AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

SCERT AP 6th Class Social Study Material Pdf 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం

6th Class Social 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
అడవుల నుండి లభించే ఉత్పత్తులను పేర్కొనుము.
జవాబు:
అడవుల నుండి మనకు వివిధ రకాలైన ఉత్పత్తులు లభిస్తున్నాయి. అవి :

  • వివిధ రకాల పళ్ళు ఉదా : సీతాఫలం, జామ, పనస, వెలగ మొ||నవి.
  • వివిధ రకాల దుంపలు. ఉదా : చిలకడదుంప, వెదురు, దుంప మొ||నవి.
  • వివిధ రకాల గింజలు, కాయలు. ఉదా : కుంకుళ్ళు, షీకాయ, బాదాము మొ||నవి.
  • తేనె, టేకు, సాల్, వెదురు మొ|| కలప, చింతపండు.
  • విస్తరాకులు, ఆయుర్వేద ఔషధ వనమూలికలు.
  • వంటచెరకు మొదలైనవి.

ప్రశ్న 2.
సంచార జీవనం అనగా నేమి?
జవాబు:
ఆది మానవులు చిన్న చిన్న సమూహాలు లేదా గుంపులుగా ఉండేవారు. వారు గుహలలో, చెట్ల నీడలలో లేదా రాతి స్థావరాలలో నివసించేవారు. ఆహారం కోసం వారు తరచుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. ఇటువంటి వారిని ‘సంచార జీవులు’ అని అంటారు. వీరు సాగించిన జీవనాన్ని సంచార జీవనం అంటారు.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 3.
నేడు మనం నిప్పును దేనికి ఉపయోగిస్తున్నాం?
జవాబు:
నేడు మనము నిప్పును క్రింది విధంగా ఉపయోగిస్తున్నాము.

  • ఆహారాన్ని వండుకుని తినుటకు
  • వెచ్చదనం పొందటానికి, నీటిని వేడి చేయటానికి.
  • మతానికి సంబంధించిన క్రతువులలో, కర్మకాండలలో
  • కొన్ని రకాల పంటల ప్రాసెసింగ్ లో (ఉదా : పొగాకును కాల్చుట)
  • వివిధ రకాల పరిశ్రమలలో (ఉదా : ఇనుము – ఉక్కు పరిశ్రమలో, సిమెంట్ పరిశ్రమలలో)
  • వెల్డింగ్ పనుల్లో
  • బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయుటకు
  • బంగారం, వెండి మొదలైన లోహాలను కరిగించడానికి, నాణెలు, బొమ్మలుగా చేయుట కొరకు.
  • చల్లని రాత్రులలో వెచ్చదనం కోసం.

ప్రశ్న 4.
నేటి మానవులు, ఆది మానవులు తిన్న ఆహార పదార్థాల జాబితాను తయారు చేసి, దానిలో మీరు గమనించిన పోలికలను, భేదాలను రాయండి.
జవాబు:
నేటి మానవులు మరియు ఆదిమానవుల ఆహార అలవాట్లలోని భేదాలు :

  • ఆదిమానవులు ఆహారాన్ని వండుకుని తినలేదు నేటి మానవులు శుభ్రం చేసుకుని, వండుకుని తింటున్నారు.
  • ఆదిమానవులు పచ్చిమాంసాన్ని భుజించగా నేటి మానవులు వండుకుని వివిధ రుచులలో భుజిస్తున్నారు.
  • ఆదిమానవులు ఆహారాన్ని సేకరించేవారు. నేటి మానవులు, ఆహారాన్ని ఉత్పత్తి (పండిస్తున్నారు) చేస్తున్నారు.
  • ఆదిమానవులు వేటాడి జంతు మాంసాన్ని పొందుతున్నారు. నేటి మానవులు జంతువులను మచ్చిక చేసుకుని పాలు, మాంసం పొందుతున్నారు.
  • ఆదిమానవులు ఆహారాన్ని నిల్వ ఉంచలేదు. నేటి మానవులు ఆహారాన్ని నిల్వ ఉంచుతున్నారు, అనేకరకాలైన ధాన్యాలు పండిస్తున్నారు.
  • ఆదిమానవులు ఆహారాన్ని భుజించడానికి ఎటువంటి పాత్రలు, పరికరాలు వాడలేదు. నేటిమానవులు అనేక రకాల వంట పాత్రలు వాడుతున్నారు మరియు చపాతి, అన్నం, పప్పు, కూరలు మొ||నవి ఆహారంలో భాగంగా ఉన్నాయి.

పోలికలు:

  • ఆదిమానవులు, నవీన (నేటి) మానవులు శక్తి కోసం ఆహారాన్ని భుజించేవారు. అంటే ఆకలి తీర్చుకోవడం కోసం.
  • ఆదిమ మానవుల్లో మాంసాహారులు కలరు అలాగే నవీన మానవుల్లో కూడా మాంసాహారులు కలరు.
  • ఆదిమానవులు ఫలాలు, దుంపలు, వేర్లు మొ||నవి ఆహారంగా తీసుకునేవారు. నేటి మానవులు కూడా ఆహారంలో, అవి స్వీకరిస్తున్నారు.

ప్రశ్న 5.
“జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం ద్వారా ఆది మానవుల జీవనం సుఖమయ అయింది” దీనితో నీవు ఏకీభవిస్తావా? మీ జవాబును సమర్థించండి.
జవాబు:

  • జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం ద్వారా ఆది మానవుల జీవనం సుఖమయం అయిందనుటలో సందేహం లేదు, నేను దీనితో ఏకీభవిస్తున్నాను.
  • జంతువులను మచ్చిక చేసుకొనడం వల్ల వారికి పాలు,మాంసం, జంతుచర్మం మొ||నవి లభించేవి.
  • మొక్కలు పెంచడం వల్ల వారికి కావలసిన ఆహార ధాన్యాలు (గింజలు) కూరగాయలు మరియు జంతువులకు అవసరమైన గడ్డి లభించేవి, గృహ (ఇళ్ళు) నిర్మాణానికి అవసరమైన కలప, ఆకులు మొ||నవి లభించేవి.
  • ఎద్దులను, గాడిదలను వ్యవసాయానికి, సరుకులు మోయటానికి ఉపయోగించుకుని తమ కష్టాన్ని తగ్గించుకున్నారు. ఈ విధంగా వారి జీవనం సుఖమయం అయింది.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 6.
వంటకు రుబ్బురోలు లేనట్లయితే మనం తినే ఆహారపు అలవాట్లపై ఎటువంటి ప్రభావం కలుగుతుంది?
జవాబు:

  • వంటకు రుబ్బురోలు లేనట్లయితే కాయలను పచ్చడి చేయలేము. ముక్కలు గానే తినవలసి వస్తుంది. అలాగే ఇడ్లీ, అట్టు, గారె లాంటి పిండ్లు వేయటానికి కుదరదు.
  • కొన్ని రకాల ఆహార పదార్థాలు తినటం కష్టం కావచ్చు. కొన్ని రకాల ధాన్యాలను గింజలుగానే తినవలసి వస్తుంది.
  • ఇలా రోలు వాడకం లేనట్లయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేసుకొనుట కూడా కష్టం కావచ్చు.

ప్రశ్న 7.
పండ్లు కోయటానికి మీరు ఎటువంటి పనిముట్లను ఉపయోగిస్తున్నారు? అవి వేటితో తయారు చేస్తారు?
జవాబు:

  • మేము పండ్లు కోయటానికి కత్తి (knife), కోత కత్తి (cutter), చాకు, చెంచా, ముళ్ళ చెంచా (fork), కొడవలి మొదలైన పనిముట్లను ఉపయోగిస్తున్నాము.
  • ఇవి అన్నీ దాదాపు స్టెయిన్లెస్ స్టీల్, ఇనుముతో తయారు చేయబడినవే.

ప్రశ్న 8.
ఆది మానవులు ధాన్యాన్ని వేటిలో నిల్వ చేసేవారు?
జవాబు:
ఆది మానవులు ఆహార నిల్వ కొరకు మట్టి పాత్రలు, గంపలు / బుట్టలు లేదా నేల మాళిగలను ఉపయోగించేవారు.

ప్రశ్న 9.
నవీన శిలాయుగ వ్యవసాయదారుల, పశుపోషకులకు, ప్రస్తుత ఆధునిక యుగ వ్యవసాయదారుల, పశు పోషకులకు మధ్య తేడాలను రాయండి.
జవాబు:

నవీన శిలాయుగ వ్యవసాయదారు/ పశుపోషకులు ఆధునిక వ్యవసాయదారు/ పశుపోషకులు
1. వీరు వ్యవసాయానికి సరైన పనిముట్లను వినియోగించలేదు. (రాతినాగలి) 1. వీరు వ్యవసాయానికి సరైన పనిముట్లు వినియోగిస్తున్నారు. (ఇనుపనాగలి)
2. వీరు పొలం దున్నటానికి జంతువులపై ఆధారపడినారు. (ఉదా : ఎద్దు) 2. వీరు ఆధునిక వాహనాలపై పొలం దున్నుతున్నారు. (ఉదా : ట్రాక్టర్)
3. వీరికి సస్యరక్షణ చర్యలు అంతగా తెలియవు. 3. వీరు-సస్యరక్షణకు పురుగుమందులు వాడుతున్నారు.
4. వీరు నీరు అందుబాటులో ఉన్నచోటనే పంటలు పండించారు. 4. నీరు అందుబాటులో లేకపోయినా కాల్వల ద్వారా, బావుల ద్వారా పంటలు పండిస్తున్నారు.
5. జంతువులను పాలు, మాంసం, చర్మాల కోసం పోషించారు. 5. జంతువులను వినోదం కోసం, పందేలకోసం కూడా పోషిస్తున్నారు.
6. వీరి వ్యవసాయ లేదా పశువుల ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోలేక పోయారు. 6. వ్యవసాయ, జంతు సంబంధ ఉత్పత్తులను చాలాకాలం నిల్వ ఉంచుతున్నారు. (ఉదా : కోల్డ్ స్టోరేజి)

ప్రశ్న 10.
నవీన శిలాయుగ వ్యవసాయ పశుపోషకులకు, జీవన విధానం, నాగరికతల ఆవిర్భావానికి ఎలా దారి తీసింది?
జవాబు:

  • నవీన రాతి యుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేసారు. తమ అవసరాలకు అనుగుణంగా కొత్త రకమయిన పనిముట్లను తయారు చేసుకొన్నారు.
  • కాంస్యయుగ ప్రారంభ కాలం నాటికి ఈ వ్యవసాయ, పశు పోషక సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు.
  • సంక్లిష్టమైన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలతో కూడిన నాగరికతలు ఈ సమూహాలలో అభివృద్ధి చెందాయి. ప్రపంచ వ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసపటోమియా, ఈజిప్ట్, సింధూలోయ (భారతదేశం) మరియు చైనాలలో వర్ధిల్లాయి.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 11.
కింద ఇచ్చిన రాతి చిత్ర కళా స్థావరాలను ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్తించండి.
A. చింతకుంట
B. ఆదోని
C. కావలి
D. నాయుడు పల్లి
E. వేల్పు మడుగు
F. శ్రీకాళహస్తి
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం 1

6th Class Social Studies 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం InText Questions and Answers

6th Class Social Textbook Page No.54

ప్రశ్న 1.
AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం 2
పై చిత్రాలను పరిశీలించి ఆది మానవులు చేస్తున్న పనుల జాబితాను తయారు చేయండి.
జవాబు:

  • జింకను వేటాడి, పట్టుకుని తీసుకు వచ్చుచున్నారు.
  • స్త్రీలు, పిల్లలు (దుంపలను, కాయలను) ఆహారాన్ని సేకరిస్తున్నారు.
  • జంతు చర్మాన్ని శుభ్రం చేయుచున్నారు.
  • రాతిపనిముట్లను తయారు చేస్తున్నారు.
  • నిప్పుపై మాంసాన్ని కాల్చుచున్నారు.

6th Class Social Textbook Page No.55

ప్రశ్న 2.
మీరు తినే ఆహారంలో అడవుల నుండి, ప్రకృతి సిద్ధంగా లభించే వాటి జాబితాను తయారు చేయండి.
జవాబు:
మేము తినే ఆహారంలో అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించేవి :

  • తేనె, చింతపండు, ఔషధ మూలికలు (క్వినైన్, కర్పూరం మొ||నవి)
  • దాల్చిన చెక్క లవంగాలు, మిరియాలు, యాలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలు.
  • వివిధ రకాల ఫలాలు (సీతాఫలము, రేగుజాతి పండ్లు మొ||నవి)
  • చూయింగ్ గమ్ తయారీలో వాడే చికిల్ మొ||నవి.

ప్రశ్న 3.
ఆది మానవులు నిప్పును ఎలా కనిపెట్టి ఉంటారో మీ ఉపాధ్యాయుల సహాయంతో చర్చించి రాయండి.
జవాబు:

  • సహజసిద్ధంగా ఏర్పడిన మెరుపు అడవిలోని చెట్లను తాకినపుడు ఏర్పడిన మంట ఆది మానవులను ఆశ్చర్యానికి గురిచేసింది.
  • గాలి బలంగా వీచినపుడు రెండు చెట్ల రాపిడి వలన ఏర్పడిన నిప్పు (మంట) ఆది మానవుడిలో ఆలోచనలను కలగజేసింది.
  • కాలక్రమేణ ఆది మానవుడు కర్ర మరియు చెకుముకిలను ఉపయోగించి మొదటగా నిప్పును ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకున్నారని పరిణామవాదులు సిద్ధాంతీకరించారు.

6th Class Social Textbook Page No.57

ప్రశ్న 4.
వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? మీ ఉపాధ్యాయులు, స్నేహితులతో చర్చించి సమాధానం వ్రాయండి.
జవాబు:
వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవుల జీవితాలను క్రింది విధంగా ప్రభావితం చేస్తున్నాయి

  • వాతావరణంలో మార్పులు మానవ జీవితంలో అభివృద్ధి సూచికగా చెప్పవచ్చును. వాతావరణంలో మార్పులు వలన మొక్కలు, చెట్లు, గడ్డి భూములు పెరిగి తద్వారా వ్యవసాయం, పచ్చదనం విస్తరించింది.
  • గడ్డితినే జంతువులయిన ఎద్దులు, గొర్రెలు, మేకలు, జింకలు మొదలైన వాటి సంఖ్య క్రమంగా పెరిగింది, జంతువులను మచ్చిక చేసుకోవటం, పశుపోషణ పెరిగింది.
  • వ్యవసాయంలో (పంటల దిగుబడిలో) గుర్తించదగిన అభివృద్ధి సాధించటం జరిగింది.
  • అయితే వాతావరణంలో నేడు అనేక కాలుష్య పదార్థాలు చేరి, వాతావరణ సమతౌల్యతను దెబ్బతీస్తూ, అతివృష్టి, – అనావృష్టి మొదలైన ప్రకృతి భీభత్సాలకు ఏర్పడుతున్నాయి.

6th Class Social Textbook Page No.58

ప్రశ్న 5.
ఆది మానవులు పశుపోషకులుగా ఎలా మారారు?
జవాబు:

  • మానవులు నివసిస్తున్న ప్రాంతాలకు ఆహారం కొరకు జంతువులు రావడం ప్రారంభించాయి.
    వారు తమ నివాసాల దగ్గరకు వచ్చే జంతువులకు ఆహారాన్ని అందించి వాటిని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు.
  • ఎంపిక చేసుకొన్న జంతువులతోనే పశోత్పత్తి గావించేవారు.
  • ఇలా మచ్చిక చేసిన జంతువులలో గొర్రెలు, మేకలు, ఎద్దులు లాంటి గడ్డి తినే జంతువులు, గుంపులుగా నివసించే పందులు ముఖ్యమైనవి.
  • ఆది మానవులు మచ్చిక చేసుకోవడానికి జంతువులు కూర మృగాల నుండి కాపాడేవారు.
  • ఈ విధంగా మానవులు వ్యవసాయ, పశుపోషకులుగా మార్పు చెందారు.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 6.
‘పశుపోషణ’ ఆది మానవుల స్థిర జీవనానికి నాంది పలికిందని నీవు ఎలా చెప్పగలవు?
జవాబు:

  • మచ్చిక జంతువులను జాగ్రత్తగా కాపాడుకొంటే అవి అనతికాలంలోనే తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి.
  • ఇవి మాంసం, పాలు, పాల పదార్థాలు అందిస్తాయి.
  • ఈ ‘కారణాల వల్ల ఆది మానవులు చాలాకాలం పాటు ఒకే ప్రదేశంలో నివాసం (స్థిర జీవనం) ఉండటం ప్రారంభించారు.

6th Class Social Textbook Page No.59

ప్రశ్న 7.
ఆధునిక రైతుల జీవన విధానాన్ని, నాటి వ్యవసాయ, పశుపోషకుల జీవన విధానాలతో పోల్చండి.
జవాబు:

  • ఆధునిక రైతులు ఆధునిక పరికరాలను ఉపయోగించి, సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తున్నారు. కాని నాటి వ్యవసాయ, పశుపోషకులు కరుకురాతి పరికరాలను ఉపయోగించారు.
  • నేటి రైతులు వివిధ రకాల పంటలను పండిస్తూ, పెద్ద పెద్ద భవనాలలో (రాతి కట్టడాలు) ఉంటూ, జంతువులను , మంచి షెడులలో పెంచుతూ వాణిజ్య తరహా పాడి, పంటలను పండిస్తున్నారు. కాని నాడు పరిమిత పంటలను పండిస్తూ తాటాకు (పూరి) గుడిసెల్లో నివసిస్తూ సాధారణ జీవనం గడిపేవారు.
  • ఈనాటి ఆధునిక రైతులు మంచి ఎరువులను పురుగు మందులను ఉపయోగిస్తూ వాణిజ్య / నగదు పంటలను లాభాలకై పండిస్తున్నారు. నాటి వ్యవసాయ పశుపోషకులు ఆహారం కొరకు జీవనాధారా వ్యవసాయం చేసినారు.
  • ఆధునిక రైతు అన్ని విధాల (నీటి సౌకర్యం, యాంత్రీకరణ, మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగి సౌకర్యం మొ||నవి) అభివృద్ధి చెంది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. నాడు ఈ సౌకర్యలేవి లేవు, ఆహారం కొరకు మాత్రమే పంటలు పండించేవారు

ప్రశ్న 8.
ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోకపోతే ఏమవుతుంది?
జవాబు:
ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోకపోతే :

  • భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుంది.
  • తర్వాత పంటకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉండవు.
  • కరవు, కాటకాలు లాంటివి ఏర్పడినప్పుడు ఆహార ధాన్యాల నిల్వలు లేకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది.
  • ఆహార కొరత సమయంలో వ్యాపారులు (నల్ల బజారు) బ్లాక్ మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది.
  • ఆహార కొరత సమయంలో ఆకలి చావులు ఏర్పడే ప్రమాదం ఉంది.

6th Class Social Textbook Page No.60

ప్రశ్న 9.
జంతువుల నుండి ఆహారం కాకుండా, మనం పొందే ఇతర వస్తువులు ఏవి?
జవాబు:
జంతువుల నుండి ఆహారం కాకుండా, మనం పొందే ఇతర వస్తువులు:

  • జంతుచర్మాలు, జంతు కొమ్ములు, దంతాలు, గోళ్ళు.
  • జంతు క్రొవ్వు, జంతు శ్రమ (ఎద్దు, గాడిదలను బరువు మోయటానికి ఉపయోగిస్తాం.)
  • జంతువుల వెంట్రుకలు (బొచ్చు)

ప్రశ్న 10.
మీ ప్రాంతంలో పెంచుకొనే జంతువులు, పక్షుల జాబితాను తయారు చేయండి.
జవాబు:

జంతువులు పక్షులు
గొర్రె, మేక, గేదెలు, దున్న, ఆవు గాడిద, కుక్క పందులు, పిల్లులు ఒంటెలు, గుర్రాలు మొ||నవి. కోళ్ళు, బాతులు, పావురాలు, చిలుకలు నెమలి, పాలపిట్ట, హంస, ఆస్ట్రిచ్ మొ||నవి.

ప్రశ్న 11.
AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం 3
పురాతన కుండ దీనిలో ఏమి నిల్వ ఉంచుకొనేవారని మీరు భావిస్తున్నారు.
జవాబు:
ఈ పురాతన కుండలో ధాన్యం నిల్వ ఉంచుకొనేవారని భావిస్తున్నాను. అలాగే వంటకు కూడా ఉపయోగించి ఉండవచ్చు.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

6th Class Social Textbook Page No.61

ప్రశ్న 12.
వంట చేయడానికి, ధాన్యం నిల్వ చేయడానికి ఆధునిక కాలంలో వాడుతున్న పరికరాలను పేర్కొనండి.
జవాబు:

వంట చేయడానికి ధాన్యం నిల్వ చేయడానికి
• గ్యాస్టవ్, ఇండక్షన్ స్టవ్ • గాలి, వేడి, తేమ ధాన్యంకు హాని కల్గించే అంశాలు వీటి నుండి రక్షణకై గ్లాసు, ప్లాస్టిక్, స్టీల్ అల్యూమినియం కంటైనర్స్ వాడతారు.
• ఎలక్ట్రిక్ కుక్కర్, ప్రెజర్ కుక్కర్
• ప్యాన్, స్టీల్ పాత్రలు
• ఓవెన్, టోస్టర్ • రిఫ్రిజిరేటర్
• గ్రిల్ (ఎలక్ట్రిక్) • జాడీలు
• స్టీల్ డబ్బాలు
• కోల్డ్ స్టోరేజీలు (శీతల గిడ్డంగులు)

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

9th Class Social Studies 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ప్రభుత్వానికి బడ్జెట్ ఎందుకు అవసరం ? బడ్జెట్ పన్నుల గురించి ఎందుకు మాట్లాడుతుంది? (AS1)
జవాబు:

  1. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్ రాబోవు ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయే ఖర్చును తెలుపుతుంది.
  2. ఈ ఖర్చులను భరించటానికి ఏ విధంగా ఆదాయాలను సేకరిస్తుందో కూడా తెలుపుతుంది.
  3. అందువలన ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది. ఎంత వ్యయం చేయడంలోను ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుంది. దీనినే “బడ్జెట్” అంటారు.
  4. ప్రభుత్వం ఆదాయ వ్యయాలపై ముందుచూపు లేకుండా వ్యవహరించినట్లయితే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
  5. వివిధ విధుల నిర్వహణకై ప్రభుత్వానికి చాలినంత డబ్బు అవసరం.
  6. ఆయా విధుల నిర్వహణకై కావాల్సిన డబ్బును ప్రజల నుండి పన్నుల రూపంలో సేకరిస్తుంది.
  7. ప్రభుత్వం వివిధ రకాల పన్నులను వసూలు చేస్తుంది.
  8. ఈ విధంగా వసూలు చేసిన పన్నులే ప్రభుత్వ రెవెన్యూ (ఆదాయం ) అవుతుంది.
  9. అందుకనే బడ్జెట్ లో పన్నుల ప్రస్తావన ఉంటుంది.

ప్రశ్న 2.
ఆదాయపు పన్ను, ఎక్సైజ్ సుంకానికి మధ్య వ్యత్యాసాలు ఏమిటి? (AS1)
జవాబు:

ఆదాయపు పన్ను ఎక్సైజ్ పన్ను
1. ప్రత్యక్ష పన్నుకు ఉదా : ఆదాయపు పన్ను. 1. పరోక్ష పన్నుకు ఉదా : ఎక్సైజ్ పన్ను.
2. వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయం పై ఆదాయపు పన్ను విధించబడుతుంది. 2. ఉత్పత్తి అయిన వస్తువులు ఫ్యాక్టరీ ద్వారాన్ని దాటక ముందే ఎక్సెజ్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
3. ఆదాయపు పన్ను కొంత పరిమితిని మించి ఆర్జించే వారికే విధిస్తారు. 3. ఆ కర్మాగారపు యజమాని లేదా మేనేజర్ ఉత్పాదిత వస్తువుల పరిమాణం మేరకు ప్రభుత్వానికి పన్ను డబ్బు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
4. వ్యక్తిగత ఆదాయాలకు కూలీలు, వేతనాలు, పింఛన్ల వంటి వివిధ రకాల వనరులుంటాయి. వ్యక్తులు బ్యాంకు నగదు నిల్వలపై వడ్డీని ఆర్జిస్తారు. కొందరు భవనాల వంటి ఆస్తులపై అద్దెను ఆర్జిస్తారు. వీటన్నింటినీ ఆదాయంగానే పరిగణిస్తారు. కాబట్టి వీరు కూడా పన్ను చెల్లించవలసి ఉంటుంది. 4. ఎక్సైజ్ సుంకాన్ని కర్మాగారం చెల్లిస్తుంది. కానీ అది వస్తువులు కొన్నవారిపై బదలాయింప బడుతుంది. ఆ కర్మాగార యజమానులు వారు చెల్లించిన పన్నులను ధరలో కలుపుకునే అమ్ముతారు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 3.
క్రింది వానిని జతపరచండి : (AS1)

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. ఎక్సెజ్ సుంకం A) వ్యక్తుల వార్షిక ఆదాయంపై విధించేది.
2. అమ్మకపు పన్ను B) వ్యాపార, వాణిజ్య సంస్థల వార్షిక లాభాలపై విధించేది.
3. దిగుమతి సుంకం C) వస్తువు తయారీ లేదా ఉత్పత్తి మీద విధించేది.
4. ఆదాయపు పన్ను D) వస్తువుల అమ్మకం జరిగినపుడు విధించేది.
5. కార్పొరేట్ పన్ను E) విదేశాల నుండి వస్తువులు తీసుకురావడంపై విధించేది.

జవాబు:

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. ఎక్సెజ్ సుంకం C) వస్తువు తయారీ లేదా ఉత్పత్తి మీద విధించేది.
2. అమ్మకపు పన్ను D) వస్తువుల అమ్మకం జరిగినపుడు విధించేది.
3. దిగుమతి సుంకం E) విదేశాల నుండి వస్తువులు తీసుకురావడంపై విధించేది.
4. ఆదాయపు పన్ను A) వ్యక్తుల వార్షిక ఆదాయంపై విధించేది.
5. కార్పొరేట్ పన్ను B) వ్యాపార, వాణిజ్య సంస్థల వార్షిక లాభాలపై విధించేది.

ప్రశ్న 4.
ఉక్కు, అగ్గిపెట్టెలు, గడియారాలు, వస్త్రం, ఇనుము వీటిలో వేటిమీద పన్నులు పెరిగితే అవి ఇతర వస్తువుల ధరలను . ఎక్కువ ప్రభావితం చేస్తాయి? ఎందుకు? (AS1)
జవాబు:
ఇనుము ధర పెరిగితే కింది పేర్కొన్న విధంగా ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి.

  1. వస్తువుల ధరలకు అన్ని రకాల పన్నులు కలుస్తూ ఉంటాయి.
  2. కానీ, కొన్ని ప్రత్యేక వస్తువులపై పన్నులు విధించడం వల్ల పెద్ద మొత్తంలో వస్తువుల ధరలు పెరుగుతాయి.
  3. ఉదా : సైకిళ్ల, తయారీకి ఉక్కు పైపులు కావాలి.
  4. ఉక్కు తయారీకిగాను ఉక్కు ఫ్యాక్టరీకి ఇనుము మరియు బొగ్గు కావాలి.
  5. ఒకవేళ ఇనుముపై ఎక్సెజ్ సుంకం పెరిగితే దాని ప్రభావం సైకిళ్ల ధరపై ఉంటుంది.
  6. ఇనుముతో తయారయ్యే వస్తువులన్నింటి ధరలూ పెరుగుతాయి.
  7. అంతేగాక ఉక్కును తయారు చేయడానికి ఇనుమునే వినియోగిస్తారు. కాబట్టి ఉక్కుతో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.
  8. ఈ విధంగా ఇనుముపై పెంచిన పన్ను వివిధ అంశాలపై ప్రభావం చూపుతుంది.

ప్రశ్న 5.
సాధారణ ఆహార పదార్థాలైన ధాన్యం, పప్పులు, నూనెలను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. ఈ వస్తువుల మీద పన్నులు విధించడం పేదవారి మీద చాలా ప్రభావం చూపుతుందని ఎలా చెప్పవచ్చు? (AS4)
జవాబు:

  1. వస్తువులు, సేవలపై పన్ను విధించే విధానంలో ధనికులు, పేదల మధ్య వ్యత్యాసం చూపడం కష్టమైన పని.
  2. అయినప్పటికీ కొన్ని వస్తువుల విషయంలో అవకాశం ఉంది.
  3. ఉదా : ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, గుడ్డలు, కిరోసిన్, వంటనూనెలు, వంటగ్యాస్ వంటి అత్యవసర వస్తువులు ధనవంతులైనా, పేదవారైనా ప్రతి ఒక్కరూ కొంటారు.
  4. కానీ పేదలు వారి మొత్తం ఆదాయాన్ని దాదాపు వీటికే వినియోగించాల్సి ఉంటుంది. అవి నిత్యావసర వస్తువులు కాబట్టి వాటిని కొనకుండా ఉండలేరు. అవి లేకపోతే జీవనం కష్టం అవుతుంది. అందువల్ల పేదవారు తమ ఆదాయం మొత్తాన్ని వీటికి కేటాయించడం వలన వారికి ఏ విధమైన ఇతర ఆదాయముండదు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 6.
నలుగురు స్నేహితులు కలసి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ అద్దెను నలుగురు కలసి చెల్లిద్దామనుకున్నారు. అద్దె నెలకు రూ. 2000. (AS1)
– వారి మధ్య ఆ అద్దె ఎలా పంచబడుతుంది?
– వారిలో ఇద్దరు నెలకు రూ. 3000, మరో ఇద్దరు రూ. 7000లు సంపాదిస్తున్నారని మనకు ముందే తెలుసు. ఈ వ్యయాన్ని వేరోక రకంగా వాటాలు వేస్తే, వారిలో ఒక్కొక్కరు అనుభవించే బాధ ఒకే విధంగా ఉంటుందా?
– అద్దె పంపకం ఎలా ఉంటే బాగుంటుందని నీవు భావిస్తున్నావు? ఎందుకు?
జవాబు:
సమానంగా పంచబడితే ఒక్కొక్కరికి రూ. 500 చొ||న వస్తుంది.
అలాగాక వారి ఆదాయం నిష్పత్తిని పరిగణనలోనికి తీసుకుంటే దాని ప్రకారం అద్దె పంచితే
(వారిలో ఇద్దరు నెలకు రూ. 3000, మరో ఇద్దరు రూ. 7000 లు సంపాదిస్తున్నారని మనకు ముందే తెలుసు.)
ఈ వ్యయాన్ని వేరొక రకంగా కాక వారి ఆదాయ నిష్పత్తి ప్రకారం పంచితే
3000 : 7000
రూ. 600 ‘లు రూ. 1400లు ప్రకారం పంచాలి.

అనగా 3000 రూపాయలు ఆదాయం పొందే ఇద్దరు (300 + 300) 600 రూపాయలు చెల్లిస్తే 7000 రూపాయలు ఆదాయం పొందేవారు (700 + 700) 1400 రూపాయలు చెల్లించాలి. ఆదాయ నిష్పత్తి ప్రకారం పంచితే బాగుంటుంది.

ప్రశ్న 7.
ఆదాయాలపై లేదా వస్తువులపై పన్ను, ఈ రెండింటిలో ధనికులు, పేదల మీద ఏది ఎక్కువ ప్రభావం చూపుతుంది? కారణాలతో వివరించండి. (AS1)
జవాబు:
ఆదాయాలపై లేదా’ వస్తువులపై పన్ను ఈ రెండింటిలో ధనికులు పేద మీద ఏది ఎక్కువ ప్రభావితం చూపుతుంది అనగా వస్తువులపై పన్ను ఎక్కువ ప్రభావం చూపుతుంది.

కారణం :
తక్కువ ఆదాయం వచ్చినా, ఎక్కువ ఆదాయం వచ్చినా తప్పనిసరిగా కొనవలసినది వస్తువులు.

వస్తువులపై పన్నులు తక్కువగా ఉంటే వస్తువులు చౌకగా లభిస్తాయి. పేదలు కూడా కొనడానికి తక్కువ ఆదాయం సరిపోతుంది. ఆదాయాలపై పన్నులు వేస్తే అధిక ఆదాయాలు పొందుతున్న కొంతమంది మీద మాత్రమే ఆ ప్రభావం పడుతుంది.

ప్రశ్న 8.
విలువ ఆధారిత పన్ను (VAT) వస్తువులపై పన్ను ఎగవేతను ఏ విధంగా తగ్గిస్తుంది? (AS1)
జవాబు:
VAT అనగా (Value Added Tax) విలువ ఆధారిత పన్ను.

  1. వ్యాట్ విధానంతో ఉన్న ప్రయోజనం వస్తువులపై పన్ను ఎగవేతను అరికట్టడం.
  2. అది ఎలా అనగా ఉత్పత్తిదారులు, వర్తకుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన లావాదేవీల నమోదులో పారదర్శకత పెంపొందుతుంది.
  3. ప్రతి ఒక్కరూ సరైన రికార్డులను నిర్వహించడానికి కొనుగోలు సమయంలో బిల్లులను అడుగుతారు.
  4. ఎందుకంటే ముడి సరుకులపై ఇది వరకే పన్ను ‘చెల్లించామని వాటి ద్వారానే తెలియజేయవచ్చు.
  5. పన్నుల శాఖ అధికారులు కొనుగోలుదారులు, అమ్మకందారుల రికార్డులను పోల్చి చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా జరిగే పన్ను ఎగవేత కష్టసాధ్యమవుతుంది.

ప్రశ్న 9.
ఎక్సెజ్ సుంకానికి, దిగుమతి సుంకానికి మధ్యగల వ్యత్యాసాలేమిటి? (AS1)
జవాబు:

ఎక్సైజ్ సుంకం దిగుమతి సుంకం
1. ఎక్సైజ్ సుంకాలను ఫ్యాక్టరీలనుండి వసూలు చేస్తారు. 1. కస్టమ్స్ సుంకాలను అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నుండి వసూలు చేస్తారు.
2. ఫ్యాక్టరీలు వస్తువులు కొన్నవారిపై ఈ పన్నును బదలాయిస్తారు. 2. విదేశాలలో వస్తువులను కొని మన దేశానికి తెచ్చే వారిపై, మన దేశం నుండి ఇతర దేశాలకు వస్తువులను సరఫరా చేసేవారిపై విధించపబడుతుంది.
3. ఇది దేశీయ ఉత్పత్తులపై విధించబడుతుంది. దేశీయ ఉత్పత్తి వస్తువులు కొన్నవారిపై విధించబడుతుంది. 3. ఇది అంతర్జాతీయ వర్తకంలో వస్తువుల విక్రయాలపై విధించబడుతుంది.

ప్రశ్న 10.
ఇటీవలి కాలంలో బస్సు చార్జీలు ఒక్కసారిగా పెరిగాయా? అయితే దానికి గల కారణాలు తెలుసుకోండి.
జవాబు:
ఇటీవలి కాలంలో బస్సు చార్జీలు ఒక్కసారిగా పెరిగాయి
కారణాలు : డీజిల్, పెట్రోలు, రేట్లు పెరగడం
ఉద్యోగుల, కార్మికుల వేతనాలు పెరగడం
నిర్వహణ ఖర్చులు పెరగడం
బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు తగ్గడం
విద్యార్ధులకు, వృద్ధులకు రాయితీలు ఇవ్వడం

ప్రశ్న 11.
‘ప్రత్యక్ష పన్నులు’ శీర్షిక క్రింద గల వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై) పేరాను చదివి కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (AS2)
ఎక్కువ ఆదాయం సంపాదించేవారు ఎక్కువ పన్ను ఎందుకు చెల్లించాలి?
జవాబు:

  1. వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై ఆదాయపు పన్ను విధించబడుతుంది.
  2. వ్యక్తిగత ఆదాయాలకు కూలీలు, వేతనాలు, పింఛన్లు వంటి వివిధ రకాల, వనరులుంటాయి.
  3. వ్యక్తులు బ్యాంకు నగదు నిల్వలపై వడ్డీని ఆర్జిస్తారు. కాబట్టి వీరు కూడా పన్ను చెల్లించవలసి ఉంటుంది.
  4. ఆదాయపు పన్నును కొంత పరిమితిని మించి ఆర్జించే వారికే విధిస్తారు.
  5. ఈ పన్నును ఆర్జించిన ఆదాయంలో పరిమితి పోగా మిగిలిన దానిలో కొంతశాతం విధిస్తారు.
  6. ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే వారు వారి ఆదాయాన్ని అనుసరించి ఎక్కువ నిష్పత్తిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

దానివల్ల తక్కువ ఆదాయం వచ్చేవారు తక్కువ పన్ను, ఎక్కువ ఆదాయం వచ్చే వారు ఎక్కువ పన్ను చెల్లించుతారు. తద్వారా -పేదవారు మరింత పేదవారు కాకుండా, ధనవంతులు మరింత ధనవంతులు కాకుండా నిరోధించవచ్చు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 12.
మన ఆర్థిక వ్యవస్థపై నల్లధనం చూపే ప్రభావం ఏమిటి? (AS6)
జవాబు:
చాలా మంది ప్రజలు తమ మొత్తం ఆదాయాలను వెల్లడించకపోవడం లేదా ఉన్న దాని కంటే తక్కువ చూపి, ఆదాయాన్ని పైకి కనపడకుండా దాయడమే, ఆ దాచిన డబ్బును నల్లధనం (Black money) అంటారు. మన ఆర్థిక వ్యవస్థపై నల్లధనం విపరీత ప్రభావం చూపుతుంది. అది ఎట్లనగా ….

వాస్తవంగా ప్రజలు, ఫ్యాక్టరీ యజమానులు, వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు అధికంగా లాభాలు ఆర్జిస్తారు. కాని వాస్తవ లాభాలు చూపి, ప్రభుత్వానికి పన్నులు చెల్లించరు. వారికి వచ్చిన లాభాన్ని తక్కువ ఆదాయాలుగా చూపుతారు. ఈ విధంగా తమ వాస్తవ ఆదాయాన్ని చూపకుండా దాయడం వలన, ప్రభుత్వానికి ధనం చేకూరదు. వాస్తవంగా చెల్లించినట్లయితే ఆ ఆదాయంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ధరలను తగ్గించి, సామాన్య ప్రజలకు చేయూతనందించవచ్చు. ఉత్పత్తి కన్నా తక్కువ ఉత్పత్తి జరిగినట్లు చూపి పన్ను నుండి తప్పించుకోవడం వలన ఆ వస్తువుల ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది. కొంతమంది వ్యాపారులు బిల్లులు సరిగ్గా ఇవ్వకుండా లేదా వాస్తవంగా అయిన వాటి కంటే తక్కువ అమ్మకాలు జరిగినట్లుగా చూపి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నారు.

9th Class Social Studies 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు InText Questions and Answers

9th Class Social Textbook Page No.132

ప్రశ్న 1.
మీ నగరం/పట్టణం/గ్రామాల్లో ప్రభుత్వం ఏ పాత్రలను పోషిస్తుండడాన్ని మీరు గమనించారో చర్చించండి.
జవాబు:

  1. మా ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు, ఆరోగ్య కేంద్రాలు తపాలా కార్యాలయాలు వంటి వివిధ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వమే నెలకొల్పి నిర్వహిస్తున్నది.
  2. రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం, ప్రభుత్వ రవాణా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది.
  3. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి వాటి నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది.
  4. ఆరోగ్య, సేవలు, పరిశుభ్రత, విద్యుత్, ప్రజా రవాణా, పాఠశాలలు వంటివి ప్రభుత్వం సదుపాయాలుగా అందిస్తున్నది.
  5. రైతులు తమ పంట భూముల్లో నీటి పారుదలకై మోటారు పంపుసెట్ల ఏర్పాటుకు ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, దుకాణాలు, మార్కెట్ల వంటి వాటిని నిర్వహిస్తున్నది.

ప్రశ్న 2.
ప్రభుత్వ ఖర్చు వివరాలను, మీ ప్రాంత వార్తాపత్రికల్లో సేకరించి జాబితా రాయండి.
జవాబు:
ప్రభుత్వ ఖర్చు వివరాలు :

  1. విద్యారంగం – 1200 కోట్లు
  2. ఆరోగ్యరంగం – 400 కోట్లు
  3. వ్యవసాయరంగం – 1000 కోట్లు
  4. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి – 300 కోట్లు
  5. గ్రామీణాభివృద్ధి – 400 కోట్లు
  6. విద్యుత్, నీటి పారుదల వరదల నియంత్రణ – 600 కోట్లు
  7. ఎరువుల సబ్సిడీ – 200 కోట్లు
  8. రైల్వేలు, రవాణా, కమ్యూనికేషన్స్ – 600 కోట్లు.
  9. రక్షణ రంగం – 700 కోట్లు
  10. పరిపాలన ఖర్చులు – 800 కోట్లు

ప్రశ్న 3.
ప్రజా సేవలకు, ఇతర కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ నుండి లభిస్తుందో ఊహించగలరా?
జవాబు:

  1. వివిధ విధుల నిర్వహణకై ప్రభుత్వానికి చాలినంత డబ్బు అవసరం.
  2. ఈ విధంగా ప్రభుత్వం యొక్క ఆయా విధుల నిర్వహణకై కావాల్సిన డబ్బును ప్రజల నుండి పన్నుల రూపంలో సేకరిస్తుంది.
  3. ప్రభుత్వం వివిధ రకాల పన్నులను వసూలు చేస్తుంది.

9th Class Social Textbook Page No.134

ప్రశ్న 4.
పై విభాగంలోని సమాచారాన్ని ఉపయోగించి ప్రభుత్వం ఆహార సబ్సిడీపై ఎంత ఖర్చు చేసిందో లెక్కించండి.
ఈ డబ్బు దేనిపై, ఎందుకోసం ఖర్చు చేయబడిందో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు 1
జవాబు:
ఆహార సబ్సిడీపై 3% ఖర్చు చేయడం జరిగింది.

ఆ డబ్బును పేదలకు కేటాయించిన బియ్యం, పప్పులు, గోధుమలు, చింతపండు, పంచదార వంటి నిత్యావసర ఆహార ధాన్యాలకు కేటాయించడం జరిగింది.

ప్రశ్న 5.
మీ ఉపాధ్యాయుల సహాయంతో పై (pie) చార్టులోని కొన్ని ఖర్చులను మొదటి విభాగంలో చర్చించిన ప్రభుత్వ పాత్రలకు అన్వయింపజేయండి.
జవాబు:
మొదటి విభాగంలో చర్చించిన ప్రభుత్వ పాత్ర

  1. ఆహారం సబ్సిడీ – 3%
  2. విద్య మొ||న విషయాలకు – 12%
  3. ఆరోగ్యం, పారిశుద్ధ్యం – 4%
  4. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధికి – 3%
  5. వినోదం వంటి ఇతరములకు – 21 %
    కేటాయించి ఖర్చు చేయడం జరిగింది.

ప్రశ్న 6.
స్వాతంత్ర్యానంతరం మన దేశ మొదటి బడ్జెట్ 1947-48 రూ. 197 కోట్లు. 2011-12లో బడ్జెట్ 23 లక్షల కోట్లు. బడ్జెట్ లో ఇంత మొత్తం పెరగడానికి కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:

  1. జనాభా పెరుగుదల
  2. ఉద్యోగస్తుల వేతనాలు పెరుగుదల
  3. ప్రభుత్వరంగ సంస్థల నిర్మాణ, నిర్వహణ పెరుగుదల
  4. వడ్డీ చెల్లింపుల పెరుగుదల
  5. రక్షణ వ్యయం పెరుగుదల
  6. పరిపాలనా ఖర్చుల పెరుగుదల
    పై విధంగా అన్ని రంగాలలో ఖర్చులు పెరగడం వలన బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. తద్వారా బడ్జెట్ మొత్తం పెరిగింది.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 7.
ప్రభుత్వ బడ్జెట్ పై పార్లమెంట్ కు అధికారం, ఎందుకు ఇవ్వబడిందో ఆలోచించండి.
జవాబు:

  1. బడ్జెట్ అంశాలపై ప్రభుత్వాన్ని చట్టసభల ద్వారా నియంత్రించవచ్చు.
  2. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని వివిధ అంశాలపై చర్చలు జరిగిన అనంతరమే ప్రభుత్వ ప్రతిపాదనలను పార్లమెంటు ఆమోదించడం జరుగుతుంది.
  3. ప్రభుత్వ ఖర్చులకై డబ్బు విడుదలకు పార్లమెంటు అనుమతించాలి.
  4. అదే విధంగా పార్లమెంటు ఆమోదం లేనిదే ఏ రకమైన పన్నూ విధించరాదు. అందువలన బడ్జెట్ పై అధికారం పార్లమెంటుకు ఇవ్వబడింది.

ప్రశ్న 8.
రసాయన ఎరువులపై రాయితీలను తగ్గించడానికి ప్రభుత్వం వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీని అర్థం ప్రభుత్వం ఇక ముందు వాటి ధరల అదుపు కొనసాగించకపోవచ్చు. రైతులు మార్కెట్ ధరలకు కొనుక్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం ఎరువుల కంపెనీలకు తక్కువ ధరలకు అమ్మడం వల్ల వచ్చే నష్టాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎరువులపై రాయితీ ఎత్తివేయాల్సి వస్తే ఆ డబ్బు ప్రభుత్వ బడ్జెట్లోని ఇతర ముఖ్య విషయాలకు మళ్లించడానికి అవకాశం కలుగుతుంది. మరో వాదం కూడా ఉంది. ఎరువులపై రాయితీలు చిన్న రైతులకు లాభదాయకంగా లేవు, కానీ పెద్ద రైతులు అవసరానికి మించి వాడేవిధంగా ప్రోత్సహిస్తున్నాయి.
ఎరువులపై రాయితీలు రైతులకు బాగా ఉపయోగపడుతున్నాయని నమ్మే రైతుగా మిమ్మల్ని మీరు భావించుకొని ఈ కేసును ఎలా వాదిస్తారు ? ఆర్థికశాఖ మంత్రికి ఒక లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
5-8-20xx.

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిగారికి,

అయ్యా,
మేము రైతులం. మాకు ఎరువులపై ఇచ్చే సబ్సిడీ వలన మేము వ్యవసాయకంగా ఎంతో లబ్దిని పొందుతున్నాం. అధునాతన పద్ధతులలో వ్యవసాయం చేసి, అధిక దిగుబడులు సాధించడానికి ఈ సబ్సిడీ కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే వాతావరణ పరిస్థితులు అనుకూలించక, విత్తనాల రేట్లు పెరిగిపోయి, పండిన పంటకు గిట్టుబాటు రేటు లేక ఇబ్బందులు పడుతున్న మాకు ఎరువులపై ఉన్న సబ్సిడీలు ఎత్తివేస్తే వాటి రేట్లు పెరిగిపోయి వాటిని సరైన మోతాదులో వాడుకోలేక పంట దిగుబడి తగ్గిపోయి సరైన ఉత్పత్తులు సాధించలేక రైతులుగా మేమేంతో నష్టపోవలసి వస్తుంది. అందువలన తమరు మాయందు దయ ఉంచి ఎరువుల సబ్సిడీలను కొనసాగించి మా వ్యవసాయ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతారని మిమ్మల్ని సహృదయపూర్వకంగా ప్రార్థించుచున్నాము..

ఇట్లు
మీ విధేయుడైన రైతు

9th Class Social Textbook Page No.135

ప్రశ్న 9.
పెట్రోల్, డీజిల్ వంటి వాటిని రవాణా వాహనాలకు, మోటారు పంపులకు, జనరేటర్ల వంటి వాటికి వినియోగిస్తాం. ఒకవేళ డీజిల్, పెట్రోల్ పై పన్ను పెరిగితే ఏమవుతుంది?
జవాబు:
పెట్రోల్, డీజిల్ వంటి వాటిని రవాణా వాహనాలకు మోటారు పంపులకు జనరేటర్ల వంటి వాటికి వినియోగిస్తాం.

  1. డీజిల్, పెట్రోల్ పై పన్ను పెరగడం వలన వాటి రేటు పెరుగుతుంది.
  2. దానితో డీజిల్ పెట్రోల్ పై ఆధారపడిన అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి.
  3. రవాణా చార్జీలు పెరగడం వలన రవాణాపై ఆధారపడిన వస్తువుల రేట్లు పెరుగుతాయి.

9th Class Social Textbook Page No.136

ప్రశ్న 10.
టి.వి. ఉదాహరణలో, దాని ఖరీదులో ఎంత భాగం వినియోగదారుడు పన్నుగా చెల్లిస్తున్నాడు?
జవాబు:
ఎక్సెజ్ సుంకం రూపంలో 1200 రూపాయలు
అమ్మకం పన్ను రూపంలో 1650 రూపాయలు
మొత్తం కలిపి 2850 రూపాయలు పన్ను చెల్లిస్తున్నాడు.

ప్రశ్న 11.
ఒకే రకమైన ఉత్పత్తులను తయారు చేసేవారి ఇద్దరిలో ఒకరు పన్ను ఎగవేసినా, మరొక వ్యక్తి కంటే ఏ విధంగా ప్రయోజనం పొందుతాడు?
జవాబు:

  1. పన్ను కట్టడం వలన తక్కువ లాభం పొందుతాడు.
  2. పన్ను ఎగవేయడం వలన దానిని కూడా తన లాభంగా పొందవచ్చును.
  3. అంతేగాక పన్ను వేయడం వల్ల ఇతరులు ఉత్పత్తి చేసిన వస్తువులకన్నా తక్కువ ధరకే అమ్మవచ్చును.
  4. అలాంటి పరిస్థితులలో పన్ను ఎగవేతదారుడు ఎక్కువ వస్తువులను అమ్ముకోవచ్చును. దానితో అతనికి మంచి లాభం రావచ్చును.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 12.
ఒకవేళ ఇనుముపై పన్ను పెంచితే దాని ప్రభావం ఇతర ఏ వస్తువులపై ఎలా పడుతుందో ఉదాహరణలివ్వండి.
జవాబు:

  1. ఇనుము రేటు పెరుగుతుంది.
  2. దానితో ఇనుముతో తయారయ్యే వస్తువులన్నింటి ధరలో పెరుగుతాయి.
  3. అంతేగాక ఉక్కును తయారు చేయడానికి ఇనుమునే వినియోగిస్తారు. కాబట్టి ఉక్కుతో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.

9th Class Social Textbook Page No.138

ప్రశ్న 13.
విలువ ఆధారిత పన్నులపై మీ అభిప్రాయం ఏమిటి? చర్చించండి.
జవాబు:

  1. విలువ ఆధారిత పన్ను విధానంలో ఉత్పత్తిదారు చెల్లించే పన్ను తక్కువగా ఉంటుంది.
  2. ఎందుకనగా ముడి పదార్థాల విలువపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  3. కర్మాగారాల్లో ఉత్పాదనాక్రమం ఇతర కర్మాగారాల్లో ఉత్పత్తి చేయబడిన ఎన్నో ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది.
  4. ఈ పన్ను విధానం (వ్యాట్) లో ముడి పదార్థాలుగా ఉపయోగించే వాటిపై మళ్ళీ పన్ను విధించబడదు.
  5. ఉత్పత్తిదారులు, వర్తకుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన లావాదేవీల నమోదులో పారదర్శకత పెంపొందుతుంది.
  6. ప్రతి ఒక్కరూ సరైన రికార్డులను నిర్వహించడానికి కొనుగోలు సమయంలో బిల్లులను అడుగుతారు. ఎందుకంటే ముడిసరుకులపై ఇదివరకే పన్ను చెల్లించామని వాటి ద్వారానే తెలియజేయవచ్చు.
  7. పన్నుల శాఖ అధికారులు. కొనుగోలుదారులు, అమ్మకందారుల రికార్డులను పోల్చి చూడటానికి అవకాశం ఉంది.

ప్రశ్న 14.
పూరించండి : తార, సాజీదా, ప్రీతిల కొనుగోళ్లపై పన్ను రేట్లు వేర్వేరు ఉన్నాయి. (ఒకే రకమైన / వేర్వేరు అలా ఎందుకు ఉన్నాయో తెలుసుకోండి.
జవాబు:
తార తన యొక్క పాఠశాల కంప్యూటర్ల కోసం సాయిరాం కంప్యూటర్స్ నుండి రెండు హార్డ్ డ్రైవ్ లను కొని తెచ్చింది. బిల్లులో విలువ ఆధారిత పన్ను కంటే ముందు రేటు రూ. 5,000 దీనికి 5% విలువ ఆధారిత పన్ను రూ. 250లు కలిపిన అనంతరం మొత్తం అమ్మకం ధర (వ్యాట్‌లతో) కలిపి రూ. 5,250 లు.

సాజీదా బ్యాటరీ రూ. 9,165లు కొనగా వ్యాట్ కలిపి 1,146 మొత్తం రూ 10,311లు చెల్లించెను.
ప్రీతి తన వంటగ్యాస్ సిలిండర్‌కు చెల్లించిన బిల్లులో వ్యాట్ లేదు.
ఎందుకంటే వంటగ్యాసు వ్యాట్ లేదు.
అందువలన పై వస్తువులపై పన్ను రేట్లు వేరువేరుగా ఉన్నాయి.

9th Class Social Textbook Page No.139

ఆదాయంపై పన్ను విధించడంలో సరైన విధానమేది?
ప్రశ్న 15.
ప్రతి ఒక్కరూ సమాన మొత్తాలను పన్నుగా చెల్లించడం సరైన విధానమని మీరు భావించి ఉంటారు. కింద పేర్కొన్న ముగ్గురు వ్యక్తులను గమనించండి.
AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు 2
పై ముగ్గురిలో ప్రతి ఒక్కరూ సమాన .మొత్తం (రూ.50) పన్ను చెల్లించే విధానం వాస్తవంగా సరైనదా? జ్యోతి తన ఆదాయంతో కనీసం తన పిల్లల్ని కూడా సరిగా పోషించలేదు. ఆమె కూడా అదే మొత్తంలో పన్ను చెల్లించడం సరైనదేనా?
జవాబు:
ఈ రకమైన పన్నుల విధానం సరియైనది కాదు.

ప్రశ్న 16.
ప్రతి ఒక్కరు తమ ఆదాయంలో కొంత మొత్తం పన్నుగా చెల్లించడం సరైన విధానమని భావిస్తున్నారు కదా! ఉదాహరణకు ప్రతి ఒక్కరు 10% పన్ను చెల్లించాల్సి ఉంటే ఎంత చెల్లించాలో కనుక్కోండి.

వ్యక్తి నెలలో సంపాదించినవి (రూ.లలో) 10% పన్ను (రూ.లలో)
జ్యోతి 1,500 150
ఆసిఫ్ 8,000 800
నితీష్ 30,000 3000

ఇది సరైనదా? అయినప్పటికీ జ్యోతికి జీవించడానికి చాలినంత ఆదాయం లేదు. ఆసిఫ్ కు తన ఇల్లు మరమ్మతులు చేయించడానికి సరిపడా డబ్బు కలిగి ఉండకపోవచ్చు. కానీ నితీష్ 20% పన్ను చెల్లించినా తన కనీస అవసరాలకు పెద్ద . మొత్తంలో డబ్బు ఉంటుంది.
జవాబు:
ఇది సరికాదు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 17.
పన్నుల విధానాన్ని సరిచేయడానికి మరింత సరైన పద్ధతిని ఇప్పుడు మీరు చెప్పగల్గుతారు. కొంత పరిమితిని ఉదాహరణకు నెలకు రూ. 7,000 లకు మించి. సంపాదించే వారే పన్ను చెల్లించాలి. బాగా ఆర్జించేవారు వారి ఆదాయాల నుండి . ఎక్కువ నిష్పత్తిలో పన్ను చెల్లించాలని కూడా మీరు చెప్పగలుగుతారు.

మీరు సంపాదించే ఆదాయం (రూ.లలో) మీరు చెల్లించే పన్ను
7,000లు కన్నా తక్కువ 0%
7,001 నుండి 15,000 ల వరకు 10%
15,001 నుండి 25,000 ల వరకు 20%
25,000ల కన్నా ఎక్కువ 30%

కింది వారిలో ఒక్కొక్కరు ఎంత పన్ను చెల్లించాలో లెక్కించండి.

వ్యక్తి నెలలో సంపాదించినవి
(రూ. లలో)
నెలకు చెల్లించాల్సిన పన్ను
(రూ.లలో)
జ్యో తి 1,000
ఆసిఫ్ 6,000
నితీష్ 20,000 4000

ఇది సరైనదేనా?
1. సరైనది కాదు.

కారణం :

  1. మనిషి తన ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి కొంత డబ్బు అవసరం. దానిమీద పన్ను విధించరాదు.
  2. అందువలన ఒక స్థాయి ఆదాయం వరకు ఏ విధమైన పన్నూ విధించకుండా ఆ దశ దాటిన తరువాత పన్ను విధిస్తే బాగుంటుంది.
  3. కావున 3వ అంశంలో పేర్కొన్న విధంగా కొంత పరిమితి వరకు పన్ను విధించకుండా ఆ తరువాత విధిస్తూ ఉండాలి.
  4. అప్పుడు పన్నుల వలన పేదవారు ఇబ్బందిపడరు.

9th Class Social Textbook Page No.140

ప్రశ్న 18.
ప్రభుత్వం విధించే ప్రధానమైన పన్నుల గురించి మనం చదివాం. ఇచ్చిన సమాచారంతో కింద పట్టికను పూరించండి. ఆదాయం పన్ను 12%, కార్పొరేట్ పన్ను 24%, దిగుమతి సుంకం 10%, ఎక్సెజ్ పన్ను 16%, సేవాపన్ను 5%, అమ్మకపు పన్ను 23%, ఇతర పరోక్ష పన్నులు 10%.
ప్రభుత్వంచే వసూలు చేయబడే పన్నులు :

పన్నులు మొత్తం పన్ను యొక్క శాతం
ప్రత్యక్ష పన్నులు : 36%
ఆదాయం పన్ను 12%
కార్పొరేట్ పన్ను 24%
పరోక్ష పన్నులు : 64%
దిగుమతి పన్ను 10%
ఎక్సైజ్ పన్ను 16%
సేవా పన్ను 5%
అమ్మకం పన్ను 23%
ఇతర పన్నులు 10%
మొత్తం పన్నులు 100%

1. ఏ రకమైన పన్నులు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి?
జవాబు:
పరోక్ష పన్నులు (64%)

2. క్రాంతికి సంవత్సరానికి రూ. 1,75,000ల ఆదాయం ఉంది. అతడు రూపాయలు రూ. 3000 పన్ను చెల్లించాలి. కమలేశ్ వార్షిక ఆదాయం 3,00,000 రూపాయలు. అతడు రూ. 5,500 ఆదాయం పన్ను చెల్లించాలి.
* ఎవరు ఎక్కువ. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు?
జవాబు:
క్రాంతికి సంవత్సరాదాయం – 1,75,000 రూపాయలు
క్రాంతి చెల్లిస్తున్న ఆదాయపు పన్ను – 3,000 రూపాయలు
క్రాంతి చెల్లిస్తున్న ఆదాయపు పన్ను శాతం – 1.71%
కమలేశ్ వార్షికాదాయం – 3,00,000
కమలేశ్ చెల్లిస్తున్న ఆదాయపు పన్ను – 5,
కమలేశ్ చెల్లిస్తున్న ఆదాయపు పన్ను శాతం – 1.83%
అందువలన కమలేశ్ ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు.

* ఎవరు ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పన్నుగా చెల్లించాలి?
జవాబు:
కమలేశ్

* ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఆదాయం ఉన్నవారు చెల్లించే పన్ను వారి ఆదాయంలో ……….. (తక్కువ/ఎక్కువ / సమానం) భాగం.
జవాబు:
ఎక్కువ

ప్రాజెక్టు

కొన్ని సబ్బులు, టూత్ పేస్టు, టాబ్లెట్స్ స్క్రిప్స్ లేదా ఎం.ఆర్.పి రాసి ఉన్న కొన్ని వస్తువుల ప్యాకింగ్ ను సేకరించి వాటిమీద రాసి ఉన్న ధరను, వాటిని అమ్ముతున్న ధరలను గురించి చర్చించండి. చిల్లర వర్తకుడు పొందుతున్న లాభాల గురించి మాట్లాడండి.
జవాబు:
లక్స్ – 20 రూ.
రెక్సోనా – 19 రూ
సంతూర్ – 16 రూ.
లిరిల్ – 25 రూ.
కోర్గెట్ 74-00 రూ.
పెప్సొడెంట్ – 70-00 రూ.
బబూల్ – 60-00 రూ.

వాటిపై ఎం.ఆర్.పి. పై విధంగా ఉండగా చిల్లర వర్తకుడు ఒక్కొక్కదానిపై దానిమీద ఉన్న ఎం.ఆర్.పి. రేటుకన్నా 2 లేదా 3 రూపాయలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు.

ప్రతి ఉత్పత్తి వస్తువుపైనా ఎం.ఆర్.పి. రేటుకన్నా 2 లేదా 3 రూపాయలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు.

ప్రతి ఉత్పత్తి వస్తువుల పైనా ఎం.ఆర్. పి. రేటుతోపాటు (అన్నిరకముల పన్నులను కలిపి) అని ఉంటుంది. కాబట్టి చిల్లర వర్తకుడు ఎం.ఆర్.పి. ఎక్కువ రేటుకు అమ్మవలసిన అవసరం లేదు. వారికి ఎం.ఆర్.పి రేటులోనే కొంత తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఆ లాభం సరిపోతుంది. కానీ చిల్లర వర్తకుడు మరికొంత అదనపు ఆదాయాన్ని రాబట్టడం కోసం ఆ విధంగా ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

SCERT AP 6th Class Social Study Material Pdf 12th Lesson సమానత్వం వైపు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 12th Lesson సమానత్వం వైపు

6th Class Social 12th Lesson సమానత్వం వైపు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. కింది వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి.
i) కులవ్యవస్థ అనేది భారతదేశంలో చాలా సాధారణంగా కనపడే అసమానతల్లో ఒకటి. ( ✓ )
ii) ప్రతి వ్యక్తికీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ( ✗ )
iii) ప్రజాస్వామిక సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడం అనేది నిరంతరం కొనసాగే పోరాటం. ( ✓ )

ప్రశ్న 2.
సమస్యలలో చిక్కుకున్నప్పుడు, ఈ సంఖ్యలను ఏ విధంగా ఉపయోగిస్తారు?
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 1
జవాబు:
100 : పోలీసులకు సంబంధించిన నంబరు. –
దొంగతనం, హత్య, దోపిడి మొదలైన అఘాయిత్యాలపుడు చేయవలసిన నంబరు

112 : మహిళలు అత్యవసర సమయాల్లో చేయవలసిన నంబరు.
‘దిశ’ మహిళా రక్షణకై ఏర్పాటు చేయబడింది మహిళలపై జరిగే ఎటువంటి దాడుల నుండైనా రక్షణ కల్పిస్తుంది. అత్యవసర సేవలు కూడా అందిస్తుంది.

181 : కేవలం మహిళా రక్షణకై ఏర్పాటు చేయబడిన నంబరు.
శారీరక వేధింపులు, గృహహింస, అత్యాచారాలు మొదలైన అఘాయిత్యాలు జరగకుండా (దిశ) నంబరును ఏర్పాటు చేసారు. మహిళా సమస్యలపై స్పందనకై ఏర్పాటైంది.

1091 : మహిళల ‘ఈవ్ టీజింగ్’ లాంటి సమస్యల నుండి రక్షణకై ఏర్పాటు చేసారు. మహిళామిత్ర, మహిళ రక్షక్, శక్తిటీమ్స్ మొ||న పోలీసు బృందాలు తక్షణం స్పందిస్తారు.

1098 : పిల్లల హక్కుల సంరక్షణకై ఏర్పాటు చేయబడింది. అన్నిరకాల పిల్లల వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ నంబర్లు అన్నీ 24 గం|| పని చేస్తాయి మరియు (టోల్ ఫ్రీ) ఉచితం.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 3.
ఈ రోజుకి కుల వ్యవస్థ ఎందుకు ఇంత వివాదాస్పదమైన అంశంగా మిగిలి ఉంది?
జవాబు:
ఈ రోజుకి కుల వ్యవస్థ ఇంత వివాదాస్పదమైన అంశంగా మిగలటానికి కారణం :

  • అనాదిగా వస్తున్న మూఢ నమ్మకాలు, విశ్వాసాలు.
  • నిరక్షరాస్యత, పేదరికం.
  • స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు, వ్యవస్థ
  • బ్రిటిషువారి విభజించు పాలించు విధానంలో కులవ్యవస్థ పాత్ర కూడ ఉంది.
  • చట్టాలు కఠినంగా అమలు పరచలేకపోవడం (వానిలోని లొసుగులు కారణం)

ప్రశ్న 4.
స్వాతంత్ర్యానికి ముందు ప్రజలు బాలికలను బడికి పంపించకపోవడానికి గల వేర్వేరు కారణాలేవి?
జవాబు:
స్వాతంత్ర్యానికి ముందు ప్రజలు బాలికలను బడికి పంపించకపోవడానికి గల కారణాలు :

  • బాల్య వివాహాలు, (కన్యాశుల్కం)
  • తల్లిదండ్రుల నిరక్షరాస్యత
  • తల్లిదండ్రుల పేదరికం
  • మూఢనమ్మకాలు, విశ్వాసాలు (ఆడపిల్లకు చదువు ఎందుకు అని అంటుండేవారు)
  • పాఠశాలలు అందుబాటులో లేకపోవడం (పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం)
  • పెద్ద కుటుంబాల (ఉమ్మడి కుటుంబాలు) అవ్వటం వలన ఆడపిల్లలను ఇంటి పనులకు పరిమితం చేయటం.
  • చిన్న పిల్లల సంరక్షణ బాధ్యతను ఇంటిలోని ఆడపిల్లలకు అప్పజెప్పడం.

ప్రశ్న 5.
భారతదేశంలో గల అసమానత యొక్క సాధారణ రూపాలు ఏమిటి?
జవాబు:
భారతదేశంలో గల అసమానత యొక్క రూపాలు :
ఆర్థిక అసమానతలు :

  • పేద, ధనిక (ఉన్నవారు, లేనివారు) వర్గాల మధ్య అసమానత.
  • సంపాదనల్లో అసమానత ఈ రోజుల్లో స్పష్టంగా కన్పిస్తుంది.

సామాజిక అసమానత :

  • సమాజంలోని వివిధ సమాజాలకు, కులాల మధ్య అసమానత.
  • అగ్రకులం, అణగారిన కులం మధ్య అసమానతలు.
    స్త్రీ, పురుషుల అవకాశాలలో, ఉద్యోగ, ఉపాధుల్లో అసమానత.
    బాగా చదువుకున్నటువంటి వారు నిరక్షరాస్యుల మీద అసమానత.

రాజకీయ అసమానత:
భారతదేశ రాజ్యాంగం అందరికి (రాజకీయంగా) సమాన హక్కులు ప్రసాదించినప్పటికీ, కొన్ని హక్కులు మాత్రం (ఉదా : ఎన్నికలలో పోటీచేయడం) కొన్ని వర్గాలకి పరిమితం అవుతుంది.

ప్రశ్న 6.
భారత ప్రజాస్వామ్యంలో సమానత్వంపై ఒక చిన్న వ్యాసం రాయండి.
జవాబు:

  • 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన నాయకులు సమాజంలో ఉన్న వివిధ రకాల అసమానతలు గురించి ఆందోళన చెందారు.
  • సమానత్వ సూత్రంపై సమాజం పునర్నిర్మించబడాలని ప్రజలు భావించారు.
  • కనుకనే భారత రాజ్యాంగంలో సమానత్వ సాధనకు ప్రాధాన్యత ఇవ్వబడింది.
  • అంటరానితనం చట్టం ద్వారా రద్దు చేయబడింది.
  • ప్రజలకు తాము చేయాలనుకుంటున్న పనిని ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వబడింది.
  • ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ అవకాశం కల్పించబడింది. ప్రజలందరికీ సమాన ప్రాముఖ్యత లభించింది.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 7.
భారతీయ సమాజంలో అసమానత మరియు వివక్షతలను తొలగించడానికి సూచనలు ఇవ్వండి.
జవాబు:
అసమానత మరియు వివక్షతలను తొలగించడానికి సూచనలు :
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 2

  • గొప్ప మార్పు తల్లిదండ్రుల నుండే రావాలి. ఇతరుల పట్ల తమ వైఖరులు, మాటలు, ప్రవర్తనలకు తల్లిదండ్రులే ఉత్తమ నమూనాలుగా నిలవాలి.
  • ఇతర మతాల గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, వారి నమ్మకాలను గౌరవించాలి.
  • స్త్రీలను సమానంగా భావించి గౌరవించాలి
  • అంగ వైకల్యం కలవారి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రోత్సహించాలి.
  • ఆరోగ్య సంరక్షణ మరియు విద్య వంటి నాణ్యమైన ప్రాథమిక సేవలను అందరికీ విస్తృతంగా అందుబాటులోకి తేవాలి.

ప్రశ్న 8.
అసమానత మరియు వివక్షతల మధ్య తేడాను తెలపండి.
జవాబు:

  • అసమానత్వము అనేది వ్యక్తులు లేదా వర్గంలోని సామాజిక స్థాయి, సంపద, అవకాశాలలో బేధమును తెలుపుతుంది.
  • వివకత అనేది వ్యక్తుల లేదా వ్యక్తుల నైపుణ్యం, యోగ్యత, గుణము మొదలైన వాటిని కాకుండా వారి వర్గాన్ని (కులము), ప్రాంతాన్ని, చర్మ రంగును (జాతి) లింగం మొ||న వాటిని పరిగణలోకి తీసుకుని సదరు వర్గాలు (బృందాల) పట్ల అన్యాయంగా, అసమానంగా చూడటం.

6th Class Social Studies 12th Lesson సమానత్వం వైపు InText Questions and Answers

6th Class Social Textbook Page No.137

ప్రశ్న 1.
ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఏ విధమైన వివక్షతకు గురవుతున్నారు?
జవాబు:
ప్రస్తుత సమాజంలో స్త్రీలు వివక్షతకు గురవుతున్న అంశాలు :

  • ప్రభుత్వేతర పనుల్లో స్త్రీ, పురుషుల మధ్య వేతనాల్లో అసమానత ఉంటుంది.
  • వివాహ సందర్భంలో (కట్న కానుకలు ఆడపిల్లవారికి తలకి మించిన భారమవుతుంది)
  • వివాహం తరువాత ఆడపిల్లను (పెండ్లికొడుకు) భర్త ఇంటికి పంపటం, ఆచారంగా ఉంది. దీనివలన ఆడపిల్ల తన తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది.
  • ఉన్నత విద్యను అందించే విషయంలో కొంతమేర ఆడపిల్లలు వివక్షతను ఎదుర్కొంటున్నారు. (మగపిల్లలతో పోల్చితే)
  • వేసుకొనే దుస్తుల్లో కూడా వివక్షత కన్పిస్తుంది.
  • కార్యాలయాల్లో, ఉపాధి ప్రదేశాలలో స్త్రీలు వివక్షతకు గురవుతున్నారు.
  • ఆచార, సాంప్రదాయాల్లో (ఉదా : తలకొరివి పెట్టడం) పురుషాధిక్యత కన్పిస్తుంది.

ప్రశ్న 2.
ఇతర మతాలకు చెందిన ప్రాంతాలకు నీవెప్పుడైనా వెళ్ళావా? అక్కడ నీవు గమనించిన మంచి విషయాలు ఏవి? ఏ సారూప్యతలు నీవు గమనించావు?
జవాబు:
ఇతర మతాలకు చెందిన ప్రాంతాలకు నేను తరచుగా వెళతాను.
అక్కడ గమనించిన మంచి విషయాలు :

  1. వారు అందరూ కలసి మెలసి ఉంటూ, నన్ను కూడా కలుపుకున్నారు.
  2. వారు వారి పెద్దలను గౌరవిస్తూ, వారు చెప్పేది శ్రద్ధగా పాటిస్తున్నారు.
  3. వారి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
  4. అందరి మంచిని కోరుకుంటున్నారు. (సర్వేజనా సుఖినోభవంతు అని)

గమనించిన సారుప్యతలు :

  1. అందరి భావాలు దేవుడు ఒక్కడే అని చెబుతున్నాయి.
  2. ప్రేమతత్వాన్ని బోధిస్తున్నాయి.
  3. తోటి ప్రాణి మంచిని కోరుతున్నారు.
  4. పాప, పుణ్యాల గురించి తెల్పుతున్నాయి.

6th Class Social Textbook Page No.139

ప్రశ్న 3.
లింగ వివక్షతను నీవు సమర్థిస్తావా? తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
లింగ వివక్షతను నేను సమర్థించను. ఎందుకంటే

  1. స్త్రీలు, ఈనాడు మగవారితో సమానంగా చదువుకుంటున్నారు.
  2. స్త్రీలు, ఈనాడు మగవారితో సమానంగా ఉద్యోగ, ఉపాధులు పొందుతున్నారు.
  3. స్త్రీలు, ఈనాడు మగవారితో సమానంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో ముందు ఉన్నారు.
  4. స్త్రీలు, ఈనాడు మగవారితో సమానంగా రవాణా, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దూసుకు పోతున్నారు
  5. స్త్రీ, పురుషులు శారీరకంగా ప్రకృతి సహజంగా కొన్ని బేధాలుండవచ్చు. అంతేగాని మిగతా విషయాల్లో సమానమే.

6th Class Social Textbook Page No.140

ప్రశ్న 4.
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 3
ఎ) ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు:
ఇది దక్షిణాఫ్రికాలో జరిగిన సంఘటన, ఈ విధమైన జాతి వివక్షత చూపించడం నిజంగా దురదృష్టకరం, అవాంఛనీయం, ఖండనీయం. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు చేపట్టాలి.

బి) ఇది ఏ రకమైన వివక్ష? తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
ఇది జాతి వివక్షత:

  • ఇది వ్యక్తి యొక్క చర్మపు రంగు లేదా జాతి లేదా జాతి మూలం ఆధారంగా చూపే వివక్ష.
  • గాంధీజి దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాకు రైలులో ప్రయాణించేటప్పుడు ఈ వివక్షతలను ఎదుర్కొన్నారు.
  • రైలులో మొదటి తరగతి టికెట్లు తీసుకున్నప్పటికి తెల్లజాతీయుల ప్రోద్బలంతో ఆయన విచక్షణా రహితంగా రైలు నుండి తోసివేయబడ్డారు.
  • ఇదే విధంగా నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.
  • వర్ణ వివక్షత వ్యవస్థ అనగా జాతి ప్రాతిపదికన ప్రజలను వేరుచేయడం.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 5.
మీరెప్పుడైనా ఏ రకమైనా వివక్షతనైనా ఎదుర్కొన్నారా? అప్పుడు మీకెలా అనిపించింది? Page No. 140
జవాబు:
నేను ఎప్పుడు ఏ విధమైన వివక్షతను ఎదుర్కొలేదు. మా పాఠశాలలో అందరం ఎంతో స్నేహంతో కలసి, మెలిసి, ఉంటాం. ఉపాధ్యాయులు కూడా మాతో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు.

అయితే క్రీడల విషయంలో దివ్యాంగుడైన నా స్నేహితుడు పాల్గొనలేకపోవడం చాలా బాధగా అన్పించింది.

కింది చిత్రాలను పరిశీలించండి.
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 4 AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 5

6th Class Social Textbook Page No.141

ప్రశ్న 6.
మీరిక్కడ ఏమి గమనించారు? మీ టీచర్ సహాయంతో చర్చించండి.
జవాబు:
మేము ఇక్కడ గమనించిన విషయాలు : .

  • ఇవి వివిధ రకాల వివక్షతను తెలియజేస్తున్న చిత్రాలు.
  • మొదటి రెండు బొమ్మల్లో బాలికల, బాలుర ఆటబొమ్మలు చూస్తే ఆడపిల్లల బొమ్మలు వంటసామాన్లు (కిచెన్), బేబీ బొమ్మలు ఇలా వారిని ఆయా పనులను భవిష్యత్తులో చేసేందుకు ఉన్ముఖీకరిస్తున్నట్లుంది. అదే బాలుర ” బొమ్మలు జీపులు, రోబోట్లు మొ||నవి ఇవి మగవారు మాత్రమే చేసేవిగా చూపిస్తున్నట్లుంది.
  • రెండవ చిత్రంలో చర్మరంగు (కులం కూడా కావచ్చు) ఆధారంగా వివక్షతను చూపుతుంది.
  • మూడవ చిత్రంలో ఆర్థికపరంగా (కులం కూడా కావచ్చు) ఆధారంగా వివక్షతను చూపుతుంది.
  • నాల్గవ చిత్రంలో కూడా (స్త్రీ) బాలికా వివక్షతను చూపుతుంది. ఇల్లు ఊడవటం, వంటచేయడం మొ||నవి సీలు (బాలిక) చేస్తున్నారు. పురుషుడు (బాలుడు) చదువుకుంటున్నారు.

6th Class Social Textbook Page No.141

ప్రశ్న 7.
గతానికీ, ఇప్పటికీ మీరేమైనా మార్పులు గమనించారా? ఈ మార్పులు ఎలా వచ్చాయి?
జవాబు:

  • గతానికీ, ఇప్పటికీ మార్పులు గమనించాను. ఈ మార్పులు ఎలా వచ్చాయి. అంటే,
  • భారత రాజ్యాంగం ప్రసాదించిన సమాన హక్కులు, చట్టాలు వలన,
  • ప్రభుత్వాలు అందిస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల వలన.
  • అందరూ చదువు కోవటం, విద్యావంతులవ్వటం వలన.
  • శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందటంతో సాంఘిక దురాచారాలు, మూఢ విశ్వాసాలు రూపుమాసిపోవడం వలన.
  • నేటి సమాచార ప్రసార సాధనాల వలన ప్రపంచమే ఒక కుగ్రామంగా (గ్లోబలైజేషన్) మారిపోవటం వలన.
  • జనాభా పెరగటం, పట్టణీకరణ పెరగటం వలన

6th Class Social Textbook Page No.144

ప్రశ్న 8.
ప్రభుత్వం మధ్యాహ్న భోజనం, అమ్మఒడి, ఉచిత పాఠ్యపుస్తకాలు, పాఠశాల యూనిఫాంలు, బూట్లు పంపిణీ మొదలైన అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఇవి సమానత్వ సాధనకు ఎలా సాయపడతాయో చర్చించండి.
జవాబు:

  • ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాల వలన విద్యార్థులందరూ ఒక విధమైన (యూనిఫాం) దుస్తులు, బూట్లు ధరించటంతో, వారిలో ధనిక పేద తేడా లేకుండా సమానంగా భావిస్తారు.
  • మధ్యాహ్న భోజన కార్యక్రమంలో విద్యార్థులందరూ కుల, మత, ప్రాంతీయ, ఆర్థిక బేధాలు లేకుండా కలసి కూర్చోని భోంచేస్తారు.
  • అలాగే ఆర్థిక విషయాల కారణంగా ఎవరూ బడి మానకుండా, ఉచిత పాఠ్యపుస్తకాలు అమ్మఒడి చేయూతనిస్తోంది. అందరూ విద్య నేర్చుకుంటారు, తద్వారా విద్యలో సమానత్వం సాధించవచ్చు.
  • అలాగే పాఠశాలలో చేపట్టే అన్ని కార్యక్రమాలు ఏ విధమైన వివక్షత చూపకుండా అందరికి సమానంగా అందేలా చూస్తారు.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 9.
వివక్షకు వ్యతిరేకంగా పోస్టర్లను తయారు చేయండి. పాఠశాలలోని ఇతర విద్యార్థులు కూడా వివక్షను వ్యతిరేకించేలా, తయారు చేసిన పోస్టర్లను పాఠశాల అంతటా ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు.
ఆధారం :
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 7
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 6

ప్రశ్న 10.
మన పాఠ్యపుస్తకంలో ప్రవేశిక ఉన్నది. అది ఎక్కడ ఉన్నదో కనుక్కోండి. శ్రద్ధగా చదవండి. సమానత్వం గురించి మీరేమి అవగాహన చేసుకున్నారో తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
మన పాఠ్యపుస్తకంలో ప్రవేశిక మొదటి పేజిలో ఉంది.

సమానత్వం గురించి నేను అవగాహన చేసుకున్న అంశాలు :

  • మన రాజ్యాంగం అన్ని అంశాలలో (ఉదా॥ ఆదాయం, ఆస్తుల విషయంలో) సమానత ఇవ్వటం లేదు, కానీ ఈ అందరికీ ఒకే హోదా ఉండేలా చూస్తుంది. దీని అర్థం ప్రతి ఒక్కరికీ ఒకే చట్టాలు వర్తిస్తాయి.
    AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 8
  • ఆటోమూ స్వేచ్ఛ, ఆవ ప్రకటనా స్వేవు నమ్ముతాన్ని పర్నాసార్లు కలిగివుంది ఆసక్తి అందాన్ని పెంపొందించడం.
  • రెండవది అది ‘అవకాశాలలో’ సమానత్వానికి హామీ ఇస్తోంది. దీని అర్థం. ప్రభుత్వ అవకాశాలన్నీ కులం, మతంతో సంబంధం లేకుండా అందరికి అందుబాటులో ఉంటాయి.
  • ఒక పదవికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సి వస్తే, ఆ అర్హతలు కూడా అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా చేస్తారు.

ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
ద్వేషాన్నీ, అసమానతను ఎదుర్కొన్న ఎవరైనా ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తుల గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
విద్యార్థులు క్రింది విషయాల ఆధారంగా స్వయంగా రాయగలరు.
ద్వేషాన్నీ, అసమానతను ఎదుర్కొన్న ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తులు.

మరియప్పన్ తంగవేలు :
మరియప్పన్ తంగవేలు ఒక భారతీయ పారా ఒలింపిక్ హై జంప్ క్రీడాకారుడు – తొమ్మిదేళ్ళ వయసులో తన కాలుకు గాయమైంది. 2016లో బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరిగిన పారా ఒలింపిక్స్ లో పురుషుల హై జంప్లో ఆయన బంగారు పతకాన్ని సాధించారు.
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 9

సింధుతాయి – ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం :
సింధుతాయి. 1948లో జన్మించింది. ఆమె తండ్రి ఆమెను విద్యావంతురాలిని చేయాలని ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు. పశువులను మేపేందుకు పంపకుండా ఆమెను బడికి పంపాడు. తొమ్మిదేళ్ల వయసులోనే ఆమెకు వివాహమయింది. ఇరవయేళ్ల వయసులో తొమ్మిదోనెల గర్భంతో ఉండగా, ఆమె భర్త ఆమెను చనిపోయేటంతగా కొట్టాడు. ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి, అతి కష్టం మీద ప్రాణాలను నిలబెట్టుకున్నది. పుట్టినింటికి వెళ్లగా, తన తల్లి ఆమెకు ఆశ్రయమివ్వడానికి నిరాకరించింది. అప్పుడామె రైల్వే ప్లాట్ ఫాం మీద భిక్షాటన చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తల్లిదండ్రుల చేత వదిలివేయబడ్డ పిల్లలు అనేకమంది ఉన్నారని ఆమె గుర్తించింది. వాళ్లనామె దత్తత తీసుకున్నది.

అనాథలకోసం ఒక ఆశ్రమాన్ని ప్రారంభించింది. 1200 మంది అనాథలకు ఆమె తల్లిగా మారింది. 750 అవార్డులను స్వీకరించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘నారీ శక్తి’ పురస్కారాన్ని అందుకున్నది. పేదరికం, బాల్య వివాహం, లింగవివక్ష, కుటుంబ నిరాదరణ – ఇవేమీ ఆమెను ఆపలేకపోయాయి. పట్టుదల గల వ్యక్తికి ఏదీ అసాధ్యం కాదనడానికి ఇది ఒక నిదర్శనం.
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 10

AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

SCERT AP 6th Class Social Study Material Pdf 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

6th Class Social 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భూ స్వరూపం అనగా నేమి?
జవాబు:
మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదు. కొన్నిచోట్ల ఉన్నతి చెందిన ప్రాంతాలు, విశాల మైదానాలు నుండి లోయల వరకు ఈ అంతరాలు ఉండవచ్చును. మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు మైదానం పీఠభూమి, కొండ, పర్వతం, లోయ వంటి వివిధ రూపాలను గమనిస్తాం. వీటినే భూస్వరూపాలని పిలుస్తారు.

ప్రశ్న 2.
భూ స్వరూపాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చును?
జవాబు:
భూస్వరూపాలు ముఖ్యంగా మూడు రకాలుగా చెప్పవచ్చును. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఈ ప్రధాన భూస్వరూపాలు అనేక చిన్న భూస్వరూపాలను కలిగి ఉంటాయి. ఈ భూస్వరూపాల ఎత్తు సముద్రమట్టం ఆధారంగా కొలుస్తారు.

ప్రశ్న 3.
డెల్టా ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
నది సముద్రంలో కలిసే ముందు చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్యభాగంలో ఇసుక, మెత్తటి మట్టి (ఒండ్రు) మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. సాధారణంగా ఇవి ‘A’ త్రిభుజాకారం (డెల్టా)లో ఉంటాయి. ఇవి చాలా సారవంతంగా ఉంటాయి.

ప్రశ్న 4.
మైదాన ప్రాంతాలలో ఎందువలన జనసాంద్రత అధికంగా ఉంటుంది?
జవాబు:
మైదాన ప్రాంతాలలో జనసాంద్రత అధికంగా ఉండటానికి గల కారణాలు :

  • మైదాన ప్రాంతాల్లోని నేలలు సారవంతంగా ఉండి మంచి పంటల దిగుబడినిస్తాయి.
  • భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో అనేక రకాల పంటలు పండించడానికి అనుకూలమైన నేలలున్నాయి.
  • మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన నగరాలకు ఆలవాలంగా ఉన్నాయి.
  • ఇక్కడ మెరుగైన రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి, చెందుతున్నాయి.
  • వ్యవసాయదారులు మిగులు సొమ్మును పెట్టుబడిగా మార్చి పరిశ్రమల స్థాపనకు దోహదం చేయటం వలన వృత్తి ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయి.
  • మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన “సాగు నీరు, త్రాగునీరు” వసతులు కల్గి ఉండి ఇండ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉండి జననివాస యోగ్యంగా ఉన్నాయి.
  • మైదాన ప్రాంతాలు ప్రాచీన కాలం నుండి మానవ ఆవాసాలకు నిలయం.
    ఉదా : సింధూ నాగరికత.

AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

ప్రశ్న 5.
విభిన్న భూస్వరూపాలలోని వివిధ రకాల నేలలను పోలండి.
జవాబు:

మైదానాల నేలలు పీఠభూముల నేలలు పర్వత (కొండ) ప్రాంత నేలలు
ఇవి సారవంతమైన ఒండ్రు, నల్లరేగడి నేలలు. ఇవి తక్కువ సారవంతమైన నేలలు. ఎర్ర, లాటరైట్, నల్లరేగడి నేలలు. రాతి పొరలతో కూడిన ఎర్ర నేలలు.
ఇవి తేమను ఎక్కువ నిలువ చేసుకుంటాయి. ఇవి తేమను తక్కువ నిలువ చేసుకుంటాయి. ఇవి తేమను నిల్వ చేసుకోవు.
ఇవి నదీతీరాలలో ఉంటాయి. ఇవి కొండల పాదాల దగ్గరగాని లేదా కొండలతో నిండిగాని ఉంటాయి. కొండ ఉపరితలంపై ఉంటాయి.
ఇవి సం||రానికి మూడు పంటలకు అనుకూలం. ఇవి సం||రానికి ఒక పంటకి కూడా అనుకూలం అని చెప్పలేము. పానీయపు పంటలకు అనుకూలం పోడు వ్యవసాయం చేస్తారు.

ప్రశ్న 6.
ప్రభుత్వం కొన్ని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా ఎందుకు గుర్తిస్తుంది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాలలో జూన్ నుండి నవంబరు వరకు వర్షాకాలం. వర్షం తక్కువ’ మరియు అంతగా నమ్మదగినదిగా ఉండదు. కరవు తరచుగా పునరావృతమయ్యే ప్రక్రియ. వర్షం చాలా తక్కువగా ఉండడం, రైతులు తరచుగా పంట నష్టపోతూ ఉండడంతో ప్రభుత్వం కొన్ని మండలాలను కరవుకి గురయ్యే ప్రాంతాలుగా ప్రకటిస్తుంది.

ప్రశ్న 7.
“భౌగోళిక మరియు శీతోష్ణస్థితి పరిస్థితులు ఒక ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలను నిర్ధారిస్తాయి”. వివరించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని ఈ భూస్వరూపాల కింద విస్తరించియున్న వివిధ ప్రాంతాలలో విభిన్నమైన పరిస్థితులను మనం గమనిస్తాం. భౌగోళిక మరియు శీతోష్ణస్థితి పరిస్థితులు ఒక ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావాన్ని చూపుతాయి. మైదానాలలో ఉండే ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడితే, కోస్తా తీర ప్రాంతాలలోని ప్రజలు చేపలు పట్టడం వారి ప్రధాన వృత్తిగా మలచుకుంటారు. బుట్టలు అల్లడం, చేపలు పట్టడం, పందులు పెంపకం, కోళ్ళ ఫారాలు, రైసు మిల్లులలో పనిచేయడం మైదాన ప్రాంతాలలో వ్యవసాయేతర కార్యకలాపాలు కాగా గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంటు ఇటుకల తయారీ మొదలగు పనులు పీఠభూమి ప్రాంతాలలో చేపడతారు.

పర్వత ప్రాంతాలు, కొండలపైన పశువుల పెంపకం, పండ్లు, తేనె, జిగురు వంటి అటవీ వస్తువులను సేకరణ చేస్తారు. కొండవాలులు కాఫీ, టీ మొదలగు పంటల సాగుకి అనుకూలమైన శీతోష్ణస్థితిని కలిగి ఉంటాయి. అడవిలో వెదురు సమృద్ధిగా లభిస్తుంది కనుక గిరిజనులు బుట్టలు, చేటలు, దోనెలు మొదలగు వస్తువులను తయారు చేసి వాటిని మార్కెట్లో అమ్ముతారు. కాగితం మిల్లుల ప్రతినిధులు వీరిని వెదురు నరికే పనిలో వినియోగించుకోవడం వలన గిరిజనులు మంచి ఆదాయాన్ని పొందుతారు.

ఇలా భూస్వరూపాలలో వైవిధ్యతలు ఆ ప్రాంతంలోని వృత్తులు, ఆహార పద్ధతులు, సహజ జీవజాలంపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రాంతంలోని శీతోష్ణస్థితులపై అక్కడి వృక్ష, జంతు సంపదలు ఆధారపడి ఉంటాయి. ఆహారం, వస్త్రధారణ, వృత్తులు వారి జీవనోపాధులు ప్రాంతీయంగా ఉండే భౌగోళిక పరిసరాలు, శీతోష్ణస్తితితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి.

ప్రశ్న 8.
మీగ్రామంలో ఉండే అన్ని ప్రాంతాలు వ్యవసాయక దిగుబడిని ఇచ్చేవేనా? మీ జవాబు అవును, కాదు ఏదైనా తగిన కారణాలు రాయండి.
జవాబు:
మా గ్రామంలో ఉండే అన్ని ప్రాంతాలు వ్యవసాయక దిగుబడిని ఇచ్చేవి (అవును)
కారణం:

  • మా గ్రామం మైదాన ప్రాంతంలో ఉంది.
  • ఇక్కడి నేలలన్నీ సారవంతమైనవి.
  • కొంత పల్లపు (మాగాణి), కొంత మెరక (మెట్ట) భూములున్నాయి.
  • దాదాపు అన్ని భూములకు నీటి సౌకర్యం (కాలువలు, బోరుబావులు) కలదు.

మా గ్రామంలో ఉండే అన్ని ప్రాంతాలు వ్యవసాయక దిగుబడిని ఇచ్చేవి (కాదు)
కారణం:

  • మా గ్రామంలో కొంత ప్రాంతం గుట్టలు, మిట్లతో (కొండలతో) కూడి ఉంది.
  • ఇక్కడి నేలలన్ని వ్యవసాయంకు అనుకూలంగా ఉండవు.
  • నీటి సౌకర్యం కూడా అంతగా లేదు. కొన్ని భూములకు మాత్రమే నీటి సౌకర్యం ఉంది.
  • ఎక్కువగా వర్షపాతం మీద ఆధారపడటం.

ప్రశ్న 9.
గిరిజనుల జీవన విధానాన్ని పరిరక్షించడం ముఖ్యమైనదిగా నీవు భావిస్తున్నావా?
జవాబు:
గిరిజనులు జీవనవిధానాన్ని పరిరక్షించడం ఎంతో ముఖ్యం, అవసరం కూడా అని నేను భావిస్తున్నాను.

  • గిరిజనులు వారికి మాత్రమే ప్రత్యేకమైన భిన్న సంస్కృతిని కలిగి ఉంటారు.
  • వారు ఉపయోగించుకునే అడవులను వారు నాశనం చేసుకోరు. అడవులను గూర్చి సంపూర్ణ అవగాహనని కలిగి ఉంటారు, కనుక అడవిలో స్వేచ్ఛగా నివసించడాన్ని వారు ఇష్టపడతారు.
  • వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న ఈ సమూహాల జీవన విధానాన్ని పరిరక్షించాల్సిందే. వీరి సంస్కృతి మరియు నాగరికత ప్రాచీన గిరిజనుల చరిత్రకు నిదర్శనం.
  • పర్యావరణానికి విఘాతం కలిగించకుండా వీరు జీవనాన్ని సాగిస్తారు. అందువల్ల వీరి జీవన విధానాన్ని పరిరక్షించడం ముఖ్యమైనదిగా భావిస్తున్నాను.

ప్రశ్న 10.
గిరిజనుల పెరటితోట ఎందువలన ముఖ్యమైనది?
జవాబు:
అటవీ ప్రాంతాలలో ఉండే గుడిసెలకి వెనుక విశాలమైన పెరడు ఉంటుంది. ఇంటి చుట్టూ వెదురుతో కంచె నిర్మిస్తారు. పెరటితోట కొరకు ఈ భూమిని చదును చేసిన సేంద్రియ పదార్థాలను కలిపి సారవంతంగా తయారుచేస్తారు. ఆహారంగా ఉపయోగించడానికి మరియు జీవనోపాధికి ప్రధానంగా మొక్కజొన్న, చిక్కుడు, సొరకాయ, మిర్చి మొదలగు కూరగాయలను ఇక్కడ పండిస్తారు. కావున గిరిజనుల పెరటితోట ముఖ్యమైనది.

ప్రశ్న 11.
మైదాన ప్రాంతంలో వ్యవసాయం ఎందుకు లాభదాయకమైన వృత్తి వివరించండి.
జవాబు:

  • ఇక్కడ అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండడం చేత మైదాన ప్రాంతాలు వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
  • లోతైన, సారవంతమైన నేలలు, చదునైన ఉపరితలం వలన పంటసాగులో యాంత్రీకరణకు అనువుగా ఉంటుంది.
  • అంతేగాక పశువులకు దాణాగా ఉపకరించే గడ్డి భూములుగా కూడా ఉపకరిస్తాయి.
  • పంటల దిగుబడికి అవసరమైన మెరుగైన నీటి సౌకర్యం ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటుంది
  • వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగుల సౌకర్యం, రవాణా సౌకర్యాలు కల్గి ఉంటాయి.

12. తూర్పు కనుమలలో ఎత్తయిన శిఖరం ………….. (అరోమ కొండ (జిందగడ)
13. …….. లో చాలాభాగం దక్కన్ పీఠభూమిలో కలదు. (రాయలసీమ)
14. మైదాన ప్రాంతాలలో ………… పంట ఎక్కువగా పండించబడుతుంది. (వరి)
15. తూర్పు కనుమలలోని కొండలు ………….. చే ఏర్పడినవి. (ఖాండలైట్, చార్నో కైట్)
16. కొండ ప్రాంతాలలోని ప్రజలు …………. నుంచి నీరు తెచ్చుకుంటారు. (చిన్నవాగులు, నీటి ఊటల)
17. …………. నేలలు ఎక్కువ శాతం సున్నం, క్షారాలను కలిగి ఉంటాయి. (చౌడు)
18. మైదాన ప్రాంతాలు ……………. కురిసే నేలలు. (ఋతుపవన వర్షాలు)

19. పీఠభూములు వీటికి ప్రసిద్ధి
అ) కూరగాయలు
ఆ) ఖనిజాలు
ఇ) జనాభా
ఈ) పంటలు
జవాబు:
ఆ) ఖనిజాలు

20. నల్లరేగడి నేలలు ఏ పంటకు సారవంతమైనవి?
అ) పత్తి
ఆ) చిరుధాన్యాలు
ఇ) కూరగాయలు
ఈ) గోధుమ
జవాబు:
అ) పత్తి

21. కోస్తా ఆంధ్రాలో జిల్లాలు కలవు.
అ) 6
ఆ) 4
ఇ) 9
ఈ) 5
జవాబు:
ఇ) 9

22. ఈ కింది పట్టికను సరైన సమాచారంతో నింపండి.
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 1
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 2

6th Class Social Studies 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు InText Questions and Answers

6th Class Social Textbook Page No.41

ప్రశ్న 1.
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 3
పై చిత్రం చూసి భూస్వరూపాల పేర్లు వ్రాయండి.
జవాబు:
పర్వతాలు (కొండలు), పీఠభూములు, మైదానం.

ప్రశ్న 2.
మీ గ్రామం/పట్టణం పరిసరాలలో ఉన్న భూస్వరూపాల పేర్లు వ్రాయండి.
జవాబు:
మా గ్రామం పరిసరాలలో మైదానం, కొండలు ఉన్నాయి.

ప్రశ్న 3.
‘మైదాన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం సులభం’ కారణం చెప్పండి.
జవాబు:
మైదాన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం సులభం కారణం:

  • ఇవి సమతలంగా ఉంటాయి, రోడ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉంటాయి.
  • మైదాన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంకు ఖర్చు తక్కువవుతంది..
  • రవాణా సౌకర్యాలు, పరిశ్రమలు ఎక్కువగా ఉండటం.

6th Class Social Textbook Page No.42

ప్రశ్న 4.
మైదాన ప్రాంతాలు ఎందువలన ఎక్కువ జనసాంద్రతను కలిగి ఉంటాయి?
జవాబు:
మైదాన ప్రాంతాలలో జనసాంద్రత అధికంగా ఉండటానికి గల కారణాలు :

  • మైదాన ప్రాంతాల్లోని నేలలు సారవంతంగా ఉండి మంచి పంటల దిగుబడినిస్తాయి.
  • భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో అనేక రకాల పంటలు పండించడానికి అనుకూలమైన నేలలున్నాయి.
  • మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన నగరాలకు ఆలవాలంగా ఉన్నాయి.
  • ఇక్కడ మెరుగైన రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి, చెందుతున్నాయి.
  • వ్యవసాయదారులు మిగులు సొమ్మును పెట్టుబడిగా మార్చి పరిశ్రమల స్థాపనకు దోహదం చేయటం వలన వృత్తి ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయి.
  • మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన “సాగు నీరు, త్రాగునీరు” వసతులు కల్గి ఉండి ఇండ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉండి జననివాస యోగ్యంగా ఉన్నాయి.
  • మైదాన ప్రాంతాలు ప్రాచీన కాలం నుండి మానవ ఆవాసాలకు నిలయం.
    ఉదా : సింధూ నాగరికత.

ప్రశ్న 5.
సాధారణంగా మైదాన ప్రాంతాలలో ఉండే గ్రామాలు మంచి ఉపాధి, జీవన ప్రమాణం కలిగి ఉంటాయి? ఎందువలన?
జవాబు:
మైదాన ప్రాంతాలలో ఉండే గ్రామాలు మంచి ఉపాధి జీవన ప్రమాణం కల్గి ఉండటానికి కారణం :

  • ఈ ప్రాంతాల్లో సారవంతమైన నేలలు ఉండటం వలన ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది.
  • వ్యవసాయదారులు మిగులు సొమ్మును పెట్టుబడిగా మార్చి పరిశ్రమల స్థాపనకు దోహదం చేయటం వలన వృత్తి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి.
    ఉదా : రైసుమిల్లులు, చక్కెర కర్మాగారాలు మొ||నవి.
  • మెరుగైన రవాణా సౌకర్యాలుండటం వలన (ఎగుమతులు, దిగుమతులు) వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధి .. చెంది ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
  • అనేక రకాల ఇతర వృత్తులు కూడా అధికంగా వృద్ధి చెంది ఉండటం.

ప్రశ్న 6.
ఏరకమైన నేలలు వ్యవసాయానికి ఎక్కువ అనుకూలం?
జవాబు:
మైదాన ప్రాంతంలోని ఒండ్రు (డెల్టా), నల్లరేగడి నేలలు వ్యవసాయానికి ఎక్కువ అనుకూలం. నేలలతోపాటు నీటిసౌకర్యం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 7.
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 4 AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 5 AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 6
పైన ఉన్న పర్వతాలు, పీఠభూమి, మైదానాలు చిత్రాలను చూసి మీ ప్రాంతం దేనిని పోలి ఉందో గుర్తించండి.
జవాబు:
మా ప్రాంతం మైదాన ప్రాంతాన్ని పోలి ఉంది. (నోట్ : విద్యార్థులు, మీ ప్రాంతాలను బట్టి జవాబు రాయగలరు.)

6th Class Social Textbook Page No.43 & 44

ప్రశ్న 8.
పటం పరిశీలించి క్రింది ఖాళీలను పూరించండి.
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 7
A. ఉత్తరం నుండి దక్షిణం వరకు కోస్తా జిల్లాల పేర్లు.
జవాబు:

  1. శ్రీకాకుళం
  2. విజయనగరం
  3. విశాఖపట్నం
  4. తూర్పు గోదావరి
  5. పశ్చిమ గోదావరి
  6. కృష్ణా
  7. గుంటూరు
  8. ప్రకాశం
  9. PSR నెల్లూరు

B. రాయలసీమ జిల్లాల పేర్లు
జవాబు:

  1. కర్నూలు
  2. అనంతపురం
  3. YSR కడప
  4. చిత్తూరు

C. మీ గ్రామం / పట్టణం / నగరం పేరు : ……………
మండలం : ……………
జిల్లా : ……………
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న జిల్లాలు : …………………….
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలు : ……………
జవాబు:
మీ గ్రామం / పట్టణం / నగరం పేరు : రాయపూడి
మండలం : తుళ్ళూరు
జిల్లా : గుంటూరు
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న జిల్లాలు : కృష్ణా, ప్రకాశం
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలు : తెలంగాణ

6th Class Social Textbook Page No.46

ప్రశ్న 9.
కొండ ప్రాంతాలు పానీయపు పంటల ఉత్పత్తికి ఎందువలన అనుకూలం? మీ స్నేహితులు మరియు ఉపాధ్యాయులతో చర్చించి రాయండి.
జవాబు:
కొండ ప్రాంతాలు పానీయపు పంటల ఉత్పత్తికి అనుకూలం ఎందువలన అంటే,

  • కొండ ప్రాంతాలలో నేలలు వాలుగానూ, ఎగుడు దిగుడుగాను ఉంటాయి.
  • ఇవి ఎత్తులో ఉండటం వలన నీరు నిలబడకుండా కిందకి జారిపోవడం జరుగుతుంది.
  • తేయాకు మొక్కలకు వెచ్చని, ఆర్ధ శీతోష్ణస్థితితోపాటు, హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి.
  • కొండ (వాలు) ప్రాంతాలలో సహజంగా కాంటూర్ వ్యవసాయం చేస్తారు. ఇక్కడి నేలల్లో మిగతా పంటలు అంతగా దిగుబడినీయవు.
  • కొండప్రాంతాలు వాలుగా ఉండి వర్షపు నీరు మొక్కల మొదళ్ళల్లో నిలబడకుండా చక్కగా పారతాయి. ఇలాంటి సౌకర్యమే ఈ పానీయపు పంటలకు కావాలి అంటే వర్షపాతం సంవత్సరం అంతా అవసరం, అలాగే ఎక్కువ నీరు మొక్కల మొదళ్లల్లో చేరకూడదు.

ప్రశ్న 10.
కొన్ని అటవీ ఉత్పత్తుల పేర్లు రాయుము.
జవాబు:
అటవీ ఉత్పత్తులు :

  1. వివిధ రకాల పళ్లు (సీతాఫలం, జామ, పనస మొ||నవి)
  2. వివిధ రకాల దుంపలు (వెదురు, చిలకడదుంప మొ||నవి)
  3. వివిధ రకాల గింజలు (కుంకుళ్లు, బాదము, షీకాయి మొ||నవి)
  4. తేనె
  5. వెదురు, టేకు, సాల్ మొదలైన కలప
  6. చింతపండు
  7. విస్తరాకులు
  8. వంట చెరకు
  9. ఇతర ఔషధాలు, వనమూలికలు.

ప్రశ్న 11.
నీవెప్పుడైనా అడవికి వెళ్ళావా? వెళ్తే మీ అనుభవాన్ని రాయండి.
జవాబు:
నేను ‘తిరుపతి’ వెళ్ళినప్పుడు, తిరుమల కొండకు నడకదారిన అడవుల్లో నుంచి వెళ్ళాను.

  • మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, పర్యావరణం ప్రశాంతంగా ఉంది.
  • కోతులు, జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు మొ||న జంతు పక్షులను చూడగలిగాను.
  • రకరకాల వృక్ష జాతులను, ఔషధ మొక్కలను పరిశీలించాము.
  • కొన్ని ప్రాంతాలలో అడవి దట్టంగా ఉండి కొంచెం భయపడ్డాము.
  • కొన్నిచోట్ల ఎక్కువ వాలు ఉండి, కొన్నిచోట్ల పల్లంగా ఉంది.
    (నోట్ : విద్యార్థులు ఇలా తమ అనుభవాన్ని స్వంతంగా రాయండి)

6th Class Social Textbook Page No.48

ప్రశ్న 12.
ఈ ప్రాంతంలో (పీఠభూమి) వ్యవసాయ పద్ధతులలో ప్రధానంగా వచ్చిన మార్పులు ఏమిటి?
జవాబు:
ఇటీవల కాలంలో రైతులు చిరుధాన్యాలకి బదులుగా వేరుశనగ, మిర్చి వంటి వ్యాపార పంటల సాగుకి మారుతూ ఉన్నారు. కొన్నిసార్లు జొన్న, కంది, మొక్కజొన్న పంటలని వేరుశనగ చేల మధ్యలో కూడా పండిస్తారు. భూసారం పెంచడానికి, తెగుళ్లను అరికట్టడానికి ఈ మధ్యకాలంలో కొందరు రైతులు గట్లు నిర్మించడం సేంద్రియ వ్యవసాయం లాంటి కొత్త పద్ధతులకు మారుతున్నారు. వ్యవసాయ భూములకు నీరందించడానికి పురాతన చెరువులు, వాగులను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు. నీటి సమస్య వలన కొందరు రైతులు సపోటా, బత్తాయి, మామిడి తోటలను పెంచడం ప్రారంభించారు. ఈ పండ్ల తోటలకు కొన్ని కాలాల్లో నీటి సౌకర్యం కల్పిస్తే అవి ప్రతి సంవత్సరం ఫలసాయాన్ని ఇస్తాయి. నీటి సదుపాయం ఉన్నచోట అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ మొదలగు పండ్లతోటలను కూడా పెంచుతున్నారు.

ప్రశ్న 13.
భవిష్యత్తులో ఎక్కువ సంఖ్యలో బోరుబావులను తవ్వడం వలన మనం ఎటువంటి సమస్యలను ఎదుర్కొనవలసి రావచ్చును? Page No. 48
జవాబు:
ఎక్కువ సంఖ్యలో బోరు బావులను తవ్వడం వలన ఏర్పడే సమస్యలు :

  • బోరు బావులను వాణిజ్య పంటలకు అధికంగా ఉపయోగించడం మూలంగా భూగర్భ జలవనరులు తగ్గిపోతున్నాయి. త్వరలో అంతరించిపోవచ్చు కూడా.
  • ఈ ప్రాంతం ఎడారిగా మారిపోవచ్చు, నీటికొరత ఎక్కువ అవ్వవచ్చును.
  • నీరు ఇంకే స్వభావాన్ని నేలలు కోల్పోవచ్చు, భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది.

ప్రశ్న 14.
కోస్తా మైదానం మరియు పీఠభూమి ప్రాంతంలోని గ్రామాలలో వర్షపాతం స్థితిని పోల్చండి. Page No. 48
జవాబు:

వర్షపాత పరిస్థితి
కోస్తా మైదానము పీఠభూమి
1) జూన్ నుండి అక్టోబరు వరకు నైఋతి ఋతుపవన కాలంలో వర్షాన్ని పొందుతుంది. 1) జూన్ నుండి నవంబరు వరకు చాలా తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది.
2) నవంబరు నుండి మే వరకు చాలా తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. 2) ఈ కాలంలో వర్షపతం ఉండదు. కాబట్టి తరుచూ కరవుకూ గురవుతుంటాయి.

6th Class Social Textbook Page No.49

ప్రశ్న 15.
ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంతంలో ప్రవహించే ముఖ్యమైన నదులేవి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంతంలో ప్రవహించే ముఖ్యమైన నదులు.

  1. గోదావరి
  2. కృష్ణా
  3. పెన్నా

ప్రశ్న 16.
కృష్ణా, గోదావరి డెల్టాలలో ఏ జిల్లాలున్నాయో గుర్తించండి.
జవాబు:

  • కృష్ణా డెల్టాలో గుంటూరు, కృష్ణా జిల్లాలు కలవు.
  • గోదావరి డెల్టాలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కలవు.

ప్రశ్న 17.
డెల్టాలు ప్రారంభమయ్యే ప్రాంతంలో గల రెండు ముఖ్య నగరాల పేర్లు రాయండి. కృష్ణానదిలో కలిసే రెండు నదులను గుర్తించండి.
జవాబు:

  1. విజయవాడ, కాకినాడ, రాజమండ్రి నగరాలు.
  2. తుంగభద్ర, మూసి, బుడమేరు, నాగులేరు, భీమ, గుండ్లకమ్మ.

AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 8

ప్రశ్న 18.
పంట విధానాలలో మార్పులు రావడానికి కారణమేమిటి?
జవాబు:
మైదాన ప్రాంతాల్లో పంట విధానాలలో మార్పు రావడానికి కారణాలు :

  • ఆహార పంటల నుండి నగదు/వ్యాపార పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
  • పెట్టుబడి పెరుగుతున్న నేపథ్యంలో ఇవి లాభదాయకంగా ఉంటున్నాయి.
  • వీటికి మార్కెటింగ్ సౌకర్యం బాగా ఉంది.
  • కాలువలు, బోరుబావుల ద్వారా నీటి సౌకర్యము అందుబాటులో ఉంటుంది.
  • యాంత్రీకరణ పెరగటం.

ప్రశ్న 19.
కోస్తా మైదానాలు ఎందువలన మిక్కిలి సారవంతమైనవి?
జవాబు:
కోస్తా (డెల్టా) మైదానాలు మిక్కిలి సారవంతమైనవి ఎందుకంటే :

  • ఇక్కడ నదులు అవక్షేపాల వల్ల మిక్కిలి ఒండ్రునేలలు ఉండడం చేత.
  • లోతైన, సారవంతమైన, చదునైన నేలలు ఉండటం వలన.
  • ఈ మైదాన ప్రాంతాలలో భూగర్భ జలవనరుల లభ్యత కూడా అధికంగా ఉంటుంది.
  • ఈ డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు గిడ్డంగుల వంటివి, వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు.

ప్రశ్న 20.
వ్యవసాయం మైదాన ప్రాంతాలలో ఎందువలన ప్రధాన వృత్తిగా ఉన్నది?
జవాబు:

  • ఇక్కడ అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండడం చేత మైదాన ప్రాంతాలు వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
  • లోతైన, సారవంతమైన నేలలు, చదునైన ఉపరితలం వలన పంటసాగులో యాంత్రీకరణకు అనువుగా ఉంటుంది.
  • అంతేగాక పశువులకు దాణాగా ఉపకరించే గడ్డి భూములుగా కూడా ఉపకరిస్తాయి.
  • పంటల దిగుబడికి అవసరమైన మెరుగైన నీటి సౌకర్వం ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటుంది
  • వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగుల సౌకర్యం, రవాణా సౌకర్యాలు కల్గి ఉంటాయి.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

SCERT AP 6th Class Social Study Material Pdf 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

6th Class Social 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ముస్లింల పవిత్ర గ్రంథం పేరేమి?
జవాబు:
ముస్లింల పవిత్ర గ్రంథం పేరు ఖురాన్.

ప్రశ్న 2.
అష్టాంగ మార్గం అనగా నేమి?
జవాబు:
బుద్ధుని ప్రకారం, మోక్షం సాధించడమే జీవిత పరమార్థం. మోక్షాన్ని బలుల ద్వారా లేదా ప్రార్థనల ద్వారా సాధించలేము. (మధ్యేమార్గం) అష్టాంగ మార్గంను అనుసరించడం ద్వారా మోక్షం సాధించవచ్చని తెలిపాడు.
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 1

అష్టాంగ మార్గాలు
1. సరైన దృష్టి సత్యాన్ని తెలుసుకోవడం సమ్యక్ దృష్టి
2. సరైన ఉద్దేశం మనసును చెడు నుండి విడిపించడం సమ్యక్ సంకల్ప
3. సరైన ప్రసంగం ఇతరులను బాధపెట్టేలా మాట్లాడకపోవడం సమ్యక్ వాక్కు
4. సరైన క్రియ ఇతరుల మంచికోసం పనిచేయడం సమ్యక్ కర్మ
5. సరైన, జీవితం జీవితాన్ని గౌరవించడం సమ్యక్ జీవన
6. సరైన కృషి చెడును ఎదిరించడం సమ్యక్ సాధన
7. సరైన ఏకాగ్రత ధ్యానం సాధన చేయడం సమ్యక్ సమాధి
8. సరైన బుద్ధి ఆలోచనలను నియంత్రించడం సమ్యక్ స్మృతి

ప్రశ్న 3.
మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికి రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  • దేవుడు ఒక్కడే – మతం మార్గమే.
  • మతము కన్నా – మానవత్వం మిన్న
  • మతాలు వేరైనా – మాధవుడు ఒక్కడే
  • మతతత్వం కాదు ముఖ్యం – మానవత్వం ముఖ్యం
  • మతం మంచి నీళ్ళు ఇవ్వదు – మమకారమే మంచిని పంచుతుంది

ప్రశ్న 4.
యేసుక్రీస్తు ప్రధాన బోధనలు ఏవి?
జవాబు:
యేసుక్రీస్తు ప్రధాన బోధనలు :

  • మానవులందరూ దేవుని పిల్లలు.
  • పాపాలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడపండి.
  • నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని కూడా ప్రేమించండి.
  • ఒక చెంపపై కొట్టినప్పుడు, మరొక చెంప చూపించు.
  • మానవసేవే మాధవసేవ.
  • శాంతి, ప్రేమ, కరుణ కల్గి ఉండాలి.
  • తనను తాను తగ్గించుకొనువాడు దేవునిచే హెచ్చింపబడును.
  • శత్రువును కూడా ప్రేమతో జయించవచ్చు.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 5.
ఇస్లాం మత ప్రధాన బోధనలు ఏవి?
జవాబు:
ఇస్లాం మత ప్రధాన బోధనలు :

  • మానవులందరూ అల్లాచే సృష్టించబడ్డారు.
  • మానవులందరూ దేవుని ముందు సమానం.
  • దేవునికి ఆకారం లేదు కాబట్టి విగ్రహారాధన సరియైనది కాదు.
  • ప్రతి ముస్లిం దేవుని సేవకునిగా మారి నిజాయితీగా ఉండాలి.
  • మానవులంతా అన్నదమ్ముల్లా మెలగాలి.

ప్రశ్న 6.
ఆర్య సత్యా లు ఏవి?
జవాబు:
ఆర్య సత్యాలు నాలుగు:

  • ప్రపంచం దుఃఖమయం.
  • దుఃఖం కోరికల వల్ల కలుగుతుంది.
  • కోరికలను త్యజించడం ద్వారా మోక్షం పొందవచ్చు.
  • అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు.

ప్రశ్న 7.
“భిన్నత్వంలో ఏకత్వం భారత ప్రధాన సాంస్కృతిక లక్షణం” – దీనితో మీరు ఏకీభవిస్తారా లేదా? వ్యాఖ్యానించుము.
జవాబు:
భారతదేశ ప్రధాన సాంస్కృతిక లక్షణం – “భిన్నత్వంలో ఏకత్వం” అని నేను ఏకీభవిస్తున్నాను.
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ విశిష్ట లక్షణం :
భారతదేశం అనేక వైవిధ్యాలతో కూడిన ప్రాంతం. మతం, భాష, సంస్కృతి, జీవనశైలి, వేషధారణ, దేవునిపై విశ్వాసం, ఆరాధనా, విధానాలు, ఆహారపు అలవాట్లు వంటి వాటిలో కూడా వైవిధ్యత కనిపిస్తుంది.

చంద్రగుప్తుడు, అశోకుడు, గౌతమీపుత్ర శాతకర్ణి. సముద్రగుప్తుడు, అక్బర్ మొదలగు రాజులు, చక్రవర్తులు. దేశాన్ని రాజకీయంగా ఏకం చేయడానికి ప్రయత్నించారు.
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 2
దేశంలోని వివిధ ప్రాంతాలలో జన్మించిన మహావీరుడు. గౌతమ బుద్ధుడు, గురునానక్, కబీర్, నిజాముద్దీన్ ఔలియా, షేక్ సలీం చిస్తి, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ రాధా కృష్ణన్ వంటి మహానీయులను, సాధువులను, తత్వవేత్తలను భారతీయులందరూ గౌరవిస్తారు.

ప్రజలు హోలీ, దీపావళి, రంజాన్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, మహావీర్ జయంతి, బుద్ధ జయంతి వంటి పండుగలను ఇతర మతస్థులను ఇబ్బంది పెట్టకుండా చాలా ప్రశాంతంగా జరుపుకుంటారు. భారతదేశం బహుళ సంస్కృతుల మరియు జాతుల (కులాల) సంక్లిష్టతను సూచిస్తుంది. విభిన్న సంస్కృతులు మరియు మతాలు ఉన్న ప్రజలలో ఐక్యతను సూచించే భావననే “భిన్నత్వంలో ఏకత్వం” అని అంటారు. ఇది భారతదేశం యొక్క అత్యున్నత సాంస్కృతిక లక్షణం.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 8.
ప్రస్తుతం భారతదేశంలో జాతీయ సమైక్యతను భగ్నం చేసే అనేక సమస్యలు కలవు. దీనికి గల కారణాలు ఏమిటి? వీటిని ఎలా పరిష్కరించవచ్చు?
జవాబు:
ప్రస్తుతం భారతదేశంలో జాతీయ సమైక్యతను భగ్నంచేసే సమస్యలు (అంశాలు) :

  1. మతతత్వం
  2. కులతత్వం
  3. ప్రాంతీయ తత్వం
  4. స్వార్థ రాజకీయాలు
  5. సమాచార ప్రసార సాధనాల అత్యుత్సాహం
  6. భాషా దురాభిమానం
  7. సాంఘిక అసమానతలు.

కారణాలు :

  • అధిక జనాభా, ఉండటం ప్రధాన కారణం. (అనేక కులాలు, మతాలు, ప్రాంతాల వారుండటం).
  • బ్రిటిషు పాలనలో ఉండటం ; వీరు అనుసరించిన విభజించు పాలించు విధానం.
  • సమాజంలోని అసమానతలు (ఆర్థిక, సామాజిక అంశాలు)
  • స్వార్థ పర రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం (విభజించడం) విభజన రాజకీయాలు చేయడం.

పరిష్కారాలు :

  • పౌరులకు దేశ సమైక్యత పట్ల అవగాహన కల్పించాలి. విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించాలి.
  • చట్టాలు నిర్దిష్టంగా, ఖచ్చితంగా ఉండాలి.
  • రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలి.
  • కుల, మత, ప్రాంతీయ, భాషాతత్వాలనే సంకుచిత భావాలను పారద్రోలాలి.

ప్రశ్న 9.
భారతదేశ పటంలో క్రింద ఇవ్వబడిన ప్రాంతాలను గుర్తించండి.
సింధూ నది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, భట్టిప్రోలు, కృష్ణానది, గంగా నది, యమునా నది, వింధ్య . పర్వత శ్రేణులు, ఉత్తర ప్రదేశ్.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 3

ప్రశ్న 10.
మత ఐక్యతను పెంపొందించేలా ఒక చిత్రాన్ని గీయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా గీయగలరు. ఉదా :
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 4
(లేదా)
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 5

ప్రశ్న 11.
మత ఐక్యతను పెంపొందించడానికి నాలుగు నినాదాలు రాయండి.
జవాబు:
మత ఐక్యతను పెంపొందించే నినాదాలు :

  • ఎన్ని మతాలున్నా – అసలైన మతం మానవత్వం మాత్రమే
  • మతం గమ్యం కాదు – మార్గదర్శిని మాత్రమే
  • మత విలువలు – పెంచాలి మనిషి నైతిక విలువని
  • పరమత సహనం – కల్పించును పరమాత్మ దర్శనం
  • మతాల మార్గదర్శకం – పరమాత్మక సన్నిధానం
  • మతాలు వేరైనా – గమ్యం ఒక్కటే
  • సర్వమత సారం – సర్వ మానవ సౌభాగ్యం

ప్రశ్న 12.
కింద ఇవ్వబడిన ఖాళీలను సరైన పదాలతో నింపండి.
I. మతం : హిందూమతం, సిక్కుమతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, జైన మతం, బౌద్ధ మతం
II. దేవుడు ప్రవక్త : సిద్ధార్థుడు, యేసుక్రీస్తు, మహావీరుడు, మహమ్మద్ ప్రవక్త, శ్రీకృష్ణుడు, గురునానక్
III. పవిత్ర గ్రంథం : త్రిపీఠికలు, బైబిల్, భగవద్గీత, ఖురాన్, గురుగ్రంథ సాహిబ్, అంగాలు
IV. పూజ ప్రదేశం : మసీదు, ఆలయం, గురుద్వారా, చర్చి, మఠం, జైన దేవాలయం
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 6
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 7

6th Class Social Studies 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు InText Questions and Answers

6th Class Social Textbook Page No.123

ప్రశ్న 1.
భారతదేశంలో అనేక భాషలు కలవు. భాష అవసరం ఏమిటి? భాషలు ఎలా పరిణామం చెంది ఉంటాయి?
జవాబు:
భాష అవసరం ఏమిటంటే :

  • భాష మనం ఆలోచించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  • మన పనులన్నీ క్రమపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా చేసుకోవడానికి మనకి భాషే ఉపయోగపడుతుంది.
  • ఇతరుల దృష్టిని మనవైపు తిప్పుకోవడానికి మనకి భాష అవసరం.
  • కొత్త విషయాలను సృష్టించడానికి కనిపెట్టడానికి, లేదా సరదాగా నవ్వించడానికి భాష అవసరం.
  • అనేక విషయాలను ఊహించుకోవడానికి, బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి భాష అవసరం.
  • మన భావాలను, అనుభవాలను పంచుకోవడానికి భాష అవసరం. ఈ రకంగా భాష మనకు ఎంతో ప్రముఖమైనది.
  • తరతరాలుగా పెద్దలు తమ పిల్లలకు సమాచారాన్ని అందించటానికి భాష అవసరం.

భాష ఎలా పరిణామం చెందింది అని చెప్పటానికి ప్రత్యక్ష ఆధారాలు తక్కువ.

  • ముందుగా అనేక (చేతి) గుర్తులను వాడారు (సంజ్ఞలను) తర్వాత శబ్దాలను వాడారు.
  • ఒక తరం నుండి మరొక తరానికి, ఒక తెగ (జాతి) నుండి మరో తెగ (జాతి)కు
  • ఒక భౌగోళిక ప్రాంతం నుండి మరొక భౌగోళిక ప్రాంతానికి, ఒక సమాజం నుండి మరొక సమాజంకు భాష ప్రసారం జరిగింది.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 2.
ఇతర భాషకు చెందిన మీ స్నేహితుడిని ఆహ్వానించండి మరియు అతనితో/ఆమెతో సంభాషించండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు. ఉదాహరణ ఆధారంగా (కన్నడ స్నేహితునితో)

  • నిన్న హెసరు ఏను? (నీ పేరు ఏమిటి)
  • నన్న హెసరు రాము.’ (నా పేరు రాము)
  • నీను పను కెలస మాడువి ? (నీవు ఏం పని చేస్తావు ?)
  • నాను శాలియల్లి ఓదుత్తిదేన్. (నేను బడిలో చదువుతున్నాను.)
  • నీను యావ తరగతియల్లి ఓదుత్తీ? (నీవు ఏ తరగతి చదువుచున్నావు?)
  • నాను ఆరునే క్లాసివల్లి ఓదుత్తిద్దేనె (నేను ఆరవ క్లాస్ చదువుతున్నాను)
    ఈ విధంగా ఏదైనా భాషలో రాయగలరు.

6th Class Social Textbook Page No.124

ప్రశ్న 3.
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 8
1516కాలం నాటి కృష్ణదేవరాయలు శాసనాన్ని చదవడానికి ప్రయత్నించండి. మీ ఉపాధ్యాయుని సహాయంతో శాసనంలో ఏముందో అర్థం చేసుకోండి.
జవాబు:

  • శుభమస్తు : శ్రీమాన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయర
  • గండ అరిరాయనిబాట భాషగెతపువ రాయరగండ యవన రాజ్య
  • స్థాపనాచార్య శ్రీ వీరప్రతాప కృష్ణదేవ మహారాయలు విజయ
  • నగరాన సింహాసనారూఢుడై పూవజీ దిగ్విజయ యాత్రకు విచ్చేశి
  • ఉద్దగిరి, కొండవీడు, కొండపల్లి రాజమహేంద్రవరం మొదలైన
  • దుగాజాలు సాధించి సింహ్యాద్రిక విచ్చేసి స్వస్తిశ్రీ జయాభ్యుదయ
  • ఈ శాసనము శ్రీకృష్ణదేవరాయలు, దిగ్విజయయాత్ర గురించి వివరిస్తున్నది. అలాగే సింహాచలం విచ్చేసినట్లుగా తెలుస్తుంది.

6th Class Social Textbook Page No.125

ప్రశ్న 4.
భారత అధికార భాషలు హిందీ మరియు ఇంగ్లీష్, ప్రియమైన విద్యార్థులారా “ఇండియా” అనే పదాన్ని అనేక భారతీయ భాషలలో ఎలా రాయవచ్చో గమనించండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 9

ప్రశ్న 5.
ఇంగ్లీషులో 26, తెలుగులో 56 అక్షరాలు కలవు. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియాలో ఎన్ని అక్షరాలు కలవు? Page No. 125
జవాబు:
తమిళంలో – 247, కన్నడంలో – 49, మలయాళంలో- 56 (57) ఒడియాలో – 64 అక్షరాలు కలవు.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 6.
భారతదేశాన్ని లౌకిక దేశం అంటారు. ఎందుకు?
జవాబు:
భారతదేశంలో ప్రభుత్వానికి ఎటువంటి మతం లేదు. అంటే ప్రభుత్వం ఏ మతాన్ని ప్రోత్సహించదు, ఏ మతాన్ని వ్యతిరేకించదు మత విషయాల్లో తటస్థంగా ఉంటుంది. అంటే మత విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అలాగే దేశ పౌరులందరికి మత స్వాతంత్ర్యపు హక్కు ఉంది. అంటే పౌరులు ఏ మతాన్నైనా అనుసరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ప్రోత్సహించుకోవచ్చును. కాబట్టి భారతదేశాన్ని లౌకిక దేశం అని అంటారు.

6th Class Social Textbook Page No.126

ప్రశ్న 7.
మన ఆరోగ్యం మరియు పరిశుభ్రతను పెంపొందించడంలో సహాయపడుతున్న మన పూర్వికులు ఆచారాలు మరియు సంప్రదాయాలపై చర్చించండి.
జవాబు:

  • ఏదైనా శుభకార్యం (ఉత్సవం) జరిగేటపుడు మామిడి (పచ్చ) తోరణాలు కడుతారు. కారణం ఎక్కువమంది ఒకచోట చేరినపుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం కాబట్టి మామిడి ఆకులు ఎక్కువ (సేపు) సమయం పచ్చగా ఉండి, ఆక్సిజన్‌ను విడుదలచేస్తాయి.
  • గ్రామీణ ప్రాంతాలలో ఇంటిముందు (పేడ) కళ్ళాపి చల్లుతారు, ఇల్లు అలుకుతారు. కారణం ఆవు పేడలో యాంటి బ్యాక్టీరియల్ గుణం ఉండి ఎటువంటి క్రిమి, కీటకాలు ఇంట్లోకి రావు. అలాగే గొబ్బిళ్ళు పెట్టడం, ముగ్గులు వేయడం కూడా.
  • రాగి పాత్రలలో నీరు త్రాగటం. రాగి (పాత్రల్లో) రేకులో బ్యాక్టీరియా, వైరస్లు త్వరగా మృతుమవుతాయి కనుక.
  • ఇంటిముందు తులసి, (ఇంటివెనుక కరివేపాకు) వేప వంటి ఔషధ గుణాలున్న మొక్కలు ఉంచడం. ఇవన్నీ క్రిమి, కీటకాలను చంపే ఔషధాలు వీటి యొక్క ఆవశ్యకతను తెల్పుటకు వీటిని పూజించమంటు అందుబాటులో ఉంచినారు.
  • గడపకు పసుపు పూయటం, పసుపు యాంటీ బ్యాక్టీరియల్ ఔషధంగా పనిచేస్తుంది. అందుకనే వంటలలో కూడా వాడతారు. అలాగే పాములు చూడగలిగే రంగు పసుపు కనుక గడపకు పసుపుంటే అవి లోపలకి రావు.
  • అలాగే ముఖానికి, కాళ్ళకు పసుపు రాసుకుంటారు కారణం ఇది యాంటి బ్యాక్టీరియల్.
    ఉగాది పచ్చడి సేవనం, ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులు ఉంటాయి. అవి ఔషధంగా ఉపయోగపడుతుంది.
  • సూర్యనమస్కారాలు చేయడం వలన విటమిన్ ‘డి’ లభిస్తుంది.
  • ఉపవాసాలు ఉండటం వెనుక కారణం ఇది మన జీర్ణవ్యవస్థను అభివృద్ధి చేస్తుంది.
  • ఉత్తర దిక్కున తల ఉంచి, నిద్రపోరాదు అని ఎందుకు చెబుతారంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం వలన బిపి మొదలైన వ్యాధులు వస్తాయని.
  • అయితే సంప్రదాయాలు మూఢాచారాలుగా, మూఢ విశ్వాసాలుగా రూపాంతరం చెందకుండా, వాటి యొక్క ఉద్దేశ్యమును గ్రహించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు

9th Class Social Studies 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పారిశ్రామిక కార్మికుల జీవితాలకు సంబంధించి కింద ఉన్న వాక్యాలలో సరైనవి ఏవి ? సరికాని వాటిని సరిచేయండి. (AS1)
ఎ) కార్మికులు పరిశ్రమలను నియంత్రించేవాళ్ళు.
జవాబు:
కార్మికులు ఏ మాత్రం దయ, కనికరం, సానుభూతిలేని యజమానుల నియంత్రణలో పనిచేశారు.

బి) కార్మికుల జీవన పరిస్థితులు సౌకర్యంగా ఉండేవి.
జవాబు:
పారిశ్రామికీకరణ వలన కార్మికుల జీవన పరిస్థితులు దుర్భరంగా ఉండేవి.

సి) కార్మికుల అసంతృప్తికి తక్కువ వేతనాలు ఒక కారణం. (✓)
జవాబు:
ఈ వాక్యం సరియైనది.

డి) పారిశ్రామికీకరణ దశలో ఉద్వేగాలు, భావనలకు ప్రాధాన్యత ఉండేది.
జవాబు:
పారిశ్రామికీకరణ దశలో ఉద్వేగాలు, భావనల కంటే హేతువు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు.

ఇ) జానపద కథలు, జానపద పాటలలో ప్రకృతికి దగ్గరగా ఉన్న విలువలకు కాల్పనికవాద రచయితలు, కళాకారులు ప్రాధాన్యతనిచ్చారు.
జవాబు:
ఈ వాక్యం సరియైనది.

ప్రశ్న 2.
ఆ కాలపు కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను కొన్నింటిని పేర్కొనండి. ఈ కాలంలో కూడా ఆ సమస్యలు ఉన్నాయేమో చర్చించండి. (AS1)
జవాబు:
ఆ కాలపు కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు :

  1. నూలు పరిశ్రమలలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల వేలాది చేనేత కార్మికులకు, పనిలేకుండాపోయింది.
  2. యంత్రాలతో పోటీపడలేని కార్మికులు ఉపాధి కోల్పోయి పేదలుగా మారారు.
  3. కనీస వేతనాలు ఉండేవి కావు.
  4. అధిక పని గంటలు ఉండేవి.
  5. మహిళల, పిల్లల పనిభారం ఎక్కువగా ఉండేది.
  6. తమ హక్కుల కోసం పోరాడడానికి బలమైన కార్మిక సంఘాలు లేవు. విద్య, వైద్య సదుపాయాలు లేవు.
  7. సానుభూతిలేని పర్యవేక్షకులు, యజమానుల నియంత్రణలో పనిచేయడం.
  8. భద్రత, గౌరవప్రద జీవనానికి అవకాశం లేదు.
  9. దారిద్ర్యం, దుర్భర జీవన పరిస్థితులు.
  10. నివసించే ప్రాంతాలు అంటువ్యాధులకు నిలయమై ఉండేవి.

ఈ రోజుల్లో :

  1. అంత దుర్భర జీవన పరిస్థితులు లేవు.
  2. కొన్ని ప్రాంతాలలో తక్కువ వేతనాలు లభిస్తున్నాయి.
  3. యజమానుల నిరంకుశత్వ, ఒంటెద్దు పోకడలు ఉన్నాయి.
  4. కార్మికుల కోర్కెలు తీర్చలేని యజమానులు లాకౌట్స్ పేరిట పరిశ్రమలను మూసివేస్తున్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 3.
పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదం (సోషలిజం)ల భావనలను పోలుస్తూ ఒక పేరా రాయండి.. అవి ఎంత వరకు సారూప్యాన్ని, వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి? (AS1)
(లేదా)
పెట్టుబడిదారీ విధానం, సామ్యవాద విధానం మధ్య పోలికలు, తేడాలు రాయండి.
జవాబు:
ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగత ఆస్తిగా ఉండి, ఏం ఉత్పత్తి చేయాలి. అందులో ఎవరికి వాటా ఉండాలి అనే విషయాలను మార్కెట్టు నిర్ణయించే పెట్టుబడిదారీ విధానంలోని మౌలిక భావనలను సామ్యవాదం ఖండిస్తుంది. పెట్టుబడిదారీ విధానం సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమయ్యే పరిస్థితికి అనివార్యంగా, అన్యాయంగా, దోపిడీకి దారితీస్తుందన్నది సామ్యవాదం చేసే విమర్శ. ‘వ్యక్తిగత స్వేచ్ఛ, అవకాశాలలో సమానత్వం అన్నది పెట్టుబడిదారులకు మాత్రమే వర్తిస్తాయి. సోషలిస్టుల * ప్రకారం నిజమైన స్వేచ్ఛ, నిజమైన సమానత్వం ఉండాలంటే, ఏ సమాజమైన వర్ధిల్లాలంటే వనరులు సామాజిక నియంత్రణలో ఉండాలి.

పోలికలలో ప్రధానంగా పెట్టుబడిదారీ విధానంలోని సామ్యవాదంలోను ఉత్పత్తి సాధనాలు ఉండాలి.
1. వస్తూత్పత్తికి పెట్టుబడి రెండింటికి అనివార్యం.
2. నాణ్యమైన వస్తూత్పత్తికి ప్రాధాన్యం. యుగాలు

పెట్టుబడిదారీ విధానం సామ్యవాదం
1. పారిశ్రామికులు, వ్యాపారస్తులు, తమ సంపద ద్వారా యంత్రాలను, ముడి సరుకులను కొనుగోలు చేసి, కార్మికుల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మటమే పెట్టుబడిదారీ విధానం. 1. ప్రకృతి వనరులు, ఆస్తులు, వ్యక్తుల కింద వారి నియంత్రణ లో కాకుండా ప్రజల అధీనంలో ఉండాలనేది సామ్యవాదం.
2. ఉత్పత్తి చేసిన వస్తువులను వాడకం కొరకు కాక, లాభాల కొరకై వినియోగిస్తారు. 2. పరిశ్రమలను జాతీయం చేయడం వల్ల ఉత్పత్తి అయిన జాతీయ సంపద సర్వ ప్రజలకు సమానంగా చెందు అవకాశం కలుగును.
3. ఈ పద్ధతిలో వస్తూత్పత్తి సాధనాలు పెట్టుబడిదారుల అధీనంలో ఉంటాయి. 3. ఈ పద్ధతిలో వస్తూత్పత్తి సాధనాలు ప్రభుత్వ అధీనంలో ఉండును.
4. ధనిక, బీద అను రెండు వర్గాలు కన్పించును. 4. ఆర్థిక అసమానతల నివారణకు తోడ్పడును.
5. కర్మాగారాలలో ఉత్పత్తి చేసే కార్మికులకు ఎటువంటి ఆస్తి లేదు. కాని ఉత్పత్తి జరగడానికి కార్మికులు ఎంతో కీలకం. 5. కర్మాగారాలు, భూములు ప్రభుత్వానికి చెంది అందరి ప్రయోజనం కోసం ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేపడతారు.
6. సప్లై మరియు డిమాండ్లు ధరను నిర్ణయిస్తాయి. 6. ధరలను ప్రభుత్వం స్వయంగా నిర్ణయిస్తుంది.
7. మార్కెట్ ఎలాంటి నియంత్రణలు లేకుండా స్వేచ్ఛగా ఉంటుంది. 7. మార్కెట్ ను చట్టాల ద్వారా ప్రభుత్వం నియంత్రిస్తుంది.
8. వచ్చే లాభాలు వ్యక్తిగత సంపదను పెంచుతాయి. 8. వచ్చే లాభాలు ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 4.
సమానత్వం సాధించటంలో కార్మిక, మహిళా ఉద్యమాలు అనుసరించిన విధానాలలో పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
మానత్వం సాధించటంలో కార్మిక, మహిళా ఉద్యమాలు :

అనుసరించిన విధానాలలో పోలికలు :

  1. నూలు పరిశ్రమలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల జీవనోపాధిని కోల్పోవటానికి కారణంగా భావించిన మరమగ్గాలపై దాడి చేసి నాశనం చేశారు.
  2. ఆహారం కొరకు ఉద్యమాలు.
  3. గడ్డి నుంచి గింజను వేరు చేసే నూర్పిడి యంత్రాల వల్ల తమకు పనిలేకుండా పోతుందని భయపడిన కార్మికులు అల్లర్లకు దిగారు.
  4. కనీస వేతనం కొరకు మహిళల, పిల్లల భారం తగ్గించటం, యంత్రాల వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం కోసం, తమ హక్కుల కోసం పోరాడటానికి కార్మిక సంఘాలుగా ఏర్పడటం కోసం అనుసరించిన విధానాలలో పోలికలు ఉన్నాయి.

తేడాలు

మహిళలు కార్మికులు
1. ఓటు హక్కు కొరకు, ఆస్తి హక్కు కొరకు ఉద్యమాలు 1. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న ఆదర్శాల సాధన కొరకు
2. పురుషుల ఆధిపత్యం నుండి విముక్తి కొరకు 2. దోపిడీ నుండి మెరుగైన వేతనాల కొరకు
3. వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వం కొరకు 3. యజమానుల యంత్రాలు, సరుకు నిల్వలపై దాడి చేయటం ద్వారా
4. విద్య, వైద్య, సతీసహగమనం, ఆడపిల్ల పుట్టగానే చంపేయటం, బలవంతంగా విధవను చేయడం వంటి వాటి విముక్తి కొరకు 4. అణచివేత నుండి, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో విముక్తి కొరకు

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 5.
కార్మికులు, మహిళల నేపథ్యంలో “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం” అన్న భావనలను తెలియచేయటానికి ఒక గోడ పత్రిక తయారుచేయండి. ఈ హక్కులు ఉల్లంఘించబడుతున్న సందర్భాలను గుర్తించండి. (AS5)
జవాబు:

  1. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నవి ఫ్రెంచి విప్లవం ద్వారా ప్రపంచానికి అందించబడిన అమూల్యమైన ఆదర్శా లు.
  2. అయితే ఈ భావనలు కార్మికులకు, మహిళలకు సమాన వేతనం.
  3. సమాన అవకాశాలు, అవకాశాలలో సమానత్వం ముఖ్యమైనవి.
  4. తమ కోర్కెలు చట్టబద్ధంగా తెలియజేయటానికి కార్మిక సంఘాలుగా ఏర్పడే హక్కు.
  5. కుల, మతాలకు, పేద, ధనిక తారతమ్యం లేకుండా వివక్షత లేకుండా విద్య, ఉద్యోగ అవకాశాలు, వేతనాలు కల్పించుట.
  6. స్త్రీ, కార్మికులకు సమాన ఓటు హక్కు కల్పించుట.
  7. సమాన పనికి సమాన వేతనం.
  8. కార్మికులకు, మహిళలకు భద్రత, గౌరవప్రదమైన జీవనం కల్పించుట.
  9. పార్లమెంటరీ, శాసనసభల, ప్రజాస్వామిక సంస్థల ఏర్పాటు.

హక్కులు ఉల్లంఘించబడుతున్న సందర్భాలు :

  1. మహిళలకు ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలు.
  2. ఉద్యోగ భద్రత లేదు. మహిళలు, పిల్లలు పట్ల కారుణ్యం లేదు.
  3. ఆర్థిక అసమానతలు.
  4. ఎటువంటి వివక్షత లేకుండా గుణాలు, ప్రతిభ ఆధారంగా మహిళలతో పాటు పౌరులందరూ సమానులని గుర్తించక పోవడం.
  5. కార్మికులు తమ హక్కుల కొరకు, సంక్షేమం కొరకు చేసిన ఉద్యమాల కాలంలో జీతాలు నిలిపివేత, కంపెనీ లాకౌట్ ప్రకటన.

ప్రశ్న 6.
సామాజిక నిరసన ఉద్యమాలు జరిగిన దేశాలను ప్రపంచ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
1. బ్రిటన్
2. ఫ్రాన్స్
3. జర్మనీ
4. ఇటలీ
5. భారత్
AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు 1

ప్రశ్న 7.
పేజీ నెం. 202లోని చివరి రెండు పేరాలు చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
రోజు రోజుకు పురుష ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న వివక్షతలను దూరం చేయడానికిగాను మహిళల్లో చైతన్యం వచ్చింది. వివిధ రచయిత్రులు, రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం, మహిళా ఉద్యమంలో భాగంగా వారిలో చైతన్యం ఉప్పొంగి, రాజకీయ, సాంస్కృతిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. విద్య, వైద్యం వంటి అన్ని రంగాలలో వివక్షతకు చరమగీతం పాడారు.

భారతదేశంలో సంఘసంస్కర్తలు నడిపించిన ఉద్యమాలు, సతీసహగమనం, ఆడపిల్ల పుట్టగానే చంపేయడం, బలవంతంగా విధవను చేయటం వంటి దురాచారాలను దూరం చేయ్యటానికి, విద్యయే కారణమని మహిళలు గ్రహించారు.

భారతదేశంలో గాంధీజీ వంటి నాయకులు మహిళా ప్రాధాన్యత గుర్తించి ఉద్యమంలో మహిళల పాత్రను నొక్కి చెప్పారు. కనుకనే స్వాతంత్ర్యం అనంతరం మహిళల కొరకు హక్కులు, చట్టాలు పొందుపరిచి సముచిత స్థానం కల్పించారు.

9th Class Social Studies 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.198

ప్రశ్న 1.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి భావనలు నిరసన ఉద్యమాలకు ఏవిధంగా స్ఫూర్తినిచ్చాయి?
జవాబు:
పారిశ్రామికీకరణ, జాతీయ రాజ్యాల ఆవిర్భావంతో చేతివృత్తులు, వ్యవసాయం అడుగంటి, ఉద్యోగ భద్రత దూరమై, కార్మికులు, మహిళలు, చిన్న రైతులు, శ్రామికులలో అసంతృప్తి, ఆవేదన, ఆందోళనలు సాగి ఉద్యమాలు చెలరేగాయి.

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆదర్శాల ఆవశ్యకతను గుర్తించిన వీరు వ్యక్తిగత స్వేచ్ఛ, అవకాశాల సమానత్వం, వివక్షత లేకుండా హక్కులు పొందడానికి, ఓటు హక్కు వంటి హక్కులు సాధించుకోవడానికి, కార్మిక సంఘాలు, సమావేశాలు, చర్చలు, ఉద్యోగ భద్రత కొరకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తినిచ్చాయి.

ప్రశ్న 2.
21వ శతాబ్దంలో ఈ మూడు ఆదర్శాలను ప్రజలు సాధించారా?
జవాబు:
21వ శతాబ్దంలో ఈ మూడు ఆదర్శాలు ప్రజలు సాధించారని చెప్పవచ్చు. కాని కొన్ని సందర్భాలలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆశయాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికీ కూడా మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు పరిశ్రమలలో, వివిధ వ్యవసాయ పనులలో లభించడం లేదు. చాలా పట్టణాలు, గ్రామాలలో కులవివక్ష, మతవివక్ష కనబడుతూ, ఆడపిల్లల విషయంలో విద్య, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల విషయంలో వివక్షత కనిపిస్తుంది.

ప్రశ్న 3.
ఈ భావనలతో స్ఫూర్తిని పొందిన సామాజిక ఉద్యమాలు మీ ప్రాంతంలో ఏమైనా ఉన్నాయా?
జవాబు:
మా ప్రాంతంలో స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆదర్శాలను ఆశయంగా తీసుకొని, ఇటీవల మహిళలు, ఆడపిల్లల యెడల జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు, మానభంగాలు, వారికి ఎదురౌతున్న సహోద్యోగుల వేధింపులు, రక్షణకై ఉద్యమాలు, నిరసనలు జరుగుతున్నాయి. బాలురుతో పాటు బాలికకు కూడా సమాన ప్రాధాన్యత కొరకు విద్య, ఇంటిలో లభించని స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకై తల్లిదండ్రులలో చైతన్యానికి కార్యక్రమాలు చేపడుతున్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 4.
“మొక్కజొన్న చట్టాలు” తొలగించాలని కార్మికులు ఎందుకు కోరారు? భూస్వాములు వాటిని ఎందుకు సమర్థించారు?
జవాబు:
ఫ్రాన్స్ తో ఇంగ్లాండు యుద్దాలు వల్ల వాణిజ్యం దెబ్బతింది. కర్మాగారాలు మూసివేశారు. సగటు వేతనాల స్థాయికి అందనంతగా రొట్టె ధరలు పెరిగాయి. పేద ప్రజల ఆహారంలో రొట్టె (మొక్కజొన్న రొట్టె) ముఖ్యమైనది. దాని ధర వాళ్ళ జీవన ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది. రొట్టెల నిల్వలను జప్తు చేసి లాభాల కోసం అధిక ధరలకు అమ్మేవారు.

బ్రిటన్లో ధరలు ఒక మేరకు పెరిగే వరకు చవకగా దొరికే ఆహారాన్ని దిగుమతి చేసుకోవటాన్ని నిషేధించే “మొక్కజొన్న చట్టాలకు” భూస్వాములు సమర్థించారు.

ప్రశ్న 5.
మన దేశంలో కూడా రైతుల క్షేమం కోసం చవక వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల నుంచి రక్షించే చట్టాలకు అంతం పలుకుతున్నారు. ఇటువంటి దిగుమతులు మనదేశ పేద ప్రజలకు మేలు చేస్తాయా?
జవాబు:
మనదేశంలో కూడా రైతుల క్షేమం కోసం చవక వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల నుంచి రక్షించే చట్టాలకు అంతం పలుకుతున్నారు. ఇటువంటి దిగుమతులు మనదేశ పేద ప్రజలకు మేలు చేస్తాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో నిరంతరం కరవు కాటకాలు, సరియైన ఉత్పత్తి లేకపోవడం వల్ల దిగుమతులు పేద ప్రజలకు మేలు చేస్తాయి.

9th Class Social Textbook Page No.199

ప్రశ్న 6.
యంత్రాలను పగలగొట్టడం కార్మికులకు ఎంతవరకు ప్రయోజనం చేకూర్చింది?
జవాబు:
నూలు పరిశ్రమలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల వేలాది చేనేత కార్మికులకు పని లేకుండా పోయింది. ఉపాధి కోల్పోయి, పేదలుగా మారారు. తమ ఈ దుర్భరస్థితికి యంత్రాలే కారణమని యంత్రాలను కార్మికులు తగలబెట్టారు.

  1. దీని ద్వారా అనేక సందర్భాలలో కర్మాగార యజమానులు కార్మికులతో సంప్రదింపులకు సిద్ధపడి మెరుగైన పని పరిస్థితులు కల్పించడానికి అంగీకరించారు.
  2. వీరికి సామాజిక మద్దతు లభించింది.
  3. సామ్యవాద భావాలు మరింత బలపడడానికి కారణమయ్యాయి.

ప్రశ్న 7.
యంత్రాలు పగలగొట్టిన వాళ్ళకు మరణశిక్ష విధిస్తూ ప్రభుత్వం చట్టాన్ని చేసింది. ఇది సరైనదేనా?
జవాబు:
ఉపాధి కోల్పోయి, పేదరికం పెరిగి, ఆకలితో అలమటించిన వారు ఏ ఆందోళనకైనా, ఏ ప్రతీకార చర్యలకైనా దిగవచ్చు. అటువంటి పరిస్థితులలో ఆ చర్యలకు గల కారణాలు తెలుసుకొని వారికి పునరావాసం కల్పించాలే గాని, మరణశిక్ష విధిస్తూ విచక్షణారహితంగా చంపడం సరైన చర్య కాదు.

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 8.
కర్మాగారంలో కొత్త యంత్రాలు ప్రవేశపెట్టినపుడు సాధారణంగా కొంతమంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సాంకేతిక విజ్ఞానాన్ని మెరుగుపరుస్తూనే కార్మికులలో నిరుద్యోగం పెంచకుండా చేసే మార్గాలు ఏమైనా ఉన్నాయా?
జవాబు:
కర్మాగారాలలో కొత్త యంత్రాల వలన కొంతమంది ఉపాధి కోల్పోతారు. ఎందుకంటే 50 మంది కార్మికులు ఒక రోజులో చేయవలసిన పని ఒక యంత్రం 3 గంటలలో చేస్తుంది. అదేవిధంగా యంత్రాల ద్వారా నాణ్యత, నమ్మకం ప్రజలలో ఉంటుంది. కార్మికుల నిర్లక్ష్యం, అశ్రద్ధ వలన అనుకున్న లాభాలు అందకపోవచ్చు. దానివలన యజమానులు మనుషుల స్థానంలో యంత్రాలను ప్రవేశపెడుతున్నారు.

కాని యంత్రాల సాంకేతిక విజ్ఞానం ద్వారా ఉత్పత్తి చేస్తున్న కార్మికులను తొలగించకూడదు. యంత్రాలపై పర్యవేక్షణకు, ఉత్పత్తులకు, మార్కెట్ కల్పించడానికి, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి, మార్కెట్ సిబ్బందిని నియమించడానికి గాను కొంతమంది నిరుద్యోగులకు పని కల్పించవచ్చు.

9th Class Social Textbook Page No.202

ప్రశ్న 9.
మార్క్స్ ప్రతిపాదించిన సామ్యవాదం లుద్దిజంతో ఏ విధంగా విభేదించింది?
జవాబు:
లుద్దిజం కార్మికులను విప్లవవాదులుగా మార్చి హింసా, దౌర్జన్య, ఆస్తుల అంతానికి పూనుకుంది. రహస్య విప్లవవాద సంస్థలు ఏర్పడడానికి అవకాశం కల్పించింది. కనీస వేతనం, పనిభారం తగ్గించటం మొదలగు వాటికి అందజం ప్రాధాన్యతనీయగా, సామ్యవాదం దానితో విభేదించింది. ప్రజలు ఉత్పత్తి చేస్తున్న ప్రతిదీ సామాజిక ఉత్పత్తి అవుతుంది. వస్తు ఉత్పత్తిలో భాగస్వాములైన అందరికీ ‘వాటా ఉంటుంది. ఉత్పత్తి సమాజానికి సంబంధించినది అయి ఉంటుంది. తాత్కాలిక హక్కులు, హింసా ప్రవృత్తిపై మార్క్స్ విభేదించారు. మెరుగైన వేతనాల కోసమే కాకుండా పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చేయడానికి పోరాటాలు చేయాలన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం పని చేయాలన్నారు.

ప్రశ్న 10.
కర్మాగార ఉత్పత్తి మెరుగైనది, కోరుకోదగినది అని మార్క్స్ ఎందుకు భావించాడు?
జవాబు:
కర్మాగారాలలో ఉత్పత్తి చేసే కార్మికులకు ఎటువంటి ఆస్తిలేదు. కాని ఉత్పత్తి జరగడానికి కార్మికులు ఎంతో కీలకమని మార్క్స్ వాదించెను. కర్మాగారాలను, వనరులన్నింటిని కార్మికులు చేజిక్కించుకొని ఉమ్మడి ప్రయోజనాల కోసం వాటిని నడపటం మొదలు పెడితే కొత్త, సమసమాజానికి మార్గం అవుతుంది. ఉత్పత్తి అన్నది ఒక కుటుంబం, ఒక చిన్న క్షేత్రం లేదా ఒక గ్రామానికి సంబంధించింది కాకుండా మొత్తం సమాజానికి సంబంధించినదిగా అవుతుంది.

ప్రశ్న 11.
మార్క్స్ కి అంతకు ముందు కాలం నాటి సామ్యవాదులకు మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
జవాబు:
మార్క్స్ కి అంతకు ముందు కాలం నాటి సామ్యవాదులకు మధ్య తేడా కన్పిస్తుంది.

ముందు కాలం నాటి సామ్యవాదులు ఉత్పాదక ఆస్తి సమాజానికి చెందాలని వాదించలేదు. సామాజిక అవసరాలను శాస్త్రజ్ఞులు, పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు అంచనా వేసి వాటిని తీర్చేలా సమాజ శక్తులను వినియోగించే కేంద్రీకృత ప్రణాళిక ఉండాలని చెప్పారు. సహకార గ్రామాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.

మార్క్స్ దృష్టిలో సామ్యవాదం అంటే ప్రపంచం పారిశ్రామికంగా మారి, అందరి ఉత్పాదక శక్తులను వెలికితీసి కొరత అనేది లేకుండా చేయటం వల్ల ప్రగతిశీలమైనది అన్నారు. కార్మికులు దేశ పగ్గాలను చేజిక్కించుకుని శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. కర్మాగారాలు, భూములు, ప్రభుత్వానికి చెంది అందరి ప్రయోజనం కోసం ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేపడతారని మార్క్స్ చెప్పెను.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ చుట్టుపక్కల ఇటువంటి సామాజిక నిరసన ఉద్యమాలు ఉన్నాయా? ఆ ఉద్యమాల నాయకులతో ముఖాముఖి నిర్వహించి, నివేదిక తయారుచేయండి. దానిని తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
మా చుట్టుపక్కల ఇటువంటి సామాజిక నిరసన ఉద్యమాలు ఉన్నాయి.

సామాజిక నిరసన ఉద్యమాలలో భాగంగా ఇటీవల కాలంలో మా ప్రాంతంలో మహిళలు మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించారు.

మా ఊరిలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని పద్మక్క నాయకత్వంలోని మహిళలు ఉద్యమాన్ని నిర్వహించారు.

పద్మక్కతో ముఖాముఖి :
నేను – అక్కా ! మన ఊరిలో మద్యపానాన్ని నిషేధించాలని ఎందుకు ఉద్యమాన్ని నిర్వహించారు.

పద్మక్క – మద్యపానం వలన చాలా కుటుంబాలు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను నష్టపోవడం జరుగుతుంది.

నేను – అక్కా ! మద్యపానాన్ని సేవించడం వలన ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను ఎలా నష్టపోవడం జరుగుతుంది?

పద్మక్క – మద్యపానం సేవించడం వలన ఆరోగ్యపరంగా అనేక వ్యాధులకు గురికావలసి ఉంటుంది. ఊపరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయి.

నేను – అక్కా ! ఇంకా ఏమైనా నష్టాలు ఉన్నాయా ! మద్యపానాన్ని సేవించడం వలన.

పద్మక్క – ఉన్నాయి. పేద, మధ్యతరగతి పౌరులు తాను సంపాదించిన రోజు వారి వేతనంలో 3 వంతులు తాగడానికి ఉపయోగిస్తే మిగిలిన ఒక వంతు ఆ కుటుంబ జీవనానికి చాలక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అలాగే ఇతర వ్యాధులు వచ్చినప్పుడు వారి వద్ద ధనం లేక ఎవరిని అడిగిన త్రాగుబోతు వానికి ‘అప్పు ఎలా ఇస్తారని, ఒకవేళ ఇచ్చిన మరల మాకు తిరిగి ఎలా ఇవ్వగల్గుతారని ఎవరు ఇవ్వరు. అలాంటి పరిస్థితులలో ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది.

అందువలన మద్యపానాన్ని సేవించవద్దు. తాగేవారిని ప్రోత్సహించవద్దు.

పట నైపుణ్యాలు

1. పెట్టుబడిదారీ విధానం – పిరమిడ్
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు 2

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

SCERT AP 6th Class Social Study Material Pdf 10th Lesson స్థానిక స్వపరిపాలన Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 10th Lesson స్థానిక స్వపరిపాలన

6th Class Social 10th Lesson స్థానిక స్వపరిపాలన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
గ్రామసభ మరియు గ్రామ పంచాయితీ మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

గ్రామసభ గ్రామపంచాయితీ
1. గ్రామ స్థాయిలో సాధారణ సభ. 1. గ్రామ స్థాయి అసెంబ్లీ లాంటిది.
2. దీనిలో గ్రామంలోని ఓటర్లు అందరూ సభ్యులే. 2. దీనిలో ఎన్నుకోబడిన వార్డు సభ్యులే సభ్యులు.
3. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం. 3. ఇది పరోక్ష (ప్రాతినిధ్య) ప్రజాస్వామ్యానికి నిదర్శనం
4. గ్రామ పంచాయితీ పనితీరును సమీక్షిస్తుంది. 4. గ్రామ సభ పనితీరును సమీక్షించలేదు.
5. దీనికి ఎన్నికలుండవు. 5. దీనిని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు.

ప్రశ్న 2.
మీరు మీ స్థానిక ప్రభుత్వ సంస్థలో ప్రతినిధి అయితే మీరు ఏ సమస్యలు ప్రస్తావిస్తారు?
జవాబు:
నేను మా స్థానిక ప్రభుత్వ సంస్థలో ప్రతినిధి అయితే ఈ క్రింది సమస్యలు ప్రస్తావిస్తాను.

  • ప్రజా సౌకర్యాలైన త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, మురుగు నీటి కాల్వల నిర్మాణం, నిర్వహణ, చెత్త సేకరించుట, నిర్వహణ గురించి
  • ప్రభుత్వ పాఠశాలలో నమోదు, హాజరు పెంచుట గురించి మరియు మధ్యాహ్న భోజన పథకం అమలు (నిర్వహణ), నాడు – నేడు అమలు గురించి ప్రస్తావిస్తాను.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 3.
మీ పంచాయితీ / మున్సిపాలిటీలో సామాన్య ప్రజలు ఏ సమస్యపైన అయినా నిర్ణయం తీసుకోవడంలో పాలుపంచుకొంటున్నారా? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
మా మున్సిపాలిటీలో కొన్ని విషయాలలో సామాన్య ప్రజలు నిర్ణయం తీసుకోవడంలో పాలు పంచుకుంటున్నారు.
ఉదాహరణలు :

  • మా వారులో పాఠశాల దగ్గర ఒక మద్యం షాపు పెట్టారు. దానితో పాఠశాల నడపటం కష్టంగా ఉండేది. దానితో ప్రజలందరూ కలిసి వార్డు సభ్యునికి తెలియపరిచారు. వార్డు సభ్యుడు చైర్మన్, కమిషనర్ తో మాట్లాడి ఆ షాపును అక్కడి నుంచి తీయించేశారు.
  • మా వార్డులో వర్షం పడితే మురుగునీరు రోడ్లపైకి పారుతోంది. కాబట్టి ప్రజలు చాలామంది మున్సిపాలిటీ సమావేశాలు జరిగే సమయంలో అక్కడికి వెళ్ళి వారికి సమస్యను కాగితం రూపంలో సమర్పించాము. వారు సమావేశంలో చర్చించి ‘భూగర్భ మురికి కాలువలను’ మా వార్డుకు శాంక్షన్ చేశారు.

ప్రశ్న 4.
అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి పంచాయితీలు పన్నులు పెంచాలా, లేదా ప్రభుత్వ నిధుల మీద ఆధారపడాలా? మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి పంచాయితీలు పన్నులు పెంచితే అది ప్రజలకు భారమవుతుంది. ప్రభుత్వ నిధుల మీద ఆధారపడితే అది కూడా పరోక్షంగా ప్రజలకు భారమౌతుంది. కాబట్టి పంచాయితీలు కొన్ని స్వావలంబనా కార్యక్రమాలు జరపాలి. పోరంబోకు స్థలాల్లో గడ్డి పెంచడం, చెరువుగట్లపై కొబ్బరి, ఈతచెట్లు పెంచడం, వాటిని వినియోగించేవారికి వేలంపాట నిర్వహించి ఆ సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలకు నిర్వహించాలి.

ప్రశ్న 5.
అంకితభావంతో పనిచేసే సర్పంచులు ఎదుర్కొనే సవాళ్ళను వివరించండి.
జవాబు:
నేడు అంకితభావంతో పనిచేసేవారు అతికొద్దిమందే ఉన్నారు. వారికి అడ్డత్రోవలో పనిచేయించుకునే వారు ఎప్పుడూ సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. ఉదా : గ్రామంలో ఇందిరా ఆవాస్ యోజన, దీపం పథకం, అన్నపూర్ణ పథకం, పనికి ఆహార పథకం, వికలాంగ, వృద్ధాప్య, వితంతు పింఛనులు మొదలైనవి అనేకం ఉన్నాయి. వీటిని అర్హులు కానివారికి ఇప్పించాలని సర్పంచ్ పై పేరు, పలుకుబడి ఉన్నవారు ఒత్తిడి తీసుకువస్తారు. ఈ సవాళ్ళను అన్నింటినీ అధిగమించి గ్రామాన్ని ముందుకు నడిపించడం సర్పంచ్ కు కత్తిమీద నడకలాంటిది.

ప్రశ్న 6.
పురపాలక సంఘం కల్పిస్తున్న ఏయే పౌర సౌకర్యాలను గ్రామ పంచాయితీ కల్పించటం లేదు?
జవాబు:
విద్యుత్తు, రవాణా, ఉన్నత విద్య, చెత్త సేకరణ (వ్యర్థ పదార్థాల నిర్వహణ), భూగర్భ డ్రైనేజీ, టౌన్ ప్లానింగ్, పార్కులు మెరుగైన ఆరోగ్య సేవలు మొదలైన పౌర సౌకర్యాలను పురపాలక సంఘం కల్పిస్తుంది. గ్రామ పంచాయితీలు కల్పించడం లేదు.

ప్రశ్న 7.
గీతిక ఉన్న వీధిలో కొళాయి నుంచి నీరు అరగంట కూడా రాదు. అందువల్ల చాలామంది బకెట్లు నింపుకోవడానికి వరుసలో నిలుచుంటారు. ఆమె సమస్య పరిష్కారం కావటానికి మీరు గీతికకు ఏ విధమైన సలహా ఇస్తారు?
జవాబు:
తన యొక్క వార్డు కౌన్సిలర్ ని కలిసి సమస్యను అతనితో చెప్పవలసినదిగా సలహా ఇస్తాను. అపుడు ఆ సమస్యను కౌన్సిల్ ముందు వుంచుతారు. అధికారులు నిర్ణయం తీసుకుని సమస్య పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటారు. ఈ అప్పటివరకు బోరింగు పంపు నుండి నీరు పట్టుకుంటుంది.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 8.
స్థానిక కార్పోరేటర్/కౌన్సిలర్‌ను కలిసి పురపాలక సంఘం చేసే పనుల గురించి తెలుసుకోవడానికి గాను కొన్ని ప్రశ్నలను తయారు చేయండి.
జవాబు:
నేను మాకు దగ్గరలో ఉన్న కార్పొరేటర్ ను కలిసి, పురపాలక సంఘం చేసే పనుల గురించి తెలుసుకోవడానికిగాను ఈ క్రింది ప్రశ్నలను తయారుచేశాను.

ప్రశ్నలు :
1. పురపాలక సంఘం, చెత్తను ఉపయోగించి ఏమైనా వ్యాపారం చేస్తుందా?
2. రోడ్డును శుభ్రంచేసే స్త్రీలకు, పురుషులకు ఏమైనా పేర్లు ఉన్నాయా?
3. మంచినీటి శుద్ధీకరణ ఏ విధంగా చేస్తారు?
4. వీధి లైట్లు నిర్వహణ కొరకు ఏదైనా కంట్రోల్ యూనిట్ ఉంటుందా?
5. ప్రజల వద్ద నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బును పురపాలక సంఘం దేనికి ఖర్చు చేస్తుంది?

ప్రశ్న 9.
దిగువ ఇవ్వబడిన పురపాలక సంఘాలను, మున్సిపల్ కార్పొరేషన్లను ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్తించండి.
i) విశాఖపట్నం
ii) విజయవాడ
iii) భీమునిపట్నం
iv) కడప
v) అనంతపురం
vi) తిరుపతి
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన 1

6th Class Social Studies 10th Lesson స్థానిక స్వపరిపాలన InText Questions and Answers

6th Class Social Textbook Page No.111

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో కల్పించే ప్రజా సౌకర్యాలను రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో కల్పిస్తున్న ప్రజా సౌకర్యాలు :

  • రక్షిత మంచినీటి సౌకర్యం.
  • ఆ భూగర్భ డ్రైనేజి ఆ మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ
  • రహదారుల నిర్మాణం, నిర్వహణ
  • వీధి దీపాల ఏర్పాటు (మరమ్మతు) నిర్వహణ
  • ఉద్యానవనాల ఏర్పాటు నిర్వహణ
  • ఉచిత విద్యా సౌకర్యం
  • ఉచిత వైద్య సదుపాయాలు
  • గ్రంథాలయాలు, పఠనాలయాలు
  • కూరగాయల, పండ్ల, చేపల మార్కెట్ల నిర్వహణ

ప్రశ్న 2.
మీరు గ్రామంలో నివసిస్తుంటే మీ గ్రామసభను సందర్శించి నివేదిక రూపొందించండి.
జవాబు:
విద్యార్థి స్వయంగా చేయగలరు. (ఈ క్రింది వానిని ఆధారంగా ఉదాహరణగా తీసుకోగలరు)

మా గ్రామంలోని గ్రామసభను సందర్శించాను. అక్కడ – రేషన్‌కార్డు కోసం కూపన్లు ఇస్తున్నారని తెలిసి కనకమ్మ గ్రామసభకు హాజరైంది. కాని ఆమెకు గ్రామసభ ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆ గ్రామసభలో దాదాపు 70 మంది ప్రజలు వస్తే అందులో 20 మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కనకమ్మ లాగే కూపన్లు ఇస్తున్నారని వచ్చారు. సమావేశంలో సర్పంచ్ గత సంవత్సరంలో జరిగిన పనుల గురించి వివరిస్తూ, ఈ సంవత్సరం జరిగే పనుల గురించి గ్రామసభ ముందుంచగా గ్రామసభకు వచ్చిన జనం చప్పట్లు కొడుతూ సర్పంచ్ చేసిన పనిని అభినందించారు. తరువాత ఆయన దారిద్ర్యరేఖకు దిగువన (BPL) గల ప్రజల వివరాలు వెల్లడించాడు. ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి వీరు లబ్దిదారులవుతారని తెలియజేశాడు.

ఆయన మాట్లాడడం ఆపగానే కనకమ్మ నిలబడి నా పేరు కూడా లబ్దిదారుల జాబితాలో ఉంచాలని, నాకు ఉద్యోగం గాని, భూమి గాని వేరే ఏ ఆధారంగాని లేదని తెలిపింది. సర్పంచ్, ఆమె పేరు తప్పకుండా ఈ జాబితాలో ఉండేటట్లు చూస్తానని చెప్పగ కనకమ్మ సంతోషిస్తూ గ్రామసభ నుంచి వెళ్ళింది. చివరిగా రేషన్‌కార్డు కోసం కూపన్లు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడంతో గ్రామసభ ముగిసింది.

6th Class Social Textbook Page No.112

ప్రశ్న 3.
గ్రామ పంచాయితీ, గ్రామ సభల మధ్య పోలికలను రాయండి.
జవాబు:
గ్రామ పంచాయితీ, గ్రామ సభల మధ్య పోలికలు :

  • రెండూ కూడాను గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోవటంలో పాల్గొంటాయి.
  • రెండింటికి ‘సర్పంచ్’ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు.
  • అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఉంటుంది.
  • రెండూ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటాయి. (మెజారిటీ సభ్యుల అభిప్రాయం).

6th Class Social Textbook Page No.113

ప్రశ్న 4.
ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదు చేయడం, తీసివేయడం ఎందుకు అవసరమో చెప్పగలరా?
జవాబు:
కొత్తగా 18 సం|| నిండిన వారిని, ఆ ప్రాంతానికి కొత్తగా బదిలీ పైగాని, ఇల్లు మారిగాని వచ్చిన వారిని, వివాహమై కొత్తగా వచ్చిన వారిని ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదు చేస్తారు.

ఇటీవల మరణించిన వారిని, బదిలీపై లేదా ఇల్లు మారి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిన వారిని, వివాహమై ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళినవారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు.

6th Class Social Textbook Page No.115

ప్రశ్న 5.
మీ ఉపాధ్యాయులు/తల్లిదండ్రుల సహాయంతో గ్రామ వాలంటీర్లు అందించే సౌకర్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
గ్రామ వాలంటీర్లు అందించే సౌకర్యాలు :

  • ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి తెలియజెప్పటమే కాకుండా మన ఇంటి దగ్గరకు (అందుబాటులోకి) తీసుకు వస్తారు.
  • వృద్ధాప్య పింఛన్లను ఇంటి వద్దనే అందిస్తున్నారు.
  • రేషన్ సరుకులను ఇంటి వద్దనే అందిస్తున్నారు.
  • ప్రభుత్వ పథకాల దరఖాస్తులను అందివ్వడం, ఆ దరఖాస్తులను అధికారులకు పంపిణీ చేయటం జరుగుతుంది.
  • గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేస్తున్నారు.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 6.
మీ మండల ప్రాదేశిక నియోజక వర్గ (MPTC) సభ్యులు మరియు జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ (ZPTC) సభ్యులు ఎవరు?
జవాబు:
సౌవిద్యార్థులు స్వయంగా రాయగలరు :
ఉదా : మా MPTC – …………….
మా ZPTC – …………………..

ప్రశ్న 7.
మీ జిల్లాలో ఎన్ని మండలాలు కలవు?
జవాబు:
విద్యార్థులు మీ మీ జిల్లాలను అనుసరించి రాయగలరు.
ఉదా : మాది గుంటూరు జిల్లా మా జిల్లాలో 57 మండలాలు కలవు.

6th Class Social Textbook Page No.116

ప్రశ్న 8.
మీ ప్రాంతంలో స్థానిక సంస్థలు కల్పించే ప్రజా సదుపాయాల జాబితాను రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో స్థానిక సంస్థలు కల్పించే ప్రజా సదుపాయాలు :

  • రక్షిత మంచినీటి సౌకర్యం.
  • భూగర్భ డ్రైనేజి
  • మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ
  • రహదారుల నిర్మాణం, నిర్వహణ
  • వీధి దీపాల ఏర్పాటు (మరమ్మత్తు) నిర్వహణ
  • ఉచిత విద్యా సౌకర్యం
  • ఉద్యనవనాలు ఏర్పాటు నిర్వహణ
  • ఉచిత వైద్య సదుపాయాలు
  • గ్రంథాలయాలు, పఠనాలయాలు
  • కూరగాయల, పండ్ల, చేపల మార్కెట్ల నిర్వహణ

6th Class Social Textbook Page No.117

ప్రశ్న 9.
మీ జిల్లాలో నగర పంచాయితీలు, పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పోరేషన్లు ఎన్ని కలవు?
జవాబు:
విద్యార్థులు మీ జిల్లా గురించి తెలుసుకుని రాయగలరు.
ఉదా : మాది గుంటూరు జిల్లా, మా జిల్లాలో
కార్పోరేషన్లు : 01 (గుంటూరు)
పురపాలక సంఘాలు : 12 (1. మంగళగిరి 2. సత్తెనపల్లి 3. తాడేపల్లి 4. తెనాలి 5. పొన్నూరు 6. బాపట్ల 7. రేపల్లె 8. నర్సరావుపేట 9. చిలకలూరి పేట 10. మాచర్ల 11. వినుకొండ 12. పిడుగురాళ్ళ
నగర పంచాయితీలు : 02 (దాచేపల్లి, గురజాల)

6th Class Social Textbook Page No.118

ప్రశ్న 10.
గ్రామ పంచాయితీ దాని పనితీరులో మున్సిపాలిటీకి ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:

గ్రామ పంచాయితీలు పురపాలక సంఘాలు
1. పంచాయితీలు గ్రామ స్వపరిపాలన సంస్థలు తక్కువ సంఖ్యలో జనాభా వుంటారు. 1. పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు. ఇక్కడ ఎక్కువ జనాభా వుంటారు.
2. రోడ్లను నిర్వహించడం, రక్షిత మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, చౌక, ధరల షాపులు నిర్వహించడం మొ||న పనులు పంచాయితీ చేస్తుంది. చెత్తను ఎత్తివేయడం లాంటి పనులు చాలా గ్రామాలలో కనబడదు. 2. గ్రామ పంచాయితీలు చేసే పనులతో పాటు అదనంగా చెత్తను ఎత్తి వేయడం, మురుగు కాలువల నిర్మాణం నిర్వహణ లాంటి బాధ్యతలను పురపాలక సంఘాలు నిర్వహిస్తాయి.
3. పంచాయితీ విధులను సర్పంచ్ పర్యవేక్షిస్తాడు. 3. పురపాలక సంఘ పనులను కమీషనర్ మరియు ఇతర కమిటీలు పర్యవేక్షిస్తారు.
4. ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం లేదు. 4. పెద్ద మొత్తంలో ఉద్యోగులు అవసరం అవుతారు.
5. కాంట్రాక్ట్ కార్మికులు మనకు కనబడరు. 5. పురపాలక సంఘాలలో కాంటాక్ట్ కార్మికులు చాలామంది ఉంటారు.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 11.
మీ ఉపాధ్యాయుని సహాయంతో దిగువ పట్టికను పూర్తి చేయండి.
జవాబు:

హోదా ఎవరు ఎన్నుకుంటారు ప్రత్యక్ష / పరోక్ష ఎన్నిక
వార్డు మెంబర్ గ్రామవార్డులోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక
సర్పంచ్ గ్రామంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక
ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ పరోక్ష ఎన్నిక
MPTC గ్రామంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక
ZPTC మండలంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక
మండల అధ్యక్షులు MPTC సభ్యులు పరోక్ష ఎన్నిక
జిల్లా పరిషత్ చైర్మన్ ZPTC సభ్యులు పరోక్ష ఎన్నిక
పురపాలక సంఘం ఛైర్మన్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు(కౌన్సిలర్) పరోక్ష ఎన్నిక
మేయర్ కార్పోరేటర్స్ & ఇతర సభ్యులు పరోక్ష ఎన్నిక

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

SCERT AP 6th Class Social Study Material Pdf 3rd Lesson పటములు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 3rd Lesson పటములు

6th Class Social 3rd Lesson పటములు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పటంలోని ముఖ్యమైన అంశాలేవి?
జవాబు:
పటంలోని ముఖ్య అంశాలు :
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 1

ప్రశ్న 2.
భూమిపై కల వాస్తవ దూరాన్ని పటంలో ఎందుకు తగ్గించి చూపాలి?
జవాబు:
ఒక ప్రదేశము యొక్క మొత్తము వైశాల్యమును కాగితంపై చూపించవలెనన్న అంతే వైశాల్యము కాగితము అవసరమగును అంటే భారతదేశ పటం గీయవలెనన్న అంతే వైశాల్యముకల కాగితము కావలెను మరియు భూమిపై ఉన్న వాస్తవ దూరము చాలా పెద్దదిగా ఉంటుంది. అంత పెద్ద వైశాల్యం గల ప్రదేశాలను వాటి మధ్య దూరాలను మానచిత్రంలో చూపించటము అసాధ్యము. కావున పటంలో తగ్గించి చూపాలి.

ప్రశ్న 3.
పటాల తయారీలో చిహ్నాల ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలుమార్గాలు బావులు మొదలైనటువంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలు చిహ్నాలతో సూచిస్తారు. ఇవి తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. పటాలు గీయడం, చదవడం సులభమవుతుంది.

ప్రశ్న 4.
మీ జిల్లా పటంలో మీ మండలం కేంద్ర కార్యాలయానికి, జిల్లా కేంద్ర కార్యాలయానికీ కల దూరాన్ని కొలవండి. వాస్తవ దూరానికి, దానికి కల నిష్పత్తి సహాయంతో పటంలో ఉపయోగించిన స్కేలు కనుగొనండి.
జవాబు:
విద్యార్థులు తమతమ జిల్లా, మండల కేంద్రాల నుండి క్రింద ఉదాహరణలో చూపిన విధంగా లెక్కించండి.

మా శ్రీకాకుళం జిల్లా కేంద్ర కార్యాలయానికి మా ‘టెక్కలి’ మండల కేంద్ర కార్యాలయానికి పటంలో
దూరం = 5 సెం.మీ,
వాస్తవ దూరం = 50 కి.మీ.
స్కేల్ : ఒక సెం.మీ. = 10 కి.మీ.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 2

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

ప్రశ్న 5.
రాజకీయ పటాలకీ, భౌతిక పటాలకీ కల వ్యత్యాసమేమి?
జవాబు:
రాజకీయ పటాలు :
గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను (అంటే రాజకీయ విభాగాలను) మాత్రమే చూపిస్తాయి.

భౌతిక పటాలు :
పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గూర్చి వివరిస్తాయి.

ప్రశ్న 6.
విషయ నిర్దేశిత పటాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
విషయ నిర్దేశిత పటాల యొక్క ప్రాముఖ్యత :

  • ఒక నిర్ధిష్ట (నిర్ణీత) అంశాన్ని గూర్చి సవివరంగా తెలియజేస్తాయి.
  • ఏదైనా ఒక ప్రాంతం గూర్చి వివరంగా తెలుసుకోవచ్చు.
  • భూవినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలుమార్గాలు, జనాభా వంటి నిర్ధిష్ట అంశాలను గురించి వివరిస్తాయి.

ప్రశ్న 7.
నిత్య జీవితంలో పటాల యొక్క ఉపయోగమేమి?
జవాబు:
పటాల వలన ఉపయోగాలు :

  • పటాలు దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు వంటి ప్రదేశాలను గుర్తించడానికి మనకి చాలా ఉపయోగకరం.
  • పటాలను ఉపయోగించి పర్వతాలు, పీఠభూములు, మైదానాల వంటి భూస్వరూపాలను చూడవచ్చును.
  • ప్రధాన రహదారి మార్గాలైన రోడ్లు, రైల్వేలను గురించి తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి.
  • పటాలు పంటలు, ఖనిజాలు, నేలలు పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి ఉపకరిస్తాయి.
  • పటాలు యుద్ధ సమయంలో సైనికులకు భద్రత దృష్ట్యా ఉపయోగకరం.
  • పటాలు పర్యాటకులు మరియు ప్రయాణీకులకు వారి గమ్య చేరడానికి మార్గదర్శకంగా ఉంటాయి.

ప్రశ్న 8.
ఇవ్వబడిన ప్రపంచ పటంలో ఖండాలు, మహాసముద్రాలు గుర్తించండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 3
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 4

→ సరియైన సమాధానాన్ని ఎంచుకుని బ్రాకెట్లో రాయండి.

1. అడవులు విస్తరణని తెలిపే పటాలు ………..
అ) భౌతిక పటము
ఆ) విషయ నిర్దేశిత పటం
ఇ) రాజకీయ పటం
ఈ) పైవేవీ కావు
జవాబు:
ఆ) విషయ నిర్దేశిత పటం

2. నీలిరంగు ……….. ని సూచించడానికి ఉపయోగిస్తాము.
అ) జలభాగములు
ఆ) పర్వతాలు
ఇ) భూభాగం
ఈ) మైదానాలు
జవాబు:
అ) జలభాగములు

3. స్కేల్ దీనిలోని ఒక ఆవశ్యకమైన భాగము …………
అ) పటము
ఆ) చిత్తుచిత్రము
ఇ) ప్రణాళిక
ఈ) ఏదీకాదు
జవాబు:
అ) పటము

4. దిక్సూచిని దీని కొరకు ఉపయోగిస్తారు.
అ) చిహ్నాలను చూపుటకు
ఆ) ప్రధాన దిక్కులను గుర్తించడానికి
ఇ) దూరాన్ని కొలవడానికి
ఈ) ఎత్తుని తెలుసుకోవడానికి
జవాబు:
ఆ) ప్రధాన దిక్కులను గుర్తించడానికి

5. ఉత్తరం మరియు తూర్పుకి మధ్యగల దిక్కుని ఇలా పిలుస్తారు.
అ) ఈశాన్యము
ఆ) ఆగ్నేయము
ఇ) వాయవ్యము
ఈ) నైరుతి
జవాబు:
అ) ఈశాన్యము

6th Class Social Studies 3rd Lesson పటములు InText Questions and Answers

6th Class Social Textbook Page No.30

ప్రశ్న 1.
మృదుల పై చిత్తుచిత్రం సహాయంతో ఎందుకు తను వెళ్ళవలసిన చోటికి చేరుకోలేదు? Page No. 30)
జవాబు:
మృదుల చిత్తుచిత్రం సహాయంతో తను వెళ్ళవలసిన చోటికి చేరలేకపోవడానికి కారణాలు :

  • చిత్తు చిత్రంలో ప్రధానంగా దిక్కులు చూపలేదు. స్కేల్ చూపలేదు.
  • చిత్తుచిత్రంలో ఏ విధమైన కొండ గుర్తులు, చిహ్నాలు చూపలేదు.

6th Class Social Textbook Page No.31

ప్రశ్న 2.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 5
పైన ఇచ్చిన చిత్రాన్ని పరిశీలించి కింది పట్టికను పూరించండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 6
జవాబు:

దిక్కు వస్తువులు
ఉత్తరం చెట్లు
ఈశాన్యం గుడి
దక్షిణం బావి
నైరుతి మసీదు
తూర్పు సూర్యోదయము
ఆగ్నేయం పాఠశాల
పడమర ఇల్లు
వాయువ్యం చర్చి

6th Class Social Textbook Page No.32

ప్రశ్న 3.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 7
చిత్రము పరిశీలించి స్కేల్ ని ఉపయోగించి కింద చూపిన ప్రదేశాల మధ్య వాస్తవ దూరాన్ని లెక్కించండి.
i) పోస్ట్ ఆఫీస్ మరియు రాజు ఇంటి మధ్య దూరం
ii) రాజు మరియు పూజ ఇంటి మధ్య దూరం
iii) చిరు ఇల్లు మరియు పాఠశాల మధ్య దూరం
జవాబు:
i) 60 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 6 సెం.మీ. × 10 మీ. = 60 మీ॥)
ii) 10 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 1 సెం.మీ. × 10 మీ. = 10 మీ॥)
iii) 50 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 5 సెం.మీ. × 10 మీ. = 50 మీ॥)

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

ప్రశ్న 4.
చిహ్నాలు మనకు సమాచారాన్ని ఎలా ఇస్తాయి?
జవాబు:
స్కేల్ పటంలోని ముఖ్యమైన అంశం. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి వంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు గీతలతో సూచిస్తారు. ఈ చిహ్నాలు తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. వీటిని ఉపయోగించుట వలన పటాలను గీయడం, చదవడం కూడా సులభం అవుతుంది. ఒక ప్రాంతలో మనకు భాష , తెలియకపోయినా ఎవరినీ సలహాలు అడగకుండానే పటాన్ని ఉపయోగించి చిహ్నాల సహాయంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

6th Class Social Textbook Page No.35

ప్రశ్న 5.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి పట్టికను తయారు చేయండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 8
జవాబు:
మనదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు గలవు. అవి :

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం రాజధాని
1. ఆంధ్రప్రదేశ్ అమరావతి
2. ఒడిశా భువనేశ్వర్
3. పశ్చిమబెంగాల్ కోల్‌కతా
4. జార్ఖండ్ రాంచి
5. బీహార్ పాట్నా
6. ఉత్తరప్రదేశ్ లక్నో
7. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్
8. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా
9. పంజాబ్ ఛండీఘర్
10. హరియాణా ఛండీఘర్
11. రాజస్థాన్ జైపూర్
12. గుజరాత్ గాంధీనగర్
13. మహారాష్ట్ర ముంబయి
14. మధ్యప్రదేశ్ భోపాల్
15. ఛత్తీస్ ఘడ్ రాయపూర్
16. కర్ణాటక బెంగళూర్
17. తెలంగాణ హైద్రాబాద్
18. కేరళ తిరువనంతపురం
19.  తమిళనాడు చెన్నెై
20. గోవా పనాజి
21. సిక్కిం గాంగ్‌టాక్
22. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్
23. అస్సాం డిస్పూర్
24. మేఘాలయ షిల్లాంగ్
25. నాగాలాండ్ కోహిమా
26. మణిపూర్ ఇంఫాల్
27. మిజోరాం ఐజ్వా ల్
28. త్రిపుర అగర్తల
కేంద్రపాలిత ప్రాంతాలు
1. అండమాన్ & నికోబార్ దీవులు పోర్టుబ్లెయిర్
2. పుదుచ్చేరి (పాండిచ్చేరి) పుదుచ్చేరి
3. లక్ష ద్వీపు(ప్) కవరత్తి
4. దాద్రానగర్ హవేలి సిల్వాస్సా
5. డామన్ & డయ్యూ డామన్
6. ఛండీగర్ ఛండీగర్
7. న్యూఢిల్లీ న్యూఢిల్లీ
8. జమ్ము & కాశ్మీర్ శ్రీనగర్ & జమ్ము
9. లడక్ లెహ్

ప్రశ్న 6.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 9
ఈ భౌతిక పటాన్ని పరిశీలించి భారతదేశం యొక్క కొన్ని భౌగోళిక స్వరూపాలను గురించి రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 10

6th Class Social Textbook Page No.36

ప్రశ్న 7.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 11
భారతదేశం – ముఖ్య పంటలు (విషయ నిర్దేశిత పటం)
i) ఈ పటం ఏమి సూచిస్తోంది?
జవాబు:
భారతదేశంలో పండే ముఖ్య పంటలను సూచిస్తోంది.

ii) దీనిని విషయ నిర్దేశిత పటం అని ఎందుకు పిలుస్తారు?
జవాబు:
ఏదైనా ఒక నిర్దిష్ట అంశాన్ని తెలియజేసే పటం విషయ నిర్దేశిత పటం అంటారు. ఈ పటంలో ‘భారతదేశం – ముఖ్య పంటలు’ అనే నిర్దిష్ట అంశాన్ని తెలియజేస్తుంది, కనుక దీనిని విషయ నిర్దేశిత పటం అని పిలుస్తారు.

ప్రాజెక్టు పని

మీ పాఠశాల చిత్తు చిత్రం గీయండి.
జవాబు:
స్వయం చేయగలరు.

వివిధ రకాల పటాలను సేకరించి ఒక స్క్రిప్ పుస్తకం తయారుచేయండి.
జవాబు:
స్వయం చేయగలరు.

సరియైన చిహ్నాలను ఉపయోగించి మీ ఇంటినుంచి పాఠశాలకి వెళ్ళే దారి యొక్క చిత్తు చిత్రాన్ని గీయండి.
జ. ఉదా :
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 7

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

SCERT AP 6th Class Social Study Material Pdf 9th Lesson ప్రభుత్వం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 9th Lesson ప్రభుత్వం

6th Class Social 9th Lesson ప్రభుత్వం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పార్లమెంటరీ మరియు అధ్యక్ష ప్రజాస్వామ్యాల మధ్య వ్యత్యాసాలను రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 1

ప్రశ్న 2.
ప్రభుత్వం అంటే ఏమిటి? వివిధ రకాల ప్రభుత్వాలు ఏవి?
జవాబు:
ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ, వాటికొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాన్ని ప్రభుత్వం’ అంటారు. ప్రభుత్వాలు రెండు రకాలు, అవి

  1. రాచరిక ప్రభుత్వం
  2. ప్రజాస్వామ్య ప్రభుత్వం

ప్రశ్న 3.
నేడు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏవైనా నాలుగు కార్యకలాపాలను రాయండి.
జవాబు:

  • ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా ఉంటుంది.
  • అలాగే తపాలా సర్వీసులు నిర్వహించడం, రైల్వే వ్యవస్థ నిర్వహణ వంటి పనులను కూడా ప్రభుత్వం చూస్తుంది.
  • ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని, సరిహద్దులను రక్షిస్తుంది. ప్రజలందరికీ ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది.
  • ఎపుడైనా ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకవసరమైన సహాయం అందిస్తుంది.
  • ప్రజలకు న్యాయస్థానాల ద్వారా వివాద పరిష్కారం చేస్తుంది.

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 4.
నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనే వారందరి అభిప్రాయాలను పరిగణించడం సాధ్యమేనా? కొన్ని ఉదాహరణలతో చర్చించండి.
జవాబు:
నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనే వారందరి అభిప్రాయాలను పరిగణించడం చాలావరకు సాధ్యం కాకపోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఏకాభిప్రాయం కుదురుతుంది, అయితే ఇది అన్ని వేళల సాధ్యం కాదు. అందుకనే మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

ఉదాహరణకు మున్సిపల్ కౌన్సిల్ లోని (20) సభ్యులు పట్టణంలో ఏర్పాటు చేయదలచుకున్న పారిశుధ్య కార్మికుల కాంట్రాక్ట్ విషయంలో సభ్యులు తమ తమ అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. అనేకమైన అభిప్రాయాలు వచ్చాయి. మరి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేరు, కనుక మెజారిటీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు.

ప్రశ్న 5.
విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ కలసి పాఠశాలను నడిపిస్తే ఎలా ఉంటుంది? పాఠశాలను నడపటానికి అందరూ భాగస్వాములు కావాలని మీరు అనుకుంటున్నారా? లేక ప్రతినిధులను ఎన్నుకొని వారితో నడపాలని కోరుకుంటున్నారా? కారణాలు తెలపండి.
జవాబు:

  • విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల నడిపిస్తే అది ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుంది.
  • పాఠశాల నడపడానికి ప్రతినిధులను ఎన్నుకొని వారితో నడపాలని కోరుకుంటున్నారు.
  • కారణాలు : అందరూ నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ సమయం వృథా అవుతుంది. అమలు చేసేవారుండరు. అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి మేధావంతులై, అంకితభావం కలిగి, ఇతరుల మేలు కోరేవారిని ప్రతినిధులుగా ఎన్నుకుంటే పాఠశాల చక్కగా నడుస్తుంది.

ప్రశ్న 6.
మీ పాఠశాలలో నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్నాయా? ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారా?
జవాబు:
మా పాఠశాలలో నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరం మా అభిప్రాయాలను తెలియజేస్తున్నాము. అయితే ఎక్కువమంది ఏ అభిప్రాయం వెళ్ళబుచ్చారో దానినే అమలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ విధివిధానాలను అనుసరించి మా అభిప్రాయం పరిగణలోకి తీసుకుంటున్నారు.

ప్రశ్న 7.
సాత్విక్ తండ్రి ఒక దుకాణం ప్రారంభించడానికి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను అడిగాడు. ప్రతి ఒక్కరు భిన్నమైన అభిప్రాయాలను తెలిపారు. కానీ చివరకు, అతను దుకాణాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాడని మీరు అనుకుంటున్నారా?
జవాబు:

  • సాత్విక్ తండ్రి ప్రజాస్వామ్య బద్దంగానే వ్యవహరించాడని నేను అనుకుంటున్నాను.
  • ఎందుకంటే తను కుటుంబ సభ్యులందరి అభిప్రాయాలను అడిగాడు.
  • కుటుంబ సభ్యులందరికి దుకాణం యొక్క లాభనష్టాల గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. ఈయనకు సరైన అవగాహన ఉంది కాబట్టి దుకాణం ప్రారంభించి ఉండవచ్చు.

ప్రశ్న 8.
పద్మ తల్లి, తన పిల్లలను ఆదివారం ఎక్కడికి వెళ్తాం అని అడిగింది. ఇద్దరు పిల్లలు సినిమాకు వెళ్తామని, ముగ్గురు పార్కుకు వెళ్లాని అన్నారు. మీరు పద్మ స్థానంలో ఉంటే ఏ నిర్ణయం తీసుకుంటారు? కారణాలు చెప్పండి.
జవాబు:

  • నేను పద్మని అయితే (ఆమె స్థానంలో ఉంటే) నేను పిల్లలను పార్కుకి తీసుకువెళ్ళే దానిని.
  • ఎందుకంటే ఎక్కువమంది (మెజారిటి) పిల్లలు పార్కుకి వెళ్తామని చెప్పారు కాబట్టి.

ప్రశ్న 9.
ప్రజాస్వా మ్యానికి పుట్టినిల్లు……….
ఎ) చైనా
బి) భారతదేశం
సి) గ్రీస్
డి) రోమ్
జవాబు:
సి) గ్రీస్

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 10.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికి ఉంటుంది?
ఎ) పురుషులు
బి) మహిళలు
సి) ప్రతినిధులు
డి) అర్హత కలిగిన ఓటర్లు
జవాబు:
డి) అర్హత కలిగిన ఓటర్లు

ప్రశ్న 11.
భారతదేశంలో…… సంవత్సరాలు నిండినవారు విశ్వజనీన వయోజన ఓటు హక్కుకు అర్హులు.
ఎ) 18 సం||
బి) 21 సం||
సి) 20 సం||
డి) 19 సం||
జవాబు:
ఎ) 18 సం||

ప్రశ్న 12.
భారతదేశంలో ప్రతి రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతానికి రాజధాని నగరం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యస్థానం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యస్థానాలు అయిన కింది రాష్ట్ర రాజధానులను దిగువ ఇచ్చిన భారతదేశ పటంలో గుర్తించండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 2
జవాబు:

  1. మహారాష్ట్ర – ముంబయి
  2. తమిళనాడు – చెన్నై
  3. ఆంధ్రప్రదేశ్ – అమరావతి
  4. కర్ణాటక – బెంగుళూరు
  5. పశ్చిమ బెంగాల్ – కొల్‌కతా
  6. తెలంగాణ – హైద్రాబాద్
  7. లడఖ్/జమ్మూకాశ్మీర్-లెహ్, శ్రీనగర్
  8. పంజాబ్ – చంఢీఘర్
  9. కేరళ – తిరువనంతపురం
  10. అరుణాచల్ ప్రదేశ్ – ఇటానగర్
  11. మధ్య ప్రదేశ్ – భోపాల్
  12. జార్ఖండ్ – రాంచి
  13. ఛత్తీస్ – రాయపూర్
  14. ఉత్తరాఖండ్ – డెహ్రాడూన్
  15. గుజరాత్ – గాంధీనగర్
  16. ఒడిశా – భువనేశ్వర్

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 3

6th Class Social Studies 9th Lesson ప్రభుత్వం InText Questions and Answers

6th Class Social Textbook Page No.100

ప్రశ్న 1.
శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వహక శాఖకు ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:

  • శాసన నిర్మాణ శాఖ శాసనాలను (చట్టాలను) లేదా నిర్ణయాలను చేస్తుంది.
  • కార్యనిర్వాహక శాఖ శాసనాలను (చట్టాలను) లేదా నిర్ణయాలను అమలుపరుస్తుంది.
  • ఈ రెండు శాఖలకు వేటికవే అధికారాలు కల్గి ఉన్నాయి. ఒకదానిలో మరొకటి జోక్యం చేసుకునే అవకాశం లేదు. కాని శాసనశాఖ, కార్యనిర్వాహకశాఖను నియంత్రిస్తుంది.

ప్రశ్న 2.
న్యాయశాఖ యొక్క ప్రధాన విధి ఏమిటి?
జవాబు:
న్యాయశాఖ చట్టాలను వ్యాఖ్యానించడం, రాజ్యాంగ పరిరక్షణ చేయడం ప్రధాన విధిగా చెప్పవచ్చు.

6th Class Social Textbook Page No.101

ప్రశ్న 3.
దిగువ వార్తా పత్రికల శీర్షికలను పరిశీలించి, వాటి ఆధారంగా ప్రభుత్వ వివిధ కార్యకలాపాల జాబితాను రాయండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 4
జవాబు:
ప్రభుత్వ వివిధ కార్యకలాపాల జాబితా :

  • అందరికి ఉచిత నాణ్యమైన విద్యనందించడం.
  • మార్కెట్ ధరలను నియంత్రించడం (అదుపులో ఉంచడం).
  • అందరికి వైద్య సదుపాయాన్ని కల్పించడం (ఉచితంగా)
  • ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొవడం. ఉదా : వరదలు, భూకంపాలు మొదలైన ప్రకృతి విపత్తులో సహాయమందించడం.
  • వివిధ శాఖాధిపతులను, నియమించటం మొదలైనవి.

6th Class Social Textbook Page No.102

ప్రశ్న 4.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 5
మీ ఉపాధ్యాయుని సహాయంతో, పై లోగోలు మరియు ప్రభుత్వ కార్యకలాపాల చిత్రాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కింది మైండ్ మ్యాప్ నింపండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 6

ప్రశ్న 5.
ప్రభుత్వానికి సంబంధించిన మరికొన్ని పనులను రాయండి.
జవాబు:
ప్రభుత్వానికి సంబంధించిన పనులు :

  • రోడ్ల నిర్మాణం చేపట్టడం
  • రైల్వే, విమాన, నౌకాయానం చేపట్టడం
  • పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలు నిర్మించడం , తంతి, తపాల సౌకర్యాల ఏర్పాటు, నిర్వహణ
  • ఆనకట్టలు నిర్మించడం
  • దేశ రక్షణ (అంతర్గత, బహిర్గత)
  • శాంతి, భద్రతల పరిరక్షణ
  • ప్రజలందరికి న్యాయం అందించటం
  • పన్ను వసూలు చేయటం
  • అనేక రకాల సంక్షేమ పథకాలు చేపట్టడం
  • సమర్థవంతంగా పాలన చేయడం
  • అంతర్జాతీయంగా స్నేహ సంబంధాలు నెలకొల్పడం

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 6.
మీరు ప్రభుత్వం నుండి ఏ రకమైన సౌకర్యాలను ఆశిస్తున్నారు?
జవాబు:

  • ఉచిత గృహ వసతి
  • 24 గం||లు రక్షిత మంచినీటి సౌకర్యం
  • KG to PG ఉచిత విద్య,
  • పరిశుభ్రతకై పారిశుధ్య సౌకర్యం.
  • మెరుగైన, నాణ్యమైన వైద్య సదుపాయం
  • పర్యావరణ పరిరక్షణకై వన సంరక్షణ.
  • మా గ్రామం/పట్టణంలో నాణ్యమైన, మంచిరోడ్లు
  • అందరికి ఉద్యోగ, ఉపాధి కల్పించడం.

ప్రశ్న 7.
మీ ఉపాధ్యాయుని సహాయంతో ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశాలలోనైనా రాచరికాలు అమలులో ఉన్నాయేమో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
ప్రస్తుత ప్రపంచంలో పూర్తిస్థాయి రాచరికాలు లేకపోయినప్పటికీ, రాజరికం అనేది (రాజు రాణి అధ్యక్షులు ఉండటం) నామమాత్రంగా నైనా కొన్ని దేశాలలో కలదు. అవి :

  • యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్)
  • బ్రూనై
  • నెదర్లాండ్
  • రోమెనియా
  • జోర్డాన్
  • బెహ్రయిన్
  • మొరాకో
  • కాంబోడియా
  • UAE
  • మొనాకో
  • కువైట్
  • భూటాన్
  • టోంగా
  • వాటికన్ సిటీ
  • కత్తార్
  • బెల్జియం
  • సౌదీ అరేబియా
  • థాయ్ లాండ్
  • మలేసియా
  • జపాన్
  • ఓమన్ మొదలైనవి.

6th Class Social Textbook Page No.103

ప్రశ్న 8.
మీకు ఏ రకమైన ప్రభుత్వం ఇష్టం? ఎందుకు?
జవాబు:
నాకు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇష్టం. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకొనబడుతుంది. ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తుంది.

ప్రశ్న 9.
ప్రజల అభిప్రాయాన్ని ఏ ప్రభుత్వం గౌరవిస్తుంది?
జవాబు:
ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తుంది.

ప్రశ్న 10.
కింది చిత్రాలను గమనించండి. ప్రభుత్వ పేరును సంబంధిత బాక్సులలో రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 7

6th Class Social Textbook Page No.104

ప్రశ్న 11.
రాచరికం మరియు ప్రజాస్వామ్యం మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

రాచరికం ప్రజాస్వామ్యం
1. వంశపారంపర్యంగా నియమింపబడిన పాలకుడు ఉంటాడు. 1. దేశంలోని ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు ఉంటాడు.
2. రాజుకి అపరిమిత అధికారాలుంటాయి. 2. ప్రభుత్వ అధికారానికి పరిమితులుంటాయి.
3. ఎన్నికలు ఉండవు, పారదర్శకత ఉండదు. పాలకులపై నియంత్రణ ఉండదు. 3. పాలన, ఎన్నిక విధానం పారదర్శకంగా ఉంటుంది. నాయకులపై నియంత్రణ ఉంటుంది.
4. రాచరికంలో హక్కులు రాజు ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటాయి. 4. ప్రజలందరికి ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఇవి రాజ్యాంగబద్దంగా అందరికీ ఇవ్వబడతాయి.
5. రాచరికంలో రాజు నియంత్రణలోనే (కనుసనల్లోనే) సమాచార, ప్రసార సాధనాలుంటాయి. ప్రభుత్వ పాలనను విమర్శిస్తే శిక్షార్హులే. 5. సమాచార, ప్రసార సాధనాలు (వార్తా పత్రికలు, దూరదర్శన్, సినిమా) ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా ఉండి, ప్రభుత్వాలను విమర్శిస్తూ, నియంత్రిస్తుంటాయి.
6. ఇది నిరంకుశ పాలన కావచ్చు, సమానత్వం కన్పించదు. 6. ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వంలో అందరూ సమానులే.

ప్రశ్న 12.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం భారతదేశంలో సాధ్యమేనా? కారణాలు తెల్పండి.
జవాబు:

  • ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం భారతదేశంలో సాధ్యం కాదు, కారణం
  • భారతదేశంలో అధికంగా దాదాపు (135 కోట్లు) జనాభా ఉండటం వల్ల సాధ్యం కాదు.

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 13.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యానికి ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో, పౌరులు మాత్రమే చట్టాలు చేయగలరు. అన్ని మార్పులను పౌరులు ఆమోదించాలి. రాజకీయ నాయకులు పార్లమెంటరీ విధానం ప్రకారం పాలన మాత్రమే చేస్తారు. పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు చట్టాలు చేస్తారు.

6th Class Social Textbook Page No.105

ప్రశ్న 14.
పై సందర్భంలో మెజారిటీ పాలనను మీరు ఎలా అర్ధం చేసుకున్నారు? మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ప్రాతినిధ్య సూత్రంతోపాటు, ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలలో మెజారిటీ పాలన ఒకటి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ (simple majority) ద్వారా కూడా ప్రతినిధులు ఎన్నికవుతారు. ఒక్కోసారి ఒక్క ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా ఎన్నిక జరగవచ్చు. అటువంటప్పుడు వేరే అభ్యర్థికి ఓటువేసిన వారు కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవలసిందే. ఆ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలు పరుస్తారు.

ఉదాహరణకు : ఒక మున్సిపల్ కౌన్సిల్ లో 45 మంది కౌన్సిలర్స్ ఉంటే 23 మంది ఒక ప్రతిపాదనను సమరిస్తే అది ఆమోదం పొందుతుంది. మిగతా 22 మంది అభిప్రాయాలకు విలువ ఉండదు. అలా ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నాయి.

ప్రశ్న 15.
మీ తల్లిదండ్రుల నుండి, ఎన్నికల వ్యవస్థలో వారు చూసే సమస్యలను తెలుసుకొని, ఒక నివేదికను తయారు చేయండి. మీ తరగతిలో వాటిని చర్చించండి. ఈ సమస్యలకు పరిష్కారాలను కనుగొనండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు. క్రింది ఆధారాలను ఉపయోగించుకోండి.

ఎన్నికలలో ప్రజలు ధనవంతుల చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతున్నారు. కొన్ని సందర్భాలలో కులం, మతం కూడా ఎన్నికల సమయంలో ప్రజలమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాక భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా పెద్దది. రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ లాంటి అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి. ఓటు చేసే వారి శాతం చాలా తక్కువగా ఉండటం యింకా పెద్ద సమస్య. ఇవి లేకుండా ఉండాలంటే ప్రజలు వివేకవంతులై ధన, కుల ప్రలోభాలకు లొంగకుండా, ఓటు చేయాలి. సరియైన ప్రతినిధులను ఎన్నుకోవాలి.

6th Class Social Textbook Page No.106

ప్రశ్న 16.
కింద ఇవ్వబడిన ప్రపంచ పటాన్ని గమనించండి. పార్లమెంటరీ వ్యవస్థ మరియు అధ్యక్ష వ్యవస్థను విడిగా అనుసరిస్తున్న దేశాల జాబితా చేయండి. (మీ ఉపాధ్యాయుని సహాయంతో) ఈ పుస్తకం యొక్క వెనుక పేజీలలో ప్రపంచ పటాన్ని చూడండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 8
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 9

6th Class Social Textbook Page No.107

ప్రశ్న 17.
మీ ఉపాధ్యాయుని సహాయంతో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
కేంద్ర ప్రభుత్వం :
ప్రధానమంత్రి, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఉద్యోగ బృందం

రాష్ట్ర ప్రభుత్వం :
ముఖ్యమంత్రి, శాసనసభ, శాసనమండలి) సభ్యులు, గవర్నర్, రాష్ట్రమంత్రులు, ఉద్యోగ బృందం

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 18.
వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
నేడు అన్ని దేశాలు (ఉదా: భారతదేశం) అత్యధిక జనాభాను కలిగి ఉన్నాయి. కాబట్టి దేశ వ్యాప్తంగా ప్రజల అవసరాలు మరియు సమస్యలను గుర్తించడం కష్టం. కాబట్టి వివిధ సమస్యలను పరిష్కరించటానికి, ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు, పాలన వికేంద్రీకరణకుగాను ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం

9th Class Social Studies 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పేద కుటుంబాలలో చాలా కుటుంబాలు అనియత వనరుల నుండి రుణాలు పొందుతాయి. అనియత రుణాలపై ధనిక కుటుంబాలు చాలా తక్కువగా ఆధారపడతాయి. ఈ వాక్యాలను మీరు సమర్థిస్తారా? మీ సమాధానాన్ని సమర్థించడానికి పేజీ నెం. 114 లోని సమాచారాన్ని ఉపయోగించండి. (AS3)
(లేదా)
భారతదేశంలో నియత, అనియత రుణదాతలు రుణాన్ని అందించే విషయంలో చాలా తేడా ఉంది. నియత రుణ సంస్థలు ప్రభుత్వం, ఆర్.బి.ఐ. రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ తమ ఖాతాదారులచే కూడా ఈ నిబంధనలను పాటింపచేస్తారు. కాని అనియత వడ్డీ వ్యాపారులు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా తమ స్వంత పద్ధతులను పాటిస్తారు. రుణగ్రహీతలు తీసుకున్న అప్పును చెల్లించలేకపోయిన పక్షములో నియత రుణదాతలు అప్పును తిరిగి రాబట్టడానికి వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యనైనా చేపడతారు. కాని అనియత రుణదాతలు అప్పును తిరిగి రాబట్టడానికి చట్టవ్యతిరేక మరియు ఎటువంటి చర్యనైనా చేపడతారు. ఈ కారణాల వలన అప్పుడప్పుడు రుణగ్రహీతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నియత రుణ సంస్థలతో పోలిస్తే అనియత రుణదాతలు అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నారు.

బ్యాంకులు, సహకార సంస్థలు అధికంగా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని వలన ఎక్కువ మంది తక్కువ వడ్డీకి రుణాలు పొంది “అధిక ఆదాయాన్ని పొందగల్గుతారు. వారు పంటలను పండించగల్గడం, వ్యాపారం చేయడం, చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడం మొదలగునవి చేయగలుగుతారు. ప్రతి ఒక్కరికి తక్కువ వడ్డీ రేటు, అప్పును తిరిగి చెల్లించే సామర్థ్యం వంటివి కల్గించడం దేశాభివృద్ధికి ప్రధాన అంశాలుగా పనిచేస్తాయి.
ప్రశ్న : “ధనిక కుటుంబాల వారు నియత రుణదాతల నుండి స్వల్ప వడ్డీకి రుణాలు పొందుతుండగా, పేదకుటుంబాల వారు అనియత రుణదాతలకు అధిక వడ్డీ చెల్లించవలసి వస్తున్నది” వ్యాఖ్యానించండి.
జవాబు:
నియత రుణాలు :
1. బ్యాంకుల ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు :
అనియత రుణాలు :
1. వడ్డీ వ్యాపారస్థులు, వర్తకులు, యజమానులు – బంధువులు, స్నేహితులు ద్వారా పొందే రుణాలు. పేద కుటుంబాలలో చాలా కుటుంబాలు అనియత వనరుల నుండి రుణాలు పొందుతాయి. అనియత రుణాలపై ధనిక కుటుంబాలు చాలా తక్కువగా ఆధారపడతాయి. ఈ వాక్యాలను నేను సమర్థిస్తాను.

కారణం :
పేద కుటుంబాల వారికి బ్యాంకుల గురించిన సమాచారం అంతగా తెలియదు. బ్యాంకులలో జరిగే లావాదేవీలు కూడా పేద కుటుంబాల వారికి తెలియదు. బ్యాంకులు అంటే ధనికులకు
చెందినవి వారి అపోహ.

పైగా బ్యాంకుల ద్వారా ఋణాలు ఇవ్వడానికి పుచీకత్తులు’ అడుగుతారు అవి పేద కుటుంబాల వారి వద్ద ఉండవు. అందువలన ప్రైవేటు వ్యాపారస్తులను నమ్ముకుని వారి వద్ద మోసపోతారు.

పట్టిక – 1 ను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.
బ్యాంకులను ఎవరు వినియోగించుకుంటున్నారంటే…..
జీతం తీసుకునే ఉద్యోగులు,
పంటలు బాగా పండించే పెద్ద రైతులు,
వ్యాపారం చేసే వ్యాపారస్థులు,
బ్యాంకులలో డబ్బులు దాచుకుంటూ ఉండగా

బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న వారు, కార్లు కొనుక్కునేవారు. ట్రాక్టర్లు కొనుక్కునేవారు, ఎరువులను కొనుగోలు చేసేవారు, ఇళ్లు కట్టుకునేవారు. వీరంతా ధనికులు. అందువలన బ్యాంకులావాదేవీలు అన్నియు నిర్వహించేవారు ఎక్కువగా ధనికులు మాత్రమే.

పేదవారు బ్యాంకులు వద్దకు వెళ్ళకుండానే ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు పొందుతూ ఉంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 2.
రుణాలపై అధిక వడ్డీరేట్లు ఎందుకు హానికరం? (AS1)
జవాబు:
రుణాలపై అధిక వడ్డీరేట్లు హానికరం ఎందుకు అనగా –

  1. ఒక్కొక్కసారి మనం తీసుకున్న దానికన్నా వడ్డీ అధికం అవుతుంది.
  2. మొత్తం తిరిగి చెల్లించాలంటే అది రుణగ్రహీతలకు భారం అవుతుంది.
  3. రుణం ద్వారా పొందిన ప్రయోజనం కన్నా రుణగ్రహీతలకు వడ్డీ చెల్లించే భారం అధికం అవుతుంది.
  4. వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వలన రైతులు తమ పంటలు పాడైపోతున్నా చూస్తూ ఉంటారు. కానీ రుణాలు తీసుకుని వాటికి తగిన చర్యలు చేపడదాము అని అనుకోరు. అందువలన వడ్డీరేట్లు ప్రజలకు అందుబాటులో ఉంటే ధనాన్ని వడ్డీకి తీసుకుని అభివృద్ధికరమైన పనులు చేయడానికి వారికి అవకాశం ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
పేదల కోసం గల స్వయం సహాయక బృందాల ప్రధాన ఉద్దేశం ఏది? మీ సొంత వాక్యాల్లో వివరించండి. (AS4)
జవాబు:
పేదవారికి రుణాలు అందజేయడానికి కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు.

  1. పేదవారిని సమీకృతం చేయడం
  2. ముఖ్యంగా స్త్రీలకోసం, వారు పొదుపు చేసే డబ్బును సేకరించడం.
  3. దీనికోసం స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేసి నిర్వహించడం.
  4. ప్రతి స్వయం సహాయక బృందంలో 15 నుండి 20 మంది ఒకే ప్రాంతానికి చెందినవారు సభ్యులుగా ఉంటూ నిరంతరం కలుస్తూ, వారి డబ్బును పొదుపు చేస్తారు.
  5. ప్రతి ఒక్కరూ 25 రూ||ల నుండి 100 లేదా అంతకన్నా ఎక్కువ వారి వారి సామర్థ్యాలను బట్టి పొదుపు చేస్తారు.
  6. సభ్యుల్లో ఎవరికైనా రుణం అవసరమైతే తమ బృందం నుండి అందరూ కలసి దాచుకున్న సొమ్ము నుండి అప్పుగా పొందవచ్చు.
  7. బృంద సభ్యులు అప్పు తీసుకున్న వారి నుండి వడ్డీ వసూలు చేస్తారు.
  8. ఈ వడ్డీ వ్యాపారులు వసూలు చేసే వడ్డీలకన్నా తక్కువగా ఉంటుంది.
  9. 1 లేదా 2 సం||రాల పాటు బృందంలోని సభ్యులందరూ క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వారికి రుణం పొందే అర్హత వస్తుంది.
  10. బ్యాంకులతో ఉండే ఈ సంబంధం అందరికీ ఇచ్చే రుణాల మొత్తాన్ని పెంచడానికి దోహదపడుతుంది.
  11. బృందం పేరుమీద బ్యాంకులు రుణాలను అందజేస్తాయి.
  12. అదే విధంగా బృందాలు తీసుకున్న అప్పును అందరు కలసి తిరిగి చెల్లించే హామీని బ్యాంకులకు ఇస్తాయి.
  13. రుణాలను పొందడం, డబ్బును పొదుపు చేయడం వంటి విషయాలను బృందం చర్చించి నిర్ణయిస్తుంది.
  14. ఎవరైనా సభ్యులు అప్పును సరిగా చెల్లించకపోతే ఆ విషయాన్ని బృందమే పర్యవేక్షిస్తుంది. ఈ ఏర్పాట్ల వలన పేద మహిళలకు బ్యాంకులు పూచీకత్తు లేకుండానే రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి.

ప్రశ్న 4.
బ్యాంకర్ తో మాట్లాడి పట్టణ ప్రాంత ప్రజలలో ఎవరు ఎక్కువ రుణాలు ఎందుకోసం పొందుతారో తెలుసుకోండి. (AS3)
జవాబు:
బ్యాంకుల నుండి పట్టణ ప్రాంత ప్రజలలో ఎక్కువ రుణాలు పొందుతున్న వారు:

  1. వ్యాపారస్థులు
  2. పారిశ్రామికవేత్తలు
  3. ప్రభుత్వ ఉద్యోగస్థులు
  4. ఆర్థికవేత్తలు

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 5.
స్వయం సహాయక బృందాల ద్వారా వచ్చే రుణానికి, బ్యాంక్ ద్వారా వచ్చే రుణానికి తేడాలేమిటి? (AS1)
జవాబు:

  1. స్వయం సహాయక బృందాల ద్వారా వచ్చే రుణాలు సమష్టిగా ఉంటాయి. అదే విధంగా బృందాలు తీసుకున్న అప్పును అందరు కలిసి తిరిగి చెల్లించే హామీని బ్యాంకులకు ఇస్తాయి.
  2. రుణాలను పొందడం, డబ్బును పొదుపు చేయడం వంటి విషయాలను బృందం చర్చించి నిర్ణయిస్తుంది.
  3. రుణాలు షరతులను బృందమే నిర్ణయిస్తుంది.
  4. అప్పును తిరిగి చెల్లించడం బృందం సభ్యులందరి సమిష్టి బాధ్యత.
  5. ఎవరైనా సభ్యులు అప్పును సరిగా చెల్లించకపోతే ఆ విషయాన్ని బృందమే పర్యవేక్షిస్తుంది. అదే బ్యాంకు ద్వారా వచ్చే రుణాలు బృందాలతో సంబంధం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఆగిపోవచ్చు. లేదా చెల్లించాల్సి వచ్చినప్పుడు చెల్లించవచ్చు. అనగా వ్యక్తిగత రుణాలు ఆ వ్యక్తి యొక్క అవసరాలను బట్టి ఉంటాయి.

ప్రశ్న 6.
పేజీ నెం. 115 లోని స్వయం సహాయక బృందాల ……. గురించి ఉన్న మూడవ పేరా చదివి ఈ కింది ప్రశ్నకు జవాబు రాయండి. (AS2)
మీ ప్రాంతంలో స్వయం సహాయక బృందాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి?
(లేదా)
“స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేద ప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి. మహిళలు స్వయంకృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం, పోషణ, గృహహింస మొదలైన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే వేదికగా కూడా స్వయం సహాయక బృందాల సమావేశాలు తోడ్పడతాయి.” పై అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ జవాబును వివరించండి.
జవాబు:
మా ప్రాంతంలోని స్వయం సహాయక బృందాలు పనిచేసే విధానం :

  1. స్వయం సహాయక బృందాలలోని సభ్యులు రుణాలను పొంది స్వయం ఉపాధిని పొంది స్వయం ఉపాధిని ఏర్పరచుకుంటున్నారు.
  2. బృంద సభ్యులు చిన్న చిన్న మొత్తాలను రుణాలుగా పొందుతారు.
  3. ఉదా:- పూచీకత్తుగా ఉంచిన భూమిని తిరిగి పొందడం, పెట్టుబడులను సంపాదించడం. (ఉదా: విత్తనాలు, ఎరువులు, ముడిసరుకులు, బట్టలు, నగలు కొనుగోలు మొదలైన వాటికి)
  4. గృహోపకరణాల కొనుగోలు నిమిత్తం, కుట్టుమిషన్, మగ్గం, పశువులు మొదలగు ఆస్తుల సంపాదన కోసం రుణాలు పొందుతారు.
  5. స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేదప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి.
  6. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమేకాక వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం, పోషణ, గృహహింస – మొదలయిన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే విధంగా కూడా స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి.

ప్రశ్న 7.
రైతుల అవసరాలు తీర్చడంలో బ్యాంకులు అందజేసే సేవలు ఏమిటి?
జవాబు:
రైతుల అవసరాలను తీర్చడంలో బ్యాంకులు అందజేసే సేవలు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. పూర్వ కాలంలో అవసరాలకి, ప్రస్తుత కాల వ్యవసాయ అవసరాలకి చాలా తేడా కన్పిస్తుంది. పూర్వ కాలంలో వ్యవసాయానికి కావలసిన ఉత్పాదకాలలో చాలా వాటిని రైతులే స్వయంగా సమకూర్చుకునే వారు. సొంత పశువులనే పొలం దున్నడానికి, ఇంటి మనుషులే వ్యవసాయ కూలీలుగా తమ పొలంలో పండిన పంటనే విత్తనాలుగా, తమ పశువుల కొట్టం నుండే ఎరువులను తయారు చేసుకోవడం మొదలైన పనులు చేసేవారు. నవీన వ్యవసాయ పద్ధతులకు అధికమైన ధనం అవసరం.

విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనడం కోసం అలాగే పొలం దున్నడం, విత్తనాలు నాటడం, పంటకోత కోయడం మొదలైన వ్యవసాయ పనులు చేసే యంత్రాల కోసం, కూలీల జీతాల కోసం ఎక్కువ డబ్బు అవసరం. దీనికి అనుగుణంగా బ్యాంకులు, రైతుల అవసరాలకు తగ్గట్లు, కాలానుగుణంగా ఋణాలు అందించి, వ్యవసాయ పురోభివృద్ధికి, రైతుల అవసరాలు తీర్చడంలో బ్యాంకులు ముందుంటున్నాయి.

9th Class Social Studies 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.105

ప్రశ్న 1.
డిమాండ్ డిపాజిట్లను నగదుగా ఎందుకు పరిగణిస్తారు?
జవాబు:

  1. డిమాండ్ డిపాజిట్లు నగదు, యొక్క వివిధ లక్షణాలకు దారితీస్తుంది.
  2. నగదుకు బదులుగా చెక్కుల రూపంలో లేదా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా చెల్లింపులు జరుగుతాయి.
  3. కరెన్సీ నోట్లు మొదలైన వివిధ నగదు రూపాల లాగానే ఈ డిపాజిట్ల ద్వారా జమచేసిన డబ్బును తిరిగి తీసుకోవడం లేదా చెల్లింపులు జరపటం లాంటి విషయాలను నగదు రూపంలో గాని, చెక్కుల రూపంలోగాని చేయవచ్చు.
  4. చెల్లింపులు జరపడంలో డిమాండ్ డిపాజిట్లు అధిక ,వినియోగం వలన అధునిక ఆర్థిక వ్యవస్థలో ఇవి కరెన్సీ, నగదుకు ప్రతిరూపంలో ఉన్నాయి. ప్రస్తుత కాలంలోని డబ్బు యొక్క వివిధ రూపాలైన కరెన్సీ, డిపాజిట్లు ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 2.
బ్యాంక్ డిపాజిట్లను కూడా ప్రభుత్వం బీమా చేస్తుంది. వివరాలు సేకరించండి.
జవాబు:
ప్రతి బ్యాంక్ తన డిపాజిట్ దారుల తరఫున “డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్” కు ఇన్సూరెన్స్ చేస్తుంది. ఏదైనా విపత్కర పరిస్థితులలో బ్యాంకు మూసివేయవలసి వస్తే ఒక లక్ష రూపాయలవరకు డిపాజిట్ దారులకు బీమా లభిస్తుంది. ప్రజలకు బ్యాంకులపై నమ్మకం కలుగచేయుటకొరకు బ్యాంక్ డిపాజిట్లను కూడా ప్రభుత్వం బీమా చేస్తుంది.

ప్రశ్న 3.
బ్యాంకులలో జమ చేసే ఫిక్స్ డిపాజిట్లు నగదు లాగా పనిచేస్తాయి. చర్చించండి.
జవాబు:

  1. బ్యాంకులలో దాచుకొనే డబ్బుకు, ఫిక్స్ డిపాజిట్లకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది.
  2. వివిధ లావాదేవీలపై అనుమతిస్తూ, ప్రజలకు బ్యాంకులపై నమ్మకం కలిగిస్తుంది.
  3. ఫిక్స్ డిపాజిట్లపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ఋణాలను వెంటనే పొందవచ్చు. వాటిని తిరిగి చెల్లించవచ్చు. లేక నిర్ణీతకాలం అయిన తరువాత రుణమును మినహాయించి తిరిగి మొత్తం సొమ్మును పొందవచ్చును. అందువలన ఫిక్స్ డిపాజిట్లు కూడా నగదు లాగా పనిచేస్తాయి.

9th Class Social Textbook Page No.107

ప్రశ్న 4.
డిపాజిట్ దారులందరు ఒకేసారి బ్యాంకు నుండి తమ డబ్బును తిరిగి ఇవ్వవలసినదిగా కోరితే ఏమౌతుంది?
జవాబు:

  1. ఏమీ జరగదు. కారణం బ్యాంకు స్థాపించబోయే ముందు కొంత పైకమును రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియాకు డిపాజిట్ గా చెల్లించాలి. మరియు బ్యాంకులు వ్యాపారం చేస్తూ ఉంటాయి కాబట్టి లాభాల బాటలోనే నడుస్తాయి.
  2. బ్యాంకులు డిపాజిట్ చేసిన మొత్తం కన్నా ఎక్కువగా డిపాజిట్లను సేకరించరాదు.
  3. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన షరతులను అంగీకరించి డిపాజిట్ల పరిధి ఎక్కువగా ఉండరాదు.
  4. అందువలన డిపాజిట్ దారులు ఒకేసారి డిపాజిట్ చేసిన సొమ్ము మొత్తము అడిగినా బ్యాంకులు ఇవ్వగలవు.

ప్రశ్న 5.
బ్యాంకు నుండి రుణం తీసుకున్న వ్యక్తితో మాట్లాడండి. రుణాన్ని ఏ అవసరానికి తీసుకున్నాడో బ్యాంకు వారిని ఏ విధంగా కలిసాడో తెలుసుకోండి?
జవాబు:

  1. బ్యాంకు నుండి రుణం తీసుకున్న సుమ అనే వ్యక్తితో మాట్లాడాను.
  2. ఆమె రుణాన్ని ఇల్లు నిర్మించడానికి తీసుకున్నది.
  3. ఆమె ఎలా రుణాన్ని తీసుకుంది అనగా ముందుగా బ్యాంకు మేనేజర్ గారి వద్దకు వెళ్ళి నేను ఇల్లు నిర్మించదలచాను. నేను ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పి రుణం ఇవ్వమని అడిగాను అంది.
  4. ఆ తరువాత ఆమెను డిఫ్యూటి మేనేజర్ హోదాలో ఉన్న ఒక ఆఫీసర్ దగ్గరకు పంపగా ఆయన రుణం ఇవ్వడానికి ఏమి కావాలో చెప్పారు.
  5. కావలసినవి :
    1. జీతమునకు సంబంధించిన వివరాలతో కూడిన సర్టిఫికెట్
    2. ఇంటి స్థలమునకు చెందిన రిజిస్ట్రేషన్ పత్రం.
    3. న్యాయపరమైన అర్హత గల పత్రము.
    4. ఆ స్థలమును ఎవరికీ అన్యాక్రాంతము చేయలేదని రుజువు చేసే పత్రం.
    5. సంబంధిత అధికారుల చేత ఇల్లు నిర్మించుకోవటానికి కావలసిన అనుమతి పత్రం.
    6. ఇంజనీరు చేత రూపొందించబడిన ఇంటి నిర్మాణం యొక్క ఆకృతి పత్రము వంటివి తీసుకువచ్చి బ్యాంకువారికి అప్పగించిన తరువాత పై అధికారులు వాటిని పరిశీలించిన తరువాత రుణమును పొందవచ్చును అని చెప్పారని ఆమె తెలియపరిచినది.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 6.
బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి వారు ఏ ఏ రుణాలు ఇచ్చారో ఏ ఏ వాటికి రుణాలు ఇవ్వకూడదో చర్చించండి.
జవాబు:
1. బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడితే ఆయన ఇవ్వవలసిన రుణాలను గురించి, ఇవ్వకూడని రుణాలను గురించి వివరించి చెప్పారు.

ఇవ్వవలసిన రుణాలు :

  1. వ్యక్తిగత రుణాలు,
  2. ఇళ్లు నిర్మించడానికి రుణాలు,
  3. కార్లు కొనుగోలు చేయడానికి రుణాలు,
  4. గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి,
  5. చదువుకోడానికి,
  6. రైతులకు సంబంధించినవి,
  7. వ్యాపారులకు సంబంధించినవి,
  8. పారిశ్రామికవేత్తలకు సంబంధించినవి.

ఇవ్వకూడని రుణాలు :

  1. ఒకసారి తనఖా పెట్టిన తరువాత మరల తనఖా పెట్టవలసి వస్తే వాటిని పరిశీలించాలి.
  2. దివాళా తీసిన వారికి
  3. స్థిర నివాసం లేనివారికి ఋణాలను ఇవ్వరాదు.

ప్రశ్న 7.
ప్రజలు వారి డబ్బును బ్యాంకులలోనే కాకుండా ఇతర సంస్థలైన గృహ సముదాయ సంస్థలు, కంపెనీలు పోస్టాఫీసు పథకాలు మొదలైన వాటిలో కూడా జమ చేస్తారు. బ్యాంక్ డిపాజిట్ల కన్నా ఇవి ఏ విధంగా విభిన్నమో చర్చించండి.
జవాబు:

  1. బ్యాంక్ డిపాజిట్లలో కరెంట్ డిపాజిట్లు, ఫిక్స్ డిపాజిట్లు వంటి రకరకాల డిపాజిట్లు ఉంటాయి.
  2. ఇతర సంస్థలలో నిర్ణీత కాలపరిమితి ననుసరించి డిపాజిట్లు ఉంటాయి.
  3. వడ్డీ రేట్లలలో కూడా తేడాలుంటాయి.
  4. వాటిని బ్యాంకులలో హామీగా చూపించి రుణాలు పొందవచ్చును.
  5. ఇతర సంస్థల యందు లావాదేవీలు సులభంగా ఉంటాయి. చిన్న చిన్న మొత్తాలలో కూడా పొదుపు చేయవచ్చును. ఆ విధంగా పొదుపుచేసిన మొత్తం ఒకేసారి పొందవచ్చును.
  6. బీమా సంస్థలలో పొదుపు చేసేటప్పుడు పొదుపు చేసే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే తదుపరి పొదుపు చేయవలసిన అవసరం లేకుండానే ఆ మొత్తం పొదుపు డబ్బును పొందవచ్చును.
  7. బ్యాంకులలో అయితే ఆ విధంగా ఉండదు. అందువలన బ్యాంక్ కార్యకలాపాలకు, ఇతర బీమా, గృహ సముదాయ పోస్టాఫీసు పథకాలకు కొంత వ్యత్యాసం ఉంది.

9th Class Social Textbook Page No.108

ప్రశ్న 8.
కింది పట్టికను పూరించండి.
జవాబు:

అలీషా స్వప్న
రుణాలు ఎందుకవసరం? చెప్పులు తయారీదారుడు. పట్టణంలో పెద్ద వ్యాపారస్థుడు నెలరోజుల సమయంలో 3 వేల జతల షూస్ తయారుచేసి ఇవ్వమని ఆర్డర్ ఇచ్చాడు. గడువు లోపల ఇచ్చిన పని పూర్తి చేయడానికి పేస్టింగ్ గ్రీజు పూయడం, స్టిచ్చింగ్ (చెప్పులు కుట్టడం) మొ||న పనుల కోసం, మరి కొంత మంది పని వారికి నియమించుకోవాలి. ఇంకా చెప్పుల తయారీకి కావలసిన ముడి సరుకులు కొనాలి అందువలన అప్పు చేశాడు. స్వప్న ఒక చిన్న రైతు. తన 3 ఎకరాల భూమిలో వేరుశనగను పండిస్తుంది. పంట పండిన తరువాత వచ్చే డబ్బుతో తను అప్పును తీర్చవచ్చు అనే ఆశతో పంటకయ్యే ఖర్చును వ్యాపారస్థుని నుండి అప్పుగా పొందింది.
రుణం తీసుకోవడం వలన ఎటువంటి హాని జరగవచ్చు? అలీషా అనుకున్న సమయంలో చెప్పులుకుట్టి వ్యాపారస్థునికి ఇచ్చాడు. కాబట్టి లాభం పొందాడు. వేసిన పంట చీడకు గురైనందువలన ఏ విధమైన ఆదాయం రాకపోగా పెట్టిన పెట్టుబడి వృథా అయినది. అందువలన నష్టపోయి అప్పు తీర్చలేని పరిస్థితి ఎదురైంది.
ఫలితమేమిటి? లాభం పొందడం నష్టాలలో చిక్కుకోవడం, కష్టాలలో పడిపోవడం జరిగింది.

ప్రశ్న 9.
అలీషాకు వరుసగా ప్రతి సంవత్సరం ఆర్డర్లు వస్తే ఆరు సంవత్సరాల తరువాత అతను ఎటువంటి స్థితికి చేరుతాడు?
జవాబు:

  1. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు.
  2. తరువాత ఆర్డర్లు వచ్చిన అప్పు తీసుకునే అవకాశం ఉండదు.
  3. చిన్న కుటీర పరిశ్రమ లాంటి దానిని స్థాపించడానికి అవకాశం ఉంటుంది.
  4. దానిలో అతను మాత్రమే ఉపాధి పొందడం కాక ఇతరులకు ఉపాధి కల్పిస్తాడు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 10.
స్వప్న నష్టాల స్థితికి చేరడానికి కారణాలు ఏవి? కింది అంశాలను చర్చించండి.
క్రిమి సంహారక మందులు, వడ్డీవ్యాపారుల పాత్ర, శీతోష్ణస్థితి.
జవాబు:
1. క్రిమిసంహారక మందులు :
ఉపయోగించిన ఈ మందుల వల్ల చీడపోవడం లేదు – కారణం నాణ్యత లోపం, కలీ మందుల వ్యాపారం వంటివి. అందువలన రైతు నష్టపోవడం జరుగుతుంది.

2. వడ్డీ వ్యాపారుల పాత్ర :
రైతులకు అధిక వడ్డీలకు రుణాలను ఇచ్చి పంటలు పండిన తరువాత తమకు అమ్మమనే షరతు పెడతారు. తక్కువ రేటుకు కొంటారు. ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు. ఆ విధంగా వారు రెండు విధాలుగా లబ్ధి పొందుతారు.

3. శీతోష్ణస్థితి :
పంటలు పండటానికి వాతావరణం అనుకూలించాలి. అందుకే భారతీయ రైతు ఋతుపవనాలతో జూదం ఆడతాడు అంటారు. సకాలంలో వర్షాలు పడి పంటలు పండితే రైతు గెలిచినట్లు, పడవలసిన సమయంలో వర్షాలు పడక పడరాని సమయంలో వర్షాలు పడి అనావృష్టి, అతివృష్టి వంటి పరిస్థితులు ఏర్పడితే నష్టపోవాల్సి ఉంటుంది. అందువలన రైతులపై ప్రభావం చూపే ప్రధాన అంశాలుగా క్రిమిసంహారక మందులను, వడ్డీ వ్యాపారులను, శీతోష్ణస్థితి వంటి అంశాలను పేర్కొనవచ్చు.

9th Class Social Textbook Page No.109

ప్రశ్న 11.
ప్రజలు అనేక సామాజిక, సాంస్కృతిక విషయాల కోసం రుణాలు తీసుకుంటారు. వివాహ సమయాలలో చేసే అధిక ఖర్చుల కోసం వధూవరుల ఇద్దరి కుటుంబాలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ప్రాంతంలోని ప్రజలు చేసే అప్పులకు ఇతర కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మీ పెద్దలు, ఉపాధ్యాయుల నుండి సమాచారాన్ని సేకరించి తరగతిలో చర్చించండి.
జవాబు:
ఇతర కారణాలు ఉన్నాయి. అవి :

  1. అప్పటికే అప్పులలో ఉండటం,
  2. పంటలు సరిగా పండక అప్పులు తీర్చకపోవడం,
  3. ఆభరణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం,
  4. కట్న, కానుకలకు అప్పులు చేయడం,
  5. తామే గొప్పగా కనిపించాలి అని అనుకోవడం,
  6. అనారోగ్య పరిస్థితులకు లోనుకావడం వంటి అంశాల వలన కూడా అప్పులు చేస్తారు.

9th Class Social Textbook Page No.110

ప్రశ్న 12.
రుణదాతలు అప్పు ఇవ్వడానికి ఎందుకు పూచీకత్తును అడుగుతారు?
జవాబు:

  1. అప్పు తీసుకునేవారు తమ సొంత ఆస్తులైన భూమి, భవనాలు, వాహనం, పశుసంపద, బ్యాంకులలో డిపాజిట్లు మొదలైన వాటిని పూచీకత్తుగా చూపిస్తారు.
  2. ఇవన్నీ అప్పు పూర్తిగా తీర్చే వరకు రుణదాతకు హామీగా ఉపయోగపడతాయి.

ప్రశ్న 13.
అప్పు తీసుకోవడంలో పూచీకత్తు పేదవారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:

  1. అప్పు తీసుకోవడంలో పూచీకత్తు ప్రధానపాత్ర పోషిస్తుంది.
  2. పూచీకత్తు లేకపోతే ఎవరూ వడ్డీకి ఇవ్వడానికి ముందుకు రారు.
  3. ఒకవేళ ఇచ్చినా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు.
  4. పేదవారిని తమ వద్ద పనిచేయమని ఒత్తిడి చేస్తారు.
  5. తక్కువ కూలీ ఇస్తారు. తప్పనిసరి పరిస్థితులలో వారు చెప్పే షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 14.
సరియైన సమాధానమును ఎంచుకొని ఖాళీలను పూరించండి.
అప్పు తీసుకునేటప్పుడు రుణగ్రహీతలు సులభమైన షరతుల కోసం ఎదురుచూస్తారు. దీని అర్థం ……….. (అధిక / అత్యల్ప) వడ్డీరేటు, ………….. (సులభమైన / కష్టమైన) షరతులతో కూడిన చెల్లింపులు, ……………….. (తక్కువ / ఎక్కువ) సంఖ్యలో చూపాల్సిన పూచీకత్తుగా ఉపయోగపడే ఆస్తులు.
జవాబు:
అత్యల్ప, సులభమైన, తక్కువ.

9th Class Social Textbook Page No.111

ప్రశ్న 15.
పై ఉదాహరణలలో రుణం పొందడానికి ఉపయోగపడే వనరుల జాబితాను రాయండి.
జవాబు:

  1. భూమికి సంబంధించిన వివరాల పత్రం.
  2. పండిన పంటను దాచినట్లు చూపే పత్రం.

ప్రశ్న 16.
అందరికీ రుణం తక్కువ వడ్డీ రేటుతో లభిస్తుందా? ఎవరెవరికి లభిస్తుంది?
జవాబు:
అందరికీ రుణం తక్కువ వడ్డీకి లభించదు.

ఎవరికి లభిస్తుంది అనగా : పంట పొలాలున్న రైతులకు, వ్యాపారస్థులకు, పారిశ్రామికవేత్తలకు, ఇటీవలికాలంలో ఏర్పడిన స్వయం సహాయక బృందాలకు, పండిన పంటలను గోదాములలో దాచినట్లు చూపే హామీపత్రాలు ఉన్న రైతులకు తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంకులు రుణాలు అందిస్తాయి.
సరియైన సమాధానం వద్ద (✓) గుర్తును ఉంచండి.
అ. కాలం గడిచే కొద్దీ రమ చేసిన అప్పు
– పెరుగుతుంది. (✓)
– స్థిరంగా ఉంటుంది.
– తగ్గుతుంది.

ఆ. బ్యాంకు నుండి రుణం పొందిన కొద్ది మందిలో అరుణ్ కూడా ఒకడు. దీనికి కారణం
– అతను విద్యావంతుడు.
– బ్యాంకు అడిగే పూచీకత్తును ప్రతి ఒక్కరూ సమర్పించలేరు. (✓)
– వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు విధించే వడ్డీరేటు ఒక్కటే.
– బ్యాంకు రుణం పొందుటకు ఎటువంటి దస్తావేజులు (పత్రాలు) అవసరం లేదు.

ప్రశ్న 17.
మీ ప్రాంతంలోని కొందరిని కలిసి మీ దగ్గర ఉన్న రుణ ఏర్పాట్ల వివరాలు సేకరించండి. రుణ షరతులలో ఉన్న తేడాలను నమోదు చేయండి.
జవాబు:
నమ్మకం కలిగిన వ్యాపారస్థుల నుండి, భూస్వాముల నుండి బ్యాంకులు ఏ విధమైన హామీలు లేకపోయినా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి.

అదే పేదవారు అయితే బ్యాంకులకు నమ్మకం ఉండదు. అందువలన వారినీ పూచీకత్తులు అడుగుతాయి.

పూచీకత్తులు చూపించిన తదుపరి రుణాలను అందజేస్తాయి.

ప్రశ్న 18.
శివకామి, అరుణ్, రమ, వాసులకు సంబంధించిన కింది వివరాలు పట్టికలో నింపండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం 1

9th Class Social Textbook Page No.114

ప్రశ్న 19.
నియత, అనియత వనరుల నుండి పొందే రుణాలలో గల భేదాలు ఏవి?
జవాబు:

  1. ధనిక కుటుంబాలు తక్కువ వడ్డీతో నియత రుణాలను పొందుతూ ఉంటే పేద కుటుంబాలు అధిక వడ్డీతో అనియత రుణాలను పొందుతున్నారు.
  2. అనగా నియత వనరులు ధనికులకు అందుబాటులో ఉన్నాయి. పేదలకు అందుబాటులో లేవు.
  3. నియత వనరులు తక్కువ వడ్డీరేటుకు లభిస్తాయి. అనియత వనరులకు ఎక్కువ వడ్డీరేటు ఉంటుంది.
  4. నియత వనరులు బ్యాంకులు ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు.
  5. అనియత వనరులు వడ్డీ వ్యాపారస్థుల ద్వారా, వర్తకుల ద్వారా, యజమానుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా పొందే రుణాలు.

ప్రశ్న 20.
ప్రతి ఒక్కరికి సముచితమైన వడ్డీ రేట్లతో ఉన్న రుణాలు ఎందుకు అందుబాటులో ఉండాలి?
జవాబు:

  1. పేదవారు అనియత రుణాలపై ఆధారపడటం వలన ఒక్కొక్కసారి తీసుకున్న మొత్తం సొమ్ము కన్నా వడ్డీ ఎక్కువగా ఉంటుంది.
  2. దానితో వారు తిరిగి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడతారు. అందువలన వడ్డీరేటు ఎల్లప్పుడు తక్కువగా ఉండాలి.
  3. వడ్డీరేటు తక్కువగా ఉండే రుణాలు నియత రుణాలు. అనగా బ్యాంకులు, సహకార సంస్థలు ఇచ్చేవి.
  4. అందువలన నియత వనరుల రుణాలు మరిన్ని ప్రదేశాలకు విస్తరించి ప్రతి ఒక్కరూ పొందేలా ఉండాలి.
  5. దానితో పేదప్రజలు తక్కువ వడ్డీపై రుణాలను పొందగలుగుతారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 21.
ఆర్.బి.ఐ లాగానే అనియత రుణాలకు పర్యవేక్షణాధికారి ఉండాలా? ఈ పని ఎందుకు కష్టతరం?
జవాబు:

  1. ఆర్.బి.ఐ లాగానే అనియత రుణాలకు పర్యవేక్షణాధికారి ఉండాలి. కానీ చాలా కష్టం.
  2. ఎందుకంటే అనియత రుణాలు ఎవరు ఇచ్చారు? ఎవరు తీసుకున్నారు? అనేది వివాదాస్పదం అయితే తప్ప ఎవరికీ తెలియదు.
  3. ఏ వడ్డీ వ్యాపారస్థుడైనా లేదా ఏ ధనవంతుడైనా మేము ఇంత పైకము వడ్డీకి ఇచ్చాము అని సమాచారాన్ని ఎవరికీ చెప్పరు.
  4. అంతేకాక ఆ లావాదేవీలన్నీ అనధికారికంగా జరుగుతాయి. అధికారికంగా వెల్లడి చేయరు.
    అందువలన పర్యవేక్షణాధికారి ఉండలేరు.

ప్రశ్న 22.
ఆంధ్రప్రదేశ్ రైతుల నిస్పృహకు పేదవారికి నియత రుణాలు తక్కువగా అందడం కూడా ఒక కారణమా? చర్చించండి.
జవాబు:

  1. అవును, అదీ ఒక కారణమే ఎందుకో మన ప్రభుత్వం చెప్పినంతగా బ్యాంకులు వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వడం లేదు.
  2. వ్యవసాయం చేసే వారిలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉండటం, వారికి యజమాన్యపు హక్కు లేకపోవడం వలన వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు.
  3. దానితో వారు నిరాశ నిస్పృహలతో ప్రయివేటు వ్యక్తులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీకి రుణాలను పొందవలసి వస్తున్నది.

9th Class Social Textbook Page No.115

ప్రశ్న 23.
బ్యాంకు నుండి పొందే రుణానికి స్వయం సహాయక బృంద సభ్యురాలిగా పొందే రుణానికి గల భేదాలు ఏమిటి?
జవాబు:

  1. బ్యాంకు నుండి పొందే రుణం వ్యక్తిగతం. :
  2. స్వయం సహాయక బృంద సభ్యురాలుగా పొందే రుణం సమష్టిది.
  3. బ్యాంకు నుండి రుణాన్ని వ్యక్తిగతంగా ఎప్పుడైనా తిరిగి చెల్లించవచ్చు.
  4. స్వయం సహాయక బృంద సభ్యురాలుగా పొందే రుణం సభ్యులందరితో కలసి సమష్టిగా చెల్లించాలి.
  5. బ్యాంకు నుండి పొందేది వ్యక్తిగత బాధ్యత. 6. స్వయం సహాయక బృందం పొందేది సమష్టి బాధ్యత.

ప్రశ్న 24.
కొన్ని స్వయం సహాయక బృందాలు’ వారి సభ్యులు తీసుకునే రుణాలకు అధిక వడ్డీని వసూలు చేస్తాయి. ఈ చర్య సరియైనదేనా? చర్చించండి.
జవాబు:

  1. సరియైనది కాదు ఎందువలననగా అన్ని స్వయం సహాయక బృందాలూ ఒకే రకమైన వడ్డీలు వసూలు చేయాలి.
  2. అందరీ పట్లా సమానత పాటించాలి.
  3. ఏ విధమైన వ్యత్యాసం చూపించరాదు.
  4. దానితో వారిలో ఆత్మస్టెర్యం పెరిగి ధైర్యంతో కొత్త కొత్త పనులు చేయడానికి, నూతన ఉత్పత్తులు చేయడానికి ముందుకు వస్తారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 25.
స్వయం సహాయక బృందాల సమాఖ్య యొక్క పాత్ర ఏమిటి?
జవాబు:

  1. స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేదప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి.
  2. మహిళలు స్వయం కృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం , పోషణ, గృహ హింస మొదలైన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే వేదికగా కూడా స్వయం సహాయక బృందాల సమావేశాలు తోడ్పడతాయి.

ప్రాజెక్టు

మీ ప్రాంతంలో ఏ రైతు అయినా ఆత్మహత్య చేసుకున్నాడా? అయితే దానికి కారణాలను తెల్సుకొని ఒక రిపోర్టు తయారు చేసి, వార్తాపత్రికలలో దీనికి సంబంధించిన వార్తలను సేకరించి మీ తరగతి గదిలో చర్చించండి.

మా ప్రాంతంలో ఒకప్పుడు రామయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం అప్పట్లో అనావృష్టి పరిస్థితి ఏర్పడి ఆరుగాలం శ్రమించి కష్టపడి వేసుకున్న పంట చేతికి రాక ఎండిపోతే దానికి పెట్టిన పెట్టుబడి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

రిపోర్టు :

అయ్యా,
న్యూస్ పేపర్ మేనేజర్ గారికి
మా ప్రాంతంలో ఒకప్పుడు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి నెలకొన్నది. వర్షాలు లేక నదులు ఎండిపోయి కాలువల ద్వారా నీరు రాక బావులలో సైతం ఊటలేక ‘చెరువులు ఎండిపోయి తత్ఫలితంగా పొలాలలో వేసిన పంటలు ఎండిపోయి, రైతులు పెట్టిన పెట్టుబడి రాక కుమార్తె పెండ్లి కుదుర్చుకొని పంట పండితే వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో కుమార్తెకు కట్నకానుకలు ఇచ్చి వివాహం చేద్దామనికొని నిర్ణయించుకున్న రామయ్య అనే రైతు చివరికి పెట్టిన పెట్టుబడి కూడా రాక వేసిన పంట ఎండిపోవడం చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి మేనేజర్ గారు దీనిని వార్తా పత్రికలయందు ప్రచురించి ఇలాంటి నిర్ణయాలు ఎవరిని తీసుకోవద్దు, బ్రతికి ఉంటే ఈ సంవత్సరం పంట పండకపోయిన వచ్చే సంవత్సరం పండుతుంది. ప్రభుత్వం ‘ఈసారి ముందుగానే పరిస్థితిని అంచనావేసి తగిన నిర్ణయాలు తీసుకొని చక్కని ప్రణాళికను రూపొందించి రైతులను ఆదుకుంటుంది, ప్రకృతి సహకరిస్తుంది’ అని రైతులకు తెలియజేయండి. వారిలో మనో ధైర్యాన్ని నింపండి.

ఇట్లు,
రామతేజ,
9వ తరగతి.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

9th Class Social Studies 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
………………….., …………….. ల కోసం బ్రిటను ఇతర దేశాలపై ఆధారపడలేదు. (శ్రామికులు, ముడి సరుకులు, పెట్టుబడి, . ఆవిష్కరణలు) (AS1)
జవాబు:
పెట్టుబడి, శ్రామికులు.

ప్రశ్న 2.
పారిశ్రామిక విప్లవకాలంలో ప్రధానమైన రెండు రవాణా మార్గాలు ………… (రోడ్డు, వాయు, జల, రైలు) (AS1)
జవాబు:
జల, రైలు.

ప్రశ్న 3.
పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో కింది వాటి గురించి రెండు వాక్యాలు రాయండి. (AS1)
అ) సాంకేతిక విజ్ఞానం
ఆ) ఆర్థిక వనరులు సమకూర్చడం, డబ్బులు
ఇ) వ్యవసాయిక విప్లవం
డి) రవాణా వ్యవస్థలు
జవాబు:
అ) సాంకేతిక విజ్ఞానం :
పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో సాంకేతిక విజ్ఞానం ప్రధాన పాత్ర పోషించింది. చేతివృత్తులు, చేతి యంత్రాలు వల్ల పెద్ద ఎత్తున సరుకులు ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. వాణిజ్య కార్యకలాపాలకు పేరు గడించడానికి అనేక పరిశ్రమలు స్థాపించి, ప్రపంచ కర్మాగారంగా ఇంగ్లాండ్ పిలువబడడానికి కారణం సాంకేతిక విజ్ఞానమే.

ఆ) ఆర్థిక వనరులు సమకూర్చడం, డబ్బులు :
కొత్త యంత్రాలు, సాంకేతిక విజ్ఞానంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన ఇంగ్లాండ్ లో సంపద అనంతంగా ఉండడం వల్ల పెట్టుబడి సమకూర్చుకోవడానికి ఇబ్బంది పడలేదు. ప్రపంచ దేశాలతో వాణిజ్య కార్యకలాపాల వలన అధికంగా ఆర్థిక వనరులు సంపాదించింది. ఈ ఆర్థిక వనరులను సరైన పద్ధతిలో ఉపయోగించారు. డబ్బును అధికం చేయడంలో ఇంగ్లాండ్ బ్యాంక్ ప్రధానపాత్ర పోషించింది. లండన్ విత్తమార్కెట్, ఉమ్మడి స్టాక్ బ్యాంకు, ఉమ్మడి స్టాక్ కార్పొరేషన్ ఏర్పడడంతో ఆర్థిక వనరులు, డబ్బు. పుష్కలంగా సమకూరాయి. సరుకులు, ఆదాయాలు, సేవలు, జ్ఞానం, ఉత్పాదక సామర్థ్యం వంటి రూపాలలో ఆర్థిక వనరులు వృద్ధి చెందాయి.

ఇ) వ్యవసాయిక విప్లవం :
బ్రిటిష్ జనాభా పారిశ్రామికీకరణ వల్ల పెరిగింది. లాభసాటికాని, పాతకాల వ్యవసాయ పద్ధతుల స్థానంలో కొత్త సాగు పద్ధతులు అంటే శాస్త్రీయంగా పంటలమార్పిడి వంటివి అనుసరించసాగారు. దీనివల్ల అధికంగా ఆహార ఉత్పత్తి పెరిగింది.

ఈ) రవాణా వ్యవస్థలు :
ముడి సరుకులు, ఉత్పత్తి అయిన వస్తువులను ప్రపంచ నలుమూలలకు చేర్చడానికి, లాభసాటి వ్యాపారాలు చేయడానికి రవాణా వ్యవస్థ ప్రధానపాత్ర పోషించింది. ముఖ్యంగా, రైలు, జల మార్గాలు పట్టణాలకు ఇనుము, బొగ్గును సమీప పట్టణాలకు ప్రయాణీకులను, సరుకులను వేగంగా, తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి తోడ్పాటు నందించాయి.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
పారిశ్రామిక విప్లవ సమయంలో జరిగిన ఆవిష్కరణల ప్రత్యేకత ఏమిటి? (AS1)
జవాబు:
యాంత్రీకరణకు అవసరమైన ప్రధాన ముడి సరుకులైన బొగ్గు, ఇనుప ఖనిజాలతో పాటు పరిశ్రమలలో వినియోగించే సీసం, రాగి, తగరం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఇంగ్లాండ్లో లభించేవి. ఇనుప ఖనిజం నుంచి దానిని కరిగించే ప్రక్రియ (స్మెల్టింగ్) ద్వారా స్వచ్ఛమైన ఇనుమును ద్రవరూపంలో తీస్తారు. కొన్ని శతాబ్దాల పాటు కలపను కాల్చటం నుంచి బొగ్గుతో ఇనుమును కరిగించేవారు. తద్వారా అడవులు మొత్తం నాశనమయ్యాయి. ఇటువంటి తరుణంలో ‘కమ్మరం” పనిచేసే ప్రాప్ షైర్ కి చెందిన డర్బీలు 3 తరాలు ద్వారా కోక్ (బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది) ని ఉపయోగించే ఈ బట్టీలో అధిక ఉష్ణోగ్రతలు సాధించగలిగారు. ఈ ఆవిష్కరణల కారణంగా కలప, బొగ్గుపై బట్టీలు ఆధారపడటం తప్పిపోయింది. బొగ్గు, లోహాలను లోతైన గనుల నుంచి వెలికి తీసే క్రమంలో గనులు తరుచు నీటి ముంపునకు గురయ్యేవి. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రంతో ఈ సమస్య పరిష్కారమైంది. రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో “మెడం” ద్వారా పక్కా రోడ్లు తయారుచేసే విధానం మరింత ప్రాధాన్యత పెంచింది. స్టీఫెన్సన్ యొక్క ఆవిరి రైలింజన్ ద్వారా విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

ఈ విధంగా పారిశ్రామిక ప్రగతిగ పురోభివృద్ధి సాధించడంలో ఆవిష్కరణలు ప్రధానపాత్ర పోషించాయి.

ప్రశ్న 5.
పారిశ్రామిక విప్లవం వల్ల బ్రిటిష్ మహిళలలోని వివిధ వర్గాలు ఏవిధంగా ప్రభావితమయ్యా యి? (AS1)
(లేదా)
“పారిశ్రామిక విప్లవం వలన బ్రిటిష్ సమాజంలోని అన్ని తరగతుల మహిళలూ ప్రభావితమయ్యారు” – వ్యాఖ్యానించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవం వల్ల మహిళల జీవన విధానంలో అనేక మార్పులు సంభవించాయి. ముందుగా – మహిళలు వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, పశుపాలన చేస్తూ, కట్టెపుల్లలు తెచ్చేవాళ్ళు. ఇంటి దగ్గర రాట్నం మీద నూలు వడికే వాళ్ళు. అయితే కర్మాగారాలలో పని పూర్తిగా మారిపోయింది. వ్యవసాయ విప్లవంతో వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల జీవన గమనంలో అనేక మార్పులు సంభవించాయి. విరామం లేకుండా చాలా గంటల సేపు ఒకే పని చేస్తూ ఉండేవారు. ఆ పనిపై పర్యవేక్షణ, తప్పులకు శిక్షలు కఠినంగా ఉండేవి. పురుషుల కంటే తక్కువ కూలీకి పనిచేయడానికి సిద్దపడే మహిళలను పనిలో పెట్టుకొనేవాళ్ళు. లాంక్ షైర్, యార్క్ షెర్లలోని నూలు వస్త్ర పరిశ్రమల్లో మహిళలను పెద్ద సంఖ్యలో పెట్టుకునేవాళ్ళు. పట్టు, లేసు తయారీ అల్లిక పరిశ్రమల్లో, బర్మింగ్ హాంలోని లోహ పరిశ్రమల్లో మహిళలే ప్రధాన కార్మికులుగా ఉండేవారు.

ప్రశ్న 6.
కాలువల ద్వారా, రైళ్ళ ద్వారా రవాణాలలోని లాభాలు ఏమిటి? (AS1)
జవాబు:
పారిశ్రామిక విప్లవం ఫలితంగా ప్రపంచ దేశాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ పోటీని తట్టుకొని ప్రపంచ దేశాలను ఆకర్పించడానికి పటిష్టమైన రవాణా వ్యవస్థ బాగా ఉపయోగపడింది. రవాణా రంగంలో ప్రధానంగా కాలువలు, రైళ్ళు ముఖ్యమైనవి. కాలువల ద్వారా అనేక ప్రయోజనాలను గమనించవచ్చు. ముడి సరుకులను, ఉత్పత్తి అయిన వస్తువులను సురక్షితంగా, తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు, చేర్చడానికి ముఖ్యమైనది. కాలువల ద్వారా, బొగ్గు, ఇనుము వంటి వాటిని సమీప పట్టణాలకు చేరవేయవచ్చును. కాలువల ద్వారా ప్రయాణ దూరం కూడా సగానికి “పైగా తగ్గుతుంది. కాలువల వలన. వ్యవసాయ భూమి విలువ పెరగడమేగాక సారవంతమవుతుంది. ఎక్కువ దిగుబడితో ఉత్పత్తులు పెరగడానికి కాలువలు దోహదపడతాయి.

రైళ్ళ ద్వారా సుఖవంతమైన, విలాసవంతమైన ప్రయాణం సాధ్యం. అధిక లోడు, అధిక టన్నుల ఉత్పత్తులు గమ్యస్థానాలకు చేరడానికి రైలు రవాణా ముఖ్యమైనది. సరుకులను, ప్రయాణీకులను, ముడి పదార్థాలను వేగవంతంగా గమ్యస్థానాలకు చేర్చగలదు. కరవు, వరదలు, నీళ్ళు గడ్డకట్టడం, క్షామం , తుపానులు వంటి సందర్భాలలో అత్యవసర సేవలకు రైళ్ళు ముఖ్య మైనవి.

ప్రశ్న 7.
పారిశ్రామిక విప్లవ కాలంలో ఇంగ్లాండ్ లో వస్త్ర, ఇనుము పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్న ప్రదేశాలను పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
1. ఇంగ్లాండ్ లో ఇనుము పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతాలు :
AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 1

2. బ్రిటన్ లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతాలు :
AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 2

ప్రశ్న 8.
పారిశ్రామిక విప్లవ కాలంలో ఆవిష్కరణలకు సంబంధించిన పట్టికను తయారుచేయండి.
జవాబు:

  • జేమ్స్ వాట్ – ఆవిరి యంత్రం
  • స్టీఫెన్సన్ – ఆవిరి రైల్వే ఇంజన్
  • మెక్కం – పక్కా రోడ్లు తయారుచేసే విధానం
  • హార్ గ్రీవ్స్ – నూలు వడికే యంత్రం
  • మొదటి అబ్రహాం డర్బీ – కోక్ (బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది)
  • రెండవ డర్బీ – ఇనుము నుండి (తేలికగా విరిగిపోని) దుక్క ఇనుమును తయారుచేయుట.
  • హెన్రీ కోర్ట్ – కలబోత బట్టీ (దీంతో కరిగిన ఇనుములోని కలుషితాలు తొలగించవచ్చు.)
  • క్రుప్ కుటుంబం – క్షేత్ర ఫిరంగుల కర్మాగారం. రైలు పెట్టెలు, ఆయుధ తయారీ.
  • వెర్నెర్ సీమెన్స్ – విద్యుత్ డైనమో కనుగొన్నాడు.
  • ఎడ్మండ్ కార్డ్ రైట్ – నీటి సహాయంతో నడిచే మరమగ్గం
  • సామ్యుల్ క్రాంప్టన్ – మ్యూల్ అనే మెరుగైన యంత్రం (దీని వలన నాణ్యమైన నూలు ఉత్పత్తి పెరిగెను).
  • ఆర్కిరైట్ – జలశక్తితో మెరుగైన మగ్గాన్ని కనుగొనెను.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 9.
ఓ నెం. 191లోని “కార్మికులు” అనే శీర్షిక కింద ఉన్న పేరాను చదివి వ్యాఖ్యానించండి?
జవాబు:
పారిశ్రామికీకరణ, సామాజిక మార్పులో భాగంగా కార్మికులు తమ జీవనాన్ని దుర్భరంగా గడిపారు. కార్మికుల సగటు జీవితకాలం చాలా తక్కువ. బర్మింగ్ హాంలో 15 సంవత్సరాలు, మాంచెస్టర్ లో 17, డర్బీలో 21 సంవత్సరాలుగా ఉండేది. చిన్న వయసులో మరణాలు అధికంగా ఉండడమే కాకుండా, చిన్న పిల్లల్లో 50 సంవత్సరాల లోపు మరణాలు సంభవిస్తుండేవి. నీటి కాలుష్యం వల్ల వ్యాపించే కలరా, టైఫాయిడ్, గాలి కాలుష్యం వల్ల క్షయ వంటి అంటువ్యాధుల వల్ల మరణాలు ఎక్కువగా ఉండేవి. కలరా వ్యాపించడం వలన 1832లో 31,000 పైగా ప్రజలు చనిపోయారు. ఆ రోజుల్లో ప్రజలు అనుభవిస్తున్న రోగాలకు తగిన వైద్య సహాయం, వైద్య విజ్ఞానం అందకపోవడం, లేకపోవడం కూడా కార్మికులు, దీన స్థితిలో బ్రతకడానికి దోహదపడ్డాయి.

9th Class Social Studies 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు InText Questions and Answers

9th Class Social Textbook Page No.186

ప్రశ్న 1.
పారిశ్రామిక విప్లవకాలంలో మహిళలు, పిల్లలు ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక విప్లవ కాలంలో మహిళలు, పిల్లలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. పేద ప్రజల పిల్లలు ఇళ్ళల్లో, పొలాల్లో పనిచేస్తుండేవాళ్ళు. పగటిపూట ఎక్కువ పనిగంటలు చేస్తుండేవారు. లోహ పరిశ్రమల్లో పిల్లలు కూడా పని చేసేవాళ్ళు. బొగ్గు గనుల వంటి ప్రమాదకర పనులు సైతం పిల్లలు చేసేవారు. మహిళలు తక్కువ కూలీకి పనిచేయటానికి సిద్ధపడేవారు. విరామం లేకుండా మహిళలు పని చేసేవారు. తక్కువ కూలీ అందించేవారు. పట్టు, లేసు తయారీ, అల్లిక పరిశ్రమల్లో, లోహపరిశ్రమల్లో పని చేస్తూ మహిళలు అనేక కష్టాలు అనుభవించేవారు.

9th Class Social Textbook Page No.187

ప్రశ్న 2.
బ్రిటిష్ లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించిన 18వ శతాబ్దం నాటి బ్రిటన్, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల పరిణామాలను చర్చించండి.
జవాబు:
ఆధునిక పారిశ్రామికీకరణను చవిచూసిన మొట్టమొదటి దేశం బ్రిటన్. బ్రిటన్ యూరప్ దేశాలన్నింటికంటే ముందే ఉత్పత్తిలో గణనీయమైన మార్పులను సాధించి, దాని ఫలితంగా ప్రపంచ కర్మాగారంగా గౌరవించబడింది. పరిశ్రమలు స్థాపించబడి అభివృద్ధి చెందటానికి బ్రిటన్‌కు ఎన్నో సానుకూల పరిస్థితులే కాకుండా అందుకు కావలసిన వనరులన్నీ ఉన్నాయి. ఇతర దేశాలు, ప్రపంచంలోని, దేశాలు ఈ మార్పులను తరువాత చవిచూశాయి.

9th Class Social Textbook Page No.188

ప్రశ్న 3.
పారిశ్రామికీకరణకు నాణ్యమైన ఇనుము, ఉక్కు ఎందుకు కావాలి? తరగతిలో చర్చించండి.
జవాబు:
యాంత్రీకరణకు, పారిశ్రామిక ప్రగతికి ప్రధాన ముడిసరుకు ఇనుము, ఉక్కు. ఇనుప ఖనిజం నుంచి దానిని కరిగించే ప్రక్రియ ద్వారా స్వచ్చమైన ఇనుమును ద్రవరూపంలో తీయవచ్చు. ఇనుము, ఉక్కుతో ఎన్నో రకాల వస్తువులను తయారు చేయవచ్చు. రోజువారీ వస్తువులలో కలపతో చేసిన భాగాలతో పోలిస్తే ఇనుముతో చేసిన వస్తువులు ఎక్కువ కాలం మనగలుగుతాయి. కలపతో చేసిన వస్తువులు కాలిపోయి, ముక్కలు అయ్యే ప్రమాదముంది. ఇనుము నాశనం కాకుండా, దాని యొక్క భౌతిక రసాయనిక, గుణాలను నియంత్రించవచ్చు.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
ఇనుప ఖనిజం, బొగ్గు తవ్వకాలకు సమాన ప్రాధాన్యత ఎందుకు లభించింది?
జవాబు:
పారిశ్రామికీకరణకు ముఖ్యమైనవి బొగ్గు, ఇనుము. ఇనుము, బొగ్గు పరిశ్రమల ఆధారంగా నాగరికతను ప్రపంచమంతా అనుకరించింది. బొగ్గును ఇనుమును కరిగించే ప్రక్రియలో ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్కసారి ఒకే గనిలో నాణ్యమైన . బొగ్గు, ఇనుప ఖనిజాలు లభించేవి. ముడిసరుకులకు, వస్తూత్పత్తికి, బొగ్గు, ఇనుముకు సమాన ప్రాధాన్యత ఉండేది. ముడి ఇనుము తయారు చేయటానికి టన్నుల కొద్దీ బొగ్గు అవసరమయ్యేది. ఈ విధంగా బొగ్గు, ఇనుముకు సమాన ప్రాధాన్యత లభించింది.

ప్రశ్న 5.
తొలినాటి పారిశ్రామిక కేంద్రాలు ఇనుము, బొగ్గు గనుల దగ్గర ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
యాంత్రీకరణకు ప్రధానమైనవి ఇనుము, బొగ్గు. వస్తువుల ఉత్పత్తికి, బొగ్గు, ఇనుము ద్వారా తయారీకి ఆయా దేశాలు ప్రాధాన్యతనందించేవి. సులభంగా రవాణాకు, సమీప పట్టణాలకు తరలించటానికి, ప్రపంచ వ్యాప్తంగా తయారైన వస్తువులకు మార్కెట్ కల్పించడానికి,. బహుళ ప్రచారం చేయడానికి గాను ఇనుము, బొగ్గు గనుల దగ్గర పారిశ్రామిక కేంద్రాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 6.
వస్త్ర పరిశ్రమను విప్లవాత్మక మార్పులకు గురిచేసిన రెండు ముఖ్యమైన ఆవిష్కరణలు పేర్కొనండి.
జవాబు:
వస్త్ర పరిశ్రమను విప్లవాత్మక మార్పులకు గురిచేసిన రెండు ముఖ్యమైన ఆవిష్కరణలలో జేమ్స్ వాట్ 1769లో కనిపెట్టిన ఆవిరి యంత్రం ఒకటి.. దీనివలన వస్తూత్పత్తి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. అదే విధంగా రెండోది 1770లో జేమ్స్ హార్ గ్రీవ్స్ కనిపెట్టిన “స్పిన్నింగ్ జెన్ని” (నూలు వడికే యంత్రం). దీనివలన నాణ్యమైన వస్త్రాలు ఉత్పత్తి అయ్యాయి.

9th Class Social Textbook Page No.193

ప్రశ్న 7.
మహిళలు, పిల్లలపై పారిశ్రామికీకరణ చూపిన రెండు ముఖ్యమైన ప్రభావాలను పేర్కొనండి.
జవాబు:
నూలువడికే జెన్ని’ వంటి చిన్న యంత్రాలు తయారుచేసి పిల్లలను పనిలో నియమించేవారు. దీర్ఘకాల పనిగంటలు, ఆదివారాల నాడు యంత్రాలను శుభ్రం చేయటం వంటి పనుల వల్ల పిల్లలకు తాజా గాలి, తగినంత వ్యాయామం ఉండేవి కావు. పిల్లలు నిద్రలోకి జారుకుని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మహిళలు కూడా పనిచేస్తూ ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం పెంచుకున్నా వారి జీవితాలు దుర్భరంగా ఉండేవి. ప్రసవ సమయంలో లేదా చాలా చిన్న వయసులోనే పిల్లలు చనిపోయేవాళ్ళు. లోహ పరిశ్రమల్లో పట్టు, లేసు తయారీ, అల్లిక పరిశ్రమల్లో ఎక్కువగా మహిళలు పని చేసేవాళ్ళు.

9th Class Social Textbook Page No.194

ప్రశ్న 8.
తొలి పారిశ్రామికీకరణ వల్ల బ్రిటిష్ పల్లెలు, పట్టణాలపై ప్రభావాలను, భారతదేశంలో అదే పరిస్థితులలోని ప్రభావాలతో పోల్చండి.
జవాబు:
తొలి పారిశ్రామికీకరణ బ్రిటిష్ పల్లెలు, పట్టణాలపై చాలా ప్రభావాన్ని చూపింది. అనేక సమస్యలకు లోనై, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. జనాభా పెరుగుదలకు దీటుగా గృహవసతి, తాగటానికి శుభ్రమైన నీళ్ళు, పారిశుద్ధ్యం వంటివి పెరగలేదు. మురికివాడలలో నివసిస్తూ, కలరా, టైఫాయిడ్, క్షయ వంటి అంటు వ్యాధుల వలన అనేక వేలమంది చనిపోయారు.

భారతదేశంలో కూడా వలస పాలన వలన చేతివృత్తులు, కులవృత్తులు నశించి, వ్యవసాయరంగంలో ఆహార పదార్థాల • ఉత్పత్తి తగ్గిపోయి, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత నిచ్చారు. అనేక ప్రాంతాలలో కరువు కాటకాలు, మలేరియా, టైఫాయిడ్, క్షయవంటి జబ్బులు కమ్ముకున్నాయి. స్వచ్ఛమైన గాలి, మంచినీరు దొరకక ప్రజలు అల్లాడిపోయారు. వైద్యశాస్త్రం నిర్లక్ష్యం
చేయబడింది.

9th Class Social Textbook Page No.195

ప్రశ్న 9.
జర్మనీ, ఫ్రాన్లలో పారిశ్రామికీకరణలను పోల్చండి. పోలికలు, తేడాలను గుర్తించండి.
జవాబు:
పోలికలు :
జర్మనీ, ఫ్రాన్స్ రెండు దేశాలు, ఇంగ్లాండ్ బాటలో నడవడానికి ప్రయత్నించాయి. ఇవి పారిశ్రామికీకరణ ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని తలంచాయి. రోడ్డు, రైలు మార్గాలు పారిశ్రామికీకరణకు రెండు దేశాలు ప్రాధాన్యతనిచ్చాయి.

తేడాలు :

జర్మనీ :
కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని జర్మనీ పరిశ్రమలు దిగుమతి చేసుకున్నాయి. పారిశ్రామికీకరణకు కావలసిన డబ్బులను పెద్ద పెద్ద బ్యాంకులు సమకూర్చాయి. జర్మనీ కొత్తతరం పరిశ్రమలైన ఇనుము – ఉక్కు రసాయనిక, విద్యుత్ పరిశ్రమలను అభివృద్ధి చేసింది. బ్రిటనను మించిపోయింది. బలమైన పారిశ్రామిక శక్తిగా జర్మనీ వెలుగొందింది.

ఫ్రాన్స్ :
ఫ్రాన్స్ ఇందుకు విరుద్ధంగా పారిశ్రామికీకరణను నిదానంగా కొనసాగించింది. 19వ శతాబ్దం చివరకు కూడా ఫ్రాన్స్ లో అధిక శాతం ప్రజలు చిన్న చిన్న కమతాలు సాగుచేసే దేశంగానే ఉంది. యాంత్రీకరణ కంటే మానవశక్తికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. ఫ్రాన్స్ లో ఆర్థిక కష్టాలు అధికంగా ఉండేవి. జర్మనీ అంత సాంకేతిక విజ్ఞానాన్ని, యాంత్రీకరణను ఫ్రాన్స్ దిగుమతి చేసుకోలేకపోయింది.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 10.
పారిశ్రామిక అభివృద్ధిలో ఫ్రాన్స్ వెనుకబడటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక అభివృద్ధిలో ఫ్రాన్స్ వెనుకబడటానికి కారణాలు :

  1. నిధుల సమస్య.
  2. ఇతర దేశాలు అభివృద్ధి చేసిన కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఫ్రాన్స్ అందుకోలేకపోయింది.
  3. గ్రామీణ శ్రామికులకు పని ఇవ్వటం వలన ఉత్పత్తి తగ్గుముఖం.
  4. బొగ్గు గనులు లేమి, దిగుమతులపై ఎక్కువ ఖర్చు.
  5. బట్టలు వంటి చిన్న పరిశ్రమలపై దృష్టి.
  6. ఎక్కువ పెట్టుబడిని ఇవ్వగల పెద్ద బ్యాంకులు ఫ్రాన్స్ లో లేకపోవడం.
  7. మానవ మేధస్సు తక్కువ.

ప్రశ్న 11.
పారిశ్రామిక ఉత్పత్తిలో ఇంగ్లాండ్, ఫ్రాన్లను అధిగమించటానికి జర్మనీకి దోహదం చేసిన అంశాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక ఉత్పత్తిలో ఇంగ్లాండ్, ఫ్రాన్లను జర్మనీ అధిగమించటానికి దోహదం చేసిన అంశాలు :

  1. బ్రిటన్, అమెరికా సాధించిన సాంకేతిక అభివృద్ధి వల్ల జర్మన్ పరిశ్రమల ప్రయోజనం.
  2. ప్రపంచ దేశాల సాంకేతిక విజ్ఞానం దిగుమతి చేసుకోవడం.
  3. పెద్ద పెద్ద పెట్టుబడుల్ని సమకూర్చగల బ్యాంకుల సహకారం.
  4. కొత్తతరం పరిశ్రమలైన రసాయనిక, విద్యుత్ పరిశ్రమల అభివృద్ధి.
  5. నూతన ఆలోచనా విధానం.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పారిశ్రామిక విప్లవ పరిణామాలు ఆర్థిక రంగంపై ఎలా ప్రభావం చూపాయో పేర్కొనండి. ఒక నివేదిక రాసి మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
నూతన ఆవిష్కరణలు, సాంకేతిక విజ్ఞానం, కొత్త యంత్రాల వినియోగంతో పారిశ్రామిక విప్లవం ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలలో పారిశ్రామికీకరణ వలన – సంపద అనంతంగా ఉండటంతో వస్తు ఉత్పత్తికి, ముడి పదార్థాల వినియోగానికి, రవాణా వ్యవస్థను వృద్ధి చేసుకోవడానికి పెట్టుబడి సమకూర్చుకోవడం తేలిక అయింది. 17వ శతాబ్దం ఆరంభం నుంచి ఇతర దేశాలతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు చేసి తద్వారా పెద్ద ఎత్తున లాభాలు గడించాయి.

పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆర్థిక వనరులతో పెట్టుబడిని రెండింతలు చేసి నిధులు మరింత పెంచుకోవడానికి దేశాలు బ్యాంకులలో ఆదా చేశాయి. అంతేకాకుండా సముద్రయానం చేసే పారిశ్రామికవేత్తలకు అధిక మొత్తంలో అధికవడ్డీకి డబ్బులు ఇచ్చి లాభాన్ని గడించాయి. విత్తమార్కెట్, స్టాక్ బ్యాంకు, స్టాక్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక పరిపుష్టి పెరిగింది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక చర్యలు వలన అధికంగా నిధులు సమకూరి ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

SCERT AP 6th Class Social Study Material Pdf 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

6th Class Social 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కళింగ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి నిర్ణయాలు ప్రపంచ శాంతిని పెంపొందిస్తాయని అనుకుంటున్నావా? ఎలా?
జవాబు:
అవును. భావిస్తున్నాను. ఎందుకనగా ……..

  • ప్రజలకు మరియు ఇతర రాజులకు యుద్ధ భయం ఉండదు.
  • యుద్దాలు లేనపుడు ఆయుధాల కొరకు ఎక్కువ మొత్తంలో సంపదను వెచ్చించనవసరం లేదు.
  • యుద్ధ భయం లేకపోతే ప్రజలందరు మనశ్శాంతితో, ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తారు.
  • యుద్దాల అవసరం లేనపుడు రాజు తన దృష్టిని ప్రజా సంక్షేమం వైపు మళ్లించవచ్చు.

ప్రశ్న 2.
నేటికాలంలో అశోకధర్మం యొక్క ప్రాముఖ్యతను వివరింపుము. అశోకధర్మం యొక్క గొప్పతనాన్ని వర్ణింపుము.
జవాబు:
నేటి కాలంలో అశోకధర్మం యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది.

అశోకధర్మం యొక్క ప్రధాన సూత్రాలు :

  • జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి.
  • తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి.
  • పేదల పట్ల సానుభూమి కలిగి ఉండాలి.
  • పెద్దలను గౌరవించవలెను.
  • ఇతర మతాలను విస్మరించరాదు.
  • మానవజాతి సంక్షేమానికి కృషి చేయాలి.
  • అశోకుని ధర్మం ప్రజలకు అనుకూలము ఆచరణీయము అయిన నైతిక సూత్రాలను కల్గి ఉంది.
  • ఉన్నతమైన జీవన విధానాన్ని అందించటమే అశోకుని ధమ్మ ఉద్దేశము.
  • ధర్మాపేక్ష, శ్రద్ధ, విధేయత, పాపభీతి, సామర్థ్యము లేకపోతే ఇహపరలోక సుఖాలను పొందలేరని బోధించాడు.
  • నేటి సమాజంలో వివిధ రూపాలలో జరుగుతున్న ‘హింసకు’ అశోకుని (అహింస) ధర్మము చక్కని పరిష్కారం.
  • అలాగే ‘పరమత సహనం’ అనే సూత్రం నేడు ఎంతో అవసరం. అనేక అల్లర్లకు, హింసకు, యుద్ధాలకు మత మౌఢ్యమే కారణం.
  • ఈ విధంగా అశోకుని క్క గొప్ప ధర్మం నేటికాలంలో ప్రాముఖ్యత కలిగి ఉంది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 3.
అశోకుని యొక్క ప్రజాపనులకు నేటికాలంలో ప్రజాప్రభుత్వాలు చేస్తున్న ప్రజా పనులకు పోలికలు మరియు భేదాలు తెలుపుము?
జవాబు:
అశోకుని యొక్క ప్రజాపనులకు నేటికాలంలో ప్రజాప్రభుత్వాలు చేస్తున్న ప్రజా పనులకు పోలికలు :

  • అశోకుడు, నేటి ప్రభుత్వాలు ప్రజాక్షేమమే తమ ప్రధాన ఆశయంగా భావించి వారి సంక్షేమము కొరకు అనేక చర్యలు చేపడుతున్నారు.
    నీరు, ఆహారం తమ ప్రజలందరికీ అందాలని అశోకుడు సంకల్పించాడు, నేటి ప్రభుత్వాలు కూడా సాగు, త్రాగు నీరు మరియు ఆహారం (రేషన్ షాపుల ద్వారా) ప్రజలందరికీ అందిస్తున్నాయి.
  • అశోకుడు దేశ వ్యాప్తముగా అనేక రహదారులను నిర్మించి, వాటి కిరువైపులా చెట్లు నాటించెను. నేటి ప్రభుత్వాలు కూడా దేశాభివృద్ధికై జాతీయ, రాష్ట్ర మొ||న రహదారులను నిర్మిస్తున్నాయి. అలాగే పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున చెట్లను (వన సంరక్షణ) నాటుట, సంరక్షించుట మొ||న చర్యలు చేపడుతున్నాయి.
  • అశోకుడు మానవులకే కాక జంతువుల కొరకై ప్రత్యేక వైద్య శాలలను నెలకొల్పను. నేటి ప్రభుత్వాలు కూడా దేశ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాట్లు చేసినాయి.

భేదాలు :

  • అశోకుని కాలంకంటే నేటి (ప్రభుత్వాల) కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందటం వలన ప్రజలకు ఎన్నో సౌకర్యాలు ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. ఉదా : డిజిటల్ సేవలు, రవాణా రంగంలోని సేవలు (రైలు విమానం మొ||నవి.)
  • నేటి కాలంలో ప్రజా పనులు చాలా విస్తృతంగా, ఖర్చుతో కూడుకుని ఉన్నాయి.

ప్రశ్న 4.
అశోకుడు తన సైన్యాన్ని యుద్ధం కోసం కాకుండా ప్రజాసేవకు వినియోగించాడు. ప్రస్తుత కాలంలో భారత సైన్యం యుద్ధాలలోనే కాకుండా పాల్గొనే ఇతర సహాయ కార్యక్రమాలేవి?
జవాబు:
భారత సైన్యం చేపడుతున్న సహాయ కార్యక్రమాలు :

  • ప్రకృతి విలయాల సందర్భంలో, తుఫానులు, భూకంపాలు, వరదలు మొ||న ప్రకృతి భీభత్సాలలో సాధారణ పౌరులను ఆదుకోవటానికి సైన్యం ఎంతో సహాయం చేస్తుంది.
  • పర్వతలోయల్లో, కొండల్లో ఎవరైనా అపాయంలో ఉన్నా, ప్రమాదాలు జరిగిన సైన్యం వారికి సహాయం అందిస్తుంది.
  • NCC (National Cadet Corps) లాంటి వానిద్వారా విద్యార్థులలో దేశభక్తిని, సైనిక శిక్షణను అందిస్తుంది.
  • ‘ఆపరేషన్ సద్భావన’ కార్యక్రమం ద్వారా భరత సైన్యం పౌరులకు అనేక రకాలుగా సేవలు అందిస్తుంది.
  • అంతర్గత కలహాలు, బాంబు ప్రేలుళ్ళు, హైజాకింగ్ మొ||న సందర్భాలలో సైన్యం ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 5.
గుప్తుల కాలంలో కళలు, సాహిత్యం మరియు వాస్తు నిర్మాణ రంగాలలో సాధించిన విజయాలేవి?
జవాబు:
గుప్తుల కాలంలో వివిధ రంగాలలో సాధించిన విజయాలు :
గుప్తుల కాలంలో సారస్వతం, గణితం, వైద్య శాస్త్రం మరియు ఖగోళశాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడినవి. అనేక కొత్త విషయాలు ఆవిష్కరించబడినవి. అందులో చెప్పబడిన జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం పేరుతో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రెండవ చంద్రగుప్తుని కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులు కలరు. వీరినే ‘నవరత్నాలు’ అంటారు. నవరత్నాలలో కాళిదాసు ప్రసిద్ధ కవి.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 2

NAVARATNAS నవరత్నాలు
కాళిదాసు సంస్కృత కవి, రచయిత
అమరసింహుడు నిఘంటుకర్త
శంకు భవన నిర్మాణ ఇంజనీరు
ధన్వంతరి ఫిజీషియన్, ఆయుర్వేద వైద్యుడు
క్షేపకుడు జ్యోతిష్య శాస్త్రవేత్త
ఘటకర్షకుడు సంస్కృత కవి, రచయిత, కవి
భేతాళబట్టు మంత్రశాస్త్ర కోవిదుడు
వరరుచీ గణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు
వరాహమిహురుడు ఖగోళ శాస్త్రవేత్త

అద్భుతమైన రాతి గుహలకు గుప్తుల కాలం ప్రసిద్ధి. వారి కాలంలో పెయింటింగ్ కు, వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 6.
భారతదేశంలో గుప్తుల కాలాన్ని “స్వర్ణయుగమని” ఎందుకు అంటారు?
జవాబు:
భారతదేశ చరిత్రలో గుప్తుల పాలనా కాలము ఒక మహోజ్వలమైన అధ్యాయము. శాస్త్ర విజ్ఞానం, జోతిష్య శాస్త్రం, గణితం మరియు సాహిత్య రంగాలలో గుప్తుల కాలంలో అనేక కొత్త విషయాలు కనుగొనుట జరిగినది. అందువలన గుప్తకాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అంటారు.

సాహిత్యరంగంలో అభివృద్ధి :
గుప్తుల కాలంలో సారస్వతం, గణితం, వైద్యశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడినవి. రెండవ చంద్రగుప్తుని కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులు కలరు. వీరినే నవరత్నాలు అంటారు. నవరత్నాలలో కాళిదాసు ప్రసిద్ధ కవి.

గణితశాస్త్రంలో ఆవిష్కరణలు :
ఆర్యభట్టు ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త, గణితశాస్త్రవేత్త. బీజగణితాన్ని వీరి కాలంలో ఉపయోగించారు. భారతీయ శాస్త్రవేత్తలు ‘సున్న’ భావనను అభివృద్ధి చేశారు. ‘సున్న’ కు గుర్తును కూడా తయారు చేశారు. 1-9 సంఖ్యలకు గుర్తులను గుప్తుల కాలంలోనే కనుగొన్నారు. వీరు కనుగొన్న ‘ఆల్గారిథమ్స్’ను నేడు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లో ఉపయోగిస్తున్నారు. బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. ఇతను పౌర సంవత్సరాన్ని దాదాపు కచ్చితంగా లెక్కించగల్గినాడు.

వైద్యశాస్త్ర ప్రగతి :
చరకుడు, సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు. ప్లాస్టిక్ సర్జరీ, ‘ విరిగిన ఎముకలను సరిచేసి ఆపరేషన్ కూడా ఆనాటి వైద్యులు చేసినారు. వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించారు.

ఖగోళశాస్త్రంలో అన్వేషణలు :
ఖగోళశాస్త్రం మరియు శాస్త్ర విజ్ఞానాలలో భారతీయ శాస్త్రవేత్తలు అనేక విషయాలు కనుగొన్నారు. నక్షత్రాలు మరియు గ్రహాల కదలికలను గమనించారు. భూమి గుండ్రంగా ఉంటుందని మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నారు. భూమికి సూర్యునికీ మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని వారు భావించేవారు. గురుత్వాకర్షణ శక్తి గురించి కూడా వీరికి తెలుసు.

భారతీయ శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగశాలలు మరియు ప్రయోగాలు లేకుండానే పై విషయాలన్నియు కనుగొన్నారు. పై విషయాలన్నింటికి కేవలం ఊహించుట ద్వారానే చెప్పగలిగారు. ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధనలు ద్వారా పై విషయాలన్నీ ఖచ్చితమైనవని నిరూపించబడినవి.

కళలు, వాస్తు శిల్పకళ :
అద్భుతమైన రాతి గుహలకు గుప్తుల కాలం ప్రసిద్ధి. వారికాలంలో పెయింటింగ్లు, వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.

లోహ విజ్ఞానం :
గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు, లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. ఇనుము మరియు ఉక్కుతో ఆయుధాలు తయారు చేసేవారు. ఆధునిక బంగారు నాణెలను పోలి ఉండే వాటిని కూడా వీరికాలంలో ముద్రించుట జరిగినది.

ప్రశ్న 7.
వైద్య మరియు లోహ విజ్ఞానశాస్త్ర రంగాలలో గుప్తుల కాలంలో సాధించిన విజయాలేవి?
జవాబు:
వైద్యశాస్త్రం :
చరకుడు మరియు సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతుడు. గుప్తుల కాలంలోని వైద్యులు విరిగిపోయిన ఎముకలను సరిచేసి ఆపరేషన్లు కూడా చేసేవారు. ఔషధంతో కూడిన మొక్కలను వ్యాధులను నయం చేయడంలో ఉపయోగించేవారు. వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించేవారు.

లోహ విజ్ఞాన శాస్త్రం :
గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. ఇనుము మరియు ఉక్కుతో ఆయుధాలు తయారు చేసేవారు. ఆధునిక బంగారు నాణేలను పోలి ఉండే వాటిని కూడా వీరి కాలంలో ముద్రించుట జరిగినది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 8.
పల్లవులు వాస్తు శిల్పకళకు చేసిన సేవను వివరింపుము.
జవాబు:
దక్షిణ భారతదేశంలోని వాస్తు శిల్పకళా నైపుణ్యానికి పల్లవ రాజులు ఎంతో సేవ చేశారు. వారి కాలంలో వాస్తు శిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారినది. తొలి పల్లవ రాజులలో మొదటి మహేంద్రవర్మ ప్రసిద్ధి చెందిన రాజు, అతడు గొప్ప వాస్తు శిల్పకళాభిమాని అతను ప్రవేశ పెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళను ‘మహేంద్రుని రీతి’ శిల్పకళ అంటారు. గుహాలయాల యొక్క ప్రభావం శిల్పకళపై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

మొదటి నరసింహ వర్మ తదుపరి ముఖ్యమైన పల్లవరాజు. ఇతను మహేంద్రవర్మ యొక్క కుమారుడు. ఇతనిని ‘మహామల్లుడు’ అని కూడా పిలుస్తారు. మహాబలిపురం రేవు పట్టణాన్ని ఇతను మంచి వాస్తు శిల్పకళా నైపుణ్యంతో అందంగా నిర్మించాడు. ఇతని కాలంలో అభివృద్ధి చేయబడిన వాస్తుశిల్పకళ ‘మహామల్లుని వాస్తు శిల్పకళారీతి’గా ప్రసిద్ధి చెందినది. మహాబలిపురంలో అయిదు రథాలు నిర్మించారు. ఇవి పంచపాండవ రథాలుగా పేరొందాయి. ఒక్కో రథాన్ని ఒక్కో పెద్ద బండరాయిని తొలిచి నిర్మించారు. కావున వీటిని ‘ఏకశిలా రథాలు’ అంటారు.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 1

రెండవ నరసింహ వర్మ దేవాలయాలు నిర్మించుటపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. అతను ‘రాజసింహుడు’ అను పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు. అతని కాలంలో నూతన వాస్తుశిల్ప కళారీతి అభివృద్ధి చెందినది. దేవాలయాలు మెత్తని మట్టి, రాయితో నిర్మించుట జరిగినది. దీనిని ‘రాజసింహుని వాస్తు శిల్పకళారీతి’ అంటారు. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం రాజసింహుని వాస్తు శిల్పకళారీతికి చక్కటి ఉదాహరణ.

ప్రశ్న 9.
భారతదేశపటంలో క్రింది వానిని గుర్తింపుము.
1. పాటలీపుత్రం
2. ఉజ్జయిని
3. నర్మదానది
4. కాంచీపురం
5. మహాబలిపురం
6. ధాన్య కటకం
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 3

ప్రశ్న 10.
నేను ఎవరు? (కనుక్కోండి చూద్దాం)
అ. ‘నేను అశోకుని నాలుగు సింహాల గుర్తులో ఉన్నాను. నేను జాతీయ పతాకం మధ్యలో కూడా ఉన్నాను. నేను ఎవరిని?
జవాబు:
అశోక ధర్మ చక్రము.

ఆ. నేను గుప్తుల వంశానికి చెందిన రాజును. దేశంలో ఉన్న అందరి రాజులను ఓడించాను. నా పేరేమి?
జవాబు:
సముద్రగుప్తుడు.

ఇ. నేను శాతవాహనుల రాజధానిని, కృష్ణానది ఒడ్డున ఉన్నాను. నా ‘పేరేమి?
జవాబు:
ధాన్య కటకం.

ఈ. మహాబలిపురంలోని రాతిని తొలిచి నిర్మించిన గుహాలయాలను పూర్తి చేశాను. నేను మొదటి మహేంద్రవర్మ, కుమారుడిని నా పేరు ఏమిటి?
జవాబు:
మొదటి నరసింహ వర్మ

6th Class Social Studies 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు InText Questions and Answers

6th Class Social Textbook Page No.88

ప్రశ్న 1.
అశోకుడు కళింగ రాజ్యాన్ని ఎందుకు ఆక్రమించాలనుకున్నాడు?
జవాబు:
అశోకుడు మరింత విశాలమైన రాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించాడు. అందుకోసం చాలా యుద్ధాలు చేశాడు. అందులో కళింగ యుద్ధము ప్రముఖమైనది. కళింగ రాజ్యం భారతదేశానికి తూర్పు తీరంలో గల స్వతంత్రమైన విశాలమైన రాజ్యం. మౌర్యవంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. అందుకని అశోకుడు కళింగ రాజ్యాన్ని ఆక్రమించాలనుకున్నాడు.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 2.
కళింగ యుద్ధంలో విజయం తర్వాత అశోకుడు ఎందుకు సంతోషంగా లేడు?
జవాబు:
అశోకుడు కళింగ రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ కళింగ యుద్ధం అత్యంత భయంకరమైనది మరియు రక్తసిక్తమైనది. అశోక చక్రవర్తి కళింగ యుద్ధభూమిలోకి స్వయంగా నడచి వెళ్ళాడు. అనేకమంది గాయపడిన మరియు చనిపోయిన సైనికులను స్వయంగా చూస్తాడు. యుద్ధంలో గెలిచినప్పటికీ అశోకచక్రవర్తి ఏ మాత్రం సంతోషంగా లేడు. భవిష్యత్తులో అతని జీవితకాలంలో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని గట్టిగా నిర్ణ యించుకుంటాడు. ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయముగా భావిస్తాడు. తన శేష జీవితంలో అహింసకు ప్రాధాన్యత ఇస్తాడు. అహింసను ప్రబోధించే బౌద్ధమతం పట్ల ఆకర్షితుడవుతాడు.

6th Class Social Textbook Page No.89

ప్రశ్న 3.
ప్రస్తుత భారతదేశపటంలో అప్పటి కళింగ రాజ్య ప్రాంతాన్ని మీ ఉపాధ్యాయుని సహాయంతో గుర్తించుము.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 4

ప్రశ్న 4.
కళింగ రాజ్యాన్ని ప్రస్తుత భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు:
ఒడిషాగా పిలుస్తున్నారు.

6th Class Social Textbook Page No.90

ప్రశ్న 5.
అశోకుని శిలాశాసనాలు నిరక్షరాస్యులు కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇది ఎలా సాధ్యమని నీవు అనుకుంటున్నావు?
జవాబు:
అశోకుని శిలాశాసనాలు నిరక్షరాస్యులు కూడా ఎలా అర్థం చేసుకోగలిగినారంటే :

  • ‘అశోకుడు’ ధర్మమహామాత్రులు’ అనే అధికారులను నియమించాడు. వారు రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు ధర్మప్రచారం చేసేవారు.
  • అశోకుడు తన సందేశాలను శాసనాల రూపంలో రాళ్లపైన, స్తంభాలపైన చెక్కించాడు.
  • చదువు రానివారికి వాటి పైనున్న సందేశాలను చదివి వినిపించాలని అధికారులను ఆదేశించాడు.
  • అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రదేశాలైన సిరియా, ఈజిప్టు, గ్రీస్, శ్రీలంకలకు వ్యాప్తి చేయటానికి రాయబారులను పంపించాడు.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 6.
ప్రస్తుత రోజులలో ప్రభుత్వం యొక్క సందేశం ప్రజలకు ఎలా చేరుతున్నది?
జవాబు:
ప్రస్తుత రోజులలో ప్రభుత్వం యొక్క సందేశం ప్రజలకు ఎలా చేరుతుందంటే :

  • పత్రికల ద్వారా
  • దూరదర్శన్ (టి.వి.) ద్వారా
  • సోషల్ మీడియా ద్వారా
  • ప్రభుత్వ శాఖల ప్రకటనల ద్వారా
  • ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక కార్యకర్తల ద్వారా
  • వివిధ గ్రంథాలు,
  • ప్రముఖుల ఉపన్యాసాల ద్వారా

ప్రశ్న 7.
మౌర్య చక్రవర్తుల కాలక్రమ చార్టును తయారు చేయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు, ఉదాహరణకు
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 5

ప్రశ్న 8.
అశోక చక్రవర్తి యొక్క వ్యక్తిత్వాన్ని తరగతిగదిలో చర్చించుము.
జవాబు:
మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు అశోకుడు. అనేక శాసనాలను వ్రాయించాడు. ఆనాటి పరిస్థితులను నేటికి తెలిసేలా చేశాడు. ప్రపంచ చలత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది, యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. కళింగ యుద్ధం తరువాత ధర్మ ప్రచారం చేశాడు. అంతేకాక రోడ్లను నిర్మించాడు. బావులను త్రవ్వించాడు. సత్రాలను కట్టించాడు. మనుష్యులకే కాక జంతువులకు కూడా వైద్యాలయాలను కట్టించాడు. ఈ కారణాల వలన అశోకుడు విశిష్ట పాలకుడని నేననుకుంటున్నాను.

ప్రశ్న 9.
జాతీయ చిహ్నం యొక్క ప్రాధాన్యతను తరగతి గదిలో చర్చించుము.
జవాబు:
సారనాథ్ లోని అశోకుని శిలా స్తంభంలోని నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ, చిహ్నంగా స్వీకరించింది.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 6

జాతీయ చిహ్నం అనేది ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. ఇది ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. 1950 జనవరి 26 నుంచి దీనిని అధికారికంగా జాతీయచిహ్నంగా గుర్తించారు. ఇందులో మూడు సింహాలు పైకి కనపడతాయి. నాల్గవసింహం మాత్రం అదృశ్యంగా దాగి ఉంటుంది. మూడు సింహాలు అధికారం, ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం అనే మూడు లక్షణాలకు ప్రతీకలు నాల్గవ సింహం భారతజాతి యొక్క గౌరవానికి ప్రతీక. ఎబాకు మధ్యలో చక్రం ఉంటుంది. అందులో కుడివైపున ఎద్దు మరియు ఎడమవైపున గెంతుతూ ఉన్న గుర్రం ఉంటుంది. ఎద్దు కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. అశ్వము వేగాన్ని మరియు శక్తిని తెలియజేస్తుంది. ఎబాక్కు దిగువవైపున ‘సత్యం జయిస్తుంది’ అని లిఖించబడి ఉంటుంది. ఇది మండూకోపనిషత్ నుంచి గ్రహింపబడింది.

6th Class Social Textbook Page No.91

ప్రశ్న 10.
రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఉందని మీరు భావిస్తున్నారా? నీ సమాధానాన్ని సమర్థింపుము.
జవాబు:
రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను.

  • వ్యాపారులకు, చేతి వృత్తుల వారికి రవాణా మార్గాలు చాలా ముఖ్యమైనవి. ఈ రవాణా మార్గాలు పెద్ద పట్టణాలను, ఓడరేవులను మరియు ఇతర దేశాలను కలుపుతాయి.
  • అభివృద్ధి చెందిన రవాణా మార్గాల వల్లనే (విదేశీ) వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది.
  • రవాణా సౌకర్యాలు ఎంత ఎక్కువగా అందుబాటులో ఉంటే వ్యవసాయ, వివిధ పరిశ్రమల ఉత్పత్తులను అంత ఎక్కువగా ప్రజలకు చేరువ చేయవచ్చు (వాణిజ్యం ద్వారా) ఉదా : విదేశాలలో తయారైన ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఫోన్లు స్థానిక మార్కెట్లో లభ్యమవ్వడం.

6th Class Social Textbook Page No.92

ప్రశ్న 11.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 7
పై భారతదేశ పటంలో గుప్త సామ్రాజ్యంలోని నాలుగు ముఖ్యమైన నగరాల పేర్లను రాయుము.
జవాబు:

  1. పాటలీపుత్ర
  2. ఉజ్జయిని
  3. సాంచి
  4. బరుకచ్చా

6th Class Social Textbook Page No.93

ప్రశ్న 12.
సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నీవు భావిస్తున్నావా? సమాధానాన్ని సమర్ధింపుము.
జవాబు:
సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నేను భావిస్తున్నాను.

  • మొదటి చంద్ర గుప్తుని తర్వాత సముద్రగుప్తుడు రాజైనాడు.
  • ఇతని కాలంలో సామ్రాజ్యము ఉత్తర భారతదేశం అంతటా విస్తరించినది. సముద్రగుప్తుడు అపజయమే ఎరుగనటువంటి గొప్ప విజేత.
  • ఇతని తర్వాత రెండవ చంద్రగుప్తుడు పరిపాలకుడయ్యాడు. పశ్చిమ భారతదేశంలోని శకరాజులను కూడా ఇతను జయించగలిగినాడు.
  • సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలోని తొమ్మిది మంది ప్రముఖ రాజులను ఓడించి వారి రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకున్నాడు.
  • దక్షిణాదిన 12 మంది రాజులను ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
  • తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్రను కొనసాగించాడు.

6th Class Social Textbook Page No.95

ప్రశ్న 13.
శాతవాహనులలో గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పవాడని ఎట్లు చెప్పగలవు ? అలా అయితే ఎందువలన?
జవాబు:

  • శాతవాహన రాజులలో ముఖ్యమైన రాజులు గౌతమీపుత్ర శాతకర్ణి, వాశిష్ట పుత్ర పులోమాని మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనులు 300 సంవత్సరాలు పరిపాలించారు.
  • గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులందరిలో గొప్పవాడు.
  • అతను శకులను, యవ్వనులను, పహ్లావులను ఓడించాడు.
  • దక్షిణ భారతదేశంలో మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడు.
  • అందువలన అతనికి త్రిసముద్రాధీశ్వర’ అనే బిరుదు వచ్చింది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

6th Class Social Textbook Page No.96

ప్రశ్న 14.
ఇక్ష్వాకులు అన్ని తెగల వారిని ఏకం చేయగలిగారు. నీవు దీనిని అంగీకరిస్తావా లేదా విభేదిస్తావా ? అవును అయితే వారు ఏయే పద్ధతులను ఉపయోగించారు?
జవాబు:
ఇక్ష్వాకులు అన్ని తెగల వారిని ఏకం చేయగలిగారు, నేను దీనికి అంగీకరిస్తున్నాను. ఏ పద్దతులు ఉపయోగించారు అంటే,

  • ఇతర తెగల వారితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకొనుట ద్వారా
  • యజ్ఞ, యాగాదులు (అశ్వమేథ యాగం మొ||) చేయటం ద్వారా
  • రామాయణంలోని శ్రీరాముని వారసులుగా చెప్పుకొనుట ద్వారా