్ని ఆధారం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. కాబట్టి పర్యావరణాన్ని సహజ పెట్టుబడిగా వర్ణించవచ్చు.

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 4.
నీటిని ఉమ్మడి ఆస్తిగా ఎందుకు పరిగణించాలి?
జవాబు:
నీరే జీవాధారం. ప్రాణాధారం, నీరు లేకుండా ఏ జీవీ జీవనం సాగించడం దుర్లభం. ప్రకృతిలో కురిసే వానల వలన, పారే నీరు భూగర్భజలంలోకి చేరుతుంది. అంతేకాకుండా సహజవనరులైన సెలయేళ్ళు, నదులు, కాలువలు, జలాశయాలు, ఆనకట్టల ద్వారా ఆయా ప్రాంతాలకు చెందిన వారందరికీ నీరు ఉమ్మడి ఆస్తిగా చెందుతుంది.

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 5.
ఎండోసల్ఫాన్ వినియోగాన్ని నిలిపివెయ్యటానికి న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది?
జవాబు:
ఎండోసల్ఫాన్ అనేది రసాయనిక పురుగులమందు. ఈ పురుగులమందు అనేక రకాలుగా హానికారక ప్రభావాల్ని చూపించింది. గాలి, నీళ్ళు మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాతో కలుషితమయ్యాయి. దానిని పిచికారి చేయడం వలన ప్రజలలో ముఖ్యంగా వ్యవసాయ కూలీలలో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనివల్ల కనీసం 5000 మంది చనిపోయారు. అంతకంటే ఎక్కువమంది అవయవ లోపాల వల్ల, క్యాన్సర్ వల్ల మరణం కంటే దారుణమైన జీవితాన్ని గడపగా ఆ పరిస్థితుల నుండి రక్షణ పొందేందుకు న్యాయస్థానానికి వెళ్ళవలసి వచ్చింది.

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 6.
ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలలో ఆ పురుగుమందు వాడకం జీవించే హక్కుకు (రాజ్యాంగంలోని 21వ అధికరణానికి) భంగం కలిగించిందని పేర్కొంది. జీవించే హక్కుకు, ఎండోసల్ఫాన్ ఎలా భంగం కలిగించిందో వివరించండి.
జవాబు:
ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణం కలిగి ఉండే హక్కు కూడా ఉంటుందని న్యాయస్థానాలు అనేక తీర్పులు చెప్పడం జరిగింది. 1991లో రాజ్యాంగంలోని 21వ అధికరణం ద్వారా జీవించే హక్కు ద్వారా జీవితాన్ని పూర్తిగా ఆనందించటానికి, కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కుంటుందని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. కానీ ఎండోసల్ఫాన్ పురుగుమందు వాడకం వలన, పరిసరాలు, పర్యావరణం, నీరు, గాలి కలుషితమై, ప్రజలలో అనేక మరణాలు సంభవించాయి. కాబట్టి, కోర్టు తీర్పునకు అనుగుణంగా-ఎండోసల్ఫాన్ విఘాతం కలిగించింది కాబట్టి దానిని నిషేధించడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 7.
గిరిజనులకు వేరే రాష్ట్రంలో పునరావాసం కల్పిస్తే దిగువ పేర్కొన్న విషయాల్లో ప్రస్తుత అలవాట్లలో ఏమి మారతాయో చూపించటానికి ఒక పట్టిక తయారుచేయండి. ఆహార అలవాట్లు, వ్యవసాయం, ఆర్థిక అంశాలు, అడవితో సంబంధం, మత ఆచారాలు, ఇల్లు కట్టుకోవడం, సామాజిక సంబంధాలు.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 1

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 8.
జీవవైవిధ్యత కోల్పోటాన్ని ఉత్తరంలో ఎతా పేర్కొన్నారు?
జవాబు:
మా చుట్టూ అనేక పక్షులు, జంతువులు, చెట్లు, పువ్వులు, పండ్లు, కీటకాలు రకరకాలైనవి ఉన్నాయి. వాటితో మా బంధం పెనవేసుకుంది. ఆవులు, గేదెలు, గొర్రెలు వంటి పశుసంపద మాకు ఆరోగ్యసంపద, ధన సంపద. ఈ అడవిలో తిరిగే ప్రతి పక్షి, జంతువు, ఇతర జీవరాసుల అరుపులు, వాటి జీవన విధానం మాకు తెలుసు. ప్రతీ జీవి కూడా పూజింపదగినదే. ఏ ప్రాణినీ తక్కువగా అంచనావేయం. అన్ని ప్రాణులపట్ల సమాన ప్రాధాన్యతతో, ప్రేమతో, కృతజ్ఞతతో మెలగుతాం.

ప్రశ్న 9.
జలసింధి గ్రామంలోని ప్రజలకు ప్రస్తుతం ఆహారభద్రత ఉందా?
జవాబు:
జలసింధి గ్రామంలోని ప్రజలకు ప్రస్తుతం ఆహారభద్రత ఉంది. వ్యవసాయాన్ని అనువుగా మార్చుకొని, తక్కువ వర్షాలతో కావలసినంత ఆహారాన్ని పొందుతున్నారు. జలసింధి గ్రామంలో గిరిజనులకు కడుపునింపేది మొక్కజొన్న. వీటితో పాటు, సజ్జలు, జొన్నలు, శనగలు, మిటికెలు, మినుములు, నువ్వులు పండించి ఆహారభద్రత పొందుతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 10.
పైన పేర్కొన్న పరిస్థితులలో మీరు నివసిస్తుంటే పునరావాసం పొందాలన్నప్పుడు ఎలా స్పందిస్తారు?
జవాబు:
అడవితో అనురాగం పెంచుకొని, పరిసరాలపై ప్రేమలో మునిగి, నేలతల్లిని ఆరాధించే మేము వేరే పునరావాస ప్రాంతంలో నివసించటానికి ఇష్టపడం. అభివృద్ధి ముసుగులో మా జీవన గమనాన్ని దెబ్బతీస్తే ఊరుకోం. ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడతాం. కొండా కోన, వాగు-వంకలతో అడవిలోనే నివసిస్తాం. ఐక్యమవుతాం. ఎదిరిస్తాం. అనుకున్నది సాధిస్తాం.

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 11.
భారతదేశ ఆర్థిక విధానంలో సరళీకరణ, ప్రపంచీకరణ చోటు చేసుకున్న తరువాత స్థానిక అవసరాలకు, ఎగుమతులకు ఖనిజాల తవ్వకం వేగంగా పెరిగింది. ఈ కింద ఇచ్చిన పట్టికలోని గణాంకాల ఆధారంగా ఈ వ్యాఖ్యానాన్ని వివరించండి.
పట్టిక : భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకం (వేల టన్నులలో)

ఖనిజం 1997 – 98 2008 – 09
బాక్సెట్ 6,108 15,250
బొగ్గు 2,97,000 4,93,000
ఇనుప ఖనిజం 75,723 2,23,544
క్రోమైట్ 1,515 3,976

జవాబు:
బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఆర్థికంగా ఛిన్నాభిన్నమైన మనదేశంలో స్థానిక అవసరాలు, ప్రపంచంలో మన స్థానాన్ని పదిలపరచుకోడానికిగాను, ఖనిజాలను ఎగుమతులు చేయడం జరిగింది. విరివిగా లభించే ఖనిజాలను వెలికితీసి సరళీకరణ ద్వారా, ప్రపంచ పోటీని నిలదొక్కుకోడానికి గాను విలువైన బాక్సెట్, బొగ్గు, ఇనుము, క్రోమైట్లను సగాని కంటే ఎక్కువగా వెలికితీయడం జరిగింది. 1997-98 కి, 2008-2009 కి మధ్య 10 సం||లలో అధికంగా ఖనిజాలను వెలికితీసి ఆదాయాలను పెంచి ఆర్థిక పరిపుష్టి సాధించడం జరిగింది.

ప్రశ్న 12.
గనుల తవ్వకం వేగంగా వృద్ధి చెందటం వల్ల పర్యావరణానికి, మనుషులకి ఏ విధమైన నష్టాలు జరుగుతాయి?
జవాబు:
గనుల తవ్వకం విచ్చలవిడిగా పెంచడం వలన, అటు పర్యావరణానికి, ఇటు మనుష్యులకు తీవ్ర ప్రమాదాలు దాపురిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు, వివిధ జంతువులు, పక్షులు, వివిధ రకాల జీవరాసులు నశించి, పర్యావరణం పాడైపోతుంది. అదేవిధంగా గనులను విరివిగా తవ్వడం వలన ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజలు అనేక కాలుష్య సమస్యలతో సతమతమవుతున్నారు. . నీటి, వాయు కాలుష్యం వలన ఆరోగ్య సంబంధ సమస్యలు పెరుగుతున్నాయి.

10th Class Social Textbook Page No.159

ప్రశ్న 13.
ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ ఆధారంగా భారతదేశంలోని అంతరాల గురించి క్లుప్తంగా రాయండి.
గ్రాఫ్ 1 : భారతదేశంలో వార్షిక ఆదాయం ఆధారంగా కుటుంబాల పంపిణీ (లక్షలలో) (2010 సర్వే)
AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 2 AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 3
జవాబు:
గ్రాఫ్ 1 ఆధారంగా 17 లక్షల పైన వార్షిక ఆదాయం కలిగిన వారు 30 లక్షల కుటుంబాలు ఉండగా, లక్షా యాభైవేల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారు 13 కోట్ల 50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రెండవ స్థానంలో తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారు అంటే లక్షా యాభైవేల నుండి 3 లక్షల 40 వేల మధ్య ఆదాయం కలిగిన వారు 7 కోట్ల 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి. దీనినిబట్టి తక్కువ ఆదాయంతో పేదరికంతో బాధపడుతున్న వారు మన దేశంలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గ్రాఫ్ 2 ప్రకారం భారతదేశంలో శత కోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద -1996లో 212 బిలియన్ రూపాయలు, 2004 లో 1,157 బిలియన్ రూపాయలు కాగా, 2011లో 11,000 బిలియన్ రూపాయలకు చేరింది.

గ్రాఫ్ 3 ప్రకారం భారతదేశంలో శతకోటీశ్వరులు 1996లో ముగ్గురు ఉండగా 2004లో ఆ సంఖ్య 9 గా ఉంది. 2011లో శత కోటీశ్వరుల సంఖ్య 55కి చేరింది.

పై గ్రా ద్వారా తేలిందేమిటంటే, కొంతమంది ప్రపంచస్థాయి భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండగా అధికశాతం ప్రజలు సరైన ఉద్యోగం లేక, చాలినంత ఆదాయాలు లేక గౌరవప్రదంగా జీవించడానికి అవసరమయ్యే కనీస అవసరాలు కూడా అందని పరిస్థితిలో ఉన్నారు. ప్రజల ఆదాయాలు, అవకాశాలలో ఇంత అంతరం ఉండటం సమసమాజానికి ఆధారం కాబోదు.

10th Class Social Textbook Page No.161

ప్రశ్న 14.
భారతీయ వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించి 9వ తరగతి పాఠాలను మరొకసారి చూడండి.
ఈ రెండు సందర్భాలలోనూ వనరుల పంపిణీ, అందుబాటుకు సంబంధించి అసమానతలను అవి ఎలా చర్చించాయి?
జవాబు:
భారతదేశంలో పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచి పేదరికాన్ని దూరం చేయడానికి గాను, నూతన వ్యవసాయ పరిజ్ఞానంతోపాటు అధిక విత్తనాల దిగుబడికి రసాయనిక ఎరువులే కీలకం. సకాలంలో నీరు, రసాయనిక ఎరువులు అందించి, తక్కువ కాలంలో, పొట్టి కాడలతో ఎక్కువ దిగుబడిని అందించే వంగడాలను అందుబాటులోకి తెచ్చారు. హరితవిప్లవం ద్వారా ఆధునిక పద్ధతులతో వరి, గోధుమలలో అధికోత్పత్తి సాధించడం జరిగింది.

అదేవిధంగా పరిశ్రమలను నెలకొల్పే క్రమంలో ఉన్న అనేక పరిమితులు దూరం చేసి, లైసెన్సింగ్ విధానంలో ఉన్న సమస్యలను అధిగమించి, నూతన పారిశ్రామిక విధానం ద్వారా అనేక పారిశ్రామిక కేంద్రాలను నెలకొల్పి, అత్యంత సమర్థవంతమైన ఉత్పత్తులు పెంపొందింపజేశారు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.161

ప్రశ్న 15.
‘హరిత విప్లవం’ విస్తరించడం వల్ల ఎటువంటి పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి? దీని నుంచి భవిష్యత్తుకు మనం ‘ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోవాలి?
జవాబు:
హరితవిప్లవం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, కొత్త రకం విత్తనాలు సృష్టించడంతో, ఆహారధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధి సాధించగా అనేక పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి. అవి

  1. హరిత విప్లవంలో అధిక ప్రాధాన్యం ఇచ్చిన వరి, గోధుమపంటల అధిక దిగుబడికిగాను పుష్కలంగా నీరు అవసరం. అందులకై అధిక సంఖ్యలో మోటార్లు, ఇంజన్లు ఉపయోగించి భారీగా భూగర్భజలాలను వెలికితీయడంతో, భూగర్భజలాలు పడిపోయాయి. దీనితో భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి భూగర్భజలాలు లేవు.
  2. సేంద్రియ ఎరువులు, పెంటపోగు గత్తం వంటి వాటి ఎరువులకు బదులుగా రసాయనిక పురుగుమందులు, క్రిమి సంహారక రసాయనాలు వాడడం వలన భూముల సారం తగ్గి, రైతుల ఖర్చు పెరిగింది.
  3. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి వాటికి ప్రాధాన్యం లేకపోవడం, ఇవి సుమారు 80% ప్రాంతాలలో పండించేవిగా ఉండడం వలన చాలా ప్రాంతాలలో సంప్రదాయ పంటలు దూరమయ్యాయి.

కాబట్టి మనం సంప్రదాయ పద్ధతులు అనుసరిస్తూ, ఆరోగ్యాన్ని పాడుచేసే విధానాలకు స్వస్తి చెప్పి, మన పూర్వీకుల పద్ధతులు పాటిస్తూ, భూసారాన్ని రక్షించుకుంటూ పర్యావరణ సమస్యలు లేకుండా చూసుకోవాలి.

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 16.
అభివృద్ధి భావనలు అన్న అధ్యాయంలో ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చని చదివాం. దీనిని వివరించటానికి బావా మహాలియా ఉత్తరాన్ని ఉపయోగించండి.
జవాబు:
ప్రజల అవసరాలు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, ఆహార ఉత్పత్తి, పారిశ్రామికీకరణ వలన అటవీ ప్రాంతంలో, నదీ పరిసర ప్రాంతాలలో పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో ఖాళీ చేయించి, అక్కడ నివసిస్తున్న ప్రజలను పట్టణ ప్రాంతాలకు, మైదాన ప్రాంతాలకు తరలించడం జరిగింది. దీని ద్వారా కొంతమంది ప్రజలకు భద్రత, ఉద్యోగ అవకాశాలు, ఉత్పత్తి పెరిగినప్పటికీ, ఎంతోమందికి మాత్రం అది పెను ప్రమాదంగా మారింది. అడవిని నమ్ముకొని, అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి, ఫలసాయాల ద్వారా బ్రతుకుతున్న వారికి, కొండా కోన, పరిసరాలు తమకు అనుకూలమైనవి కావడం వలన వేరే ప్రాంతాలలో జీవించడం కష్టం. తమకు అలవాట్లు, పూర్వీకుల ఆచారాలకు అనుగుణంగా తమ తమ ప్రాంతాలలో నివసించటానికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది.

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 17.
గిరిజనులలో జీవనోపాధి, సంస్కృతి, సామాజిక సంబంధాలు అడవితో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి. దీనిని వివరించండి.
జవాబు:
అడవిలో నివసించే గిరిజనులకు అడవే జీవనాధారం. గిరిజనులు వారి శ్రమతో రకరకాలైన సంప్రదాయ పంటలు పండిస్తారు. డబ్బుతో పని లేకుండా, నాణ్యమైన విత్తనాలు, పశువుల నుండి వచ్చే ఎరువును వాడి, మంచి ఫలసాయాల్ని పొందుతారు. పంటలు పండని సమయంలో అడవిలో దొరికే అనేక ఫలాలు, దుంపలు, కాయలు, పండ్లు గిరిజనుల ఆకలిని తీరుస్తాయి.

సంస్కృతి, సంప్రదాయాలకు గిరిజనులు ప్రాధాన్యం ఇస్తారు. క్రమం తప్పకుండా చెట్టు తల్లిని, అగ్నిని, అమ్మతల్లిని పూజిస్తారు. సంతలలో కలిసి ఒకరికొకరు ఇష్టపడి వివాహాలు జరుపుకుంటారు. సామాజిక సంబంధాలకు విలువనిస్తారు. కష్టసుఖాలలో ఒకటిగా జీవిస్తారు. అడవిలో దొరికే జంతువుల మాంసాలను సమంగా పంచుకొని, కలిసి తింటారు. సమూహాలుగా ఏర్పడి వేటకు బయలుదేరతారు.

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 18.
‘అభివృద్ధి భావనలు’ అన్న అధ్యాయంలో మీరు కుడంకుళం అణువిద్యుత్తు కర్మాగారానికి నిరసనల గురించి చదివారు. ఇక్కడ తెలుసుకున్న వాటి ఆధారంగా ఆ నిరసనలను వివరించండి.
జవాబు:

  1. ‘కుడంకుళం’ తమిళనాడులోని ఒక ప్రశాంతమైన గ్రామం.
  2. అక్కడి ప్రజల జీవనోపాధి చేపలు పట్టడం.
  3. ‘కుడంకుళం’ అణువిద్యుత్ కర్మాగారాన్ని అక్కడ స్థాపించటంవలన, వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వస్తుంది.
  4. అందువలన వారికి జీవనోపాధి పోతుంది.
  5. అంతేకాకుండా అణువిద్యుత్ కర్మాగారాలలో జరిగే విధ్వంసాల వలన కూడా వారు భయపడుతున్నారు.
  6. వారి మనస్సులలో గత కొద్దికాలం క్రిందట జపాన్ అణుకర్మాగారంలో జరిగిన విధ్వంసం మెదలుతూ ఉంది.
  7. అందువలన అక్కడ దీర్ఘకాలంగా పోరాటం జరుగుతోంది.
  8. కనుక ఆధునిక అభివృద్ధి పథకాల వలన వీరి అతి ముఖ్యమైన వనరైన సముద్రము అందుబాటులో లేకుండాపోతుంది.

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 19.
పర్యావరణ పరిరక్షణ ప్రత్యక్షంగా ప్రభావితులయ్యే సమూహాలకే కాక మనందరికీ కూడా ఎంతో కీలకమైనది. కొన్ని ఉదాహరణలతో దీనిని వివరించండి.
(లేదా)
క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.

“వేగమైన ఆర్థిక అభివృద్ధి వల్ల అనేక రంగాలలో ఇప్పటికే మనం వ్యతిరేక పరిణామాలను చవి చూస్తున్నాం. భూగర్భ జలాలు, రసాయనిక పురుగు మందుల సమస్యలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. పర్యావరణంపై ఆధారపడి అనేక వేల సమూహాలు నివసిస్తున్నాయి. పర్యావరణాన్ని విధ్వంసం చెయ్యటమంటే ఈ సమూహాలను మట్టుపెట్టడమే.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం. మన చుట్టూ ఉండే గాలి, నీరు, చెట్లు, వాతావరణం, శీతోషసితిలో అనేక మార్పుల వలన మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉదాహరణకు అభివృద్ధి పేరుతో పరిశ్రమల స్థాపన ఆశయంతో చుట్టూ ఉండే అడవులు, జంతువులు, మిగతా జీవరాసులు నశిస్తాయి. మరీ ముఖ్యంగా ఈ పర్యావరణంలో ప్రకృతిలో ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి జీవిస్తున్నాయి.

అదే విధంగా వ్యవసాయరంగంలో సాంకేతికత పేరుతో సంప్రదాయ పద్ధతులు కాకుండా సంకరజాతి వంగడాలు, రసాయనిక పురుగుమందులు వాడడం వలన వాటి ప్రభావం మనష్యులందరి మీద పరోక్షంగా పడుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకమైనది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 20.
ఎనిమిదవ తరగతిలోని ఆంధ్రప్రదేశ్ లోని ఖనిజాలకు సంబంధించిన అధ్యాయాలను మరొకసారి చూడండి. పారిశ్రామిక వేత్తలకు, ఖనిజాలు ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు మధ్య ఎటువంటి వైరుధ్యాలు చోటు చేసుకుంటాయి?
జవాబు:
వెనుకబడిన దేశమైన భారతదేశం ఆర్థికంగా బలం పుంజుకోవడానికిగాను పరిశ్రమలను నెలకొల్పదలచి, సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, అధిక ఆదాయం పొందగా ఆర్థిక ప్రగతి సాధించింది. అయితే పారిశ్రామికవేత్తలకు కేటాయించిన ప్రదేశాలలో నివసించే ప్రజలకు అనేక విషయాలలో వైరుధ్యాలు ఉన్నాయి. ఖనిజ వనరులు లభ్యమయ్యే ప్రదేశాలలో అడవులను విచక్షణారహితంగా నరికివేయటం, ఖనిజాలను కడగడానికి పెద్ద మొత్తంలో నీళ్ళు కావాలి. తద్వారా దగ్గరలోని నదులు, నీటి వనరులు కలుషితమవుతాయి. గనులలో పనిచేసే కార్మికులు అనేక ప్రమాదాలు ఎదుర్కొంటారు. ఇలాంటివే మరెన్నో వైరుధ్యాలు చోటుచేసుకుంటాయి.