AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

SCERT AP 6th Class Social Study Material Pdf 6th Lesson తొలి నాగరికతలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 6th Lesson తొలి నాగరికతలు

6th Class Social 6th Lesson తొలి నాగరికతలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సింధూలోయ నాగరికత మరియు వేదనాగరికతల మధ్య పోలికలేవి?
జవాబు:
సింధూలోయ నాగరికత మరియు వేదనాగరికతల మధ్య పోలికలు :

  • రెండూ భారత దేశ గొప్ప నాగరికతలుగా విలసిల్లినాయి.
  • రెండూ నాగరికతల ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినారు. అలంకార ప్రియత్వం కల్గి ఉన్నారు.
  • వ్యవసాయం ప్రధాన వృత్తిగా కల్గి ఉన్నారు. బార్లీ, బఠానీ, గోధుమ పంటలను ఇద్దరూ పండించారు.
  • లోహ పనిముట్లను వాడినారు. (రాగి, కాంస్యం, ఇనుము మొ||నవి.)
  • రెండూ నాగరికత ప్రజలు వినోదానికి ప్రాధాన్యమిచ్చారు. నాట్యం, సంగీతం, చదరంగం మొ||నవి రెండూ నాగరికత కన్పించే అంశాలు.
  • రెండూ నాగరికత ప్రజలు మత విశ్వాసాలను కల్గి ఉన్నారు. (అయితే దేవతలు వేరూ కావచ్చు.)
  • స్త్రీలకు సమాజంలో గౌరవస్థానం (మలివేదకాలంలో మినహా) ఉండేది.

ప్రశ్న 2.
సింధూ లోయ, నాగరికత తవ్వకాలలో పాల్గొన్నదెవరు?
జవాబు:
1850లో బ్రిటీష్ ఇంజనీర్లు కరాచీ లాహోరు నగరాల మధ్య రైలు మార్గాలు వేయుటకు తవ్వకాలు జరుపుతుండిరి. ఆ తవ్వకాలలో వేలాది రాళ్ళు దొరికినవి రైలు మార్గాలు వేయుటకు ఆ రాళ్ళను ఉపయోగించాలని నిర్ణయించారు. ఆ రాళ్ళు అయిదు వేల సంవత్సరాల క్రితంవన్న సంగతి అప్పుడు తెలియదు. 1920లో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు. దీనినే సింధూలోయ నాగరికత అని హరప్పా నాగరికత అని అంటారు. 1921-22 సం॥లలో అప్పటి పురావస్తుశాఖ డైరెక్టర్ జనరల్ అయిన సజాన్ మార్నల్ ఆధ్వర్యంలో హరప్పాలో దయారాం సాహి, మొహంజోదారోలో ఆర్.డి. బెనర్జీలు త్రవ్వకాలను జరిపి సింధూ నాగరికత – విశేషాలను వెలుగులోకి తెచ్చారు.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 3.
సింధూ ప్రజల ఆర్థిక జీవనాన్ని వివరింపుము.
జవాబు:
సింధూ ప్రజల ఆర్థిక జీవనము :

  • వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు మొ||న పంటలను పండించేవారు. పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం ఆ కాలంలోని ప్రధాన వృత్తులు. పత్తిని మొట్టమొదట పండించింది వీరే.
  • కాల్చిన ఇటుకలను తయారుచేయుట వీరి వేరొక ముఖ్య వృత్తి, పశువులు, మేకలు, పందులు, కుక్కలు, గుజ్రాలు మరియు గాడిదలను పెంచేవారు.
  • అరేబియా సముద్రంలోని లోథాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో సింధూ ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు.

ఆర్థిక జీవనం :
AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 1

ప్రశ్న 4.
సింధూ ప్రజల ఇండ్ల నిర్మాణము ఎట్టిది?
జవాబు:

  • హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇళ్ళు కట్టుకొనేవారు.
  • రెండు అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకొనేవారు.
  • ప్రతి ఇంటికి ఒక బావి మరియు స్నానాలగది ఉండేది.
  • ఇంటిలోని వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువలోకి పంపేవారు.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 2

ప్రశ్న 5.
సింధూ ప్రజల మురుగు నీటిపారుదల వ్యవస్థ ప్రశంసనీయమైనది ఎలా?
జవాబు:

  • సింధూ ప్రజల మురుగు నీటిపారుదల వ్యవస్థ ఎంతో ప్రశంసనీయమైనది.
  • వీరికాలంలో మంచి ప్రణాళికబద్ధమైన భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ కలదు.
  • ఈ వ్యవస్థ పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి సింధూ ప్రజలు ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

ప్రశ్న 6.
“భగవంతుని మీద భక్తి అనేది ఒక నమ్మకం” సింధూ ప్రజల దేవతల గురించి వ్యాఖ్యానించుము.
జవాబు:

  • సింధూ ప్రజలు పశుపతి (శివుడు) మరియు అమ్మతల్లిని పూజించేవారు.
  • వేపచెట్టు మరియు రావి చెట్టును పూజించేవారు.
  • భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువులను పూజించేవారు.
  • కాలిభంగన్ మరియు లోథాల్ ప్రాంతాలలో అగ్ని పేటికలు అనగా యజ్ఞవాటికలు ఉండేవి. (ఆప్) స్వస్తిక్ గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 3

ప్రశ్న 7.
వేదాలెన్ని? అవి ఏవి?
జవాబు:
వేద సాహిత్యములో నాలుగు ప్రముఖ వేదాలు కలవు. అవి :

  1. ఋగ్వేదము
  2. యజుర్వేదము
  3. సామవేదము
  4. అధర్వణ వేదము.

ప్రశ్న 8.
“వేదమనగా ఉత్కృష్టమైన (ఉన్నతమైన) జ్ఞానము” వ్యాఖ్యానించుము.
జవాబు:

  • సంస్కృత భాషలో వేదమనగా ఉన్నతమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే వేధము.
  • వేదాలను శృతులు అని కూడా అంటారు.
  • పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు.
  • భారతీయ యోగాకు వేదాలే ఆధారాలు.
  • వేదాలలో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞాన కలదు.
  • వేదకాలపు సాంప్రదాయాలు ఇప్పటికీ అవిచ్చినముగా కొనసాగుతున్నవి.
  • ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి ‘వేద కాలానికే మరలా వెళ్ళాలి’ అని పిలుపునిచ్చారు.
  • వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
  • వేద సాహిత్యములో నాలుగు ప్రముఖ వేదాలు కలవు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆధర్వణ వేదము

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 9.
తొలివేదకాలము నాటి ప్రజల సాంఘిక జీవనాన్ని వివరింపుము.
జవాబు:
కుటుంబ వ్యవస్థ :
కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం. తండ్రి కుటుంబానికి పెద్ద. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమలులో ఉంది. యుద్ధ ఖైదీలను బానిసలుగా చూసేవారు. దాసులను బానిసలుగా చూసేవారు. ఒకే భార్యను కలిగి ఉండుట ఈ కాలంలో సాధారణంగా ఉండేది.

స్త్రీల స్థానం :
సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కాని, సతీసహగమనం కానీ అమలులో లేదు. స్త్రీలు తమ భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకొనేవారు. వితంతువులు తిరిగి వివాహము చేసుకొనే పద్ధతి కలదు. ఘోష, అపాలా, లోపాముద్ర, ఇంద్రాణి, విష్యవర వంటి విద్యావంతులైన స్త్రీలు గొప్ప వేద పండితులు ఈ స్త్రీలు తమ భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్య క్రమాలలో పాల్గొనేవారు.

వేష ధారణ :
వాసా (ధోవతి) ఆదివాసా (శరీరము పై భాగానిని కప్పుకొనేది) ప్రస్తుతం మన వేషధారణను పోలి ‘ఉండేవి. దుస్తులను బంగారు దారంతో కుట్టేవారు. స్త్రీలు చెవి రింగులు, కంఠభారణాలు, గాజులు మరియు కాలి పట్టీలు ధరించేవారు. స్త్రీలు తలకు నూనె రాసుకుని జడలు వేసుకొనేవారు.

వినోదాలు :
రథపు పందేలు, వేట, మల్లయుద్దాలు, నాట్యం మరియు సంగీతం మొదలైనవి కొన్ని వినోదాలు. మూడు రకాలైన సంగీతవాయిద్యాలు ఉపయోగించేవారు.

విద్య :
విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి. బోధనా అభ్యసన ప్రక్రియలలో అన్ని విద్యా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. విద్యాలయాలలో యుద్ధ తంత్రం, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళలను నేర్పేవారు.

వర్ణవ్యవస్థ :
తొలి వేదకాలంలో ఎటువంటి వివక్షత లేదు. కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం లేదు. ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చును.

ప్రశ్న 10.
మలి వేదకాలము నాటి ప్రజల సాంఘిక జీవనము గురించి నీకేమి తెలియును?
జవాబు:
మలి వేదకాలములో తొలి వేదకాలముతో పోల్చితే అనేక సాంఘిక మార్పులు సంభవించాయి. అవి :

  • ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైనది. అవి నాలుగు రకాలు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం మరియు సన్యాసం వీరి కాలంలో ప్రారంభమైనవి.
  • స్త్రీల స్థానం దిగజారింది. వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది.
  • బాల్య వివాహాలు మరియు సతీసహగమనం వీరి కాలంలో ప్రారంభమయ్యాయి.
  • రాజులు మరియు ఉన్నత వర్గాల ప్రజలలో బహుభార్యత్వము ప్రారంభమైనది.
  • స్త్రీకి ఆస్తి హక్కు లేదు, వరకట్నము ఆచరణలోకి వచ్చెను.
  • వర్ణాంతర వివాహాలు నిషేధించబడినవి.

ప్రశ్న 11.
ఇతిహాసాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
రామాయణం, మహాభారతాలు అనేవి రెండు గొప్ప ఇతిహాసాలు, రామాయణాన్ని (ఆది కావ్యం) సంస్కృతంలోకి వాల్మీకి రచించారు. రామాయణంలో శ్రీరాముడిని ఆదర్శపాలకుడిగా, ఆదర్శ సోదరునిగా, ఆదర్శ కుమారునిగా, సీతను ఆదర్శ మహిళగా వర్ణించారు. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడనే ఋషి రచించాడు. అధర్మం పై ధర్మం సాధించిన విజయమే ‘మహాభారతం’గా చెప్పబడింది.

ప్రశ్న 12.
భారతదేశము యొక్క అవుట్ లైన్ మ్యాన్లో ఈ క్రింది వాటిని గుర్తించుము.
ఎ) సింధూనది బి) గంగానది సి) యమునా నది
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 4

ప్రశ్న 13.
సింధూలోయ నాగరికత పతనానికి కారణాలేవి?
జవాబు:
సింధూలోయ నాగరికత పతనానికి కారణాలు :

  • ఆర్యుల దండయాత్రలు సింధూ నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు.
  • అయితే ‘మార్టిమర్ వీలర్’ అనే చరిత్రకారుడు దీనిని అంగీకరించలేదు. సింధూ నది తన ప్రవాహమార్గాన్ని మార్చుకోవడం వలన మరియు వరదల వలన సింధూ నాగరికత పతనమైనట్టు భావిస్తున్నారు.
  • సింధూనది మరియు దాని ఉపనదులలో నీరు లేకుండా ఎండిపోవుట వలన అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదలి వెళ్ళారని కొంతమంది చరిత్రకారులు భావిస్తారు.
  • సింధూలోయ నాగరికత పతనానికి అనేక కారణాలు ఉన్నాయని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు.

6th Class Social Studies 6th Lesson తొలి నాగరికతలు InText Questions and Answers

6th Class Social Textbook Page No.65

ప్రశ్న 1.
సింధూలోయ నాగరికతా కాలం నాటి పట్టణ ప్రణాళికకు, ప్రస్తుత పట్టణ ప్రణాళికలకు ఏవైనా తేడాలను నీవు గమనించావా? అయితే ఎలాంటి తేడాలను గమనించావా?
జవాబు:
సింధూలోయ నాగరికతా కాలం నాటి పట్టణ ప్రణాళిక ఆధునిక (ప్రస్తుత) పట్టణ ప్రణాళికను పోలి ఉంది. కొద్ది తేడాలు మాత్రమే గమనించాను. అవి:

  • నేడు చాలా చోట్ల భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ లేదు.
  • నేడు చాలా పట్టణాల్లో సరియైన ప్రణాళికా బద్దమైన (భవన) నిర్మాణాలు లేవు. మురికివాడల సంగతి మరీ అధ్వాన్నం.
  • చాలా పట్టణాల్లో విశాలమైన రహదారులు లేవు. ఇరుకు సందులే.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 2.
సింధూ కాలంనాటి నీటిపారుదల వ్యవస్థ అత్యంత ఆధునికమైనదేనా? ఎలా?
జవాబు:

  • సింధూ కాలం నాటి నీటి పారుదల వ్యవస్థ అత్యంత ఆధునికమైనదే.
  • మంచి ప్రణాళికాబద్ధమైన నీటి పారుదల వ్యవస్థ కలదు. .
  • వీరు పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు.

6th Class Social Textbook Page No.66

ప్రశ్న 3.
సింధూలోయ ప్రజల ఆర్థిక కార్యకలాపాలకు, ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలకు పోలికలు ఏవి?

ఆర్థిక కార్యకలాపం సింధూ ప్రజల కాలం ప్రస్తుత కాలం
ఎగుమతులు
దిగుమతులు
పంటలు
మచ్చిక చేసుకొని పెంచుకునే జంతువులు
చేతి వృత్తులు

జవాబు:
సింధూలోయ ప్రజల ఆర్థిక కార్యకలాపాలకు, ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలకు పోలికలు

ఆర్థిక కార్యకలాపం సింధూ ప్రజల కాలం ప్రస్తుత కాలం
ఎగుమతులు నూలు వస్త్రాలు, ధాన్యం దంతపు దువ్వెనలు, ఆభరణాలు వజ్రాలు, తోళ్ళు ఉత్పత్తుల., రత్నాలు, ఔషధాలు యంత్రాలు, లోహాలు.
దిగుమతులు అలంకార సామాగ్రి, రాగి తగరం పెట్రోలు, రంగురాళ్ళు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ప్లాస్టిక్, స్టీల్
పంటలు వరి, గోధుమ, బార్లీ, పత్తి, బరాని వరి, గోధుమ, బార్లీ, తృణధాన్యాలు అన్ని పత్తి, జనుము, పొగాకు, కాఫీ, టీ మొ||నవి
మచ్చిక చేసుకొని పెంచుకునే జంతువులు మేకలు, గొర్రెలు, గేదెలు ఎద్దు, ఏనుగులు, కుక్కలు మేకలు, గొర్రెలు, గేదెలు, ఎద్దులు, గాడిదలు ఏనుగులు, కుక్కలు, ఒంటెలు మొ||నవి.
చేతి వృత్తులు తాపీ పని, చేనేత పని, నూలు, వడుకుట, రాగిపాత్రలు, కుండల తయారీ. తాపీ పని, చేనేతపని, నూలు వడుకుట రాగి పాత్రలు, కుండల తయారీ మొదలైనవి.

6th Class Social Textbook Page No.67

ప్రశ్న 4.
సింధూ నాగరికత కాలంలోని ప్రజలు ఉపయోగించిన లోహాలను ప్రస్తుతం మనం ఉపయోగించే లోహాలతో పోల్చుము. Page No. 67)
AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 5
జవాబు:

సింధూలోయ నాగరికత ప్రజలు ఉపయోగించిన లోహాలు ప్రస్తుతం ఉపయోగిస్తున్న లోహాలు
రాగి, తగరము పాత్రలు, బంగారం, వెండితో చేసిన ఆభరణాలు. రాగి, స్టీల్, ఇత్తడి పాత్రలు, వెండి, బంగారం, ప్లాటినం మొ||న ఆభరణాలు వాడుతున్నారు.
కాంస్యంతో చేసిన పనిముట్లు వాడినారు. ఇనుము, అల్యూమినియం, స్టీల్లో చేసిన పనిముట్లు వాడుతున్నారు.

6th Class Social Textbook Page No.69

ప్రశ్న 5.
AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 6
i) పై పట్టికలో నాగరికతల మధ్య ఎలాంటి పోలికలను నీవు గమనించావు?
ii) మిగిలిన నాగరికతల కన్నా సింధూ నాగరికత ఏయే విధములుగా పురోగమించినది? Page No. 699
జవాబు:
i)

  • ఈ నాగరికతలన్నీ నదీలోయ ప్రాంతాలలోనే విలసిల్లినాయి.
  • ఈ నాగరికతల్లో ఎక్కువ నాగరికతలు పట్టణ నాగరికతలే.
  • ఈ నాగరికతలన్నీ తమ స్వంత లిపిని కల్గి ఉన్నాయి.
  • ఈ శాస్త్ర, సాంకేతికంగా, ఆయా నాగరికతలు అభివృద్ధి చెందినాయని చెప్పవచ్చు. ఉదా : పిరమిడ్ల నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ.
    లోహాలను కూడా విరివిగా ఉపయోగించినట్లు తెలుస్తుంది.

ii)

  • మిగిలిన నాగరికతల కన్నా సింధూ నాగరికత క్రింది విధముగా పురోగమించింది :
  • గ్రిడ్ ఆకారంలో ప్రణాళిక బద్దమైన పట్టణ ప్రణాళిక కల్గి ఉంది.
  • భూగర్భ మురుగునీటి పారుదల (పైపుల ద్వారా) వ్యవస్థ కలదు.
  • ఋతుపవన వ్యవస్థ కలిగి ఉంది.
  • బలమైన కేంద్రీకృత ప్రభుత్వం కల్గి ఉంది.

6th Class Social Textbook Page No.71

ప్రశ్న 6.
భారతదేశంలో ఉన్న మతాల పేర్లను రాయుము.
జవాబు:
భారతదేశంలో ఉన్న మతాల పేర్లు :

  1. హిందూ మతము
  2. క్రైస్తవ మతము
  3. ఇస్లాం మతము
  4. బౌద్ధ మతం
  5. జైన మతం
  6. సిక్కు మతం
  7. పార్శీ మతం (జోరాస్ట్రియన్) మొ||నవి.

6th Class Social Textbook Page No.72

ప్రశ్న 7.
నేడు మన ప్రజా ప్రతినిధులు ఎలా ఎన్నిక కాబడుతున్నారు?
జవాబు:
నేడు మన ప్రజా ప్రతినిధులను, వయోజనులైన (18 సం||లు పైబడిన) వారు తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకుంటారు. అంటే ప్రజాస్వామ్యయుతంగా మెజారిటీ సభ్యుల అమోదించే ఎన్నుకోబడుతున్నారు.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 8.
మీ పాఠశాల గ్రంథాలయంలోని ప్రముఖ గ్రంథాల పేర్లు రాసి, వాటి రచయితల పేర్లు రాయుము.
జవాబు:
విద్యార్థులు తమతమ పాఠశాల గ్రంథాలయాలలోని గ్రంథాల పేర్లు, రచయిత పేర్లు రాయగలరు. ఉదా :

గ్రంథము రచయిత
1. ది ఇన్ సైడర్ పి.వి. నరసింహారావు
2. నా దేశయువజనులారా ఏ.పి.జె. అబ్దుల్ కలాం
3. ద ఇగ్నైటెడ్ మైండ్స్ ( ఒక విజేత ఆత్మ కథ) ఏ.పి.జె. అబ్దుల్ కలాం
4. కొన్ని కలలు కొన్ని మెలకువలు వాడ్రేవు చినవీర భద్రుడు
5. మహా ప్రస్థానం శ్రీశ్రీ
6. కన్యాశుల్కం గురజాడ అప్పారావు
7. అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర్ తిలక్
8. మైండ్ పవర్ యండమూరి వీరేంద్రనాథ్
9. విజయానికి ఐదు మెట్లు యండమూరి వీరేంద్రనాథ్
10. కృష్ణపక్షం దేవులపల్లి కృష్ణశాస్త్రి
11. వేమన శతకం వేమన
12. సుమతీ శతకం బద్దెన
13. వేయిపడగలు విశ్వనాథ సత్యనారాయణ
14. విశ్వంభర సి. నారాయణరెడ్డి
15. టీచర్ యస్. ఏ. వార్నర్
16. పిల్లలు ఎలా నేర్చుకుంటారు? జాన్ హోల్డ్
17. మనసు భాష – మైండ్ మేజిక్ (NLP) బి.వి. పట్టాభిరామ్
18. విజయం మీదే బి.వి. పట్టాభిరామ్
19. మీరే విజేతలు ! విజయాలన్నీ మీవే సి.వి. సర్వేశ్వరశర్మ
20. ఆటలతో పాఠాలు మన్నవ గిరిధరరావు మొదలైనవి.

ప్రాజెక్టు పని

సింధూలోయ నాగరికత, వేద నాగరికతల పోలికలపై ఒక ప్రాజెక్టు తయారు చేయుము.
జవాబు:
సింధూలోయ నాగరికత మరియు వేదనాగరికతల మధ్య పోలికలు :

  • రెండు భారత దేశ గొప్ప నాగరికతలుగా వెలసిల్లినాయి.
  • రెండూ నాగరికతల ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినారు. అలంకార ప్రియత్వం కలి ఉన్నారు.
  • వ్యవసాయం ప్రధాన వృత్తిగా కల్గి ఉన్నారు. బార్లీ, బఠానీ, గోధుమ పంటలను ఇద్దరూ పండించారు.
  • లోహ పనిముట్లను వాడినారు. (రాగి, కాంస్యం, ఇనుము మొ||నవి.)
  • రెండూ నాగరికత ప్రజలు వినోదానికి ప్రాధాన్యమిచ్చారు. నాట్యం, సంగీతం, చదరంగం మొ||నవి రెండూ నాగరికత కన్పించే అంశాలు.
  • రెండూ నాగరికత ప్రజలు మత విశ్వాసాలను కల్గి ఉన్నారు. (అయితే దేవతలు వేరూ కావచ్చు.)
  • స్త్రీలకు సమాజంలో గౌరవస్థానం (మలివేదకాలంలో మినహా) ఉండేది. సింధూలోయ నాగరికత వేద నాగరికత

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 7

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

SCERT AP 6th Class Social Study Material Pdf 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం

6th Class Social 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
అడవుల నుండి లభించే ఉత్పత్తులను పేర్కొనుము.
జవాబు:
అడవుల నుండి మనకు వివిధ రకాలైన ఉత్పత్తులు లభిస్తున్నాయి. అవి :

  • వివిధ రకాల పళ్ళు ఉదా : సీతాఫలం, జామ, పనస, వెలగ మొ||నవి.
  • వివిధ రకాల దుంపలు. ఉదా : చిలకడదుంప, వెదురు, దుంప మొ||నవి.
  • వివిధ రకాల గింజలు, కాయలు. ఉదా : కుంకుళ్ళు, షీకాయ, బాదాము మొ||నవి.
  • తేనె, టేకు, సాల్, వెదురు మొ|| కలప, చింతపండు.
  • విస్తరాకులు, ఆయుర్వేద ఔషధ వనమూలికలు.
  • వంటచెరకు మొదలైనవి.

ప్రశ్న 2.
సంచార జీవనం అనగా నేమి?
జవాబు:
ఆది మానవులు చిన్న చిన్న సమూహాలు లేదా గుంపులుగా ఉండేవారు. వారు గుహలలో, చెట్ల నీడలలో లేదా రాతి స్థావరాలలో నివసించేవారు. ఆహారం కోసం వారు తరచుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. ఇటువంటి వారిని ‘సంచార జీవులు’ అని అంటారు. వీరు సాగించిన జీవనాన్ని సంచార జీవనం అంటారు.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 3.
నేడు మనం నిప్పును దేనికి ఉపయోగిస్తున్నాం?
జవాబు:
నేడు మనము నిప్పును క్రింది విధంగా ఉపయోగిస్తున్నాము.

  • ఆహారాన్ని వండుకుని తినుటకు
  • వెచ్చదనం పొందటానికి, నీటిని వేడి చేయటానికి.
  • మతానికి సంబంధించిన క్రతువులలో, కర్మకాండలలో
  • కొన్ని రకాల పంటల ప్రాసెసింగ్ లో (ఉదా : పొగాకును కాల్చుట)
  • వివిధ రకాల పరిశ్రమలలో (ఉదా : ఇనుము – ఉక్కు పరిశ్రమలో, సిమెంట్ పరిశ్రమలలో)
  • వెల్డింగ్ పనుల్లో
  • బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయుటకు
  • బంగారం, వెండి మొదలైన లోహాలను కరిగించడానికి, నాణెలు, బొమ్మలుగా చేయుట కొరకు.
  • చల్లని రాత్రులలో వెచ్చదనం కోసం.

ప్రశ్న 4.
నేటి మానవులు, ఆది మానవులు తిన్న ఆహార పదార్థాల జాబితాను తయారు చేసి, దానిలో మీరు గమనించిన పోలికలను, భేదాలను రాయండి.
జవాబు:
నేటి మానవులు మరియు ఆదిమానవుల ఆహార అలవాట్లలోని భేదాలు :

  • ఆదిమానవులు ఆహారాన్ని వండుకుని తినలేదు నేటి మానవులు శుభ్రం చేసుకుని, వండుకుని తింటున్నారు.
  • ఆదిమానవులు పచ్చిమాంసాన్ని భుజించగా నేటి మానవులు వండుకుని వివిధ రుచులలో భుజిస్తున్నారు.
  • ఆదిమానవులు ఆహారాన్ని సేకరించేవారు. నేటి మానవులు, ఆహారాన్ని ఉత్పత్తి (పండిస్తున్నారు) చేస్తున్నారు.
  • ఆదిమానవులు వేటాడి జంతు మాంసాన్ని పొందుతున్నారు. నేటి మానవులు జంతువులను మచ్చిక చేసుకుని పాలు, మాంసం పొందుతున్నారు.
  • ఆదిమానవులు ఆహారాన్ని నిల్వ ఉంచలేదు. నేటి మానవులు ఆహారాన్ని నిల్వ ఉంచుతున్నారు, అనేకరకాలైన ధాన్యాలు పండిస్తున్నారు.
  • ఆదిమానవులు ఆహారాన్ని భుజించడానికి ఎటువంటి పాత్రలు, పరికరాలు వాడలేదు. నేటిమానవులు అనేక రకాల వంట పాత్రలు వాడుతున్నారు మరియు చపాతి, అన్నం, పప్పు, కూరలు మొ||నవి ఆహారంలో భాగంగా ఉన్నాయి.

పోలికలు:

  • ఆదిమానవులు, నవీన (నేటి) మానవులు శక్తి కోసం ఆహారాన్ని భుజించేవారు. అంటే ఆకలి తీర్చుకోవడం కోసం.
  • ఆదిమ మానవుల్లో మాంసాహారులు కలరు అలాగే నవీన మానవుల్లో కూడా మాంసాహారులు కలరు.
  • ఆదిమానవులు ఫలాలు, దుంపలు, వేర్లు మొ||నవి ఆహారంగా తీసుకునేవారు. నేటి మానవులు కూడా ఆహారంలో, అవి స్వీకరిస్తున్నారు.

ప్రశ్న 5.
“జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం ద్వారా ఆది మానవుల జీవనం సుఖమయ అయింది” దీనితో నీవు ఏకీభవిస్తావా? మీ జవాబును సమర్థించండి.
జవాబు:

  • జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం ద్వారా ఆది మానవుల జీవనం సుఖమయం అయిందనుటలో సందేహం లేదు, నేను దీనితో ఏకీభవిస్తున్నాను.
  • జంతువులను మచ్చిక చేసుకొనడం వల్ల వారికి పాలు,మాంసం, జంతుచర్మం మొ||నవి లభించేవి.
  • మొక్కలు పెంచడం వల్ల వారికి కావలసిన ఆహార ధాన్యాలు (గింజలు) కూరగాయలు మరియు జంతువులకు అవసరమైన గడ్డి లభించేవి, గృహ (ఇళ్ళు) నిర్మాణానికి అవసరమైన కలప, ఆకులు మొ||నవి లభించేవి.
  • ఎద్దులను, గాడిదలను వ్యవసాయానికి, సరుకులు మోయటానికి ఉపయోగించుకుని తమ కష్టాన్ని తగ్గించుకున్నారు. ఈ విధంగా వారి జీవనం సుఖమయం అయింది.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 6.
వంటకు రుబ్బురోలు లేనట్లయితే మనం తినే ఆహారపు అలవాట్లపై ఎటువంటి ప్రభావం కలుగుతుంది?
జవాబు:

  • వంటకు రుబ్బురోలు లేనట్లయితే కాయలను పచ్చడి చేయలేము. ముక్కలు గానే తినవలసి వస్తుంది. అలాగే ఇడ్లీ, అట్టు, గారె లాంటి పిండ్లు వేయటానికి కుదరదు.
  • కొన్ని రకాల ఆహార పదార్థాలు తినటం కష్టం కావచ్చు. కొన్ని రకాల ధాన్యాలను గింజలుగానే తినవలసి వస్తుంది.
  • ఇలా రోలు వాడకం లేనట్లయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేసుకొనుట కూడా కష్టం కావచ్చు.

ప్రశ్న 7.
పండ్లు కోయటానికి మీరు ఎటువంటి పనిముట్లను ఉపయోగిస్తున్నారు? అవి వేటితో తయారు చేస్తారు?
జవాబు:

  • మేము పండ్లు కోయటానికి కత్తి (knife), కోత కత్తి (cutter), చాకు, చెంచా, ముళ్ళ చెంచా (fork), కొడవలి మొదలైన పనిముట్లను ఉపయోగిస్తున్నాము.
  • ఇవి అన్నీ దాదాపు స్టెయిన్లెస్ స్టీల్, ఇనుముతో తయారు చేయబడినవే.

ప్రశ్న 8.
ఆది మానవులు ధాన్యాన్ని వేటిలో నిల్వ చేసేవారు?
జవాబు:
ఆది మానవులు ఆహార నిల్వ కొరకు మట్టి పాత్రలు, గంపలు / బుట్టలు లేదా నేల మాళిగలను ఉపయోగించేవారు.

ప్రశ్న 9.
నవీన శిలాయుగ వ్యవసాయదారుల, పశుపోషకులకు, ప్రస్తుత ఆధునిక యుగ వ్యవసాయదారుల, పశు పోషకులకు మధ్య తేడాలను రాయండి.
జవాబు:

నవీన శిలాయుగ వ్యవసాయదారు/ పశుపోషకులు ఆధునిక వ్యవసాయదారు/ పశుపోషకులు
1. వీరు వ్యవసాయానికి సరైన పనిముట్లను వినియోగించలేదు. (రాతినాగలి) 1. వీరు వ్యవసాయానికి సరైన పనిముట్లు వినియోగిస్తున్నారు. (ఇనుపనాగలి)
2. వీరు పొలం దున్నటానికి జంతువులపై ఆధారపడినారు. (ఉదా : ఎద్దు) 2. వీరు ఆధునిక వాహనాలపై పొలం దున్నుతున్నారు. (ఉదా : ట్రాక్టర్)
3. వీరికి సస్యరక్షణ చర్యలు అంతగా తెలియవు. 3. వీరు-సస్యరక్షణకు పురుగుమందులు వాడుతున్నారు.
4. వీరు నీరు అందుబాటులో ఉన్నచోటనే పంటలు పండించారు. 4. నీరు అందుబాటులో లేకపోయినా కాల్వల ద్వారా, బావుల ద్వారా పంటలు పండిస్తున్నారు.
5. జంతువులను పాలు, మాంసం, చర్మాల కోసం పోషించారు. 5. జంతువులను వినోదం కోసం, పందేలకోసం కూడా పోషిస్తున్నారు.
6. వీరి వ్యవసాయ లేదా పశువుల ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోలేక పోయారు. 6. వ్యవసాయ, జంతు సంబంధ ఉత్పత్తులను చాలాకాలం నిల్వ ఉంచుతున్నారు. (ఉదా : కోల్డ్ స్టోరేజి)

ప్రశ్న 10.
నవీన శిలాయుగ వ్యవసాయ పశుపోషకులకు, జీవన విధానం, నాగరికతల ఆవిర్భావానికి ఎలా దారి తీసింది?
జవాబు:

  • నవీన రాతి యుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేసారు. తమ అవసరాలకు అనుగుణంగా కొత్త రకమయిన పనిముట్లను తయారు చేసుకొన్నారు.
  • కాంస్యయుగ ప్రారంభ కాలం నాటికి ఈ వ్యవసాయ, పశు పోషక సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు.
  • సంక్లిష్టమైన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలతో కూడిన నాగరికతలు ఈ సమూహాలలో అభివృద్ధి చెందాయి. ప్రపంచ వ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసపటోమియా, ఈజిప్ట్, సింధూలోయ (భారతదేశం) మరియు చైనాలలో వర్ధిల్లాయి.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 11.
కింద ఇచ్చిన రాతి చిత్ర కళా స్థావరాలను ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్తించండి.
A. చింతకుంట
B. ఆదోని
C. కావలి
D. నాయుడు పల్లి
E. వేల్పు మడుగు
F. శ్రీకాళహస్తి
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం 1

6th Class Social Studies 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం InText Questions and Answers

6th Class Social Textbook Page No.54

ప్రశ్న 1.
AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం 2
పై చిత్రాలను పరిశీలించి ఆది మానవులు చేస్తున్న పనుల జాబితాను తయారు చేయండి.
జవాబు:

  • జింకను వేటాడి, పట్టుకుని తీసుకు వచ్చుచున్నారు.
  • స్త్రీలు, పిల్లలు (దుంపలను, కాయలను) ఆహారాన్ని సేకరిస్తున్నారు.
  • జంతు చర్మాన్ని శుభ్రం చేయుచున్నారు.
  • రాతిపనిముట్లను తయారు చేస్తున్నారు.
  • నిప్పుపై మాంసాన్ని కాల్చుచున్నారు.

6th Class Social Textbook Page No.55

ప్రశ్న 2.
మీరు తినే ఆహారంలో అడవుల నుండి, ప్రకృతి సిద్ధంగా లభించే వాటి జాబితాను తయారు చేయండి.
జవాబు:
మేము తినే ఆహారంలో అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించేవి :

  • తేనె, చింతపండు, ఔషధ మూలికలు (క్వినైన్, కర్పూరం మొ||నవి)
  • దాల్చిన చెక్క లవంగాలు, మిరియాలు, యాలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలు.
  • వివిధ రకాల ఫలాలు (సీతాఫలము, రేగుజాతి పండ్లు మొ||నవి)
  • చూయింగ్ గమ్ తయారీలో వాడే చికిల్ మొ||నవి.

ప్రశ్న 3.
ఆది మానవులు నిప్పును ఎలా కనిపెట్టి ఉంటారో మీ ఉపాధ్యాయుల సహాయంతో చర్చించి రాయండి.
జవాబు:

  • సహజసిద్ధంగా ఏర్పడిన మెరుపు అడవిలోని చెట్లను తాకినపుడు ఏర్పడిన మంట ఆది మానవులను ఆశ్చర్యానికి గురిచేసింది.
  • గాలి బలంగా వీచినపుడు రెండు చెట్ల రాపిడి వలన ఏర్పడిన నిప్పు (మంట) ఆది మానవుడిలో ఆలోచనలను కలగజేసింది.
  • కాలక్రమేణ ఆది మానవుడు కర్ర మరియు చెకుముకిలను ఉపయోగించి మొదటగా నిప్పును ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకున్నారని పరిణామవాదులు సిద్ధాంతీకరించారు.

6th Class Social Textbook Page No.57

ప్రశ్న 4.
వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? మీ ఉపాధ్యాయులు, స్నేహితులతో చర్చించి సమాధానం వ్రాయండి.
జవాబు:
వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవుల జీవితాలను క్రింది విధంగా ప్రభావితం చేస్తున్నాయి

  • వాతావరణంలో మార్పులు మానవ జీవితంలో అభివృద్ధి సూచికగా చెప్పవచ్చును. వాతావరణంలో మార్పులు వలన మొక్కలు, చెట్లు, గడ్డి భూములు పెరిగి తద్వారా వ్యవసాయం, పచ్చదనం విస్తరించింది.
  • గడ్డితినే జంతువులయిన ఎద్దులు, గొర్రెలు, మేకలు, జింకలు మొదలైన వాటి సంఖ్య క్రమంగా పెరిగింది, జంతువులను మచ్చిక చేసుకోవటం, పశుపోషణ పెరిగింది.
  • వ్యవసాయంలో (పంటల దిగుబడిలో) గుర్తించదగిన అభివృద్ధి సాధించటం జరిగింది.
  • అయితే వాతావరణంలో నేడు అనేక కాలుష్య పదార్థాలు చేరి, వాతావరణ సమతౌల్యతను దెబ్బతీస్తూ, అతివృష్టి, – అనావృష్టి మొదలైన ప్రకృతి భీభత్సాలకు ఏర్పడుతున్నాయి.

6th Class Social Textbook Page No.58

ప్రశ్న 5.
ఆది మానవులు పశుపోషకులుగా ఎలా మారారు?
జవాబు:

  • మానవులు నివసిస్తున్న ప్రాంతాలకు ఆహారం కొరకు జంతువులు రావడం ప్రారంభించాయి.
    వారు తమ నివాసాల దగ్గరకు వచ్చే జంతువులకు ఆహారాన్ని అందించి వాటిని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు.
  • ఎంపిక చేసుకొన్న జంతువులతోనే పశోత్పత్తి గావించేవారు.
  • ఇలా మచ్చిక చేసిన జంతువులలో గొర్రెలు, మేకలు, ఎద్దులు లాంటి గడ్డి తినే జంతువులు, గుంపులుగా నివసించే పందులు ముఖ్యమైనవి.
  • ఆది మానవులు మచ్చిక చేసుకోవడానికి జంతువులు కూర మృగాల నుండి కాపాడేవారు.
  • ఈ విధంగా మానవులు వ్యవసాయ, పశుపోషకులుగా మార్పు చెందారు.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 6.
‘పశుపోషణ’ ఆది మానవుల స్థిర జీవనానికి నాంది పలికిందని నీవు ఎలా చెప్పగలవు?
జవాబు:

  • మచ్చిక జంతువులను జాగ్రత్తగా కాపాడుకొంటే అవి అనతికాలంలోనే తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి.
  • ఇవి మాంసం, పాలు, పాల పదార్థాలు అందిస్తాయి.
  • ఈ ‘కారణాల వల్ల ఆది మానవులు చాలాకాలం పాటు ఒకే ప్రదేశంలో నివాసం (స్థిర జీవనం) ఉండటం ప్రారంభించారు.

6th Class Social Textbook Page No.59

ప్రశ్న 7.
ఆధునిక రైతుల జీవన విధానాన్ని, నాటి వ్యవసాయ, పశుపోషకుల జీవన విధానాలతో పోల్చండి.
జవాబు:

  • ఆధునిక రైతులు ఆధునిక పరికరాలను ఉపయోగించి, సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తున్నారు. కాని నాటి వ్యవసాయ, పశుపోషకులు కరుకురాతి పరికరాలను ఉపయోగించారు.
  • నేటి రైతులు వివిధ రకాల పంటలను పండిస్తూ, పెద్ద పెద్ద భవనాలలో (రాతి కట్టడాలు) ఉంటూ, జంతువులను , మంచి షెడులలో పెంచుతూ వాణిజ్య తరహా పాడి, పంటలను పండిస్తున్నారు. కాని నాడు పరిమిత పంటలను పండిస్తూ తాటాకు (పూరి) గుడిసెల్లో నివసిస్తూ సాధారణ జీవనం గడిపేవారు.
  • ఈనాటి ఆధునిక రైతులు మంచి ఎరువులను పురుగు మందులను ఉపయోగిస్తూ వాణిజ్య / నగదు పంటలను లాభాలకై పండిస్తున్నారు. నాటి వ్యవసాయ పశుపోషకులు ఆహారం కొరకు జీవనాధారా వ్యవసాయం చేసినారు.
  • ఆధునిక రైతు అన్ని విధాల (నీటి సౌకర్యం, యాంత్రీకరణ, మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగి సౌకర్యం మొ||నవి) అభివృద్ధి చెంది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. నాడు ఈ సౌకర్యలేవి లేవు, ఆహారం కొరకు మాత్రమే పంటలు పండించేవారు

ప్రశ్న 8.
ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోకపోతే ఏమవుతుంది?
జవాబు:
ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోకపోతే :

  • భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుంది.
  • తర్వాత పంటకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉండవు.
  • కరవు, కాటకాలు లాంటివి ఏర్పడినప్పుడు ఆహార ధాన్యాల నిల్వలు లేకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది.
  • ఆహార కొరత సమయంలో వ్యాపారులు (నల్ల బజారు) బ్లాక్ మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది.
  • ఆహార కొరత సమయంలో ఆకలి చావులు ఏర్పడే ప్రమాదం ఉంది.

6th Class Social Textbook Page No.60

ప్రశ్న 9.
జంతువుల నుండి ఆహారం కాకుండా, మనం పొందే ఇతర వస్తువులు ఏవి?
జవాబు:
జంతువుల నుండి ఆహారం కాకుండా, మనం పొందే ఇతర వస్తువులు:

  • జంతుచర్మాలు, జంతు కొమ్ములు, దంతాలు, గోళ్ళు.
  • జంతు క్రొవ్వు, జంతు శ్రమ (ఎద్దు, గాడిదలను బరువు మోయటానికి ఉపయోగిస్తాం.)
  • జంతువుల వెంట్రుకలు (బొచ్చు)

ప్రశ్న 10.
మీ ప్రాంతంలో పెంచుకొనే జంతువులు, పక్షుల జాబితాను తయారు చేయండి.
జవాబు:

జంతువులు పక్షులు
గొర్రె, మేక, గేదెలు, దున్న, ఆవు గాడిద, కుక్క పందులు, పిల్లులు ఒంటెలు, గుర్రాలు మొ||నవి. కోళ్ళు, బాతులు, పావురాలు, చిలుకలు నెమలి, పాలపిట్ట, హంస, ఆస్ట్రిచ్ మొ||నవి.

ప్రశ్న 11.
AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం 3
పురాతన కుండ దీనిలో ఏమి నిల్వ ఉంచుకొనేవారని మీరు భావిస్తున్నారు.
జవాబు:
ఈ పురాతన కుండలో ధాన్యం నిల్వ ఉంచుకొనేవారని భావిస్తున్నాను. అలాగే వంటకు కూడా ఉపయోగించి ఉండవచ్చు.

AP Board 6th Class Social Solutions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

6th Class Social Textbook Page No.61

ప్రశ్న 12.
వంట చేయడానికి, ధాన్యం నిల్వ చేయడానికి ఆధునిక కాలంలో వాడుతున్న పరికరాలను పేర్కొనండి.
జవాబు:

వంట చేయడానికి ధాన్యం నిల్వ చేయడానికి
• గ్యాస్టవ్, ఇండక్షన్ స్టవ్ • గాలి, వేడి, తేమ ధాన్యంకు హాని కల్గించే అంశాలు వీటి నుండి రక్షణకై గ్లాసు, ప్లాస్టిక్, స్టీల్ అల్యూమినియం కంటైనర్స్ వాడతారు.
• ఎలక్ట్రిక్ కుక్కర్, ప్రెజర్ కుక్కర్
• ప్యాన్, స్టీల్ పాత్రలు
• ఓవెన్, టోస్టర్ • రిఫ్రిజిరేటర్
• గ్రిల్ (ఎలక్ట్రిక్) • జాడీలు
• స్టీల్ డబ్బాలు
• కోల్డ్ స్టోరేజీలు (శీతల గిడ్డంగులు)

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

SCERT AP 6th Class Social Study Material Pdf 12th Lesson సమానత్వం వైపు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 12th Lesson సమానత్వం వైపు

6th Class Social 12th Lesson సమానత్వం వైపు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. కింది వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి.
i) కులవ్యవస్థ అనేది భారతదేశంలో చాలా సాధారణంగా కనపడే అసమానతల్లో ఒకటి. ( ✓ )
ii) ప్రతి వ్యక్తికీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ( ✗ )
iii) ప్రజాస్వామిక సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడం అనేది నిరంతరం కొనసాగే పోరాటం. ( ✓ )

ప్రశ్న 2.
సమస్యలలో చిక్కుకున్నప్పుడు, ఈ సంఖ్యలను ఏ విధంగా ఉపయోగిస్తారు?
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 1
జవాబు:
100 : పోలీసులకు సంబంధించిన నంబరు. –
దొంగతనం, హత్య, దోపిడి మొదలైన అఘాయిత్యాలపుడు చేయవలసిన నంబరు

112 : మహిళలు అత్యవసర సమయాల్లో చేయవలసిన నంబరు.
‘దిశ’ మహిళా రక్షణకై ఏర్పాటు చేయబడింది మహిళలపై జరిగే ఎటువంటి దాడుల నుండైనా రక్షణ కల్పిస్తుంది. అత్యవసర సేవలు కూడా అందిస్తుంది.

181 : కేవలం మహిళా రక్షణకై ఏర్పాటు చేయబడిన నంబరు.
శారీరక వేధింపులు, గృహహింస, అత్యాచారాలు మొదలైన అఘాయిత్యాలు జరగకుండా (దిశ) నంబరును ఏర్పాటు చేసారు. మహిళా సమస్యలపై స్పందనకై ఏర్పాటైంది.

1091 : మహిళల ‘ఈవ్ టీజింగ్’ లాంటి సమస్యల నుండి రక్షణకై ఏర్పాటు చేసారు. మహిళామిత్ర, మహిళ రక్షక్, శక్తిటీమ్స్ మొ||న పోలీసు బృందాలు తక్షణం స్పందిస్తారు.

1098 : పిల్లల హక్కుల సంరక్షణకై ఏర్పాటు చేయబడింది. అన్నిరకాల పిల్లల వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ నంబర్లు అన్నీ 24 గం|| పని చేస్తాయి మరియు (టోల్ ఫ్రీ) ఉచితం.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 3.
ఈ రోజుకి కుల వ్యవస్థ ఎందుకు ఇంత వివాదాస్పదమైన అంశంగా మిగిలి ఉంది?
జవాబు:
ఈ రోజుకి కుల వ్యవస్థ ఇంత వివాదాస్పదమైన అంశంగా మిగలటానికి కారణం :

  • అనాదిగా వస్తున్న మూఢ నమ్మకాలు, విశ్వాసాలు.
  • నిరక్షరాస్యత, పేదరికం.
  • స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు, వ్యవస్థ
  • బ్రిటిషువారి విభజించు పాలించు విధానంలో కులవ్యవస్థ పాత్ర కూడ ఉంది.
  • చట్టాలు కఠినంగా అమలు పరచలేకపోవడం (వానిలోని లొసుగులు కారణం)

ప్రశ్న 4.
స్వాతంత్ర్యానికి ముందు ప్రజలు బాలికలను బడికి పంపించకపోవడానికి గల వేర్వేరు కారణాలేవి?
జవాబు:
స్వాతంత్ర్యానికి ముందు ప్రజలు బాలికలను బడికి పంపించకపోవడానికి గల కారణాలు :

  • బాల్య వివాహాలు, (కన్యాశుల్కం)
  • తల్లిదండ్రుల నిరక్షరాస్యత
  • తల్లిదండ్రుల పేదరికం
  • మూఢనమ్మకాలు, విశ్వాసాలు (ఆడపిల్లకు చదువు ఎందుకు అని అంటుండేవారు)
  • పాఠశాలలు అందుబాటులో లేకపోవడం (పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం)
  • పెద్ద కుటుంబాల (ఉమ్మడి కుటుంబాలు) అవ్వటం వలన ఆడపిల్లలను ఇంటి పనులకు పరిమితం చేయటం.
  • చిన్న పిల్లల సంరక్షణ బాధ్యతను ఇంటిలోని ఆడపిల్లలకు అప్పజెప్పడం.

ప్రశ్న 5.
భారతదేశంలో గల అసమానత యొక్క సాధారణ రూపాలు ఏమిటి?
జవాబు:
భారతదేశంలో గల అసమానత యొక్క రూపాలు :
ఆర్థిక అసమానతలు :

  • పేద, ధనిక (ఉన్నవారు, లేనివారు) వర్గాల మధ్య అసమానత.
  • సంపాదనల్లో అసమానత ఈ రోజుల్లో స్పష్టంగా కన్పిస్తుంది.

సామాజిక అసమానత :

  • సమాజంలోని వివిధ సమాజాలకు, కులాల మధ్య అసమానత.
  • అగ్రకులం, అణగారిన కులం మధ్య అసమానతలు.
    స్త్రీ, పురుషుల అవకాశాలలో, ఉద్యోగ, ఉపాధుల్లో అసమానత.
    బాగా చదువుకున్నటువంటి వారు నిరక్షరాస్యుల మీద అసమానత.

రాజకీయ అసమానత:
భారతదేశ రాజ్యాంగం అందరికి (రాజకీయంగా) సమాన హక్కులు ప్రసాదించినప్పటికీ, కొన్ని హక్కులు మాత్రం (ఉదా : ఎన్నికలలో పోటీచేయడం) కొన్ని వర్గాలకి పరిమితం అవుతుంది.

ప్రశ్న 6.
భారత ప్రజాస్వామ్యంలో సమానత్వంపై ఒక చిన్న వ్యాసం రాయండి.
జవాబు:

  • 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన నాయకులు సమాజంలో ఉన్న వివిధ రకాల అసమానతలు గురించి ఆందోళన చెందారు.
  • సమానత్వ సూత్రంపై సమాజం పునర్నిర్మించబడాలని ప్రజలు భావించారు.
  • కనుకనే భారత రాజ్యాంగంలో సమానత్వ సాధనకు ప్రాధాన్యత ఇవ్వబడింది.
  • అంటరానితనం చట్టం ద్వారా రద్దు చేయబడింది.
  • ప్రజలకు తాము చేయాలనుకుంటున్న పనిని ఎంచుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వబడింది.
  • ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ అవకాశం కల్పించబడింది. ప్రజలందరికీ సమాన ప్రాముఖ్యత లభించింది.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 7.
భారతీయ సమాజంలో అసమానత మరియు వివక్షతలను తొలగించడానికి సూచనలు ఇవ్వండి.
జవాబు:
అసమానత మరియు వివక్షతలను తొలగించడానికి సూచనలు :
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 2

  • గొప్ప మార్పు తల్లిదండ్రుల నుండే రావాలి. ఇతరుల పట్ల తమ వైఖరులు, మాటలు, ప్రవర్తనలకు తల్లిదండ్రులే ఉత్తమ నమూనాలుగా నిలవాలి.
  • ఇతర మతాల గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, వారి నమ్మకాలను గౌరవించాలి.
  • స్త్రీలను సమానంగా భావించి గౌరవించాలి
  • అంగ వైకల్యం కలవారి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రోత్సహించాలి.
  • ఆరోగ్య సంరక్షణ మరియు విద్య వంటి నాణ్యమైన ప్రాథమిక సేవలను అందరికీ విస్తృతంగా అందుబాటులోకి తేవాలి.

ప్రశ్న 8.
అసమానత మరియు వివక్షతల మధ్య తేడాను తెలపండి.
జవాబు:

  • అసమానత్వము అనేది వ్యక్తులు లేదా వర్గంలోని సామాజిక స్థాయి, సంపద, అవకాశాలలో బేధమును తెలుపుతుంది.
  • వివకత అనేది వ్యక్తుల లేదా వ్యక్తుల నైపుణ్యం, యోగ్యత, గుణము మొదలైన వాటిని కాకుండా వారి వర్గాన్ని (కులము), ప్రాంతాన్ని, చర్మ రంగును (జాతి) లింగం మొ||న వాటిని పరిగణలోకి తీసుకుని సదరు వర్గాలు (బృందాల) పట్ల అన్యాయంగా, అసమానంగా చూడటం.

6th Class Social Studies 12th Lesson సమానత్వం వైపు InText Questions and Answers

6th Class Social Textbook Page No.137

ప్రశ్న 1.
ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఏ విధమైన వివక్షతకు గురవుతున్నారు?
జవాబు:
ప్రస్తుత సమాజంలో స్త్రీలు వివక్షతకు గురవుతున్న అంశాలు :

  • ప్రభుత్వేతర పనుల్లో స్త్రీ, పురుషుల మధ్య వేతనాల్లో అసమానత ఉంటుంది.
  • వివాహ సందర్భంలో (కట్న కానుకలు ఆడపిల్లవారికి తలకి మించిన భారమవుతుంది)
  • వివాహం తరువాత ఆడపిల్లను (పెండ్లికొడుకు) భర్త ఇంటికి పంపటం, ఆచారంగా ఉంది. దీనివలన ఆడపిల్ల తన తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది.
  • ఉన్నత విద్యను అందించే విషయంలో కొంతమేర ఆడపిల్లలు వివక్షతను ఎదుర్కొంటున్నారు. (మగపిల్లలతో పోల్చితే)
  • వేసుకొనే దుస్తుల్లో కూడా వివక్షత కన్పిస్తుంది.
  • కార్యాలయాల్లో, ఉపాధి ప్రదేశాలలో స్త్రీలు వివక్షతకు గురవుతున్నారు.
  • ఆచార, సాంప్రదాయాల్లో (ఉదా : తలకొరివి పెట్టడం) పురుషాధిక్యత కన్పిస్తుంది.

ప్రశ్న 2.
ఇతర మతాలకు చెందిన ప్రాంతాలకు నీవెప్పుడైనా వెళ్ళావా? అక్కడ నీవు గమనించిన మంచి విషయాలు ఏవి? ఏ సారూప్యతలు నీవు గమనించావు?
జవాబు:
ఇతర మతాలకు చెందిన ప్రాంతాలకు నేను తరచుగా వెళతాను.
అక్కడ గమనించిన మంచి విషయాలు :

  1. వారు అందరూ కలసి మెలసి ఉంటూ, నన్ను కూడా కలుపుకున్నారు.
  2. వారు వారి పెద్దలను గౌరవిస్తూ, వారు చెప్పేది శ్రద్ధగా పాటిస్తున్నారు.
  3. వారి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
  4. అందరి మంచిని కోరుకుంటున్నారు. (సర్వేజనా సుఖినోభవంతు అని)

గమనించిన సారుప్యతలు :

  1. అందరి భావాలు దేవుడు ఒక్కడే అని చెబుతున్నాయి.
  2. ప్రేమతత్వాన్ని బోధిస్తున్నాయి.
  3. తోటి ప్రాణి మంచిని కోరుతున్నారు.
  4. పాప, పుణ్యాల గురించి తెల్పుతున్నాయి.

6th Class Social Textbook Page No.139

ప్రశ్న 3.
లింగ వివక్షతను నీవు సమర్థిస్తావా? తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
లింగ వివక్షతను నేను సమర్థించను. ఎందుకంటే

  1. స్త్రీలు, ఈనాడు మగవారితో సమానంగా చదువుకుంటున్నారు.
  2. స్త్రీలు, ఈనాడు మగవారితో సమానంగా ఉద్యోగ, ఉపాధులు పొందుతున్నారు.
  3. స్త్రీలు, ఈనాడు మగవారితో సమానంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో ముందు ఉన్నారు.
  4. స్త్రీలు, ఈనాడు మగవారితో సమానంగా రవాణా, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దూసుకు పోతున్నారు
  5. స్త్రీ, పురుషులు శారీరకంగా ప్రకృతి సహజంగా కొన్ని బేధాలుండవచ్చు. అంతేగాని మిగతా విషయాల్లో సమానమే.

6th Class Social Textbook Page No.140

ప్రశ్న 4.
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 3
ఎ) ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు:
ఇది దక్షిణాఫ్రికాలో జరిగిన సంఘటన, ఈ విధమైన జాతి వివక్షత చూపించడం నిజంగా దురదృష్టకరం, అవాంఛనీయం, ఖండనీయం. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు చేపట్టాలి.

బి) ఇది ఏ రకమైన వివక్ష? తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
ఇది జాతి వివక్షత:

  • ఇది వ్యక్తి యొక్క చర్మపు రంగు లేదా జాతి లేదా జాతి మూలం ఆధారంగా చూపే వివక్ష.
  • గాంధీజి దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాకు రైలులో ప్రయాణించేటప్పుడు ఈ వివక్షతలను ఎదుర్కొన్నారు.
  • రైలులో మొదటి తరగతి టికెట్లు తీసుకున్నప్పటికి తెల్లజాతీయుల ప్రోద్బలంతో ఆయన విచక్షణా రహితంగా రైలు నుండి తోసివేయబడ్డారు.
  • ఇదే విధంగా నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.
  • వర్ణ వివక్షత వ్యవస్థ అనగా జాతి ప్రాతిపదికన ప్రజలను వేరుచేయడం.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 5.
మీరెప్పుడైనా ఏ రకమైనా వివక్షతనైనా ఎదుర్కొన్నారా? అప్పుడు మీకెలా అనిపించింది? Page No. 140
జవాబు:
నేను ఎప్పుడు ఏ విధమైన వివక్షతను ఎదుర్కొలేదు. మా పాఠశాలలో అందరం ఎంతో స్నేహంతో కలసి, మెలిసి, ఉంటాం. ఉపాధ్యాయులు కూడా మాతో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు.

అయితే క్రీడల విషయంలో దివ్యాంగుడైన నా స్నేహితుడు పాల్గొనలేకపోవడం చాలా బాధగా అన్పించింది.

కింది చిత్రాలను పరిశీలించండి.
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 4 AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 5

6th Class Social Textbook Page No.141

ప్రశ్న 6.
మీరిక్కడ ఏమి గమనించారు? మీ టీచర్ సహాయంతో చర్చించండి.
జవాబు:
మేము ఇక్కడ గమనించిన విషయాలు : .

  • ఇవి వివిధ రకాల వివక్షతను తెలియజేస్తున్న చిత్రాలు.
  • మొదటి రెండు బొమ్మల్లో బాలికల, బాలుర ఆటబొమ్మలు చూస్తే ఆడపిల్లల బొమ్మలు వంటసామాన్లు (కిచెన్), బేబీ బొమ్మలు ఇలా వారిని ఆయా పనులను భవిష్యత్తులో చేసేందుకు ఉన్ముఖీకరిస్తున్నట్లుంది. అదే బాలుర ” బొమ్మలు జీపులు, రోబోట్లు మొ||నవి ఇవి మగవారు మాత్రమే చేసేవిగా చూపిస్తున్నట్లుంది.
  • రెండవ చిత్రంలో చర్మరంగు (కులం కూడా కావచ్చు) ఆధారంగా వివక్షతను చూపుతుంది.
  • మూడవ చిత్రంలో ఆర్థికపరంగా (కులం కూడా కావచ్చు) ఆధారంగా వివక్షతను చూపుతుంది.
  • నాల్గవ చిత్రంలో కూడా (స్త్రీ) బాలికా వివక్షతను చూపుతుంది. ఇల్లు ఊడవటం, వంటచేయడం మొ||నవి సీలు (బాలిక) చేస్తున్నారు. పురుషుడు (బాలుడు) చదువుకుంటున్నారు.

6th Class Social Textbook Page No.141

ప్రశ్న 7.
గతానికీ, ఇప్పటికీ మీరేమైనా మార్పులు గమనించారా? ఈ మార్పులు ఎలా వచ్చాయి?
జవాబు:

  • గతానికీ, ఇప్పటికీ మార్పులు గమనించాను. ఈ మార్పులు ఎలా వచ్చాయి. అంటే,
  • భారత రాజ్యాంగం ప్రసాదించిన సమాన హక్కులు, చట్టాలు వలన,
  • ప్రభుత్వాలు అందిస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల వలన.
  • అందరూ చదువు కోవటం, విద్యావంతులవ్వటం వలన.
  • శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందటంతో సాంఘిక దురాచారాలు, మూఢ విశ్వాసాలు రూపుమాసిపోవడం వలన.
  • నేటి సమాచార ప్రసార సాధనాల వలన ప్రపంచమే ఒక కుగ్రామంగా (గ్లోబలైజేషన్) మారిపోవటం వలన.
  • జనాభా పెరగటం, పట్టణీకరణ పెరగటం వలన

6th Class Social Textbook Page No.144

ప్రశ్న 8.
ప్రభుత్వం మధ్యాహ్న భోజనం, అమ్మఒడి, ఉచిత పాఠ్యపుస్తకాలు, పాఠశాల యూనిఫాంలు, బూట్లు పంపిణీ మొదలైన అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఇవి సమానత్వ సాధనకు ఎలా సాయపడతాయో చర్చించండి.
జవాబు:

  • ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాల వలన విద్యార్థులందరూ ఒక విధమైన (యూనిఫాం) దుస్తులు, బూట్లు ధరించటంతో, వారిలో ధనిక పేద తేడా లేకుండా సమానంగా భావిస్తారు.
  • మధ్యాహ్న భోజన కార్యక్రమంలో విద్యార్థులందరూ కుల, మత, ప్రాంతీయ, ఆర్థిక బేధాలు లేకుండా కలసి కూర్చోని భోంచేస్తారు.
  • అలాగే ఆర్థిక విషయాల కారణంగా ఎవరూ బడి మానకుండా, ఉచిత పాఠ్యపుస్తకాలు అమ్మఒడి చేయూతనిస్తోంది. అందరూ విద్య నేర్చుకుంటారు, తద్వారా విద్యలో సమానత్వం సాధించవచ్చు.
  • అలాగే పాఠశాలలో చేపట్టే అన్ని కార్యక్రమాలు ఏ విధమైన వివక్షత చూపకుండా అందరికి సమానంగా అందేలా చూస్తారు.

AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 9.
వివక్షకు వ్యతిరేకంగా పోస్టర్లను తయారు చేయండి. పాఠశాలలోని ఇతర విద్యార్థులు కూడా వివక్షను వ్యతిరేకించేలా, తయారు చేసిన పోస్టర్లను పాఠశాల అంతటా ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు.
ఆధారం :
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 7
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 6

ప్రశ్న 10.
మన పాఠ్యపుస్తకంలో ప్రవేశిక ఉన్నది. అది ఎక్కడ ఉన్నదో కనుక్కోండి. శ్రద్ధగా చదవండి. సమానత్వం గురించి మీరేమి అవగాహన చేసుకున్నారో తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
మన పాఠ్యపుస్తకంలో ప్రవేశిక మొదటి పేజిలో ఉంది.

సమానత్వం గురించి నేను అవగాహన చేసుకున్న అంశాలు :

  • మన రాజ్యాంగం అన్ని అంశాలలో (ఉదా॥ ఆదాయం, ఆస్తుల విషయంలో) సమానత ఇవ్వటం లేదు, కానీ ఈ అందరికీ ఒకే హోదా ఉండేలా చూస్తుంది. దీని అర్థం ప్రతి ఒక్కరికీ ఒకే చట్టాలు వర్తిస్తాయి.
    AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 8
  • ఆటోమూ స్వేచ్ఛ, ఆవ ప్రకటనా స్వేవు నమ్ముతాన్ని పర్నాసార్లు కలిగివుంది ఆసక్తి అందాన్ని పెంపొందించడం.
  • రెండవది అది ‘అవకాశాలలో’ సమానత్వానికి హామీ ఇస్తోంది. దీని అర్థం. ప్రభుత్వ అవకాశాలన్నీ కులం, మతంతో సంబంధం లేకుండా అందరికి అందుబాటులో ఉంటాయి.
  • ఒక పదవికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సి వస్తే, ఆ అర్హతలు కూడా అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా చేస్తారు.

ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
ద్వేషాన్నీ, అసమానతను ఎదుర్కొన్న ఎవరైనా ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తుల గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
విద్యార్థులు క్రింది విషయాల ఆధారంగా స్వయంగా రాయగలరు.
ద్వేషాన్నీ, అసమానతను ఎదుర్కొన్న ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తులు.

మరియప్పన్ తంగవేలు :
మరియప్పన్ తంగవేలు ఒక భారతీయ పారా ఒలింపిక్ హై జంప్ క్రీడాకారుడు – తొమ్మిదేళ్ళ వయసులో తన కాలుకు గాయమైంది. 2016లో బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరిగిన పారా ఒలింపిక్స్ లో పురుషుల హై జంప్లో ఆయన బంగారు పతకాన్ని సాధించారు.
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 9

సింధుతాయి – ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం :
సింధుతాయి. 1948లో జన్మించింది. ఆమె తండ్రి ఆమెను విద్యావంతురాలిని చేయాలని ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు. పశువులను మేపేందుకు పంపకుండా ఆమెను బడికి పంపాడు. తొమ్మిదేళ్ల వయసులోనే ఆమెకు వివాహమయింది. ఇరవయేళ్ల వయసులో తొమ్మిదోనెల గర్భంతో ఉండగా, ఆమె భర్త ఆమెను చనిపోయేటంతగా కొట్టాడు. ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి, అతి కష్టం మీద ప్రాణాలను నిలబెట్టుకున్నది. పుట్టినింటికి వెళ్లగా, తన తల్లి ఆమెకు ఆశ్రయమివ్వడానికి నిరాకరించింది. అప్పుడామె రైల్వే ప్లాట్ ఫాం మీద భిక్షాటన చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తల్లిదండ్రుల చేత వదిలివేయబడ్డ పిల్లలు అనేకమంది ఉన్నారని ఆమె గుర్తించింది. వాళ్లనామె దత్తత తీసుకున్నది.

అనాథలకోసం ఒక ఆశ్రమాన్ని ప్రారంభించింది. 1200 మంది అనాథలకు ఆమె తల్లిగా మారింది. 750 అవార్డులను స్వీకరించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘నారీ శక్తి’ పురస్కారాన్ని అందుకున్నది. పేదరికం, బాల్య వివాహం, లింగవివక్ష, కుటుంబ నిరాదరణ – ఇవేమీ ఆమెను ఆపలేకపోయాయి. పట్టుదల గల వ్యక్తికి ఏదీ అసాధ్యం కాదనడానికి ఇది ఒక నిదర్శనం.
AP Board 6th Class Social Solutions Chapter 12 సమానత్వం వైపు 10

AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

SCERT AP 6th Class Social Study Material Pdf 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

6th Class Social 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భూ స్వరూపం అనగా నేమి?
జవాబు:
మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదు. కొన్నిచోట్ల ఉన్నతి చెందిన ప్రాంతాలు, విశాల మైదానాలు నుండి లోయల వరకు ఈ అంతరాలు ఉండవచ్చును. మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు మైదానం పీఠభూమి, కొండ, పర్వతం, లోయ వంటి వివిధ రూపాలను గమనిస్తాం. వీటినే భూస్వరూపాలని పిలుస్తారు.

ప్రశ్న 2.
భూ స్వరూపాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చును?
జవాబు:
భూస్వరూపాలు ముఖ్యంగా మూడు రకాలుగా చెప్పవచ్చును. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఈ ప్రధాన భూస్వరూపాలు అనేక చిన్న భూస్వరూపాలను కలిగి ఉంటాయి. ఈ భూస్వరూపాల ఎత్తు సముద్రమట్టం ఆధారంగా కొలుస్తారు.

ప్రశ్న 3.
డెల్టా ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
నది సముద్రంలో కలిసే ముందు చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్యభాగంలో ఇసుక, మెత్తటి మట్టి (ఒండ్రు) మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. సాధారణంగా ఇవి ‘A’ త్రిభుజాకారం (డెల్టా)లో ఉంటాయి. ఇవి చాలా సారవంతంగా ఉంటాయి.

ప్రశ్న 4.
మైదాన ప్రాంతాలలో ఎందువలన జనసాంద్రత అధికంగా ఉంటుంది?
జవాబు:
మైదాన ప్రాంతాలలో జనసాంద్రత అధికంగా ఉండటానికి గల కారణాలు :

  • మైదాన ప్రాంతాల్లోని నేలలు సారవంతంగా ఉండి మంచి పంటల దిగుబడినిస్తాయి.
  • భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో అనేక రకాల పంటలు పండించడానికి అనుకూలమైన నేలలున్నాయి.
  • మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన నగరాలకు ఆలవాలంగా ఉన్నాయి.
  • ఇక్కడ మెరుగైన రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి, చెందుతున్నాయి.
  • వ్యవసాయదారులు మిగులు సొమ్మును పెట్టుబడిగా మార్చి పరిశ్రమల స్థాపనకు దోహదం చేయటం వలన వృత్తి ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయి.
  • మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన “సాగు నీరు, త్రాగునీరు” వసతులు కల్గి ఉండి ఇండ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉండి జననివాస యోగ్యంగా ఉన్నాయి.
  • మైదాన ప్రాంతాలు ప్రాచీన కాలం నుండి మానవ ఆవాసాలకు నిలయం.
    ఉదా : సింధూ నాగరికత.

AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

ప్రశ్న 5.
విభిన్న భూస్వరూపాలలోని వివిధ రకాల నేలలను పోలండి.
జవాబు:

మైదానాల నేలలు పీఠభూముల నేలలు పర్వత (కొండ) ప్రాంత నేలలు
ఇవి సారవంతమైన ఒండ్రు, నల్లరేగడి నేలలు. ఇవి తక్కువ సారవంతమైన నేలలు. ఎర్ర, లాటరైట్, నల్లరేగడి నేలలు. రాతి పొరలతో కూడిన ఎర్ర నేలలు.
ఇవి తేమను ఎక్కువ నిలువ చేసుకుంటాయి. ఇవి తేమను తక్కువ నిలువ చేసుకుంటాయి. ఇవి తేమను నిల్వ చేసుకోవు.
ఇవి నదీతీరాలలో ఉంటాయి. ఇవి కొండల పాదాల దగ్గరగాని లేదా కొండలతో నిండిగాని ఉంటాయి. కొండ ఉపరితలంపై ఉంటాయి.
ఇవి సం||రానికి మూడు పంటలకు అనుకూలం. ఇవి సం||రానికి ఒక పంటకి కూడా అనుకూలం అని చెప్పలేము. పానీయపు పంటలకు అనుకూలం పోడు వ్యవసాయం చేస్తారు.

ప్రశ్న 6.
ప్రభుత్వం కొన్ని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా ఎందుకు గుర్తిస్తుంది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాలలో జూన్ నుండి నవంబరు వరకు వర్షాకాలం. వర్షం తక్కువ’ మరియు అంతగా నమ్మదగినదిగా ఉండదు. కరవు తరచుగా పునరావృతమయ్యే ప్రక్రియ. వర్షం చాలా తక్కువగా ఉండడం, రైతులు తరచుగా పంట నష్టపోతూ ఉండడంతో ప్రభుత్వం కొన్ని మండలాలను కరవుకి గురయ్యే ప్రాంతాలుగా ప్రకటిస్తుంది.

ప్రశ్న 7.
“భౌగోళిక మరియు శీతోష్ణస్థితి పరిస్థితులు ఒక ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలను నిర్ధారిస్తాయి”. వివరించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని ఈ భూస్వరూపాల కింద విస్తరించియున్న వివిధ ప్రాంతాలలో విభిన్నమైన పరిస్థితులను మనం గమనిస్తాం. భౌగోళిక మరియు శీతోష్ణస్థితి పరిస్థితులు ఒక ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావాన్ని చూపుతాయి. మైదానాలలో ఉండే ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడితే, కోస్తా తీర ప్రాంతాలలోని ప్రజలు చేపలు పట్టడం వారి ప్రధాన వృత్తిగా మలచుకుంటారు. బుట్టలు అల్లడం, చేపలు పట్టడం, పందులు పెంపకం, కోళ్ళ ఫారాలు, రైసు మిల్లులలో పనిచేయడం మైదాన ప్రాంతాలలో వ్యవసాయేతర కార్యకలాపాలు కాగా గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంటు ఇటుకల తయారీ మొదలగు పనులు పీఠభూమి ప్రాంతాలలో చేపడతారు.

పర్వత ప్రాంతాలు, కొండలపైన పశువుల పెంపకం, పండ్లు, తేనె, జిగురు వంటి అటవీ వస్తువులను సేకరణ చేస్తారు. కొండవాలులు కాఫీ, టీ మొదలగు పంటల సాగుకి అనుకూలమైన శీతోష్ణస్థితిని కలిగి ఉంటాయి. అడవిలో వెదురు సమృద్ధిగా లభిస్తుంది కనుక గిరిజనులు బుట్టలు, చేటలు, దోనెలు మొదలగు వస్తువులను తయారు చేసి వాటిని మార్కెట్లో అమ్ముతారు. కాగితం మిల్లుల ప్రతినిధులు వీరిని వెదురు నరికే పనిలో వినియోగించుకోవడం వలన గిరిజనులు మంచి ఆదాయాన్ని పొందుతారు.

ఇలా భూస్వరూపాలలో వైవిధ్యతలు ఆ ప్రాంతంలోని వృత్తులు, ఆహార పద్ధతులు, సహజ జీవజాలంపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రాంతంలోని శీతోష్ణస్థితులపై అక్కడి వృక్ష, జంతు సంపదలు ఆధారపడి ఉంటాయి. ఆహారం, వస్త్రధారణ, వృత్తులు వారి జీవనోపాధులు ప్రాంతీయంగా ఉండే భౌగోళిక పరిసరాలు, శీతోష్ణస్తితితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి.

ప్రశ్న 8.
మీగ్రామంలో ఉండే అన్ని ప్రాంతాలు వ్యవసాయక దిగుబడిని ఇచ్చేవేనా? మీ జవాబు అవును, కాదు ఏదైనా తగిన కారణాలు రాయండి.
జవాబు:
మా గ్రామంలో ఉండే అన్ని ప్రాంతాలు వ్యవసాయక దిగుబడిని ఇచ్చేవి (అవును)
కారణం:

  • మా గ్రామం మైదాన ప్రాంతంలో ఉంది.
  • ఇక్కడి నేలలన్నీ సారవంతమైనవి.
  • కొంత పల్లపు (మాగాణి), కొంత మెరక (మెట్ట) భూములున్నాయి.
  • దాదాపు అన్ని భూములకు నీటి సౌకర్యం (కాలువలు, బోరుబావులు) కలదు.

మా గ్రామంలో ఉండే అన్ని ప్రాంతాలు వ్యవసాయక దిగుబడిని ఇచ్చేవి (కాదు)
కారణం:

  • మా గ్రామంలో కొంత ప్రాంతం గుట్టలు, మిట్లతో (కొండలతో) కూడి ఉంది.
  • ఇక్కడి నేలలన్ని వ్యవసాయంకు అనుకూలంగా ఉండవు.
  • నీటి సౌకర్యం కూడా అంతగా లేదు. కొన్ని భూములకు మాత్రమే నీటి సౌకర్యం ఉంది.
  • ఎక్కువగా వర్షపాతం మీద ఆధారపడటం.

ప్రశ్న 9.
గిరిజనుల జీవన విధానాన్ని పరిరక్షించడం ముఖ్యమైనదిగా నీవు భావిస్తున్నావా?
జవాబు:
గిరిజనులు జీవనవిధానాన్ని పరిరక్షించడం ఎంతో ముఖ్యం, అవసరం కూడా అని నేను భావిస్తున్నాను.

  • గిరిజనులు వారికి మాత్రమే ప్రత్యేకమైన భిన్న సంస్కృతిని కలిగి ఉంటారు.
  • వారు ఉపయోగించుకునే అడవులను వారు నాశనం చేసుకోరు. అడవులను గూర్చి సంపూర్ణ అవగాహనని కలిగి ఉంటారు, కనుక అడవిలో స్వేచ్ఛగా నివసించడాన్ని వారు ఇష్టపడతారు.
  • వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న ఈ సమూహాల జీవన విధానాన్ని పరిరక్షించాల్సిందే. వీరి సంస్కృతి మరియు నాగరికత ప్రాచీన గిరిజనుల చరిత్రకు నిదర్శనం.
  • పర్యావరణానికి విఘాతం కలిగించకుండా వీరు జీవనాన్ని సాగిస్తారు. అందువల్ల వీరి జీవన విధానాన్ని పరిరక్షించడం ముఖ్యమైనదిగా భావిస్తున్నాను.

ప్రశ్న 10.
గిరిజనుల పెరటితోట ఎందువలన ముఖ్యమైనది?
జవాబు:
అటవీ ప్రాంతాలలో ఉండే గుడిసెలకి వెనుక విశాలమైన పెరడు ఉంటుంది. ఇంటి చుట్టూ వెదురుతో కంచె నిర్మిస్తారు. పెరటితోట కొరకు ఈ భూమిని చదును చేసిన సేంద్రియ పదార్థాలను కలిపి సారవంతంగా తయారుచేస్తారు. ఆహారంగా ఉపయోగించడానికి మరియు జీవనోపాధికి ప్రధానంగా మొక్కజొన్న, చిక్కుడు, సొరకాయ, మిర్చి మొదలగు కూరగాయలను ఇక్కడ పండిస్తారు. కావున గిరిజనుల పెరటితోట ముఖ్యమైనది.

ప్రశ్న 11.
మైదాన ప్రాంతంలో వ్యవసాయం ఎందుకు లాభదాయకమైన వృత్తి వివరించండి.
జవాబు:

  • ఇక్కడ అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండడం చేత మైదాన ప్రాంతాలు వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
  • లోతైన, సారవంతమైన నేలలు, చదునైన ఉపరితలం వలన పంటసాగులో యాంత్రీకరణకు అనువుగా ఉంటుంది.
  • అంతేగాక పశువులకు దాణాగా ఉపకరించే గడ్డి భూములుగా కూడా ఉపకరిస్తాయి.
  • పంటల దిగుబడికి అవసరమైన మెరుగైన నీటి సౌకర్యం ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటుంది
  • వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగుల సౌకర్యం, రవాణా సౌకర్యాలు కల్గి ఉంటాయి.

12. తూర్పు కనుమలలో ఎత్తయిన శిఖరం ………….. (అరోమ కొండ (జిందగడ)
13. …….. లో చాలాభాగం దక్కన్ పీఠభూమిలో కలదు. (రాయలసీమ)
14. మైదాన ప్రాంతాలలో ………… పంట ఎక్కువగా పండించబడుతుంది. (వరి)
15. తూర్పు కనుమలలోని కొండలు ………….. చే ఏర్పడినవి. (ఖాండలైట్, చార్నో కైట్)
16. కొండ ప్రాంతాలలోని ప్రజలు …………. నుంచి నీరు తెచ్చుకుంటారు. (చిన్నవాగులు, నీటి ఊటల)
17. …………. నేలలు ఎక్కువ శాతం సున్నం, క్షారాలను కలిగి ఉంటాయి. (చౌడు)
18. మైదాన ప్రాంతాలు ……………. కురిసే నేలలు. (ఋతుపవన వర్షాలు)

19. పీఠభూములు వీటికి ప్రసిద్ధి
అ) కూరగాయలు
ఆ) ఖనిజాలు
ఇ) జనాభా
ఈ) పంటలు
జవాబు:
ఆ) ఖనిజాలు

20. నల్లరేగడి నేలలు ఏ పంటకు సారవంతమైనవి?
అ) పత్తి
ఆ) చిరుధాన్యాలు
ఇ) కూరగాయలు
ఈ) గోధుమ
జవాబు:
అ) పత్తి

21. కోస్తా ఆంధ్రాలో జిల్లాలు కలవు.
అ) 6
ఆ) 4
ఇ) 9
ఈ) 5
జవాబు:
ఇ) 9

22. ఈ కింది పట్టికను సరైన సమాచారంతో నింపండి.
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 1
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 2

6th Class Social Studies 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు InText Questions and Answers

6th Class Social Textbook Page No.41

ప్రశ్న 1.
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 3
పై చిత్రం చూసి భూస్వరూపాల పేర్లు వ్రాయండి.
జవాబు:
పర్వతాలు (కొండలు), పీఠభూములు, మైదానం.

ప్రశ్న 2.
మీ గ్రామం/పట్టణం పరిసరాలలో ఉన్న భూస్వరూపాల పేర్లు వ్రాయండి.
జవాబు:
మా గ్రామం పరిసరాలలో మైదానం, కొండలు ఉన్నాయి.

ప్రశ్న 3.
‘మైదాన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం సులభం’ కారణం చెప్పండి.
జవాబు:
మైదాన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం సులభం కారణం:

  • ఇవి సమతలంగా ఉంటాయి, రోడ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉంటాయి.
  • మైదాన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంకు ఖర్చు తక్కువవుతంది..
  • రవాణా సౌకర్యాలు, పరిశ్రమలు ఎక్కువగా ఉండటం.

6th Class Social Textbook Page No.42

ప్రశ్న 4.
మైదాన ప్రాంతాలు ఎందువలన ఎక్కువ జనసాంద్రతను కలిగి ఉంటాయి?
జవాబు:
మైదాన ప్రాంతాలలో జనసాంద్రత అధికంగా ఉండటానికి గల కారణాలు :

  • మైదాన ప్రాంతాల్లోని నేలలు సారవంతంగా ఉండి మంచి పంటల దిగుబడినిస్తాయి.
  • భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో అనేక రకాల పంటలు పండించడానికి అనుకూలమైన నేలలున్నాయి.
  • మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన నగరాలకు ఆలవాలంగా ఉన్నాయి.
  • ఇక్కడ మెరుగైన రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి, చెందుతున్నాయి.
  • వ్యవసాయదారులు మిగులు సొమ్మును పెట్టుబడిగా మార్చి పరిశ్రమల స్థాపనకు దోహదం చేయటం వలన వృత్తి ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయి.
  • మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన “సాగు నీరు, త్రాగునీరు” వసతులు కల్గి ఉండి ఇండ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉండి జననివాస యోగ్యంగా ఉన్నాయి.
  • మైదాన ప్రాంతాలు ప్రాచీన కాలం నుండి మానవ ఆవాసాలకు నిలయం.
    ఉదా : సింధూ నాగరికత.

ప్రశ్న 5.
సాధారణంగా మైదాన ప్రాంతాలలో ఉండే గ్రామాలు మంచి ఉపాధి, జీవన ప్రమాణం కలిగి ఉంటాయి? ఎందువలన?
జవాబు:
మైదాన ప్రాంతాలలో ఉండే గ్రామాలు మంచి ఉపాధి జీవన ప్రమాణం కల్గి ఉండటానికి కారణం :

  • ఈ ప్రాంతాల్లో సారవంతమైన నేలలు ఉండటం వలన ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది.
  • వ్యవసాయదారులు మిగులు సొమ్మును పెట్టుబడిగా మార్చి పరిశ్రమల స్థాపనకు దోహదం చేయటం వలన వృత్తి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి.
    ఉదా : రైసుమిల్లులు, చక్కెర కర్మాగారాలు మొ||నవి.
  • మెరుగైన రవాణా సౌకర్యాలుండటం వలన (ఎగుమతులు, దిగుమతులు) వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధి .. చెంది ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
  • అనేక రకాల ఇతర వృత్తులు కూడా అధికంగా వృద్ధి చెంది ఉండటం.

ప్రశ్న 6.
ఏరకమైన నేలలు వ్యవసాయానికి ఎక్కువ అనుకూలం?
జవాబు:
మైదాన ప్రాంతంలోని ఒండ్రు (డెల్టా), నల్లరేగడి నేలలు వ్యవసాయానికి ఎక్కువ అనుకూలం. నేలలతోపాటు నీటిసౌకర్యం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 7.
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 4 AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 5 AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 6
పైన ఉన్న పర్వతాలు, పీఠభూమి, మైదానాలు చిత్రాలను చూసి మీ ప్రాంతం దేనిని పోలి ఉందో గుర్తించండి.
జవాబు:
మా ప్రాంతం మైదాన ప్రాంతాన్ని పోలి ఉంది. (నోట్ : విద్యార్థులు, మీ ప్రాంతాలను బట్టి జవాబు రాయగలరు.)

6th Class Social Textbook Page No.43 & 44

ప్రశ్న 8.
పటం పరిశీలించి క్రింది ఖాళీలను పూరించండి.
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 7
A. ఉత్తరం నుండి దక్షిణం వరకు కోస్తా జిల్లాల పేర్లు.
జవాబు:

  1. శ్రీకాకుళం
  2. విజయనగరం
  3. విశాఖపట్నం
  4. తూర్పు గోదావరి
  5. పశ్చిమ గోదావరి
  6. కృష్ణా
  7. గుంటూరు
  8. ప్రకాశం
  9. PSR నెల్లూరు

B. రాయలసీమ జిల్లాల పేర్లు
జవాబు:

  1. కర్నూలు
  2. అనంతపురం
  3. YSR కడప
  4. చిత్తూరు

C. మీ గ్రామం / పట్టణం / నగరం పేరు : ……………
మండలం : ……………
జిల్లా : ……………
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న జిల్లాలు : …………………….
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలు : ……………
జవాబు:
మీ గ్రామం / పట్టణం / నగరం పేరు : రాయపూడి
మండలం : తుళ్ళూరు
జిల్లా : గుంటూరు
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న జిల్లాలు : కృష్ణా, ప్రకాశం
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలు : తెలంగాణ

6th Class Social Textbook Page No.46

ప్రశ్న 9.
కొండ ప్రాంతాలు పానీయపు పంటల ఉత్పత్తికి ఎందువలన అనుకూలం? మీ స్నేహితులు మరియు ఉపాధ్యాయులతో చర్చించి రాయండి.
జవాబు:
కొండ ప్రాంతాలు పానీయపు పంటల ఉత్పత్తికి అనుకూలం ఎందువలన అంటే,

  • కొండ ప్రాంతాలలో నేలలు వాలుగానూ, ఎగుడు దిగుడుగాను ఉంటాయి.
  • ఇవి ఎత్తులో ఉండటం వలన నీరు నిలబడకుండా కిందకి జారిపోవడం జరుగుతుంది.
  • తేయాకు మొక్కలకు వెచ్చని, ఆర్ధ శీతోష్ణస్థితితోపాటు, హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి.
  • కొండ (వాలు) ప్రాంతాలలో సహజంగా కాంటూర్ వ్యవసాయం చేస్తారు. ఇక్కడి నేలల్లో మిగతా పంటలు అంతగా దిగుబడినీయవు.
  • కొండప్రాంతాలు వాలుగా ఉండి వర్షపు నీరు మొక్కల మొదళ్ళల్లో నిలబడకుండా చక్కగా పారతాయి. ఇలాంటి సౌకర్యమే ఈ పానీయపు పంటలకు కావాలి అంటే వర్షపాతం సంవత్సరం అంతా అవసరం, అలాగే ఎక్కువ నీరు మొక్కల మొదళ్లల్లో చేరకూడదు.

ప్రశ్న 10.
కొన్ని అటవీ ఉత్పత్తుల పేర్లు రాయుము.
జవాబు:
అటవీ ఉత్పత్తులు :

  1. వివిధ రకాల పళ్లు (సీతాఫలం, జామ, పనస మొ||నవి)
  2. వివిధ రకాల దుంపలు (వెదురు, చిలకడదుంప మొ||నవి)
  3. వివిధ రకాల గింజలు (కుంకుళ్లు, బాదము, షీకాయి మొ||నవి)
  4. తేనె
  5. వెదురు, టేకు, సాల్ మొదలైన కలప
  6. చింతపండు
  7. విస్తరాకులు
  8. వంట చెరకు
  9. ఇతర ఔషధాలు, వనమూలికలు.

ప్రశ్న 11.
నీవెప్పుడైనా అడవికి వెళ్ళావా? వెళ్తే మీ అనుభవాన్ని రాయండి.
జవాబు:
నేను ‘తిరుపతి’ వెళ్ళినప్పుడు, తిరుమల కొండకు నడకదారిన అడవుల్లో నుంచి వెళ్ళాను.

  • మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, పర్యావరణం ప్రశాంతంగా ఉంది.
  • కోతులు, జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు మొ||న జంతు పక్షులను చూడగలిగాను.
  • రకరకాల వృక్ష జాతులను, ఔషధ మొక్కలను పరిశీలించాము.
  • కొన్ని ప్రాంతాలలో అడవి దట్టంగా ఉండి కొంచెం భయపడ్డాము.
  • కొన్నిచోట్ల ఎక్కువ వాలు ఉండి, కొన్నిచోట్ల పల్లంగా ఉంది.
    (నోట్ : విద్యార్థులు ఇలా తమ అనుభవాన్ని స్వంతంగా రాయండి)

6th Class Social Textbook Page No.48

ప్రశ్న 12.
ఈ ప్రాంతంలో (పీఠభూమి) వ్యవసాయ పద్ధతులలో ప్రధానంగా వచ్చిన మార్పులు ఏమిటి?
జవాబు:
ఇటీవల కాలంలో రైతులు చిరుధాన్యాలకి బదులుగా వేరుశనగ, మిర్చి వంటి వ్యాపార పంటల సాగుకి మారుతూ ఉన్నారు. కొన్నిసార్లు జొన్న, కంది, మొక్కజొన్న పంటలని వేరుశనగ చేల మధ్యలో కూడా పండిస్తారు. భూసారం పెంచడానికి, తెగుళ్లను అరికట్టడానికి ఈ మధ్యకాలంలో కొందరు రైతులు గట్లు నిర్మించడం సేంద్రియ వ్యవసాయం లాంటి కొత్త పద్ధతులకు మారుతున్నారు. వ్యవసాయ భూములకు నీరందించడానికి పురాతన చెరువులు, వాగులను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు. నీటి సమస్య వలన కొందరు రైతులు సపోటా, బత్తాయి, మామిడి తోటలను పెంచడం ప్రారంభించారు. ఈ పండ్ల తోటలకు కొన్ని కాలాల్లో నీటి సౌకర్యం కల్పిస్తే అవి ప్రతి సంవత్సరం ఫలసాయాన్ని ఇస్తాయి. నీటి సదుపాయం ఉన్నచోట అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ మొదలగు పండ్లతోటలను కూడా పెంచుతున్నారు.

ప్రశ్న 13.
భవిష్యత్తులో ఎక్కువ సంఖ్యలో బోరుబావులను తవ్వడం వలన మనం ఎటువంటి సమస్యలను ఎదుర్కొనవలసి రావచ్చును? Page No. 48
జవాబు:
ఎక్కువ సంఖ్యలో బోరు బావులను తవ్వడం వలన ఏర్పడే సమస్యలు :

  • బోరు బావులను వాణిజ్య పంటలకు అధికంగా ఉపయోగించడం మూలంగా భూగర్భ జలవనరులు తగ్గిపోతున్నాయి. త్వరలో అంతరించిపోవచ్చు కూడా.
  • ఈ ప్రాంతం ఎడారిగా మారిపోవచ్చు, నీటికొరత ఎక్కువ అవ్వవచ్చును.
  • నీరు ఇంకే స్వభావాన్ని నేలలు కోల్పోవచ్చు, భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది.

ప్రశ్న 14.
కోస్తా మైదానం మరియు పీఠభూమి ప్రాంతంలోని గ్రామాలలో వర్షపాతం స్థితిని పోల్చండి. Page No. 48
జవాబు:

వర్షపాత పరిస్థితి
కోస్తా మైదానము పీఠభూమి
1) జూన్ నుండి అక్టోబరు వరకు నైఋతి ఋతుపవన కాలంలో వర్షాన్ని పొందుతుంది. 1) జూన్ నుండి నవంబరు వరకు చాలా తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది.
2) నవంబరు నుండి మే వరకు చాలా తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. 2) ఈ కాలంలో వర్షపతం ఉండదు. కాబట్టి తరుచూ కరవుకూ గురవుతుంటాయి.

6th Class Social Textbook Page No.49

ప్రశ్న 15.
ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంతంలో ప్రవహించే ముఖ్యమైన నదులేవి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంతంలో ప్రవహించే ముఖ్యమైన నదులు.

  1. గోదావరి
  2. కృష్ణా
  3. పెన్నా

ప్రశ్న 16.
కృష్ణా, గోదావరి డెల్టాలలో ఏ జిల్లాలున్నాయో గుర్తించండి.
జవాబు:

  • కృష్ణా డెల్టాలో గుంటూరు, కృష్ణా జిల్లాలు కలవు.
  • గోదావరి డెల్టాలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కలవు.

ప్రశ్న 17.
డెల్టాలు ప్రారంభమయ్యే ప్రాంతంలో గల రెండు ముఖ్య నగరాల పేర్లు రాయండి. కృష్ణానదిలో కలిసే రెండు నదులను గుర్తించండి.
జవాబు:

  1. విజయవాడ, కాకినాడ, రాజమండ్రి నగరాలు.
  2. తుంగభద్ర, మూసి, బుడమేరు, నాగులేరు, భీమ, గుండ్లకమ్మ.

AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 8

ప్రశ్న 18.
పంట విధానాలలో మార్పులు రావడానికి కారణమేమిటి?
జవాబు:
మైదాన ప్రాంతాల్లో పంట విధానాలలో మార్పు రావడానికి కారణాలు :

  • ఆహార పంటల నుండి నగదు/వ్యాపార పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
  • పెట్టుబడి పెరుగుతున్న నేపథ్యంలో ఇవి లాభదాయకంగా ఉంటున్నాయి.
  • వీటికి మార్కెటింగ్ సౌకర్యం బాగా ఉంది.
  • కాలువలు, బోరుబావుల ద్వారా నీటి సౌకర్యము అందుబాటులో ఉంటుంది.
  • యాంత్రీకరణ పెరగటం.

ప్రశ్న 19.
కోస్తా మైదానాలు ఎందువలన మిక్కిలి సారవంతమైనవి?
జవాబు:
కోస్తా (డెల్టా) మైదానాలు మిక్కిలి సారవంతమైనవి ఎందుకంటే :

  • ఇక్కడ నదులు అవక్షేపాల వల్ల మిక్కిలి ఒండ్రునేలలు ఉండడం చేత.
  • లోతైన, సారవంతమైన, చదునైన నేలలు ఉండటం వలన.
  • ఈ మైదాన ప్రాంతాలలో భూగర్భ జలవనరుల లభ్యత కూడా అధికంగా ఉంటుంది.
  • ఈ డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు గిడ్డంగుల వంటివి, వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు.

ప్రశ్న 20.
వ్యవసాయం మైదాన ప్రాంతాలలో ఎందువలన ప్రధాన వృత్తిగా ఉన్నది?
జవాబు:

  • ఇక్కడ అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండడం చేత మైదాన ప్రాంతాలు వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
  • లోతైన, సారవంతమైన నేలలు, చదునైన ఉపరితలం వలన పంటసాగులో యాంత్రీకరణకు అనువుగా ఉంటుంది.
  • అంతేగాక పశువులకు దాణాగా ఉపకరించే గడ్డి భూములుగా కూడా ఉపకరిస్తాయి.
  • పంటల దిగుబడికి అవసరమైన మెరుగైన నీటి సౌకర్వం ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటుంది
  • వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగుల సౌకర్యం, రవాణా సౌకర్యాలు కల్గి ఉంటాయి.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

SCERT AP 6th Class Social Study Material Pdf 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

6th Class Social 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ముస్లింల పవిత్ర గ్రంథం పేరేమి?
జవాబు:
ముస్లింల పవిత్ర గ్రంథం పేరు ఖురాన్.

ప్రశ్న 2.
అష్టాంగ మార్గం అనగా నేమి?
జవాబు:
బుద్ధుని ప్రకారం, మోక్షం సాధించడమే జీవిత పరమార్థం. మోక్షాన్ని బలుల ద్వారా లేదా ప్రార్థనల ద్వారా సాధించలేము. (మధ్యేమార్గం) అష్టాంగ మార్గంను అనుసరించడం ద్వారా మోక్షం సాధించవచ్చని తెలిపాడు.
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 1

అష్టాంగ మార్గాలు
1. సరైన దృష్టి సత్యాన్ని తెలుసుకోవడం సమ్యక్ దృష్టి
2. సరైన ఉద్దేశం మనసును చెడు నుండి విడిపించడం సమ్యక్ సంకల్ప
3. సరైన ప్రసంగం ఇతరులను బాధపెట్టేలా మాట్లాడకపోవడం సమ్యక్ వాక్కు
4. సరైన క్రియ ఇతరుల మంచికోసం పనిచేయడం సమ్యక్ కర్మ
5. సరైన, జీవితం జీవితాన్ని గౌరవించడం సమ్యక్ జీవన
6. సరైన కృషి చెడును ఎదిరించడం సమ్యక్ సాధన
7. సరైన ఏకాగ్రత ధ్యానం సాధన చేయడం సమ్యక్ సమాధి
8. సరైన బుద్ధి ఆలోచనలను నియంత్రించడం సమ్యక్ స్మృతి

ప్రశ్న 3.
మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికి రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  • దేవుడు ఒక్కడే – మతం మార్గమే.
  • మతము కన్నా – మానవత్వం మిన్న
  • మతాలు వేరైనా – మాధవుడు ఒక్కడే
  • మతతత్వం కాదు ముఖ్యం – మానవత్వం ముఖ్యం
  • మతం మంచి నీళ్ళు ఇవ్వదు – మమకారమే మంచిని పంచుతుంది

ప్రశ్న 4.
యేసుక్రీస్తు ప్రధాన బోధనలు ఏవి?
జవాబు:
యేసుక్రీస్తు ప్రధాన బోధనలు :

  • మానవులందరూ దేవుని పిల్లలు.
  • పాపాలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడపండి.
  • నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని కూడా ప్రేమించండి.
  • ఒక చెంపపై కొట్టినప్పుడు, మరొక చెంప చూపించు.
  • మానవసేవే మాధవసేవ.
  • శాంతి, ప్రేమ, కరుణ కల్గి ఉండాలి.
  • తనను తాను తగ్గించుకొనువాడు దేవునిచే హెచ్చింపబడును.
  • శత్రువును కూడా ప్రేమతో జయించవచ్చు.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 5.
ఇస్లాం మత ప్రధాన బోధనలు ఏవి?
జవాబు:
ఇస్లాం మత ప్రధాన బోధనలు :

  • మానవులందరూ అల్లాచే సృష్టించబడ్డారు.
  • మానవులందరూ దేవుని ముందు సమానం.
  • దేవునికి ఆకారం లేదు కాబట్టి విగ్రహారాధన సరియైనది కాదు.
  • ప్రతి ముస్లిం దేవుని సేవకునిగా మారి నిజాయితీగా ఉండాలి.
  • మానవులంతా అన్నదమ్ముల్లా మెలగాలి.

ప్రశ్న 6.
ఆర్య సత్యా లు ఏవి?
జవాబు:
ఆర్య సత్యాలు నాలుగు:

  • ప్రపంచం దుఃఖమయం.
  • దుఃఖం కోరికల వల్ల కలుగుతుంది.
  • కోరికలను త్యజించడం ద్వారా మోక్షం పొందవచ్చు.
  • అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు.

ప్రశ్న 7.
“భిన్నత్వంలో ఏకత్వం భారత ప్రధాన సాంస్కృతిక లక్షణం” – దీనితో మీరు ఏకీభవిస్తారా లేదా? వ్యాఖ్యానించుము.
జవాబు:
భారతదేశ ప్రధాన సాంస్కృతిక లక్షణం – “భిన్నత్వంలో ఏకత్వం” అని నేను ఏకీభవిస్తున్నాను.
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ విశిష్ట లక్షణం :
భారతదేశం అనేక వైవిధ్యాలతో కూడిన ప్రాంతం. మతం, భాష, సంస్కృతి, జీవనశైలి, వేషధారణ, దేవునిపై విశ్వాసం, ఆరాధనా, విధానాలు, ఆహారపు అలవాట్లు వంటి వాటిలో కూడా వైవిధ్యత కనిపిస్తుంది.

చంద్రగుప్తుడు, అశోకుడు, గౌతమీపుత్ర శాతకర్ణి. సముద్రగుప్తుడు, అక్బర్ మొదలగు రాజులు, చక్రవర్తులు. దేశాన్ని రాజకీయంగా ఏకం చేయడానికి ప్రయత్నించారు.
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 2
దేశంలోని వివిధ ప్రాంతాలలో జన్మించిన మహావీరుడు. గౌతమ బుద్ధుడు, గురునానక్, కబీర్, నిజాముద్దీన్ ఔలియా, షేక్ సలీం చిస్తి, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ రాధా కృష్ణన్ వంటి మహానీయులను, సాధువులను, తత్వవేత్తలను భారతీయులందరూ గౌరవిస్తారు.

ప్రజలు హోలీ, దీపావళి, రంజాన్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, మహావీర్ జయంతి, బుద్ధ జయంతి వంటి పండుగలను ఇతర మతస్థులను ఇబ్బంది పెట్టకుండా చాలా ప్రశాంతంగా జరుపుకుంటారు. భారతదేశం బహుళ సంస్కృతుల మరియు జాతుల (కులాల) సంక్లిష్టతను సూచిస్తుంది. విభిన్న సంస్కృతులు మరియు మతాలు ఉన్న ప్రజలలో ఐక్యతను సూచించే భావననే “భిన్నత్వంలో ఏకత్వం” అని అంటారు. ఇది భారతదేశం యొక్క అత్యున్నత సాంస్కృతిక లక్షణం.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 8.
ప్రస్తుతం భారతదేశంలో జాతీయ సమైక్యతను భగ్నం చేసే అనేక సమస్యలు కలవు. దీనికి గల కారణాలు ఏమిటి? వీటిని ఎలా పరిష్కరించవచ్చు?
జవాబు:
ప్రస్తుతం భారతదేశంలో జాతీయ సమైక్యతను భగ్నంచేసే సమస్యలు (అంశాలు) :

  1. మతతత్వం
  2. కులతత్వం
  3. ప్రాంతీయ తత్వం
  4. స్వార్థ రాజకీయాలు
  5. సమాచార ప్రసార సాధనాల అత్యుత్సాహం
  6. భాషా దురాభిమానం
  7. సాంఘిక అసమానతలు.

కారణాలు :

  • అధిక జనాభా, ఉండటం ప్రధాన కారణం. (అనేక కులాలు, మతాలు, ప్రాంతాల వారుండటం).
  • బ్రిటిషు పాలనలో ఉండటం ; వీరు అనుసరించిన విభజించు పాలించు విధానం.
  • సమాజంలోని అసమానతలు (ఆర్థిక, సామాజిక అంశాలు)
  • స్వార్థ పర రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం (విభజించడం) విభజన రాజకీయాలు చేయడం.

పరిష్కారాలు :

  • పౌరులకు దేశ సమైక్యత పట్ల అవగాహన కల్పించాలి. విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించాలి.
  • చట్టాలు నిర్దిష్టంగా, ఖచ్చితంగా ఉండాలి.
  • రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలి.
  • కుల, మత, ప్రాంతీయ, భాషాతత్వాలనే సంకుచిత భావాలను పారద్రోలాలి.

ప్రశ్న 9.
భారతదేశ పటంలో క్రింద ఇవ్వబడిన ప్రాంతాలను గుర్తించండి.
సింధూ నది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, భట్టిప్రోలు, కృష్ణానది, గంగా నది, యమునా నది, వింధ్య . పర్వత శ్రేణులు, ఉత్తర ప్రదేశ్.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 3

ప్రశ్న 10.
మత ఐక్యతను పెంపొందించేలా ఒక చిత్రాన్ని గీయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా గీయగలరు. ఉదా :
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 4
(లేదా)
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 5

ప్రశ్న 11.
మత ఐక్యతను పెంపొందించడానికి నాలుగు నినాదాలు రాయండి.
జవాబు:
మత ఐక్యతను పెంపొందించే నినాదాలు :

  • ఎన్ని మతాలున్నా – అసలైన మతం మానవత్వం మాత్రమే
  • మతం గమ్యం కాదు – మార్గదర్శిని మాత్రమే
  • మత విలువలు – పెంచాలి మనిషి నైతిక విలువని
  • పరమత సహనం – కల్పించును పరమాత్మ దర్శనం
  • మతాల మార్గదర్శకం – పరమాత్మక సన్నిధానం
  • మతాలు వేరైనా – గమ్యం ఒక్కటే
  • సర్వమత సారం – సర్వ మానవ సౌభాగ్యం

ప్రశ్న 12.
కింద ఇవ్వబడిన ఖాళీలను సరైన పదాలతో నింపండి.
I. మతం : హిందూమతం, సిక్కుమతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, జైన మతం, బౌద్ధ మతం
II. దేవుడు ప్రవక్త : సిద్ధార్థుడు, యేసుక్రీస్తు, మహావీరుడు, మహమ్మద్ ప్రవక్త, శ్రీకృష్ణుడు, గురునానక్
III. పవిత్ర గ్రంథం : త్రిపీఠికలు, బైబిల్, భగవద్గీత, ఖురాన్, గురుగ్రంథ సాహిబ్, అంగాలు
IV. పూజ ప్రదేశం : మసీదు, ఆలయం, గురుద్వారా, చర్చి, మఠం, జైన దేవాలయం
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 6
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 7

6th Class Social Studies 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు InText Questions and Answers

6th Class Social Textbook Page No.123

ప్రశ్న 1.
భారతదేశంలో అనేక భాషలు కలవు. భాష అవసరం ఏమిటి? భాషలు ఎలా పరిణామం చెంది ఉంటాయి?
జవాబు:
భాష అవసరం ఏమిటంటే :

  • భాష మనం ఆలోచించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  • మన పనులన్నీ క్రమపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా చేసుకోవడానికి మనకి భాషే ఉపయోగపడుతుంది.
  • ఇతరుల దృష్టిని మనవైపు తిప్పుకోవడానికి మనకి భాష అవసరం.
  • కొత్త విషయాలను సృష్టించడానికి కనిపెట్టడానికి, లేదా సరదాగా నవ్వించడానికి భాష అవసరం.
  • అనేక విషయాలను ఊహించుకోవడానికి, బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి భాష అవసరం.
  • మన భావాలను, అనుభవాలను పంచుకోవడానికి భాష అవసరం. ఈ రకంగా భాష మనకు ఎంతో ప్రముఖమైనది.
  • తరతరాలుగా పెద్దలు తమ పిల్లలకు సమాచారాన్ని అందించటానికి భాష అవసరం.

భాష ఎలా పరిణామం చెందింది అని చెప్పటానికి ప్రత్యక్ష ఆధారాలు తక్కువ.

  • ముందుగా అనేక (చేతి) గుర్తులను వాడారు (సంజ్ఞలను) తర్వాత శబ్దాలను వాడారు.
  • ఒక తరం నుండి మరొక తరానికి, ఒక తెగ (జాతి) నుండి మరో తెగ (జాతి)కు
  • ఒక భౌగోళిక ప్రాంతం నుండి మరొక భౌగోళిక ప్రాంతానికి, ఒక సమాజం నుండి మరొక సమాజంకు భాష ప్రసారం జరిగింది.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 2.
ఇతర భాషకు చెందిన మీ స్నేహితుడిని ఆహ్వానించండి మరియు అతనితో/ఆమెతో సంభాషించండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు. ఉదాహరణ ఆధారంగా (కన్నడ స్నేహితునితో)

  • నిన్న హెసరు ఏను? (నీ పేరు ఏమిటి)
  • నన్న హెసరు రాము.’ (నా పేరు రాము)
  • నీను పను కెలస మాడువి ? (నీవు ఏం పని చేస్తావు ?)
  • నాను శాలియల్లి ఓదుత్తిదేన్. (నేను బడిలో చదువుతున్నాను.)
  • నీను యావ తరగతియల్లి ఓదుత్తీ? (నీవు ఏ తరగతి చదువుచున్నావు?)
  • నాను ఆరునే క్లాసివల్లి ఓదుత్తిద్దేనె (నేను ఆరవ క్లాస్ చదువుతున్నాను)
    ఈ విధంగా ఏదైనా భాషలో రాయగలరు.

6th Class Social Textbook Page No.124

ప్రశ్న 3.
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 8
1516కాలం నాటి కృష్ణదేవరాయలు శాసనాన్ని చదవడానికి ప్రయత్నించండి. మీ ఉపాధ్యాయుని సహాయంతో శాసనంలో ఏముందో అర్థం చేసుకోండి.
జవాబు:

  • శుభమస్తు : శ్రీమాన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయర
  • గండ అరిరాయనిబాట భాషగెతపువ రాయరగండ యవన రాజ్య
  • స్థాపనాచార్య శ్రీ వీరప్రతాప కృష్ణదేవ మహారాయలు విజయ
  • నగరాన సింహాసనారూఢుడై పూవజీ దిగ్విజయ యాత్రకు విచ్చేశి
  • ఉద్దగిరి, కొండవీడు, కొండపల్లి రాజమహేంద్రవరం మొదలైన
  • దుగాజాలు సాధించి సింహ్యాద్రిక విచ్చేసి స్వస్తిశ్రీ జయాభ్యుదయ
  • ఈ శాసనము శ్రీకృష్ణదేవరాయలు, దిగ్విజయయాత్ర గురించి వివరిస్తున్నది. అలాగే సింహాచలం విచ్చేసినట్లుగా తెలుస్తుంది.

6th Class Social Textbook Page No.125

ప్రశ్న 4.
భారత అధికార భాషలు హిందీ మరియు ఇంగ్లీష్, ప్రియమైన విద్యార్థులారా “ఇండియా” అనే పదాన్ని అనేక భారతీయ భాషలలో ఎలా రాయవచ్చో గమనించండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 9

ప్రశ్న 5.
ఇంగ్లీషులో 26, తెలుగులో 56 అక్షరాలు కలవు. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియాలో ఎన్ని అక్షరాలు కలవు? Page No. 125
జవాబు:
తమిళంలో – 247, కన్నడంలో – 49, మలయాళంలో- 56 (57) ఒడియాలో – 64 అక్షరాలు కలవు.

AP Board 6th Class Social Solutions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 6.
భారతదేశాన్ని లౌకిక దేశం అంటారు. ఎందుకు?
జవాబు:
భారతదేశంలో ప్రభుత్వానికి ఎటువంటి మతం లేదు. అంటే ప్రభుత్వం ఏ మతాన్ని ప్రోత్సహించదు, ఏ మతాన్ని వ్యతిరేకించదు మత విషయాల్లో తటస్థంగా ఉంటుంది. అంటే మత విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అలాగే దేశ పౌరులందరికి మత స్వాతంత్ర్యపు హక్కు ఉంది. అంటే పౌరులు ఏ మతాన్నైనా అనుసరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ప్రోత్సహించుకోవచ్చును. కాబట్టి భారతదేశాన్ని లౌకిక దేశం అని అంటారు.

6th Class Social Textbook Page No.126

ప్రశ్న 7.
మన ఆరోగ్యం మరియు పరిశుభ్రతను పెంపొందించడంలో సహాయపడుతున్న మన పూర్వికులు ఆచారాలు మరియు సంప్రదాయాలపై చర్చించండి.
జవాబు:

  • ఏదైనా శుభకార్యం (ఉత్సవం) జరిగేటపుడు మామిడి (పచ్చ) తోరణాలు కడుతారు. కారణం ఎక్కువమంది ఒకచోట చేరినపుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం కాబట్టి మామిడి ఆకులు ఎక్కువ (సేపు) సమయం పచ్చగా ఉండి, ఆక్సిజన్‌ను విడుదలచేస్తాయి.
  • గ్రామీణ ప్రాంతాలలో ఇంటిముందు (పేడ) కళ్ళాపి చల్లుతారు, ఇల్లు అలుకుతారు. కారణం ఆవు పేడలో యాంటి బ్యాక్టీరియల్ గుణం ఉండి ఎటువంటి క్రిమి, కీటకాలు ఇంట్లోకి రావు. అలాగే గొబ్బిళ్ళు పెట్టడం, ముగ్గులు వేయడం కూడా.
  • రాగి పాత్రలలో నీరు త్రాగటం. రాగి (పాత్రల్లో) రేకులో బ్యాక్టీరియా, వైరస్లు త్వరగా మృతుమవుతాయి కనుక.
  • ఇంటిముందు తులసి, (ఇంటివెనుక కరివేపాకు) వేప వంటి ఔషధ గుణాలున్న మొక్కలు ఉంచడం. ఇవన్నీ క్రిమి, కీటకాలను చంపే ఔషధాలు వీటి యొక్క ఆవశ్యకతను తెల్పుటకు వీటిని పూజించమంటు అందుబాటులో ఉంచినారు.
  • గడపకు పసుపు పూయటం, పసుపు యాంటీ బ్యాక్టీరియల్ ఔషధంగా పనిచేస్తుంది. అందుకనే వంటలలో కూడా వాడతారు. అలాగే పాములు చూడగలిగే రంగు పసుపు కనుక గడపకు పసుపుంటే అవి లోపలకి రావు.
  • అలాగే ముఖానికి, కాళ్ళకు పసుపు రాసుకుంటారు కారణం ఇది యాంటి బ్యాక్టీరియల్.
    ఉగాది పచ్చడి సేవనం, ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులు ఉంటాయి. అవి ఔషధంగా ఉపయోగపడుతుంది.
  • సూర్యనమస్కారాలు చేయడం వలన విటమిన్ ‘డి’ లభిస్తుంది.
  • ఉపవాసాలు ఉండటం వెనుక కారణం ఇది మన జీర్ణవ్యవస్థను అభివృద్ధి చేస్తుంది.
  • ఉత్తర దిక్కున తల ఉంచి, నిద్రపోరాదు అని ఎందుకు చెబుతారంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం వలన బిపి మొదలైన వ్యాధులు వస్తాయని.
  • అయితే సంప్రదాయాలు మూఢాచారాలుగా, మూఢ విశ్వాసాలుగా రూపాంతరం చెందకుండా, వాటి యొక్క ఉద్దేశ్యమును గ్రహించాలి.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

SCERT AP 6th Class Social Study Material Pdf 10th Lesson స్థానిక స్వపరిపాలన Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 10th Lesson స్థానిక స్వపరిపాలన

6th Class Social 10th Lesson స్థానిక స్వపరిపాలన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
గ్రామసభ మరియు గ్రామ పంచాయితీ మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

గ్రామసభ గ్రామపంచాయితీ
1. గ్రామ స్థాయిలో సాధారణ సభ. 1. గ్రామ స్థాయి అసెంబ్లీ లాంటిది.
2. దీనిలో గ్రామంలోని ఓటర్లు అందరూ సభ్యులే. 2. దీనిలో ఎన్నుకోబడిన వార్డు సభ్యులే సభ్యులు.
3. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం. 3. ఇది పరోక్ష (ప్రాతినిధ్య) ప్రజాస్వామ్యానికి నిదర్శనం
4. గ్రామ పంచాయితీ పనితీరును సమీక్షిస్తుంది. 4. గ్రామ సభ పనితీరును సమీక్షించలేదు.
5. దీనికి ఎన్నికలుండవు. 5. దీనిని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు.

ప్రశ్న 2.
మీరు మీ స్థానిక ప్రభుత్వ సంస్థలో ప్రతినిధి అయితే మీరు ఏ సమస్యలు ప్రస్తావిస్తారు?
జవాబు:
నేను మా స్థానిక ప్రభుత్వ సంస్థలో ప్రతినిధి అయితే ఈ క్రింది సమస్యలు ప్రస్తావిస్తాను.

  • ప్రజా సౌకర్యాలైన త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, మురుగు నీటి కాల్వల నిర్మాణం, నిర్వహణ, చెత్త సేకరించుట, నిర్వహణ గురించి
  • ప్రభుత్వ పాఠశాలలో నమోదు, హాజరు పెంచుట గురించి మరియు మధ్యాహ్న భోజన పథకం అమలు (నిర్వహణ), నాడు – నేడు అమలు గురించి ప్రస్తావిస్తాను.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 3.
మీ పంచాయితీ / మున్సిపాలిటీలో సామాన్య ప్రజలు ఏ సమస్యపైన అయినా నిర్ణయం తీసుకోవడంలో పాలుపంచుకొంటున్నారా? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
మా మున్సిపాలిటీలో కొన్ని విషయాలలో సామాన్య ప్రజలు నిర్ణయం తీసుకోవడంలో పాలు పంచుకుంటున్నారు.
ఉదాహరణలు :

  • మా వారులో పాఠశాల దగ్గర ఒక మద్యం షాపు పెట్టారు. దానితో పాఠశాల నడపటం కష్టంగా ఉండేది. దానితో ప్రజలందరూ కలిసి వార్డు సభ్యునికి తెలియపరిచారు. వార్డు సభ్యుడు చైర్మన్, కమిషనర్ తో మాట్లాడి ఆ షాపును అక్కడి నుంచి తీయించేశారు.
  • మా వార్డులో వర్షం పడితే మురుగునీరు రోడ్లపైకి పారుతోంది. కాబట్టి ప్రజలు చాలామంది మున్సిపాలిటీ సమావేశాలు జరిగే సమయంలో అక్కడికి వెళ్ళి వారికి సమస్యను కాగితం రూపంలో సమర్పించాము. వారు సమావేశంలో చర్చించి ‘భూగర్భ మురికి కాలువలను’ మా వార్డుకు శాంక్షన్ చేశారు.

ప్రశ్న 4.
అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి పంచాయితీలు పన్నులు పెంచాలా, లేదా ప్రభుత్వ నిధుల మీద ఆధారపడాలా? మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి పంచాయితీలు పన్నులు పెంచితే అది ప్రజలకు భారమవుతుంది. ప్రభుత్వ నిధుల మీద ఆధారపడితే అది కూడా పరోక్షంగా ప్రజలకు భారమౌతుంది. కాబట్టి పంచాయితీలు కొన్ని స్వావలంబనా కార్యక్రమాలు జరపాలి. పోరంబోకు స్థలాల్లో గడ్డి పెంచడం, చెరువుగట్లపై కొబ్బరి, ఈతచెట్లు పెంచడం, వాటిని వినియోగించేవారికి వేలంపాట నిర్వహించి ఆ సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలకు నిర్వహించాలి.

ప్రశ్న 5.
అంకితభావంతో పనిచేసే సర్పంచులు ఎదుర్కొనే సవాళ్ళను వివరించండి.
జవాబు:
నేడు అంకితభావంతో పనిచేసేవారు అతికొద్దిమందే ఉన్నారు. వారికి అడ్డత్రోవలో పనిచేయించుకునే వారు ఎప్పుడూ సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. ఉదా : గ్రామంలో ఇందిరా ఆవాస్ యోజన, దీపం పథకం, అన్నపూర్ణ పథకం, పనికి ఆహార పథకం, వికలాంగ, వృద్ధాప్య, వితంతు పింఛనులు మొదలైనవి అనేకం ఉన్నాయి. వీటిని అర్హులు కానివారికి ఇప్పించాలని సర్పంచ్ పై పేరు, పలుకుబడి ఉన్నవారు ఒత్తిడి తీసుకువస్తారు. ఈ సవాళ్ళను అన్నింటినీ అధిగమించి గ్రామాన్ని ముందుకు నడిపించడం సర్పంచ్ కు కత్తిమీద నడకలాంటిది.

ప్రశ్న 6.
పురపాలక సంఘం కల్పిస్తున్న ఏయే పౌర సౌకర్యాలను గ్రామ పంచాయితీ కల్పించటం లేదు?
జవాబు:
విద్యుత్తు, రవాణా, ఉన్నత విద్య, చెత్త సేకరణ (వ్యర్థ పదార్థాల నిర్వహణ), భూగర్భ డ్రైనేజీ, టౌన్ ప్లానింగ్, పార్కులు మెరుగైన ఆరోగ్య సేవలు మొదలైన పౌర సౌకర్యాలను పురపాలక సంఘం కల్పిస్తుంది. గ్రామ పంచాయితీలు కల్పించడం లేదు.

ప్రశ్న 7.
గీతిక ఉన్న వీధిలో కొళాయి నుంచి నీరు అరగంట కూడా రాదు. అందువల్ల చాలామంది బకెట్లు నింపుకోవడానికి వరుసలో నిలుచుంటారు. ఆమె సమస్య పరిష్కారం కావటానికి మీరు గీతికకు ఏ విధమైన సలహా ఇస్తారు?
జవాబు:
తన యొక్క వార్డు కౌన్సిలర్ ని కలిసి సమస్యను అతనితో చెప్పవలసినదిగా సలహా ఇస్తాను. అపుడు ఆ సమస్యను కౌన్సిల్ ముందు వుంచుతారు. అధికారులు నిర్ణయం తీసుకుని సమస్య పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటారు. ఈ అప్పటివరకు బోరింగు పంపు నుండి నీరు పట్టుకుంటుంది.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 8.
స్థానిక కార్పోరేటర్/కౌన్సిలర్‌ను కలిసి పురపాలక సంఘం చేసే పనుల గురించి తెలుసుకోవడానికి గాను కొన్ని ప్రశ్నలను తయారు చేయండి.
జవాబు:
నేను మాకు దగ్గరలో ఉన్న కార్పొరేటర్ ను కలిసి, పురపాలక సంఘం చేసే పనుల గురించి తెలుసుకోవడానికిగాను ఈ క్రింది ప్రశ్నలను తయారుచేశాను.

ప్రశ్నలు :
1. పురపాలక సంఘం, చెత్తను ఉపయోగించి ఏమైనా వ్యాపారం చేస్తుందా?
2. రోడ్డును శుభ్రంచేసే స్త్రీలకు, పురుషులకు ఏమైనా పేర్లు ఉన్నాయా?
3. మంచినీటి శుద్ధీకరణ ఏ విధంగా చేస్తారు?
4. వీధి లైట్లు నిర్వహణ కొరకు ఏదైనా కంట్రోల్ యూనిట్ ఉంటుందా?
5. ప్రజల వద్ద నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బును పురపాలక సంఘం దేనికి ఖర్చు చేస్తుంది?

ప్రశ్న 9.
దిగువ ఇవ్వబడిన పురపాలక సంఘాలను, మున్సిపల్ కార్పొరేషన్లను ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్తించండి.
i) విశాఖపట్నం
ii) విజయవాడ
iii) భీమునిపట్నం
iv) కడప
v) అనంతపురం
vi) తిరుపతి
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన 1

6th Class Social Studies 10th Lesson స్థానిక స్వపరిపాలన InText Questions and Answers

6th Class Social Textbook Page No.111

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో కల్పించే ప్రజా సౌకర్యాలను రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో కల్పిస్తున్న ప్రజా సౌకర్యాలు :

  • రక్షిత మంచినీటి సౌకర్యం.
  • ఆ భూగర్భ డ్రైనేజి ఆ మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ
  • రహదారుల నిర్మాణం, నిర్వహణ
  • వీధి దీపాల ఏర్పాటు (మరమ్మతు) నిర్వహణ
  • ఉద్యానవనాల ఏర్పాటు నిర్వహణ
  • ఉచిత విద్యా సౌకర్యం
  • ఉచిత వైద్య సదుపాయాలు
  • గ్రంథాలయాలు, పఠనాలయాలు
  • కూరగాయల, పండ్ల, చేపల మార్కెట్ల నిర్వహణ

ప్రశ్న 2.
మీరు గ్రామంలో నివసిస్తుంటే మీ గ్రామసభను సందర్శించి నివేదిక రూపొందించండి.
జవాబు:
విద్యార్థి స్వయంగా చేయగలరు. (ఈ క్రింది వానిని ఆధారంగా ఉదాహరణగా తీసుకోగలరు)

మా గ్రామంలోని గ్రామసభను సందర్శించాను. అక్కడ – రేషన్‌కార్డు కోసం కూపన్లు ఇస్తున్నారని తెలిసి కనకమ్మ గ్రామసభకు హాజరైంది. కాని ఆమెకు గ్రామసభ ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆ గ్రామసభలో దాదాపు 70 మంది ప్రజలు వస్తే అందులో 20 మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కనకమ్మ లాగే కూపన్లు ఇస్తున్నారని వచ్చారు. సమావేశంలో సర్పంచ్ గత సంవత్సరంలో జరిగిన పనుల గురించి వివరిస్తూ, ఈ సంవత్సరం జరిగే పనుల గురించి గ్రామసభ ముందుంచగా గ్రామసభకు వచ్చిన జనం చప్పట్లు కొడుతూ సర్పంచ్ చేసిన పనిని అభినందించారు. తరువాత ఆయన దారిద్ర్యరేఖకు దిగువన (BPL) గల ప్రజల వివరాలు వెల్లడించాడు. ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి వీరు లబ్దిదారులవుతారని తెలియజేశాడు.

ఆయన మాట్లాడడం ఆపగానే కనకమ్మ నిలబడి నా పేరు కూడా లబ్దిదారుల జాబితాలో ఉంచాలని, నాకు ఉద్యోగం గాని, భూమి గాని వేరే ఏ ఆధారంగాని లేదని తెలిపింది. సర్పంచ్, ఆమె పేరు తప్పకుండా ఈ జాబితాలో ఉండేటట్లు చూస్తానని చెప్పగ కనకమ్మ సంతోషిస్తూ గ్రామసభ నుంచి వెళ్ళింది. చివరిగా రేషన్‌కార్డు కోసం కూపన్లు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడంతో గ్రామసభ ముగిసింది.

6th Class Social Textbook Page No.112

ప్రశ్న 3.
గ్రామ పంచాయితీ, గ్రామ సభల మధ్య పోలికలను రాయండి.
జవాబు:
గ్రామ పంచాయితీ, గ్రామ సభల మధ్య పోలికలు :

  • రెండూ కూడాను గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోవటంలో పాల్గొంటాయి.
  • రెండింటికి ‘సర్పంచ్’ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు.
  • అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఉంటుంది.
  • రెండూ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటాయి. (మెజారిటీ సభ్యుల అభిప్రాయం).

6th Class Social Textbook Page No.113

ప్రశ్న 4.
ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదు చేయడం, తీసివేయడం ఎందుకు అవసరమో చెప్పగలరా?
జవాబు:
కొత్తగా 18 సం|| నిండిన వారిని, ఆ ప్రాంతానికి కొత్తగా బదిలీ పైగాని, ఇల్లు మారిగాని వచ్చిన వారిని, వివాహమై కొత్తగా వచ్చిన వారిని ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదు చేస్తారు.

ఇటీవల మరణించిన వారిని, బదిలీపై లేదా ఇల్లు మారి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిన వారిని, వివాహమై ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళినవారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు.

6th Class Social Textbook Page No.115

ప్రశ్న 5.
మీ ఉపాధ్యాయులు/తల్లిదండ్రుల సహాయంతో గ్రామ వాలంటీర్లు అందించే సౌకర్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
గ్రామ వాలంటీర్లు అందించే సౌకర్యాలు :

  • ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి తెలియజెప్పటమే కాకుండా మన ఇంటి దగ్గరకు (అందుబాటులోకి) తీసుకు వస్తారు.
  • వృద్ధాప్య పింఛన్లను ఇంటి వద్దనే అందిస్తున్నారు.
  • రేషన్ సరుకులను ఇంటి వద్దనే అందిస్తున్నారు.
  • ప్రభుత్వ పథకాల దరఖాస్తులను అందివ్వడం, ఆ దరఖాస్తులను అధికారులకు పంపిణీ చేయటం జరుగుతుంది.
  • గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేస్తున్నారు.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 6.
మీ మండల ప్రాదేశిక నియోజక వర్గ (MPTC) సభ్యులు మరియు జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ (ZPTC) సభ్యులు ఎవరు?
జవాబు:
సౌవిద్యార్థులు స్వయంగా రాయగలరు :
ఉదా : మా MPTC – …………….
మా ZPTC – …………………..

ప్రశ్న 7.
మీ జిల్లాలో ఎన్ని మండలాలు కలవు?
జవాబు:
విద్యార్థులు మీ మీ జిల్లాలను అనుసరించి రాయగలరు.
ఉదా : మాది గుంటూరు జిల్లా మా జిల్లాలో 57 మండలాలు కలవు.

6th Class Social Textbook Page No.116

ప్రశ్న 8.
మీ ప్రాంతంలో స్థానిక సంస్థలు కల్పించే ప్రజా సదుపాయాల జాబితాను రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో స్థానిక సంస్థలు కల్పించే ప్రజా సదుపాయాలు :

  • రక్షిత మంచినీటి సౌకర్యం.
  • భూగర్భ డ్రైనేజి
  • మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ
  • రహదారుల నిర్మాణం, నిర్వహణ
  • వీధి దీపాల ఏర్పాటు (మరమ్మత్తు) నిర్వహణ
  • ఉచిత విద్యా సౌకర్యం
  • ఉద్యనవనాలు ఏర్పాటు నిర్వహణ
  • ఉచిత వైద్య సదుపాయాలు
  • గ్రంథాలయాలు, పఠనాలయాలు
  • కూరగాయల, పండ్ల, చేపల మార్కెట్ల నిర్వహణ

6th Class Social Textbook Page No.117

ప్రశ్న 9.
మీ జిల్లాలో నగర పంచాయితీలు, పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పోరేషన్లు ఎన్ని కలవు?
జవాబు:
విద్యార్థులు మీ జిల్లా గురించి తెలుసుకుని రాయగలరు.
ఉదా : మాది గుంటూరు జిల్లా, మా జిల్లాలో
కార్పోరేషన్లు : 01 (గుంటూరు)
పురపాలక సంఘాలు : 12 (1. మంగళగిరి 2. సత్తెనపల్లి 3. తాడేపల్లి 4. తెనాలి 5. పొన్నూరు 6. బాపట్ల 7. రేపల్లె 8. నర్సరావుపేట 9. చిలకలూరి పేట 10. మాచర్ల 11. వినుకొండ 12. పిడుగురాళ్ళ
నగర పంచాయితీలు : 02 (దాచేపల్లి, గురజాల)

6th Class Social Textbook Page No.118

ప్రశ్న 10.
గ్రామ పంచాయితీ దాని పనితీరులో మున్సిపాలిటీకి ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:

గ్రామ పంచాయితీలు పురపాలక సంఘాలు
1. పంచాయితీలు గ్రామ స్వపరిపాలన సంస్థలు తక్కువ సంఖ్యలో జనాభా వుంటారు. 1. పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు. ఇక్కడ ఎక్కువ జనాభా వుంటారు.
2. రోడ్లను నిర్వహించడం, రక్షిత మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, చౌక, ధరల షాపులు నిర్వహించడం మొ||న పనులు పంచాయితీ చేస్తుంది. చెత్తను ఎత్తివేయడం లాంటి పనులు చాలా గ్రామాలలో కనబడదు. 2. గ్రామ పంచాయితీలు చేసే పనులతో పాటు అదనంగా చెత్తను ఎత్తి వేయడం, మురుగు కాలువల నిర్మాణం నిర్వహణ లాంటి బాధ్యతలను పురపాలక సంఘాలు నిర్వహిస్తాయి.
3. పంచాయితీ విధులను సర్పంచ్ పర్యవేక్షిస్తాడు. 3. పురపాలక సంఘ పనులను కమీషనర్ మరియు ఇతర కమిటీలు పర్యవేక్షిస్తారు.
4. ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం లేదు. 4. పెద్ద మొత్తంలో ఉద్యోగులు అవసరం అవుతారు.
5. కాంట్రాక్ట్ కార్మికులు మనకు కనబడరు. 5. పురపాలక సంఘాలలో కాంటాక్ట్ కార్మికులు చాలామంది ఉంటారు.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 11.
మీ ఉపాధ్యాయుని సహాయంతో దిగువ పట్టికను పూర్తి చేయండి.
జవాబు:

హోదా ఎవరు ఎన్నుకుంటారు ప్రత్యక్ష / పరోక్ష ఎన్నిక
వార్డు మెంబర్ గ్రామవార్డులోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక
సర్పంచ్ గ్రామంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక
ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ పరోక్ష ఎన్నిక
MPTC గ్రామంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక
ZPTC మండలంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక
మండల అధ్యక్షులు MPTC సభ్యులు పరోక్ష ఎన్నిక
జిల్లా పరిషత్ చైర్మన్ ZPTC సభ్యులు పరోక్ష ఎన్నిక
పురపాలక సంఘం ఛైర్మన్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు(కౌన్సిలర్) పరోక్ష ఎన్నిక
మేయర్ కార్పోరేటర్స్ & ఇతర సభ్యులు పరోక్ష ఎన్నిక

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

SCERT AP 6th Class Social Study Material Pdf 3rd Lesson పటములు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 3rd Lesson పటములు

6th Class Social 3rd Lesson పటములు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పటంలోని ముఖ్యమైన అంశాలేవి?
జవాబు:
పటంలోని ముఖ్య అంశాలు :
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 1

ప్రశ్న 2.
భూమిపై కల వాస్తవ దూరాన్ని పటంలో ఎందుకు తగ్గించి చూపాలి?
జవాబు:
ఒక ప్రదేశము యొక్క మొత్తము వైశాల్యమును కాగితంపై చూపించవలెనన్న అంతే వైశాల్యము కాగితము అవసరమగును అంటే భారతదేశ పటం గీయవలెనన్న అంతే వైశాల్యముకల కాగితము కావలెను మరియు భూమిపై ఉన్న వాస్తవ దూరము చాలా పెద్దదిగా ఉంటుంది. అంత పెద్ద వైశాల్యం గల ప్రదేశాలను వాటి మధ్య దూరాలను మానచిత్రంలో చూపించటము అసాధ్యము. కావున పటంలో తగ్గించి చూపాలి.

ప్రశ్న 3.
పటాల తయారీలో చిహ్నాల ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలుమార్గాలు బావులు మొదలైనటువంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలు చిహ్నాలతో సూచిస్తారు. ఇవి తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. పటాలు గీయడం, చదవడం సులభమవుతుంది.

ప్రశ్న 4.
మీ జిల్లా పటంలో మీ మండలం కేంద్ర కార్యాలయానికి, జిల్లా కేంద్ర కార్యాలయానికీ కల దూరాన్ని కొలవండి. వాస్తవ దూరానికి, దానికి కల నిష్పత్తి సహాయంతో పటంలో ఉపయోగించిన స్కేలు కనుగొనండి.
జవాబు:
విద్యార్థులు తమతమ జిల్లా, మండల కేంద్రాల నుండి క్రింద ఉదాహరణలో చూపిన విధంగా లెక్కించండి.

మా శ్రీకాకుళం జిల్లా కేంద్ర కార్యాలయానికి మా ‘టెక్కలి’ మండల కేంద్ర కార్యాలయానికి పటంలో
దూరం = 5 సెం.మీ,
వాస్తవ దూరం = 50 కి.మీ.
స్కేల్ : ఒక సెం.మీ. = 10 కి.మీ.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 2

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

ప్రశ్న 5.
రాజకీయ పటాలకీ, భౌతిక పటాలకీ కల వ్యత్యాసమేమి?
జవాబు:
రాజకీయ పటాలు :
గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను (అంటే రాజకీయ విభాగాలను) మాత్రమే చూపిస్తాయి.

భౌతిక పటాలు :
పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గూర్చి వివరిస్తాయి.

ప్రశ్న 6.
విషయ నిర్దేశిత పటాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
విషయ నిర్దేశిత పటాల యొక్క ప్రాముఖ్యత :

  • ఒక నిర్ధిష్ట (నిర్ణీత) అంశాన్ని గూర్చి సవివరంగా తెలియజేస్తాయి.
  • ఏదైనా ఒక ప్రాంతం గూర్చి వివరంగా తెలుసుకోవచ్చు.
  • భూవినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలుమార్గాలు, జనాభా వంటి నిర్ధిష్ట అంశాలను గురించి వివరిస్తాయి.

ప్రశ్న 7.
నిత్య జీవితంలో పటాల యొక్క ఉపయోగమేమి?
జవాబు:
పటాల వలన ఉపయోగాలు :

  • పటాలు దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు వంటి ప్రదేశాలను గుర్తించడానికి మనకి చాలా ఉపయోగకరం.
  • పటాలను ఉపయోగించి పర్వతాలు, పీఠభూములు, మైదానాల వంటి భూస్వరూపాలను చూడవచ్చును.
  • ప్రధాన రహదారి మార్గాలైన రోడ్లు, రైల్వేలను గురించి తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి.
  • పటాలు పంటలు, ఖనిజాలు, నేలలు పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి ఉపకరిస్తాయి.
  • పటాలు యుద్ధ సమయంలో సైనికులకు భద్రత దృష్ట్యా ఉపయోగకరం.
  • పటాలు పర్యాటకులు మరియు ప్రయాణీకులకు వారి గమ్య చేరడానికి మార్గదర్శకంగా ఉంటాయి.

ప్రశ్న 8.
ఇవ్వబడిన ప్రపంచ పటంలో ఖండాలు, మహాసముద్రాలు గుర్తించండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 3
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 4

→ సరియైన సమాధానాన్ని ఎంచుకుని బ్రాకెట్లో రాయండి.

1. అడవులు విస్తరణని తెలిపే పటాలు ………..
అ) భౌతిక పటము
ఆ) విషయ నిర్దేశిత పటం
ఇ) రాజకీయ పటం
ఈ) పైవేవీ కావు
జవాబు:
ఆ) విషయ నిర్దేశిత పటం

2. నీలిరంగు ……….. ని సూచించడానికి ఉపయోగిస్తాము.
అ) జలభాగములు
ఆ) పర్వతాలు
ఇ) భూభాగం
ఈ) మైదానాలు
జవాబు:
అ) జలభాగములు

3. స్కేల్ దీనిలోని ఒక ఆవశ్యకమైన భాగము …………
అ) పటము
ఆ) చిత్తుచిత్రము
ఇ) ప్రణాళిక
ఈ) ఏదీకాదు
జవాబు:
అ) పటము

4. దిక్సూచిని దీని కొరకు ఉపయోగిస్తారు.
అ) చిహ్నాలను చూపుటకు
ఆ) ప్రధాన దిక్కులను గుర్తించడానికి
ఇ) దూరాన్ని కొలవడానికి
ఈ) ఎత్తుని తెలుసుకోవడానికి
జవాబు:
ఆ) ప్రధాన దిక్కులను గుర్తించడానికి

5. ఉత్తరం మరియు తూర్పుకి మధ్యగల దిక్కుని ఇలా పిలుస్తారు.
అ) ఈశాన్యము
ఆ) ఆగ్నేయము
ఇ) వాయవ్యము
ఈ) నైరుతి
జవాబు:
అ) ఈశాన్యము

6th Class Social Studies 3rd Lesson పటములు InText Questions and Answers

6th Class Social Textbook Page No.30

ప్రశ్న 1.
మృదుల పై చిత్తుచిత్రం సహాయంతో ఎందుకు తను వెళ్ళవలసిన చోటికి చేరుకోలేదు? Page No. 30)
జవాబు:
మృదుల చిత్తుచిత్రం సహాయంతో తను వెళ్ళవలసిన చోటికి చేరలేకపోవడానికి కారణాలు :

  • చిత్తు చిత్రంలో ప్రధానంగా దిక్కులు చూపలేదు. స్కేల్ చూపలేదు.
  • చిత్తుచిత్రంలో ఏ విధమైన కొండ గుర్తులు, చిహ్నాలు చూపలేదు.

6th Class Social Textbook Page No.31

ప్రశ్న 2.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 5
పైన ఇచ్చిన చిత్రాన్ని పరిశీలించి కింది పట్టికను పూరించండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 6
జవాబు:

దిక్కు వస్తువులు
ఉత్తరం చెట్లు
ఈశాన్యం గుడి
దక్షిణం బావి
నైరుతి మసీదు
తూర్పు సూర్యోదయము
ఆగ్నేయం పాఠశాల
పడమర ఇల్లు
వాయువ్యం చర్చి

6th Class Social Textbook Page No.32

ప్రశ్న 3.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 7
చిత్రము పరిశీలించి స్కేల్ ని ఉపయోగించి కింద చూపిన ప్రదేశాల మధ్య వాస్తవ దూరాన్ని లెక్కించండి.
i) పోస్ట్ ఆఫీస్ మరియు రాజు ఇంటి మధ్య దూరం
ii) రాజు మరియు పూజ ఇంటి మధ్య దూరం
iii) చిరు ఇల్లు మరియు పాఠశాల మధ్య దూరం
జవాబు:
i) 60 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 6 సెం.మీ. × 10 మీ. = 60 మీ॥)
ii) 10 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 1 సెం.మీ. × 10 మీ. = 10 మీ॥)
iii) 50 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 5 సెం.మీ. × 10 మీ. = 50 మీ॥)

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

ప్రశ్న 4.
చిహ్నాలు మనకు సమాచారాన్ని ఎలా ఇస్తాయి?
జవాబు:
స్కేల్ పటంలోని ముఖ్యమైన అంశం. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి వంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు గీతలతో సూచిస్తారు. ఈ చిహ్నాలు తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. వీటిని ఉపయోగించుట వలన పటాలను గీయడం, చదవడం కూడా సులభం అవుతుంది. ఒక ప్రాంతలో మనకు భాష , తెలియకపోయినా ఎవరినీ సలహాలు అడగకుండానే పటాన్ని ఉపయోగించి చిహ్నాల సహాయంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

6th Class Social Textbook Page No.35

ప్రశ్న 5.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి పట్టికను తయారు చేయండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 8
జవాబు:
మనదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు గలవు. అవి :

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం రాజధాని
1. ఆంధ్రప్రదేశ్ అమరావతి
2. ఒడిశా భువనేశ్వర్
3. పశ్చిమబెంగాల్ కోల్‌కతా
4. జార్ఖండ్ రాంచి
5. బీహార్ పాట్నా
6. ఉత్తరప్రదేశ్ లక్నో
7. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్
8. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా
9. పంజాబ్ ఛండీఘర్
10. హరియాణా ఛండీఘర్
11. రాజస్థాన్ జైపూర్
12. గుజరాత్ గాంధీనగర్
13. మహారాష్ట్ర ముంబయి
14. మధ్యప్రదేశ్ భోపాల్
15. ఛత్తీస్ ఘడ్ రాయపూర్
16. కర్ణాటక బెంగళూర్
17. తెలంగాణ హైద్రాబాద్
18. కేరళ తిరువనంతపురం
19.  తమిళనాడు చెన్నెై
20. గోవా పనాజి
21. సిక్కిం గాంగ్‌టాక్
22. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్
23. అస్సాం డిస్పూర్
24. మేఘాలయ షిల్లాంగ్
25. నాగాలాండ్ కోహిమా
26. మణిపూర్ ఇంఫాల్
27. మిజోరాం ఐజ్వా ల్
28. త్రిపుర అగర్తల
కేంద్రపాలిత ప్రాంతాలు
1. అండమాన్ & నికోబార్ దీవులు పోర్టుబ్లెయిర్
2. పుదుచ్చేరి (పాండిచ్చేరి) పుదుచ్చేరి
3. లక్ష ద్వీపు(ప్) కవరత్తి
4. దాద్రానగర్ హవేలి సిల్వాస్సా
5. డామన్ & డయ్యూ డామన్
6. ఛండీగర్ ఛండీగర్
7. న్యూఢిల్లీ న్యూఢిల్లీ
8. జమ్ము & కాశ్మీర్ శ్రీనగర్ & జమ్ము
9. లడక్ లెహ్

ప్రశ్న 6.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 9
ఈ భౌతిక పటాన్ని పరిశీలించి భారతదేశం యొక్క కొన్ని భౌగోళిక స్వరూపాలను గురించి రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 10

6th Class Social Textbook Page No.36

ప్రశ్న 7.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 11
భారతదేశం – ముఖ్య పంటలు (విషయ నిర్దేశిత పటం)
i) ఈ పటం ఏమి సూచిస్తోంది?
జవాబు:
భారతదేశంలో పండే ముఖ్య పంటలను సూచిస్తోంది.

ii) దీనిని విషయ నిర్దేశిత పటం అని ఎందుకు పిలుస్తారు?
జవాబు:
ఏదైనా ఒక నిర్దిష్ట అంశాన్ని తెలియజేసే పటం విషయ నిర్దేశిత పటం అంటారు. ఈ పటంలో ‘భారతదేశం – ముఖ్య పంటలు’ అనే నిర్దిష్ట అంశాన్ని తెలియజేస్తుంది, కనుక దీనిని విషయ నిర్దేశిత పటం అని పిలుస్తారు.

ప్రాజెక్టు పని

మీ పాఠశాల చిత్తు చిత్రం గీయండి.
జవాబు:
స్వయం చేయగలరు.

వివిధ రకాల పటాలను సేకరించి ఒక స్క్రిప్ పుస్తకం తయారుచేయండి.
జవాబు:
స్వయం చేయగలరు.

సరియైన చిహ్నాలను ఉపయోగించి మీ ఇంటినుంచి పాఠశాలకి వెళ్ళే దారి యొక్క చిత్తు చిత్రాన్ని గీయండి.
జ. ఉదా :
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 7

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

SCERT AP 6th Class Social Study Material Pdf 9th Lesson ప్రభుత్వం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 9th Lesson ప్రభుత్వం

6th Class Social 9th Lesson ప్రభుత్వం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పార్లమెంటరీ మరియు అధ్యక్ష ప్రజాస్వామ్యాల మధ్య వ్యత్యాసాలను రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 1

ప్రశ్న 2.
ప్రభుత్వం అంటే ఏమిటి? వివిధ రకాల ప్రభుత్వాలు ఏవి?
జవాబు:
ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ, వాటికొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాన్ని ప్రభుత్వం’ అంటారు. ప్రభుత్వాలు రెండు రకాలు, అవి

  1. రాచరిక ప్రభుత్వం
  2. ప్రజాస్వామ్య ప్రభుత్వం

ప్రశ్న 3.
నేడు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏవైనా నాలుగు కార్యకలాపాలను రాయండి.
జవాబు:

  • ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా ఉంటుంది.
  • అలాగే తపాలా సర్వీసులు నిర్వహించడం, రైల్వే వ్యవస్థ నిర్వహణ వంటి పనులను కూడా ప్రభుత్వం చూస్తుంది.
  • ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని, సరిహద్దులను రక్షిస్తుంది. ప్రజలందరికీ ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది.
  • ఎపుడైనా ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకవసరమైన సహాయం అందిస్తుంది.
  • ప్రజలకు న్యాయస్థానాల ద్వారా వివాద పరిష్కారం చేస్తుంది.

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 4.
నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనే వారందరి అభిప్రాయాలను పరిగణించడం సాధ్యమేనా? కొన్ని ఉదాహరణలతో చర్చించండి.
జవాబు:
నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనే వారందరి అభిప్రాయాలను పరిగణించడం చాలావరకు సాధ్యం కాకపోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఏకాభిప్రాయం కుదురుతుంది, అయితే ఇది అన్ని వేళల సాధ్యం కాదు. అందుకనే మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

ఉదాహరణకు మున్సిపల్ కౌన్సిల్ లోని (20) సభ్యులు పట్టణంలో ఏర్పాటు చేయదలచుకున్న పారిశుధ్య కార్మికుల కాంట్రాక్ట్ విషయంలో సభ్యులు తమ తమ అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. అనేకమైన అభిప్రాయాలు వచ్చాయి. మరి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేరు, కనుక మెజారిటీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు.

ప్రశ్న 5.
విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ కలసి పాఠశాలను నడిపిస్తే ఎలా ఉంటుంది? పాఠశాలను నడపటానికి అందరూ భాగస్వాములు కావాలని మీరు అనుకుంటున్నారా? లేక ప్రతినిధులను ఎన్నుకొని వారితో నడపాలని కోరుకుంటున్నారా? కారణాలు తెలపండి.
జవాబు:

  • విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల నడిపిస్తే అది ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుంది.
  • పాఠశాల నడపడానికి ప్రతినిధులను ఎన్నుకొని వారితో నడపాలని కోరుకుంటున్నారు.
  • కారణాలు : అందరూ నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ సమయం వృథా అవుతుంది. అమలు చేసేవారుండరు. అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి మేధావంతులై, అంకితభావం కలిగి, ఇతరుల మేలు కోరేవారిని ప్రతినిధులుగా ఎన్నుకుంటే పాఠశాల చక్కగా నడుస్తుంది.

ప్రశ్న 6.
మీ పాఠశాలలో నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్నాయా? ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారా?
జవాబు:
మా పాఠశాలలో నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరం మా అభిప్రాయాలను తెలియజేస్తున్నాము. అయితే ఎక్కువమంది ఏ అభిప్రాయం వెళ్ళబుచ్చారో దానినే అమలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ విధివిధానాలను అనుసరించి మా అభిప్రాయం పరిగణలోకి తీసుకుంటున్నారు.

ప్రశ్న 7.
సాత్విక్ తండ్రి ఒక దుకాణం ప్రారంభించడానికి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను అడిగాడు. ప్రతి ఒక్కరు భిన్నమైన అభిప్రాయాలను తెలిపారు. కానీ చివరకు, అతను దుకాణాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాడని మీరు అనుకుంటున్నారా?
జవాబు:

  • సాత్విక్ తండ్రి ప్రజాస్వామ్య బద్దంగానే వ్యవహరించాడని నేను అనుకుంటున్నాను.
  • ఎందుకంటే తను కుటుంబ సభ్యులందరి అభిప్రాయాలను అడిగాడు.
  • కుటుంబ సభ్యులందరికి దుకాణం యొక్క లాభనష్టాల గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. ఈయనకు సరైన అవగాహన ఉంది కాబట్టి దుకాణం ప్రారంభించి ఉండవచ్చు.

ప్రశ్న 8.
పద్మ తల్లి, తన పిల్లలను ఆదివారం ఎక్కడికి వెళ్తాం అని అడిగింది. ఇద్దరు పిల్లలు సినిమాకు వెళ్తామని, ముగ్గురు పార్కుకు వెళ్లాని అన్నారు. మీరు పద్మ స్థానంలో ఉంటే ఏ నిర్ణయం తీసుకుంటారు? కారణాలు చెప్పండి.
జవాబు:

  • నేను పద్మని అయితే (ఆమె స్థానంలో ఉంటే) నేను పిల్లలను పార్కుకి తీసుకువెళ్ళే దానిని.
  • ఎందుకంటే ఎక్కువమంది (మెజారిటి) పిల్లలు పార్కుకి వెళ్తామని చెప్పారు కాబట్టి.

ప్రశ్న 9.
ప్రజాస్వా మ్యానికి పుట్టినిల్లు……….
ఎ) చైనా
బి) భారతదేశం
సి) గ్రీస్
డి) రోమ్
జవాబు:
సి) గ్రీస్

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 10.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికి ఉంటుంది?
ఎ) పురుషులు
బి) మహిళలు
సి) ప్రతినిధులు
డి) అర్హత కలిగిన ఓటర్లు
జవాబు:
డి) అర్హత కలిగిన ఓటర్లు

ప్రశ్న 11.
భారతదేశంలో…… సంవత్సరాలు నిండినవారు విశ్వజనీన వయోజన ఓటు హక్కుకు అర్హులు.
ఎ) 18 సం||
బి) 21 సం||
సి) 20 సం||
డి) 19 సం||
జవాబు:
ఎ) 18 సం||

ప్రశ్న 12.
భారతదేశంలో ప్రతి రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతానికి రాజధాని నగరం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యస్థానం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యస్థానాలు అయిన కింది రాష్ట్ర రాజధానులను దిగువ ఇచ్చిన భారతదేశ పటంలో గుర్తించండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 2
జవాబు:

  1. మహారాష్ట్ర – ముంబయి
  2. తమిళనాడు – చెన్నై
  3. ఆంధ్రప్రదేశ్ – అమరావతి
  4. కర్ణాటక – బెంగుళూరు
  5. పశ్చిమ బెంగాల్ – కొల్‌కతా
  6. తెలంగాణ – హైద్రాబాద్
  7. లడఖ్/జమ్మూకాశ్మీర్-లెహ్, శ్రీనగర్
  8. పంజాబ్ – చంఢీఘర్
  9. కేరళ – తిరువనంతపురం
  10. అరుణాచల్ ప్రదేశ్ – ఇటానగర్
  11. మధ్య ప్రదేశ్ – భోపాల్
  12. జార్ఖండ్ – రాంచి
  13. ఛత్తీస్ – రాయపూర్
  14. ఉత్తరాఖండ్ – డెహ్రాడూన్
  15. గుజరాత్ – గాంధీనగర్
  16. ఒడిశా – భువనేశ్వర్

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 3

6th Class Social Studies 9th Lesson ప్రభుత్వం InText Questions and Answers

6th Class Social Textbook Page No.100

ప్రశ్న 1.
శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వహక శాఖకు ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:

  • శాసన నిర్మాణ శాఖ శాసనాలను (చట్టాలను) లేదా నిర్ణయాలను చేస్తుంది.
  • కార్యనిర్వాహక శాఖ శాసనాలను (చట్టాలను) లేదా నిర్ణయాలను అమలుపరుస్తుంది.
  • ఈ రెండు శాఖలకు వేటికవే అధికారాలు కల్గి ఉన్నాయి. ఒకదానిలో మరొకటి జోక్యం చేసుకునే అవకాశం లేదు. కాని శాసనశాఖ, కార్యనిర్వాహకశాఖను నియంత్రిస్తుంది.

ప్రశ్న 2.
న్యాయశాఖ యొక్క ప్రధాన విధి ఏమిటి?
జవాబు:
న్యాయశాఖ చట్టాలను వ్యాఖ్యానించడం, రాజ్యాంగ పరిరక్షణ చేయడం ప్రధాన విధిగా చెప్పవచ్చు.

6th Class Social Textbook Page No.101

ప్రశ్న 3.
దిగువ వార్తా పత్రికల శీర్షికలను పరిశీలించి, వాటి ఆధారంగా ప్రభుత్వ వివిధ కార్యకలాపాల జాబితాను రాయండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 4
జవాబు:
ప్రభుత్వ వివిధ కార్యకలాపాల జాబితా :

  • అందరికి ఉచిత నాణ్యమైన విద్యనందించడం.
  • మార్కెట్ ధరలను నియంత్రించడం (అదుపులో ఉంచడం).
  • అందరికి వైద్య సదుపాయాన్ని కల్పించడం (ఉచితంగా)
  • ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొవడం. ఉదా : వరదలు, భూకంపాలు మొదలైన ప్రకృతి విపత్తులో సహాయమందించడం.
  • వివిధ శాఖాధిపతులను, నియమించటం మొదలైనవి.

6th Class Social Textbook Page No.102

ప్రశ్న 4.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 5
మీ ఉపాధ్యాయుని సహాయంతో, పై లోగోలు మరియు ప్రభుత్వ కార్యకలాపాల చిత్రాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కింది మైండ్ మ్యాప్ నింపండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 6

ప్రశ్న 5.
ప్రభుత్వానికి సంబంధించిన మరికొన్ని పనులను రాయండి.
జవాబు:
ప్రభుత్వానికి సంబంధించిన పనులు :

  • రోడ్ల నిర్మాణం చేపట్టడం
  • రైల్వే, విమాన, నౌకాయానం చేపట్టడం
  • పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలు నిర్మించడం , తంతి, తపాల సౌకర్యాల ఏర్పాటు, నిర్వహణ
  • ఆనకట్టలు నిర్మించడం
  • దేశ రక్షణ (అంతర్గత, బహిర్గత)
  • శాంతి, భద్రతల పరిరక్షణ
  • ప్రజలందరికి న్యాయం అందించటం
  • పన్ను వసూలు చేయటం
  • అనేక రకాల సంక్షేమ పథకాలు చేపట్టడం
  • సమర్థవంతంగా పాలన చేయడం
  • అంతర్జాతీయంగా స్నేహ సంబంధాలు నెలకొల్పడం

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 6.
మీరు ప్రభుత్వం నుండి ఏ రకమైన సౌకర్యాలను ఆశిస్తున్నారు?
జవాబు:

  • ఉచిత గృహ వసతి
  • 24 గం||లు రక్షిత మంచినీటి సౌకర్యం
  • KG to PG ఉచిత విద్య,
  • పరిశుభ్రతకై పారిశుధ్య సౌకర్యం.
  • మెరుగైన, నాణ్యమైన వైద్య సదుపాయం
  • పర్యావరణ పరిరక్షణకై వన సంరక్షణ.
  • మా గ్రామం/పట్టణంలో నాణ్యమైన, మంచిరోడ్లు
  • అందరికి ఉద్యోగ, ఉపాధి కల్పించడం.

ప్రశ్న 7.
మీ ఉపాధ్యాయుని సహాయంతో ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశాలలోనైనా రాచరికాలు అమలులో ఉన్నాయేమో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
ప్రస్తుత ప్రపంచంలో పూర్తిస్థాయి రాచరికాలు లేకపోయినప్పటికీ, రాజరికం అనేది (రాజు రాణి అధ్యక్షులు ఉండటం) నామమాత్రంగా నైనా కొన్ని దేశాలలో కలదు. అవి :

  • యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్)
  • బ్రూనై
  • నెదర్లాండ్
  • రోమెనియా
  • జోర్డాన్
  • బెహ్రయిన్
  • మొరాకో
  • కాంబోడియా
  • UAE
  • మొనాకో
  • కువైట్
  • భూటాన్
  • టోంగా
  • వాటికన్ సిటీ
  • కత్తార్
  • బెల్జియం
  • సౌదీ అరేబియా
  • థాయ్ లాండ్
  • మలేసియా
  • జపాన్
  • ఓమన్ మొదలైనవి.

6th Class Social Textbook Page No.103

ప్రశ్న 8.
మీకు ఏ రకమైన ప్రభుత్వం ఇష్టం? ఎందుకు?
జవాబు:
నాకు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇష్టం. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకొనబడుతుంది. ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తుంది.

ప్రశ్న 9.
ప్రజల అభిప్రాయాన్ని ఏ ప్రభుత్వం గౌరవిస్తుంది?
జవాబు:
ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తుంది.

ప్రశ్న 10.
కింది చిత్రాలను గమనించండి. ప్రభుత్వ పేరును సంబంధిత బాక్సులలో రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 7

6th Class Social Textbook Page No.104

ప్రశ్న 11.
రాచరికం మరియు ప్రజాస్వామ్యం మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

రాచరికం ప్రజాస్వామ్యం
1. వంశపారంపర్యంగా నియమింపబడిన పాలకుడు ఉంటాడు. 1. దేశంలోని ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు ఉంటాడు.
2. రాజుకి అపరిమిత అధికారాలుంటాయి. 2. ప్రభుత్వ అధికారానికి పరిమితులుంటాయి.
3. ఎన్నికలు ఉండవు, పారదర్శకత ఉండదు. పాలకులపై నియంత్రణ ఉండదు. 3. పాలన, ఎన్నిక విధానం పారదర్శకంగా ఉంటుంది. నాయకులపై నియంత్రణ ఉంటుంది.
4. రాచరికంలో హక్కులు రాజు ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటాయి. 4. ప్రజలందరికి ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఇవి రాజ్యాంగబద్దంగా అందరికీ ఇవ్వబడతాయి.
5. రాచరికంలో రాజు నియంత్రణలోనే (కనుసనల్లోనే) సమాచార, ప్రసార సాధనాలుంటాయి. ప్రభుత్వ పాలనను విమర్శిస్తే శిక్షార్హులే. 5. సమాచార, ప్రసార సాధనాలు (వార్తా పత్రికలు, దూరదర్శన్, సినిమా) ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా ఉండి, ప్రభుత్వాలను విమర్శిస్తూ, నియంత్రిస్తుంటాయి.
6. ఇది నిరంకుశ పాలన కావచ్చు, సమానత్వం కన్పించదు. 6. ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వంలో అందరూ సమానులే.

ప్రశ్న 12.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం భారతదేశంలో సాధ్యమేనా? కారణాలు తెల్పండి.
జవాబు:

  • ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం భారతదేశంలో సాధ్యం కాదు, కారణం
  • భారతదేశంలో అధికంగా దాదాపు (135 కోట్లు) జనాభా ఉండటం వల్ల సాధ్యం కాదు.

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 13.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యానికి ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో, పౌరులు మాత్రమే చట్టాలు చేయగలరు. అన్ని మార్పులను పౌరులు ఆమోదించాలి. రాజకీయ నాయకులు పార్లమెంటరీ విధానం ప్రకారం పాలన మాత్రమే చేస్తారు. పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు చట్టాలు చేస్తారు.

6th Class Social Textbook Page No.105

ప్రశ్న 14.
పై సందర్భంలో మెజారిటీ పాలనను మీరు ఎలా అర్ధం చేసుకున్నారు? మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ప్రాతినిధ్య సూత్రంతోపాటు, ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలలో మెజారిటీ పాలన ఒకటి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ (simple majority) ద్వారా కూడా ప్రతినిధులు ఎన్నికవుతారు. ఒక్కోసారి ఒక్క ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా ఎన్నిక జరగవచ్చు. అటువంటప్పుడు వేరే అభ్యర్థికి ఓటువేసిన వారు కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవలసిందే. ఆ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలు పరుస్తారు.

ఉదాహరణకు : ఒక మున్సిపల్ కౌన్సిల్ లో 45 మంది కౌన్సిలర్స్ ఉంటే 23 మంది ఒక ప్రతిపాదనను సమరిస్తే అది ఆమోదం పొందుతుంది. మిగతా 22 మంది అభిప్రాయాలకు విలువ ఉండదు. అలా ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నాయి.

ప్రశ్న 15.
మీ తల్లిదండ్రుల నుండి, ఎన్నికల వ్యవస్థలో వారు చూసే సమస్యలను తెలుసుకొని, ఒక నివేదికను తయారు చేయండి. మీ తరగతిలో వాటిని చర్చించండి. ఈ సమస్యలకు పరిష్కారాలను కనుగొనండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు. క్రింది ఆధారాలను ఉపయోగించుకోండి.

ఎన్నికలలో ప్రజలు ధనవంతుల చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతున్నారు. కొన్ని సందర్భాలలో కులం, మతం కూడా ఎన్నికల సమయంలో ప్రజలమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాక భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా పెద్దది. రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ లాంటి అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి. ఓటు చేసే వారి శాతం చాలా తక్కువగా ఉండటం యింకా పెద్ద సమస్య. ఇవి లేకుండా ఉండాలంటే ప్రజలు వివేకవంతులై ధన, కుల ప్రలోభాలకు లొంగకుండా, ఓటు చేయాలి. సరియైన ప్రతినిధులను ఎన్నుకోవాలి.

6th Class Social Textbook Page No.106

ప్రశ్న 16.
కింద ఇవ్వబడిన ప్రపంచ పటాన్ని గమనించండి. పార్లమెంటరీ వ్యవస్థ మరియు అధ్యక్ష వ్యవస్థను విడిగా అనుసరిస్తున్న దేశాల జాబితా చేయండి. (మీ ఉపాధ్యాయుని సహాయంతో) ఈ పుస్తకం యొక్క వెనుక పేజీలలో ప్రపంచ పటాన్ని చూడండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 8
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 9

6th Class Social Textbook Page No.107

ప్రశ్న 17.
మీ ఉపాధ్యాయుని సహాయంతో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
కేంద్ర ప్రభుత్వం :
ప్రధానమంత్రి, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఉద్యోగ బృందం

రాష్ట్ర ప్రభుత్వం :
ముఖ్యమంత్రి, శాసనసభ, శాసనమండలి) సభ్యులు, గవర్నర్, రాష్ట్రమంత్రులు, ఉద్యోగ బృందం

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 18.
వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
నేడు అన్ని దేశాలు (ఉదా: భారతదేశం) అత్యధిక జనాభాను కలిగి ఉన్నాయి. కాబట్టి దేశ వ్యాప్తంగా ప్రజల అవసరాలు మరియు సమస్యలను గుర్తించడం కష్టం. కాబట్టి వివిధ సమస్యలను పరిష్కరించటానికి, ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు, పాలన వికేంద్రీకరణకుగాను ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

SCERT AP 6th Class Social Study Material Pdf 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

6th Class Social 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కళింగ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి నిర్ణయాలు ప్రపంచ శాంతిని పెంపొందిస్తాయని అనుకుంటున్నావా? ఎలా?
జవాబు:
అవును. భావిస్తున్నాను. ఎందుకనగా ……..

  • ప్రజలకు మరియు ఇతర రాజులకు యుద్ధ భయం ఉండదు.
  • యుద్దాలు లేనపుడు ఆయుధాల కొరకు ఎక్కువ మొత్తంలో సంపదను వెచ్చించనవసరం లేదు.
  • యుద్ధ భయం లేకపోతే ప్రజలందరు మనశ్శాంతితో, ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తారు.
  • యుద్దాల అవసరం లేనపుడు రాజు తన దృష్టిని ప్రజా సంక్షేమం వైపు మళ్లించవచ్చు.

ప్రశ్న 2.
నేటికాలంలో అశోకధర్మం యొక్క ప్రాముఖ్యతను వివరింపుము. అశోకధర్మం యొక్క గొప్పతనాన్ని వర్ణింపుము.
జవాబు:
నేటి కాలంలో అశోకధర్మం యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది.

అశోకధర్మం యొక్క ప్రధాన సూత్రాలు :

  • జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి.
  • తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి.
  • పేదల పట్ల సానుభూమి కలిగి ఉండాలి.
  • పెద్దలను గౌరవించవలెను.
  • ఇతర మతాలను విస్మరించరాదు.
  • మానవజాతి సంక్షేమానికి కృషి చేయాలి.
  • అశోకుని ధర్మం ప్రజలకు అనుకూలము ఆచరణీయము అయిన నైతిక సూత్రాలను కల్గి ఉంది.
  • ఉన్నతమైన జీవన విధానాన్ని అందించటమే అశోకుని ధమ్మ ఉద్దేశము.
  • ధర్మాపేక్ష, శ్రద్ధ, విధేయత, పాపభీతి, సామర్థ్యము లేకపోతే ఇహపరలోక సుఖాలను పొందలేరని బోధించాడు.
  • నేటి సమాజంలో వివిధ రూపాలలో జరుగుతున్న ‘హింసకు’ అశోకుని (అహింస) ధర్మము చక్కని పరిష్కారం.
  • అలాగే ‘పరమత సహనం’ అనే సూత్రం నేడు ఎంతో అవసరం. అనేక అల్లర్లకు, హింసకు, యుద్ధాలకు మత మౌఢ్యమే కారణం.
  • ఈ విధంగా అశోకుని క్క గొప్ప ధర్మం నేటికాలంలో ప్రాముఖ్యత కలిగి ఉంది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 3.
అశోకుని యొక్క ప్రజాపనులకు నేటికాలంలో ప్రజాప్రభుత్వాలు చేస్తున్న ప్రజా పనులకు పోలికలు మరియు భేదాలు తెలుపుము?
జవాబు:
అశోకుని యొక్క ప్రజాపనులకు నేటికాలంలో ప్రజాప్రభుత్వాలు చేస్తున్న ప్రజా పనులకు పోలికలు :

  • అశోకుడు, నేటి ప్రభుత్వాలు ప్రజాక్షేమమే తమ ప్రధాన ఆశయంగా భావించి వారి సంక్షేమము కొరకు అనేక చర్యలు చేపడుతున్నారు.
    నీరు, ఆహారం తమ ప్రజలందరికీ అందాలని అశోకుడు సంకల్పించాడు, నేటి ప్రభుత్వాలు కూడా సాగు, త్రాగు నీరు మరియు ఆహారం (రేషన్ షాపుల ద్వారా) ప్రజలందరికీ అందిస్తున్నాయి.
  • అశోకుడు దేశ వ్యాప్తముగా అనేక రహదారులను నిర్మించి, వాటి కిరువైపులా చెట్లు నాటించెను. నేటి ప్రభుత్వాలు కూడా దేశాభివృద్ధికై జాతీయ, రాష్ట్ర మొ||న రహదారులను నిర్మిస్తున్నాయి. అలాగే పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున చెట్లను (వన సంరక్షణ) నాటుట, సంరక్షించుట మొ||న చర్యలు చేపడుతున్నాయి.
  • అశోకుడు మానవులకే కాక జంతువుల కొరకై ప్రత్యేక వైద్య శాలలను నెలకొల్పను. నేటి ప్రభుత్వాలు కూడా దేశ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాట్లు చేసినాయి.

భేదాలు :

  • అశోకుని కాలంకంటే నేటి (ప్రభుత్వాల) కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందటం వలన ప్రజలకు ఎన్నో సౌకర్యాలు ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. ఉదా : డిజిటల్ సేవలు, రవాణా రంగంలోని సేవలు (రైలు విమానం మొ||నవి.)
  • నేటి కాలంలో ప్రజా పనులు చాలా విస్తృతంగా, ఖర్చుతో కూడుకుని ఉన్నాయి.

ప్రశ్న 4.
అశోకుడు తన సైన్యాన్ని యుద్ధం కోసం కాకుండా ప్రజాసేవకు వినియోగించాడు. ప్రస్తుత కాలంలో భారత సైన్యం యుద్ధాలలోనే కాకుండా పాల్గొనే ఇతర సహాయ కార్యక్రమాలేవి?
జవాబు:
భారత సైన్యం చేపడుతున్న సహాయ కార్యక్రమాలు :

  • ప్రకృతి విలయాల సందర్భంలో, తుఫానులు, భూకంపాలు, వరదలు మొ||న ప్రకృతి భీభత్సాలలో సాధారణ పౌరులను ఆదుకోవటానికి సైన్యం ఎంతో సహాయం చేస్తుంది.
  • పర్వతలోయల్లో, కొండల్లో ఎవరైనా అపాయంలో ఉన్నా, ప్రమాదాలు జరిగిన సైన్యం వారికి సహాయం అందిస్తుంది.
  • NCC (National Cadet Corps) లాంటి వానిద్వారా విద్యార్థులలో దేశభక్తిని, సైనిక శిక్షణను అందిస్తుంది.
  • ‘ఆపరేషన్ సద్భావన’ కార్యక్రమం ద్వారా భరత సైన్యం పౌరులకు అనేక రకాలుగా సేవలు అందిస్తుంది.
  • అంతర్గత కలహాలు, బాంబు ప్రేలుళ్ళు, హైజాకింగ్ మొ||న సందర్భాలలో సైన్యం ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 5.
గుప్తుల కాలంలో కళలు, సాహిత్యం మరియు వాస్తు నిర్మాణ రంగాలలో సాధించిన విజయాలేవి?
జవాబు:
గుప్తుల కాలంలో వివిధ రంగాలలో సాధించిన విజయాలు :
గుప్తుల కాలంలో సారస్వతం, గణితం, వైద్య శాస్త్రం మరియు ఖగోళశాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడినవి. అనేక కొత్త విషయాలు ఆవిష్కరించబడినవి. అందులో చెప్పబడిన జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం పేరుతో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రెండవ చంద్రగుప్తుని కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులు కలరు. వీరినే ‘నవరత్నాలు’ అంటారు. నవరత్నాలలో కాళిదాసు ప్రసిద్ధ కవి.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 2

NAVARATNAS నవరత్నాలు
కాళిదాసు సంస్కృత కవి, రచయిత
అమరసింహుడు నిఘంటుకర్త
శంకు భవన నిర్మాణ ఇంజనీరు
ధన్వంతరి ఫిజీషియన్, ఆయుర్వేద వైద్యుడు
క్షేపకుడు జ్యోతిష్య శాస్త్రవేత్త
ఘటకర్షకుడు సంస్కృత కవి, రచయిత, కవి
భేతాళబట్టు మంత్రశాస్త్ర కోవిదుడు
వరరుచీ గణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు
వరాహమిహురుడు ఖగోళ శాస్త్రవేత్త

అద్భుతమైన రాతి గుహలకు గుప్తుల కాలం ప్రసిద్ధి. వారి కాలంలో పెయింటింగ్ కు, వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 6.
భారతదేశంలో గుప్తుల కాలాన్ని “స్వర్ణయుగమని” ఎందుకు అంటారు?
జవాబు:
భారతదేశ చరిత్రలో గుప్తుల పాలనా కాలము ఒక మహోజ్వలమైన అధ్యాయము. శాస్త్ర విజ్ఞానం, జోతిష్య శాస్త్రం, గణితం మరియు సాహిత్య రంగాలలో గుప్తుల కాలంలో అనేక కొత్త విషయాలు కనుగొనుట జరిగినది. అందువలన గుప్తకాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అంటారు.

సాహిత్యరంగంలో అభివృద్ధి :
గుప్తుల కాలంలో సారస్వతం, గణితం, వైద్యశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడినవి. రెండవ చంద్రగుప్తుని కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులు కలరు. వీరినే నవరత్నాలు అంటారు. నవరత్నాలలో కాళిదాసు ప్రసిద్ధ కవి.

గణితశాస్త్రంలో ఆవిష్కరణలు :
ఆర్యభట్టు ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త, గణితశాస్త్రవేత్త. బీజగణితాన్ని వీరి కాలంలో ఉపయోగించారు. భారతీయ శాస్త్రవేత్తలు ‘సున్న’ భావనను అభివృద్ధి చేశారు. ‘సున్న’ కు గుర్తును కూడా తయారు చేశారు. 1-9 సంఖ్యలకు గుర్తులను గుప్తుల కాలంలోనే కనుగొన్నారు. వీరు కనుగొన్న ‘ఆల్గారిథమ్స్’ను నేడు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లో ఉపయోగిస్తున్నారు. బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. ఇతను పౌర సంవత్సరాన్ని దాదాపు కచ్చితంగా లెక్కించగల్గినాడు.

వైద్యశాస్త్ర ప్రగతి :
చరకుడు, సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు. ప్లాస్టిక్ సర్జరీ, ‘ విరిగిన ఎముకలను సరిచేసి ఆపరేషన్ కూడా ఆనాటి వైద్యులు చేసినారు. వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించారు.

ఖగోళశాస్త్రంలో అన్వేషణలు :
ఖగోళశాస్త్రం మరియు శాస్త్ర విజ్ఞానాలలో భారతీయ శాస్త్రవేత్తలు అనేక విషయాలు కనుగొన్నారు. నక్షత్రాలు మరియు గ్రహాల కదలికలను గమనించారు. భూమి గుండ్రంగా ఉంటుందని మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నారు. భూమికి సూర్యునికీ మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని వారు భావించేవారు. గురుత్వాకర్షణ శక్తి గురించి కూడా వీరికి తెలుసు.

భారతీయ శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగశాలలు మరియు ప్రయోగాలు లేకుండానే పై విషయాలన్నియు కనుగొన్నారు. పై విషయాలన్నింటికి కేవలం ఊహించుట ద్వారానే చెప్పగలిగారు. ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధనలు ద్వారా పై విషయాలన్నీ ఖచ్చితమైనవని నిరూపించబడినవి.

కళలు, వాస్తు శిల్పకళ :
అద్భుతమైన రాతి గుహలకు గుప్తుల కాలం ప్రసిద్ధి. వారికాలంలో పెయింటింగ్లు, వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.

లోహ విజ్ఞానం :
గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు, లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. ఇనుము మరియు ఉక్కుతో ఆయుధాలు తయారు చేసేవారు. ఆధునిక బంగారు నాణెలను పోలి ఉండే వాటిని కూడా వీరికాలంలో ముద్రించుట జరిగినది.

ప్రశ్న 7.
వైద్య మరియు లోహ విజ్ఞానశాస్త్ర రంగాలలో గుప్తుల కాలంలో సాధించిన విజయాలేవి?
జవాబు:
వైద్యశాస్త్రం :
చరకుడు మరియు సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతుడు. గుప్తుల కాలంలోని వైద్యులు విరిగిపోయిన ఎముకలను సరిచేసి ఆపరేషన్లు కూడా చేసేవారు. ఔషధంతో కూడిన మొక్కలను వ్యాధులను నయం చేయడంలో ఉపయోగించేవారు. వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించేవారు.

లోహ విజ్ఞాన శాస్త్రం :
గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. ఇనుము మరియు ఉక్కుతో ఆయుధాలు తయారు చేసేవారు. ఆధునిక బంగారు నాణేలను పోలి ఉండే వాటిని కూడా వీరి కాలంలో ముద్రించుట జరిగినది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 8.
పల్లవులు వాస్తు శిల్పకళకు చేసిన సేవను వివరింపుము.
జవాబు:
దక్షిణ భారతదేశంలోని వాస్తు శిల్పకళా నైపుణ్యానికి పల్లవ రాజులు ఎంతో సేవ చేశారు. వారి కాలంలో వాస్తు శిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారినది. తొలి పల్లవ రాజులలో మొదటి మహేంద్రవర్మ ప్రసిద్ధి చెందిన రాజు, అతడు గొప్ప వాస్తు శిల్పకళాభిమాని అతను ప్రవేశ పెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళను ‘మహేంద్రుని రీతి’ శిల్పకళ అంటారు. గుహాలయాల యొక్క ప్రభావం శిల్పకళపై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

మొదటి నరసింహ వర్మ తదుపరి ముఖ్యమైన పల్లవరాజు. ఇతను మహేంద్రవర్మ యొక్క కుమారుడు. ఇతనిని ‘మహామల్లుడు’ అని కూడా పిలుస్తారు. మహాబలిపురం రేవు పట్టణాన్ని ఇతను మంచి వాస్తు శిల్పకళా నైపుణ్యంతో అందంగా నిర్మించాడు. ఇతని కాలంలో అభివృద్ధి చేయబడిన వాస్తుశిల్పకళ ‘మహామల్లుని వాస్తు శిల్పకళారీతి’గా ప్రసిద్ధి చెందినది. మహాబలిపురంలో అయిదు రథాలు నిర్మించారు. ఇవి పంచపాండవ రథాలుగా పేరొందాయి. ఒక్కో రథాన్ని ఒక్కో పెద్ద బండరాయిని తొలిచి నిర్మించారు. కావున వీటిని ‘ఏకశిలా రథాలు’ అంటారు.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 1

రెండవ నరసింహ వర్మ దేవాలయాలు నిర్మించుటపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. అతను ‘రాజసింహుడు’ అను పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు. అతని కాలంలో నూతన వాస్తుశిల్ప కళారీతి అభివృద్ధి చెందినది. దేవాలయాలు మెత్తని మట్టి, రాయితో నిర్మించుట జరిగినది. దీనిని ‘రాజసింహుని వాస్తు శిల్పకళారీతి’ అంటారు. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం రాజసింహుని వాస్తు శిల్పకళారీతికి చక్కటి ఉదాహరణ.

ప్రశ్న 9.
భారతదేశపటంలో క్రింది వానిని గుర్తింపుము.
1. పాటలీపుత్రం
2. ఉజ్జయిని
3. నర్మదానది
4. కాంచీపురం
5. మహాబలిపురం
6. ధాన్య కటకం
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 3

ప్రశ్న 10.
నేను ఎవరు? (కనుక్కోండి చూద్దాం)
అ. ‘నేను అశోకుని నాలుగు సింహాల గుర్తులో ఉన్నాను. నేను జాతీయ పతాకం మధ్యలో కూడా ఉన్నాను. నేను ఎవరిని?
జవాబు:
అశోక ధర్మ చక్రము.

ఆ. నేను గుప్తుల వంశానికి చెందిన రాజును. దేశంలో ఉన్న అందరి రాజులను ఓడించాను. నా పేరేమి?
జవాబు:
సముద్రగుప్తుడు.

ఇ. నేను శాతవాహనుల రాజధానిని, కృష్ణానది ఒడ్డున ఉన్నాను. నా ‘పేరేమి?
జవాబు:
ధాన్య కటకం.

ఈ. మహాబలిపురంలోని రాతిని తొలిచి నిర్మించిన గుహాలయాలను పూర్తి చేశాను. నేను మొదటి మహేంద్రవర్మ, కుమారుడిని నా పేరు ఏమిటి?
జవాబు:
మొదటి నరసింహ వర్మ

6th Class Social Studies 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు InText Questions and Answers

6th Class Social Textbook Page No.88

ప్రశ్న 1.
అశోకుడు కళింగ రాజ్యాన్ని ఎందుకు ఆక్రమించాలనుకున్నాడు?
జవాబు:
అశోకుడు మరింత విశాలమైన రాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించాడు. అందుకోసం చాలా యుద్ధాలు చేశాడు. అందులో కళింగ యుద్ధము ప్రముఖమైనది. కళింగ రాజ్యం భారతదేశానికి తూర్పు తీరంలో గల స్వతంత్రమైన విశాలమైన రాజ్యం. మౌర్యవంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. అందుకని అశోకుడు కళింగ రాజ్యాన్ని ఆక్రమించాలనుకున్నాడు.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 2.
కళింగ యుద్ధంలో విజయం తర్వాత అశోకుడు ఎందుకు సంతోషంగా లేడు?
జవాబు:
అశోకుడు కళింగ రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ కళింగ యుద్ధం అత్యంత భయంకరమైనది మరియు రక్తసిక్తమైనది. అశోక చక్రవర్తి కళింగ యుద్ధభూమిలోకి స్వయంగా నడచి వెళ్ళాడు. అనేకమంది గాయపడిన మరియు చనిపోయిన సైనికులను స్వయంగా చూస్తాడు. యుద్ధంలో గెలిచినప్పటికీ అశోకచక్రవర్తి ఏ మాత్రం సంతోషంగా లేడు. భవిష్యత్తులో అతని జీవితకాలంలో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని గట్టిగా నిర్ణ యించుకుంటాడు. ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయముగా భావిస్తాడు. తన శేష జీవితంలో అహింసకు ప్రాధాన్యత ఇస్తాడు. అహింసను ప్రబోధించే బౌద్ధమతం పట్ల ఆకర్షితుడవుతాడు.

6th Class Social Textbook Page No.89

ప్రశ్న 3.
ప్రస్తుత భారతదేశపటంలో అప్పటి కళింగ రాజ్య ప్రాంతాన్ని మీ ఉపాధ్యాయుని సహాయంతో గుర్తించుము.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 4

ప్రశ్న 4.
కళింగ రాజ్యాన్ని ప్రస్తుత భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు:
ఒడిషాగా పిలుస్తున్నారు.

6th Class Social Textbook Page No.90

ప్రశ్న 5.
అశోకుని శిలాశాసనాలు నిరక్షరాస్యులు కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇది ఎలా సాధ్యమని నీవు అనుకుంటున్నావు?
జవాబు:
అశోకుని శిలాశాసనాలు నిరక్షరాస్యులు కూడా ఎలా అర్థం చేసుకోగలిగినారంటే :

  • ‘అశోకుడు’ ధర్మమహామాత్రులు’ అనే అధికారులను నియమించాడు. వారు రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు ధర్మప్రచారం చేసేవారు.
  • అశోకుడు తన సందేశాలను శాసనాల రూపంలో రాళ్లపైన, స్తంభాలపైన చెక్కించాడు.
  • చదువు రానివారికి వాటి పైనున్న సందేశాలను చదివి వినిపించాలని అధికారులను ఆదేశించాడు.
  • అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రదేశాలైన సిరియా, ఈజిప్టు, గ్రీస్, శ్రీలంకలకు వ్యాప్తి చేయటానికి రాయబారులను పంపించాడు.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 6.
ప్రస్తుత రోజులలో ప్రభుత్వం యొక్క సందేశం ప్రజలకు ఎలా చేరుతున్నది?
జవాబు:
ప్రస్తుత రోజులలో ప్రభుత్వం యొక్క సందేశం ప్రజలకు ఎలా చేరుతుందంటే :

  • పత్రికల ద్వారా
  • దూరదర్శన్ (టి.వి.) ద్వారా
  • సోషల్ మీడియా ద్వారా
  • ప్రభుత్వ శాఖల ప్రకటనల ద్వారా
  • ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక కార్యకర్తల ద్వారా
  • వివిధ గ్రంథాలు,
  • ప్రముఖుల ఉపన్యాసాల ద్వారా

ప్రశ్న 7.
మౌర్య చక్రవర్తుల కాలక్రమ చార్టును తయారు చేయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు, ఉదాహరణకు
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 5

ప్రశ్న 8.
అశోక చక్రవర్తి యొక్క వ్యక్తిత్వాన్ని తరగతిగదిలో చర్చించుము.
జవాబు:
మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు అశోకుడు. అనేక శాసనాలను వ్రాయించాడు. ఆనాటి పరిస్థితులను నేటికి తెలిసేలా చేశాడు. ప్రపంచ చలత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది, యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. కళింగ యుద్ధం తరువాత ధర్మ ప్రచారం చేశాడు. అంతేకాక రోడ్లను నిర్మించాడు. బావులను త్రవ్వించాడు. సత్రాలను కట్టించాడు. మనుష్యులకే కాక జంతువులకు కూడా వైద్యాలయాలను కట్టించాడు. ఈ కారణాల వలన అశోకుడు విశిష్ట పాలకుడని నేననుకుంటున్నాను.

ప్రశ్న 9.
జాతీయ చిహ్నం యొక్క ప్రాధాన్యతను తరగతి గదిలో చర్చించుము.
జవాబు:
సారనాథ్ లోని అశోకుని శిలా స్తంభంలోని నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ, చిహ్నంగా స్వీకరించింది.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 6

జాతీయ చిహ్నం అనేది ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. ఇది ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. 1950 జనవరి 26 నుంచి దీనిని అధికారికంగా జాతీయచిహ్నంగా గుర్తించారు. ఇందులో మూడు సింహాలు పైకి కనపడతాయి. నాల్గవసింహం మాత్రం అదృశ్యంగా దాగి ఉంటుంది. మూడు సింహాలు అధికారం, ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం అనే మూడు లక్షణాలకు ప్రతీకలు నాల్గవ సింహం భారతజాతి యొక్క గౌరవానికి ప్రతీక. ఎబాకు మధ్యలో చక్రం ఉంటుంది. అందులో కుడివైపున ఎద్దు మరియు ఎడమవైపున గెంతుతూ ఉన్న గుర్రం ఉంటుంది. ఎద్దు కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. అశ్వము వేగాన్ని మరియు శక్తిని తెలియజేస్తుంది. ఎబాక్కు దిగువవైపున ‘సత్యం జయిస్తుంది’ అని లిఖించబడి ఉంటుంది. ఇది మండూకోపనిషత్ నుంచి గ్రహింపబడింది.

6th Class Social Textbook Page No.91

ప్రశ్న 10.
రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఉందని మీరు భావిస్తున్నారా? నీ సమాధానాన్ని సమర్థింపుము.
జవాబు:
రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను.

  • వ్యాపారులకు, చేతి వృత్తుల వారికి రవాణా మార్గాలు చాలా ముఖ్యమైనవి. ఈ రవాణా మార్గాలు పెద్ద పట్టణాలను, ఓడరేవులను మరియు ఇతర దేశాలను కలుపుతాయి.
  • అభివృద్ధి చెందిన రవాణా మార్గాల వల్లనే (విదేశీ) వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది.
  • రవాణా సౌకర్యాలు ఎంత ఎక్కువగా అందుబాటులో ఉంటే వ్యవసాయ, వివిధ పరిశ్రమల ఉత్పత్తులను అంత ఎక్కువగా ప్రజలకు చేరువ చేయవచ్చు (వాణిజ్యం ద్వారా) ఉదా : విదేశాలలో తయారైన ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఫోన్లు స్థానిక మార్కెట్లో లభ్యమవ్వడం.

6th Class Social Textbook Page No.92

ప్రశ్న 11.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 7
పై భారతదేశ పటంలో గుప్త సామ్రాజ్యంలోని నాలుగు ముఖ్యమైన నగరాల పేర్లను రాయుము.
జవాబు:

  1. పాటలీపుత్ర
  2. ఉజ్జయిని
  3. సాంచి
  4. బరుకచ్చా

6th Class Social Textbook Page No.93

ప్రశ్న 12.
సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నీవు భావిస్తున్నావా? సమాధానాన్ని సమర్ధింపుము.
జవాబు:
సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నేను భావిస్తున్నాను.

  • మొదటి చంద్ర గుప్తుని తర్వాత సముద్రగుప్తుడు రాజైనాడు.
  • ఇతని కాలంలో సామ్రాజ్యము ఉత్తర భారతదేశం అంతటా విస్తరించినది. సముద్రగుప్తుడు అపజయమే ఎరుగనటువంటి గొప్ప విజేత.
  • ఇతని తర్వాత రెండవ చంద్రగుప్తుడు పరిపాలకుడయ్యాడు. పశ్చిమ భారతదేశంలోని శకరాజులను కూడా ఇతను జయించగలిగినాడు.
  • సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలోని తొమ్మిది మంది ప్రముఖ రాజులను ఓడించి వారి రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకున్నాడు.
  • దక్షిణాదిన 12 మంది రాజులను ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
  • తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్రను కొనసాగించాడు.

6th Class Social Textbook Page No.95

ప్రశ్న 13.
శాతవాహనులలో గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పవాడని ఎట్లు చెప్పగలవు ? అలా అయితే ఎందువలన?
జవాబు:

  • శాతవాహన రాజులలో ముఖ్యమైన రాజులు గౌతమీపుత్ర శాతకర్ణి, వాశిష్ట పుత్ర పులోమాని మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనులు 300 సంవత్సరాలు పరిపాలించారు.
  • గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులందరిలో గొప్పవాడు.
  • అతను శకులను, యవ్వనులను, పహ్లావులను ఓడించాడు.
  • దక్షిణ భారతదేశంలో మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడు.
  • అందువలన అతనికి త్రిసముద్రాధీశ్వర’ అనే బిరుదు వచ్చింది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

6th Class Social Textbook Page No.96

ప్రశ్న 14.
ఇక్ష్వాకులు అన్ని తెగల వారిని ఏకం చేయగలిగారు. నీవు దీనిని అంగీకరిస్తావా లేదా విభేదిస్తావా ? అవును అయితే వారు ఏయే పద్ధతులను ఉపయోగించారు?
జవాబు:
ఇక్ష్వాకులు అన్ని తెగల వారిని ఏకం చేయగలిగారు, నేను దీనికి అంగీకరిస్తున్నాను. ఏ పద్దతులు ఉపయోగించారు అంటే,

  • ఇతర తెగల వారితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకొనుట ద్వారా
  • యజ్ఞ, యాగాదులు (అశ్వమేథ యాగం మొ||) చేయటం ద్వారా
  • రామాయణంలోని శ్రీరాముని వారసులుగా చెప్పుకొనుట ద్వారా

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

SCERT AP 6th Class Social Study Material Pdf 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

6th Class Social 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
గణ అంటే ఏమిటి? రాజులు పాలించిన రాజ్యాలకు వీటికి తేడాలు ఏమిటి?
జవాబు:
గిరిజన సమూహాలు పాలించిన ప్రాంతాన్ని ‘గణ’ అంటారు. సాధారణంగా గణ పరిపాలనా కొంతమంది సభ్యుల చేతిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమను ‘రాజ’ అని పిలుచుకునేవారు. ఉదా : వజ్జి
రాజ్యాలను రాజులు పరిపాలించేవారు. రాజువంశ పారంపర్యంగా వచ్చేవాడు. దీనినే రాజరికం అంటారు. పరిపాలనకు రాజు సర్వాధికారి. రాజుకి స్వంత సైన్యం ఉంటుంది. వీరు రాజు ఆజ్ఞలను పాటిస్తారు.

ప్రశ్న 2.
మహా జనపదాలలో రాజులు కోటలు ఎందుకు నిర్మించారు.?
జవాబు:
మహా జనపదాలలో రాజులు పెద్ద పెద్ద కోటలు నిర్మించారు. ఎందుకంటే :

  • శత్రు రాజ్యాల దాడుల నుండి తమ రాజ్యాన్ని కాపాడుకోటానికి
  • తమ సంపదను, అధికారాన్ని ప్రదర్శించడానికి
  • తమ ఖజానాను, (ధాన్యాగారాలను) రక్షించుకోవడానికి
  • తమ ప్రాంతమంతా సులభంగా, అందుబాటులో ఉండేందుకు.

ప్రశ్న 3.
నాటి మహాజన పదాల కాలంలో గ్రామ నిర్వహణకు, నేటి గ్రామాల నిర్వహణకు మధ్యగల తేడాలను తెలపండి.
జవాబు:
నాడు, నేడు కూడా గ్రామాల నిర్వహణ ఎన్నికైన వారిచే నిర్వహించబడింది, నిర్వహించబడుతోంది. అయితే ఆనాడు గ్రామానికి అధికారి రాజు. నేడు సర్పంచ్. నేడు గ్రామాలకు కావలసిన అవసరాలైన త్రాగునీరు, వీధిలైట్లు, లైబ్రరీ మొదలైన సౌకర్యాలు కలుగచేస్తారు. ఇంటి పన్ను మొదలైనవి వసూళ్ళు చేస్తారు. గ్రామానికి కావలసిన వసతుల కోసం పైస్థాయి వారితో మాట్లాడుతారు. కానీ నాటి గ్రామాల యొక్క నిర్వహణ, వీటితో పాటుగా గ్రామరక్షణ కూడా వారే చేసేవారు. గ్రామాధికారి పొలంలో సంవత్సరానికి ఒక రోజు గ్రామస్తులు ఉచితంగా పనిచేసేవారు. పన్నును ధన, వస్తు, జంతు రూపంలో కట్టేవారు. చివరగా చెప్పాలంటే నేటి నిర్వహణ ప్రజాస్వామికం, నాటి నిర్వహణ రాచరికం.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 4.
ప్రస్తుతం ప్రభుత్వం వృత్తి పనులవారి మీద ఏవిధంగా పన్నులు వేస్తుంది? మహాజనపదాలలోని పన్నుల విధానం, ఇదీ ఒకటేనా?
జవాబు:
ప్రస్తుతం ప్రభుత్వం స్వంతగా చేతివృత్తులవారి మీద ఎటువంటి పన్నులు వేయడం లేదు. కొన్ని కొన్ని వృత్తులు చేసేటువంటి (ఉదా : ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు) వారి మీద వృత్తి పన్ను ప్రతినెలా కొద్దిమొత్తం వారి జీతం నుండి మినహాయిస్తుంది. మహాజనపదాలలోని పన్నుల విధానం, ఇదీ వేరు వేరు.

ప్రశ్న 5.
ఏ ఆధారాల సహాయంతో నీవు మహాజనపదాల గురించి తెలుసుకున్నావు?
జవాబు:

  • మహాజనపదాల గ్రామాలు, పట్టణాల గురించి రెండు రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు.
  • ఒకటి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా, మరొకటి ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా గంగా లోయలో వందలాది ప్రాంతాలలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించారు.
  • హస్తినాపుర (నేటి ఢిల్లీ), అత్రంజీ ఖేరా, కోశాంబి (అలహాబాద్ దగ్గర), పాటలీపుత్ర మొదలైనవి ముఖ్యమైన పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు.
  • ఈ కాలానికి చెందిన పుస్తకాలు చాలా వరకూ మత సంబంధమైనవి. అవి మత సంబంధమైనవి అయినప్పటికీ ‘ కూడా అవి నాటి పట్టణాలు, గ్రామాలు, పాలకులు మరియు రాజుల గురించి తెలియపరిచాయి.
  • కొన్ని పుస్తకాలు సుదూర ప్రాంతాలయిన గ్రీకు వారిచే కూడా రాయబడ్డాయి.
  • ఉపనిషత్తులు, ధర్మ సూత్రాలు, దిగానికాయ, మధ్యమనికాయ, హెరిడోటస్ చరిత్ర మొదలైనవి ఈ కాలంలో రాయబడిన కొన్ని ముఖ్య గ్రంథాలు.

ప్రశ్న 6.
మహాజన పదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడిన వ్యవసాయ విధానాల గురించి రాయండి.
జవాబు:
మహాజన పదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడిన వ్యవసాయ విధానాలు :

  • ఇనుప నాగలిని వినియోగించటం.
  • వరి నారు పోసే పద్ధతిని ప్రారంభించటం.
  • అభివృద్ధి చెందిన సాగునీటి సౌకర్యాలు మొ||నవి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 7.
“మహాజనపదాలు పది తరాలలో అభివృద్ధి చెందాయి.” ఈ వ్యాఖ్యలతో నీవు ఏకీభవిస్తావా? నీ జవాబును సమర్థించుము.
జవాబు:
మహాజనపదాలు పదితరాలలో అభివృద్ధి చెందాయనే వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.

హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగ, యమున నదులు ప్రవహిస్తున్నాయి. దీనిని గంగా నదీ లోయ అంటారు. ఈ మైదానంలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇది అత్యంత సారవంతమైనది. హిమాలయాల నుండి ఒండ్రు మట్టిని తెచ్చే ఈ నదులు ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. ప్రారంభంలో వివిధ తెగల ప్రజలు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో వ్యవసాయం చేయుటకు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ తెగలలో ముఖ్యమైనవి శాక్య, లిచ్ఛవీ, మల్ల, వైదేహి మొదలైన తెగలు. ఈ తెగలనే సంస్కృతంలో ‘జన’ అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలుస్తారు.

ఈ నదుల వెంట ప్రజలు 2700 సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించారు. వారు ఇనుప ఉపకరణాల సహాయంతో అడవులను నరికి వేసి, భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుని వరి మరియు ఇతర పంటలు పండించారు. అనేక పెద్ద గ్రామాలు మరియు పట్టణాలూ ఈ ప్రాంతాలలో అభివృద్ధి చెందాయి. బహుశా ఆ ప్రాంతాలలో వేర్వేరు తెగలకు చెందిన చాలామంది వ్యక్తులు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండవచ్చు. గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను “మహాజనపదాలు” లేదా ‘పెద్ద జనపదాలు’ పిలిచేవారు. మహాజనపదాలలో చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండి రక్షణ పరంగా పటిష్టంగా ఉండేవి.

ప్రశ్న 8.
జనపదాల కాలం నాటి వృత్తి పనివారి పనితనాన్ని నీవెలా ప్రశంసిస్తావు?
జవాబు:
చాలా గ్రామాలలో నైపుణ్యం గల వృత్తి పనివారు ఉండేవారు. కమ్మర్లు, వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు (నాగలి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవి)ను, వంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిలవ ఉంచే పాత్రలను కుమ్మరి , బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామగ్రిని వడ్రంగులు, దుస్తులను నేతపనివారు తయారు చేసేవారు.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 1

మహాజనపదం కాలంలో వృత్తి కార్మికులు నాటి కుమ్మరులు మట్టి కుండలను తయారు చేశారు. వీటిలో కొన్ని బూడిద రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి. ఒక రకమైన ప్రత్యేకమైన కుండలు ఈ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. వీటిని “పెయింటెడ్ గ్రేవేర్” అని పిలుస్తారు. ఆ బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు, రేఖా గణిత నమూనాలు చిత్రించబడి ఉన్నాయి.

ప్రశ్న 9.
మహా జనపదాల కాలంలో పరిపాలకులచే వసూలు చేయబడిన పన్నులేవి?
జవాబు:

  • వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ‘భాగ’ అని పిలిచేవారు.
  • ప్రతీనెల ఒక రోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకి చెల్లించేవారు.
  • వ్యాపారస్థులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు.
  • వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప వంటివి ఇచ్చేవారు.
  • ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి.
  • ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులు నాణేల రూపంలో చెల్లించేవారు.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 10.
మహా జనపదాల కాలంలో పాలకుల ఎన్నిక, ప్రస్తుత రోజులలో ఎన్నికల విధానం కన్నా ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
మహా జనపదాల కాలంలో పాలకులు (రాజులు) ఒక కుటుంబ వంశపారంపర్యంగా చాలాకాలంపాటు పాలించేవారు. అంటె ఎక్కువ జనపదాలలో రాచరికం అమల్లో ఉంది. కొన్ని గణ రాజ్యాలలో మాత్రమే ఒకే పరిపాలకుడు కాక, ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాలలో వేలమంది కలసి పాలన చేసేవారు.

ప్రస్తుత రోజులలో పాలకుల ఎన్నిక విధానం ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా జరుగుతుంది. అంటే వయోజనులైన (18 సం||లు పైబడినవారు) వారు తమ ఓటుహక్కు ద్వారా పాలకులను ఎన్నుకుంటున్నారు.

ప్రశ్న 11.
ప్రస్తుత కాలంలో పంటలు పండించే విధానాలు మహాజనపదాల కాలంలో విధానాలతో ఏ విధంగా సరిపోతాయి?
జవాబు:

  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో ఇనప నాగలి వినియోగించడం జరిగింది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో వరి నారు పోసే పద్దతి. ఒకే విధంగా ఉంది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో సాగునీటి సౌకర్యాల కల్పన ఒకేలా ఉంది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో పాలకులు వ్యవసాయాభివృద్ధికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 12.
మగధ బలమైన రాజ్యంగా ఆవిర్భవించడానికి తోడ్పడిన సహజ వనరుల పాత్రను ప్రశంసించుము.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 2
మగధ రాజ్యం గంగానదికి ఇరువైపులా విస్తరించి ఉందని మీరు గమనించి ఉంటారు. నదులు, భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకొనేవారు. నదుల మీద సరకు రవాణా చేసేవారు. సైనికులను తరిలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలు, రథాలను నిర్మించటానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు తయారు చేసేవారు. వీటన్నింటి కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజైన బింబిసారుడు, అతని కుమారుడు అజాత శత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. ఈ రాజు కోట నుండి విధంగా సహజ వనరులు మగధను బలమైన రాజ్యంగా ఆవిర్భవించటానికి బయలుదేరుట తోడ్పడినాయి.

ప్రశ్న 13.
భారతదేశ అవుట్ లైన్ పటములో పదహారు మహాజనపదాలను, వాటి రాజధానులను గుర్తించుము.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 3

ప్రశ్న 14.
ఈ పాఠ్యాంశంలో నేర్చుకున్న కొత్త పదాలతో కింది పదబంధ ప్రహేళికను పూరించండి. మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకోండి.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 4
అడ్డం :
1. మహాజనపదాలలో శక్తివంతమైన రాజ్యం.
2. వారణాసికి మరొక పేరు.
3. కౌశాంబి ఈ మహాజన పదానికి రాజధాని.
4. మహాభారతం ఈ మహాజనపదానికి చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుపుతుంది.
5. రైతులు పంట దిగుబడిలో 1/6 వంతుగా చెల్లించే పన్ను.
6. యజ్ఞాలు మరియు కుల వ్యవస్థని ఇవి ఖండిస్తున్నాయి.
7. ‘వజ్ర’లో ఈ రకమైన ప్రభుత్వం ఉన్నది.

నిలువు :
1. తూర్పు దిక్కున చిట్టచివరి మహాజనపదం
2. అవంతి రాజధాని నగరం.
3. నాగళ్ళు తయారు చేయడానికి రైతులు ఉపయోగించిన లోహం.
4. గోదావరీ నదీ తీరంలో కల మహాజనపదం.
5. గహపతులు నియమించుకున్న బానిసలు.
6. కుశివార ఈ రాజ్యానికి రాజధాని.
7. సూరసేనకి రాజధాని
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 5

6th Class Social Studies 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం InText Questions and Answers

6th Class Social Textbook Page No.75

ప్రశ్న 1.
1) భారతదేశ పటంలో గంగా, యుమునా నదులు ఏమైదానాల గుండా ప్రవహిస్తున్నాయో గుర్తించండి.
2) భారతదేశ పటంలో నవీన నగరాలైన ఢిల్లీ, అలహాబాద్, వారణాసి, లక్నో, పాట్నాలను గుర్తించండి.
3) ఈ ప్రాంతం మీ గ్రామాలను పోలి ఉందా? కారణాలు తెల్పండి.
జవాబు:
1.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 6
2.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 7
3. ఈ ప్రాంతం మా గ్రామాలను పోలి లేదు. కారణం మా గ్రామం పీఠభూమి ప్రాంతంలో ఉంది. పై ప్రాంతం మైదాన ప్రాంతంలో ఉంది.

ప్రశ్న 2.
గంగా సింధు మైదానంలో మొదట్లో స్థిరపడ్డ తెగల పేర్లను మీ ఉపాధ్యాయుల సహాయంతో తెలుసుకోండి.
జవాబు:
గంగా, సింధు మైదానంలో భరత, పురు, కురు, పాంచాల, యదు, తుర్వాస, శాక్య, లిచ్ఛవీ, మల్ల, వైదేహీ మొ॥న తెగలు మొదట్లో స్థిరపడ్డ తెగలు.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 3.
‘జనపదం’ అంటే అర్థం ఏమిటి? మహాజనపదాలకు, వీటికి గల తేడా ఏమిటి?
జవాబు:
మొదట్లో వివిధ తెగలు గంగా – సింధూ మైదానంలోని అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డాయి. ఈ తెగలనే సంస్కృతంలో “జన’ అని వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలిచేవారు.

గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను ‘మహా జనపదాలు’ లేదా ‘పెద్ద జనపదాలు’ అని పిలిచేవారు.

6th Class Social Textbook Page No.76

ప్రశ్న 4.
గంగ నదీ పరీవాహక ప్రాంతంలో గల మహాజన పదాలు మరియు పట్టణాలను ఒక పట్టిక రూపంలో రాయండి.
జవాబు:
గంగ నదీ పరీవాహక ప్రాంతంలో గల మహాజన పదాలు మరియు పట్టణాలు :
మహాజనపదాలు – పట్టణాలు
1. కురు – ఇంద్రప్రస్తము
2. కోసల – శ్రీవస్తి
3. వజ్జి – వైశాలి
4. వత్స – కౌశోంబి
5. కాశి – వారణాశి
6. మగధ – రాజ గృహ
7. అంగ – చంప
8. మల్ల – కుశీనగరం
9. ఛేది – శోతిమతి
10. సూరసేన – మధుర
11. పాంచాల – అహిచ్ఛత్ర

6th Class Social Textbook Page No.77

ప్రశ్న 5.
క్రింది పటంలో నాటి ముఖ్యమైన జనపదాలు చూపబడ్డాయి. పటాన్ని చూసి కింది ఖాళీలను పూరించండి.
1. యమునానదికి ఇరువైపులా విస్తరించిన జనపదం ……….. (కురు)
2. పాంచాల జనపదం ……………. నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. (గోమతి (ఉత్తర గంగా)
3. సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం ………. (మధుర)
4. అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం …….. (కాంభోజ)
5. గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం ……….. (అస్మక)
6. గాంధార జనపదం ………….. నదీ తీరాన నెలకొంది. (జీలం)

ప్రశ్న 6.
ఒక ప్రసిద్ధి చెందిన ఇతిహాసంలో ఈ జనపదాల గురించి ప్రస్తావన ఉంది. దాని గురించి తెలుసుకోండి.
జవాబు:
భారతదేశ ప్రసిద్ది ఇతిహాసమైన ‘మహాభారతంలో’ ఈ జనపదాల ప్రస్తావన ఉంది. ముఖ్యంగా ‘కురు’ (హస్తినాపురం) మహాజనపదం ప్రధాన కేంద్రంగా ఉంది.

6th Class Social Textbook Page No.78

ప్రశ్న 7.
నేడు వరిని ఏ విధంగా సేద్యం చేస్తున్నారు?
జవాబు:
నేడు వరిని క్రింది విధంగా సేద్యం చేస్తున్నారు.

  • మొదటగా భూమిని చదును చేసి, గట్లు కడతారు.
  • తర్వాత నీరు పెట్టి, దమ్ము చేస్తారు. (మెత్తగా చేస్తారు)
  • తర్వాత నాట్లు వేస్తారు (కొన్ని ప్రాంతాలలో వెద పెట్టడం జరుగుతుంది)
  • తర్వాత కలుపు తీయటం, పంటకు అవసరమైన ఎరువులు వేయటం జరుగుతుంది.
  • అవసరమనుకుంటే పురుగు మందులు చల్లటం జరుగుతుంది.
  • తర్వాత వరి కంకులు రావడం జరుగుతుంది. కంకులు ముదిరిన తర్వాత పొలంలోని నీరు తీసేస్తారు.
  • తర్వాత వరికోతలు చేపట్టి, కుప్ప పోస్తారు. తర్వాత నూర్పిడి చేస్తారు.
  • తూర్పార బట్టి వడ్లను వేరు చేస్తారు. (కొన్ని ప్రాంతాలలో వరికోత యంత్రం ద్వారానే ఇవన్నీ చేస్తున్నారు.)

6th Class Social Textbook Page No.79

ప్రశ్న 8.
నాటి గ్రామాలలో గృహపతులకు మరియు వృత్తి పనివారికి మధ్యగల సంబంధం గురించి వివరించండి.
జవాబు:
గృహపతికి అవసరమైన పనిముట్లను వృత్తిపనివారు తయారుచేసి ఇచ్చేవారు. ఈ ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వృత్తి పనివారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవటానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు. వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పనివారిచే చేయబడిన వస్తువులు వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీసాయి.

6th Class Social Textbook Page No.80

ప్రశ్న 9.
నగరాలలోని ప్రజలకు ధాన్యం, పాలు, మాంసం మొదలైనవి అవసరం. నగరంలో వ్యవసాయం లేకుండా అంతమంది ప్రజలు వాటిని ఎలా పొందగలిగేవారు?
జవాబు:
నగరాలకు చుట్టుప్రక్కల గ్రామాలుంటాయి. ధాన్యం అక్కడి నుండి నగరాలలోని రైస్ మిల్లర్లు కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతారు. డైరీ ఫారాల ద్వారా పాలు సేకరించి, పాశ్చురైజేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధిచేసి, శీతలీకరించి ప్రజలకు సరఫరా జరుపుతారు. నగరాలలో కూడా పశువుల పెంపకం జరుగుతుంది. కాబట్టి మాంసం కూడా సులభంగానే లభ్యమవుతుంది.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 10.
మీరు ఎప్పుడైనా టీవిలో కాని, ఆ ప్రాంతాన్ని సందర్శించి కానీ ఒక కోటను చూసారా?
జవాబు:
చూసాను. టీవిలో రాజస్థాన్లోని (జైపూర్) కోటలను, హైదరాబాద్ లోని గోల్కొండ కోటను చూసాను. ప్రత్యక్షంగా కొండవీడు కోటను, వరంగల్ కోటను సందర్శించాను.

ప్రశ్న 11.
కోట చుట్టూ అంత పెద్ద గోడలు ఎందుకు ఉంటాయి ? అవి వేటితో నిర్మింపబడి ఉంటాయి? వీటంతటికి అవసరమైన ధనాన్ని రాజులు ఎలా పొందేవారు?
జవాబు:

  • శత్రు దేశాల దాడుల నుండి రక్షణకై కోటచుట్టూ పెద్ద గోడలు ఉంటాయి. .
  • వీటిని పెద్ద పెద్ద కొండ రాళ్ళతో నిర్మింపబడి ఉంటాయి.
  • వీటంతటికి అవసరమైన ధనాన్ని రాజులు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసేవారు.

ప్రశ్న 12.
మహాజన పదాలలో రాజులకు సైన్యం ఎందుకు అవసరం?
జవాబు:
మహాజన పదాల రాజులు వారి తెగను, రాజ్యాన్ని కాపాడాల్సి వచ్చేది. ఇతరుల దండయాత్రల నుండి వారిని రక్షించాల్సి వచ్చేది. అంతేగాక పన్నులు చెల్లించడానికి నిరాకరించేవారిని శిక్షించడానికి, ప్రజలు రాజు ఆజ్ఞలను పాటించేలా చూడటానికి కూడా సైనికులు అవసరం.

6th Class Social Textbook Page No.81

ప్రశ్న 13.
వేటాడేవారు, సేకరణ చేసేవారు రాజుకు ఏ రూపంలో పన్నులు చెల్లించేవారు?
జవాబు:
వేటాడేవారు, సేకరణ చేసేవారు అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప వంటివి ఇచ్చేవారు. అలాగే అటవీ ఉత్పత్తులైన కాయలు, పండ్లు, తేనె మొ|| న వాటిని కూడా బహుమతిగా ఇచ్చేవారు.

ప్రశ్న 14.
ప్రతి ఒక్కరూ తాము కష్టపడి సంపాదించినదానిలో కొంత చెల్లించాల్సి వస్తే అది వాళ్ళ జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
జవాబు:
ప్రతి ఒక్కరూ రాజ్యంలో తమ రక్షణ కొరకు ప్రభుత్వం తమకు కల్పించే సౌకర్యాలకు కొంత సొమ్మును చెల్లించాల్సి వస్తే అది సమంజసంగానే ఉంటుంది. కాని కష్టపడి సంపాదించిన దానిలో కొంత చెల్లించాల్సి వస్తే అది వారి జీవితాలపై దుష్ప్రభావాల్ని చూపిస్తుంది. దీనిని తప్పించుకోవడానికి ప్రజలు ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.

ప్రశ్న 15.
వాళ్ళు పన్నులు చెల్లించటానికి ఎందుకు అంగీకరించి ఉంటారు? కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు ఏరకంగా ప్రయోజనం పొందారు?
జవాబు:
తమ జీవితాల రక్షణ కోసం, నీటిపారుదల సౌకర్యాల కోసం, తెగ వృద్ధి కోసం పన్నులు చెల్లించడానికి అంగీకరించి ఉంటారు. కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు తమ దృష్టిని పూర్తిగా తమ వ్యవసాయంపైన, వ్యాపారం పైనా పెట్టి ఉంటారు. తద్వారా వారు మంచి ఆదాయం పొంది ఉంటారు.

ప్రశ్న 16.
‘భాగ’ అంటే ఏమిటి? రైతుల ఉత్పత్తి నుంచి ఇప్పటి ప్రభుత్వం కూడా ఇలా తీసుకుంటుందా?
జవాబు:
రాజులు వ్యవసాయం చేసే గృహపతుల నుండి పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనినే ‘భాగ’ అనేవారు. రైతుల ఉత్పత్తి నుంచి ఇప్పటి ప్రభుత్వం ఇలా తీసుకోదు.

6th Class Social Textbook Page No.82

ప్రశ్న 17.
వృత్తి ఉత్పత్తులను, వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి మహాజవపదాల రాజులు ఎందుకు ఆసక్తి చూపారు?
జవాబు:
రాజ్యంలో పన్నుల రూపంలో ఆదాయం పెంచుకోవడానికి రాజులు మహాజనపదాలలోని వ్యాపారులను దూరదేశాలతో వ్యాపారం చేయవలసినదిగా ప్రోత్సహించారు. అలాగే చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులు పెంచాలని, స్వయం సమృద్ధి కొరకే కాక ఎక్కువ పన్నులు వారి నుండి వసూలు చేయుటకుగాను – (రాజులు) ప్రోత్సహించిరి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 18.
రాజులు విధించే పన్నుల వల్ల గ్రామపెద్దలు ఏ విధంగా లాభపడేవారు?
జవాబు:
వ్యాపారస్తుల నుండి తమ తరఫున పన్నులు వసూలు చేయాలని గ్రామపెద్దని రాజులు కోరేవారు. ఈ పన్నులు వసూలు చేసినందుకు గాను రాజు వీరికి కొంత శాతం ముట్టచెప్పేవారు. ఈ విధంగా రాజులు విధించే పన్నుల వల్ల గ్రామ పెద్దలు తమ అధికారం, సంపద పెంచుకుని లాభపడేవారు.

6th Class Social Textbook Page No.83

ప్రశ్న 19.
అక్కడ సహజ సంపదను ఉపయోగించి మగధ రాజులు బలమైన మగధ రాజ్యాన్ని ఎలా నిర్మించారు?
జవాబు:
మగధ గంగానదికి రెండువైపులా విస్తరించి ఉన్నది. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగుచేసుకునేవారు. నదుల మీద సరుకు రవాణా చేసేవారు, సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని వచ్చి యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుండి లభించే కలపతో కోటలు, రాజభవనాలను, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారుచేసేవారు. వీటి కారణంగా మగధ రాజ్యంను బలమైన రాజ్యంగా మగధ రాజులు నిర్మించారు.

ప్రశ్న 20.
ప్రతి సహజ వనరులను గురించి, వాటిని ఉపయోగించి మగధ రాజులు బలమైన మగధ రాజ్యాలు ఎలా నిర్మించారు?
జవాబు:
మగధ రాజులు ఆ ప్రాంతంలోని సహజ వనరులను చక్కగా వినియోగించుకుని తమ సంపదను అధికారాన్ని పెంచుకున్నారు.

నదులు :
ఇచట ప్రవహించే నదులు ఈ ప్రాంతాన్ని సారవంతం చేసినవి. గృహపతులు తమ పంటలకు సమృద్ధిగా నీరు లభించుటవలన పంటలు బాగా పండించిరి. వస్తువులు మరియు సైన్యాన్ని రవాణా చేయడానికి ఇవి బాగా ఉపయోగపడినవి.

అడవులు :
మగధ చుట్టూ అడవులు గలవు. వీటిలోనుండి ఏనుగులను బంధించి తెచ్చి యుద్ధాలలో ఉపయోగపడే విధంగా శిక్షణ ఇచ్చేవారు. అడవులలో లభించే కలపనుపయోగించి కోటలను, రాజభవనాలను మరియు రథాలను నిర్మించేవారు.

ఇనుప ఖనిజం :
ఇనుప ఖనిజం నిల్వలు ఉండుట వలన వీటితో రాజులు యుద్ధాలకు అవసరమైన ఆయుధాలను మరియు వ్యవసాయ పనిముట్లు అయిన నాగటి కొర్రులు, కొడవళ్ళు మొదలగువాటిని తయారుచేశారు.

ఈ సహజ వనరులు మగధకు శక్తివంతమైన రాజ్యంగా ఎదగడానికి ఉపయోగపడినవి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 21.
వజ్జి మహాజనపదంలోని గణతంత్ర ప్రభుత్వాన్ని (పాల్గొనే అవకాశం లేని వారిని) ప్రస్తుత గణతంత్ర రాజ్య అసెంబ్లీతో పోల్చండి.
జవాబు:

  • వట్టి మహాజన పదంలో ప్రస్తుత గణతంత్ర రాజ్యంలో వలే ఒకే పరిపాలకుడు ఒక పరిపాలకుల బృందం ఉండేది. అయితే మహిళలకు,
  • బానిసలకు, సేవకులకు ఈ సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదు.
  • కాని ప్రస్తుత గణతంత్ర వ్యవస్థలో ఇటువంటి తారతమ్యాలు లేవు. అసలు బానిస వ్యవస్థీ లేదు.

ప్రాజెక్టు పని

పదహారు మహాజనపదాలకు సంబంధించిన సమాచారం సేకరించండి. భారతదేశ రాజకీయ పటం సహాయంతో అవి ప్రస్తుతం ఏయే రాష్ట్రాల పరిధిలో ఉన్నవో గుర్తించండి. ఆ వివరాలతో ఈ కింది పట్టికను నింపండి.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 8
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 9

AP Board 6th Class Social Studies Study Material Guide Solutions Pdf Download State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 6th Class Social Studies Study Material Guide Pdf free download, AP Board 6th Class Social Studies Textbook Solutions in English Medium and Telugu Medium are part of AP Board 6th Class Textbook Solutions.

Students can also go through AP Board 6th Class Social Notes to understand and remember the concepts easily. Students can also read AP 6th Class Social Important Questions for exam preparation.

AP State Syllabus 6th Class Social Studies Guide Study Material Pdf Free Download

6th Class Social Guide | AP State 6th Class Social Textbook Solutions

AP 6th Class Social Study Material Pdf English Medium

AP Board 6th Class Social Studies Solutions Telugu Medium

AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics

SCERT AP Board 6th Class Social Solutions 7th Lesson Emergence of Kingdoms and Republics Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Studies Solutions 7th Lesson Emergence of Kingdoms and Republics

6th Class Social Studies 7th Lesson Emergence of Kingdoms and Republics Textbook Questions and Answers

Improve Your Learning

Question 1.
What do you mean by Gana? How were they different from the kingdoms ruled by the kings?
Answer:
The term ‘gana’ means people of equal status. Sangha means ‘assembly’. Gana Sangha means an assembly of equal-status people. They cover a small area that was ruled by a superior group among them. These gana sanghas practiced “all are equal” traditions.
A kingdom means a territory and was ruled by a king or queen. In a kingdom, a family which rules for a long, period becomes a dynasty.

Question 2.
Why did the Rajas of Mahajanapadas build forts?
Answer:

  1. The rajas of Mahajanapadas built forts to protect their capital city.
  2. Huge walls of wood, brick or stone were built around the cities.
  3. Forts were probably built because people were afraid of attacks from other kings and needed protection.
  4. Some rulers wanted to show their wealth and strength by building large, tall, and impressive walls around their cities.
  5. The land and the people living inside the forts could be controlled more easily by the king.

AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics

Question 3.
Can you point out the difference between the way villages are managed today and in the time of Mahajanapadas?
Answer:
Nowadays, regular elections are taking place in villages which promotes democracy in our country. But in earlier times there was a ruler who controlled the village which did not help the democracy, but it helped in the monarch system which went for a long time in our country.

Question 4.
Find out how the craftspersons are; taxed by the government today? Was it the same in the times of Mahajanapadas?
Answer:
Craft persons have to pay taxes at the time of Mahajanapadas. Sometimes they have to work free of charge for the king for one day of every month.
But today if a craft person earns money more than the specified amount by the government they have to pay the tax for the excess amount they earned. There is no chance to work instead of paying tax.

Question 5.
Through what sources do you know about Mahajanapadas?
Answer:
We can know much about those villages and towns from two kinds of sources from archaeological excavations in different places and from the books composed during that period:

Question 6.
Write the agricultural practices that led to an increase in agricultural production in the time of Mahajanapadas.
Answer:
Two major changes were practiced during the Mahajanapadas period.

  1. Iron ploughshares were used. Heavy, clayey soil could be turned over better than with a wooden ploughshare, so that more grain could be produced.
  2. People of Mahajanapadas began transplanting paddy. Instead of scattering seeds on the ground, from which plants would sprout, saplings were grown and then planted in the fields. Production developed due to this since many plants survived.

AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics

Question 7.
“ The Mahajanapadas developed on the river banks.” Do you agree or not? Justify your answer.
Answer:
All the Mahajanapadas developed on the river banks. I agree with this statement. Archeologists found hundreds of sites in the Ganges valley. As this plain receives very high rainfall, it is very fertile. These rivers bring silt from the Himalayas and flow throughout the year. Transportation is also easy from these places. So Mahajanapadas developed on the river banks. If we observe all the Mahajanapadas, all the janapadas emerged around the river banks of Ganga, Yamuna, Narmada and Godavari.

Question 8.
How do you appreciate the works of craftsmen in the times of Mahajanapadas?
Answer:
During the period of Mahajanapadas, craftsmen played a key role in the development of Mahajanapadas. Availability of iron facilitated craft production also. Blacksmiths made necessary tools for agriculture like ploughshares, sickles, axes, arrows etc., With the use of iron ploughshare productivity improved. Potters made pots for cooking and storing grains. Carpenters made carts and with the help of these carts transportation was made easy. Weavers weaved cloth which was exported to other places and it helped the economy of Mahajanapadas. Potters made special type of pottery known as painted grey ware, which became famous in those days.
In this way craftsmen participated in the development of Mahajanapadas.

Question 9.
What were the taxes collected by the rulers of the Mahajanapadas?
Answer:
The taxes collected by the Mahajanapadas were :

  1. 1/6th of the total agricultural produce as a tax on crops.
  2. Craftsmen had to pay taxes in the form of labor.
  3. Taxes on the sale and purchase of goods and services for trade.
  4. Taxes on herders in the form of animals or animal products and taxes on hunters and gatherers in the nature of their collection from forests.

AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics

Question 10.
How are present-day elections different from the way in which rulers were chosen in Janapadas?
Answer:
Choosing of rulers in ‘janapadas’ – Men were chosen ‘rajas’ by performing big sacrifices. The ‘Ashwamedha was one such ritual that was used to identify a ‘raja’. The ‘raja’ chosen by this sacrifice was considered very powerful.
Electing rulers today – Today, we have a democratic system of government. Each citizen has a right to cast his vote and to form the government through his elected representative.

Question 11.
What is similar in the way crops were grown in the Mahajanapadas and how they are grown today?
Answer:
The crops that were grown in the Mahajanapadas were wheat, barley, peas, and lentils. These crops are grown in the same way as those were grown in the ancient days.
In the time of Mahajanapads, they planted paddy saplings instead of grains.
Even today the same system was followed by the farmers.

Question 12.
How can you appreciate the role of natural resources in the emergence of Magadha as a powerful kingdom?
Answer:
The rivers made the land very fertile and the Grihapatis could irrigate their lands easily. The rivers were also used for transporting goods and armies. Parts of the Magadha were forested. Elephants were captured from there and trained for fighting in the armies. Wood from the forests was used for building fortresses and palaces and chariots. In the southern parts of Magadha, there were iron ore deposits that could be used for making weapons, etc.
All this enabled Magadha to emerge as a very powerful kingdom. The kingdom extended from the northwest part of India to Odisha.
Thus Magadha used the natural wealth of the region to build a powerful kingdom.

Question 13.
Locate the 16 Mahajanapadas and their capitals in the following India outline map.
Answer:
AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics 1

AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics

Question 14.
Solve the puzzle with new terms you have learned in this lesson. Take the support of your teacher.
AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics 2
Down ↓

  1. The mahajanapada located on the extreme eastern side
  2. This is the capital city of Avanti
  3. Farmers used this metal to make plough shares.
  4. The Mahajanapada located on the banks of river Godavari
  5. The slaves employed at Gahapatis
  6. Kusinara is the capital of this kingdom
  7. The capital city of Surasena Cross

Cross →

  1. The powerful kingdom of Mahajanapadas
  2. another name for Varanasi
  3. Kaushambi is the capital of this Mahajanapada
  4. Mahabharata tells us about the battle among the kings of this mahajanapada
  5. 1 /6th of farm produce collected as tax from farmers
  6. These condemned caste systems and the use of yagnas
  7. Vajji has this type of government.

Answer:
AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics 4

AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics

Project Work

Collect the information about 16 Mahajanapadas, and the state, in which they were located. Prepare a table as given below. Refer to India Political map given.
AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics 3
Answer:

S.No. Mahajanapada Capital Modern Location / State
1. Anga Champa West Bengal
2. Magadha Girivraja/Rajagriha Gaya & Patna / Bihar
3. Kasi Banaras/Varanasi Uttar Pradesh
4. Vatsa Kausambi Around Allahabad / UP
5. Kosala Shravasti Modern Avadh region / Eastern UP
6. Surasena Mathura Western UP region
7. Kuru Indraprasta Meerut & Southeastern Haryana
8. Matsya Viratnagar Around Jaipur
9. Chedi Sothirati Bundelkhand region
10. Avanti Ujjaini/Mahismati Around Malwa MP
11. Gandhara Taxila Rawalpindi/Pakistan
12. Kamboja Pooncha Kashmir & Hindukush
13. Asmaka Pratisthan / Pothan Telangana & Maharashtra
14. Vajji Vaishali Bihar
15. Malla Kusihara Deoria & UP
16. Panchala Ahichatra/Kampliya Western UP

6th Class Social Studies 7th Lesson Emergence of Kingdoms and Republics InText Questions and Answers

Let’s Do

(Textbook Page No. 75)

Question 1.
Look at the physical map of India and identify the plains through which the rivers Ganga and Yamuna flow
Answer:
AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics 5

AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics

Question 2.
Identify the modern cities of India like Delhi, Allahabad, Varanasi, Lucknow and Patna.
Answer:
AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics 6

Question 3.
Do you think this area will be similar to your villages? Give your reasons.
Answer:
I don’t think that our villages are similar to that of Delhi, Allahabad, Varanasi, Lucknow, and Patna. They are well developed from the time of Mahajanapadas itself. Because of high fertility lands and transportation facilities these areas developed from that time. Now they became big cities and Delhi being our national capital. So, we can’t compare our villages to the cities mentioned above.

(Textbook Page No. 77)

Question 4.
The important Janapadas of those times are shown on the map.
Look at the map and fill in the blanks.
1. The …………. Janapada was settled on both the banks of the Yamuna.
2. The Panchala was settled on both the banks of the river …………..
3. The ………….. Janapada was situated on the western side of the Surasena.
4. The ………….. Janapada was on the extreme north.
5. The ………….. Janapada was situated on the banks of the river Godavari.
6. The Gandhara was situated on the banks of the river …………..
Answer:
1) Kuru
2) Ganga
3) Matsya
4) Kambhoja
5) Asmaka
6) Kubha

AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics

Think and Respond

(Textbook Page No. 75)

Question 1.
Find out the names of a few Janas (tribes) who initially settled down in the Indo – Gangetic plain,
Answer:

  1. Magadha dynasty
  2. Imperial Kanauj
  3. Mughal Empire
  4. Maratha Empire are some of the janapadas who initially settled down in the Indo – Gangetic plains.

Question 2.
What do you mean by Janapada? How is it different from Mahajanapadas?
Answer:
People of different tribes settled down to practice agriculture in many parts of the valley. These tribes were called Jana and the place they settled was called Janapada. Many groups of such villages and towns are called Mahajanapadas.

Question 3.
How is paddy grown today? (Textbook Page No. 78)
Answer:

  1. Land is to be prepared and levelled.
  2. Planting on time to be done.
  3. Fertilization to be done.
  4. Field is to be watered.
  5. Pests is to be controlled.
  6. Harvest on time.
  7. Storing safely.
  8. Milling efficiently.

AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics

Question 4.
Describe the relationship between Grihapatis and Craftsmen of the village. (Textbook Page No. 79)
Answer:
In most villages, there Were craft persons like blacksmiths who made tools necessary for agriculture (like ploughshares, sickles, axes, arrows, etc), potters who made pots for cooking and storing grains, carpenters who made carts, ploughs, furniture etc., and weavers who wove cloth for the villagers.
Probably the Grihapatis gave them grains in return for their products. These craft products were necessary for agriculture, but the Grihapatis may not have had the time or skill to make them.

(Textbook Page No. 80)

Question 5.
The people of the towns would haMe needed grain, milk, meat etc. How do you think they got them if most townspeople were not doing any farming?
Answer:
Even though the townspeople were riot doing, any farming they get milk and meat by purchasing them from nearby villages and shops situated in the town.

Question 6.
Have you ever seen a fort on TV or have you ever been there? Why were there big walls around the fort?
Answer:
I have seen Red fort. I had been to Delhi and I have seen the Red Fort there. There are big walls around the fort. To protect the enemy kings by not entering them into the fort big walls were constructed around the fort.

AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics

Question 7.
What were they made of? How do you think the kings managed to get the wealth needed for all this?
Answer:
The Red fort got its name from the stone used to construct it. The entire fort is made up of red sandstone. Maybe it was constructed with the tax amount collected and conquering other kingdoms.

Question 8.
Why did the king of Mahajanapadas need armies?
Answer:
The kings of Mahajanapadas were afraid of attacks from other kings and enemies. They needed protection. So the king of Mahajanapada needed armies.

(Textbook Page No. 81)

Question 9.
In which form the hunter-gatherers paid taxes to their kings?
Answer:
Hunters and gatherers paid taxes to the Raja from what they got from the forest like hides, woods, and honey etc.

Question 10.

  1. If everyone was forced to give away a part of their earnings as tax, how did it affect their lives?
    Answer:
    If everyone was forced to give away a part of their earnings, they will lose the earning for that part which was given as tax.
  2. Why do you think they agreed to pay the taxes? Do you think they benefited in any way from the new arrangements?
    Answer:
    They will get encouragement, and support from the king – besides protection.
  3. What is bhaga? Does the government of our times take the produce of farmers in , a similar way?
    Answer:
    The Grihapatis had to divide their crops into six parts and one part of them is to be given to king as tax. This was called bhaga.
    The government of our times does not collect produce from the farmers. The government collects tax from the farmers as per the quantity sold.

AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics

(Textbook Page No. 82)

Question 11.

  1. Why were the kings of Mahajanapadas keen to increase craft production and trade?
    Answer:
    The kings of Mahajanapadas were k^en to increase craft production and trade because they would get more taxes. The wealth of the kingdom will increase.
  2. How did the headmen of the villages benefit from the imposition of taxes by the kings?
    Answer:
    The kings of Mahajanapadas wanted the village headmen to collect the taxes on their behalf. This might have helped the headmen to increase their power in the villages.

(Textbook Page No. 83)

Question 12.
Write a couple of lines on each of the natural resources of Magadha and how it could have been used by the kings.
Answer:

  1. Magadha kingdom was spread on both sides of the river Ganga. The river made the land fertile and the Grihapatis could irrigate the land easily and produce was high.
  2. The river was also used for transporting goods and armies.
  3. Elephants were captured from the forests that spread over in the kingdom and trained for fighting in the wars.
  4. In southern parts of Magadha, there were iron ore deposits that were used for making weapons etc.

Question 13.
Compare the gana form of government in Vajji with the present-day republic. Who was not allowed to participate in the assembly of Vajji Mahajanapada?
Answer:
Vajji had gana form of government which was nearly equal to the present-day form of government. Gana was ruled by a group of leaders instead of a single ruler. In the present republic type of government, we will elect local loaders and they will discuss our problems in the assemblies through discussion and debate.
Women, slaves and wage earners are not allowed to participate in the assembly of vajji mahajanapadas.

AP Board 6th Class Social Studies Solutions Chapter 7 Emergence of Kingdoms and Republics

Explore

Question 1.
A famous religious epic tells us about many of these Janapadas. Find out about it. (Textbook Page No. 77)
Answer:
The Mahabharat.

Do you know

Question 1.
Make a list of the Mahajanapadas and the cities which were situated on the Ganges valley. (Textbook Page No. 76)
Answer:

  1. Kasi – Banaras
  2. Kosala – Shravasti
  3. Anga – Champa
  4. Magadha – Girivraja or Rajagriha
  5. Vajji or Vriji – Vaishali
  6. Malya – Kushinagar
  7. Vatsa – Kausambi
  8. Kuru – Indraprasta/Hastinapur
  9. Pachala – Ahichhtra
  10. Surasena – Mathura