AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

SCERT AP 9th Class Social Studies Guide Pdf 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

9th Class Social Studies 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
జవాబుదారీ, బాధ్యతాయుత, చట్టబద్ధ ప్రభుత్వం ఉండేలా ప్రజాస్వామ్యం ఎలా చూస్తుంది? (AS1)
జవాబు:

  1. ప్రజాస్వామ్యం అంటే అంతిమంగా ప్రజల నుంచి అధికారం పొంది, దానికి జవాబుదారీగా ఉండే ప్రభుత్వం.
  2. దీనిలో ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు కొంతకాలానికి ఎన్నుకుంటారు.
  3. ఎన్నికైన ప్రజాప్రతినిధులు వివిధ రకాలుగా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు.
  4. ప్రజలు ఎన్నుకున్న శాసనసభలలో ప్రభుత్వ పక్ష ప్రతినిధులు తమ పనిని వివరించాలి, పనుల ప్రణాళికను ఈ శాసనసభలే ఆమోదించాలి.
  5. ప్రభుత్వం చేసిన పనికి సంబంధించిన సమాచారాన్ని ఏ పౌరుడైనా అడగవచ్చు. ఆ సమాచారాన్ని ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అన్నిటికీ మించి నిర్దిష్ట కాలం తరువాత మళ్ళీ ఎన్నికలుంటాయి.
  6. ప్రజాప్రతినిధులు మళ్ళీ ప్రజల మద్దతును పొందవలసి ఉంటుంది.
  7. వాళ్ళు చేసిన పనిని వివరించమని అడిగి అది సంతృప్తికరంగా లేనప్పుడు ప్రజలు వాళ్లను తిరస్కరించవచ్చు.

ప్రశ్న 2.
సామాజిక వైవిధ్యతలను కలుపుకుని వెళ్లే స్వభావాన్ని ప్రజాస్వామ్యాలు ఏ స్థితిలో ప్రదర్శిస్తాయి? (AS1)
జవాబు:

  1. ప్రజల పాలన అని. అన్నప్పుడు వయోజనులైన అందరూ అని అర్థం.
  2. వాళ్ళు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ధనికులు కావచ్చు,. పేదవాళ్ళు కావచ్చు. నల్లవాళ్లు కావచ్చు, తెల్లవాళ్లు కావచ్చు, హిందువులు లేదా క్రిస్టియన్లు లేదా ముస్లింలు లేదా నాస్తికులు కావచ్చు. ఏ భాష మాట్లాడే వాళ్లేనా కావచ్చు. ఈ భావన ఏర్పడటానికి చాలాకాలం పట్టింది.
  3. సూచికగా ఎన్నికలలో ఓటు చేసే హక్కును తీసుకుందాం.
  4. మొదట్లో ఆస్తి ఉన్న కొంతమంది పురుషులకు మాత్రమే ఓటుహక్కు ఉండేది.
  5. క్రమేపీ కొన్ని దేశాలలో ఈ హక్కును పేదవాళ్ళకు కల్పించారు. ఆ తరువాత అది మహిళలకు లభించింది.
  6. చివరికి అన్ని మతాల, జాతుల వాళ్ళకు ఓటు హక్కు లభించింది.
  7. 1920 నుంచి అమెరికాలో శ్వేతజాతి మహిళలకు ఓటుహక్కు లభించింది.
  8. 1965 లో నల్లజాతీయులైన పౌరుల ఓటు హక్కుపై వివక్షతను తొలగించింది.
  9. న్యూజీలాండ్ 1893లోనే అన్ని వర్గాల ప్రజలకు ఓటుహక్కు కల్పించిన మొదటి దేశం.
  10. సార్వజనీన ఓటుహక్కు కల్పించిన తొలి పెద్ద దేశం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్.

రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవటం అన్న మౌలిక సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్యంలో వయోజనులైన ప్రతి ఒక్క పౌరునికి ఒక ఓటుహక్కు ఉండాలి. ప్రతి ‘ఓటుకు సమాన విలువ ఉండాలి.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 3.
కింద వ్యాఖ్యానాలను సమర్ధించటానికి వ్యతిరేకించటానికి మీ వాదనలు పేర్కొనండి : (AS2)
అ. పారిశ్రామిక దేశాలు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించగలవు, కానీ పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం ఉండాలి.
జవాబు:
పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం కన్నా ప్రజాస్వామ్యం ఉంటేనే బాగుంటుంది.

కారణం ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పనలోను, ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయటంలో, వాటిని అమలు చేయటంలో ప్రజలు భాగస్వాములు కావాలి. ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనేలా బహిరంగ చర్చలు జరపాలి తరువాత చట్టాలు, విధానాలు రూపొందించాలి ఆ విధంగా ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేయటం వల్ల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన అవకాశాలు పొందుతారు. అందువలన పేద దేశాలు కూడా ధనిక దేశాలుగా మారతాయి.

పారదర్శకత (దాపరికం లేని పరిపాలన), అమలు జరిగినపుడు,. అవినీతి, అన్యాయం, లంచగొండితనం వంటివి లేనప్పుడు పేదదేశాలు ప్రజాస్వామ్యాన్ని అమలు చేసినప్పటికీ ధనిక దేశాలుగా మారతాయి.

అందువల్ల పేద దేశాలు ధనిక దేశాలు కావాలంటే నియంతృత్వం కన్నా ప్రజాస్వామ్యమే మేలు.

ఆ. పౌరుల మధ్య ఆదాయాలలో అసమానతలను ప్రజాస్వామ్యం తగ్గించలేదు.
జవాబు:

  1. సమాజం ధనిక – పేదలుగా, పైకులాలు – దళితులుగా విభజింపబడి ఉంటే రాజకీయ సమానత్వం అర్థరహితం అవుతుంది.
  2. ఉన్నత హెూదా, సంపద ఉన్నవాళ్ళు తమకు అనుకూలంగా ఓటు వేయమని మిగిలిన వాళ్లని తేలికగా ప్రభావితం చేయగలుగుతారు.
  3. చాలా కుటుంబాలలో ఆ కుటుంబానికి పెద్ద అయిన పురుషుడు మహిళలతో సహా కుటుంబ సభ్యులందరూ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తారు.
  4. అమెరికా వంటి అనేక దేశాలలో అనేక ప్రసార సాధనాలు ధనిక కార్పొరేట్ సంస్థలు లేదా వ్యక్తుల చేతుల్లో ఉంటాయి.
  5. దేనిని ఎక్కువగా ప్రసారం చేస్తారు ? దేనిని విస్మరిస్తారు ? అన్న దానిని బట్టి వీళ్ళు ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దుతారు. ప్రభావితం చేస్తారు.
  6. సంపన్నులకు, శక్తిమంతులకు శాసనసభ్యులు, మంత్రులు అందుబాటులో ఉంటారు. కాబట్టి వాళ్ళు విధానాలను, కార్యక్రమాలను ప్రభావితం చేయగలుగుతారు.
  7. ఇంకోవైపున పేదలకు నిరక్షరాస్యులకు ప్రభుత్వ వర్గాలు ఈ విధంగా అందుబాటులో ఉండవు కాబట్టి అనేక దేశాల ప్రభుత్వాలు ధనికులకు అనుకూలంగా, పేదల ప్రయోజనాలకు విరుద్దంగా ఉండే విధానాలను అనుసరిస్తుంటాయి.
  8. కాబట్టి రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక, ఆర్థిక సమానత్వం ఉంటే తప్ప పౌరుల మధ్య ఆదాయాలలో అసమానతలను ప్రజాస్వామ్యం తగ్గించలేదు.

ఇ. పేద దేశాలలోని ప్రభుత్వాలు పేదరికం తగ్గించటం, ఆరోగ్యం , విద్యల పై తక్కువ ఖర్చు చేసి, పరిశ్రమలకు, మౌలిక సదుపాయాలకు ఎక్కువ ఖర్చు చేయాలి.
జవాబు:
పేద దేశాలలోని ప్రభుత్వాలు పేదరికం తగ్గించటం, ఆరోగ్యం , విద్యలపై తక్కువ ఖర్చుచేసి, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలకు ఎక్కువ ఖర్చు చేయడానికి కారణం.

అర్థశాస్త్ర పరిభాషలో వ్యయాలు రెండు రకాలు :

  1. ఉత్పాదక వ్యయం
  2. అనుత్పాదక వ్యయం

ఉత్పాదక వ్యయం అనగా పరిశ్రమలు, వ్యవసాయంపై చేసే వ్యయం.

అనుత్పాదక వ్యయం అనగా రోడ్లు, భవనాలపై చేసే వ్యయం.

అందువలన పేద దేశాలు ఉత్పాదక వ్యయం మీద ఎక్కువ ఖర్చు చేస్తాయి. అనుత్పాదక వ్యయంపై చేసే వ్యయం వలన అదనపు రాబడులు ఏమీరావు.

ఈ. ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ ఒక ఓటు ఉంటుంది కాబట్టి ఆధిపత్యానికి, ఘర్షణలకు తావు ఉండదు.
జవాబు:
ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ ఒక ఓటు ఉంటుంది. పౌరుల మధ్య ఓటు హక్కు విషయంలో ఏ విధమైన వ్యత్యాసం ఉండదు. ప్రతి ఓటుకీ సమాన విలువ ఉంటుంది.

పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదలు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, హిందువులు, క్రిస్టియన్లు లేదా ముస్లింలు లేదా నాస్తికులు అయినా, ఏ భాష మాట్లాడేవారైనా ఎవరికైనా ఓటుహక్కు ఉంటుంది కాబట్టి ఏ విధమైన వ్యత్యాసం ఉండదు. కావున ఏ విధమైన ఆధిపత్యానికీ, ఘర్షణలకూ తావు ఉండదు.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయటంలో కింద ఉన్న వాటిల్లో ఏది వర్తించదు? (AS1)
ప్రజాస్వామ్యంలో :
అ. స్వేచ్ఛాయుత ఎన్నికలు
ఆ. వ్యక్తి గౌరవం
ఇ. అధిక సంఖ్యాకుల పాలన
ఈ. చట్టం ముందు అందరూ సమానులు
జవాబు:
ఆ. వ్యక్తి గౌరవం .

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 5.
ప్రజాస్వామ్యంలో రాజకీయ, సామాజిక అసమానతలపై అధ్యయనం ఈ కింది విషయాన్ని వెల్లడి చేస్తోంది. (AS1)
అ. ప్రజాస్వామ్యం, అభివృద్ధి కలిసి ఉంటాయి.
ఆ. ప్రజాస్వామ్యంలో అసమానతలు ఉంటాయి.
ఇ. నియంతృత్వంలో అసమానతలు ఉండవు
ఈ. ప్రజాస్వామ్యం కంటే నియంతృత్వం మంచిది.
జవాబు:
(ఆ) ప్రజాస్వామ్యంలో అసమానతలు ఉంటాయి.

ప్రశ్న 6.
ఆరు దేశాలకు సంబంధించిన సమాచారం దిగువన ఉంది. ఈ సమాచారాన్ని బట్టి ఆయా దేశాలను ఏ రకంగా వర్గీకరిస్తారు? ఒక్కొక్కదాని ఎదురుగా “ప్రజాస్వామికం’ లేదా ‘అప్రజాస్వామికం’ లేదా ‘ఖచ్చితంగా చెప్పలేం’ అని రాయండి. (AS1)
దేశం (అ) : దేశ అధికారిక మతాన్ని అంగీకరించని ప్రజలకు ఓటు హక్కు ఉండదు.
దేశం (ఆ) : ఒకే పార్టీ గత ఇరవై సంవత్సరాలుగా ఎన్నికలలో గెలుస్తోంది.
దేశం (ఇ) : గత ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయింది.
దేశం (ఈ) : సైన్యాధిపతి ఆమోదం లేకుండా సైన్యానికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంటు చేయలేదు.
దేశం (ఉ) : న్యాయవ్యవస్థ అధికారాలను తగ్గిస్తూ పార్లమెంటు చట్టం చేయలేదు.
దేశం (ఊ) : దేశానికి సంబంధించి ముఖ్య ఆర్థిక నిర్ణయాలన్నీ కేంద్ర బ్యాంకు అధికారులు తీసుకుంటారు, వీటిని మంత్రులు మార్చలేరు.
జవాబు:
దేశం (అ) : ప్రజాస్వామికం
దేశం (ఆ) : ప్రజాస్వామికం
దేశం (ఇ) : ప్రజాస్వామికం
దేశం (ఈ) : అప్రజాస్వామికం
దేశం (ఉ) : ప్రజాస్వామికం
దేశం (ఊ) : అప్రజాస్వామికం

ప్రశ్న 7.
కింద ఉన్న ప్రతి వాక్యంలో ప్రజాస్వామిక, అప్రజాస్వామిక అంశాలు ఉన్నాయి. ప్రతి వాక్యానికి ఆ రెండింటినీ వేరుగా రాయండి. (AS1)
అ. ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయించిన నియంత్రణలకు లోబడి పార్లమెంటు కొన్ని చట్టాలు చేయాలని మంత్రి చెప్పారు. –  ప్రజాస్వామికం

ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయించిన నియంత్రణలకు లోబడి పార్లమెంటు . కొన్ని చట్టాలు చేయవలసిన అవసరం లేదు అని మంత్రి చెప్పారు. – అప్రజాస్వామికం

ఆ. పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని నివేదికలు వచ్చిన నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలను నిర్వహించవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. – ప్రజాస్వామికం

పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని నివేదికలు వచ్చిన నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించలేదు. – అప్రజాస్వామికం

పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఏనాడూ 10 శాతం మించలేదు. ఈ కారణంగా పార్లమెంటులో మూడవ వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని మహిళా సంఘాలు ఉద్యమం మొదలు పెట్టాయి. – ప్రజాస్వామికం

పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఏనాడూ 10 శాతం మించలేదు. ఈ కారణంగా పార్లమెంటులో మూడవ వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని మహిళా సంఘాలు ఉద్యమం మొదలు పెట్టలేదు. అసలు ఆ ప్రస్తావన కూడా తేలేదు. – అప్రజాస్వామికం

ప్రశ్న 8.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్న కింది వాదనలకు మీ ప్రతిస్పందన రాయండి : (AS4)
అ. దేశంలో అత్యంత క్రమశిక్షణ ఉండి, అవినీతిలేని వ్యవస్థ సైన్యం ఒక్కటే. కాబట్టి దేశాన్ని సైన్యం పరిపాలించాలి.
జవాబు:
సైన్యం పరిపాలిస్తే బాగుంటుంది కానీ ప్రజల సమస్యలు సైన్యానికి అంతగా తెలియవు. తెలిసిన వాటిని చేయాలి అనే దృఢ సంకల్పం సైన్యానికి ఉండకపోవచ్చు. కారణం. సైన్యం అనేది ఉద్యోగస్వామ్యం మాత్రమే. ప్రజాసమస్యలు ప్రజాస్వామ్యంలోనే చక్కగా పరిష్కరింపబడతాయి. కానీ నాయకులలో అవినీతి, బంధుప్రీతి, లంచగొండితనం వంటి అంశాలు లేకపోతే ప్రజాస్వామ్యంలో దేశం త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలనుండి వస్తారు కాబట్టి ప్రజాసమస్యలు బాగా పరిష్కరింపబడతాయి.

ఆ. అధిక సంఖ్యాకుల పాలన అంటే ఏమీ తెలియని ప్రజల పాలన. తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనకు కావలసింది విజ్ఞుల పాలన.
జవాబు:
అధిక సంఖ్యాకుల పాలన ఆంటే ప్రజలందరి పాలన. అనగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రజలందరు ప్రభుత్వ కార్యకలాపాలలో భాగస్వాములు కావడం.

తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనకి కావలసింది విజ్ఞుల పాలన. అనగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రజలు విజ్ఞులైన నాయకులను ఎన్నుకొని వారి ద్వారా పరిపాలింపబడడం. ఇలాంటి విధానం వలన సమయం ధనం ఆదా కావడానికి అవకాశం ఉంటుంది.

ఇ. ఆధ్యాత్మిక విషయాలలో మతగురువుల మార్గదర్శనం కోరుకున్నప్పుడు రాజకీయాల్లో కూడా మార్గదర్శనం చేయమని ఎందుకు అడగకూడదు? దేశాన్ని మతగురువులు పరిపాలించాలి.
జవాబు:
ఆధ్యాత్మిక విషయాలలో మత గురువులు. కానీ వారు రాజనీతిలో కాని రాజకీయాలలోకాని, సంక్షేమ పథకాల రూపకల్పనలో, కాని, వాటిని అమలు చేయడంలో కాని మత గురువులకు అవగాహన ఉండవలసిన అవసరం ఉండదు. కాబట్టి దాని పట్ల వారికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. పైగా మత గురువులు మతపరమైన విషయాలపట్ల చూపించిన ప్రతిభ రాజకీయ, ప్రజాపాలన విషయాలలో చూపించకపోవచ్చును, మతం అనేది మత్తుమందు లాంటిది. రాజకీయాలు ఆ విధమైనవి కావు.

ప్రశ్న 9.
ప్రపంచ పటంలో ఈ క్రింది దేశాలను గుర్తించండి. (AS5)
అ) శ్రీలంక
ఆ) బెల్జియం
ఇ) రష్యా
ఈ) అమెరికా (యు.ఎస్.ఎ)
AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన 1

ప్రశ్న 10.
‘పౌరుల గౌరవం, స్వేచ్ఛ’ అనే శీర్షిక కింద గల మొదటి రెండు పేరాలు చదివి దిగువ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి :
ప్రజాస్వామిక దేశంలో పౌరుల గౌరవం, స్వేచ్ఛ గురించి మీ సొంతమాటల్లో రాయండి. (AS2)
జవాబు:
వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడటంలో వివిధ రకాల ప్రభుత్వాలలో ప్రజాస్వామ్యం మెరుగైనది.

ప్రతి వ్యక్తికీ తోటి మానవుల నుంచి గౌరవం పొందాలని ఉంటుంది.

తనకు తగినంత మర్యాద ఇవ్వటం లేదని భావించినందువల్లనే తరచు వ్యక్తుల మధ్య ఘర్షణలు తలెత్తుతుంటాయి. • గౌరవం, స్వేచ్ఛల పట్ల నిబద్దతే ప్రజాస్వామ్యానికి పునాది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయాన్ని కనీసం సూత్రబద్దంగానైనా ప్రజాస్వామిక దేశాలు గుర్తించాయి.

దీనిని వివిధ ప్రజాస్వామ్యాలలో వివిధ స్థాయిలలో సాధించారు. ఆధిపత్యం, పరాధీనత ఆధారంగా తరతరాలుగా నడిచిన సమాజాలలో అందరూ సమానం అని అంగీకరించటం అంత తేలికైన విషయం కాదు.

ప్రశ్న 11.
ప్రజలు ప్రజాస్వామ్యం కొరకు పోరాడడానికి గల కారణాలను తెల్పండి.
జవాబు:
తరతరాలుగా రాచరిక, నియంతృత్వ పరిపాలనపై ప్రజల గౌరవానికి, స్వేచ్ఛకు విలువ లేకుండా, ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన కొనసాగించడంపై ప్రజలు ఎదిరించారు. పౌరుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు, బాధ్యత లేని పరిపాలన కొనసాగినప్పుడు ప్రజలు, రాచరిక పునాదులపై నడిచే ప్రభుత్వాలను, సైనిక పాలనలను సైతం ప్రజలు తిరస్కరించారు. సమానత్వ సూత్రంపై నడిచే, ప్రజల సంక్షేమం, ఉపాధి మెరుగుపరిచే ప్రజాస్వామ్యంపై ప్రజలు ఇష్టత చూపించారు. కుల ఆధారిత అసమానతలు, అత్యాచారాలు, వ్యక్తికి చట్టపర నైతిక విలువలు లేని పాలనను కాదని ప్రజాస్వామ్యం కావాలన్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 12.
మన పాఠశాలల్లో ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందనడానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. (AS6)
జవాబు:
మన పాఠశాలల్లో ప్రజాస్వామ్యం జరుగుతుంది అనడానికి కొన్ని ఉదాహరణలు :

  1. మన పాఠశాలల్లో కులమతాలు, ధనిక, పేదాయని భేదం లేకుండా అందరికీ యూనిఫారమ్స్ ధారణ ద్వారా సమానత్వం లభిస్తుంది.
  2. అదేవిధంగా తరగతులు, ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా అందరికీ మధ్యాహ్న భోజనం అందించబడుతుంది.
  3. అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యతనిస్తూ ఆ రోజులలో సెలవును మంజూరు చేయడమే కాకుండా స్థానిక ప్రాంత పండుగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
  4. తరగతి నాయకుడి ఎన్నిక కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మెజార్టీ విద్యార్ధుల అభిప్రాయం మేరకు, ఎన్నిక ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది.
  5. పేదవారికి, వెనుకబడిన వారికి ఆర్థికంగా చేయూత నందించుటకుగాను స్కాలర్ షిప్స్, ఆర్థిక పథకాలు అందించడం జరుగుతుంది.

9th Class Social Studies 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన InText Questions and Answers

9th Class Social Textbook Page No.247

ప్రశ్న 1.
పరిపాలనలో భాగస్వాములు కావటం ప్రజలకు ఎందుకు ఇష్టం ఉండదు? సరైన అవగాహన లేకపోవటం వల్లనా, ఆసక్తి లేకనా, లేక తమ అభిప్రాయానికి విలువ ఉండదని భావించటం వల్లనా?
జవాబు:

  1. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు కేవలం ఎన్నికల్లో పాల్గొని, పాలకులను ఎన్నుకోవటం మాత్రమే కాదు.
  2. ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయటంలో, వాటిని అమలు చేయటంలో కూడా ప్రజలు భాగస్వాములు కావాలి.
  3. ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనేలా బహిరంగ చర్చలు జరిపిన తరువాత ,చట్టాలు, విధానాలు రూపొందించినప్పుడు ఇది సాధ్యమవుతుంది.
  4. స్వతంత్ర పౌర సంఘాలుగా ఏర్పడి చట్టాలు, విధానాలు సమర్థంగా అమలు అయ్యేలా చూడటంలో ప్రజలు భాగస్వాములు కావాలి.
  5. అనేక దేశాలలో ఎన్నికైనా ప్రభుత్వాలు కూడా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవు. పైగా దానిని అడ్డుకుంటాయి.
  6. ప్రజలు కూడా దేశ వ్యవహారాలలో అంత ఆసక్తి చూపకుండా ఉదాసీనంగా ఉండిపోతారు.
  7. కారణం ప్రజలందరికి పరిపాలన పట్ల అవగాహన లేకపోవడం, ఆసక్తి చూపకపోవడం.
  8. ఒకవేళ ఆసక్తి చూపినా పాలకులు వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకపోవడం.

9th Class Social Textbook Page No.248

ప్రశ్న 2.
ప్రపంచంలో అనేక ప్రభుత్వాలు ప్రజలకు పౌరహక్కులను ఇచ్చాయి. అయితే ప్రజల ఫోనులను టాపింగ్ చేయటం, వాళ్ళ ఉత్తరాలు చదవటం, వాళ్ళ కార్యకలాపాలపై నిఘా ఉంచటం వంటి చర్యలు చేపడతాయి. ఇది సరైనదేనా?
జవాబు:

  1. ప్రజాస్వామ్యానికి పౌరహక్కులు ఉండాలి.
  2. తెలుసుకోటానికి, చర్చించటానికి, స్వతంత్ర అభిప్రాయాలు ఏర్పరచుకోటానికి, వాటిని వ్యక్తపరచటానికి సంఘాలుగా ఏర్పడి తమ భావాల అమలుకు పోరాడటానికి పౌరులకు స్వేచ్ఛ ఉన్నప్పుడే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటంలో భాగస్వాములు అవుతారు.
  3. అంతేకాని ప్రజల ఫోనులను టాపింగ్ చేయటం, వాళ్ళ ఉత్తరాలు చదవటం, వాళ్ల కార్యకలాపాలపై నిఘా ఉంచడం వంటి చర్యల వల్ల వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను హరించివేయడమే అవుతుంది.
  4. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైనదికాదు.

AP Board 9th Class Social Solutions Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

ప్రశ్న 3.
ప్రజాస్వామికంగా, ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అనేక దేశాలలో తీవ్రస్థాయిలో అసమానతలు ఎందుకు కొనసాగుతున్నాయి?
జవాబు:

  1. అనేక దేశాల ప్రభుత్వాలు ధనికులకు అనుకూలంగా, పేదల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే విధానాలను అనుసరిస్తూ ఉంటాయి.
  2. ప్రజాస్వామికంగా ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అనేక దేశాలలో తీవ్ర స్థాయిలో అసమానతలు ఉండటానికి కారణాలు.
    అ) తరతరాలుగా వస్తున్న వారసత్వపు సంపద.
    ఆ) ఉన్నత వర్గాలకు చెందినవారు మంచి విద్య, ఉద్యోగావకాశాలు పొందడం.
    ఇ) సంపద మరికొంత సంపదను సముపార్జించి పెట్టడం.
    ఈ) ఉన్న వర్గాలకు చెందినవారు పారిశ్రామిక, వాణిజ్య వర్గాలపై ఆధిపత్యం చెలాయించడం.
    ఉ) ఆలోచనా విధానాలలోనూ మార్పులు రావడం.

9th Class Social Textbook Page No.250

ప్రశ్న 4.
మన దేశంలోని ఎన్నికలను ఉదాహరణగా తీసుకుందాం. ఒక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళలో 1000 మందికి ఓటు హక్కు ఉందని అనుకుందాం. సాధారణంగా ఎన్నికల్లో 60 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటారు. అంటే ఎన్నికల్లో 600 మంది ఓటు వేస్తారు. ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అనుకుందాం. గెలిచిన అభ్యర్థికి 250 ఓట్లు, రెండవ అభ్యర్థికి 200 ఓట్లు, మిగిలిన 8 మందికి కలిపి 150 ఓట్లు పడ్డాయని అనుకుందాం. 250 . ఓట్లు వచ్చిన వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల ప్రయోజనాలకు, దృక్పథాలకు గెలిచిన అభ్యర్థి ఏ మేరకు ప్రాతినిధ్యం వహిస్తారు? గెలిచిన అభ్యర్థికి ఓటర్లలో 25 శాతం మద్దతు మాత్రమే ఉంది. ఇది న్యాయమైన ప్రజాస్వామిక ఏర్పాటేనా? నిర్ణయాలు తీసుకునే సంస్థలకు ప్రజల ప్రతినిధులను ఎన్నుకోటానికి మరో విధానం ఏమైనా ఉందా?
జవాబు:
మన దేశంలోని ఎన్నికలను ఉదాహరణగా తీసుకుందాం. ఒక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళలో 1000కి ఓటుహక్కు ఉందని అనుకుందాం. సాధారణంగా ఎన్నికల్లో 60 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటుహక్కుని ఉపయోగించుకుంటారు. అనగా ఎన్నికల్లో 600 మంది ఓటు వేస్తారు. అయితే ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారని అనుకుందాం. గెలిచిన అభ్యర్థికి 250 ఓట్లు, రెండవ అభ్యర్థికి 200 ఓట్లు, మిగిలిన 8 మందికి కలిపి 150 ఓట్లు పడ్డాయని అనుకుందాం. కానీ 250 ఓట్లు వచ్చిన వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తారు. అయితే అతను ఆ 250 మందికి మాత్రమే ప్రతినిధిగా కాకుండా ప్రజలందరికి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.

ప్రజలందరికి అభిప్రాయాలను తెలుసుకుంటాడు. ప్రజలందరికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రజలందరికి సంక్షేమ పథకాలను వర్తింపచేస్తాడు. ప్రజలందరికి అవసరాలు తీర్చటానికి కృషి చేస్తాడు. అందువల్ల ఇది న్యాయమైన ప్రజాస్వామిక వ్యవస్థగానే కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకునే సంస్థలకు ప్రజల ప్రతినిధులను ఎన్నుకోటానికి మరో విధానం.

  1. ప్రజలకు ఓటు చేసే హక్కుతో పాటు తిరస్కరించే అధికారం కూడా ఇవ్వాలి.
  2. ఎక్కువమంది ప్రజలు తిరస్కరించిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించరాదు.
  3. అనుకూలమైన ఓట్లతో పాటు వ్యతిరేకమైన ఓట్లను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.

9th Class Social Textbook Page No.254

ప్రశ్న 5.
సామాజిక, మత, భాషాపర వైవిధ్యతలను కలుపుకుని వెళ్ళటానికి ఈ రెండు (బెల్జియం, శ్రీలంక) దేశాలు అనుసరించిన మార్గాలను చర్చించండి.
జవాబు:
బెల్జియం, శ్రీలంకలు రెండు ప్రజాస్వామిక దేశాలే అయినప్పటికీ రెండు దేశాలు అధికారాన్ని పంచుకోవటంలో భిన్నమైన మార్గాలు అవలంబించాయి.

1) బెల్జియం :
వివిధ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు, భావనలను మన్నించినపుడే దేశం ఐక్యంగా ఉంటుందని బెల్జియం నాయకులు గుర్తించారు. ఈ అవగాహన కారణంగా అధికారాన్ని పంచుకోటానికి అందరికీ ఆమోదయోగ్యమైన ఏర్పాట్లు చేసుకున్నారు.

2) శ్రీలంక :
అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు అధికారాన్ని పంచుకోటానికి ఇష్టపడక తమ ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నించినపుడు దేశ సమైక్యత దెబ్బ తింటుందని, అంతర్యుద్ధాలు, పౌర యుద్ధాల కారణంగా దేశం వందల సంవత్సరాలు వెనుకబడుతుందని శ్రీలంక నిరూపించింది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ ఉపాధ్యాయుని సహాయంతో తరగతి ప్రతినిధిని ఎన్నుకోటానికి తరగతిలో ఎన్నికలు నిర్వహించండి.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం

9th Class Social Studies 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బ్రిటిష్ పాలనకు ముందు ప్రజలు అడవులను ఎలా ఉపయోగించుకున్నారు ? ఆ రోజుల్లో అడవులు, పూర్తిగా నాశనమయ్యే అవకాశం అంత ఎక్కువగా ఎందుకు లేదు? (AS1)
జవాబు:
అనాదిగా అడవులలో నివసిస్తున్న ప్రజలు, ఆదివాసీలు తమ రోజువారీ జీవితాలకు కావలసిన అనేక వస్తువులను అడవుల నుండి పొందేవాళ్ళు. ఒక విధంగా అడవుల యజమానులు వాళ్ళే. వేటాడడానికి దుంపలు, పళ్ళు, పూలు, మూలికలు సేకరించటానికి, పశువులను మేపుకోవడానికి అడవులను ఉపయోగించుకునే వాళ్ళు. లాభాల కోసం అడవిలో లభించే కలప, ఇతర వస్తువులను అమ్మే వాళ్ళుకాదు.

వ్యవసాయ భూముల కోసం అడవులను నరికినప్పటికీ రైతులు, ఆదివాసీల మధ్య ఘర్షణలు ఉన్నప్పటికీ అడవి కింద విస్తార భూభాగాలు ఉండేవి. అడవులను ఉపయోగించుకున్నప్పటికీ ప్రజలు వాటిని రక్షించే వాళ్ళు. కలపకు పెద్ద చెట్లు నరికి, కొత్త చెట్లను పెరగనిచ్చేవాళ్ళు. విచ్చలవిడిగా విశాల పరిధిలో అడవులను వాళ్ళు నరికెయ్యలేదు. అందువల్ల అడవులు పూర్తిగా నాశమయ్యే అవకాశం అంత ఎక్కువగా లేదు.

ప్రశ్న 2.
ఆదివాసీలు ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? తమ కోపాన్ని, నిరసననీ వాళ్ళు ఎలా వ్యక్తం చేశారు? కొన్ని – ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ పరిపాలనకు ముందు ఆదివాసీలు అడవిలో లభించే అనేక ఫలసాయాన్ని, అటవీ ఉత్పత్తులను అమ్ముకొని, జీవించేవాళ్ళు. లాభాల కోసం అడవిలో లభించే కలప, ఇతర వస్తువులను అమ్మేవాళ్ళు కాదు. కానీ బ్రిటిష్ వారి పాలనలో ఆదివాసీల జీవితాలు దుర్భరమైనాయి. వారి జీవన పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. మధ్యప్రదేశ్, తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి విదేశస్థులపై ఆధారపడవలసి వచ్చేది. స్వాతంత్ర్యం తరువాత . కూడా విద్యకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల అంతగా చదువుకోని కార్మికశక్తి పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా కొనసాగింది.

ఛత్తీస్ గఢ్ కు చెందిన బైగా, మురియా, గోండ్, భిల్ జాతులు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన కోయ, రెడ్డి, కోలం జాతులు, ఒడిశాలోని సవర ఆదివాసీలు అటవీశాఖ లేదా గుత్తేదారుల వద్ద కూలీలుగా పనిచేయవలసి వచ్చేది. వడ్డీ వ్యాపారస్తుల వద, రైతుల పొలాల్లో వెట్టి కార్మికులుగా మారేవాళ్ళు, బయట నుండి వచ్చిన ప్రజలు ఆదివాసీల భూములను ఆక్రమించుకుని, హింసలకు గురి చేశారు. అటవీశాఖ అధికారులు జరిమానాలు విధించడం, చిన్న చిన్న కారణాలకు ప్రజలను కొట్టడం, బలవంతంగా ఇళ్ళలో చొరబడి వస్తువులను లాక్కోవడం, ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లంచాలు తీసుకోవడం వంటి విషయాలు సాధారణమైపోయాయి.

ఇటువంటి ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఆదివాసీలు అనేక ప్రాంతాలలో ప్రతిఘటించసాగారు. ఈ ప్రతిఘటనలలో పోలీసు స్టేషన్లు, అటవీశాఖ కేంద్రాలు, వడ్డీ వ్యాపారస్తుల ఇళ్ళు వంటివి తగలబెట్టేవాళ్ళు. అనేకసార్లు అడవిని తగలబెట్టేవాళ్ళు.
ఉదా : 1856 జార్ఖండ్ సంతాల్ తిరుగుబాట్లు.
1922 ఆంధ్రప్రదేశ్ కోయ తిరుగుబాట్లు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 3.
అదివానీ తిరుగుబాటులను బ్రిటిష్ పాలకులు ఏ విధంగా అణచివేశారు?
జవాబు:
అడవి హక్కులు అనుభవించడానికి, స్వేచ్ఛా జీవితం గడపడానికి బయట వ్యక్తుల దోపిడీల నుండి రక్షణ పొందడానికి, వేధింపుల నుండి బయటపడడానికి, అడవిలో హాయిగా నివసించడానికి గాను ఆదివాసీలు తిరుగుబాట్లు చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేశారు. ప్రధానంగా జార్ఖండ్ కి చెందిన సంతాల్ ఆదివాసీలు బ్రిటిష్ పాలనను నిరసిస్తూ వ్యతిరేకించసాగారు. 1855-56లో సంతాలులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. జమిందారులను, వడ్డీ వ్యాపారస్తులను చంపి దోచుకోసాగారు. అయితే సంతాలుల వద్ద విల్లంబులు, బాణాలు తప్పించి వేరే ఆయుధాలు లేవు. తుపాకులున్న బ్రిటిష్ సైనికులను వాళ్ళు ఎక్కువ కాలం నిలువరించలేకపోయారు.

జార్బండ్ రాష్ట్రంలో ఉన్న చోటానాగపూర్ పీఠభూమిలోని ముండా ఆదివాసీలు 1874 – 1901 మధ్య ‘బిర్సా’ అనే యువకుడి నాయకత్వంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలనుకున్నారు. వడ్డీ వ్యాపారస్తులు, జమీందారులకు రక్షణ నిచ్చిన విదేశీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలనుకున్నారు. కానీ నాయకులను పట్టుకొని జైలుపాలు చేయటంతో చివరికి ముండా తిరుగుబాటును అణచివేయగలిగారు. 1900లో బిర్సాముండా జైలులో చనిపోయాడు.

ఆంధ్రప్రదేశ్ లో కోయ ఆదివాసీలు, బస్తర్, మరియా, మురియా ఆదివాసీలు, గోండ్, కోలం ఆదివాసీల తిరుగుబాట్లను ఉత్తరాఖండ్ లోని కుమావూ తిరుగుబాట్లను బ్రిటిష్ పాలకులు కుటిల కుతంత్రాలతో, ఆధునిక ఆయుధాలతో అణచివేశారు.

ప్రశ్న 4.
భారతదేశ వివిధ ప్రాంతాలలో ఆదివాసీల తిరుగుబాటులను తెలియజేసే కాల పట్టిక తయారుచేయండి. (AS3)
జవాబు:
భారతదేశ వివిధ ప్రాంతాలలో ఆదివాసీల తిరుగుబాటులను తెలియచేసే కాల పట్టిక :
1880 C : ఆంధ్రప్రదేశ్ లో కోయలు తిరుగుబాటు.
1866 – 56 : జార్ఖండ్ కి చెందిన సంతాల్ ఆదివాసీల తిరుగుబాట్లు.
1874 – 1901 : జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న చోటానాగపూర్ పీఠభూమిలోని ముండా ,ఆదివాసీల తిరుగుబాట్లు
1910 : మధ్యప్రదేశ్ లోని బస్తర్ లో మరియా, మురియా ఆదివాసీల తిరుగుబాట్లు.
1922 : ఆంధ్రప్రదేశ్ కోయ, కోలం ఆదివాసీల తిరుగుబాట్లు.
1940 : గోండ్, కోలం ఆదివాసీల తిరుగుబాట్లు.
1921 – 22 : ఉత్తరాఖండ్ లోని కుమావూ ప్రాంతంలోని ఆదివాసీల తిరుగుబాట్లు చేశారు.

ప్రశ్న 5.
బ్రిటిష్ ప్రభుత్వంతో భారతీయ పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సమస్యలు ఉండేవి?
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వంతో భారతీయ సారిశ్రామిక వేత్తలకు ఎదురయిన సమస్యలు :

  • రోడ్డు, రైలు మార్గాలు, విద్యుత్, బొగ్గు, ఇనుము వంటి అనేక వనరులు, సౌకర్యాలు భారతీయ పారిశ్రామిక వేత్తలకు కావాలి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ రంగాలపై తగినంత దృష్టి నిలపలేదు.
  • భారతీయ పారిశ్రామిక వేత్తలు తమకు కావలసిన యంత్రాలన్నింటినీ విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేది. యంత్రాలను తయారుచేసే పరిశ్రమలు భారతదేశంలో ఇంకా స్థాపించబడలేదు.
  • పరిశ్రమల అభివృద్ధికి శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల సహాయం కావాలి. చదువుకున్న కార్మికులు అన్ని స్థాయిలలో కావాలి. అయితే భారతదేశంలో చదువుకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. భారతీయ శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధికి విదేశస్థులపై ఆధారపడవలసి వచ్చేది. స్వాతంత్ర్యం తరువాత . కూడా విద్యకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల అంతగా చదువుకోని కార్మికశక్తి పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా కొనసాగింది.

ప్రశ్న 6.
బ్రిటిష్ పాలనలో పరిశ్రమలు నెలకొల్పటం భారతీయ కంపెనీల కంటే విదేశీ కంపెనీలకు ఎందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవి ? కొన్ని కారణాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ పాలనలో చాలా కార్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటివి భారతీయుల చేతుల్లో కాకుండా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అందువల్ల ఈ కంపెనీలకు ఎన్నో ప్రయోజనాలు సమకూరాయి. బ్రిటిష్ ప్రభుత్వంలోని వివిధ . స్థాయిల అధికారులు, ఉద్యోగస్తులు, బ్రిటిష్ వాళ్లకు అందుబాటులో ఉండేవాళ్ళు. ఆ సౌకర్యం భారతీయ కంపెనీలకు లేదు. విదేశీ వ్యాపారం అంతా యూరపు కంపెనీల చేతుల్లో ఉన్నందువల్ల వాళ్ళకు ఎటువంటి నిధుల కొరతాలేదు. భారతదేశంలో సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామికీకరణలో ప్రగతి సాధించే శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు విదేశీ కంపెనీలలో చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. తద్వారా భారతీయ కంపెనీల కంటే విదేశీ కంపెనీలకు ఎక్కువ అవకాశాలు ఉండేవి.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 7.
కార్మిక చట్టాలు ముందుగా పిల్లలకు, ఆ తర్వాత మహిళలకు, చివరకు పురుషులకు చేశారు. వీటిని ఈ క్రమంలో ఎందుకు చేశారు?
జవాబు:
మిల్లులలో మరియు యంత్రాలలో పని ప్రతిరోజూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్యాస్తమయం తరువాతే ముగిసేది. కార్మాగారపు వేడి, తేమ, మోత, ధూళితో రోజంతా గడిచేది. అనారోగ్యాలు, జబ్బులు, అంటువ్యాధులతో రోజూ వేసవిలో 14 గంటలు, శీతాకాలంలో 12 గంటలు పనిచేయవలసి వచ్చేది.

పై దుర్భర కష్టాలన్నీ పిల్లలు, స్త్రీలు కూడా అనుభవించారు. 1-12 సం||ల వయసుగల బాలలు భయంకరమైన పనులు చేసేవారు. బాల్యమంతా మిల్లులలో కరిగిపోయేది. పూవులాంటి పసి పిల్లల కన్నీళ్ళు తుడవాలని, బాల్య మాధుర్యాన్ని పిల్లలకు అందించాలని తలంచి పనిభారం నుండి ముందుగా విముక్తులను చేయడానికి పిల్లలకు చట్టాలు కల్పించారు.

అదే విధంగా మహిళలు కూడా, ఇంటి పని, వంట పని, కుటుంబ భారమంతా మోస్తూ మరల కర్మాగారాలలో 14 నుండి 18 గంటలు పురుషులతో పాటు పనిచేయడం అందులో గర్భిణులుగా, బాలింతలుగా ఉండటం వల్ల మహిళలు నరకయాతన అనుభవించే వాళ్ళు. దీనిని దృష్టిలో పెట్టుకుని మిల్లులలో పిల్లలు, మహిళలకే ఎక్కువగా దుర్భర పరిస్థితులు ఉన్నందున ముందుగా వాళ్ళకి విముక్తి చట్టాలు రూపొందించారు.

ప్రశ్న 8.
పారిశ్రామిక అభివృద్ధిని విద్య ఎలా ప్రభావితం చేస్తుంది ? తరగతిలో చర్చించండి. (AS6)
జవాబు:
చాలా దేశాలలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి, సాంకేతిక విజ్ఞానంతో పయనించి, ప్రపంచ పోటీలో నిలదొక్కుకో సుకానికి ఆయా దేశాలు ముందుగా విద్యకు ప్రాధాన్యత నిచ్చాయి. ముఖ్యంగా, ఇంగ్లాడ్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు పారిశ్రామిక అభివృద్ధికి, విద్యకు పెద్దపీట వేశాయి.

చదువుకున్న కార్మికులు అన్ని స్థాయిలలో ఉండాలి. అప్పుడే పారిశ్రామిక అభివృద్ధి సాగుతుంది. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, విషయ నిపుణతగల సాంకేతిక నిపుణులు కావాలి. వీరంతా మేధావంతులుగా మారి పరిశ్రమలు వేగవంతం కావడంలో విద్య ప్రధాన భూమిక పోషిస్తుంది. వివేచనా జ్ఞానం, అద్భుత తెలివితేటలతో పరిశ్రమలను వివిధ స్థాయిలలో అభివృద్ధి చేసి, పోటీని తట్టుకోగలగాలి. కాబట్టి పారిశ్రామిక అభివృద్ధిని విద్య ముఖ్య భూమిక పోషిస్తుంది.

ప్రశ్న 9.
20వ శతాబ్దంలోని ప్రధాన పారిశ్రామిక పట్టణాలను భారతదేశ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
నా శ్రామిక పట్టణాలు :

  1. ముంబై
  2. అహ్మదాబాద్
  3. జంషెడ్ పూర్
  4. చెన్నై (మద్రాస్)
  5. సూరత్
  6. హైదరాబాద్
  7. పూనె
  8. విశాఖపట్నం
  9. కోల్ కతా
  10. కాన్పూర్
  11. నాగపూర్
  12. ఇండోర్
  13. సేలం

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 1

ప్రశ్న 10.
ఆదివాసీల తిరుగుబాట్లు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకొని ఆ ప్రదేశాలను భారతదేశ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
ఆదివాసీల తిరుగుబాట్లు జరిగిన ప్రదేశాలు పటంలో చూడండి.

  1. జార్ఖండ్
  2. చోటానాగపూర్ పీఠభూమి
  3. ఉత్తరాఖండ్
  4. చింతపల్లి
  5. ఆదిలాబాద్

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 2

ప్రశ్న 11.
పేజీ నెం. 221లోని “ఆదివాసీ తిరుగుబాట్లు” అంశాన్ని చదివి, వాఖ్యానించండి. (AS2)
జవాబు:
అనాదిగా అడవులను ఆధారం చేసుకొని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీలు జీవనం సాగించేవాళ్లు. మధ్యప్రదేశ్, చత్తీ కి చెందిన బైగా, మురియా, గోండ్, బిల్ జాతులు, ఆంధ్రప్రదేశ్ కి చెందిన కోయ, రెడ్డి, కోలం జాతులు, ఒడిశాలోని సవర జాతులు అటవీశాఖాదికారులు, గుత్తేదారుల వద్ద, లేదా వడ్డీ వ్యాపారస్తుల వద్ద వెట్టిచాకిరీ కార్మికులుగా శ్రమను చిందించేవారు. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల నుండి మైదాన ప్రాంతం నుండి వచ్చిన ప్రజలు, గిరిజనుల భూములను చేజిక్కించుకుని, గిరిజనులను అణగదొక్కారు. అదేవిధంగా అటవీశాఖాధికారులు కూడా గిరిజనులను ఇబ్బందులకు గురిచేసి జరిమానాలు విధించి, చిన్న కారణాలకు సైతం ప్రజలను కొట్టడం, బలవంతంగా ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను లాక్కోని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం నిత్యసత్యమైపోయాయి.

ఇటువంటి ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఆదివాసీలు అనేక ప్రాంతాలలో ప్రతిఘటించసాగారు. దీనికిగాను వారు విప్లవ పంథాను ఎంచుకుని, పోలీస్ స్టేషన్లు, అటవీశాఖ కేంద్రాలు, వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లు వంటిని తగలబెట్టేవారు. కొన్ని సందర్భాలలో అడవిని తగలబెట్టేవాళ్లు. ఈ తిరుగుబాట్లు 1856లో జార్ఖండ్ సంతాల్ ఆదివాసీలు, 1880, 1922 ఆంధ్రప్రదేశ్ కోయ ఆదివాసీలు, 1940లలో గోండ్, కోలం ఆదివాసీలు చేశారు.

9th Class Social Studies 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం InText Questions and Answers

9th Class Social Textbook Page No.220

ప్రశ్న 1.
బ్రిటిష్ పాలనకు ముందు ఆదివాసుల జీవనవిధానం, అడవులను వాళ్ళు ఉపయోగించుకున్న విధానాలను తెలియజేసే నాలుగు వాక్యాలను గుర్తించండి.
జవాబు:
అడవులలో ఆనందంగా జీవించే ఆదివాసీలే అడవులకు యజమానులు. తమ రోజూవారీ జీవనానికి కావలసిన అనేక ఉత్పత్తులు హాయిగా అడవుల నుండి పొందేవాళ్ళు. వేటాడుతూ, తమ ఆహారానికి అవసరమైన దుంపలు, పళ్ళు’ ఆరగిస్తూ, పూలు, వనమూలికలు సేకరిస్తూ, పశువులను మేపుకుంటూ అడవులను ఉపయోగించుకునే వాళ్ళు.

9th Class Social Textbook Page No.221

ప్రశ్న 2.
రైల్వే పట్టాలలో ఒకప్పుడు ఉపయోగించిన కలప స్లీపర్లను మీరు చూశారా? వీటికి బదులుగా ప్రస్తుతం ఏమి వాడుతున్నారు? ఈ మార్పు ఎందుకు చేయవలసి వచ్చింది? చర్చించండి.
జవాబు:
భారతదేశం బ్రిటిష్ పరిపాలనకు ముందు అడవులతో పచ్చని చెట్లతో వికసించేది. పరిశ్రమల అభివృద్ధి పేరుతో ఓడలు, గనుల నిర్మాణాలకు కలప కోసం అడవులలో లభించే చెట్లను నరికేవారు. రైలు మార్గాలు అభివృద్ధి చెందిన తరువాత, ప్రతి సంవత్సరం కొత్త రైలు మార్గాలు వేయటానికి ఒక కోటికి పైగా కలప స్లీపర్లు అవసరమయ్యేవి. తద్వారా అడవులు రానురాను అంతరించడమే కాకుండా అడవులు కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తుండటంతో ప్రస్తుతం కలప స్లీపర్లకు బదులు ఇనుప స్లీపర్లను వాడుతూ, పర్యావరణాన్ని, ప్రకృతిని, అడవులను కాపాడుతున్నారు.

9th Class Social Textbook Page No.225

ప్రశ్న 3.
‘రక్షిత మార్కెటు’ అంటే ఏమిటో చర్చించండి.
జవాబు:
ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్న వస్తువులపై లేదా బట్టలపై పన్నులను విధించినట్లయితే విదేశీ వస్తు ధరలు పెరుగుతాయి. మన దేశంలో వస్తువులపై పన్ను విధించకుండా తక్కువ ఖరీదుకు వస్తువులను అమ్మినట్లయితే భారతదేశ వస్తువులకు విలువ, ప్రాధాన్యత, పనితనం కనిపించి వస్తువులు అమ్మటానికి అనువైన వాతావరణం కనిపిస్తుంది. దీనినే రక్షిత మార్కెట్ అంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 4.
భారతదేశానికి వస్తున్న బ్రిటిష్ సరుకులపై పన్నులు విధించాలని భారతీయులు కోరసాగారు. ఇది న్యాయమైన కోరికేనా? భారతీయ, బ్రిటిష్ పరిశ్రమలతో ప్రభుత్వం సమానంగానే వ్యవహరించాలా?
జవాబు:
భారతదేశానికి వస్తున్న బ్రిటిష్ సరుకులపై పన్నులు విధించాలని భారతీయులు కోరడం న్యాయమైన కోరికే. ఎందుకంటే మన దేశంలో ముడి పదార్థాలను అతి చౌకగా కొని, వాటిని వారి దేశంలో వస్తువులుగా మార్చి , అధిక ధరలకు మన దేశ మార్కెట్లో అమ్మి మన సంపదనంతా వస్తు రూపంలో దోచుకుంటున్నారు. అదే విధంగా వారు తయారుచేసిన వస్తువులలో సాంకేతిక విజ్ఞానం, పనితనం కనిపించడం వలన ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించగలుగుతున్నాయి. పన్నులు విధించడం వల్ల బ్రిటిష్ వస్తు ఖరీదు పెరగడమే కాకుండా మన దేశ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. కాబట్టి దోపిడీ పాలన గల బ్రిటిష్ పరిశ్రమల విషయంలో ప్రభుత్వం సమానంగా వ్యవహరించవలసిన అవసరం లేదు.

9th Class Social Textbook Page No.226

ప్రశ్న 5.
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారత పరిశ్రమలు ఎందుకు వేగంగా వృద్ధి చెందాయి?
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో (1914-18) భారతదేశంలోని విదేశీ వస్తువుల దిగుమతి గణనీయంగా పడిపోయింది. సరుకు రవాణా ఓడలను యుద్ధ సంబంధ పనులకు మళ్ళించడం వల్ల ఓడల కొరత ఏర్పడడం ఒక కారణం. అంతేకాకుండా యూరప్ కర్మాగారాలలో యుద్దానికి కావలసిన వస్తువులను ఉత్పత్తి చేయసాగారు. దాంతో భారతదేశ మార్కెటు కోసం ఉత్పత్తి చేసే వస్తువులు తగ్గిపోయాయి.

ఈ పరిస్థితులలో భారతదేశంలో ఏర్పాటు చేసిన కర్మాగారాలు తమ ఉత్పత్తిని, అమ్మకాలను పెంచుకున్నాయి. ఈ అమ్మకాలతో ప్రేరణ పొంది పరిశ్రమలు వేగంగా వృద్ధి చెందాయి.

9th Class Social Textbook Page No.227

ప్రశ్న 6.
బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఏ పరిశ్రమలు స్థాపించారు?
జవాబు:
బ్రిటిష్ పాలనలో భారతదేశంలో నూలు, వస్త్ర పరిశ్రమ. జెంషెటాటా ఆధ్వర్యంలో జంషెడ్ పూర్ వద్ద ఉక్కు కర్మాగారం స్థాపించారు.

ప్రశ్న 7.
స్వాతంత్ర్య సమయంలో భారత పరిశ్రమల అభివృద్ధికి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్య సమయంలో చాలా కర్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటివి భారతీయుల చేతులలో లేవు. ఇవి చాలా ఎక్కువగా బ్రిటిష్ వారి అధీనంలో ఉండేవి. పరిశ్రమల అభివృద్ధికి కావలసిన అధికారాలు, ఉద్యోగస్తులు బ్రిటిష్ వాళ్ళకు అందుబాటులో ఉండేవాళ్ళు. ఇటువంటి మేధావులైన కార్మికులు మన దేశ పరిశ్రమలలో పనిచేసేవారు కాదు. పరిశ్రమల అభివృద్ధికి కావలసిన నిధులు కూడా మన పరిశ్రమలకు కొరతగా ఉండేవి. శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కూడా తగినంత మంది లేకపోవడం కూడా మన పరిశ్రమలు సమస్యలు ఎదుర్కోవడానికి కారణమైంది.

9th Class Social Textbook Page No.229

ప్రశ్న 8.
భారతదేశంలో తొలినాటి కర్మాగారాలలో కార్మికుల పని, విశ్రాంతికి సంబంధించిన నియమాలు ఏమిటి?
జవాబు:
మిల్లులలో పనిచేసే కార్మికుల పని ప్రతిరోజూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్యాస్తమయం తరువాతే ముగిసేది. తెల్లవారకముందే నిద్రలేచి మిల్లులకు బారులు తీరిన కార్మికులు పని మొదలు పెడితే ఆపడమనేదే లేదు.

విశ్రాంతి చాలా తక్కువగా ఉండేది. 15 -20 నిమిషాలు భోజనానికి విశ్రాంతి ఉండేది. సూర్యుడు అస్తమించిన తరువాత చీకటిలో చూడటం అసాధ్యమైనప్పుడు మాత్రమే యంత్రాలతో ఆ రోజుకి పని ఆగేది. వారానికి ఒక రోజు సెలవులేదు. ముఖ్యమైన పండుగలకు మాత్రమే సెలవు ఇచ్చేవారు. మిగతా సమయంతా పనిలోనే కార్మికులు నిమగ్నమయ్యేవాళ్ళు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 9.
వేతనాల చెల్లింపునకు సంబంధించిన నియమాలు ఏమిటి?
జవాబు:
కార్మికులు ఉత్పత్తి చేసిన సరుకులను బట్టి కూలీ చెల్లించే వాళ్ళు. “ఎంత ఉత్పత్తి చేస్తే అంత కూలీ” అన్న నియమాన్ని యజమానులు అమలు చేశారు. ఒక్కొక్క సారి యంత్రాలు పనిచేయకపోయినా చెల్లింపులు ఉండవని చెప్పేవారు. నెల అయిన తరువాత కార్మికులకు మిల్లు యజమాని మొత్తం కూలీ చెల్లించేవాడు కాదు. మళ్ళీ నెల వరకు కొంత డబ్బు తన వద్దే అట్టే పెట్టుకొనే వాళ్ళు. ఇటువంటి పరిస్థితులలో ఎవరైనా కార్మికులు పనిమానేసి వెళ్లిపోవటం సాధ్యం అయ్యేది కాదు.

ప్రశ్న 10.
ఏ కారణాల వల్ల కార్మికుల వేతనాలను తగ్గించేవాళ్ళు?
జవాబు:
కార్మికులకు జరిమానాలు విధించేవాళ్ళు. ప్రతీ చిన్న విషయానికి, పనికి ఆలస్యంగా వచ్చారని, బట్ట పాడైపోయిందని, కార్మికులు చిత్తశుద్ధితో పనిచేయలేదని యజమానికి అనిపించినా జరిమానాలు విధించి, కార్మికులకు నెలలో రావలసిన వేతనం నుంచి మినహాయించే వాళ్ళు.

9th Class Social Textbook Page No.230

ప్రశ్న 11.
కార్మికులు సమ్మె ఎందుకు చేసేవాళ్ళు?
జవాబు:
కార్మికుల దుర్భర పరిస్థితుల నుండి తమ హక్కుల సాధన కొరకు సమ్మె చేసేవారు.

  • కొన్ని సందర్భాలలో తమ వేతనాలు తగ్గించినందుకు నిరసనగా, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేశారు.
  • అంతేకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా, తమ జీవన విధానం కొరకు వేతనాలను పెంచమని సమ్మె చేశారు.
  • మరి ముఖ్యంగా కార్మికులు వేతనాలు, హక్కుల కోసమే కాకుండా బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలన నుండి విముక్తి కొరకు సమ్మెల ద్వారా కార్మికులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.

ప్రశ్న 12.
ఇతర చర్యలకు బదులు సమ్మెనే ఆయుధంగా ఎందుకు ఉపయోగించే వాళ్ళు?
జవాబు:
ఈ సమ్మె చేయడం ద్వారా పరిశ్రమలు మూతబడతాయి.

  • ఉత్పత్తి నిలిచిపోతుంది. ఈ పరిశ్రమలకు, కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది.
  • కంపెనీ ఉత్పత్తులపై సమాజంలో చెడు ప్రభావం పడుతుంది.
  • నిరంకుశ నిర్ణయాలు గల యజమానుల నుండి మార్పు కొరకు సమ్మెనే ఎంచుకుంటారు.

సమ్మె ద్వారా వచ్చే నష్టం కంటే వారి కోరికలు తీర్చడమే ప్రధానమని యజమానులు భావించి, కార్మికుల కోర్కెలు తీరుస్తారు. నిరసనలు, ఉపన్యాసాలు, ఊరేగింపుల ద్వారా కంపెనీ యజమానులలో మార్పురాదు. కాబట్టి బలమైన ఆయుధం సమ్మెనే కార్మికులు ఎంచుకుంటారు.

9th Class Social Textbook Page No.231

ప్రశ్న 13.
మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? కాల పట్టికలో దానిని గుర్తించండి. మీ తల్లిదండ్రులు, తాత, అవ్వలు, వీలైతే కొంతమంది వృద్ధ బంధువులు పుట్టిన సంవత్సరాలను కూడా గుర్తించండి.
జవాబు:
నేను 1999లో జన్మించాను. మా నాన్నగారు 1963లో జన్మించారు. మా అమ్మగారు 1965లో జన్మించారు. మా తాతగారు 1943లో, మా అవ్వ 1939లో జన్మించారు.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 14.
వాళ్ళలో ఎవరైనా ఏదైనా కార్మిక చట్టాల వల్ల ప్రయోజనం పొందారేమో కనుక్కోండి.
జవాబు:
మా తాతగారు షుగర్ ఫ్యాక్టరీ (పంచదార పరిశ్రమ) లో పనిచేసేవారు. ఈ కార్మిక చట్టాల వలన పనిగంటలు తగ్గాయని, చాలా విషయాలలో కంపెనీ యజమానులు ప్రయోజనం కల్పించారని, వైద్య సదుపాయాలు మరియు విశ్రాంతికి తగిన అవకాశాలు కల్పించారని చెప్పారు.

ప్రశ్న 15.
మొదట్లో కార్మికుల సంక్షేమంపై భారతదేశంలోని విద్యావంతులు ఎందుకు అంతగా దృష్టి పెట్టలేదు?
జవాబు:

  • కార్మికులకు స్థిర ఆదాయాలు, సెలవు వంటి సౌకర్యాలు కల్పిస్తే మిల్లు ఉత్పత్తి తగ్గిపోతుందని,
  • యజమానుల ఖర్చులు పెరిగిపోతాయని,
  • దీనివల్ల కార్మాగారాలలో ఉత్పత్తి చేసే వస్తువుల ఖర్చు పెరిగిపోతుందని,

ఇదే జరిగితే బ్రిటన్ నుంచి వచ్చే వస్తువులు తేలికగా అమ్ముడయ్యి, భారతదేశంలో పరిశ్రమల ప్రగతి కుంటుపడుతుందని కార్మికుల సంక్షేమంపై అంతగా దృష్టి పెట్టలేదు.

ప్రశ్న 16.
కార్మిక చట్టాలు పారిశ్రామికవేత్తలను ఏ విధంగా ప్రభావితం చేసి ఉంటాయి?
జవాబు:
కార్మిక చట్టాలు పారిశ్రామికవేత్తలను భయందోళనకు గురిచేశాయి. కార్మిక చట్టాల వల్ల పని గంటలు తగ్గడమే కాకుండా విశ్రాంతి గంటలు పెరగడం వలన ఉత్పత్తి తగ్గుతుందని, వారిలో ఐక్యత, సమ్మెవంటి హక్కులు ద్వారా మిల్లు యజమానులకు ఖర్చులు పెరిగి, నష్టాలు వచ్చే ప్రమాదముందని భయపడ్డారు.

ప్రశ్న 17.
బ్రిటిష్ పారిశ్రామికవేత్తలు భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధిని వ్యతిరేకించారు. అయినప్పటికీ వాళ్ళు భారతదేశ కార్మికుల పక్షాన నిలబడ్డారు. ఎందుకు?
జవాబు:
బ్రిటిష్ పారిశ్రామిక ఉత్పత్తులపై భారతదేశంలో పన్నులు విధించడం వల్ల వాళ్ళ వస్తూత్పత్తి ధరలు పెరగసాగాయి. కానీ భారతదేశంలో అధిక కార్మికులు తక్కువ వేతనానికి అధిక పని గంటలు పనిచేసి అధికోత్పత్తి సాధించడమే కాకుండా తక్కువ ధరకు భారతీయ ఉత్పత్తులు లభిస్తున్నాయి. కాబట్టి కార్మికులకు మరిన్ని హక్కులు, సౌకర్యాలు కల్పించి, పని గంటలు తగ్గించి, వేతనాలు పెంచినట్లయితే భారతీయ వస్తువుల ధరలు పెరిగి, తమ ఉత్పత్తులపై కొనుగోలు శక్తి పెరిగి అధిక లాభాలు పొందవచ్చని భావించారు.

ప్రశ్న 18.
బ్రిటిషు కాలంలో ఏ వయస్సు లోపల పిల్లలను కార్మికులుగా పెట్టుకోకుండా చేశారు?
జవాబు:
9 సం||ల లోపు పిల్లలను కార్మికులుగా పిల్లలను పెట్టుకోకుండా చేశారు.

ప్రశ్న 19.
ప్రస్తుత చట్టాల ప్రకారం ఏ వయస్సు లోపల పిల్లలను కార్మికులుగా పెట్టుకోకూడదు?
జవాబు:
14 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలలో నియమించకూడదు.

ప్రశ్న 20.
కార్మిక చట్టాల ప్రకారం పిల్లలు, మహిళలు, పురుషులు రోజుకి ఎన్ని గంటల పాటు పనిచేయాలి?
జవాబు:

  1. కార్మిక చట్టాల ప్రకారం పిల్లలతో రోజుకి 7 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు.
  2. మహిళా కార్మికులతో రోజుకి 11 గంటలకు మించి పనిచేయించకూడదు.
  3. పురుష కార్మికులతో రోజుకి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు.

9th Class Social Textbook Page No.232

ప్రశ్న 21.
బ్రిటిష్ కాలంలో భారతదేశంలో ఏర్పడిన రెండు ముఖ్యమైన కార్మిక సంఘాలు ఏవి?
జవాబు:
1920 ల నుంచి కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి.

  1. సోషలిస్టు భావాలతో ఏర్పడిన “గిర్నికాంగార్ యూనియన్”.
  2. అహ్మదాబాదులో గాంధీజీ ప్రభావంతో ఏర్పడిన శక్తివంతమైన కార్మిక సంఘం “మజూర్ మహాజన్”.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 22.
కార్మికులకు కార్మిక సంఘం ఎందుకు ముఖ్యమైనది? చర్చించండి.
జవాబు:

  1. కార్మికుల సంక్షేమం కోసం.
  2. తమ హక్కుల సాధన కొరకు.
  3. మెరుగైన వేతనాలు సాధించుకోడానికి.
  4. మిల్లు యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకోడానికి.
  5. కార్మికులకు ప్రమాదాలు, మరణాలు సంభవించినప్పుడు, మెరుగైన నష్టపరిహారాలు యజమానుల నుండి పొందడానికి.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
అటవీ శాఖకు వెళ్ళి అడవులను ఎలా కాపాడుకోవాలి, స్థానిక ప్రజలు, కర్మాగారాలు వాటిని జాగ్రత్తగా ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై ఒక అధికారితో ముఖాముఖి నిర్వహించండి.
జవాబు:
అటవీ శాఖకు వెళ్ళి ‘అడవులను కాపాడుకోవాల్సిన విధం, స్థానిక ప్రజలు, కర్మాగారాలు వాటిని జాగ్రత్తగా ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై ఒక అధికారితో ముఖాముఖి :

నేను – అటవీ శాఖాధికారిగారూ….. అడవులను ఎలా కాపాడుకోవాలి?

అటవీ శాఖాధికారి – అడవులను నరకరాదు. అవి మన జాతీయ సంపద.

నేను – మన కలప అవసరాలు అడవుల ద్వారానే కదా తీరేది.

అటవీ శాఖాధికారి – అడవులనుండి మనకు కలప లభిస్తున్నప్పటికి, అడవులను విచ్చలవిడిగా నరకరాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో నరకవలసి వచ్చిన వాటి స్థానంలో మొక్కలను నాటాలి.

నేను – అంటే చెట్లను నరుకుతున్న ప్రదేశాలలో క్రొత్త మొక్కలను నాటవలసి ఉంటుందన్నమాట.

అటవీ శాఖాధికారి – అంతేకాదు, మనం నివసిస్తున్న ప్రదేశాలందు ఖాళీగా ఉన్న ప్రాంతాలలోను, ఆ పాఠశాలల, కళాశాలల ఆవరణములలోని పారిశ్రామిక ప్రాంతాలయందు, రోడ్లకిరువైపుల నదులు, కాలువగట్లపైన మొక్కలను నాటవలసి ఉంటుంది.

నేను – మొక్కలను పెంచడం వలన ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా?

అటవీ శాఖాధికారి – అనేక ఉపయోగాలు ఉన్నాయి. పర్యావరణం పరిరక్షించబడుతుంది. వర్షాలు సంభవిస్తాయి. వరదలను అరికట్టడం జరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వృక్షో రక్షతి రక్షితః – వృక్షాలను మనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి.

ప్రశ్న 2.
మీకు దగ్గరలో ఉన్న ఒక కర్మాగారాన్ని సందర్శించి దాని చరిత్ర, సాంకేతిక విజ్ఞానం ఎలా మారింది, కార్మికులు ఎక్కడ నుంచి వస్తారు తెలుసుకోండి. కొంతమంది కార్మికులు, యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళ దృక్పథాలు తెలుసుకోండి.

పట నైపుణ్యాలు

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 3
అల్లూరి సీతారామరాజు
తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో సీతారామరాజు గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొంది, చింతపల్లి, రంపచోడవరం, కె.డి. పేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం, అన్నవరం పోలీస్ స్టేషన్లపై రాజు దాడులు చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం కృషిచేసిన రాజును మంప గ్రామం వద్ద బ్రిటిష్ ప్రభుత్వం కాల్చి చంపింది.

AP Board 9th Class Social Solutions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం 4
కొమరం భీం
సీతారామరాజు పోరాటంతో, బిర్సాముండా తిరుగుబాటుతో స్ఫూర్తి పొంది, నిజాంకి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాడు. గొండు, కోయ యువకులతో భీం గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయుధాలను ప్రయోగించడంలో గిరిజన ప్రజలకు శిక్షణ ఇచ్చాడు. జోడేఘాట్ అడవులలో ఒక పౌర్ణమి రోజున నిజాం సైన్యంతో జరుగుతున్న పోరాటంలో కొమరం భీం వీరమరణం పొందారు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 21th Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

9th Class Social Studies 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. కింద పేర్కొన్న వాటిలో ఏది ప్రాథమిక హక్కులలో భాగం కాదు? (AS1)
అ) బీహార్ కార్మికులు పంజాబ్ కి వెళ్ళి అక్కడ పనిచేయడం.
ఆ) అల్పసంఖ్యాక మత వర్గం బడులు నడపటం.
ఇ) ప్రభుత్వ ఉద్యోగాలలో స్త్రీ, పురుషులకు ఒకే జీతం లభించటం.
ఈ) తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సంక్రమించటం.
జవాబు:
(ఈ) తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సంక్రమించటం.

ప్రశ్న 2.
కింద పేర్కొన్న వాటిల్లో ఏ స్వేచ్ఛ భారత పౌరులకు లేదు? (AS1)
అ) ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ.
ఆ) సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ.
ఇ) ప్రభుత్వాన్ని మార్చే ఉద్యమాన్ని చేపట్టే స్వేచ్ఛ.
ఈ) రాజ్యాంగ మౌళిక విలువలను వ్యతిరేకించే స్వేచ్ఛ.
జవాబు:
(ఆ) సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 3.
ప్రజాస్వామ్యం, హక్కులకు మధ్యగల సంబంధాల గురించి కింద పేర్కొన్న వాటిల్లో ఏది సరైనది? మీ ఎంపికకు కారణాలు పేర్కొనండి.
అ) ప్రజాస్వామికమైన ప్రతిదేశం తన పౌరులకు హక్కులను ఇస్తుంది.
ఆ) పౌరులకు హక్కులు ఇచ్చే ప్రతి దేశం ప్రజాస్వామిక దేశం అవుతుంది.
ఇ) హక్కులు ఇవ్వటం మంచిదే, కాని ప్రజాస్వామ్యానికి అవి తప్పనిసరి కాదు. (AS1)
జవాబు:
ప్రజాస్వామికమైన ప్రతి దేశం తన పౌరులకు హక్కులను ఇస్తుంది :
మనదేశం శతాబ్దాల పాటు, రాజులు, రాణుల పాలనలో ఉండగా, బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి, దేశ భవిష్యత్, ప్రభుత్వం రాచరిక పాలనలో కాకుండా ప్రజాస్వామిక దేశంగా ఉండాలని కోరుకున్నాం. ప్రజలు తమకు తాము పరిపాలించుకోవాలని నిర్ణయం మొదట తీసుకున్నాం. రాజ్యాంగంలో సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఉండాలని, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ పౌరులందరికీ అందించబడింది. ప్రజాస్వామ్యంలో భాగాలే పౌరులకు కల్పించే హక్కులు: ప్రజాస్వామ్య ఫలాలు అనుభవించడానికి పౌరులకు అందించే హక్కులు మార్గదర్శకాలు. ప్రజాస్వామ్యంలో ఇతరులు తమ హక్కులను అనుభవించనిచ్చే స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ప్రజాస్వామికమైన ప్రతి దేశం తన పౌరులకు హక్కులను ఇస్తుంది.

ప్రశ్న 4.
స్వాతంత్ర్యపు హక్కుకు దిగువ పేర్కొన్న పరిమితులు విధించటం సరైనదేనా? మీ సమాధానాలకు కారణాలు ఇవ్వండి.
అ) భద్రత దృష్ట్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతి కావాలి.
ఆ) స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని ప్రాంతాలలో బయటవాళ్ళు ఆస్తులు కొనటాన్ని నిషేధించారు.
ఇ) రాబోయే ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే పుస్తక ప్రచురణను ప్రభుత్వం నిషేధించింది. (AS2)
జవాబు:
అ) భద్రత దృష్ట్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతి కావాలి :
స్వాతంత్ర్యపు హక్కులో భాగంగా ప్రజా ప్రయోజనాల దృష్యా, భద్రత దృష్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతి లేదు. కొన్ని సరిహద్దు ప్రాంతాలలో స్వేచ్ఛా సంచారం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే క్రమంలో పౌరులు సంచరించే వీలులేదు. సరిహద్దు ప్రాంతాలలో ఇరు ప్రాంతాలు, దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎదురవ్వవచ్చు. అటువంటి సమయాలలో ప్రజలు సంచరిస్తే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఎదురవ్వవచ్చు. కాబట్టి సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతిలేదు.

ఆ) స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని ప్రాంతాలలో బయటవాళ్ళు ఆస్తులు కొనటాన్ని నిషేధించారు :
స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని ప్రాంతాలలో బయటవాళ్ళు ఆస్తులు కొనవచ్చును. అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, అనైతికమైన, ప్రమాదకరమైన వ్యాపారం చేపట్టరాదు. రాజ్యాంగం పౌరులకు ఏ వృత్తి అయినా, ఉపాధి, వాణిజ్యం ఏ ప్రాంతంలోనైనా చేపట్టవచ్చు. అయితే చేసే వ్యాపారం వల్ల ఇతరులకు ఇబ్బంది, అన్యాయం, అక్రమాలు చోటు చేసుకోకూడదు. ఆస్తులు (కొనాలన్నా, అమ్మాలన్నా) ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం క్రయ విక్రయాలు జరగాలి.

ఇ) రాబోయే ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే పుస్తక ప్రచురణను ప్రభుత్వం నిషేధించింది :
భారత రాజ్యాంగం స్వాతంత్ర్యపు హక్కు ద్వారా వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛలకు అనుగుణంగా వివిధ ప్రచురణలకు, భావ వ్యక్తీకరణలకు అవకాశం కల్పించింది. తమ భావాలను, అభిప్రాయాలను, వాస్తవ విషయాలను పత్రికలు, ప్రచురణలు ద్వారా పాఠక లోకానికి తెలియజేయవచ్చు. అయితే ఆ ప్రచురణలో వ్యక్తిగత దూషణలు, అవాస్తవాలు, అబద్ధపు ప్రచారాలు చేయకూడదు. ఒకవేళ ప్రచురణకు పూనుకుంటే దానికి తగిన రుజువులు, సాక్ష్యాలు పొందుపరచవలసి ఉంటుంది.

ప్రశ్న 5.
ఈ అధ్యాయం, గత అధ్యాయం చూసి రాజ్యాంగం ఇచ్చిన ఆరు ప్రాథమిక హక్కుల జాబితాను తయారుచేయండి. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు. అణచివేతకు పాల్పడే ప్రభుత్వాల నుంచి ప్రజలకు ఈ హక్కులు రక్షణనిస్తాయి. వీటిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ హక్కులు ఉల్లంఘించ బడినప్పుడు అత్యున్నత న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందవచ్చును. ప్రాథమిక హక్కులు 6. అవి :

  1. సమానత్వపు హక్కు
  2. స్వాతంత్ర్యపు హక్కు
  3. మత స్వాతంత్ర్యపు హక్కు
  4. పీడనాన్ని నిరోధించే హక్కు
  5. సాంస్కృతిక, విద్యావిషయక హక్కు
  6. రాజ్యాంగ పరిహారపు హక్కు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 6.
కింద పేర్కొన్న వాటిల్లో ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడుతున్నాయా? అలా అయితే ఏ హక్కు లేదా హక్కులు – ఉల్లంఘింపబడుతున్నాయి? తరగతిలో మీ తోటి విద్యార్థులతో చర్చించండి. (AS1)
అ) ఏ చట్టాన్ని అతిక్రమించారో చెప్పకుండా ఒక వ్యక్తిని నాలుగు రోజులపాటు పోలీస్ స్టేషనులో ఉంచారు.
ఆ) నీ ఆస్తిలో కొంతభాగం తనదని పక్క వ్యక్తి పేర్కొనటం.
ఇ) మీ తల్లిదండ్రులు నిన్ను బడికి వెళ్ళనివ్వటం లేదు. నీకు ఆహారర్ సరిగా పెట్టలేకపోతున్నారు కాబట్టి నిన్ను అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేయటానికి పంపిస్తున్నారు.
ఈ) మీ తండ్రి నుంచి వారసత్వంగా నువ్వు పొందిన ఆస్తిని నీ సోదరుడు నీకు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాడు.
జవాబు:
అ) ఏ చట్టాన్ని అతిక్రమించారో చెప్పకుండా ఒక వ్యక్తిని నాలుగు రోజులపాటు పోలీస్ స్టేషన్లో, ఉంచారు :
చట్టాలు అందరికీ ఆ వ్యక్తి ఆదాయం , హోదా, నేపథ్యం వంటి వాటితో సంబంధం లేకుండా వర్తిస్తాయి. చట్టరక్షణ సమానంగా వర్తిస్తుంది. అయితే చట్ట అతిక్రమణ జరిగినట్లు తెలిస్తే, ఫిర్యాదులు వస్తే, వాటికి సంబంధించిన వ్యక్తులకు ముందుగా తెలియజేసి అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో ఉంచవచ్చు. కాని 24 గంటలలోపు ఆ వ్యక్తులను కోర్టులకు అప్పగించాలి. అంతేగాని నేరం రుజువు కాకుండా, 4 రోజులు పోలీసుస్టేషన్లో ఉంచడం చట్టరీత్యా నేరం. అ కారణంగా అరెస్టు చేస్తే ఆ వ్యక్తి తను ఎంచుకున్న లాయర్ ద్వారా వాదించే హక్కు ఉంది.

ఆ) నీ ఆస్తిలో కొంతభాగం తనదని పక్క వ్యక్తి పేర్కొనటం :
ప్రజాస్వామ్యం పౌరులకు ప్రాథమిక హక్కులు అందించింది. వాటిని సక్రమంగా, హుందాగా అనుభవించాలని, అవసరమైతే చట్టాలు, న్యాయస్థానాలు ద్వారా లబ్ధిపొందాలని రాజ్యాంగం తలచింది. అయితే ఏ వ్యక్తి కూడా దురాక్రమణ పూర్వకంగా, ఇతరుల ఆస్తులను, సంపదలను ఆక్రమించటానికి అవకాశం లేదు. తాత తండ్రుల నుండి పౌరులు సంపాదించిన ఆస్తులకు సంబంధించి, రిజిష్టర్డ్ ‘ దస్త్రాలు, రుజువు పత్రాలు ఉంటాయి. వాటిని కాదని ఆస్తిలో సగభాగం తనదని ఆక్రమించుకోవటం చట్టరీత్యా నేరం. అటువంటి సందర్భాలలో న్యాయస్థానాలు కఠినంగా శిక్షిస్తాయి.

ఇ) మీ తల్లిదండ్రులు నిన్ను బడికి వెళ్ళనివ్వటం లేదు. నీకు ఆహారం సరిగా పెట్టలేకపోతున్నారు కాబట్టి నిన్ను అగ్గిపెట్టెల కర్మాగారంలో పని చేయటానికి పంపిస్తున్నారు.
2002లో జీవించే హక్కులో విద్యా హక్కు భాగమైంది. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత, నిర్భంద విద్యను అందించాలి. తమ పిల్లలు క్రమం తప్పకుండా బడికి హాజరు అయ్యేలా చూసే బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు వివిధ వృత్తులు, ఉపాధి అవకాశాలు అందుకొని, పిల్లలను పెంచి పోషించి తగిన ఆహారాన్ని అందించే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. 14 సం||ల లోపు బాలలను కర్మాగారాలు, గనులు, అగ్గిపెట్టెలు, టపాకాయలు, అద్దకం వంటి ప్రమాదకరమైన పనులలో పెట్టడం నేరం. అలా చేస్తే తల్లిదండ్రులకు కూడా చట్టరీత్యా శిక్షలు అమలుచేస్తారు.

ఈ) మీ తండ్రి నుంచి వారసత్వంగా నువ్వు పొందిన ఆస్తిని నీ సోదరుడు నీకు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాడు.
ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును భారత రాజ్యాంగం తొలగించింది. అయితే ఆస్తి పంపకం విషయంలో తల్లిదండ్రుల ఆస్తులకు సంబంధించి, రుజువు పత్రాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి, పెద్ద మనుషుల ఒప్పందాలు చాలా ముఖ్యం. తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ఆస్తిని నీ సోదరుడు ఇవ్వటానికి నిరాకరిస్తే, న్యాయస్థానాలను ఆశ్రయించి, వాటి ద్వారా వారికి రావలసిన ఆస్తి వాటాను పొందవచ్చును.

ప్రశ్న 7.
మీరు ఒక న్యాయవాది అనుకోండి. కొంతమంది ప్రజలు దిగువ పేర్కొన్న విన్నపంతో మీ దగ్గరకు వచ్చారు. వాళ్ళ తరఫున మీరు ఏవిధంగా వాదిస్తారు?
“ఎగువన ఉన్న కర్మాగారాల వల్ల మా ప్రాంతంలోని నదీజలాలు బాగా కలుషితం అవుతున్నాయి. మాకు మంచినీళ్ళు ఈ నది నుంచే వస్తాయి. ఈ నీళ్ళు కలుషితం కావటం వల్ల మా ఊరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మేం ప్రభుత్వానికి ఫిర్యాదు . చేశాం. కాని వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా మా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.” (AS4)
జవాబు:
భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా సుఖంగా నివసించటానికి, ఆనందంగా బ్రతకడానికి, స్థిరపడడానికి హక్కుంది. తను జీవనం సాగించే ప్రదేశంలో తనకు నష్టం కలిగించే చర్యలు, అపాయం, హానికరం కలిగించే కార్యక్రమాలు ఎవరూ చేపట్టకూడదు. కర్మాగారాలు విడిచే హానికరమైన వ్యర్థాలు ద్వారా నదీజలాలు కలుషితమయ్యి, ప్రమాదకరమైన జబ్బులు, ప్రాణాపాయం కలగవచ్చు. తద్వారా మనిషి జీవనం దుర్భరమౌతుంది. అటువంటి సందర్భాలలో వ్యక్తులకు న్యాయస్థానాల ద్వారా, చట్టాల ద్వారా రక్షణ కల్పించాలి.

ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు స్థానిక పోలీసులు కేసులు నమోదు చేస్తారు. కర్మాగారాల యజమానులను అరెస్టులు చేస్తారు. దానికి నివారణా చర్యలు, ప్రతి చర్యలు ద్వారా, ఈ కలుషితాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. .. అవసరమైతే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించుటకు కృషి చేస్తాను. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా న్యాయస్థానాల ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడానికి ప్రయత్నిస్తాను.

ప్రశ్న 8.
“బిరుదుల రద్దు” అన్న శీర్షిక కింద ఉన్న వాక్యాలను చదివి ఈ ప్రశ్నకు సమాధానమివ్వండి.
ఈ బహుమతులు పొందిన వ్యక్తి దానిని బిరుదుగా ఉపయోగించుకోకూడదు. ఎందుకు? (AS2)
జవాబు:
రాచరిక వర్గాన్ని, బూర్జువాలను ఇష్టమొచ్చినట్లు, అసమానంగా విభజించటాన్ని తొలగిస్తూ భారత ప్రభుత్వం ఎటువంటి బిరుదులు ఇవ్వకుండా రాజ్యాంగం నిషేధం విధించింది. భారతదేశ పౌరులు ఇతర దేశాల బిరుదులను తీసుకోకూడదు. అయితే భారతదేశ పౌరులు సైనిక, పౌర పతకాలు పొందవచ్చు. భారతరత్న, పరమవీరచక్ర, పద్మవిభూషణ్ వంటి పతకాలు పొందిన వాళ్ళు వాటిని బిరుదుగా ఉపయోగించుకోకూడదు. కాబట్టి, ఇవి రాజ్యాంగ నిషేధ పరిధిలోకి రావు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 9.
మీకు తెలిసిన ఒక హక్కుల ఉల్లంఘన సందర్భాన్ని విశ్లేషించండి. (AS6)
జవాబు:
రాజ్యాంగం మనకు అందించిన అద్భుతమైన గొప్ప అవకాశం ప్రాథమిక హక్కుల కల్పన. అయితే ఇటీవల సమానత్వపు హక్కులో భాగంగా అస్పృశ్యత నిషేధం (అంటరానితనాన్ని) రాజ్యాంగం నిర్ద్వంద్వంగా రద్దు పరిచింది. ఎవరైనా అస్పృశ్యతను పాటిస్తే నేరం అవుతుంది. అందుకు పాల్పడిన వాళ్లు చట్టరీత్యా శిక్షార్హులు. జైలుశిక్ష కూడా పడుతుంది. కాని ఇటీవల గ్రామీణ ప్రాంతాలలో అంటరానితనం కొన్ని సందర్భాలలో మేం గమనిస్తున్నాం. గ్రామాలలో టీక్లబ్ వద్ద రెండు గ్లాసుల పద్ధతి అమలులో ఉంది. అంతేకాకుండా హరిజన కాలనీలు, గిరిజన కాలనీలని గ్రామాలకు దూరంగా ఇండ్లను కడుతున్నారు. – అదే విధంగా స్వాతంత్రపు హక్కులో భాగంగా జీవించే హక్కు ముఖ్యమైనది. జీవించే హక్కులో 2002లో విద్యాహక్కు కూడా భాగమైంది. దీని ప్రకారం 6-14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి. కాని ప్రయివేట్ పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తూ, అధిక ఫీజులు, భరించలేని శిక్షలు, ప్రభుత్వ సూచనలు పట్టించుకోని యాజమాన్యం, అధిక ఒత్తిడితో బాల్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా నేను హక్కుల ఉల్లంఘనలను గమనిస్తున్నాను.

9th Class Social Studies 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు InText Questions and Answers

9th Class Social Textbook Page No.255

ప్రశ్న 1.
గత సంవత్సరం మీరు చదివిన రాజ్యాంగ పీఠికలోని ముఖ్యమైన కొన్ని అంశాలను రాయండి.
జవాబు:
స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చి, మార్గదర్శకంగా నిలిచిన విలువలే భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచాయి. ఈ విలువలు భారత రాజ్యాంగ “పీఠిక”లో పొందుపరిచి ఉన్నాయి. రాజ్యాంగ ఉద్దేశాలను, మౌళిక సూత్రాలను ఈ పీఠిక తెలియజేస్తుంది. “భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయటానికి తీర్మానించి దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వం ఇస్తూ మాకు మేం ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నాం.”

9th Class Social Textbook Page No.259

ప్రశ్న 2.
ఏ రకమైన సమానత్వపు హక్కులకు రాజ్యాంగం హామీ ఇస్తోంది? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
భారత రాజ్యాంగం సమానత్వానికి హక్కు ఇస్తోంది. ఇందులో ఉన్న ముఖ్యమైన హక్కులు :

1. చట్టరక్షణలో సమానత్వం : ఉదా : చట్టరక్షణ సమానంగా లభిస్తుంది. భారతీయ పౌరుల కులం, వర్ణం, లింగ, మతం, హోదా వంటి వాటికి ప్రాధాన్యత లేదు. వివక్షత చూపరాదు. తప్పు చేస్తే ప్రధానమంత్రి అయినా శిక్షార్హుడే.

2. సామాజిక సమానత్వం : ఉదా : పౌరులు, దుకాణాలు, రెస్టారెంట్లు, బావులు, చెరువులు, రహదారులు మరియు ప్రభుత్వం అందించు సదుపాయాలు ఉపయోగించుకోవడానికి అడ్డులేదు.

3. అవకాశాలలో సమానత్వం : ఉదా : మతం, జాతి, కులం, లింగ, వారసత్వం, జన్మస్థానం, నివాస స్థానం కారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు కాకూడదు. వివక్షతకు గురి కాకూడదు.

4. అస్పృశ్యత నిషేధం : ఉదా : అంటరానివాళ్ళుగా ఎవరినీ పరిగణించరాదు.

5. బిరుదులు రద్దు : ఉదా : రాచరికపు బిరుదులను రాజ్యాంగం నిషేధించింది.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 3.
సమానత్వపు ప్రాథమిక హక్కును కింద పేర్కొన్నవి ఉల్లంఘిస్తున్నాయేమో చర్చించండి. ఇలా చేయటం రాజ్యాంగ రీత్యా సరైనదో, కాదో చర్చించండి.
– వీధిలోని నల్లా (కుళాయి) నుండి నీళ్ళు పట్టుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి కుండ తనక కుండకు తగిలిందని ఒక వ్యక్తి గొడవ పెట్టుకున్నాడు.
– కొన్ని ప్రత్యేక కులాలకు చెందిన వారనే నెపంతో కొందరు పిల్లలను పాఠశాలల్లో మంచినీళ్లు ఇతరులకు పోయనివ్వరు.
– కొన్ని వర్గాల ప్రజలను ఊరిలో కాకుండా ఊరిబయట మాత్రమే ఉండడానికి అనుమతిస్తారు.
– ప్రార్థనా స్థలాలకు వెళితే తమను అవమానిస్తారనీ, లేదా కొడతారనీ చాలా సమూహాల ప్రజలు అక్కడకు వెళ్ళరు.
జవాబు:
సమానత్వపు ప్రాథమిక హక్కులో భాగంగా అస్పృశ్యత నిషేధం పొందుపరిచారు. ఏ రూపంలోనైనా అంటరాని తనాన్ని రాజ్యాంగం రద్దు పరిచింది. అస్పృశ్యతను ఎవరైనా పాటిస్తే వారు చట్టరీత్యా శిక్షార్హులు. వారికి జైలు శిక్ష కూడా పడవచ్చు. వీధులలో పబ్లిక్ కుళాయిలలో కులమతాలకు అతీతంగా నీటిని పొందవచ్చు. అక్కడ కులం ఆధారంగా వివక్షత చూపిస్తే, ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా నేరం. చాలా గ్రామాలలో కొన్ని వర్గాల ప్రజలను అంటరాని వాళ్ళుగా, తక్కువ కులాల వారిగా పరిగణించి, ఊరిలోకి రానీయకపోయినా, ఊరి బయట బహిష్కరణకు గురిచేసినా తీవ్ర శిక్షకు గురౌతారు. అంతేకాకుండా మన రాజ్యాంగం లౌకికతత్వానికి ప్రాధాన్యతనిస్తూ, అన్ని మతాలను, కులాలను సమానంగా చూస్తూ, అన్ని మతాలను గౌరవిస్తుంది. కాని కొన్ని ప్రాంతాలలో, కొన్ని దేవాలయాలకు కొంతమందిని అనుమతించకపోవడం, ప్రవేశం నిషేధించడం చట్టరీత్యా నేరం. అటువంటి సంఘటనలు జరిగినచో వారు ఫిర్యాదు చేస్తే దోషులను కఠినంగా శిక్షించడం జరుగుతుంది.

ప్రశ్న 4.
రాజ్యాంగంలో సమానత్వపు ప్రాథమిక హక్కు లేకపోతే ఏమవుతుంది? చర్చించండి.
జవాబు:
రాజ్యాంగం ద్వారా సమానత్వపు ప్రాథమిక హక్కు లేకపోతే సమన్యాయపాలన దెబ్బతింటుంది. చట్టరక్షణ సమానంగా లభించదు. అస్పృశ్యత అధికమౌతుంది. సంపన్నులు, మేధావులే ఉన్నత ఉద్యోగాలు పొందుతారు. అల్పసంఖ్యాకులు, వెనుకబడిన వారికి అవకాశాలు అందవు. దుకాణాలు, రెస్టారెంట్లు, బావులు, చెరువులు, రహదారులు, ప్రభుత్వ సదుపాయాలు అందరికీ అందవు. సామాజిక సాంప్రదాయం దెబ్బతింటుంది. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వెనుకబడినవారు అణగదొక్కబడతారు.

9th Class Social Textbook Page No.261

ప్రశ్న 5.
మీ ప్రాంతంలో ఎటువంటి సంఘాలు ఉన్నాయి?
జవాబు:
మా ప్రాంతంలో మహిళా, డ్వాక్రా సంఘాలు, కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, వైద్య సంఘాలు, వ్యాపార సంఘాలు, పెన్షనర్స్ సంఘాలు ఉన్నాయి.

ప్రశ్న 6.
కార్మిక సంఘాలు ఎందుకు ఏర్పడతాయి? అవి ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?
జవాబు:
కర్మాగారాలలో కార్మిక సంఘాలు, తమ కోరికల సాధన కొరకు సంఘాలుగా ఏర్పడతాయి. తమ కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాల కొరకు, అధిక మొత్తంలో జీతాలు కొరకు, వసతి సదుపాయాలు కొరకు, ప్రమాదాల కాలంలో జరిగిన నష్టాలకు పరిహారం గూర్చి, కార్మిక సంఘాలు, కర్మాగారాల యజమానుల నుండి లబ్ది పొందడానికి సంఘాల అవసరం ఉంది.

సంఘాలు ఎదుర్కొనే సమస్యలు :

  1. లాకౌట్లు
  2. తక్కువ సదుపాయాలు
  3. ఎక్కువ పనిగంటలు
  4. ఆరోగ్య సమస్యలు
  5. ఆలస్య జీతాలు
  6. యజమానుల నిరంకుశత్వాలు
  7. ఏకపక్ష నిర్ణయాలు
  8. శాశ్వతం కాని ఉద్యోగాలు
  9. నిరంతరం ఇబ్బందులు

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 7.
ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఎందుకు స్థిరపడాలనుకుంటారు?
జవాబు:

  1. రోజురోజుకూ అంతరించిపోతున్న కులవృత్తులు.
  2. లాభసాటిగా లేని వ్యవసాయ పనులు.
  3. ఉపాధి, అవకాశాలు కల్పించలేని ప్రభుత్వాలు.
  4. గ్రామాలలో లభించే తక్కువ కూలిరేట్లు.
  5. నిరంతరం కరువు కాటకాలు, తుపానులు, వరద బీభత్సాలు.
  6. పట్టణాలలో, నగరాలలో విరివిగా లభించే ఉద్యోగాలు.
  7. తక్కువ పని గంటలు, ఎక్కువ జీతాలు.
  8. నగరాలు, ఇతర ప్రాంతాలలో మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు వలన ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నారు.

ప్రశ్న 8.
పట్టణంలో పని దొరికి, ఉండటానికి సరైన ఇల్లు లేని వాళ్ళపట్ల ప్రభుత్వ బాధ్యత ఏమిటి?
జవాబు:
దేశంలో ప్రజలు ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ నగరాలలో నివసిస్తున్నప్పటికీ వారికి సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత. ఎప్పటికప్పుడు వివిధ ఆర్థిక, గణాంక సర్వేల ద్వారా ప్రజలకు అందుతున్న సదుపాయాలు, గృహవసతి, ఆరోగ్యం , విద్య సదుపాయాలు అందించవలసి ఉంది. వివిధ కారణాలతో ఉపాధి అవకాశాలకై పట్టణాలకు వచ్చి స్థిరపడిన వారికి ఇళ్ళు, రాజీవ్ గృహకల్పన ద్వారా వసతి సదుపాయాలు కల్పించాలి. దగ్గరలో గల ప్రభుత్వ అధికారుల ద్వారా వారికి చేయూతనందించాలి.

9th Class Social Textbook Page No.262

ప్రశ్న 9.
కింద పేర్కొన్న వాటిల్లో వాక్ స్వాతంత్ర్య నియంత్రణను దృష్టియందుంచుకొని చర్చ నిర్వహించండి.
1. ఒక కులం ప్రజల భావనలను గాయపరిచే ఉద్దేశంతో ఒక పుస్తకం రాశారు.
2. ప్రతి సినిమాకి విడుదలకు ముందు సెన్సారు బోర్డు నుంచి ఆమోదం పొందాలి.
3. రాత్రి 11 గంటలు దాటిన తరువాత పండుగలు, ప్రార్థనల రోజులలో ఎవరూ మైకు వాడకూడదని న్యాయస్థానం ఆదేశించింది.
జవాబు:
వాక్ స్వాతంత్ర్యం వల్ల వ్యక్తులకు ప్రజా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి వివిధ రూపాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. వాక్ స్వాతంత్ర్యం పరిమితమైన హక్కు. శాంతిభద్రతలు, ప్రభుత్వ భద్రత, నైతికత, ప్రజాహితం వంటి కారణాలతో ఈ హక్కుకు పరిమితులున్నాయి. వాక్ స్వాతంత్ర్యం ద్వారా ఒక కులాన్ని గాని, మతాన్ని గాని కించపరిచే వ్యాఖ్యలు, ప్రచురణలు చేయకూడదు. ఒకరి కుల సాంప్రదాయాలను, ఆచారాలను వక్రీకరించకూడదు. ఒకరి కుల మనోభావాలను కించపరచకూడదు. అవమాన పరచకూడదు మరియు ప్రజల శాంతిభద్రతలకు, వారి సుఖజీవనానికి ఆటంకం కలిగించకూడదు. రాత్రి 11 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి, సమావేశాలు, సభలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు న్యాయస్థానాలు అనుమతి ఉంటుంది. మన వాక్ స్వాతంత్ర్యం మిగతా వారికి ఇబ్బందుల నుండి రక్షణకు కాల నిర్ణయం విధించారు.

సినిమాలు ప్రజలను, సమాజాన్ని, సక్రమ మార్గంలో నడిపించడానికి మార్గదర్శకాలు. “సినిమా” అనేది అనుకరణ మాధ్యమం. ఈ సినిమా మాధ్యమం ద్వారా, పిల్లలను, మహిళలను, ఉద్యోగస్థులను, కుల, మతాలను కించపరిచే సన్నివేశాలు, చిత్రాలు, పాటలు, మాటలు ఉండకూడదు. దాని ఫలితంగా సమాజంలో చెడు ఫలితాలు కలుగుతాయి. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, అశ్లీల దృశ్యాలు, బూతు సాహిత్యం ద్వంద్వార్థ పదాలను సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు ముందు పరిశీలించి, సెన్సార్ చేసిన పిమ్మట ఆమోదిస్తూ మంజూరు పత్రం అందిస్తుంది.

ప్రశ్న 10.
ఎనిమిదవ తరగతిలో చదివిన పోలీసులు, న్యాయస్థానాల పాత్రలలో తేడాలు ఏమిటి?
జవాబు:
శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల ప్రధానపాత్ర. నేరాలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి, విచారణ చేయడం పోలీసుల కర్తవ్యం. రకరకాల రుజువులు సేకరిస్తారు. సాక్ష్యులను విచారించి విషయాలు నమోదు చేస్తారు. ముందుగా తొలి సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్) తయారుచేస్తారు. సాక్ష్యాలు దోషి అని రుజువు చేస్తుంటే పోలీసులు న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేయాలి.

నిందితుడు దోషో, కాదో అని వాదోపవాదాలు సాక్షుల ద్వారా నిర్ధారించుకొని, దోషి అయితే ఏ శిక్ష విధించాలో న్యాయమూర్తులు, లేదా న్యాయవర్గం విధిస్తుంది. హత్య, లంచగొండి తనం, దోపిడీ వంటి నేరాలు మోపబడిన వ్యక్తికి బెయిలు పోలీసులు ఇవ్వరు. బెయిల్ మంజూరు చేయాలో వద్దా నిర్ధారించేది న్యాయమూర్తి. ఒకవేళ బెయిలు మంజూరు చేస్తే కొన్ని హామీలు సమర్పించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 11.
మీ ప్రాంతంలో ఏ ఏ రకాల పాఠశాలలు ఉన్నాయి? ఇన్ని రకాల పాఠశాలలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
మా ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రయివేట్ పాఠశాలలు, బాలికల పాఠశాలలు, వికలాంగుల పాఠశాలలు, చెవిటి, మూగ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, ముస్లిం పాఠశాలలు (ఉర్దూ), ఆంగ్ల పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వం నియమించు ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా సాధారణ, మధ్య తరగతి విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో అనేక రకాల బిల్డింగ్లు, మధ్యాహ్న భోజన పథకాలు, ఉచితంగా బట్టలు, పుస్తకాలు అందించబడుతున్నాయి.

ప్రయివేట్ పాఠశాలలో ఉద్యోగస్తుల పిల్లలు, ఆర్థికస్ధమత గలవారు చదువుతున్నారు. ఇందులో శిక్షణ పొందని ఉపాధ్యాయులు కూడా పనిచేస్తుంటారు. వారికి ప్రభుత్వం అందించు సౌకర్యాలు ఉండవు.

బాలికలు వారి అవసరాలు, వారి జీవన విధానానికి అనుగుణంగా, ప్రత్యేక వాతావరణంలో చదువుకోవడానికిగాను బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

గిరిజన బాలబాలికల సంక్షేమం కొరకు గిరిజన సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేశారు.

చెవిటి, మూగ విద్యార్థులు, మామూలు విద్యార్థులతో కలిసి చదువుకోలేరు. కాబట్టి వారికి కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా బోధన చేయాలి. కాబట్టి చెవిటి, మూగ పాఠశాలలున్నాయి. భాషాపరమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఉర్దూ పాఠశాలలున్నాయి.

ప్రశ్న 12.
మీ ప్రాంతంలో ఈ రకమైన హక్కులు పిల్లలకు కల్పించబడుతున్నాయని నీవు భావిస్తున్నావా?
జవాబు:
మా ప్రాంతంలో 6-14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత, నిర్భంద విద్యను అందిస్తున్నారు. పిల్లల అవసరాలకు తగ్గట్లు. ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధిస్తున్నారు. క్రమం తప్పకుండా మా తల్లిదండ్రులు బడికి పంపిస్తున్నారు. ఆరోగ్యం, ఆహారం, మధ్యాహ్న భోజన పథకం ద్వారా సమకూరుస్తున్నారు. ప్రమాదకరమైన పనులు చేయించటం లేదు. కర్మాగారాలు, హోటళ్ళు, బీడీ పరిశ్రమలు, అగ్గిపెట్టెల తయారీలో పిల్లలను చేర్చుకోవటం లేదు. మా ప్రాంతంలో బలవంతపు చాకిరీలు నిషేధించబడ్డాయి.

ప్రశ్న 13.
ఉపాధ్యాయుడి సహాయంతో రాష్ట్రంలోని కనీస వేతనాలను తెలుసుకోండి.
జవాబు:
రాష్ట్రంలో స్త్రీ, పురుషులకు, ఉద్యోగస్థులకు, వ్యవసాయ, ఉపాధి హామీ పథకం కూలీలకు వేరువేరుగా వేతనాలు అందిస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో
పురుషులకు – రూ. 200 వరకు (రోజుకు) :
స్త్రీలకు – రూ. 150 వరకు (రోజుకు)
రోజువారి వ్యవసాయ కూలి (పురుషులకి) – రూ. 120 (రోజుకు)
రోజువారి కూలి (స్త్రీలకి) – రూ. 80 (రోజుకు)
తాపీ మేస్త్రీకి (ఇల్లు కట్టే సమయంలో) – రూ. 300 (రోజుకు)
సాయం చేసే స్త్రీలకు – రూ. 130
ఉపాధ్యాయులకు – రూ. 300 నుండి రూ. 2000 వరకు (రోజుకు)
వైద్యులకి (తనిఖీ రుసుం) – రూ. 100 నుండి 300 వరకు (రోజుకు)

9th Class Social Textbook Page No.263

ప్రశ్న 14.
సతీసహగమనాన్ని ఆచరించటం వల్ల ప్రాథమిక హక్కులకు ఏవిధంగా భంగం కలుగుతుంది?
జవాబు:
పౌరులందరూ తమ అంతరాత్మను అనుసరించి ఏ మతాన్ని అయినా అవలంబించే హక్కు కలిగి ఉన్నారు. వ్యక్తిగా తన మత ఆచారాలను పాటించకుండా ఏ వ్యక్తినీ నిషేధించలేరు. అయితే మతం మాటున జరిగే ఘోరాలు, హత్యలను రాజ్యాంగం ప్రకారం అనుమతించరు. బలవంతంగా తమ అభిమతాలకు వ్యతిరేకంగా, ‘సతి’ సహగమనాన్ని ప్రోత్సహించడం, ‘ . మత స్వాతంత్ర్యపు హక్కుకు భంగం కలుగుతుంది. ‘సతి’ సహగమనం లౌకికవాద స్ఫూర్తికి విఘాతం. మతం పేరుతో బలవంతపు చావులను రాజ్యాంగం అనుమతించదు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 15.
ఒక వ్యక్తి అనుకుంటే ఏ మతమూ అవలంబించకుండా ఉండవచ్చా?
జవాబు:
రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా తను అనుకుంటే ఏ మతమూ అవలంబించకుండా ఉండవచ్చు.

9th Class Social Textbook Page No.266

ప్రశ్న 16.
మన రాష్ట్రంలో మానవ హక్కుల సంఘం ఉందా? దాని కార్యక్రమాల గురించి తెలుసుకోండి.
జవాబు:
1993లో ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కుల పరిరక్షణ చట్ట నిబంధనల మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులుంటారు. వీరందరినీ రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. వీరిని నియమించే సమయంలో గవర్నర్ ఈ కింది వారిని సంప్రదించాలి.

  1. రాష్ట్ర ముఖ్యమంత్రి, కమిటీకి అధ్యక్షుడు.
  2. రాష్ట్ర విధానసభ స్పీకరు
  3. రాష్ట్ర హోం మంత్రి
  4. రాష్ట్ర విధాన సభ స్పీకర్
  5. రాష్ట్ర విధాన సభ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవీ కాలం – 5 సం||రాలు
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి.
మరొక సభ్యుడు మానవ హక్కుల రంగంలో నిష్ణాతుడై ఉండాలి.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధికార విధానాలు :

  1. మానవ హక్కులు ఉల్లంఘనను నివారించటంలో ప్రభుత్యోద్యోగి విఫలమైనప్పుడు తనంతట తానుగానే లేదా ఫిర్యాదు ఆధారంగా కాని విచారణ జరపడం.
  2. న్యాయస్థానాలు అనుమతితో మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కక్షిదారునిగా చేరడం.
  3. జైళ్ళను ఇతర నిర్బంధ గృహాలను సందర్శించి తనిఖీ చేసి అక్కడ ఉన్నవారికి కనీస వసతుల కల్పనపై విచారించి అవసరమైన సూచనలివ్వడం.
  4. మానవ హక్కుల పరిరక్షణలో రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలను, చట్టపరమైన నిబంధనలను’ నిరంతరం సమీక్షిస్తూ తగిన సూచనలివ్వడం.

ప్రశ్న 17.
మానవ హక్కులకు ఉల్లంఘనలను కొన్నింటిని పేర్కొనండి.
జవాబు:

  1. పోలీసుల వేధింపులు
  2. ఇష్టమొచ్చినట్లు అరెస్టు చేయటం
  3. సమాచార హక్కును తిరస్కరించటం
  4. అవినీతి
  5. మహిళలపై లైంగిక వేధింపులు
  6. అత్యాచారాలు
  7. నేర విచారణలో ఆలస్యం
  8. స్త్రీ, శిశు హత్య
  9. డబ్బుకోసం కిడ్నాపింగ్
  10. మహిళలు, పిల్లలు, అట్టడుగు ప్రజల దారుణ జీవన పరిస్థితులు
  11. కుటుంబంలో మహిళల పట్ల వివక్షత
  12. ఇంటి పని చేసేవాళ్ళ పై హింస వంటివి మానవ హక్కుల ఉల్లంఘనలకు కొన్ని ఉదాహరణలు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 18.
మీ ప్రాంతంలో ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని తెలిస్తే దానికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘానికి ఒక ఫిర్యాదు రాయండి.
జవాబు:

ఫిర్యాదు

విజయవాడ,
10 – 10 – 20xx.

సబ్జెక్టు : జాతీయ మానవ హక్కుల చైర్మన్ గారికి మా ప్రాంతంలోని పోలీసుల వేధింపుల గురించి ఒక చిన్న విన్నపం.

To:
జాతీయ మానవ హక్కుల చైర్మన్,
డిల్లీ.

గౌరవనీయులైన జాతీయ మానవ హక్కుల చైర్మన్ గారికి,

అయ్యా,
మాది విజయవాడలోని లబ్బీపేట ప్రాంతం. మా ప్రాంతం నందు దినసరి కార్మికులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వారికి చట్టం గురించి కాని, పోలీసుల గురించి కాని అంతగా తెలియదు.’ అయితే పోలీసులు లేనిపోని కారణాలు చెబుతూ తరచుగా మా ప్రాంతంలోని ప్రజలను బెదిరింపులతోను, వేధింపులతోను అనేక ఇబ్బందులకు గురిచేసి వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అందువల్ల మీరు ఈ విషయం నందు జోక్యం చేసుకుని మా ప్రాంతంలోని, ప్రజలను పోలీసుల వేధింపుల నుండి రక్షణ కల్పించవలసినదిగా ప్రార్థించుచున్నాము.

ఇట్లు
మీ విధేయుడు,
ఎం. భావసాయి,
9వ తరగతి.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
ఒక సీనియర్ న్యాయవాదిని మీ తరగతికి ఆహ్వానించి, ముఖాముఖి ద్వారా ఈ కింది విషయాలు తెలుసుకోండి :
– ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, వాటి పర్యవసానాలు
– బాలల హక్కుల ఉల్లంఘన
– ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పోరాడే విధానాలు
– సంబంధిత ఇతర విషయాలు.
జవాబు:
ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, వాటి పర్యవసానాలు :
ప్రాథమిక హక్కులను న్యాయస్థానాలు పరిరక్షిస్తాయి. థమిక హక్కుల ఉల్లంఘనకు గురైనప్పుడు వ్యక్తులు శిక్షార్హులు అవుతారు.

బాలల హక్కుల ఉల్లంఘన :
బాలల హక్కుల ఉల్లంఘించటం కూడా చట్టరీత్యా నేరం మరియు శిక్షార్హులు. న్యాయస్థానాలు బాలల హక్కులను పరిరక్షిస్తాయి. దానికితోడు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 2007 మార్చిలో ఏర్పాటుచేశారు.

ఈ సంస్థ 18 సం||రాల వయస్సు లోపల గల బాలలందరికి వర్తిస్తుంది.

బాలల కోసం అమలవుతున్న వివిధ రక్షణలను, సౌకర్యాలను పరిశీలించి సమీక్ష చేసి తగిన సిఫారసులు చేస్తుంది. బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి, విచారించి తగిన చర్యలు చేపడుతుంది. తీవ్రవాదం, మత ఘర్షణలు, గృహహింస, లైంగిక దాడులు, వేధింపులు మొదలగు సమస్యలపై తగిన పరిష్కారాలను సూచిస్తుంది.

బాలల హక్కులకు సంబంధించిన ఒప్పందాలను, చట్టాలను, పథకాలను, కార్యక్రమాలను అధ్యయనం చేసి సమర్థవంతంగా అమలు చేయడానికి సిఫారసులు చేస్తుంది. బాలల హక్కులపైన పరిశోధన మరియు హక్కులపై అవగాహన కల్పించడానికి సెమినార్లు, చర్చావేదికలు నిర్వహిస్తుంది.

బాల నేరస్థుల జైళ్లను సందర్శించి వారికి కల్పిస్తున్న వసతులపై ప్రభుత్వానికి నివేదికలు ఇస్తుంది.

పై విధంగా బాలల హక్కులను ఒకవైపు న్యాయస్థానాలు మరోవైపు కమిషన్ కంటికి రెప్పలా కాపాడుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పోరాడే విధానాలు :
శాంతియుతంగా, గాంధేయ మార్గంలో హక్కులకోసం .పోరాడాలి. ఏ విధమైన హింసాపూరిత వాతావరణానికి అవకాశం కల్పించరాదు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేయరాదు. పౌరులు, తమ తమ విధులను పాటిస్తూనే శాంతియుత మార్గంలో న్యాయస్థానాలు ద్వారా లేదా సమస్యలను పరిష్కరించు కోవలయును.

సంబంధిత ఇతర విషయాలు :
మానవుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ న్యాయస్థానాలతో పాటు జాతీయ స్థాయిలో జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పనిచేస్తున్నాయి. వీటిని 1993లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటుచేయడం జరిగింది.

జాతీయ మానవ హక్కుల చట్టాన్ని 2006లో సవరించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులు ఉంటారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మను రాష్ట్రపతి నియమిస్తారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ను గవర్నర్ నియమిస్తారు.

ఈ కమిషన్లు చేసే విధులు :
మానవ హక్కుల ఉల్లంఘన లేదా ఉల్లంఘనను నివారించటంలో ప్రభుత్వోద్యోగి విఫలమైనప్పుడు తనంతట తానుగానే . లేదా ఫిర్యాదు ఆధారంగా కాని విచారణ జరపడం. న్యాయస్థానాల అనుమతితో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కక్షిదారునిగా చేరటం.

జైళ్ళను ఇతర నిర్బంధ గృహాలను సందర్శించి తనిఖీ చేసి అక్కడ ఉన్నవారికి కనీస వసతుల కల్పనపై విచారించి అవసరమైన సూచనలివ్వడం వంటి విధులను నిర్వహించడం జరుగుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

9th Class Social Studies 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

పటం 1 : 1900 – 1950లలో ప్రజాస్వామ్య దేశాలు.
AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 1
పటం 2 : 2011లో ప్రజాస్వామిక దేశాలు
AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 2

ప్రశ్న 1.
అ) ఇచ్చిన పటాల ఆధారంగా కింద ఇచ్చిన పట్టికలోని ఖండాలలో ప్రజాస్వామిక దేశాల పేర్లు రాయండి. (AS5)
AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 3

ఆ) 2011లో ప్రజాస్వామికంగా ఉన్న ఆఫ్రికా దేశాలను గుర్తించండి.
జవాబు:

  1. దక్షిణాఫ్రికా
  2. నమీబియా
  3. బోట్సువానా
  4. మొజాంబిక్
  5. నైజీరియా
  6. జాంబియా
  7. టాంజానియా
  8. కెన్యా
  9. మడగాస్కర్
  10. మాలి
  11. సూడాన్

ఇ) 2011లో ప్రజాస్వామికం లేని పెద్ద దేశాలను గుర్తించండి.
జవాబు:

  1. చైనా
  2. కజకిస్థాన్
  3. సౌదీ అరేబియా
  4. అల్జీరియా
  5. జైరా
  6. అంగోలా
  7. ఇథియోపియా
  8. సోమాలియా

ప్రశ్న 2.
పటాలను అధ్యయనం చేసి కింది విషయాల గురించి ఆలోచించండి. (AS5)
అ) పటాల ఆధారంగా 20వ శతాబ్దం ప్రజాస్వామ్య విస్తరణకు ముఖ్యమైన యుగంగా పేర్కొనవచ్చా?
జవాబు:
అవును

ఆ) 20వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం ప్రధానంగా ……………….. ఖండాలలో ఉండింది. ఇంకోవైపు ……………., ………… ఖండాలలో దాదాపుగా ప్రజాస్వామిక దేశాలు లేవు.
జవాబు:
ఉత్తర అమెరికా, ఐరోపా ; ఆఫ్రికా, ఆసియా.

ఇ) ఈనాటికి కూడా ప్రజాస్వామిక ప్రభుత్వాలు లేని …………………… వంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.
జవాబు:
నైరుతీ ఆఫ్రికా, ఉత్తర ఆసియా.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
చాలా దేశాలు ఎన్నికలు నిర్వహిస్తూ తాము ప్రజాస్వామిక దేశాలమని పేర్కొంటాయి. ఈ ఎన్నికలు మయన్మార్, లిబియాలలో ఎలా జరిగాయి? (AS1)
జవాబు:
లిబియా వలస పాలన నుండి, రాచరిక పాలన నుండి గఢాఫి, సైనిక నియంతృత్వ పరిపాలన కొనసాగింది. అంచెలంచెలుగా అభివృద్ధి చెంది సామాజిక సంక్షేమంలో లిబియా అత్యున్నత స్థానాన్ని సాధించింది. ప్రజా సంఘాలను ఏర్పాటు చేయటం, కేంద్రంలో ఎన్నికైన ప్రజా శాసనసభ ద్వారా ప్రజా వ్యవహారాలలో సాధారణ ప్రజలు పాలుపంచుకోటాన్ని లిబియాలో ప్రోత్సహించారు. 2010 ద్వితీయార్ధం అరబ్ ప్రపంచంలో ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయటానికి అనేక ఉద్యమాలు చెలరేగాయి. అందులో లిబియా ఒకటి. సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. 2012 నుండి లిబియాలో ప్రజాస్వామ్య పద్ధతులలో ఎన్నికలు జరుగుతున్నాయి.

బర్మాలో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని, ప్రజలందరి హక్కులు కాపాడాలని బర్మన్ జాతి నాయకుడు ఆంగ్ సాన్ కృషి చేశాడు. కాని ఆయనను చంపేశారు. తదుపరి బర్మా సైన్యాధిపతి జనరల్ నెవిన్ అధీనంలోకి వెళ్ళిపోయింది. బర్మాలో సంక్షేమం జరగలేదు. సైన్యాధిపతులు హక్కులు ఉల్లంఘించారు. 1988 నుండి బర్మాలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి ఆంగ్ సాన్ సూకి కేంద్ర బిందువుగా మారారు. 2011లో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరుగగా 45 పార్లమెంట్ స్థానాలకు గాను 43 సీట్లు ఆంగ్ సాన్ సూకి సారథ్యం గల ఎన్ఎల్ డి గెలుచుకుంది. భవిష్యత్తులో పలు పార్టీలు పోటీచేసే ఎన్నికలు జరుగుతాయని ఆశిద్దాం.

ప్రశ్న 4.
ప్రసార మాధ్యమాల (మీడియా)ను నియంత్రించటానికి పాలకులు ఎందుకు ప్రయత్నించేవాళ్ళు? మీ ప్రాంతంలో ప్రసార మాధ్యమాలపై నియంత్రణ ఏవిధంగా ఉందో మీకు తెలుసా? (AS4)
జవాబు:
ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, ప్రజలలో రాజకీయ అవగాహన కల్గించి, విజ్ఞానవంతులను చేయడానికి ప్రసార మాధ్యమాలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ప్రసార మాధ్యమాలను పాలకులు తమ అధీనంలో ఉంచుకొని, వాటి ద్వారా ప్రజలను తమ పాలనపై మంచి అభిప్రాయం కలిగేటట్లు కార్యక్రమాలు రూపొందించేవాళ్ళు.

ప్రసార మాధ్యమాలను నియంత్రించకపోతే అవి పాలకుల అవినీతి, నిరంకుశత్వ నిర్ణయాలు, దోపిడీ పరిపాలన, ప్రజలను ఏవిధంగా మోసం చేసి పరిపాలిస్తున్నదీ తెలియజేసి ప్రజలను, ముఖ్యంగా యువత, మహిళలను చైతన్యపరిచినట్లైతే వారు నిరసనలు, ఉద్యమాల ద్వారా పాలకుల పాలనకు చరమగీతం పాడగలరు. చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు కలవు. అందుకే ప్రసార మాధ్యమాలను నియంత్రించేవాళ్లు.

మా ప్రాంతంలో రేడియో, దూరదర్శన్లు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఈ మాధ్యమాల కార్యక్రమాలు అమలుచేయటానికి వీలులేదు.

ప్రశ్న 5.
తమ దేశాలలోని ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటాలు, ఘటనల గురించి లిబియా, మయన్మార్‌కు చెందిన పౌరుల మధ్య సంభాషణను ఊహించి రాయండి. (AS6)
సంభాషణ
జవాబు:
లిబియా పౌరులు : వలస పాలనను ఎదిరించి, రాచరికాన్ని కాదని, సైనిక పాలనను తలదన్ని, మేం స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించాం…… చరిత్రలో గొప్పవాళ్ళమయ్యాం.

మయన్మార్ పౌరులు : ఆగండి…. ఆగండి… ఏమీ మీ ప్రేలాపనలు. మీదొక పేద దేశం…. తినడానికి తిండి లేని దేశం. ఎడారులలో పశువులతో సంచరిస్తూ గడిపే మీ జీవితం. మీదొక చరిత్ర. ప్రజాస్వామ్యం కోసం పోరాటం…..

లిబియా పౌరులు : మీరు సాధించినది ఏమిటి? మీలో ఐక్యత లేదు. ప్రజలకు హక్కులు లేవు. బానిస బతుకులు వేలాదిమంది చావులు. ప్రజాస్వామ్యానికొక విధానం లేదు.

మయన్మార్ పౌరులు : ప్రజాస్వామ్యం కోసం పరితపించాం. సైనిక పాలనను ఎదిరించాం. ఆంగ్ సాన్ సూకిలాంటి వాళ్ళు తమ జీవితాలనే త్యాగం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు.

లిబియా పౌరులు : మా ప్రజాస్వామ్య పోరాటాలకు ప్రపంచ మద్దతు ఉంది. ఐక్యరాజ్య సమితి సైతం మా పోరాటాలకు స్ఫూర్తి నిచ్చింది. ప్రజాస్వామ్య ఎన్నికలు జరుగుతున్నాయి.

మయన్మార్ పౌరులు : మా దేశంలో ఆంగ్ సాన్ సూకీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇదే మా ప్రజాస్వామ్య పోరాట స్ఫూర్తికి నిదర్శనం.

లిబియా పౌరులు : ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి నేడు మేం ప్రజాస్వామ్య సంబరాలకు దగ్గరౌతున్నాం…..

మయన్మార్ పౌరులు : మేము కూడా ఎన్నెన్నో పోరాట పతాకాలు ఎగురవేసి ప్రజాస్వామ్య వేడుకలకు వెళుతున్నాం…….

ప్రశ్న 6.
ప్రజాస్వామ్యం పనిచేయటంలో అక్షరాస్యత, అందరికీ చదువు ఏ విధంగా దోహదం చేస్తాయి? (AS6)
(లేదా)
ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పని చేయటంలో అక్షరాస్యత ఏ విధంగా దోహదం చేస్తుంది?
జవాబు:
ఏ దేశంలో అక్షరాస్యత అందరికీ చదువు అందుతుందో, ఆ దేశం ప్రజాస్వామ్యానికి బాటలు వేస్తుంది. ప్రజలు అక్షరాస్యులై విజ్ఞానవంతులైనచో పౌరహక్కుల వినియోగం, పౌరుల బాధ్యతలు సక్రమంగా అమలు జరుగుతాయి. ప్రజలలో పాలకులను ప్రశ్నించే తత్వం అలవడుతుంది. జవాబుదారీ పాలన కనపడుతుంది. అక్షరాస్యత, చదువుకున్న వాళ్ళలో కుటుంబ నిర్వహణ కాకుండా, తమ పనులలో, వృత్తులలో నైపుణ్యం చూపించి, ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగములలో అభివృద్ధి కనపడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలు అమలు జరుగుతున్నాయి.. ఇవన్నీ సక్రమ వినియోగం జరగాలంటే ప్రజలు ఖచ్చితంగా అక్షరాస్యులవ్వాలి. మహిళా చట్టాలు, సమన్యాయపాలన, వివక్ష, దోపిడీ పాలన వంటి వాటిని దూరం చేయడానికి అక్షరాస్యత అవసరం. చదువుకున్న, చైతన్యవంతులైన యువత ఉండే ఆ దేశంలో ప్రజాస్వామ్య ఫలాలు పదికాలాలు నిలుస్తాయి.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 7.
ప్రజాస్వామ్యం, నియంతృత్వాల మధ్య తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:

ప్రజాస్వామ్యం నియంతృత్వం
1. స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలుంటాయి. 1. రాచరిక, సైనికపాలన ఉంటుంది.
2. పౌరులకు హక్కులు కల్పించబడతాయి. 2. పౌరులకు హక్కులు అందించబడవు, నియంత్రించబడతాయి.
3. పత్రికా స్వేచ్ఛ ఉంటుంది. 3. పత్రికలపై ఆంక్షలు విధించబడతాయి.
4. ప్రజలే పాలకులు. 4. వంశపారంపర్య పాలన గాని, బలవంతంగా ఆక్రమించుకున్న పాలకులు.
5. లౌకిక రాజ్యం అమలులో ఉంటుంది. 5. అధికారిక మతం ఉంటుంది.
6. పాలకులకు జవాబుదారీ తనం ఉంటుంది. 6. జవాబుదారీ తనం ఉండదు.

ప్రశ్న 8.
మయన్మార్ లో ప్రజాస్వామ్యానికై పోరాడటంలో ఆంగ్ సాన్ సూకి పాత్ర ఏమిటి?
జవాబు:
తన తండ్రిగారైన బర్మన్ జాతి నాయకుడు ఆంగ్ సాన్ ఆశయాలు నిలబెట్టడానికి, బర్మాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటానికి జరుగుతున్న పోరాటాలు, నిరసనలకు ఆ నాటి నుంచి నేటి వరకు ఆంగ్ సాన్ సూకీ కేంద్రబిందువయ్యారు. పౌరహక్కులు విస్తరింపజేయాలని, ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నెలకొల్పాలని, సైనిక ప్రభుత్వంపై ప్రపంచదేశాల ఒత్తిడికి కారణం సూకీ నిరంతర పోరాటదీక్షే. 2008 నుండి బర్మాలో స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరిపించటానికి, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకురావడానికి సూకీ తన జీవితాన్ని ఫణంగా పెట్టారు. కాని సైనిక ప్రభుత్వం ఆమెను గృహ నిర్బంధంలో ఉంచి, తన కొడుకులను కలుసుకోకుండా, తన భర్త చనిపోయిన సందర్భంలో కూడా ఆమెకు స్వేచ్ఛ కల్పించలేదు.

అయినా ఆమె బర్మాలో స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి కృషిచేస్తూ (నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసి) “ జాతీయ ప్రజాస్వామ్య కూటమి” ద్వారా నిరంతరం పరితపిస్తూ, ప్రజాస్వామ్య ఫలాలు అందించడానికి తపిస్తున్నారు. ఈమె కృషికి 1991 లోనే ప్రపంచ శాంతి బహుమతి అందుకుంది.

ప్రశ్న 9.
ఈ అధ్యాయం చివరి పేరా చదివి కింది ప్రశ్నకు సమాధానమివ్వండి.
నూతన ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది? (AS2)
జవాబు:
దేశాలు ఎదుర్కొనే సంక్లిష్ట సమస్యలలో కొన్నింటిని పరిష్కరించటానికి ప్రజలందరి స్వేచ్ఛను, హక్కులను గౌరవించే
ప్రజాస్వామ్యమే సరైన మార్గమని అందరికీ స్పష్టమవుతుంది. అత్యంత పేద ప్రజలు, బలహీన వర్గాలు కూడా తమ గొంతుక వినిపించి ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగల, అందరికీ న్యాయం, శాంతిని అందించగల నూతన ప్రజాస్వామిక విధానాన్ని రూపొందించటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోంది.

9th Class Social Studies 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం InText Questions and Answers

9th Class Social Textbook Page No.235

ప్రశ్న 1.
ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచటంలో ఈ రకమైన పరిస్థితులు ఎటువంటి సమస్యలను సృష్టిస్తాయి?
జవాబు:
జాతుల ప్రాబల్యం, సంచారజీవనం, నిరక్షరాస్యత, మహిళలపై ఆంక్షల నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ పాలు పంచుకునేలా చేయటం చాలా కష్టమైన విషయం. ఇటువంటి పరిస్థితులలో ప్రజా సంఘాలను ఏర్పాటుచేయటం, కేంద్రంలో ఎన్నికైన ప్రజా శాసనసభ ద్వారా ప్రజా వ్యవహారాలలో సాధారణ ప్రజలు పాలుపంచుకోవటం చాలా సమస్యతో కూడుకున్న వ్యవహారం.

9th Class Social Textbook Page No.237

ప్రశ్న 2.
గఢాఫి ప్రభుత్వం వల్ల ఎంతో ప్రయోజనం పొందినప్పటికీ దానికి వ్యతిరేకంగా ఎందుకు తిరుగుబాటు చేశారు?
జవాబు:
గఢాఫి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి లిబియాను అన్ని రంగాలలో ముందుంచింది. ఎన్నికైన ప్రజాసంఘాలు ద్వారా పరిపాలనకు మధ్యతరగతి వర్గం ప్రోత్సహించింది. కాని గఢాఫి ప్రజాస్వామ్యాన్ని నమ్మలేదు. గఢాఫి ప్రజా సంఘాలకు సమాంతరంగా విప్లవ సంఘాల నాయకత్వ వ్యవస్థను ఏర్పరిచారు. రాజకీయ ప్రత్యర్థులను చంపటానికి, చిత్రహింసలు పెట్టడానికి, చంపేయటానికి గఢాఫి ప్రభుత్వం సంకల్పించింది. రాజకీయ పార్టీలకు అవకాశం లేదు. పత్రికా స్వేచ్ఛ లేదు. కనుకనే వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
గఢాఫి తనది ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకున్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ఉండవలసిన ఏ అంశాలు అందులో లోపించాయి? ప్రజాస్వామిక ప్రభుత్వంలోని ఏ అంశాలు అందులో ఉన్నాయి?
జవాబు:
గఢాఫి రాచరికాన్ని రద్దుచేసి సైనిక పాలనలో ప్రభుత్వాన్ని ఏర్పరచినప్పటికీ ప్రజాసంక్షేమంకై అనేక సంస్కరణలు, పథకాలు అమలుచేసినప్పటికీ అందులో ప్రధానంగా ప్రజా సంఘాలను నమ్మటానికి సాహసించలేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రధానపాత్ర పోషిస్తాయి. కాని గఢాఫి ఏ రాజకీయ పార్టీలకు అవకాశం కల్పించలేదు. కార్మిక సంఘాలు, ఇతర స్వతంత్ర సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజకీయ ప్రత్యర్థులను హింసించటానికి పూనుకున్నారు. పత్రికలకు స్వేచ్ఛలేదు.

ప్రజాస్వామిక అంశాలు కూడా ఉన్నాయి.

  • అందరికీ విద్య, వైద్య సదుపాయాలు కల్పించారు.
  • వివక్షతను దూరం చేసి మహిళలకు స్వేచ్ఛ, సమాన హెూదా కల్పించటానికి కృషి చేశారు.
  • భూపంపిణీ, భూసంస్కరణలు అమలుచేశారు.
  • సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేశారు.

ప్రశ్న 4.
ప్రజాస్వామ్యానికి పౌరహక్కులు ఉండటం ఎందుకు ముఖ్యం? లిబియా అనుభవం నేపథ్యంలో వివరించండి.
జవాబు:
లిబియాలో పౌరహక్కులకు భంగం కలిగించే అనేక అంశాలు గమనించవచ్చు. మహిళలపై అణచివేత దృశ్యాలు, ప్రజల సంక్షేమం కంటే పాలకులకు జాతి సంక్షేమం, గౌరవం ప్రధానంగా ఉండేవి. ప్రభుత్వంపై విమర్శలను, వ్యతిరేకతను సహించే అవకాశం లేదు. పత్రికా స్వేచ్ఛ, సమన్యాయ పాలన లేకపోవడం పౌరహక్కులు ముఖ్యమని వివరించవచ్చు.

ప్రశ్న 5.
పత్రికలు, టివి వంటి ప్రసార సాధనాలను నియంత్రించటానికి నిరంకుశ పాలకులు ప్రయత్నిస్తారు. ప్రజలు తమ ఆలోచనలను, సమాచారాన్ని పంచుకోగల ఇతర మాధ్యమాలు మీకు తెలుసా?
జవాబు:
సమావేశాలు, వారం వారం జరిగే సంతలు, వివిధ జానపద కళారూపాలు, బుర్రకథ, నాటకాలు, బృందగానాలు, జముకుల కథలు, వివిధ కళారూపాలు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, ఫేస్ బుక్కులు వగైరా.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 6.
ఒక వ్యాపారి చనిపోవటంతో ట్యూనీసియా పోరాటం మొదలైంది. అంతర్జాల వేదికలైన “ఫేస్ బుక్” వంటి వాటి ద్వారా ఉద్యమం బలోపేతం అయ్యింది. ప్రభుత్వం ఇటువంటి వాటిని నియంత్రించటం అంత తేలిక ఎందుకు కాదు?
జవాబు:
ఒకప్పుడు ప్రసార మాధ్యమాలు ద్వారానే ప్రజాచైతన్యం, అవగాహన కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు జరిగేవి. అంతేకాకుండా . వాటి నియంత్రణతో ఎటువంటి చైతన్యం ప్రజలలో వచ్చేది కాదు. కాని కాలగమనంలో వచ్చిన అనేక సాంకేతిక, వైజ్ఞానిక అభివృద్ధితో ప్రజల ఆలోచనలలో చాలా మార్పు వచ్చినది. ఇతరులకు తెలియకుండా, ప్రభుత్వ పరిశీలనకు అందకుండా ఒకరి భావాలు ఒకరు తెలుసుకుని పాలకులపై సమర శంఖం పూరించడానికి అవకాశాలు మెరుగయ్యాయి. ఇటువంటి శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని నియంత్రించడం అంత తేలిక కాదు.

9th Class Social Textbook Page No.240

ప్రశ్న 7.
స్వాతంత్ర్యం తరువాత బర్మాలో ప్రజాస్వామ్యం ఎందుకు నిలదొక్కుకోలేకపోయింది?
జవాబు:
బర్మా మనకు స్వాతంత్ర్యం లభించిన 5 నెలల తరువాత స్వాతంత్ర్యం పొందినప్పటికీ వివిధ జాతులకు తమ హక్కులు, స్వయం నిర్ణయ హక్కుల కొరకు కృషి చేసిన బర్మన్ నాయకుడు ఆంగ్ సాన్ని చంపేశారు. ఆ తదుపరి బర్మా సైన్యం సైనిక బలగంతో పాలన చేజిక్కించుకుంది. బర్మాను పాలించిన సైన్యాధిపతులు మానవహక్కులు కాలరాసారు. ప్రజలు, పిల్లలు అనే తేడా. లేకుండా వెట్టిచాకిరి చేయించారు. ప్రజాస్వామ్యభావాలు, ఉద్యమాలు ప్రజలలోకి వెళ్ళకుండా సైనిక పాలకులు నియంతృత్వ పాలన కొనసాగించడంతో ప్రజాస్వామ్యం నిలదొక్కుకోలేక పోయింది, ప్రజాస్వామ్య పోరాట పటిమ కనపరిచిన ఆంగ్ సాన్ సూకీ లాంటి వారిని గృహ నిర్బంధం చేశారు.

ప్రశ్న 8.
స్వాతంత్ర్యం తరువాత లిబియాలో ప్రజాస్వామ్యం ఎందుకు నిలదొక్కుకోలేకపోయింది?
జవాబు:
1951లో లిబియా స్వాతంత్ర్యం పొందినప్పటికీ పేద దేశం. రాచరికం తరువాత దేశ అభివృద్ధి కొరకు ప్రజల సంక్షేమం కొరకు యువత తీవ్రంగా కృషి చేసింది. 1969 నుండి మువమ్మర్ గఢాఫి రాచరికాన్ని కాదని, సైనిక పాలనలో ప్రజాస్వామ్య కార్యక్రమాలతో లిబియాను అన్ని రంగాలలో ముందుంచాడు. అయితే ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ప్రజా సంఘాల ఏర్పాటును గఢాఫి నేతృత్వంలో తిరస్కరించారు. ప్రజలకు హక్కులు ఇవ్వక, స్వేచ్చలేక నిరంకుశ పాలనకు పూనుకున్నారు. ఉద్యమాలు, తిరుగుబాట్లు, హింసాత్మక ఘటనలు వలన లిబియాలో ప్రజాస్వామ్యం నిలదొక్కుకోలేకపోయింది.

ప్రశ్న 9.
లిబియా, బర్మాలలో స్వాతంత్ర్యం తీసుకురావటంలో విద్యార్థులు, యువత ప్రముఖ పాత్ర ఎందుకు పోషించారు?
జవాబు:
రెండు దేశాలలో యువత, విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించారు. రెండు దేశాలలో కూడా సైనిక పాలనతో పౌరహక్కులు దూరమై, దేశ సంపదలు కొల్లగొట్టడమే కాకుండా వలస శక్తులు వలన దేశాలు నిర్వీర్యమయ్యాయి. విజ్ఞానవంతులైన యువత తమ దేశంలో గల దుర్భర పరిస్థితులు, బానిసత్వం, స్త్రీలకు గల కట్టుబాట్లు, అణచివేత ధోరణులు, వివిధ జాతుల మధ్య యుద్ధ వాతావరణం నుండి తమ దేశాలను రక్షించడానికి విద్యార్థులు, యువత ముందుకు వచ్చారు. దేశంలో శాంతిని, ఐక్యతను కాపాడి ప్రపంచ దేశములలో అగ్రగామిగా ఉండాలని యువత పూనుకున్నారు.

ప్రశ్న 10.
లిబియా, బర్మా ఘటనలలో ఎటువంటి పోలికలు మీకు కనపడ్డాయి? వీటిని దృష్టిలో ఉంచుకోండి – నాయకత్వం, పోరాట స్వరూపం, మార్పు ప్రక్రియ.
జవాబు:
నాయకత్వం :

  • రెండు దేశాల నాయకులు సైనికపాలనే అమలుచేశారు.
  • స్వేచ్ఛగా భయంలేని వాతావరణంలో జరిగిన ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాన్ని రెండుదేశాల ప్రజలు కోరుతున్నారు.
  • గఢాఫి సైనిక పాలనలో ప్రజాస్వామ్య భావాలు అమలుచేయడానికి ప్రయత్నించాడు.
  • ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు, నాయకత్వం కొరకు ఆంగ్ సాన్ సూకీ ప్రయత్నం చేశారు.
  • లిబియా సైన్యాధిపతి గఢాఫి అయితే బర్మా సైన్యాధిపతి జనరల్ నెవిన్ దేశ అధికారాన్ని ఆక్రమించుకున్నారు.
  • రెండు దేశాలను సైన్యం నుంచి ప్రధాన మద్దతు పొందిన వ్యక్తులు పాలించారు.

పోరాట స్వరూపం :

  • లిబియాలో ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చెలరేగాయి.
  • బర్మాలో సైనికపాలనకు వ్యతిరేకంగా నిరసనలు ఉద్యమాలు జరిగాయి.
  • లిబియాలో నిరసనకారులు, ఉద్యమకారులపై బెంఘాజి వంటి పట్టణాలలో భద్రతాదళాలు కాల్పులు జరిపి చంపించారు.
  • బర్మాలో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు నిరసనలో వేలమందిని చంపించారు.

మార్పు ప్రక్రియ :

  • సైనిక ప్రభుత్వ పాలన నుండి రెండు దేశాలు మార్పు కోరుకోవాలి.
  • రెండు దేశాలలో చివరకు ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు కారణమైంది.
  • ప్రజలు రెండుదేశాల సైనిక పాలనకు చరమగీతం పాడాలని, దానికి అనుగుణంగా మార్పు జరిగింది.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 11.
ఆ రెండు దేశాలలో ప్రజాస్వామ్యంగా మారే. నేపథ్యంలో ప్రధాన తేడాలు ఏమిటి?
వీటిని దృష్టిలో ఉంచుకోండి. నాయకత్వం, పోరాట స్వరూపం, మార్పు ప్రక్రియ.
జవాబు:
నాయకత్వం :
బర్మా తన ప్రస్థానాన్ని ప్రజాస్వామిక దేశంగా మొదలు పెట్టి సైనికపాలనలోకి మారితే, లిబియా రాచరికాన్ని వదిలించుకుని, సైనికపాలనతో అంతం అయింది. లిబియాలో సైనిక ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు గఢాఫీ నేతృత్వంలో ప్రవేశపెట్టింది.

కాని బర్మాలో పాలకులు ఎటువంటి అభివృద్ధికి అవకాశం ఇవ్వలేదు.

లిబియాలో నాయకులను గృహ నిర్బంధం చేయలేదు. కాని బర్మాలో ప్రజాస్వామ్య పోరాటం కొరకు కృషి చేస్తున్న ఆంగ్ . సాన్ సూకిని గృహ నిర్బంధం చేశారు.

పోరాట స్వరూపం :

  • ప్రజాసంఘాలను వ్యతిరేకిస్తూ గఢాఫి రివల్యూషనరీ కౌన్సిల్ ద్వారా విప్లవసంఘాలను ఏర్పరిచాడు.
  • జాతీయ ప్రజాస్వామ్య కూటమి ద్వారా ప్రజా ఉద్యమాలు.
  • రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయటానికి, చిత్రహింసలు పెట్టడానికి, సైనికశక్తిని ఉపయోగించుకుంది లిబియా.
  • బర్మాలో పాలకులు గృహ నిర్బంధంలో ఉంచి పోరాటస్ఫూర్తిని అడ్డగించాలని చూసింది.
  • లిబియా పోరాటంలో. యువత ప్రధాన పాత్ర పోషించగా బర్మాలో విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించారు.
  • లిబియా పోరాటానికి, నిరసనలకు, ఐక్యరాజ్యసమితి మద్దతు పలకగా, బర్మా పోరాటానికి ప్రపంచం అంగీకారం తెలిపింది.

మార్పు ప్రక్రియ :

  • లిబియాలో సంక్షేమ ఫలాలు అందించి, తమ ప్రభుత్వ ప్రాబల్యం పెంచుకోడానికి కృషి చేసింది.
  • బర్మాలో సంక్షేమ ఫలాలు అందించకుండా ప్రజలను పేదరికంలోకి నెట్టారు.
  • లిబియాలో మార్పు చాలా ఆలస్యమైంది.
  • బర్మాలో మార్పు కొరకు స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి మొదలైంది.
  • బర్మాలో ఎన్నికలు ద్వారా ప్రజాస్వామ్య విధానంలో పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
  • లిబియాలో రాజకీయ పార్టీలకు ఇంకా అవకాశం ఇవ్వలేదు.
  • లిబియాలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు ఉపయోగించుకున్నారు.
  • బర్మాలో ఆ వాతావరణం ఇంకా అభివృద్ధి చెందలేదు.

ప్రశ్న 12.
రెండు దేశాల వివరణలలో రాజకీయ పార్టీలు, ఓటింగ్ కి సంబంధించిన వాక్యాలను గుర్తించండి.
జవాబు:
రెండు దేశాలలో రాజకీయ పార్టీలు రావాలని, ప్రజాస్వామ్య పద్దతిలో ఓటింగ్ జరగాలని వాంఛించాయి. లిబియాలో పార్టీలు ప్రతినిధులను లిబియాలో 200 మందిని ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. బర్మాలో కూడా జాతీయ ప్రజాస్వామ్య కూటమి ద్వారా జరిగిన ఓటింగ్ లో 80 శాతం సీట్లు సాధించాయి.

2011లో బర్మాలో 45 పార్లమెంట్ స్థానాలకు 43 స్థానాలు సూకి పార్టీ అయిన ఎన్ఎల్ డి గెలుచుకుంది.

రెండు దేశాలలో రాజకీయపార్టీలు ద్వారా, ఓటింగ్ ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్య భావాలు, పౌరహక్కులు పొందవచ్చని తలంచి ఆ దిశగా పయనిస్తున్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 13.
2012 సంవత్సరంలో లిబియా, బర్మాలలో వచ్చిన మార్పులను రాయండి.
జవాబు:
విప్లవం విజయవంతం, గఢాఫి మరణం తరువాత లిబియాలో వంద రాజకీయ పార్టీలు పోటీచేయగా ప్రజలు స్వేచ్చగా ఎన్నికలలో పాల్గొని 200 మంది ప్రతినిధులను ఎన్నుకున్నారు. 2012 నవంబర్ 14న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసింది. ఒక తాత్కాలిక రాజ్యాంగం ఏర్పడింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్య మనగలిగి, ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడే దారులు కనిపిస్తున్నాయి.

బర్మాలో 2008 నుంచి మార్పులు సంభవించి ప్రజాస్వామిక గణతంత్రంగా మారింది. 2010లో ఐక్యరాజ్యసమితి పరిశీలనలో ఎన్నికలు జరిగాయి. ఆ తదుపరి 2011లో జరిగిన ఎన్నికలలో ఆంగ్ సాన్ సూకి ఎస్ఎల్ విజయవంతంగా విజయం పొందడం ప్రజాస్వామ్యానికి ఆరంభంగా చెప్పవచ్చు. లిబియాలాగా బర్మా కథ ఇంకా పూర్తికాలేదు. దేశం పూర్తి ప్రజాస్వామికంగా మారుతుందని, భవిష్యత్తులో పలు పార్టీలు పోటీచేసే ఎన్నికలు నిర్వహిస్తారని ఆశిస్తున్నారు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
వార్తాపత్రికలు చదివి లిబియా, ఈజిప్టు లేదా ఇతర దేశాలలో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న ప్రయత్నాలపై వార్తలను కత్తిరించండి. వీటిని కాగితాలపై అంటించి తరగతిలో ప్రదర్శించండి.

పటనైపుణ్యం

ప్రశ్న 1.
ప్రపంచ పటంలో లిబియా, మయన్మార్ లను గుర్తించండి. అవి ఏ ఖండాలలో ఉన్నాయి?
AP Board 9th Class Social Solutions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం 4
ఇవి ఆఫ్రికా, ఆగ్నేయాసియా ఖండాలలో ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

SCERT AP 9th Class Social Studies Guide Pdf 24th Lesson రోడ్డు భద్రతా విద్య Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 24th Lesson రోడ్డు భద్రతా విద్య

9th Class Social Studies 24th Lesson రోడ్డు భద్రతా విద్య Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
వాహన చోదకులు ఏ విధమైన ధృవపత్రాలను తమ వెంట ఉంచుకోవాలి? ఏ విధమైన నైపుణ్యాలు భద్రతాపరమైన డ్రైవింగ్ కు అవసరం.? (AS1)
జవాబు:
వాహన చోదకులు ఈ క్రింది పేర్కొన్న ధ్రువపత్రాలను తమ వెంట ఉంచుకోవాలి.

  1. డ్రైవింగ్ లైసెన్స్
  2. వాహన రిజిస్ట్రేషన్
  3. వాహనం యొక్క ఇన్స్యూరెన్స్
  4. వాహనం యొక్క కాలుష్యరహిత ధ్రువపత్రం

భద్రతాపరమైన డ్రైవింగ్ కు నైపుణ్యాలు :

  1. రక్షిత, ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి.
  2. ట్రాఫిక్ సిగ్నల్స్ ను అతిక్రమించరాదు.
  3. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ లు ఉపయోగించాలి.
  4. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి.
  5. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరాదు.

ప్రశ్న 2.
ట్రాఫిక్ గుర్తులను ఒకవేళ ఎవరైనా పాటించకుండా వెళితే ఏమవుతుంది? (AS1)
జవాబు:

  1. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది.
  2. ప్రమాదాలు ఒక్కొక్కసారి తీవ్ర గాయాలకు, అంగవైకల్యానికి దారితీయవచ్చు.
  3. ఘోర ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను కోల్పోవటానికి అవకాశం ఉంటుంది.
  4. ట్రాఫిక్ గుర్తులను పాటించకపోవడం వలన మనకు మాత్రమేగాక ఎదుటివారికి కూడా హాని జరగవచ్చు.
  5. విలువైన వాహనాలు దెబ్బతింటాయి.
  6. అందువల్ల ట్రాఫిక్ గుర్తులను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకుంటూ, ఎదుటివారి ప్రాణాలకు కూడా రక్షణ కల్పిస్తే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 3.
రోడ్డు భద్రతకుగాను మీ ప్రాంతంలో తీసుకుంటున్న చర్యలను సూచించండి. (AS4)
జవాబు:
రోడ్డు భద్రతకుగాను మా ప్రాంతంలోని వివిధ వర్గాల వారు తీసుకుంటున్న చర్యలు :
డ్రైవర్ తీసుకుంటున్న చర్యలు :

  1. ఎడమవైపున ఉండి కుడివైపున వేగంగా వెళ్లే వాహనాలకు దారి వదులుతున్నారు.
  2. ఎడమవైపు నుంచి వాహనాలను దాటరు.
  3. రక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ హెల్మెట్ ధరిస్తారు.
  4. తక్కువ కార్బన్ మోనాక్సైడ్ వదిలే వాహనాలనే ఉపయోగిస్తున్నారు.
  5. అనవసరంగా హారన్ మోగించరు.
  6. భారీ వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టులు ఉపయోగిస్తున్నారు.
  7. ట్రాఫిక్ సిగ్నలను అతిక్రమించరు.
  8. తమ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుతారు.
  9. ఆల్కహాల్ సేవించి వాహనాలను నడపరు.
  10. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరు.

పాదచారులు పాటిస్తున్న నిబంధనలు :

  1. పాదచారులకు నిర్దేశించిన మార్గంలోనే నడుస్తారు. ఒకవేళ అలాంటి ప్రత్యేక మార్గం లేకుంటే, రోడ్డు ఇరుకుగా ఉంటే రోడ్డుకు కుడివైపునే ఎదురుగా వస్తున్న వాహనాలను పరిశీలిస్తూ నడుస్తారు.
  2. రాత్రివేళ బయట రోడ్డుపై నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రతిబింబించే దుస్తులను ధరిస్తారు.
  3. రాత్రివేళల్లో నడిచేటప్పుడు విధిగా టార్చిలైట్ దగ్గర ఉంచుకుంటారు.
  4. రోడ్డును దాటునపుడు ఎడమవైపు, కుడివైపు చూసి వాహనాలు రాకుండా ఉన్నప్పుడు దాటుతారు.
  5. ఒకవేళ వాహనాలు రెండువైపులా, వస్తూ ఉంటే అవి వెళ్లే వరకు వేచి ఉంటారు.
  6. వాహనాలు రాకుండా ఉన్నప్పుడు వేగంగా నడుచుకుంటూ రోడ్డును దాటుతారు. రెండువైపులా వాహనాలు వస్తున్నాయో లేదో గమనిస్తారు.
  7. రోడ్డును దాటుటకు జీబ్రా క్రాసింగ్ ను ఉపయోగిస్తారు.
  8. రోడ్డుపై నడుస్తున్నపుడు, రోడ్డును దాటుతున్నపుడు మొబైల్ ఫోన్ ను ఉపయోగించరు.
  9. ట్రాఫిక్ పోలీస్ సహాయంతో రోడ్డును దాటుతారు.

ప్రశ్న 4.
తప్పనిసరిగా, జాగ్రత్తపడే, సమాచార నిమిత్తం ఉన్న ట్రాఫిక్ గుర్తులను ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
ట్రాఫిక్ గుర్తులు :

  1. తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు
  2. సమాచార గుర్తులు
  3. జాగ్రత్తపరచే గుర్తులు.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 4

ప్రశ్న 5.
కమల ఒక నూతన వాహనాన్ని కొనాలని భావించింది. ఆమెకు ఏ విధమైన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమవుతాయో వివరించండి. (AS1)
జవాబు:
కమల ఒక నూతన వాహనాన్ని కొనాలని భావించినప్పుడు ఆమెకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు :

  1. అమ్మకం చేసినట్లుగా డీలర్ నుంచి ధ్రువపత్రం
  2. రోడ్డుపై నడపటానికి వీలైనది అని తెలిపే ధ్రువీకరణ పత్రం
  3. వాహన బీమా ధ్రువపత్రం
  4. కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం
  5. నివాస రూఢీ ధ్రువపత్రం

శాశ్వత రిజస్ట్రేషన్ :
తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించేటపుడు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత దరఖాస్తుతో పాటుగా ఆర్.టి.ఏ అధికారులకు ఒక నెలలోపుగా సమర్పించి శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 6.
రాము తన వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను వేరే వాహనానికి మార్చాలని భావించాడు. ఇది చేయవచ్చా చేయకూడదా? ఎందుకో వివరించండి. (AS6)
జవాబు:
రాము తన వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ను వేరే వాహనానికి మార్చడానికి వీల్లేదు. ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌కు, వేరొక రిజిస్ట్రేషన్ నెంబర్‌కు పోలిక ఉండదు.

అలా మార్చడం వలన :

  1. ప్రమాదాలు జరిగిన సమయంలో ఇబ్బందులు ఎదురౌతాయి.
  2. నియమ నిబంధనలకు వ్యతిరేకం.
  3. ఒక్కొక్క నెంబరు ప్రారంభం ఒక్కొక్క వాహనానికి వేరేగా ఉంటుంది.
  4. రిజిస్ట్రేషన్ సందర్భంలో ఆర్.టి.ఏ. అధికారులకు అప్పగించిన ధృవపత్రాలలో తేడా రాకూడదు.
  5. అలా మార్చిన వాహనాలను ఆర్.టి.ఏ. అధికారులు సీజ్ చేస్తారు.

కాబట్టి ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ను వేరొక రిజిస్ట్రేషన్ నెంబరుకు మార్చకూడదు.

ప్రశ్న 7.
రోడ్డు భద్రతా ఆవశ్యకతను వివరించండి. (AS1)
జవాబు:

  1. జనాభా, పారిశ్రామికీకరణ, నగరీకరణ, గ్లోబలైజేషన్ వంటి వాటి పెరుగుదల వాహనాల రద్దీని కూడా పెంచింది.
  2. అందువల్ల రవాణా సులభతరం కావడానికి ఒక క్రమబద్ధీకరణ అవసరం.
  3. క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారందరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించడమే.
  4. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం రోడ్డును ఉపయోగించుకునే ప్రతి ఒక్కరి బాధ్యత.
  5. రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోతే ప్రాణాంతకమైన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది.
  6. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా మనం సుఖంగా ఉండడమే గాక తోటి ప్రయాణికులను కూడా సుఖంగా ఉంచవచ్చును.

ప్రశ్న 8.
పేజీ నెం. 286లోని ‘ప్రమాద బాధితులు – వయస్సు’ పట్టిక చదివి అత్యధిక కేసులు నమోదైన వయస్సు వారిని గుర్తించి, బార్ ను గీయండి. (AS3)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 5

ప్రశ్న 9.
పేజీ నెం. 287లోని ‘ట్రాఫిక్ ఇబ్బందులు’ అంశాన్ని చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ఇప్పుడు ప్రతీ పట్టణంలో, నగరాలలో అతి ముఖ్యమైన సమస్య ట్రాఫిక్ ఇబ్బందులు (గందరగోళం) తెల్లవారి లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వివిధ పనులు నిమిత్తం, ఉద్యోగ రీత్యా ప్రజలు వాహనాలనే ఉపయోగించే తమ ప్రయాణాలు చేయడం వలన ట్రాఫిక్ జాంకు కారణమౌతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, డాక్టర్లు ఇలా ఎందరో వివిధ పనుల నిమిత్తం బయలుదేరి ట్రాఫిక్ లో చిక్కుకుని బాధలు అనుభవిస్తుంటారు. డ్రైనేజీ నిర్మాణం సక్రమంగా లేకపోవడం, వీధుల్లో సంచరించే జంతువులు, పండ్లు, కూరగాయల వ్యాపారులు, వాహనదారులు ముఖ్యంగా కారు, ఆటో రిక్షా వారు “నిలుపుటకు వీలులేదు” అనే ప్రదేశంలో వాహనాలు నిలుపుట వల్ల ట్రాఫిక్ జాంకు కారణమౌతున్నాయి.

కాబట్టి వీలైనంత వరకు దగ్గర పనులకు నడవడం ద్వారా కొంత వరకు ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు.

9th Class Social Studies 24th Lesson రోడ్డు భద్రతా విద్య InText Questions and Answers

9th Class Social Textbook Page No.286

ప్రశ్న 1.
ఏ గ్రూపు వయస్సు వారిపై ఎక్కువ కేసులు ఉన్నాయి? ఎందుకో మీరు చెప్పగలరా?
జవాబు:
25 – 30 సం||రాల మధ్య వయస్కులపై ఎక్కువ కేసులు ఉన్నాయి. వారిపై ఎక్కువ కేసులు ఉండటానికి కారణం :

  1. ప్రతి విషయంలోనూ ఈ వయస్సువారు దుడుకుతనంతో వ్యవహరిస్తారు.
  2. తనకు నచ్చినట్లే చేయాలనే స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు.
  3. వివిధ అవసరాల నిమిత్తం రోడ్డును ఎక్కువగా ఉపయోగిస్తున్నది కూడా ఈ వయస్సు వారే.
  4. ఈ వయస్సులోనివారు స్వతంత్రతను ఎక్కువగా కోరుకోవడంతో వారు ప్రమాదాలను కూడా ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తున్నది.
  5. కాబట్టి ఈ వయస్సు వారే ఎక్కువగా ప్రమాదాలకు గురౌతున్నారు.

ప్రశ్న 2.
20 – 25, 25 – 30 వయస్సు వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి?
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 2

9th Class Social Textbook Page No.287

ప్రశ్న 3.
ఈ చిత్రాన్ని పరిశీలించి ప్రమాదాలకు గురైన వాహనాల యొక్క సమాచారంతో మీ తరగతిలో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 1

హైదరాబాద్ నగరం

ద్విచక్ర వాహనాల ప్రమాదాల శాతం 30%
త్రిచక్ర వాహనాల ప్రమాదాల శాతం 11%
నాలుగు చక్రాల వాహనాల ప్రమాదాల శాతం 28%
డి.సి.యంల ప్రమాదాల శాతం 3%
తెలియని వాహనాల ప్రమాదాల శాతం 5%
ఆర్టీసీ బస్సుల ప్రమాదాల శాతం 11%
ప్రైవేట్ బస్సుల ప్రమాదాల శాతం 1%
ట్రక్కుల ప్రమాదాల శాతం 5%
టెంపోట్రాలి ప్రమాదాల శాతం 2%
ఇతరములు 4%
మొత్తం ప్రమాదాల సంఖ్య 2577

ప్రశ్న 4.
ఏ రకమైన వాహనాలు ఎక్కువ ప్రమాదాలకు కారణం అయ్యాయి. ఎందుకో చెప్పగలవా?
జవాబు:
ద్విచక్రవాహనాలు ఎక్కువ ప్రమాదాలకు కారణం అయ్యాయి. ఎందుకంటే

  1. యువకులు ఆ వాహనాలను ఎక్కువగా ఉపయోగించటం.
  2. వారు రోడ్డు నియమ నిబంధనలను పాటించకపోవటం.
  3. ద్విచక్ర వాహనాలకు ప్రమాదం జరగటం సులభతరం.

AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య

ప్రశ్న 5.
రోడ్డు నియమ నిబంధనలు అంటే ఏమిటో మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:

  1. రోడ్డు నియమ నిబంధనలు అనగా రోడ్డుపై వెళ్ళువారు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు.
  2. అలా పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
  3. కారణం జనాభా విపరీతంగా పెరగడం వలన, రోడ్లు ఇరుకుగా ఉండటం వలన, రోడ్డు పైకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
  4. రోడ్డు పైకి వచ్చేవారు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు త్వరగా వెళ్ళాలి అనే భావంతో ప్రయాణించడం వలన ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది.
  5. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే రోడ్డుపైకి వచ్చేవారు కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. దానితో ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుంది.

9th Class Social Textbook Page No.288

ప్రశ్న 6.
డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తప్పనిసరిగా కలిగి ఉండాలి?
జవాబు:
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరాదు. ఇది ఎవ్వరికీ, మినహాయింపు కాదు.
డ్రైవింగ్ లైసెన్స్ రకాలు :
1) లెర్నర్ లైసెన్స్ :
ఇది తాత్కాలికమైనది. డ్రైవింగ్ నేర్చుకొనుటకు ఆరునెలల కాల పరిమితితో దీనిని జారీ చేస్తారు.

2) శాశ్వత లైసెన్స్ :
తాత్కాలిక లైసెన్స్ జారీచేసిన ఒక నెల తరువాత నుంచి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు డ్రైవింగ్ చేసే విధానం అంతా పరిశీలించి ఇస్తారు కాబట్టి రోడ్డుపై వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి మరియు డ్రైవింగ్ విధి విధానాలు తెలిసిఉండాలి. కావున రోడ్డుపై వాహనాలు నడుపువారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

9th Class Social Textbook Page No.290

ప్రశ్న 7.
మీ టీచర్ సహాయంతో రోడ్డు ఉపరితలంపై సూచించే గుర్తులను ఆర్.టి.ఏ అధికారులు / ట్రాఫిక్ పోలీసుల నుంచి సేకరించి వివిధ గుర్తుల ద్వారా కలిగే ప్రయోజనాలను మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
రోడ్డుపైన సూచించే గుర్తులు :
రోడ్డు ఉపరితలంపై పొదచారుల కోసం, వాహన చోదకులకు మార్గ నిర్దేశనం చేయుటకు ఈ గుర్తులు ఉపయోగిస్తారు. రోడ్డుపై గందరగోళాన్ని, అగమ్యాన్ని నివారించడానికి ఒకే విధమైన గుర్తులను ఉపయోగిస్తారు.

1) పాదచారుల దారి :
రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడవటానికి వీలుగా ఉండే దారి. ఇది సుమారు రెండు మీటర్లు వెడల్పు ఉంటుంది.

2) డివైడర్ :
రోడ్డును రెండు సమాన భాగాలుగా విభజించేది.

3) జీబ్రా క్రాసింగ్ :
పాదచారులు రోడ్డును ఒక వైపు నుంచి మరొక వైపునకు దాటడానికి ఉద్దేశించినది.

రోడ్డుపై సూచించే గుర్తుల వల్ల ప్రయోజనాలు :

  1. పాదచారుల దారి మీదకు వాహనాలు ఏవీ రావు కాబట్టి పాదచారులు నడవటానికి అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైన ప్రమాదాలు సంభవించవు.
  2. రోడ్డును రెండు సమానభాగాలుగా విభజించటం వలన ఏ విధమైన రాకపోకలకు అవాంతరాలు ఎదురుకావు మరియు ప్రమాదాలు జరగవు.
  3. జీబ్రా క్రాసింగ్ అనేది పాదచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశము. వాహనాలు జీబ్రా క్రాసింగ్ గుర్తులున్నచోట నెమ్మదిగా వెళ్తాయి కాబట్టి పాదచారులు రోడ్డు దాటవలసి వస్తే ఇక్కడే దాటాలి. దీనితో ప్రమాదాలు నివారించబడతాయి.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీకు అందుబాటులో ఉన్న ట్రాఫిక్ పోలీస్ / ఆర్.టి.ఎ అధికారులను అడిగి క్రింది విషయాలు సేకరించండి.
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 3
మీ ప్రాంతంలో ట్రాఫిక్ పరిస్థితులను తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 24 రోడ్డు భద్రతా విద్య 6

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

9th Class Social Studies 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. కింది వాటిని జతపరచండి. (AS1)

1. నల్లమందు యుద్ధాలు అ) బెల్జియం
2. ఒట్టోమన్ సామ్రాజ్యం ఆ) స్పెయిన్
3. వ్యక్తిగత ఆస్తిగా వలస ప్రాంతం ఇ) వలస ప్రాంతంగా మార్చటానికి ముందు వ్యాపారాన్ని నియంత్రించారు
4. రైతులు స్థిరపడేలా చేయడం ఈ) చైనా

జవాబు:

1. నల్లమందు యుద్ధాలు ఈ) చైనా
2. ఒట్టోమన్ సామ్రాజ్యం ఇ) వలస ప్రాంతంగా మార్చటానికి ముందు వ్యాపారాన్ని నియంత్రించారు
3. వ్యక్తిగత ఆస్తిగా వలస ప్రాంతం అ) బెల్జియం
4. రైతులు స్థిరపడేలా చేయడం ఆ) స్పెయిన్

ప్రశ్న 2.
ఐరోపా వాసులు ‘కనుగొనటం’, ‘అన్వేషణ’ అన్న పదాలను ఎలా ఉపయోగిస్తారు? ఆ భౌగోళిక ప్రాంతాలలో ఉంటున్న ప్రజలను ఇవి ఎలా ప్రభావితం చేశాయి? (AS1)
జవాబు:
ఐరోపా వాసులు ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు కొనసాగించి అధిక లాభాలు ఆర్జించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వర్తక వాణిజ్యాలు కొనసాగించడానికి, అనేక నూతన ప్రదేశాలను కనుగొని, ముఖ్య పట్టణాలలో ముఖ్యమైన వ్యాపార కేంద్రాలను అన్వేషణ చేసి వ్యాపారాభివృద్ధికి తోడ్పడ్డారు. ప్రపంచానికి తెలియని అనేక కొత్త ప్రాంతాలు, దేశాలను అన్వేషించి, వాటికి పేర్లు పెట్టారు. తమ వలస ప్రాంతాలకు తేలికగా, సులువుగా చేరుకొనే ప్రయత్నంలో అనేక కొత్త మార్గాలను అన్వేషించారు. పోర్చుగీసు వాళ్ళు ఆఫ్రికా చుట్టుముట్టి భారతదేశానికి దారి కనుక్కోటానికి ప్రయత్నించారు. వివిధ కొత్త ప్రాంతాలను అన్వేషించి, కనుగొనడం ద్వారా ఆయా ప్రాంత ప్రజలు ఆనందం వెలిబుచ్చారు. వ్యాపారాభివృద్ధితో ముందుకు నడిపించడమే కాకుండా కొన్ని సందర్భాలలో హింసలకు, బానిసత్వానికి గురయ్యారు. ఏ విధమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లేక వలస పాలకుల అధీనంలో చీకటి బతుకులు బతికేవాళ్ళు.

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 3.
వలస ప్రాంతాలుగా మార్చటంలో వ్యాపారం పోషించిన పాత్ర ఏమిటి? (AS1)
జవాబు:
రాజుల పాలనలో రాజుల ఆధీనంలో ఉన్న ముఖ్య పట్టణాలను, వ్యాపారం పేరిట వివిధ దేశాలకు చెందిన వ్యాపారస్తులు, రాజుల అనుమతితో వర్తకం చేసుకోవడానికి అనుమతి పొందేవారు. తమ వ్యాపార మెళుకువలతో రాజులను ఆకర్షించడమే కాకుండా ముఖ్య నగరాలు, ముడి పదార్థాలు అభ్యమయ్యే ప్రాంతాలను తమ వ్యాపార కేంద్రాలుగా వ్యాపారస్తులు మలుచుకున్నారు. అంతేకాకుండా అప్పుడు రాజులలో ఉన్న అనైక్యత, వైరుధ్యాలు, వైరాలను తమకు అనుకూలంగా మార్చుకొని, లంచం రూపంలో నిధులు అందించి, చాలా ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. వ్యాపార కేంద్రాలు ద్వారా తమ అధీనమైన ప్రాంతాలలోని ప్రజలను బానిసలుగా చేసి, వలస ప్రాంతాలుగా మలుచుకొని అధిక సంపదను దోచుకొని, తమ పాదాక్రాంతం చేసుకున్నారు.

ప్రశ్న 4.
వలస పాలన వివిధ దేశాలలో స్థానిక ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేసింది? మూడు ఖండాలకు వేరుగా ఒక్కొక్క దాని గురించి ఈ కింది నేపథ్యంలో రాయండి.
ఎ) పండించిన పంటలు
బి) మతం
సి) ప్రకృతి వనరుల వినియోగం (AS1)
జవాబు:
ఎ) పండించిన పంటలు :
యూరపు వలస ప్రాంతాలలోని స్థానికులు నావికులను, వ్యాపారస్తులను ఆహ్వానించి, ఆహారం, ఆశ్రయం ఇచ్చారు. కాని స్పెయిన్ ప్రజలు వాళ్ళను దోచుకుని బానిసలుగా వాడుకున్నారు. వ్యవసాయ క్షేత్రాలలో వలస ప్రాంతాలు ఏర్పరిచారు. పండిన పంటలు ఆక్రమించుకుని రైతుల భూములు ఆక్రమించి వారికి భూముల్లేకుండా చేశారు.

లాటిన్ అమెరికాలో వలస దేశాల పరిపాలనలో కేథలిక్కు చర్చి కూడా ముఖ్య పాత్ర పోషించింది. స్పెయిన్ నుంచి స్థిరపడినవారి అధీనంలో విశాల భూభాగాలు ఉండేవి. వీటిని ‘హసియండా’ అనేవాళ్ళు. వేలాది ఎకరాలలో విస్తరించి అందులో వెండి, రాగి గనులు, వ్యవసాయ భూములు ఉండేవి. చెరుకు, పొగాకు, పత్తి వంటి వాణిజ్య పంటలను సాగుచేసి వలస పాలిత ప్రాంతాలు వాటిని చవకగా తమపై ఆధిపత్యమున్న దేశాలకు అమ్మాలి.

ఆసియాలో యూరపు వలస దేశాల పాలనలో కూడా రబ్బరు, మిరియాలు, చెరుకు వంటి ఏక పంటలతో ప్రోత్సహించారు.

బి) మతం :
మూడు ఖండాల మధ్య చాలా వ్యాపార మార్గాల అన్వేషణ, నియంత్రణ, అధిక లాభాలకై యుద్దాలు చేసేవారు. కేథలిక్కు మత విధానాలను బలవంతంగా రుద్దసాగారు. మతాధికారులు, మతగురువులు, పోపు ఆధిపత్యం కొనసాగింది. వలస పాలిత ప్రాంతాలలో మత ఆధిపత్యం చెలాయించటానికి అధికంగా ప్రయత్నించారు.

సి) ప్రకృతి వనరుల వినియోగం :
వలస ప్రాంతాలలో ప్రకృతి వనరులు ఈ మూడు ఖండాల వారిని ఆకర్షించాయి. ప్రకృతి వనరులను తమ అధీనంలోకి తెచ్చుకోడానికిగాను భూదాహంతో ఆయా ప్రాంతాలలో స్థిరపడడానికి ప్రయత్నించారు. విలువైన బంగారు గనులు, వెండి నిక్షేపాలు గల భూములను ఆక్రమించి, యజమానులను తరిమికొట్టారు. కొన్ని ప్రాంతాలలో వలస ప్రాంత భూములను చవకగా పొంది ప్రకృతి వనరులను అనుభవించారు.

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 5.
చైనా, భారతదేశం, ఇండోనేషియాలపై వలసపాలన తీరు గురించి రాయండి. వాటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
భారతదేశం :
15వ శతాబ్దం ఆరంభంలో గోవా వంటి ఓడ రేవుల పై పోర్చుగీసు ఆధిపత్యం సాధించింది. ఇతర యూరప్ దేశాలు 16వ శతాబ్దం చివరి నాటికి వ్యాపార కేంద్రాలను స్థాపించి, భారతదేశంతో వ్యాపారం చేయటం మొదలుపెట్టాయి. భారతదేశ భాగాలపై రాజకీయ నియంత్రణ దక్షిణ భారతంలో మొదలైంది. మద్రాస్ పైన బ్రిటిష్, పాండిచ్చేరి పైన ఫ్రెంచి ఆధిపత్యం సాధించాయి. చవక ధరలకు తమ ఉత్పత్తులను అమ్మేలా రైతులు, చేతి వృత్తి కళాకారులు, వ్యాపారస్తులను బలవంతం చేయటానికి తన రాజకీయ శక్తిని బ్రిటిషు వారు ఉపయోగించుకున్నారు.

చైనా :
యూరపు దేశాలు చైనాలో స్వేచ్ఛగా వ్యాపారం చేయడానికి చైనా అనుమతించలేదు. ఒక పట్టణంలో మాత్రమే వ్యాపారం చేసుకోడానికి అనుమతిచ్చారు. చైనాలో బాగా గిరాకి ఉండి, భారత్ లో విరివిగా పండు నల్లమందు అక్రమ రవాణా ద్వారా లాభాలు గడించాలని యూరపు దేశస్తులు తలంచారు. నల్లమందు ద్వారా తమ దేశస్తులు నష్టపోతున్నారని చైనా తలంచగా ఈ రెండు దేశాల మధ్య, 1840 – 42 ల మధ్య యుద్ధాలు జరిగాయి. తదుపరి చైనా ఓడిపోయి ఇంగ్లాండు. ఒప్పందాలకు అంగీకరించింది.

ఇండోనేషియా :
బలమైన రాజ్యాలు లేని ఇండోనేషియాలోని విశాల భూభాగాలను డచ్ కంపెనీ ఆక్రమించుకోసాగింది. తమ ఉత్పత్తులను కంపెనీకి తక్కువ ధరలకు అమ్మేలా స్థానిక ప్రజలపై ఒత్తిడి పెట్టగలిగింది. 1800 సం|| నుండి ఇండోనేషియా ఆక్రమించుకొని పాలించసాగింది. ఆ దేశాన్ని ఆదాయ వనరుగా ఉపయోగించుకుంది.

పోలికలు :

  1. ఈ మూడు దేశాలు వలస దేశాలుగా ఉన్నవే.
  2. ఈ మూడు దేశాలు, ప్రకృతి వనరులు, సహజ సంపదతో విలసిల్లేవి.
  3. వ్యాపారాలతో ప్రారంభించి, వలసవాద దేశాల అధీనంలోనికి వెళ్ళినవే.
  4. ఇచ్చట ప్రజలలో, రాజులలో అనైక్యత మూలంగానే.
  5. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న దేశాలు.
  6. ప్రజలను బానిసలుగా మార్చారు.

తేడాలు :
‘భారతదేశం’లో అన్ని ప్రాంతాలలో వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు పొందారు. (ముఖ్య పట్టణాలు).

‘చైనా’ అన్ని ప్రాంతాలు కాకుండా, ఒకే ఒక్క పట్టణంలో వ్యాపారానికి అనుమతి.
‘ఇండోనేషియా’ బలమైన రాజ్యాలు లేకపోవడం వల్ల దేశం అంతా ఆక్రమణ.
భారతదేశంలో ఆధిపత్యానికి ఒకదానితో ఒకటి పోటి పడసాగాయి. అనేక యుద్ధాలు ద్వారా పరిపాలన పాదాక్రాంతం. చైనాలో నల్లమందు ద్వారా యుద్ధాలు ప్రారంభం. అనేక ఒప్పందాలు వల్ల నిధులన్ని కొల్లగొట్టారు.
ఇండోనేషియాలో రబ్బరు, మిరియాలు, చెరుకు వంటి ఏక పంటలతో విస్తృత తోటలు సాగు చేయటాన్ని ప్రోత్సహించింది.

ప్రశ్న 6.
ప్రపంచ పటం నందు పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచి వలసలను గుర్తించి, రంగులతో నింపండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 4

9th Class Social Studies 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం InText Questions and Answers

9th Class Social Textbook Page No.205

ప్రశ్న 1.
వాళ్ళకు అసలు తెలియని ఖండాలు ఏవి?
జవాబు:
ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణా అమెరికా, అంటార్కిటికా.

ప్రశ్న 2.
వాళ్ళకు తీర ప్రాంతాలు తెలిసి, లోపలి ప్రాంతాలు తెలియని ఖండాలు ఏవి?
జవాబు:
ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్.

9th Class Social Textbook Page No.206

ప్రశ్న 3.
1400 లలో ఆసియాతో వ్యాపారాన్ని యూరపు దేశాలైన పోర్చుగల్, స్పెయిన్ కాకుండా ఇటలీ ఎందుకు నియంత్రిస్తోంది?
జవాబు:
1400 సం||నాటికి యూరపు, ఆసియాల మధ్య చాలా వరకు వ్యాపార మార్గాలను ముస్లిం రాజ్యాలు నియంత్రించసాగాయి. ప్రత్యేకించి ఒట్టోమన్ సామ్రాజ్యం యూరప్ క్రైస్తవ శక్తులతో నిరంతరం యుద్ధాలు చేస్తుండేది. ఇటలీ దేశస్థులు అరబ్బు వ్యాపారస్తులతో కుదుర్చుకున్న ఒప్పంద ఫలితంగా వాళ్ళు ఆసియా నుండి సరుకులు తెచ్చి అలెగ్జాండ్రియా దగ్గర వాళ్లకి అమ్మేవాళ్ళు. పశ్చిమ యూరపులో హాలెండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లాండ్ వంటి దేశాల వ్యాపారస్తులు, ప్రభుత్వాలు, ఈ వ్యాపార ప్రాముఖ్యతను గుర్తించారు. దాంతో భారతదేశం, చైనా వంటి దేశాలకు ఇటలీ వ్యాపారస్తుల నియంత్రణలో ఉన్న ప్రాంతాల నుంచి కాకుండా తేలికగా, త్వరగా చేరుకునే మార్గాలను అన్వేషించసాగారు.)

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 4.
ఆసియాకి మరో మార్గాన్ని కనుక్కోవటానికి పోర్చుగల్, స్పెయిన్ దేశాలు ఎందుకు అంత ఆసక్తి కనపరిచాయి?
జవాబు:
భారతదేశం, చైనా, ఇండోనేషియా వంటి దేశాలు. ఇటలీ వ్యాపారస్తుల నియంత్రణలో ఉండటం, కొన్ని ప్రాంతాలలో ఇటలీ ఒప్పందం కుదుర్చుకొని వ్యాపారలావా దేవీలు కొనసాగించడం వల్ల ఈ మార్గాలు కాకుండా తేలికగా, త్వరగా చేరుకొనే మార్గాలను అన్వేషించారు. ఉదా : పోర్చుగీసు వాళ్ళు ఆఫ్రికా చుట్టుముట్టి భారతదేశానికి దారి కనుక్కోటానికి ప్రయత్నించారు. అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటటం ద్వారా భారతదేశం చేరుకోవచ్చో లేదో తెలుసుకోవాలని స్పెయిన్ ప్రయత్నించింది. అనుభవజ్ఞులైన నావికులు, ఓడలు ద్వారా ఆసియాను అన్వేషణ చేశారు.

9th Class Social Textbook Page No.208

ప్రశ్న 5.
1800 నాటి దక్షిణ అమెరికా పటాన్ని చూసి వివిధ వలస రాజ్యా లను, పాలిత దేశాలను గుర్తించండి.
జవాబు:
దక్షిణ అమెరికా వలస రాజ్యా లు :
పోర్చుగీసు, స్పెయిన్, డచ్, యు.కె.

పాలిత దేశాలు :
ఉరుగ్వే,
వెనిజులా,
ఈక్వెడార్,
బొలీవియా,
పెరు,
పరాగ్వే,
అర్జెంటైనా.
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 2

ప్రశ్న 6.
వలస ప్రాంతాల ప్రభుత్వాలలో అక్కడ స్థిరపడిన స్పానిష్ ప్రజలకు ప్రముఖ పాత్రను ఎందుకు ఇవ్వలేదు?
జవాబు:
స్పానిష్ ప్రజలకు వలస ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదు. వలస దేశాల పరిపాలనలో కేథలిక్కు చర్చి. కూడా ముఖ్యపాత్ర పోషించేది. స్పెయిన్ కి చవకగా ప్రకృతి వనరులు, శ్రామికులను అందించేలా వలస ప్రాంతాల ఆర్థిక విధానాలను నియంత్రించారు, కానీ ఆ దేశాలు అభివృద్ధి చెందడానికి కాదు. స్పానిష్ ప్రజలకు ఉన్న ఆయుధాలు. మందుగుండు సామగ్రి వలస ప్రాంత ప్రభుత్వాలను భయపెట్టింది. స్పానిష్ వలస పాలనలో ఉన్న ప్రజలు అక్కడ ఎంతో కాలం క్రితం స్థిరపడిన స్పానిష్ ప్రజలతో సహ తమపై స్పానిష్ రాచరిక వర్గాల నియంత్రణను ద్వేషించసాగారు.

9th Class Social Textbook Page No.209

ప్రశ్న 7.
మీరు ఎనిమిదవ తరగతిలో నిజాం రాజ్యంలోని జమీందారీ వ్యవస్థ గురించి చదివారు. నిజాం రాష్ట్రంలోని జమీందారీ వ్యవస్థను దక్షిణ అమెరికాలోని హసియండాలతో పోల్చండి. వాటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
జమీందారీ వ్యవస్థకు, హసియండాలతో పోలికలు, తేడాలు ఉన్నాయి.

పోలికలు :

  • జమీందారీ వ్యవస్థలోను, హసియండాలోను కూడా ఉండేవి వ్యవసాయ భూములే.
  • జమీందారుల అధీనంలోని భూములు, భూస్వాముల అధీనంలోని భూములు వేలల్లో ఉండేవి.
  • తరతరాలుగా అనుభవిస్తున్నారు.

భేదాలు :

  • జమీందారీ వ్యవస్థలోని భూముల్లో కొన్ని సారవంతమైనవి. మరికొన్ని ఎకరాలు నిస్సారమైనవి.
  • హసియండా భూములు బాగా ఖరీదైనవి, సారవంతమైనవి.
  • జమీందారీ భూములను చిన్నచిన్న రైతులు, కౌలుదార్లు వ్యవసాయం చేసేవారు.
    హసియండా భూముల్లో ఆఫ్రికా బానిసలు, స్వేచ్ఛలేని ఇండియన్లను నియమించుకునేవారు.
  • జమీందారుల భూముల్లో రకరకాల పంటలు, అడవులు, చెట్లు ఉండేవి.
    హసియండా వేలాది ఎకరాలలో విస్తరించి అందులో వెండి, రాగి గనులు, వ్యవసాయ భూములు, పచ్చిక బీళ్ళు, కర్మాగారాలు కూడా ఉండేవి.
  • జమీందారీ భూముల్లో భూ సంస్కరణ, భూ పరిమితి చట్టాలు వలన కొంత భూమి కోల్పోయారు. హసియండాలో భూములు కోల్పోలేదు.

ప్రశ్న 8.
లాటిన్ అమెరికాలోని వలస పాలిత ప్రాంతాల్లో దిగువ ప్రజల సమస్యల జాబితా తయారుచేయండి.
జవాబు:
1. హసియండాల యజమానులైన స్పానిష్ వలసవాదులు :
స్పెయిన్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళ చేతుల్లో ఆ దేశాల గనులు, భూములు ఉండేవి. వాళ్ళల్లో కొంతమంది పెద్ద భూస్వాములుగా ఉండేవాళ్ళు. వీళ్ళ కింద ఉండే విశాల భూభాగాన్ని “హసియండా” అనేవాళ్ళు. ఈ భూస్వాములు తమకింద పనిచేయటానికి, ఆఫ్రికా బానిసలను లేదా స్వేచ్ఛలేని ఇండియన్లని నియమించుకునే వాళ్ళు. వీరు అనేక బాధలు, కష్టాలు అనుభవిస్తూ, తమ శక్తిని ధారపోసి పనిచేసేవాళ్ళు.

2. అమెరికాలో స్థిరపడిన చిన్న స్పానిష్ రైతులు :
అమెరికాలో స్థిరపడిన చిన్న స్పానిష్ రైతులు ఉండేవారు. కాని వలస ప్రాంతాల పరిపాలనలో అక్కడ స్థిరపడిన స్పెయిన్ ప్రజలకు ఎటువంటి పాత్ర లేదు. స్పెయిన్ కి చవకగా ప్రకృతి వనరులు, శ్రామికులను అందించేలా వలస ప్రాంతాల ఆర్థిక విధానాలను నియంత్రించారు. కాని ఆ దేశాలు అభివృద్ధి చెందటానికి కాదు.

3. స్థానిక అమెరికన్లు :
‘దక్షిణ అమెరికాలో అధికభాగం స్పెయిన్, పోర్చుగల్ అధీనంలోకి వచ్చింది. ప్రజలలో సగానికిపైగా ప్రజలు యూరోపియన్ల చేతుల్లో హతమయ్యారు. తద్వారా యూరప్ ప్రజల నియంత్రణలో, బ్రతికారు. చాలామంది స్థానిక అమెరికన్లు స్పానిష్ నియంత్రణలోకి వచ్చారు. భారీగా పన్నులు చెల్లించేవారు. గనులు, వ్యవసాయ క్షేత్రాలలో పనిచేయవలసి వచ్చేది. గుడులను విధ్వంసం చేసి చాలామందిని రోమన్ కాథలిక్కు మతానికి మార్చేశారు.

4. లాటిన్ అమెరికాలో స్థిరపడిన ఆఫ్రికా బానిసలు :
లాటిన్ అమెరికాలో స్థిరపడిన ఆఫ్రికా బానిసల జీవనం దుర్భరంగా ఉండేది. దక్షిణ అమెరికాలో చాలామంది హతమవ్వడం, రోగాల బారిన పడి చనిపోవడం వల్ల ఆఫ్రికా బానిసలను కొనసాగారు. తద్వారా వాళ్ళు జీవితాంతం నరకయాతన అనుభవించేవాళ్ళు. ఎదిరించే శక్తి లేక, సరైన ఆయుధాలు, నాయకత్వం లేకపోవడం వలన కటికచీకటి బతుకులు అనుభవించేవారు.

9th Class Social Textbook Page No.211

ప్రశ్న 9.
వలసపాలన నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటికీ లాటిన్ అమెరికా దేశాలు ఇంకా ఎందుకు అభివృద్ధి చెందకుండా ఉండిపోయాయి?
జవాబు:

  1. పారిశ్రామిక దేశాలైన బ్రిటన్, అమెరికాలపై ఆధారపడి ఉండటం.
  2. సామాజిక, ఆర్థిక, అసమానతలు తీవ్రంగా ఉండడం.
  3. భూమి లేకపోవడం వల్ల పేదరికం ఎక్కువగా ఉండి ఈ దేశాలు అభివృద్ధి చెందకుండా ఉండిపోయాయి.

ప్రశ్న 10.
మన్రో సిద్ధాంతం లాటిన్ స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా కాపాడింది ఇది వాటి స్వాతంత్ర్యాన్ని పరిమితం కూడా చేసిందా?
జవాబు:
1820 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు బలమైన ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదిగింది. అమెరికా అధ్యక్షుడు జేమ్స్. మన్రో తయారుచేసిన ‘మన్రో సిద్ధాంతం ప్రకారం అమెరికా ఖండాలలో యూరప్ దేశాలు ఏవీ వలస ప్రాంతాలను ఏర్పరచుకోకూడదు. అందుకు ప్రతిగా ఇతర ఖండాలలో యూరపు వ్యవహారాల్లో కానీ, వలస ప్రాంతాలలో కానీ అమెరికా జోక్యం చేసుకోదు. వాటి స్వాతంత్ర్యాన్ని పరిమితం చేయలేదు.

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 11.
మన్రో సిద్ధాంతం వల్ల బ్రిటన్ ఏ విధంగా లాభపడింది?
జవాబు:
బలమైన నౌకాదళం ఉన్న బ్రిటన్ మన్రో సిద్ధాంతాన్ని సమర్ధించింది. అమెరికా ఖండాలలోని దేశాలు యూరపు శక్తుల రాజకీయ అధీనంలో లేకపోతే వాటికి ఇంగ్లాండుతో వ్యాపారం చేయడానికి, వాటి పారిశ్రామిక ఉత్పత్తులను కొనే స్వేచ్ఛ ఉంటుంది.

9th Class Social Textbook Page No.215

12. పాశ్చాత్య దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ముఖ్యమైన వస్తువులు పట్టు, తేయాకు.

13. చైనాలో పాశ్చాత్య దేశాలు అమ్మటానికి ప్రయత్నించిన ఉత్పత్తి నల్లమందు.

14. చైనాలో వ్యాపారాన్ని ప్రభావితం చేయటానికి ప్రయత్నించిన ఆసియా దేశం జపాన్.

9th Class Social Textbook Page No.216

ప్రశ్న 15.
1913 నాటి ఆఫ్రికా పటాన్ని చూసి ఆఫ్రికాని ఏ మేరకు యూరపు దేశాలు తమ వలస ప్రాంతాలుగా మార్చుకున్నాయో చూడండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 1

ప్రశ్న 16.
కింద పట్టికలో ఆఫ్రికాలోని కొన్ని దేశాల పేర్లు ఉన్నాయి. 1913లో వీటిని వలసగా చేసుకొని పాలించిన దేశం పేరును ఎదురుగా రాయండి.
జవాబు:

ఆధునిక దేశం 1913 నాటికి వలసగా చేసుకొని పాలించిన దేశం
దక్షిణ ఆఫ్రికా ఇంగ్లాండ్
ఈజిప్టు ఇంగ్లాండ్
నైజీరియా ఫ్రాన్స్
ఘనా ఇంగ్లాండ్
లిబియా ఇటలీ
అల్జీరియా ఫ్రాన్స్
అంగోలా పోర్చుగీసు
కాంగో బెల్జియం

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీరు బ్రిటన్ పౌరులైతే వలసపాలనను సమర్థిస్తారా? ఎందుకు? భారతదేశ పౌరులుగా వలస పాలనకు మద్దతు ఇస్తారా? వ్యతిరేకిస్తారా? మీ దృక్పథాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
బ్రిటన్ పౌరుడిని అయితే వలస పాలనను సమర్థిస్తాను. ఎందుకంటే ప్రపంచ పోటీని తట్టుకోడానికి, వర్తక వాణిజ్యాలలో, ముందుండడానికి, విశాల సామ్రాజ్యం మా అధీనంలో ఉండడానికి, బ్రిటన్ ప్రపంచంలో బలమైన రాజ్యమని ప్రపంచ ప్రజలు జేజేలు పలకడానికి సమర్థిస్తాను.

భారతదేశ పౌరులుగా వలస పాలనను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే దాస్య బతుకులు, చీకటి పాలన వద్దని, పరదేశీయుల చేతుల్లో భారతమాత చిక్కరాదని, అపార సహజ వనరులు, ముడి పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు విలువైన వస్తువులు వేరొక ప్రాంతానికి తరలించడం ఇష్టంలేక, అవమానాలు, బానిస బతుకులు మాకొద్దని, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఎంతో ముద్దని, త్యాగధనుల స్ఫూర్తి ఆదర్శాలు వెల్లివిరియాలని వలస పాలనను వ్యతిరేకిస్తాను.

పటనైపుణ్యం

ప్రశ్న 1.
ప్రపంచ పటంలో ఈ దిగువ దేశాలను గుర్తించుము.
1. మెక్సికో
2. అమెరికా
3. చైనా
4. నెదర్లాండ్స్
5. ఇండోనేషియా
6. టర్కీ
7. స్పెయిన్
8. వెస్ట్ ఇండీస్
9. ఇటలీ
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 3

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

SCERT AP 9th Class Social Studies Guide Pdf 23rd Lesson విపత్తుల నిర్వహణ Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 23rd Lesson విపత్తుల నిర్వహణ

9th Class Social Studies 23rd Lesson విపత్తుల నిర్వహణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ప్రకృతి ప్రమాదాలు ఏవిధంగా విపత్తులు మారుతున్నాయో వివరించండి. (AS1)
జవాబు:

  1. ప్రణాళికలు లేకుండా నగరాలు విస్తరించడం.
  2. మురుగునీరు పోవడానికి సరైన సౌకర్యం లేకపోవడం.
  3. జనాభా వేగంగా పెరగడం.
  4. మానవుల నిర్లక్ష్యం వల్ల లేదా కావాలని ఒక వ్యక్తి లేదా బృందం చేసే పనుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి.
  5. ఈ విపత్తులు వల్ల ప్రాణనష్టం జరుగుతుంది.
  6. దేశ ఉత్పాదక, ఆర్థిక సామర్థ్యంపై దీర్ఘకాల ప్రభావం ఉంటుంది.
  7. వీటితోపాటు రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు జరగడం వల్ల వాటివల్ల విలువైన ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవిస్తున్నాయి.
  8. వీటితోపాటు అగ్నిప్రమాదాలు, వరదలు, కరవుకాటకాలు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించి ప్రాణ, ఆస్తినష్టాలు జరుగుతున్నాయి.

ప్రశ్న 2.
ఉగ్రవాదం అనగానేమి? వారి యొక్క లక్ష్యాలు ఏమిటి? (AS1)
జవాబు:
ఉగ్రవాదం అనగా :
హింసాత్మక చర్యల ద్వారా ప్రజలను, పాలకులను, దేశాధినేతలను బెదిరిస్తూ, తమ కోర్కెలను సాధించుకొనేందుకు చేపట్టే ఉగ్ర భయంకర దుష్ట చేష్టలనే ఉగ్రవాదము అంటారు.

ఉగ్రవాదం యొక్క లక్ష్యాలు :

  1. యుద్ధం, అంతర్గత పౌర యుద్ధాలు పెచ్చుమీరిపోయి ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణము కావడం.
  2. అల్లర్లను సృష్టించి, ప్రశాంత వాతావరణం లేకుండా చేయడం.
  3. సైనికులను, సామాన్య ప్రజానీకాన్ని భయ భ్రాంతులకు గురి చేయడం.
  4. రక్తపాతాన్ని సృష్టించడం.
  5. మందు పాతరలు పెట్టి రైళ్ళను పడగొట్టడం, వంతెనలు పేల్చడం, సైనికులను చంపడం వంటివి చేయడం.
  6. పిల్లలు కూడా నిత్యం దాడులకు భయపడుతూ గడుపుతుంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 3.
అగ్నిప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి మనం’ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు:
అగ్నిప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  1. నిప్పు లేదా పొగ చూసినప్పుడు అలారం మోగించండి / హెచ్చరిక జారీ చేయండి.
  2. సాధ్యమైనంత త్వరగా భవనం నుంచి బయటకు వెళ్లండి. వీలైతే మిమ్మల్ని కప్పుకోండి. వరండాలో బయటకు తప్పించుకునే మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడండి.
  3. ఫోను ఎక్కడుందో తెలుసుకుని 101కి ఫోన్ చేయండి. నిదానంగా, స్థిమితంగా మీ చిరునామా చెప్పి అగ్నిమాపక దళాన్ని పంపించమని అడగండి.
  4. పొగ ఉన్నప్పుడు నేలమీద పాకుతూ వెళ్లండి. వేడిగాలి, పొగ పైకి లేస్తాయి కాబట్టి నేల దగ్గర గాలి బాగుంటుంది.
  5. మీరు బైటకు వెళ్లేదారి మూసివేసి ఉంటే కిటికీ ఉన్న ఒక గదిలోకి వెళ్లండి. తలుపు వేసి పొగ లోపలికి రాకుండా చేయండి. కిటికీ తలుపు తెరిచి సహాయం కోసం అరవండి.
  6. తలుపు మూసి ఉంటే మంటలు వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి. భవనాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు అందరికంటే వెనకనున్న వాళ్లు తలుపులు వేసుకుంటూ రావాలి.
  7. విద్యుత్తు స్విచ్చులన్నీ తీసేసి ఉంచాలి. మెయిన్ స్విచ్ ను కట్టెయ్యటం ఉత్తమం.
  8. అతుకులు, పలు ఉన్న విద్యుత్తు తీగలు, కేబుళ్లకోసం చూడండి. ఇవి ప్రమాదకరమైనవి కాబట్టి వీటిని వెంటనే మార్చాలి. ప్లగ్ పాయింట్లు కిందకల్లా ఉంటే, ప్రత్యేకించి ప్రాథమిక తరగతుల్లో వాటికీ టేపు వేసేసి ఉంచాలి. లేకపోతే చిన్నపిల్లలు వాటిల్లో వేళ్లు పెట్టినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశముంది.
  9. బడిలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్తు తీగలను గమనించండి. ఏవైనా గోడలు నెమ్ముకుంటూ ఉంటే వాటిని వెంటనే మరమ్మతు చేసి, విద్యుత్తు తీగలను మార్చివేయాలి. నిప్పు, లేదా పొగ చూసినప్పుడు అలారం మోగించండి/హెచ్చరిక జారీ చేయండి.
  10. సాధ్యమైనంత త్వరగా భవనం నుంచి బయటకు వెళ్లండి. వీలైతే మిమ్మల్ని కప్పుకోండి. వరండాలో బయటకు తప్పించుకునే మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడండి.

చేయగూడనివి :

  1. మీ బొమ్మలు, పెంపుడు జంతువులు వంటి వాటికోసం అగ్నిప్రమాదానికి గురైన భవనం లోపలికి మళ్లీ వెళ్లవద్దు. అగ్నిమాపకదళం మీకంటే వేగంగా ముఖ్యమైన వాటిని బయటకు తీసుకురాగలరు.
  2. మంచం కిందగానీ, అలమర లోపలగానీ ఎప్పుడూ దాక్కోవద్దు. పెద్దగా అరుస్తూ భవనం నుంచి బయటకు వెళ్లాలి.
  3. చాపలు, తివాచీ వంటి వాటికింద నుంచి విద్యుత్తు తీగలు, కేబుళ్లు వంటివి తీస్తే అవి పాడైపోయి ప్రమాదాలకు దారి తీయవచ్చు. ఈ పరిస్థితి ఎక్కువగా పాఠశాల పరిపాలనా విభాగంలో ఎదురవుతూ ఉంటుంది.
  4. తేలికగా కాలిపోవటానికి వీలుండే కర్టెన్లు, ఇతర వస్తువులకు దగ్గరగా విద్యుత్తు బల్బులు అమర్చగూడదు.

ప్రశ్న 4.
రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణాలేవి? వాటిని తగ్గించడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
జవాబు:
రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణాలు :

  1. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం.
  2. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించటం.
  3. తాగి వాహనం నడపటం.
  4. వాహనాలు సరైన స్థితిలో ఉండక పోవటం.
  5. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవటం.

రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు :

  1. మద్యం సేవించి వాహనాలను నడపరాదు.
  2. వాహనాలను నడిపేవారు మందులను తీసుకుంటూ నడపరాదు.
  3. అలసిపోయి ఉన్నవారు, అలసట ఉన్నవారు వాహనాలను నడపరాదు.
  4. జబ్బుపడినవారు, గాయాల పాలైన వారు వాహనాలను నడపరాదు.
  5. కోపంగా లేదా ఆందోళనగా ఉన్నవారు వాహనాలను నడపరాదు.
  6. రోడ్డు మీద అసహనంగా ఉండరాదు. రోడ్డు మీద పరుగులు తీయరాదు.
  7. మలుపు / మూల వద్ద రోడ్డును ఎప్పుడూ దాటరాదు.
  8. బస్సు / వాహనం ఎక్కటానికి పరుగులు పెట్టరాదు.
  9. ట్రాఫిక్ సిగ్నళ్ళు ఉన్నచోట, జీబ్రా క్రాసింగ్ ఉన్నచోట మాత్రమే రోడ్డు దాటాలి.
  10. బస్సు పూర్తిగా ఆగిన తరువాత ఎక్కాలి. క్యూ పద్ధతి పాటించాలి.

మొదలైన చర్యలు జాగ్రత్తగా పాటించడం వలన రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చును.

ప్రశ్న 5.
ఉగ్రవాదుల దాడుల వలన ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. వీరి చర్యలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
జవాబు:
ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో వారి చర్యలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  1. రవాణా వాహనాలలో, బహిరంగ ప్రదేశాలలో ఎవరికీ చెందని సూట్ కేసు, సంచి వంటిని గమనిస్తే పోలీసులకు తెలియజేయాలి. ఎందుకంటే వాటిలో పేలుడు పదార్థాలు ఉండవచ్చు.
  2. “100” నంబరుకి పోలీస్ కంట్రోలు రూమ్ కి ఫోన్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఫోన్ చేసే హక్కు ఉంది. తద్వారా ప్రమాదాన్ని వారి ద్వారా నివారించవచ్చు.
  3. పోలీసులకు తెలియజేసిన పిదప అనుమానాస్పద వస్తువులపై నిఘా ఉంచాలి. ఇతరులను కూడా దాని నుంచి దూరంగా ఉండమని చెప్పాలి.
  4. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు వారి ప్రవర్తనపై, నిలిపి ఉన్న వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  5. పౌరుల భద్రత అందరికీ సంబంధించిన విషయం కాబట్టి భద్రత పట్ల అవగాహన కల్పించటానికి వివిధ సంస్థలు తమ విధి విధానాలు ప్రకటిస్తూ ప్రజలను జాగృతం చేయాలి.
  6. ఉగ్రవాదాన్ని ఎదుర్కోటానికి, క్షేమకర జీవితం గడపటానికి పోలీసులు కొన్ని పోస్టర్లు జారీ చేస్తారు. వాటి గురించి తెలుసుకుని వాటిని జీవితంలో అనుసరించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 6.
రైలు ప్రమాదాలకు గల కారణాలను గుర్తించండి. (AS1)
జవాబు:
ప్రపంచంలో ఎక్కువ రైలు మార్గాలు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశంలో రైలు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. తరుచుగా జరిగే రైలు ప్రమాదాలకు గల కారణాలు :

  1. రైలు ప్రమాదాలకు కారణాలలో రైలు పట్టాలు తప్పటం ఒకటి.
  2. రైలు మార్గాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం.
  3. విద్రోహ చర్యలు, కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
  4. మానవ పొరపాట్లు, అప్రమత్తంగా లేకపోవడం.
  5. గ్యాస్, పెట్రోల్, బొగ్గు, నూనె వంటి మండే పదార్థాల రవాణా కారణంగా కూడా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.
  6. రైలులో పొగత్రాగడం, సిగరెట్, బీడీ వంటి వాటి వలన కూడా అగ్ని ప్రమాదాలు రైలులో జరుగుటకు కారణం.
  7. కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద కూడా ప్రమాదాలకు మూలమౌతున్నాయి.

ప్రశ్న 7.
మీ గ్రామంలో, పాఠశాలలో, మీ ఇంటి దగ్గర సంభవించగల ప్రమాదాలను గుర్తించండి. (AS4)
జవాబు:
మా గ్రామంలో, పాఠశాలలో, మా ఇంటి దగ్గర సంభవించగల ప్రమాదాలు :

  1. మలుపు / మూలల దగ్గర రోడ్డు దాటేటప్పుడు.
  2. పాఠశాల వదిలి పెట్టిన సమయం.
  3. బస్సు / వాహనం ఎక్కడానికి పరుగులు తీసే సమయం.
  4. బడివాళ్ళు నిర్దేశించిన బస్సులు తప్పించి ఇతర బస్సులు ఎక్కే సమయం.
  5. ట్రాఫిక్ సిగ్నళ్ళు పాటించకపోవడం.
  6. జీబ్రా క్రాసింగ్ గుర్తులున్న చోటనే రోడ్డును దాటకపోవడం వంటి సమయాలు.

ప్రశ్న 8.
భారతదేశ పటంలో ఉగ్రవాదుల దాడులకు గురైన ఈ కింది నగరాలను గుర్తించండి. (AS5)
జవాబు:
ఎ) ముంబై బి) హైదరాబాద్ సి) భాగల్ పూర్ డి) కుంభకోణం ఇ) బెంగళూరు
AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ 1

ప్రశ్న 9.
మీకు తెలిసిన ఒక ప్రమాద సంబంధ వైపరీత్యం గురించి రాయండి. (AS6)
జవాబు:
ఇటీవల కాలంలో మా జిల్లాలో అత్యంత దురదృష్టకరమైన రైలు ప్రమాదం జరిగింది. దీని కారణంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మంది వరకు గాయాలపాలయ్యారు. విజయనగరం దగ్గరి గొట్లాం సమీపంలో రాత్రి 7 గంటల సమయంలో బొకారో ఎక్స్ ప్రెస్ రైలులో పొగచిమ్మగా, పెద్ద ప్రమాదం రైలులో సంభవిస్తుందని తోటి ప్రయాణికులలో అలజడులు రేగగా, ఆ పుకార్లు షికార్లు చేసి భయంతో ప్రయాణీకులు గొలుసులాగి, ఎదురుగా పట్టాలపై పరిగెత్తసాగారు. అదే సమయంలో విజయవాడ వెళుతున్న రాయగడ పాసింజర్ ఈ ప్రయాణీకులను ఢీకొనగా అక్కడికక్కడే చనిపోయారు. ఇది నాకు తెలిసిన ఇటీవల జరిగిన అత్యంత ప్రమాద సంబంధ వైపరీత్యం.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 10.
పేజీ నెం. 281లోని ‘అగ్ని ప్రమాదం’ అంశం చదివి వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాల కారణంగా సుమారు 30,000 మంది చనిపోతున్నారు. వేడిమి, ఇంధనం, ప్రాణ వాయువు – ఈ మూడు కలిసినపుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి అందకుండా చేయడం ద్వారా నిప్పును ఆపవచ్చు. ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించి విలువైన ప్రాణాలు, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. మానవ నిర్లక్ష్యం, లేదా అవగాహన లోపం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగి విపరీత నష్టాలకు మూలమౌతున్నాయి.
ఉదా :
తమిళనాడులోని కుంభకోణంలోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది బాలలు చనిపోయారు. అగ్ని ప్రమాదం జరిగినపుడు ఏం చేయాలో టీచర్లకు, విద్యార్థులకు తెలియకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన ఉంటే ఇటువంటి సందర్భాలలో అపాయం నుంచి తప్పించుకోవచ్చు.

9th Class Social Studies 23rd Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం InText Questions and Answers

9th Class Social Textbook Page No.277

ప్రశ్న 1.
ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విపత్తులు ఎంతవరకు సహజమైనవి? దీని గురించి ఎప్పుడైనా విశ్లేషించారా? ముంబాయిలోని వరదలను ఉదాహరణగా తీసుకుందాం. పెద్ద ఎత్తున జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణాలు ఏమిటి? భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందా?
జవాబు:
ప్రకృతి వైపరీత్యాలనేవి కొంతవరకు సహజమైనవి. కొంతవరకు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి.

మానవులు చేసే తప్పులను దిద్దుకుంటే కొన్ని వైపరీత్యాలను నివారించవచ్చు. ముంబయిలోని వరదలను ఉదాహరణగా తీసుకుంటే పెద్ద ఎత్తున జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణాలు :

  1. ఏ ప్రణాళికా లేకుండా నగరం విస్తరించటం.
  2. మురుగునీరు పోవటానికి సరైన సౌకర్యం లేకపోవటం.
  3. జనాభా వేగంగా పెరగటం వంటి కారణాల వలన, భారీ వర్షాల వలన పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది.

దేశ ఉత్పాదక, ఆర్థిక సామర్థ్యం పైన కూడా దీర్ఘకాల ప్రభావం పడింది. ప్రకృతి వైపరీత్యాలలో సహజమైనవాటికి ఉదాహరణగా వరదలు, కరవు కాటకాలు, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం వంటి అంశాలను పేర్కొనవచ్చు.

అగ్నిప్రమాదాలు, రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు వంటి వాటిని మానవ కారక వైపరీత్యాలుగా చెప్పవచ్చును.

9th Class Social Textbook Page No.279, 280

ప్రశ్న 2.
రైలు ప్రమాదాలను తగ్గించటానికి పాటించవలసిన భద్రతా చర్యలు ఏవి?
జవాబు:
రైలు ప్రమాదాలను తగ్గించటానికి పాటించవలసిన భద్రతా చర్యలు :

  1. రైల్వే క్రాసింగ్ దగ్గర సిగ్నల్ కోసం చూడండి. రైలు గేటును గమనిస్తూ ఉండండి.
  2. గార్డులేని రైల్వే క్రాసింగ్ దగ్గర వాహనం దిగి రెండువైపులా చూసిన తరవాత పట్టాలు దాటాలి.
  3. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు కింద నుంచి దూరి పట్టాలు దాటరాదు.
  4. ప్రయాణీకులను తరలించడానికి వీలుకాని వంతెన మీద, సొరంగాల వద్ద రైలును, రైలింజన్ డ్రైవర్లు ఆపకూడదు.
  5. మండే గుణమున్న పదార్థాలను రైలులో తీసుకెళ్ళరాదు.
  6. నడుస్తున్న రైలులో తలుపు దగ్గర నిలబడరాదు. బయటకు తొంగి చూడరాదు.
  7. ఆగి ఉన్నలేదా కదులుతున్న రైలులోంచి మీ తల, చేతులు బయటపెట్టరాదు.
  8. స్టేషనులో రైలు పట్టాల మీదుగా దాటరాదు. ప్లాట్ ఫారం మారటానికి ఉద్దేశించిన పాదచారుల వంతెనను ఉపయోగించండి.
  9. అనుమానాస్పద వస్తువులను తాకరాదు. పట్టాలమీద, రైల్వే యార్డులలో ఆటలు ఆడవద్దు. రైలుబోగీలు ఉన్నట్టుండి కదలడం వల్ల అక్కడ ఉన్నవారు ప్రమాదానికి గురవుతారు.
  10. కదులుతున్న రైలు మీదకి ఎటువంటి వస్తువులు విసరవద్దు. దీనివల్ల తీవ్రగాయాలు అవుతాయి.

9th Class Social Textbook Page No.281

ప్రశ్న 3.
విమానం ఎక్కినప్పుడు పాటించవలసిన విషయాలు ఏవి?
జవాబు:

  1. ప్రయాణ సమయంలో పాటించవలసిన భద్రతలను తెలియచేస్తున్నప్పుడు శ్రద్ధగా వినండి.
  2. మీరు కూర్చున్న ముందు సీటు జేబులో ఉండే భద్రతా వివరాల కార్డును జాగ్రత్తగా చదవండి.
  3. దగ్గరలో అత్యవసర ద్వారం ఎక్కడ ఉందో తెలుసుకోండి. దానిని ఎలా తెరవాలో తెలుసుకోండి.
  4. సీటులో కూర్చుని ఉన్నప్పుడు తప్పనిసరిగా సీటుబెల్టు పెట్టుకుని ఉండండి.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రశ్న 4.
విమాన ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
జవాబు:

  1. ప్రశాంతంగా ఉండండి. విమాన సిబ్బంది చెపుతున్నది విని, అనుసరించండి. మీకు సహాయం చేయటం క్యాబిన్ సిబ్బంది ముఖ్యమైన బాధ్యత.
  2. అత్యవసర ద్వారాన్ని తెరవటానికి ముందు. కిటికీ నుండి బయటకు చూడండి బయట మంటలు ఉంటే తలుపు తెరవవద్దు. తలుపు తెరిస్తే మంటలు లోపలికి వ్యాపిస్తాయి. బయటకు వెళ్ళటానికి ఉన్న మరొక దారిని ఉపయోగించండి.
  3. పొగ పైకి లేస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి క్యాబిన్లో పొగ ఉంటే నేలమీదకి ఉండండి.
  4. నేలలో ఉండే అత్యవసర దీపాలను అనుసరించండి. ఇవి బయటకు వెళ్లే ద్వారాలను సూచిస్తాయి.
  5. మీ దగ్గర గుడ్డ | రుమాలు ఉంటే ముక్కు, మూతికి అడ్డంగా పెట్టుకోండి.

9th Class Social Textbook Page No.283

ప్రశ్న 5.
సమీప అగ్నిమాపక కేంద్రానికి వెళ్ళి అగ్నిప్రమాదాలు తగ్గించటంలో మీరు పాటించగల మెలకువల గురించి తెలుసుకోండి.
జవాబు:
సమీప అగ్నిమాపక కేంద్రానికి వెళ్ళి అగ్ని ప్రమాదాలను తగ్గించటంలో మేము పాటించగల మెలకువలు గురించి తెలుసుకున్నాము. అవి :

  1. నిప్పుతో ఆటలాడరాదు.
  2. నిప్పు అవసరము తీరిన వెంటనే ఆర్పవలెను.
  3. సిగరెట్లు, బీడీలు కాల్చువారు కూడా సిగరెట్టు, బీడీ కాల్చుకుని మండుతున్న అగ్గిపుల్లను విసిరేసి వెళ్లిపోతారు. అది ప్రక్కన ఉన్న చెత్త చెదారంతో కలిసిపోయి పెద్ద పెద్ద మంటలు రావడానికి అవకాశం ఉంటుంది.
  4. అలాగే సిగరెట్లు, బీడీలు కాల్చుకుని ఆర్పివేయకుండా విసిరేసి వెళ్ళిపోతారు. దాని వలన కూడా పెద్ద పెద్ద మంటలు రావడానికి అవకాశం ఉంటుంది.
  5. గ్రామీణ ప్రాంతాల యందు కట్టెల పొయ్యి మీద అన్నం, కూరలు వండి, నిప్పును ఆర్పకుండా వారు వేరే పనులలో నిమగ్నమైపోతారు. అలాంటి సమయాలలో కూడా పెద్ద పెద్ద మంటలు ఏర్పడవచ్చును.
  6. అలాంటి పరిస్థితులు వీలైనంత వరకు తటస్థపడకుండా జాగ్రత్తలు వహించాలి.
  7. అతుకులు, పట్టీలు ఉన్న విద్యుత్ తీగలు ఉపయోగించరాదు.

ప్రశ్న 6.
ఉగ్రవాద దాడి జరిగినప్పుడు మీరు పాటించవలసిన విషయాలు ఏవి?
జవాబు:

  1. ప్రశాంతంగా ఉండండి. ఉద్రేకానికి లోనవ్వవద్దు.
  2. స్థానిక అత్యవసర అధికారుల సూచనలు పాటించండి.
  3. వార్తల కోసం, సూచనల కోసం రేడియో వినండి. లేదా టీ.వి. చూడండి.
  4. మీ దగ్గరలో దాడులు జరిగితే ఎవరికైనా గాయాలు అయ్యాయేమో చూడండి. ప్రథమచికిత్స చేయండి. తీవ్ర గాయాలైన వారికి సహాయం అందేలా చూడండి.
  5. దెబ్బతిన్న పరికరాలను ఆపివేయండి.
  6. పెంపుడు జంతువులను కట్టేసి ఉంచండి. లేదా గదిలో బంధించి ఉంచండి.
  7. మీ కుటుంబ మిత్రులకు ఫోను చేయండి. ప్రాణానికి ముప్పు ఉంటే తప్పించి మళ్ళీ ఫోను ఉపయోగించవద్దు.
  8. మీ చుట్టు పక్కల వాళ్ళ గురించి, ప్రత్యేకించి వృద్ధులు, వైకల్యం ఉన్న వాళ్ళ గురించి ఆరా తీయండి.

9th Class Social Textbook Page No.284

ప్రశ్న 7.
భారతదేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదులు జరిపిన దుశ్చర్యలను గుర్తించండి. అవి చిన్న పిల్లల మీద చూపే ప్రభావాన్ని
వివరించండి. జ. భారతదేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదులు జరిపిన దుశ్చర్యలు : .

  1. ముంబయిలో తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు చేసిన దాడులు.
  2. హైదరాబాద్ లోని బాంబు పేలుళ్ళు.
  3. బెంగళూరులోని ‘బాంబు పేలుళ్ళు.

ఉగ్రవాదుల దాడులు చిన్న పిల్లల మీద అనేక రకాలుగా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉగ్రవాదులు దాడులు చేసే ప్రాంతాలలో పిల్లలు నిత్యం దాడులకు భయపడుతూ గడుపుతుంటారు.

పిల్లలు పాఠశాలకు హాజరు కావటానికి, సాధారణ జీవితాలు గడపటానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 23 విపత్తుల నిర్వహణ

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పత్రికలు, మ్యాగజైన్స్ ద్వారా ఇటీవల సంభవించిన మానవ విపత్తులు సమాచారాన్ని సేకరించండి. ఒకవేళ అలాంటి ప్రమాదాలు మీ ప్రాంతంలో సంభవిస్తే నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకొంటారు.?
జవాబు:
మానవ విపత్తులు సంభవించిన సమయంలో సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఒక మానవునిగా తోటి మానవుని ఆదుకోవటానికి అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది.

వారికి బట్టలు సరఫరా చేయటం కాని, ఆహార పదార్థాలు సరఫరా చేయటం కాని, ఇతర గృహనిర్మాణ సామానులు కాని, గృహోపకరణములు గానీ సరఫరా చేయటం జరుగుతుంది.

పశువులకు పశుగ్రాసం నష్టం వాటిల్లితే దానిని అందజేయడం జరుగుతుంది.

ప్రశ్న 2.
ఉగ్రవాదం వలన సంభవించే వివిధ రకాల నష్టాలను పట్టిక ద్వారా చూపండి.
జవాబు:
ఉగ్రవాదం – వివిధ రకాల నష్టాలు

  1. మానవ జీవనం అస్తవ్యస్తం అవుతుంది.
  2. జనజీవనం అల్లకల్లోలం
  3. వందల మంది మరణాలు
  4. వేలమంది క్షత్రగాత్రులు
  5. కోట్ల విలువైన ఆస్తినష్టాలు
  6. ప్రపంచ మేధావులలో అభద్రతా భావాలు
  7. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలలో భయాందోళనలు
  8. అమాయక ప్రజల ఆర్తనాదాలు
  9. మత సామరస్య విఘాతం
  10. అభివృద్ధి కుంటుపడటం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు

9th Class Social Studies 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బాల్య వివాహాల దుష్ఫలితాలు ఏవి? (AS1)
జవాబు:
బాల్య వివాహాల దుష్ఫలితాలు :

  1. చిన్న వయసులో గర్భవతులు కావడం.
  2. ఆడ పిల్లల అక్రమ రవాణాకు, అమ్మకానికి అవకాశం ఏర్పడడం.
  3. చదువుకు ఆటంకం.
  4. శారీరక ఎదుగుదలకు ఆటంకం.
  5. కుటుంబ పోషణకై బాలకార్మికులుగా మారుట.
  6. మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తడం.
  7. వైకల్యంతో కూడిన శిశు జననాలు లేదా మృత శిశువులు జన్మించడం.
  8. ఎదుగుదల లేని పిల్లలను బలవంతంగా కుటుంబ వ్యవస్థలోకి నెట్టివేయడం.
  9. అధిక సంఖ్యలో గర్భ విచ్ఛిత్తి, గర్భస్రావం, నెలలు నిండక ముందే ప్రసవం జరగడం ఫలితంగా మాతృ మరణాలు, శిశు మరణాల సంఖ్య పెరగడం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 2.
గృహహింస ఎందుకు సర్వసాధారణమైంది? అది ఏయే రూపాల్లో కనిపిస్తుంది? కారణాలు రాయండి. (AS1)
జవాబు:
మన రాజ్యాంగం పౌరులందరికీ గౌరవంగా బ్రతికే హక్కును ఇచ్చింది. స్త్రీలు కూడా పౌరులే. స్త్రీలు కూడా గౌరవంగా బ్రతకాలి. వారిని దూషించకుండా, అవమానించకుండా ఉండాలి. స్త్రీలు చేసే పనిని గౌరవించి, వారి హక్కులు, స్వేచ్ఛా వాతావరణంలో అనుభవించేటట్లు పరిస్థితులు కల్పించాలి. ప్రతీ కుటుంబంలో స్త్రీలను శారీరకంగా, మానసికంగా దెబ్బ తీస్తున్నారు. స్త్రీ పై ఆధిపత్యం కోసం పద్ధతి ప్రకారం జరిపే చర్యల క్రమమే గృహహింస.

కారణాలు :

  1. స్త్రీలలో గల అమాయకత్వం.
  2. స్త్రీల రక్షణకు కల్పించే చట్టాలపై అవగాహన లేకపోవడం.
  3. స్త్రీలలో గల నిరక్షరాస్యత.
  4. పురుష అహంకార సమాజం.
  5. స్త్రీల పట్ల సమాజం చిన్న చూపు.
  6. స్త్రీకి స్త్రీయే శత్రువుగా మారటం.
  7. స్త్రీలలో గల నిరాసక్తత.

ప్రశ్న 3.
మీరు బాలికలు, మహిళల యొక్క వివిధ సమస్యల గురించి చదివారు. ఇలాంటి సమస్యలు మీ గ్రామంలో లేదా పట్టణంలో ఎప్పుడైనా గమనించారా? అయితే, ఏం చేయాలి? (AS4)
జవాబు:
మా గ్రామం మరియు మా పరిసర ప్రాంతాలలో బాల్య వివాహాలు, వరకట్నం, లైంగిక వేధింపులు గమనించాం.

మా గ్రామంలో వరకట్న సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు గల కుటుంబాలు, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. వరుడ్ని వేలంలో కొన్నట్లు ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వారిని పెండ్లాడే సంస్కృతి కనిపిస్తుంది.

  1. ముందుగా సమాజంలో మార్పు రావాలి.
  2. స్త్రీల యొక్క గుణగణాలకు, కుటుంబ సాంప్రదాయాలకు ప్రాధాన్యత నివ్వాలి.
  3. వరకట్నం అడిగే పెద్దలను, వరుడ్ని పోలీసులకు అప్పజెప్పాలి.
  4. స్త్రీలలో మార్పు రావాలి.
  5. ఇంకా కట్నం కోసం వేధించే భర్తలను నిర్భయంగా పోలీసులకు, కోర్టులకు, స్వచ్ఛంద సంస్థల ముందుంచాలి.

ప్రశ్న 4.
బాలికలు, మహిళల సంరక్షణకై ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది. వాటిని సక్రమంగా అమలు చేయడానికి మీరిచ్చే సూచనలు ఏవి?
(లేదా)
బాలికలు, మహిళల అభివృద్ధి మరియు సంరక్షణకై ప్రభుత్వం ఎన్నో పథకాలు మరియు చట్టాల రూపకల్పన చేస్తుంది. వాటిని సక్రమంగా అమలు చేయటానికి మీరందించే సూచనలు ఏమిటి?
జవాబు:
అనాదిగా మవదేశం పురుషాధిక్యత గలది. స్త్రీలు అంటే చిన్న చూపు పురాతన కాలం నుండి కొనసాగుతుంది. అంతేకాకుండా స్త్రీలు ఎదుర్కొను అనేక సమస్యల నుండి, వేధింపుల నుండి, హింసల నుండి రక్షణకై అనేక చట్టాలు రూపొందించి, అండగా ఉంటూ అధికారులు, న్యాయస్థానాలు ఆదుకుంటున్నాయి.

అయితే చట్టాలు సక్రమంగా అమలు చేయడానికిగాను సలహాలు :

  1. చట్టాలపై స్త్రీలలో అవగాహన కలిగించడానికి గ్రామీణ ప్రాంత మహిళలలో చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
  2. అవగాహన సదస్సులు, బహిరంగ వేదికలలో చట్టాలపై వివరంగా తెలియజేయాలి.
  3. సమాచార సాధనాలైన రేడియో, టీ.వి, వార్తాపత్రికలు, సినిమాల ద్వారా చట్టాలపై అవగాహన కలిగించడానికి ఎక్కువ సమయం, స్థలం కేటాయించాలి.
  4. స్త్రీలు విద్యావంతులు కావాలి.
  5. పాఠశాల స్థాయి నుండే బాలికలలో చట్టాలపై పూర్తి అవగాహన కలిగించాలి.
  6. డ్వాక్రా, మహిళా సంఘాల సమావేశాలలో చట్టాలు – లభించే ప్రయోజనాలు, కల్పించే సౌకర్యాలు వివరించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 5.
మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఈ రోజుల్లో మహిళలు స్వేచ్ఛగా బయట తిరగడానికి సాహసించడం లేదు. ఆడ పిల్లలను చదివించడానికి బయట ప్రాంతాలకు పంపించడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ఆంక్షలు, బయట ప్రపంచంలో మహిళలను వేధించడం, బాధించడం, తక్కువ చేసి మాట్లాడటం, ఆడవాళ్ళు కనిపిస్తే ఎగతాళి చేయడం, లైంగిక వేధింపులకు గురి చేయడం, మానసిక క్షోభకు గురిచేసే మాటలనడం, అవమానించడం, భయపెట్టి, బెదిరించి, మాయమాటలు చెప్పి, ప్రేమలో దించి, లొంగదీసుకొని, హత్యా నేరాలకు పాల్పడడం మనం నిత్యం చూస్తున్నాం. అంతేకాకుండా వరకట్నం పెండ్లి సమయంలోనే కాకుండా, వివాహానంతరం కూడా ఇంకా అధికంగా కట్నం తెమ్మని, లేకపోతే బలవంతంగా చంపడం జరుగుతుంది. అమ్మాయి జన్మిస్తే తల్లిని నిందించడం నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం.

ప్రశ్న 6.
మీరు తహశీల్దారు అయితే, బాల్య వివాహాలను ఎలా అరికడతారు?
జవాబు:
బాల్యం జీవితాంతం గుర్తుండే తీపి గుర్తు. వెంటాడే సుందర దృశ్యం. బాల్యం మధురానుభూతులు అనుభవించక ముందే, చదువుకోవాలనే కోరిక తీరక ముందే, బాలబాలికల వివాహ వయస్సు రాకముందే అంటే బాలురకు 21 సం||లు బాలికకు 18 సం|| నిండక ముందే చాలా ప్రాంతాలలో బాల్యవివాహాలు జరుగుతున్నాయి.

నేనే తహశీల్దారును అయితే :

  1. నా మండల పరిధిలోగల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో గల విద్యార్థులలో చైతన్యం కల్గించే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను.
  2. పోలీస్ అధికారి, ప్లీడర్, ఒక డాక్టర్‌ను ప్రతీ గ్రామానికి పంపించి తల్లిదండ్రులకు బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు, బలవంతంగా వివాహాలు జరిపిస్తే వేసే శిక్షలు, ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు వివరిస్తాను. (వారి ద్వారా)
  3. ఎక్కడైనా అవగాహన లోపంతో బాల్య వివాహాలు జరిగినట్లు వివిధ గ్రామాధికారులు ద్వారా తెలుసుకొని, మహిళా సంక్షేమ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా మనస్తత్వ నిపుణులచే కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాను.
  4. ప్రతీ గ్రామంలో కూడా బాల్య వివాహాల నిరోధానికై కమిటినీ ఏర్పాటు చేసి, అంగన్‌వాడీ టీచర్, ANM, ఆశ వర్కర్, సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులను కమిటీగా నియమించి నిరోధానికి కృషి చేస్తాను.
  5. ప్రతీ గ్రామ సభలో దండోరా వేయించి సామాజిక అవగాహన కలిగింపజేస్తాను.

ప్రశ్న 7.
మహిళలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కొరకు ఒక కరపత్రాన్ని తయారుచేయండి. (AS6)
జవాబు:
మహిళలు ఎదుర్కొనే సమస్యలపై కరపత్రం :

ఆడదే ఆధారం – కాని వారికి లేదు సహకారం

సృష్టికి మూలకారణం ఆడది. ఆడది లేకుంటే ఈ సృలేదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా సమాజానికి దశను, దిశను నిర్దేశించే ముహిళలు నేడు అణగదొక్కబడుతున్నారు. ఆత్మన్యూనతా భావంతో అడుగంటిపోతున్నారు. చివరకు ఆత్మహత్యలే ప్రధానమనుకుంటున్నారు.

అక్రమ రవాణా :
ఉద్యోగం ఇప్పిస్తామని, సినిమాలలో అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి, వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి, వ్యభిచార గృహాలకు విక్రయించి, హింసించి మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.

వరకట్నపు పిచాచి :
అమ్మాయి, అబ్బాయి వివాహం అనంతరం (వధూవరులు) ఆనందంగా జీవించడానికి పెండ్లి సమయంలో అత్తవారు ఇచ్చే కానుకలు రోజురోజుకు వెర్రితలలు వేసి నేడు వరకట్నంను వేలం వేస్తున్నారు. కట్నం ఇవ్వలేని తల్లిదండ్రులు, వారి ఆడపిల్లలకు పెండ్లిండ్లు చేయలేని సందర్భాలెన్నో. కొన్నిసార్లు వివాహాలు జరిపించినా, తదనంతరం అదనపు కట్నం కొరకు అమ్మాయిని వేధించడం, తిట్టడం, కొట్టడం, కొన్ని సందర్భాలలో చంపివేయడం చూస్తున్నాం. ఇది న్యాయమా?

గృహ హింస :
స్త్రీలు చేసే పనిని గౌరవించాలి, ఆదరించాలి, చేయూతనందించాలి. అలాకాకుండా నాలుగు గోడల మధ్య మహిళలను రకరకాల పద్ధతులతో హింసించి, మానసిక క్షోబకు గురిచేసి ఆత్మహత్యా విధానాలకు పురికొల్పుతూ, నిండు జీవితాలను బలిచేస్తున్నారు.

లైంగిక ఆత్యాచారాలు, వేధింపులు :
ఇటీవల కాలంలో మహిళలపై ఆత్యాచారాలు, లైంగిక వేధింపులు నిత్యకృత్యమై పోయాయి. ఆఫీసులలో, లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నారు. ఎదురు తిరిగిన వారిని యాసిడ్ తో దాడి చేస్తున్నారు. కనీస మర్యాద కూడా పాటించకుండా పశువులతో సమానంగా ప్రవర్తిస్తున్నారు.

మారాలి, సమాజం మారాలి. స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో, ఎక్కడ మర్యాదలు ఆందజేస్తామో ఆ సమాజమే బాగుపడుతుంది. ఇప్పటికైనా మహిళలకు అందించాలి సహకారం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 8.
పేజీ నెం. 275లోని ‘అత్యాచారం, లైంగిక వేధింపులు’ అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
ఇటీవల కాలంలో విదేశీ సంస్కృతి వెర్రి తలలు వేసి మహిళలపట్ల చిన్నచూపు ఏర్పడి విచక్షణా జ్ఞానాన్ని మరచిపోయి, మహిళలపట్ల అనేక క్రూర చర్యలకు పాల్పడుతున్నారు. అందులో ప్రధానమైన దుశ్చర్య అత్యాచారాలు – లైంగిక వేధింపులు. స్వేచ్ఛగా, హాయిగా విహరించలేని, తిరగలేని దౌర్భాగ్యం మనకు మహిళల పట్ల కానవస్తుంది. రోజు రోజుకు మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, ‘ వేధింపులు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల ఈ రకమైన వేధింపుల నిరోడానికి, లైంగిక, అత్యాచార నియంత్రణకు జస్టిస్ జె.యస్. వర్మ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియుమించి ఫిబ్రవరి 2, 2013న దానిని రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. దీని ప్రకారం

  1. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధించబడుతుంది.
  2. మహిళలపై యాసిడ్ దాడి సమయంలో పెనుగులాటలో దాడి చేసినవారు మరణించినా మహిళలకు శిక్షలేదు.
  3. మహిళా పోలీస్ ద్వారా విచారణ జరుపబడుతుంది.
    ఈ విధంగా మహిళలకు రక్షణ కల్పించబడుతుంది.

9th Class Social Studies 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.271

ప్రశ్న 1.
అప్పుడప్పుడు 15 సంవత్సరములు కూడా నిండని పిల్లలకు వారి ప్రమేయం, ఇష్టాయిష్టాలు చూడకుండా పెళ్ళిళ్లు చేస్తున్నారు. ఇలాంటివి ఎలా ఆపవచ్చు? ఎవరు సహాయం చేస్తారు?
జవాబు:
అప్పుడప్పుడూ గ్రామీణ పల్లె ప్రాంతాలలో 18 సం||లు పూర్తికాకుండా 13, 14, 15 సం||ల వయసులో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అవగాహనా లోపం, తల్లిదండ్రులలో, పిల్లలలో చైతన్యం లేకపోవడం, తదనంతర కష్టాలు, నష్టాలు వారికి తెలియకపోవడం. అంతేకాకుండా పిల్లల పుట్టిన తేదీ, వయస్సు విషయాలలో తల్లిదండ్రులకు పూర్తి సమాచారం లేకపోవడం. ఇలాంటి బాల్య వివాహాలు జరిగినట్లు మొదట గుర్తించేది గ్రామ కార్యదర్శి. గ్రామ కార్యదర్శి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్.డి.ఓ, మండల స్థాయిలో తహశీల్దారుకు తెలియజేస్తాడు. ఈ సందర్భంగా వారికి ఫిర్యాదు చేస్తాడు. పై అధికారుల సూచన మేరకు మహిళ సంక్షేమ అధికారి CDPO మరియు సబ్ ఇన్ స్పెక్టరు, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయులు మొ||వారు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా పెళ్ళిళ్ళు ఆపవచ్చు.

9th Class Social Textbook Page No.273

ప్రశ్న 2.
మీ నివాస ప్రాంతంలో కట్నం కోసం మహిళలను వేధించడం గమనించారా? ఎలాంటి వేధింపులు జరుగుతున్నాయి? దీనిని నిరోధించాలంటే సమాజంలో ఎలాంటి మార్పులు రావాలి? ఎవరు బాధ్యత వహించాలి?
జవాబు:
మా ప్రాంతంలో కట్నం కోసం మహిళలను వేధించడం నిరంతరం చూస్తున్నాం. అదనపు కట్నం తెమ్మని అత్త మామలు, ఆడపడుచులు, భర్త తరచుగా వేధించడం, తిట్టడం, కొట్టడం, కొన్ని సందర్భాలలో బలవంతంగా చంపి, ఆత్మహత్యలుగా చిత్రీకరించడం చేస్తున్నారు. మరికొన్ని సందర్భాలలో ఈ మహిళలు ఈ వేధింపులు, బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

దీనిని నిరోధించాలంటే సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలి. వరకట్నం అనే సాంఘిక దురాచారం రూపు మాపడానికి రేపటి భావిభారత పౌరులైన విద్యార్థుల నుండే చైతన్యం రావాలి. చదువుకున్న వారిలో, తల్లిదండ్రులలో అవగాహన పెరగాలి. కట్నం వేధింపులకు విధించే శిక్షలు కఠినంగా ఉండాలి. దీనిని రూపుమాపడానికి సమాజంలో ఉన్న ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

9th Class Social Textbook Page No.274

ప్రశ్న 3.
గృహ హింస ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు మొదలై రాను రాను దురలవాటుగా మారిపోతుంది. హింస నుండి మరింత హింస పుడుతుంది. దీన్ని ఎలా ఆపవచ్చు? ఎవరు సహాయపడతారు?
జవాబు:
స్త్రీలు కూడా పౌరులే. స్త్రీలు గౌరవంగా బ్రతకడం, ఎవరూ దూషించకుండా, అవమానించకుండా ఉండడం, స్త్రీలు చేసే పనిని గౌరవించడమే కాకుండా వారికున్న హక్కులను అనుభవించేటట్లు పరిస్థితులు కల్పించడం సమాజంలోని ప్రతీ ఒక్కరి బాధ్యత.

ప్రారంభంలో చిన్న చిన్న మాటలతో అవమానించి, చులకన చేసి మాట్లాడి చివరకు శారీరక, మానసిక క్షోభకు గురిచేసి జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు.

గృహహింస మొదట ప్రారంభం కుటుంబం నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల్లో మార్పు రావాలి. మానవత్వం వెల్లివిరియాలి. కుటుంబ సభ్యుల్లో మార్పు రానప్పుడు, గృహహింస అనేక రూపాల్లో బయట పడుతున్నప్పుడు, మహిళలు పోలీస్ అధికారికి గాని, జుడీషియల్ అధికారికిగాని, ఫస్ట్ క్లాస్/మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు స్వయంగాగాని, ఫోన్ ద్వారాగాని, ఇ-మెయిల్ ద్వారాగాని ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడు, జరుగుతుందని తెలిసినప్పుడు పై అధికారులకు తెలియచేస్తూ ఆపగలరు. నిరోధించగలరు. సహాయపడగలరు.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పేదవారికి ఉచిత న్యాయ సహాయం పొందడానికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది. మీకు సమీపంలో ఉన్న వకీలు/ప్లీడరును సంప్రదించి సమాచారం సేకరించండి.
జవాబు:
న్యాయం దృష్టిలో అందరూ సమానులే. ఏ పౌరుడు కూడా ఆర్థిక కారణాల మూలంగా, ఇతర బలహీనతల కారణంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సహాయం’ అందిస్తుంది. ఇందులకై కేంద్రప్రభుత్వం 1976వ సం||లో భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 39(ఎ) జత చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయ సహాయాన్ని అందించేలా చేయడానికి లోక్ అదాలత్ లను ఏర్పరచింది.

న్యాయ సహాయం పొందడానికి అర్హులు :

  1. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
  2. మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు.
  3. ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు.

రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు.

దరఖాస్తు చేసే విధానం :
జిల్లా కోర్టు, హైకోర్టు న్యాయసేవా అధికార సంస్థకు సహాయం కొరకు దరఖాస్తు చేస్తే సహాయం అందించబడుతుంది.

న్యాయ సహాయ విధానాలు :

  1. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట.
  2. న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం.
  3. కేసులకు పరిశీలించిన మీదట, అవసరమైనచో దరఖాస్తుదారుని తరఫున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టడం.
  4. న్యాయ సహాయం పొందినవారికి ఆయా కేసులలో తీర్పుల నకళ్ళు ఉచితంగా ఇవ్వడం, మొదలగు సహాయాలు అందించబడతాయి.

AP 9th Class Social Important Questions Chapter 5 జీవావరణం

These AP 9th Class Social Important Questions 5th Lesson జీవావరణం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 5th Lesson Important Questions and Answers జీవావరణం

9th Class Social 5th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ఆహారపు గొలుసు అనగానేమి?
జవాబు:
ఒక రకమైన జీవరూపం మరొకదానికి ఆహారం అవుతుంది. దీనినే ‘ఆహారపు గొలుసు’ అంటారు.

ప్రశ్న 2.
మొక్కలు తయారు చేసిన ఆహారాన్ని తినే జంతువులు ఏవి?
జవాబు:
మొక్కలు తయారుచేసిన ఆహారాన్ని ‘శాకాహారులు’ అని పిలిచే జింక, ఆవు, మేక, ఏనుగు వంటి గడ్డి తినే జంతువులు తింటాయి.

ప్రశ్న 3.
మాంసాహార జంతువులు అనగానేమి?
జవాబు:
శాకాహార జంతువులను తినే వాటిని మాంసాహార జంతువులంటారు. కుక్క, పిల్లి, డేగ, పులి, సింహం మొ||నవి ఉదాహరణలు.

AP 9th Class Social Important Questions Chapter 5 జీవావరణం

ప్రశ్న 4.
సహజ వృక్షజాలాన్ని ఎన్ని వర్గాలుగా విభజిస్తారు? అవి ఏవి?
జవాబు:
సహజ వృక్ష జాలాన్ని ప్రధానంగా మూడు వర్గాలుగా విభజిస్తారు.

  1. తగినంత వర్షపాతం, ఎండ ప్రాంతాల్లో అడవులు
  2. ఒక మాదిరి వర్షాలు పడే ప్రాంతాలలో గడ్డిభూములు
  3. శుష్క ప్రాంతాలలో పొదలు.

ప్రశ్న 5.
టండ్రా వృక్షజాలం అనగానేమి?
జవాబు:
బాగా చలిగా ఉండే ప్రాంతాలలో పెరిగే నాచు, లిచెన్, చిన్న పొదలతో కూడిన మొక్కలను టండ్రా వృక్షజాలం అంటారు.

ప్రశ్న 6.
మధ్యధరా వృక్షజాలానికి ఆ పేరు ఎలా వచ్చింది?
జవాబు:
ఇవి మధ్యధరా సముద్రం చుట్టూ యూరప్, ఆఫ్రికా, ఆసియాలలో కనబడతాయి. కాబట్టి వీటికి మధ్యధరా వృక్షజాలం అని పేరు వచ్చింది.

ప్రశ్న 7.
టైగా అంటే ఏమిటి?
జవాబు:
ఉత్తరార్ధ గోళంలో 50 నుంచి 70° అక్షాంశాల మధ్య అద్భుతమైన శృంగాకారపు అడవులు కనపడతాయి. వీటిని ‘టైగా’ అని కూడా అంటారు.

ప్రశ్న 8.
స్టెప్పీలు అనగానేమి?
జవాబు:
ఈ సమశీతోష్ణ మండల గడ్డి భూములను ‘స్టెప్పీలు’ అంటారు. ఇక్కడి గడ్డి కురచగా ఉంటుంది.

ప్రశ్న 9.
ఏ రకమైన వృక్షజాలాన్ని టండ్రా వృక్షజాలం’ అంటారు?
జవాబు:
ధృవ ప్రాంతంలో వృక్షజాలం తక్కువ. నాచు, లిచెన్, చిన్న చిన్న పొదలు’ వంటివి ఇక్కడ ఉంటాయి. ఈ రకమైన వృక్షజాలాన్ని ‘టండ్రా వృక్షజాలం’ అంటారు.

ప్రశ్న 10.
శిలాజ ఇంధనాలు వేటిని అంటారు?
జవాబు:
లక్షల సం||రాల క్రితం అడవులు భూమిలోపలికి తిరగబడటం వల్ల బొగ్గు, చమురులు ఏర్పడ్డాయి. అందుకే వీటిని ‘శిలాజ ఇంధనాలు’ అంటారు.

ప్రశ్న 11.
శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తే విడుదలగు రసాయనాలు ఏవి?
జవాబు:
శిలాజ ఇంధనాలు ఉపయోగించటం వల్ల బొగ్గుపులుసు వాయువుతో పాటు నైట్రోజన్ ఆక్సెడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, ఆవిరైపోయే కర్బన మూలకాలు, భారలోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి.

ప్రశ్న 12.
ఆమ్లవర్షం అని దేనిని అంటారు?
జవాబు:
వాతావరణంలోని ఆమ్ల రేణువులు వర్ష బిందువులతో కలిసినప్పుడు వాన నీటిలో ఆమ్లశాతం పెరుగుతుంది. దీనినే ఆమ్ల వర్షం అంటారు.

ప్రశ్న 13.
‘ప్రపంచం వేడెక్కటం’ అనగానేమి?
జవాబు:
వివిధ రకాల కాలుష్యాల వలన – పర్యావరణం విషపూరితం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా శీతోష్ణస్థితులు మారుతాయి. దీనినే ‘ప్రపంచం వేడెక్కటం’ (Global warming) అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 5 జీవావరణం

ప్రశ్న 14.
“భూగోళం వేడెక్కడానికి” గల ఏవేని రెండు కారణాలను రాయండి.
జవాబు:

  1. అడవుల నిర్మూలన, శిలాజ ఇంధన వినియోగం.
  2. పరిశ్రమల నుండి విడుదల చేసే వివిధ రకాల కాలుష్యకారకమైన వాయువులు.

ప్రశ్న 15.
పర్యావరణ కాలుష్య నివారణపై ప్రజలకు అవగాహన కల్గించడానికి చేపట్టదగిన ఏవైనా రెండు కార్యక్రమాలను రాయండి.
జవాబు:

  1. గ్రామాలలో మరియు పట్టణాలలో డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన ద్వారా కాలుష్యం ఎలా పెరుగుతుంది మరియు ఎలా అరికట్టాలి అనేది తెలియచేయాలి.
  2. జానపద పాటలు, మరియు నాటకాల ద్వారా పర్యావరణం మనకు ఎంత అవసరమో మరియు దానిని ఎలా పరిరక్షించాలో తెలియచేయాలి.

ప్రశ్న 16.
అటవీ సంరక్షణ మీద నినాదాలు రాయండి.
జవాబు:
అటవీ సంరక్షణ మీద నినాదాలు :

  1. వృక్షో రక్షతి రక్షితః
  2. మొక్కలను కాపాడండి – అవి మన ప్రాణాలను కాపాడుతాయి.

9th Class Social 5th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
గాలి, నీరు, నేలలో విషపూరితమైన పదార్థాలు కలవటం వలన జీవావరణ సంక్షోభానికి దారితీస్తుంది. దీని నివారణకు విద్యార్థిగా మీరు సూచించే పరిష్కార మార్గాలు తెలపండి.
జవాబు:
గాలి కాలుష్యం – నివారణ చర్యలు :

  1. గాలిలో ఉన్న మరియు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే మనం తక్కువ దూరాలకు నడిచి కాని, సైకిల్ ద్వారా కాని, మరియు ప్రభుత్వ రవాణా సదుపాయాల ద్వారా కాని చేరుకోవాలి.
  2. ఎక్కువగా మొక్కలను పెంచాలి.
  3. రైతులు పొలంలో మిగిలిన వ్యర్థ పదార్థాలను తగులు పెట్టకుండా వాటిని వేరే విధంగా ఉపయోగించాలి.
  4. పరిశ్రమలలో కూడా కాలుష్య నియంత్రణ చేసే యంత్రాలను వాడేవారికి మాత్రమే అనుమతి ఇవ్వాలి.

నీటి కాలుష్యం – నివారణ చర్యలు :

  1. పరిశ్రమలలోని వ్యర్థాలను చెరువులు, నదులు, సముద్రాలలోనికి వదలకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.
  2. రైతులు సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించాలి.

నేల కాలుష్యం – నివారణ చర్యలు :

  1. రైతులు రసాయన ఎరువులను వాడటం వలన నేల కలుషితం అయి సారాన్ని కోల్పోతుంది.
  2. కావున వారు రసాయన ఎరువుల వాడకాన్ని చాలావరకు తగ్గించాలి.

ప్రశ్న 2.
AP 9th Class Social Important Questions Chapter 5 జీవావరణం 1
పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ. భారతదేశంలో అధికభాగం ఏ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి?
బి. హిమాలయాలలోని అడవుల రకం ఏవి?
సి. ఉష్ణమండల సతత హరిత అడవులలో పెరిగే చెట్లు ఏవి?
డి. టేకు, వేప లాంటి చెట్లు ఏ రకమైన అడవులలో పెరుగుతాయి?
జవాబు:
ఎ. భారతదేశంలో అధికభాగం ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఉన్నాయి.
బి. భారతదేశంలోని హిమాలయాలలో శృంగాకారపు అడవులు ఉన్నాయి.
సి. ఉష్ణమండల సతత హరిత అడవులలో పెరిగే చెట్లు, రోజ్ వుడ్, ఎబోని, మహాగని, గట్టి కలపనిచ్చే చెట్లు.
డి. టేకు, వేప లాంటి చెట్లు ఉష్ణమండల ఆకురాల్చే అడవులలో పెరుగుతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు

9th Class Social Studies 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మౌలిక సరుకుల పరిశ్రమలను నెలకొల్పటానికి ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకుంది? (AS1)
జవాబు:
మౌలిక సరుకుల పరిశ్రమలను నెలకొల్పటానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొనటానికి గల కారణం :

  1. దేశం పారిశ్రామికీకరణ చెందాలంటే, వివిధ రకాల కర్మాగారాలు పెద్ద సంఖ్యలో అభివృద్ధి చెందాలంటే యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు రవాణా సౌకర్యాలు వంటి కొన్ని మౌలిక సౌకర్యాలు అవసరం.
  2. ఈ అవసరమైన సరుకులను – యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలంటారు.
  3. అనేక కర్మాగారాలకు అవసరమయ్యే మౌలిక సరుకులను ఈ మౌలిక పరిశ్రమలు అందిస్తాయి కాబట్టి ప్రభుత్వం ఈ పరిశ్రమలను స్థాపించటానికి బాధ్యత తీసుకుంది.

ప్రశ్న 2.
కొన్ని ప్రత్యేక ప్రాంతాలలోనే పరిశ్రమలు ఎందుకు నెలకొల్పబడ్డాయి? (AS1)
జవాబు:
కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొల్పబడడానికి కారణాలు :

  1. ముడి సరుకుల లభ్యత
  2. కూలీల అందుబాటు
  3. పెట్టుబడి
  4. విద్యుత్
  5. మార్కెట్ వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని పరిశ్రమలను స్థాపించుతారు.
  6. అందువల్లనే పరిశ్రమలు అన్ని అంశాలు అనువుగా అందుబాటులో ఉండే ప్రదేశాల్లో లేదా తక్కువ ఖర్చుతో సమకూర్చుకోగల ప్రదేశాల్లో నెలకొల్పుతారు.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 3.
మౌలిక సరుకుల పరిశ్రమలు ఏవి? వినియోగ వస్తువుల పరిశ్రమలకూ వీటికీ తేడా ఏమిటి? (AS1)
జవాబు:
యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలు ప్రజలు ఉపయోగించే వస్తువులను తయారు చేసే పరిశ్రమలను వినియోగ వస్తువుల పరిశ్రమలంటారు.

మౌలిక సరుకుల పరిశ్రమలు వినియోగ వస్తువుల పరిశ్రమలు
1. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకోలేరు. 1. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకోగలరు.
2. వీటిని ఉపయోగించి వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయవచ్చును. 2. వీటిని ప్రజలు తమ అవసరాల కొరకు ఉపయోగించుకొంటారు.

ప్రశ్న 4.
ఖనిజ వనరులు ఉన్న పట్టణాలు / ప్రాంతాల పేర్లు విద్యార్థులచే గుర్తింపజేసి, అక్కడ ఎలాంటి పరిశ్రమలు స్థాపించవచ్చో వాళ్లని రాయమనండి. (AS1)
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 1
జవాబు:

ప్రశ్న 5.
అంతకుముందు ప్రభుత్వ రంగానికే పరిమితమైన అనేక పరిశ్రమలలోకి 1990లలో ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం ఎందుకు అనుమతించింది? (AS4)
జవాబు:

  1. కర్మాగారాలలో తయారైన వినియోగ వస్తువులు దేశంలోకి దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం చట్టాలను సడలించింది.
  2. భారతదేశంలో పారిశ్రామిక కార్యకలాపాలను ప్రత్యేకించి కొత్త వాణిజ్యవేత్తలను ప్రోత్సహించటానికి ప్రభుత్వ నియమాలను సరళీకృతం చేశారు.
  3. ప్రభుత్వ ఆధీనంలోని పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచటానికి వాటిలో కొన్నింటిని అమ్మేశారు.
  4. ఈ పరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించే నిధులను కూడా తగ్గించేశారు.
  5. ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోటానికి ఈ కంపెనీలను అనుమతించసాగారు.
  6. కొత్త సాంకేతిక విజ్ఞానం దేశంలోకి వచ్చేలా, ఉత్పత్తి చేసిన సరుకులను విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించడానికి విదేశీ, ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలను భారతదేశంలో పరిశ్రమలు స్థాపించటానికి ప్రోత్సహించసాగారు.

ప్రశ్న 6.
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఉపాధి కల్పన ఎలా ప్రభావితమైనది? (AS1)
జవాబు:

  1. పారిశ్రామిక సంస్థల సంఖ్య పెరిగింది. కానీ ఉపాధి ఆశించినంతగా పెరగలేదు. ఎక్కువగా చిన్న చిన్న ఉద్యోగాలే కల్పించబడ్డాయి.
  2. ప్రస్తుతం భారతదేశంలో సంఘటిత రంగంగా వ్యవహరించే రెండు లక్షల పెద్ద కర్మాగారాలున్నాయి.
  3. అసంఘటిత రంగంగా పేర్కొనే 3 కోట్ల చిన్న పారిశ్రామిక కేంద్రాలున్నాయి.
  4. ఇవన్నీ కలిపి దేశంలోని 46 కోట్ల కార్మికవర్గంలో అయిదింట ఒక వంతుకు ఉపాధి కల్పిస్తున్నాయి.
  5. కర్మాగారాలలో ఉపాధి పొందే కార్మికుల శాతాన్ని ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు.
  6. కార్మికులకు మెరుగైన జీతాలు, మెరుగైనని సురక్షిత పని పరిస్థితులు, ఆరోగ్య వైద్య సదుపాయాలను పరిశ్రమల యాజమాన్యాలు కల్పించేలా భారతదేశంలో అనేక చట్టాలను చేశారు.
  7. అనేక కొత్త పరిశ్రమలు ఏర్పడతాయని, కాలక్రమంలో కార్మికులలో అధిక శాతం సంపాదన పెరుగుతుందని ఆశించారు.
  8. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికి పరిశ్రమలలో ఉపాధి శాతం ఆశించినంతగా పెరగలేదు.
  9. అంతేగాకుండా కార్మికులలో చాలామంది చిన్న పారిశ్రామిక కేంద్రాలలో ఉపాధి పొందుతున్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 7.
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ప్రభుత్వ ఆదాయం ఎలా ప్రభావితమైనది? (AS1)
జవాబు:
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ప్రభుత్వ ఆదాయం ప్రభావితమైన విధానం :

  1. ప్రభుత్వ పారిశ్రామిక రంగాల విషయంలో పరిశ్రమల నిర్వహణకు ప్రతి సంవత్సరం కొన్ని నిధులు కేటాయించేవారు.
  2. కాలక్రమంలో ఇవి స్వతంత్రమైనా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తాయని భావించేవారు.
  3. అనేక ప్రభుత్వ రంగ కర్మాగారాలలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉండేది. వీటికి ప్రభుత్వం సహాయం నిరంతరం అవసరం అవుతూ ఉండేది.
  4. వీటి నిర్వహణలో ప్రభుత్వ జోక్యం కొనసాగుతూ ఉండేది. ఆశించిన దానికంటే వాటి పని చాలా నిరాశాజనకంగా ఉండేది.
  5. అందువల్ల అలాంటి వాటిని ప్రైవేటు పరం చేసి నూతన పారిశ్రామిక విధానం ప్రకారం అత్యుత్తమ లాభాలు పొందుతున్న సంస్థలను మాత్రమే దాని నియంత్రణలో ఉంచింది.

ప్రశ్న 8.
“పరిశ్రమల వల్ల పర్యావరణ సమస్యలు పెరుగుతాయి” చర్చించండి. (AS4)
జవాబు:

  1. పరిశ్రమల ఉత్పత్తి ప్రక్రియలో విద్యుత్, వివిధ రసాయనికాలు అవసరం అవుతాయి.
  2. ఉత్పత్తి క్రమంలో ఈ పరిశ్రమలు అనేక వ్యర్థాలను విడుదల చేస్తాయి.
  3. పారిశ్రామిక ప్రాంతాలలో ఇవి కాలుష్యానికి దారితీస్తున్నాయి.

ప్రశ్న 9.
పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కొన్ని నినాదాలు రాయండి. (AS6)
(లేదా)
“పర్యావరణ కాలుష్య నివారణకై” ఏవైనా రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  1. వృక్షో రక్షతి రక్షితః
  2. పర్యావరణ పరిరక్షణ – మనందరి బాధ్యత.
  3. మనిషికి ఆయువు పెరగాలి – అందుకే చెట్లను పెంచాలి.
  4. కాలుష్యాన్ని నివారించండి – పర్యావరణాన్ని కాపాడండి.
  5. సహజ ఎరువులను వాడండి – పుడమితల్లిని కాపాడండి.
  6. ప్రకృతి రక్షణే జీవాధారం – చెట్లే ప్రగతికి ప్రాణాధారం.
  7. హద్దులు లేని అనుబంధానికి అమ్మే ఒక అందం
    అంతులేని ఆనందానికి ప్రకృతితోనే బంధం.
  8. పరిసరమే మన చుట్టూ ఉండే చక్కని నేస్తం
    పర్యావరణం కాపాడటమే మన అందరి కర్తవ్యం.
  9. చెట్లు లేనిది బ్రతుకే లేదు
    మానవ జాతికి మెతుకే లేదు.
  10. గాలీ, నేలా, నీరు, నింగి జీవుల మనుగడకి ఆధారం.
    అడవులు నరికి పెంచే కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలే మానవునికి దుఃఖకారణం.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 10.
పేజీ నెం. 83లోని రెండవ పేరాను (రేడియోసెట్ల నుంచి ……….. కీలకమవుతుంది) చదివి వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
సమాచార సాంకేతిక విజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ భారతదేశాన్ని ఆసియా. ఖండంలో ప్రధమురాలిగా నిలబెట్టాయి. భారతదేశానికి ఎలక్ట్రానిక్స్ రాజధానిగా బెంగళూర్ ఎదిగింది. ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్, పుణె, చెన్నై, కోల్ కత, లక్నో, కోయంబత్తూరు వంటి నగరాలు సమాచార విప్లవంలో దూసుకుపోతున్నాయి.

రేడియో సెట్ల నుండి టెలివిజన్ వరకు, టెలిఫోన్లు, చరవాణీలు, పేజర్లు, కంప్యూటర్లతో దేశం దూసుకుపోతోంది. ఈ ‘ రంగంలో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలో 30% వరకు మహిళలు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రంగాలలో ప్రగతి కొనసాగి, విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం ఈ రంగం ఆర్జిస్తుంది.

ప్రశ్న 11.
పేజీ నెం. 95లోని పటాన్ని పరిశీలించి, భారతదేశ అవుట్ లైన్ పటంలో మన దేశంలోని ఇనుము – ఉక్కు కర్మాగారాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 2

9th Class Social Studies 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.76

ప్రశ్న 1.
ఇతర కర్మాగారాలు ముడి సరుకులుగా ఉపయోగించుకొనే వస్తువులను తయారు చేసే కర్మాగారాల జాబితా రాయండి.
జవాబు:
యంత్రాల పరిశ్రమ, విద్యుత్ పరిశ్రమ, ఖనిజాల పరిశ్రమ, ముడి లోహాలను శుద్ధి చేసే పరిశ్రమ రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలు.

ప్రశ్న 2.
ఇతర కర్మాగారాల కోసం ఉత్పత్తి చేసే అనేక వస్తువులకు ఇనుము మౌలిక అవసరం. మీ చుట్టు పక్కల కనిపించే ఉదాహరణలతో దీనిని వివరించండి.
జవాబు:
ఇనుము మౌలిక అవసరం.
ఉదా : నేలను త్రవ్వే పలుగు, పార, కోయడానికి ఉపయోగించే కత్తులు, కొడవళ్లు, చాకులు బరిసెలు. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ” ఇనుపచువ్వలు.

వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే మేకులు, వివిధ రకాలైన ఫ్రేములు మొ||నవి.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 3.
కర్మాగారాలలో ఉపయోగించే యంత్రాలను మీరు చూశారా? వివిధ రకాల యంత్రాల చిత్రాలను సేకరించండి.
జవాబు:
కర్మాగారాలలో ఉపయోగించే యంత్రాలను మేము చూశాము. అవి :
బియ్యం మిల్లు, పత్తి మిల్లు, కారం పట్టేవి, పిండి పట్టేవి, నీరు లాగేవి మొ||నవి.

ప్రశ్న 4.
అనేక వస్తువుల ఉత్పత్తిలో పెట్రోలియం మౌలిక అవసరం ఎలా అవుతుందో తెలియజేసే చార్టుని తయారు చేయండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 3

ప్రశ్న 5.
‘మౌలిక’ అనే పదం అంటే ఏమిటో చర్చించండి. పరిశ్రమలకు మౌలిక అవసరాలు ఏమిటి?
జవాబు:
మౌలిక అంటే ముఖ్యమైనవి, ప్రధానమైనవి, ప్రాథమికమైనవి అనే అర్థాలు వస్తాయి. పరిశ్రమకు మౌలిక అవసరాలు ఏమిటనగా యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలు వంటివి. ”

ప్రశ్న 6.
స్వాతంత్ర్య కాలంలో పారిశ్రామికీకరణ ద్వారా మనం ఏ లక్ష్యాలను సాధించాలని కోరుకున్నాం?
జవాబు:
స్వాతంత్ర్యకాలంలో పారిశ్రామికీకరణ ద్వారా మనం సాధించాలని అనుకున్న లక్ష్యాలు :

  1. పారిశ్రామిక కార్యకలాపాలు మొదలైతే పట్టణీకరణ మొదలవుతుంది.
  2. పట్టణాలలో మాత్రమే పట్టణ సమీప ప్రాంతాలలో పరిశ్రమలను స్థాపించి వాటిని అభివృద్ధి చేయడం.
  3. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ జంటగా పురోగమిస్తాయి.
  4. పట్టణాలు సరుకులకు మార్కెట్ గా ఉండటమేగాక బ్యాంకింగ్, బీమా, రవాణా కార్మికులు, సలహాదారుల, ఆర్థిక సలహాలు వంటి సేవలను కూడా అందిస్తాయి.
  5. అందువల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించి పారిశ్రామిక వాతావరణాన్ని కల్పించాలి.
  6. భారతదేశ జనాభా ప్రధానంగా గ్రామీణ జనాభా కావడం వలన గ్రామాలలో పరిశ్రమలను స్థాపించవలసిన అవసరం ఉన్నదని భావించడం.

9th Class Social Textbook Page No.77

ప్రశ్న 7.
టీ పొడి, టూత్ పేస్టు కవర్లు (Wrappers) సేకరించండి. వాటిమీద ఉన్న విషయాన్ని చదివి కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
………………. ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు.
………………. ని ఖనిజ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు.
జవాబు:
టీ పొడి, టూత్ పేస్ట్.

ప్రశ్న 8.
టూత్ పేస్ట్ కు ముడిసరుకులైన …………………….., ………………… లను మరో పరిశ్రమలో ఉత్పత్తి చేస్తారు. దానిని మౌలిక లేదా కీలక పరిశ్రమ అంటారు. ఇందుకు భిన్నంగా టూత్ పేస్ట్ వినియోగదారీ సరుకు కావడం వల్ల ఈ పరిశ్రమ వినియోగదారీ వస్తు పరిశ్రమ అంటారు.
జవాబు:
అల్యూమినియం ట్యూబు, కాల్షియం.

ప్రశ్న 9.
పరిశ్రమల యాజమానులు వ్యక్తులు కావచ్చు, వ్యక్తుల బృందం కావచ్చు. ఉదా : టీ ప్యాకెట్ల తయారీ యజమానులు …………….. కాగా టూత్ పేస్టు …………… ఇలాంటి పరిశ్రమను ప్రైవేటు రంగ పరిశ్రమ అంటారు. యాజమాన్యం ప్రభుత్వానికి చెందినట్లయితే దానిని, ప్రభుత్వరంగ పరిశ్రమ అంటారు. అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలకు రెండు ఉదాహరణలు …………..
జవాబు:
ప్రయివేటు వ్యక్తులు, పేస్ట్ తయారీ ;

  1. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
  2. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 10.
పెద్ద సంఖ్యలో వ్యక్తులు కొన్ని పరిశ్రమలను పాలు, చెరకు, కొబ్బరి పీచు మొదలైన ముడి సరుకులను, వనరులను సమీకరించుకొని నిర్వహిస్తారు. ఇటువంటి పరిశ్రమలను ………… అంటారు.
జవాబు:
సహకార పరిశ్రమలు

9th Class Social Textbook Page No.78

ప్రశ్న 11.
నూలు వడకటం, ఖద్దరు నేయటానికి మహాత్మాగాంధీ ఎందుకు ప్రాధాన్యత నిచ్చారు?
జవాబు:
నూలు వడకటం, ఖద్దరు నేయటానికి మహాత్మాగాంధీ ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం :

  1. మన దేశంలో ప్రాచీనమైన, అతి పెద్ద పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ.
  2. ఎక్కువమందికి జీవనోపాధి కల్పించే పరిశ్రమ నూలు పరిశ్రమ.
  3. అందరికి అవసరమైన వస్తువు బట్టలు. అందువల్ల ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం యంత్రాలపై – నేయబడిన వస్త్రాలను దిగుమతి చేసుకోవడంతో చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది.
  4. కావున చేనేత కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ, మనకు కావలసిన వస్త్రాన్ని మనమే తయారు చేసుకుంటూ, వ్యాపార నిమిత్తం భారత దేశానికి వచ్చిన బ్రిటిష్ వారికి లాభం లేకుండా చేయడం వలన వారు మనదేశం నుండి వెళ్ళిపోవడానికి అవకాశం కల్పించగలము అనే నమ్మకంతో గాంధీగారు అలాంటి విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

9th Class Social Textbook Page No.80

ప్రశ్న 12.
పంచదార, బెల్లం పరిశ్రమలను ఎక్కడ స్థాపించాలి?
జవాబు:

  1. పంచదార, బెల్లం పరిశ్రమలు చెరకు పండే ప్రాంతాలలోనే స్థాపించాలి. కారణం చెరకు నరికిన తరువాత ఎక్కువ కాలం నిల్వ ఉంటే సుక్రోజ్ శాతం తగ్గిపోతుంది.
  2. అందువల్ల చెరకు నరికిన వెంటనే పరిశ్రమకు తరలించవలసి ఉంటుంది.
  3. కావున చెరకు పండే ప్రాంతాలలోనే. పంచదార, బెల్లం పరిశ్రమలను స్థాపించవలసి ఉంటుంది.

ప్రశ్న 13.
భారతదేశంలో తలసరి ఉక్కు వినియోగం ఎందుకు తక్కువగా ఉంది?
జవాబు:

  1. ఇనుము – ఉక్కు పరిశ్రమలు మౌలిక పరిశ్రమలు ఇతర భారీ, మధ్యతరహా, తేలికపాటి పరిశ్రమలన్నీ తమకు కావలసిన యంత్రాలకు వీటిపై ఆధారపడి ఉన్నాయి.
  2. అనేక రకాల ఇంజనీరింగ్ వస్తువులు, భవననిర్మాణ సామగ్రి, రక్షణ, వైద్య, దూరవాణి, శాస్త్రీయ పరికరాలు, అనేక వినియోగదారీ వస్తువుల వంటి వాటికి ఉక్కు అవసరం.
  3. కాని పైన పేర్కొనబడిన పరిశ్రమలు భారతదేశంలో చెప్పుకోదగినంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు.
    అందువల్ల తలసరి ఉక్కు వినియోగ తక్కువగా ఉంది.

9th Class Social Textbook Page No.82

ప్రశ్న 14.
సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాలను ఎక్కడ స్థాపించటం ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది?
జవాబు:
సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాలను స్థాపించవలసిన ప్రదేశాలు :

  1. ప్రధాన ముడిపదార్థాలైన సున్నపురాయి, సిలికా, అల్యూమినియం, జిప్సం వంటి ముడి పదార్థాలు ఎక్కడ లభిస్తాయో సాధారణంగా సిమెంట్ పరిశ్రమలు అక్కడ స్థాపించవలసి ఉంటుంది.
  2. సిమెంట్ పరిశ్రమకు రైలు వంటి రవాణా సౌకర్యాలతో పాటు బాగా అభివృద్ధి చెందిన ప్రదేశం కూడా కావాలి.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 15.
గల్ఫ్ దేశాల మార్కెటుకి దగ్గరగా గుజరాత్ లో సిమెంట్ కర్మాగారాలు కొన్ని నెలకొని ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలలో సిమెంట్ కర్మాగారాలు ఎక్కడ నెలకొని ఉన్నాయో తెలుసుకోండి. ఆ కర్మాగారాల పేర్లు తెలుసుకోండి.
జవాబు:

  1. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో చెన్నైలో నిర్మించారు.
  2. 1989లో ధర, పంపిణీలలో నియంత్రణలను తీసివేయటం, ఇతర విధానాలలో సంస్కరణల వల్ల సామర్థ్యం, ప్రక్రియ, సాంకేతిక విజ్ఞానం, ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించింది.
  3. సిమెంట్ నాణ్యత పెరగటంతో తూర్పు ఆసియా, గల్ఫ్ దేశాలలో, ఆఫ్రికా దక్షిణ ఆసియాలలో మన దేశ సిమెంటుకు గిరాకీ పెరిగింది.

సిమెంట్ పరిశ్రమ నెలకొని ఉన్న ప్రాంతాలు :

  1. తమిళనాడు : తలైయుత్తు అలంగులం, తలకపట్టి దాల్మియాపురం, పాలియూర్, వంకరిదుర్గ్, మధురై.
  2. మధ్యప్రదేశ్ : జముల్, సాత్నా, కల్ని, కైమూర్, బాన మూర్, ముంధర్ దేశంలోకెల్లా జముల్ ఫ్యాక్టరీ అతి పెద్దది.
  3. ఆంధ్రప్రదేశ్ : జగ్గయ్యపేట.
  4. తెలంగాణ : కరీంనగర్, కోదాడ.
  5. రాజస్థాన్ : లఖేరి బుంది, సవాయ్, మాధోపూర్ బితోర్ గద్, ఉదయపూర్.

9th Class Social Textbook Page No.84

ప్రశ్న 16.
దిగువ పట్టికను పూరించండి.
కొన్ని పరిశ్రమల గురించి తెలుసుకోవడానికి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 4
జవాబు:

పరిశ్రమ ప్రస్తుతం అవి ఉన్న రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలలో అవి ఎందుకు ఉన్నాయి?
రసాయనిక పరిశ్రమ రసాయనిక ఎరువులు :
బీహార్ లోని సింద్రి, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్, తెలంగాణలోని రామగుండం, పంజాబ్ – నంగల్, హర్యానా – పానిపట్
ఆయా రాష్ట్రంలో ఎక్కువగా నెలకొల్పడానికి ప్రధాన కారణం – రసాయనాలు, విద్యుత్, పెట్రోలియం వంటి ఉత్పత్తులు ఆయా ప్రాంతాలలో విరివిగా దొరకడం.
ఎరువుల పరిశ్రమ సింథటిక్ దారాలు :
మహారాష్ట్ర – ముంబయి
గుజరాత్ – అహ్మదాబాద్
మధ్యప్రదేశ్ – గ్వాలియర్
తెలంగాణ – కాగజ్ నగర్పెట్రో కెమికల్స్ :
మహారాష్ట్ర – ట్రాంబే ధానే
గుజరాత్ – వడోదర
సిమెంట్ పరిశ్రమ తమిళనాడు – తలైయుత్తు అలిహలా
తలకపట్టి దాల్మియాపూర్
ఆంధ్రప్రదేశ్ – జగ్గయ్యపేట
తెలంగాణ – కరీంనగర్, కోదాడ
గుజరాత్ – సిక్కా, సూరీ
రాజస్థాన్ – లభేరి బుంది
సిమెంట్ పరిశ్రమకు కావలసిన సున్నపురాయి, సిలికా, అల్యూమినియం, జిప్సం వంటి ముడి పదార్థాలతో పాటు, అభివృద్ధి చెంది రవాణా సౌకర్యాలు
ఆటోమొబైల్ పరిశ్రమ మహారాష్ట్ర – ముంబయి, పుణె
పశ్చిమబెంగాల్ – కోల్ కత
తమిళనాడు – చెన్నై
ఉత్తరప్రదేశ్ – లక్నో
రోడ్లు, రవాణా అభివృద్ధి చెంది ఉండడం, ఎగుమతులు, దిగుమతులకు అనుకూల ప్రదేశాలు సాంకేతిక నైపుణ్యం గల, సాంకేతిక నైపుణ్యం లేని శ్రామికులు ఎక్కువగా ఉండడం.

9th Class Social Textbook Page No.88

ప్రశ్న 17.
రెండు ‘పై’ (Pie) చార్టులలోని మూడు రకాల ఆర్థిక రంగాలలో ‘ఉపాధిలో తేడాలు ఏమిటి ? :
(లేదా)
కింది “పై” చార్టు, వ్యవసాయ, పరిశ్రమలు మరియు సేవారంగం ద్వారా పొందుతున్న ఉపాధి శాతాలను తెలియజేస్తున్నది. చార్టును పరిశీలించి, ప్రశ్నకు సమాధానం రాయండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 5
ప్రశ్న: 1972 – 73 మరియు 2009-2010 మధ్య ఉపాధి కల్పనలో వచ్చిన మార్పులు ఏమిటి?
జవాబు:
1972-73 సం||రం వ్యవసాయంపై ఆధారపడిన వారి శాతం – 74%.
2009-2010 సం||రం వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి శాతం 53%.
కావున 1972 -73 సం||రంతో పోలిస్తే వ్యవసాయ రంగంపై ఆధారపడిన శాతం తగ్గింది.
1972 -73 పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం – 11%.
2009 – 10 సం||రంలో పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం – 22%.
కావున 1972 – 73 సంవత్సరంతో పోలిస్తే 2009-10 సం||రంలో పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.
1972 – 73 సం||రంలో సేవలపై ఆధారపడిన వారి శాతం – 13%.
2009 – 10 సం||రంలో సేవలపై ఆధారపడిన వారి శాతం – 25%.
కావున 1972 – 73 సంవత్సరంతో పోలిస్తే 2009 – 10 సం||రాల్లో సేవలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.
మొత్తం మీద 1972 – 73 సం||రానికి 2009 – 10 సం||రానికి తేడా ఏమనగా వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి శాతం తగ్గగా మిగిలిన రంగాలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.

ప్రశ్న 18.
పారిశ్రామిక రంగం వారీగా ఉపాధి కల్పనలో ఎంత శాతం తేడా ఉంది?
జవాబు:
1972 – 73 లో పారిశ్రామిక రంగంపై ఆధారపడిన వారి శాతం – 11%
2009 – 10 లో పారిశ్రామిక రంగంపై ఆధారపడిన వారి శాతం – 22%
తేడా – 11%
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 6

ప్రశ్న 19.
పరిశ్రమలలో ఆశించినంతగా ఉపాధి పెరగలేదా? టీచరుతో చర్చించండి.
జవాబు:
పరిశ్రమలలో ఆశించినంతగా ఉపాధి పెరగలేదు. కారణం –
1972-73లో 11% ఉంటే 2009-10లలో 22 శాతానికి మాత్రమే పెరిగినది. అంటే 27 సం||రాలలో ఉపాధి కేవలం 11% మాత్రమే పెరిగినది.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 7

9th Class Social Textbook Page No.90

రవాణా వాహనాలు, పంపులు ఉత్పత్తి, ….. 1950 – 2011
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 8

ప్రశ్న 20.
వివిధ కర్మాగారాలు తమ ఉత్పత్తులలో ఉపయోగించే వస్తువులు ఉత్పత్తి పెరుగుదలకు ఉదాహరణలు పేర్కొనండి.
జవాబు:
వాణిజ్య వాహనాలు 1950-51లో 9 మిలియన్లు ఉండగా 2010-11 నాటికి 753 మిలియన్లకి పెరిగింది.

మోటారు సైకిళ్ళు 1950-51లో ఏమీ లేవు. 1960-61లో 1 మిలియన్ మాత్రమే ఉండగా 2010-11 నాటికి 10. 527 మిలియన్లకు పెరిగాయి. అనగా పెరుగుదల గణనీయంగా ఉన్నది.

పంపులు 1950-51లో 35 మిలియన్లు ఉండగా 2010-11లో 3139 మిలియన్లకు పెరిగింది.

ట్రాక్టర్లు డీజిల్ తో నడిచేవి 1980-81కు ముందు లేవు. ఆ సంవత్సరం మాత్రం 71 మిలియన్లు ఉండగా 2010-11 నాటికి 465 మిలియన్లకు పెరిగింది. కాబట్టి పెరుగుదల పై విధంగా ఉన్నది.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 21.
గత 30 సంవత్సరాలలో వస్త్ర ఉత్పత్తి ఎంత పెరిగింది ? దీని ప్రభావం ఎలా ఉంటుంది ? మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
వస్త్రాల ఉత్పత్తి (మిలియన్ చదరపు మీటర్లలో)

సంవత్సరం నూలు వస్త్రాలు ఇతర వస్త్రాలు
1950-51 4900
1960-61 6000 100
1970-71 6500 1000
1980-81 8000 2000
1990-91 15000 8000
2000-01 20000 20000
2010-11 31000 30000

వస్త్రాలు మన అవసరాలకు ఉపయోగించడం మాత్రమే కాక ఇతర దేశాలకు దిగుమతి చేయడం జరుగుతుంది.

ప్రశ్న 22.
సిమెంటు, ఉక్కు ఉత్పత్తిని చూపించే పటాన్ని చూడండి. 1980 – 81 నుంచి ఇప్పటి వరకు వీటి ఉత్పత్తిలో పెరుగుదల తెలియజేయటానికి ఒక పట్టిక తయారు చేయండి. ఈ ఉత్పత్తి పెరగటం వల్ల కలిగిన ప్రయోజనాలను, నష్టాలను చర్చించండి.
జవాబు:

సంవత్సరం సిమెంట్ ఉత్పత్తి
(మిలియన్ టన్నులలో)
ఉక్కు ఉత్పత్తి
(మిలియన్ టన్నులలో)
1950-51 5 1
1960-61 10 2
1970-71 15 6
1980-81 20 8
1990-91 50 12
2000-01 100 30
2010-11 210 62

ఉక్కు ఉత్పత్తి పెరిగినది దీనివలన మౌలిక పరిశ్రమలు సంఖ్య పెరిగింది.

ఉత్పత్తి పెరగటం వల్ల కలిగిన లాభాలు :
సిమెంట్ ఉత్పత్తి పెరగటం వల్ల భవన నిర్మాణం రంగం పెరిగింది. మరియు ఎగుమతులు పెరిగాయి.

అరబ్ దేశాలకు మన సిమెంట్ ను ఎక్కువగా ఎగుమతి చేయడం జరుగుతున్నది.

నిర్మాణ రంగానికి కూడా ఉక్కును ఎక్కువగా ఉపయోగించడం జరుగుతున్నది.

నష్టాలు :
సున్నపురాయి, జిప్సమ్ నిల్వలు రోజు రోజుకు తరిగిపోతున్నాయి. అలాగే ఉక్కుకు కావలసిన ముడి ఇనుమును ఎక్కువగా ఎగుమతి చేయడం జరుగుతుంది.

ఇంకా పూర్తి స్థాయిలో ముడి ఇనుమును మన అవసరాలకు ఉపయోగించుకోగలిగితే ఇనుము – ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందినట్లు అవుతుంది.

పట నైపుణ్యం

1. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ఉక్కును 1950-51 నుండి. 2010-11 వరకు గ్రాఫ్ చిత్రంలో చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 9

2. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన సిమెంట్ ను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 10

3. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన విద్యుత్ ను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 11

4. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన వస్త్రాలను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 12

5. భారతదేశంలో లభించే ఇనుప ఖనిజ క్షేత్రాలను, ఇనుప ఖనిజ గనులను భారతదేశం పటంలో చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 13

6. బొగ్గు లభించే ప్రాంతాలను భారతదేశ పటం నందు చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 14

7. భారతదేశ పటం నందు ఇనుము – ఉక్కు కర్మాగారాల ప్రదేశాలను చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 15

8. భారతదేశ పటం నందలి సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులను గుర్తించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 16

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ ప్రాంతంలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ఒకదానిని, ఖనిజ ఆధారిత పరిశ్రమను ఒకదానిని ఎంచుకోండి.
1) వాటిల్లో ఉపయోగించే ముడిసరుకులు ఏమిటి?
2) ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో వేటికి రవాణా ఖర్చు కావాలి?
3) ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను పాటిస్తున్నాయా?
జవాబు:
మా ప్రాంతంలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమ.

– పొగాకు పరిశ్రమ :

  1. వాటిలో ఉపయోగించే ముడి సరుకులు – పొగాకు.
  2. ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో వేటికి రవాణా ఖర్చు కావాలి?
    పొగాకుకు రవాణా ఖర్చు కావాలి.

మరియు తయారుచేయబడిన సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటి వాటిని వివిధ ప్రాంతాలకు చేరవేయాలన్నా, మరియు సిగరెట్ పరిశ్రమ, బీడీల పరిశ్రమ, చుట్టల పరిశ్రమ ప్రాంతాలకు పొగాకును చేరవేయాలన్నా రవాణా ఖర్చు కావలసి ఉంటుంది.

ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను అంతగా పాటించడం లేదనే చెప్పవచ్చును.

ఎందువలెనంటే పరిశ్రమల చుట్టు మొక్కలను పెంచడం లేదు.

పరిశ్రమ నందు వడిలివేయబడిన పదార్థాల డంపింగ్ యార్డ్ ద్వారా నాశనం చేయకుండా దగ్గరలోని కృష్ణానదిలోను, రోడ్ల ప్రక్కన వేయడంవల్ల ఆ పరిసర ప్రాంతాలు కాలుష్యానికి గురౌతున్నాయి.

మా ప్రాంతంలోని ఖనిజాధార పరిశ్రమ.

– సిమెంట్ పరిశ్రమ :
ప్రధాన ముడి సరుకులు : సున్నపురాయి, జిప్సం , బొగ్గు, డోలమైట్, పింగాణి మన్ను మొదలగునవి.

ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో సున్నపురాయి, జిప్సం, డోలమైట్, పింగాణి మన్ను, బొగ్గు మొదలైన వాటి అన్నింటికి రవాణా ఖర్చు కావాలి.

సున్నపురాయి అధిక పరిమాణంలో కావాలి.

ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను పాటిస్తున్నాయా?

అంతగా పాటించడం లేదనే చెప్పాలి. ఎందువలెనంటే ఈ పరిశ్రమ పనిచేస్తున్నప్పుడు దుమ్ము, ధూళి విపరీతంగా వస్తుంది.

అది గాలిలో కలిసి గాలిని కలుషితం చేస్తుంది.
అలాగే వ్యర్థ పదార్థాలను బయట ప్రదేశములందు వదలడం వలన బయటి ప్రదేశాలు రసాయనిక కాలుష్యానికి గురౌతున్నాయి.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

SCERT AP 6th Class Social Study Material Pdf 6th Lesson తొలి నాగరికతలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 6th Lesson తొలి నాగరికతలు

6th Class Social 6th Lesson తొలి నాగరికతలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సింధూలోయ నాగరికత మరియు వేదనాగరికతల మధ్య పోలికలేవి?
జవాబు:
సింధూలోయ నాగరికత మరియు వేదనాగరికతల మధ్య పోలికలు :

  • రెండూ భారత దేశ గొప్ప నాగరికతలుగా విలసిల్లినాయి.
  • రెండూ నాగరికతల ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినారు. అలంకార ప్రియత్వం కల్గి ఉన్నారు.
  • వ్యవసాయం ప్రధాన వృత్తిగా కల్గి ఉన్నారు. బార్లీ, బఠానీ, గోధుమ పంటలను ఇద్దరూ పండించారు.
  • లోహ పనిముట్లను వాడినారు. (రాగి, కాంస్యం, ఇనుము మొ||నవి.)
  • రెండూ నాగరికత ప్రజలు వినోదానికి ప్రాధాన్యమిచ్చారు. నాట్యం, సంగీతం, చదరంగం మొ||నవి రెండూ నాగరికత కన్పించే అంశాలు.
  • రెండూ నాగరికత ప్రజలు మత విశ్వాసాలను కల్గి ఉన్నారు. (అయితే దేవతలు వేరూ కావచ్చు.)
  • స్త్రీలకు సమాజంలో గౌరవస్థానం (మలివేదకాలంలో మినహా) ఉండేది.

ప్రశ్న 2.
సింధూ లోయ, నాగరికత తవ్వకాలలో పాల్గొన్నదెవరు?
జవాబు:
1850లో బ్రిటీష్ ఇంజనీర్లు కరాచీ లాహోరు నగరాల మధ్య రైలు మార్గాలు వేయుటకు తవ్వకాలు జరుపుతుండిరి. ఆ తవ్వకాలలో వేలాది రాళ్ళు దొరికినవి రైలు మార్గాలు వేయుటకు ఆ రాళ్ళను ఉపయోగించాలని నిర్ణయించారు. ఆ రాళ్ళు అయిదు వేల సంవత్సరాల క్రితంవన్న సంగతి అప్పుడు తెలియదు. 1920లో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు. దీనినే సింధూలోయ నాగరికత అని హరప్పా నాగరికత అని అంటారు. 1921-22 సం॥లలో అప్పటి పురావస్తుశాఖ డైరెక్టర్ జనరల్ అయిన సజాన్ మార్నల్ ఆధ్వర్యంలో హరప్పాలో దయారాం సాహి, మొహంజోదారోలో ఆర్.డి. బెనర్జీలు త్రవ్వకాలను జరిపి సింధూ నాగరికత – విశేషాలను వెలుగులోకి తెచ్చారు.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 3.
సింధూ ప్రజల ఆర్థిక జీవనాన్ని వివరింపుము.
జవాబు:
సింధూ ప్రజల ఆర్థిక జీవనము :

  • వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు మొ||న పంటలను పండించేవారు. పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం ఆ కాలంలోని ప్రధాన వృత్తులు. పత్తిని మొట్టమొదట పండించింది వీరే.
  • కాల్చిన ఇటుకలను తయారుచేయుట వీరి వేరొక ముఖ్య వృత్తి, పశువులు, మేకలు, పందులు, కుక్కలు, గుజ్రాలు మరియు గాడిదలను పెంచేవారు.
  • అరేబియా సముద్రంలోని లోథాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో సింధూ ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు.

ఆర్థిక జీవనం :
AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 1

ప్రశ్న 4.
సింధూ ప్రజల ఇండ్ల నిర్మాణము ఎట్టిది?
జవాబు:

  • హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇళ్ళు కట్టుకొనేవారు.
  • రెండు అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకొనేవారు.
  • ప్రతి ఇంటికి ఒక బావి మరియు స్నానాలగది ఉండేది.
  • ఇంటిలోని వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువలోకి పంపేవారు.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 2

ప్రశ్న 5.
సింధూ ప్రజల మురుగు నీటిపారుదల వ్యవస్థ ప్రశంసనీయమైనది ఎలా?
జవాబు:

  • సింధూ ప్రజల మురుగు నీటిపారుదల వ్యవస్థ ఎంతో ప్రశంసనీయమైనది.
  • వీరికాలంలో మంచి ప్రణాళికబద్ధమైన భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ కలదు.
  • ఈ వ్యవస్థ పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి సింధూ ప్రజలు ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

ప్రశ్న 6.
“భగవంతుని మీద భక్తి అనేది ఒక నమ్మకం” సింధూ ప్రజల దేవతల గురించి వ్యాఖ్యానించుము.
జవాబు:

  • సింధూ ప్రజలు పశుపతి (శివుడు) మరియు అమ్మతల్లిని పూజించేవారు.
  • వేపచెట్టు మరియు రావి చెట్టును పూజించేవారు.
  • భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువులను పూజించేవారు.
  • కాలిభంగన్ మరియు లోథాల్ ప్రాంతాలలో అగ్ని పేటికలు అనగా యజ్ఞవాటికలు ఉండేవి. (ఆప్) స్వస్తిక్ గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 3

ప్రశ్న 7.
వేదాలెన్ని? అవి ఏవి?
జవాబు:
వేద సాహిత్యములో నాలుగు ప్రముఖ వేదాలు కలవు. అవి :

  1. ఋగ్వేదము
  2. యజుర్వేదము
  3. సామవేదము
  4. అధర్వణ వేదము.

ప్రశ్న 8.
“వేదమనగా ఉత్కృష్టమైన (ఉన్నతమైన) జ్ఞానము” వ్యాఖ్యానించుము.
జవాబు:

  • సంస్కృత భాషలో వేదమనగా ఉన్నతమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే వేధము.
  • వేదాలను శృతులు అని కూడా అంటారు.
  • పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు.
  • భారతీయ యోగాకు వేదాలే ఆధారాలు.
  • వేదాలలో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞాన కలదు.
  • వేదకాలపు సాంప్రదాయాలు ఇప్పటికీ అవిచ్చినముగా కొనసాగుతున్నవి.
  • ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి ‘వేద కాలానికే మరలా వెళ్ళాలి’ అని పిలుపునిచ్చారు.
  • వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
  • వేద సాహిత్యములో నాలుగు ప్రముఖ వేదాలు కలవు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆధర్వణ వేదము

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 9.
తొలివేదకాలము నాటి ప్రజల సాంఘిక జీవనాన్ని వివరింపుము.
జవాబు:
కుటుంబ వ్యవస్థ :
కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం. తండ్రి కుటుంబానికి పెద్ద. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమలులో ఉంది. యుద్ధ ఖైదీలను బానిసలుగా చూసేవారు. దాసులను బానిసలుగా చూసేవారు. ఒకే భార్యను కలిగి ఉండుట ఈ కాలంలో సాధారణంగా ఉండేది.

స్త్రీల స్థానం :
సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కాని, సతీసహగమనం కానీ అమలులో లేదు. స్త్రీలు తమ భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకొనేవారు. వితంతువులు తిరిగి వివాహము చేసుకొనే పద్ధతి కలదు. ఘోష, అపాలా, లోపాముద్ర, ఇంద్రాణి, విష్యవర వంటి విద్యావంతులైన స్త్రీలు గొప్ప వేద పండితులు ఈ స్త్రీలు తమ భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్య క్రమాలలో పాల్గొనేవారు.

వేష ధారణ :
వాసా (ధోవతి) ఆదివాసా (శరీరము పై భాగానిని కప్పుకొనేది) ప్రస్తుతం మన వేషధారణను పోలి ‘ఉండేవి. దుస్తులను బంగారు దారంతో కుట్టేవారు. స్త్రీలు చెవి రింగులు, కంఠభారణాలు, గాజులు మరియు కాలి పట్టీలు ధరించేవారు. స్త్రీలు తలకు నూనె రాసుకుని జడలు వేసుకొనేవారు.

వినోదాలు :
రథపు పందేలు, వేట, మల్లయుద్దాలు, నాట్యం మరియు సంగీతం మొదలైనవి కొన్ని వినోదాలు. మూడు రకాలైన సంగీతవాయిద్యాలు ఉపయోగించేవారు.

విద్య :
విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి. బోధనా అభ్యసన ప్రక్రియలలో అన్ని విద్యా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. విద్యాలయాలలో యుద్ధ తంత్రం, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళలను నేర్పేవారు.

వర్ణవ్యవస్థ :
తొలి వేదకాలంలో ఎటువంటి వివక్షత లేదు. కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం లేదు. ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చును.

ప్రశ్న 10.
మలి వేదకాలము నాటి ప్రజల సాంఘిక జీవనము గురించి నీకేమి తెలియును?
జవాబు:
మలి వేదకాలములో తొలి వేదకాలముతో పోల్చితే అనేక సాంఘిక మార్పులు సంభవించాయి. అవి :

  • ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైనది. అవి నాలుగు రకాలు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం మరియు సన్యాసం వీరి కాలంలో ప్రారంభమైనవి.
  • స్త్రీల స్థానం దిగజారింది. వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది.
  • బాల్య వివాహాలు మరియు సతీసహగమనం వీరి కాలంలో ప్రారంభమయ్యాయి.
  • రాజులు మరియు ఉన్నత వర్గాల ప్రజలలో బహుభార్యత్వము ప్రారంభమైనది.
  • స్త్రీకి ఆస్తి హక్కు లేదు, వరకట్నము ఆచరణలోకి వచ్చెను.
  • వర్ణాంతర వివాహాలు నిషేధించబడినవి.

ప్రశ్న 11.
ఇతిహాసాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
రామాయణం, మహాభారతాలు అనేవి రెండు గొప్ప ఇతిహాసాలు, రామాయణాన్ని (ఆది కావ్యం) సంస్కృతంలోకి వాల్మీకి రచించారు. రామాయణంలో శ్రీరాముడిని ఆదర్శపాలకుడిగా, ఆదర్శ సోదరునిగా, ఆదర్శ కుమారునిగా, సీతను ఆదర్శ మహిళగా వర్ణించారు. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడనే ఋషి రచించాడు. అధర్మం పై ధర్మం సాధించిన విజయమే ‘మహాభారతం’గా చెప్పబడింది.

ప్రశ్న 12.
భారతదేశము యొక్క అవుట్ లైన్ మ్యాన్లో ఈ క్రింది వాటిని గుర్తించుము.
ఎ) సింధూనది బి) గంగానది సి) యమునా నది
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 4

ప్రశ్న 13.
సింధూలోయ నాగరికత పతనానికి కారణాలేవి?
జవాబు:
సింధూలోయ నాగరికత పతనానికి కారణాలు :

  • ఆర్యుల దండయాత్రలు సింధూ నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు.
  • అయితే ‘మార్టిమర్ వీలర్’ అనే చరిత్రకారుడు దీనిని అంగీకరించలేదు. సింధూ నది తన ప్రవాహమార్గాన్ని మార్చుకోవడం వలన మరియు వరదల వలన సింధూ నాగరికత పతనమైనట్టు భావిస్తున్నారు.
  • సింధూనది మరియు దాని ఉపనదులలో నీరు లేకుండా ఎండిపోవుట వలన అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదలి వెళ్ళారని కొంతమంది చరిత్రకారులు భావిస్తారు.
  • సింధూలోయ నాగరికత పతనానికి అనేక కారణాలు ఉన్నాయని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు.

6th Class Social Studies 6th Lesson తొలి నాగరికతలు InText Questions and Answers

6th Class Social Textbook Page No.65

ప్రశ్న 1.
సింధూలోయ నాగరికతా కాలం నాటి పట్టణ ప్రణాళికకు, ప్రస్తుత పట్టణ ప్రణాళికలకు ఏవైనా తేడాలను నీవు గమనించావా? అయితే ఎలాంటి తేడాలను గమనించావా?
జవాబు:
సింధూలోయ నాగరికతా కాలం నాటి పట్టణ ప్రణాళిక ఆధునిక (ప్రస్తుత) పట్టణ ప్రణాళికను పోలి ఉంది. కొద్ది తేడాలు మాత్రమే గమనించాను. అవి:

  • నేడు చాలా చోట్ల భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ లేదు.
  • నేడు చాలా పట్టణాల్లో సరియైన ప్రణాళికా బద్దమైన (భవన) నిర్మాణాలు లేవు. మురికివాడల సంగతి మరీ అధ్వాన్నం.
  • చాలా పట్టణాల్లో విశాలమైన రహదారులు లేవు. ఇరుకు సందులే.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 2.
సింధూ కాలంనాటి నీటిపారుదల వ్యవస్థ అత్యంత ఆధునికమైనదేనా? ఎలా?
జవాబు:

  • సింధూ కాలం నాటి నీటి పారుదల వ్యవస్థ అత్యంత ఆధునికమైనదే.
  • మంచి ప్రణాళికాబద్ధమైన నీటి పారుదల వ్యవస్థ కలదు. .
  • వీరు పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు.

6th Class Social Textbook Page No.66

ప్రశ్న 3.
సింధూలోయ ప్రజల ఆర్థిక కార్యకలాపాలకు, ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలకు పోలికలు ఏవి?

ఆర్థిక కార్యకలాపం సింధూ ప్రజల కాలం ప్రస్తుత కాలం
ఎగుమతులు
దిగుమతులు
పంటలు
మచ్చిక చేసుకొని పెంచుకునే జంతువులు
చేతి వృత్తులు

జవాబు:
సింధూలోయ ప్రజల ఆర్థిక కార్యకలాపాలకు, ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలకు పోలికలు

ఆర్థిక కార్యకలాపం సింధూ ప్రజల కాలం ప్రస్తుత కాలం
ఎగుమతులు నూలు వస్త్రాలు, ధాన్యం దంతపు దువ్వెనలు, ఆభరణాలు వజ్రాలు, తోళ్ళు ఉత్పత్తుల., రత్నాలు, ఔషధాలు యంత్రాలు, లోహాలు.
దిగుమతులు అలంకార సామాగ్రి, రాగి తగరం పెట్రోలు, రంగురాళ్ళు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ప్లాస్టిక్, స్టీల్
పంటలు వరి, గోధుమ, బార్లీ, పత్తి, బరాని వరి, గోధుమ, బార్లీ, తృణధాన్యాలు అన్ని పత్తి, జనుము, పొగాకు, కాఫీ, టీ మొ||నవి
మచ్చిక చేసుకొని పెంచుకునే జంతువులు మేకలు, గొర్రెలు, గేదెలు ఎద్దు, ఏనుగులు, కుక్కలు మేకలు, గొర్రెలు, గేదెలు, ఎద్దులు, గాడిదలు ఏనుగులు, కుక్కలు, ఒంటెలు మొ||నవి.
చేతి వృత్తులు తాపీ పని, చేనేత పని, నూలు, వడుకుట, రాగిపాత్రలు, కుండల తయారీ. తాపీ పని, చేనేతపని, నూలు వడుకుట రాగి పాత్రలు, కుండల తయారీ మొదలైనవి.

6th Class Social Textbook Page No.67

ప్రశ్న 4.
సింధూ నాగరికత కాలంలోని ప్రజలు ఉపయోగించిన లోహాలను ప్రస్తుతం మనం ఉపయోగించే లోహాలతో పోల్చుము. Page No. 67)
AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 5
జవాబు:

సింధూలోయ నాగరికత ప్రజలు ఉపయోగించిన లోహాలు ప్రస్తుతం ఉపయోగిస్తున్న లోహాలు
రాగి, తగరము పాత్రలు, బంగారం, వెండితో చేసిన ఆభరణాలు. రాగి, స్టీల్, ఇత్తడి పాత్రలు, వెండి, బంగారం, ప్లాటినం మొ||న ఆభరణాలు వాడుతున్నారు.
కాంస్యంతో చేసిన పనిముట్లు వాడినారు. ఇనుము, అల్యూమినియం, స్టీల్లో చేసిన పనిముట్లు వాడుతున్నారు.

6th Class Social Textbook Page No.69

ప్రశ్న 5.
AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 6
i) పై పట్టికలో నాగరికతల మధ్య ఎలాంటి పోలికలను నీవు గమనించావు?
ii) మిగిలిన నాగరికతల కన్నా సింధూ నాగరికత ఏయే విధములుగా పురోగమించినది? Page No. 699
జవాబు:
i)

  • ఈ నాగరికతలన్నీ నదీలోయ ప్రాంతాలలోనే విలసిల్లినాయి.
  • ఈ నాగరికతల్లో ఎక్కువ నాగరికతలు పట్టణ నాగరికతలే.
  • ఈ నాగరికతలన్నీ తమ స్వంత లిపిని కల్గి ఉన్నాయి.
  • ఈ శాస్త్ర, సాంకేతికంగా, ఆయా నాగరికతలు అభివృద్ధి చెందినాయని చెప్పవచ్చు. ఉదా : పిరమిడ్ల నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ.
    లోహాలను కూడా విరివిగా ఉపయోగించినట్లు తెలుస్తుంది.

ii)

  • మిగిలిన నాగరికతల కన్నా సింధూ నాగరికత క్రింది విధముగా పురోగమించింది :
  • గ్రిడ్ ఆకారంలో ప్రణాళిక బద్దమైన పట్టణ ప్రణాళిక కల్గి ఉంది.
  • భూగర్భ మురుగునీటి పారుదల (పైపుల ద్వారా) వ్యవస్థ కలదు.
  • ఋతుపవన వ్యవస్థ కలిగి ఉంది.
  • బలమైన కేంద్రీకృత ప్రభుత్వం కల్గి ఉంది.

6th Class Social Textbook Page No.71

ప్రశ్న 6.
భారతదేశంలో ఉన్న మతాల పేర్లను రాయుము.
జవాబు:
భారతదేశంలో ఉన్న మతాల పేర్లు :

  1. హిందూ మతము
  2. క్రైస్తవ మతము
  3. ఇస్లాం మతము
  4. బౌద్ధ మతం
  5. జైన మతం
  6. సిక్కు మతం
  7. పార్శీ మతం (జోరాస్ట్రియన్) మొ||నవి.

6th Class Social Textbook Page No.72

ప్రశ్న 7.
నేడు మన ప్రజా ప్రతినిధులు ఎలా ఎన్నిక కాబడుతున్నారు?
జవాబు:
నేడు మన ప్రజా ప్రతినిధులను, వయోజనులైన (18 సం||లు పైబడిన) వారు తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకుంటారు. అంటే ప్రజాస్వామ్యయుతంగా మెజారిటీ సభ్యుల అమోదించే ఎన్నుకోబడుతున్నారు.

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 8.
మీ పాఠశాల గ్రంథాలయంలోని ప్రముఖ గ్రంథాల పేర్లు రాసి, వాటి రచయితల పేర్లు రాయుము.
జవాబు:
విద్యార్థులు తమతమ పాఠశాల గ్రంథాలయాలలోని గ్రంథాల పేర్లు, రచయిత పేర్లు రాయగలరు. ఉదా :

గ్రంథము రచయిత
1. ది ఇన్ సైడర్ పి.వి. నరసింహారావు
2. నా దేశయువజనులారా ఏ.పి.జె. అబ్దుల్ కలాం
3. ద ఇగ్నైటెడ్ మైండ్స్ ( ఒక విజేత ఆత్మ కథ) ఏ.పి.జె. అబ్దుల్ కలాం
4. కొన్ని కలలు కొన్ని మెలకువలు వాడ్రేవు చినవీర భద్రుడు
5. మహా ప్రస్థానం శ్రీశ్రీ
6. కన్యాశుల్కం గురజాడ అప్పారావు
7. అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర్ తిలక్
8. మైండ్ పవర్ యండమూరి వీరేంద్రనాథ్
9. విజయానికి ఐదు మెట్లు యండమూరి వీరేంద్రనాథ్
10. కృష్ణపక్షం దేవులపల్లి కృష్ణశాస్త్రి
11. వేమన శతకం వేమన
12. సుమతీ శతకం బద్దెన
13. వేయిపడగలు విశ్వనాథ సత్యనారాయణ
14. విశ్వంభర సి. నారాయణరెడ్డి
15. టీచర్ యస్. ఏ. వార్నర్
16. పిల్లలు ఎలా నేర్చుకుంటారు? జాన్ హోల్డ్
17. మనసు భాష – మైండ్ మేజిక్ (NLP) బి.వి. పట్టాభిరామ్
18. విజయం మీదే బి.వి. పట్టాభిరామ్
19. మీరే విజేతలు ! విజయాలన్నీ మీవే సి.వి. సర్వేశ్వరశర్మ
20. ఆటలతో పాఠాలు మన్నవ గిరిధరరావు మొదలైనవి.

ప్రాజెక్టు పని

సింధూలోయ నాగరికత, వేద నాగరికతల పోలికలపై ఒక ప్రాజెక్టు తయారు చేయుము.
జవాబు:
సింధూలోయ నాగరికత మరియు వేదనాగరికతల మధ్య పోలికలు :

  • రెండు భారత దేశ గొప్ప నాగరికతలుగా వెలసిల్లినాయి.
  • రెండూ నాగరికతల ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినారు. అలంకార ప్రియత్వం కలి ఉన్నారు.
  • వ్యవసాయం ప్రధాన వృత్తిగా కల్గి ఉన్నారు. బార్లీ, బఠానీ, గోధుమ పంటలను ఇద్దరూ పండించారు.
  • లోహ పనిముట్లను వాడినారు. (రాగి, కాంస్యం, ఇనుము మొ||నవి.)
  • రెండూ నాగరికత ప్రజలు వినోదానికి ప్రాధాన్యమిచ్చారు. నాట్యం, సంగీతం, చదరంగం మొ||నవి రెండూ నాగరికత కన్పించే అంశాలు.
  • రెండూ నాగరికత ప్రజలు మత విశ్వాసాలను కల్గి ఉన్నారు. (అయితే దేవతలు వేరూ కావచ్చు.)
  • స్త్రీలకు సమాజంలో గౌరవస్థానం (మలివేదకాలంలో మినహా) ఉండేది. సింధూలోయ నాగరికత వేద నాగరికత

AP Board 6th Class Social Solutions Chapter 6 తొలి నాగరికతలు 7

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

SCERT AP 9th Class Social Studies Guide Pdf 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

9th Class Social Studies 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ఈ అధ్యాయంలో పునరుజ్జీవనంపై చర్చ ప్రధానంగా ……… (ఇంగ్లాండ్ / ఇటలీ / ఫ్రాన్స్/ జర్మనీ). (AS1)
జవాబు:
ఇటలీ.

ప్రశ్న 2.
పునరుజ్జీవన కాలంలో కింద పేర్కొన్న భావనలలో వచ్చిన మార్పుల గురించి ఒక పదం లేదా ఒక వాక్యంతో రాయండి. (AS1)
జవాబు:
అ. మానవతావాదులు : మరణాంతర జీవితం గురించి కాక ప్రపంచం గురించి ఆసక్తి చూపారు.
ఆ. పుస్తకాలు : 14 శ॥ నుంచి 17 శ॥ వరకు కొత్త మానవతా సంస్కృతి వికసించింది.
ఇ. చిత్రకళలు : చుట్టు ప్రక్కల ప్రకృతి నుంచి ప్రజలను, ప్రదేశాలను పరిశీలించి చిత్రీకరించే వరకు.
ఈ. మానవులు : భౌతిక సంపద, అధికారం, కీర్తి నుంచి సత్ప్రవర్తన వరకు.
ఉ. మహిళలు : గృహసంరక్షణ ,నుంచి విద్య, ఆర్థికశక్తి, ఆస్తి సంపాదన వరకు.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 3.
బైబిలును ముద్రించడం ద్వారా దేవుడు, చర్చిపై భావనలు ఎలా ప్రభావితం అయ్యాయి? (AS1)
జవాబు:
బైబిలు ముద్రించడానికి పూర్వం చేతితో రాసిన బైబిలు ఉండేది. ముద్రణ సాంకేతిక విజ్ఞానంపై పట్టు సాధించడం 16వశతాబ్దపు మహా విప్లవం. జర్మనీ దేశస్థుడు 1455లో జోహాన్స్ గుట్బెర్గ్ కార్యశాలలో బైబిలు 150 ప్రతులను ముద్రించాడు. కొత్త భావాలను ప్రచారం చేసే ముద్రిత పుస్తకం వెంటనే వందలాది పాఠకులను చేరుకుంది. ఇటలీ మానవతావాద సంస్కృతి యూరప్లో వేగంగా వ్యాపించటానికి ముద్రిత పుస్తకాలు అందుబాటులో ఉండటం ప్రధానకారణం.

ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవితాన్ని చర్చి శాసించిందని, చర్చికి అపార అధికారం, సంపద సమకూరి, అవినీతిమయం అయ్యిందని గ్రహించారు. విశ్వవిద్యాలయ పండితులు, చర్చి సభ్యులు కూడా మానవతా భావాలపట్ల ఆకర్షితులయ్యారు. సాధారణ మతానికి అనవసర ఆచారాలను తరువాత జోడించారని ఖండిస్తూ వాటిని త్యజించమని చెప్పారు. ఎక్కడో ఉన్న దేవుడు మనిషిని సృష్టించాడని, ‘ఇక్కడ’ ఇప్పుడు, ఆనందాన్వేషణలో జీవితాన్ని స్వేచ్ఛగా బతకమన్నాడని వాళ్ళు విశ్వసించారు.

ప్రశ్న 4.
మధ్యకాలంనాటి ఇటలీ నగరాలను ప్రస్తుత ఇటలీ నగరాలతో పోల్చండి. వాటి ప్రస్తుత పేర్లలో ఏమైనా తేడాలు ఉన్నాయా? (AS1)
జవాబు:
బైజాంటైన్ సామ్రాజ్యం, ఇస్లామిక్ దేశాల మధ్య వాణిజ్యం విస్తరించటంతో ఇటలీ తీరం వెంట రేవు పట్టణాలు పునరుద్ధరించబడ్డాయి. చైనా, పశ్చిమ యూరప్ దేశాలతో వ్యాపారం పెరగటంలో ఇటలీ నగరాలు కీలకపాత్ర పోషించాయి. ఈ నగరాలు తమను బలమైన సామ్రాజ్యంలో భాగంగా కాకుండా స్వతంత్ర పట్టణ దేశాలుగా చూడసాగాయి. వీటిల్లో “ఫ్లోరెన్స్” “వెనిస్”, గణతంత్రాలు కాగా, ఇంకా ఎన్నో యువరాజుల పాలనలోని నగరసభలుగా ఉండేవి. బాగా వర్ధిల్లిన నగరాలలో “వెనిస్” జెనోవాలు ముఖ్యమైనవి.

ఈ నగరాలలో మత గురువులు రాజకీయ ఆధిపత్యం చెలాయించే వాళ్ళు కాదు. బలమైన ప్యూడల్ భూస్వాములు కూడా ఇక్కడ లేరు. పట్టణ పరిపాలనలో ధనిక వ్యాపారులు, బ్యాంకర్లు చురుకుగా పాల్గొనేవారు. ఈ పట్టణాలను సైనిక నియంతలు పరిపాలించిన సమయంలో కూడా పట్టణ ప్రజలలో పౌరులమన్న భావన బలహీనపడలేదు.

ప్రస్తుత గ్రీకు నగరాలలో మానవతావాదం తాండవిస్తుంది. మరణాంతర జీవితం గురించేకాక, ఈ ప్రపంచం గురించి వాళ్ళు ఆసక్తి చూపారు. మనిషిని ఈ జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి సమస్తాన్ని, విజ్ఞాన శాస్త్రం, కళలు వంటి వాటిని ముఖ్యమైనవిగా నేటి ఇటలీ నగరాలు భావించాయి.

ప్రశ్న 5.
14,15వ శతాబ్దాలలో గ్రీకు, రోమను సంస్కృతులలో ఏ అంశాలను పునరుద్ధరించారు? (AS1)
జవాబు:
14, 15వ శతాబ్దాలలో గ్రీకు, రోమను సంస్కృతులలో అనేక అంశాలు పునరుద్ధరించారు. గ్రీకు సాహిత్యం మానవ జీవితంలో ఆసక్తిని కలిగించింది. గ్రీకు, గ్రీకు రోమను సంస్కృతి, శిల్పాలు, చిత్రకళ, భవనాలు, సాహిత్యం , తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రం ఎంతో ఉన్నతంగా ఉండేవి. క్రైస్తవ మతాన్ని పాటించటానికి ప్రాధాన్యత నిచ్చిన రోమన్ కాథలిక్కు చర్చి ప్రజల సంస్కృతిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రజలను ఆలోచించవద్దని, మతగురువులు చెప్పింది నమ్మమని అది ఒత్తిడి చేసేది. పురాతన సాంస్కృతిక సంపద అంతా విస్మరింపబడి, కనుమరుగైపోయింది.

ఆ తరువాత పరిస్థితి మారింది. రైతాంగం, భూస్వాముల వర్గం చర్చి నియంత్రణను వ్యతిరేకించ సాగింది. భూస్వాముల, చర్చి ఆధిపత్యం తగ్గి ప్రజలు మరింత స్వేచ్చను అనుభవించసాగారు. చిత్రకళ, శిల్పం, ఇతర కళలు, సాహిత్యం వంటి వాటిల్లో కొత్త ధోరణులు బయలుదేరాయి. విజ్ఞానశాస్త్రం పునరుద్ధరించబడింది. రోమన్ సంస్కృతి అవశేషాలైన భవనాలు, శిల్పాలు వంటి వాటిని కళాకారులు అధ్యయనం చేయసాగారు. కళలు, శిల్పాలు, వృద్ధి చెంది సంస్కృతిని నిల్పాయి. మానవతా వాదంతో మనిషిలో సత్ప్రవర్తనకు ప్రాధాన్యతనిచ్చారు.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 6.
మానవతావాద భావనలు ఇటలీలోని పట్టణాలను ముందుగా ఎందుకు ప్రభావితం చేశాయి? (AS1)
జవాబు:
1453లో కాన్స్టాంటినోపుల్ పతనం తర్వాత అనేక మంది గ్రీకు పండితులు తను సాహిత్యంతో ఇటలీకి పారిపోయారు. దీంతో పురాతన సాహిత్యం గ్రీకు భాషపట్ల ప్రజలకు ఆసక్తి కలిగింది. మానవతావాద భావనలు ముందుగా ఇటలీని పట్టణాలను ప్రభావితం చేశాయి. మనిషిని ఈ జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి సమస్తాన్ని, విజ్ఞానశాస్త్రం, కళలు వంటి వాటిని మానవత వాదులు ముఖ్యమైనవిగా చెప్పటంతో పట్టణవాసులు ఆకర్షితులయ్యారు. కొత్త విషయాలు, చట్టం, మతం వంటి వాటిని బోధించటానికి విశ్వవిద్యాలయాలు స్థాపించారు.

ఇటలీలోని పట్టణ విద్యావంతులు ఈ విషయాల పట్ల ఆసక్తి కనపరిచారు. మూఢనమ్మకాలపై ఆధారపడిన కొన్ని చర్చి ఆచారాలను మానవతావాదులు విమర్శించడం కూడా ఇటలీ పట్టణ వాసులను ఆకర్షించింది. చిత్రకళ, శిల్పంనకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఈ వాద
భావనలను పట్టణవాసులు స్వాగతించారు. భౌతిక సంపద, అధికారం, కీర్తి ఎల్ల ఇటలీవాసులు ఆకర్షితులయ్యారు.

ప్రశ్న 7.
మానవతావాద ఆలోచనల్లోని అంశాలు ఏమిటి? (AS1)
జవాబు:
పురాతన గ్రీకు సాహిత్యం మానవ జీవనం ఆసక్తిని కల్గించింది. వాళ్ళు నివసించిన ప్రపంచం వాళ్ళకి చాలా కీలకమైనదిగా అనిపించింది. మానవతావాదం మనిషి స్వభావం, ఆసక్తులకు సంబంధించినది కాబట్టి దీనిని అధ్యయనం చేసే విద్యార్థులను మానవతావాదులుగా పేర్కొన్నారు. మధ్యయుగాల పండితుల మాదిరి మరణాంతర జీవితం గురించి కాక ఈ ప్రపంచం గురించి మానవతావాదులు ఆసక్తి చూపారు. మానవతావాదం వల్ల డబ్బు, అధికారం సంపాదించడం ద్వారా మాత్రమే కాకుండా ఇతరత్రా తమ జీవితాలను మలచుకునే సామర్థ్యం మనుషులకుందని నమ్మసాగారు. మానవ స్వభావం బహుముఖమైనది అన్న విశ్వాసంతో ఈ భావన ముడిపడి ఉంది.

ప్రశ్న 8.
పక్కన ఉన్న పట్టిక పుస్తకాల ముద్రణలో వృద్ధి గురించి చెబుతుంది. దాని గురించి ఏం చెప్పగలరు? (AS3)
(లేదా)
గ్రాఫ్ ఆధారంగా పుస్తకాల ముద్రణ గూర్చి రాయండి.
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 1
జవాబు:
15వ శతాబ్దం ముందు వరకు చేతితో రాసిన ప్రతులు కొంతమంది చేతుల్లోనే ఉండేవి. ఇతర దేశాల ప్రజలు గొప్ప కళాకారుల చిత్రకళ, శిల్పాపత్రాలు, భవన 1450-1800 మధ్య కాలంలో విజ్ఞానం తెలుసుకోవాలంటే ఇటలీ వెళ్ళవలసి వచ్చేది. పత్రాలు చేతితో రాసిన – యూరప్ లో ప్రచురితమైన పుస్తకాలు పుస్తకాలు, పెయింటింగ్లు, యూరప్, అమెరికా పురావస్తుశాలల్లో, ఆర్ట్ గ్యాలరీలలో, మ్యూజియంలలో ఉండేవి. అయితే 1455 జోహాన్స్ గుటెన్బర్గ్ కార్యశాలలో బైబిలు 150 ప్రతులను ముద్రించారు.

“ముద్రణ సాంకేతిక విజ్ఞానంపై పట్టు సాధించటం 16వ శతాబ్దపు మహా విప్లవం”. 15 వ శతాబ్దం తరువాత చేతితో రాసిన పురాతన పుస్తకాలన్నింటిని ముద్రించారు. అచ్చు అయిన పుస్తకాలను కొనుక్కోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. అంతకు ముందెన్నడూ లేనంతగా భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తారంగా వ్యాపించడంతో కొత్త భావాలను ప్రచారం చేసే ముద్రిత పుస్తకాలు వెంటనే లక్షలాది పాఠకులను చేరుకున్నాయి. నిదానంగా ప్రజలలో చదివే అలవాటు పెరిగింది. ఇటలీ మానవతా సంస్కృతిపై ఆసక్తి కనపరిచిన లక్షలాది మంది విద్యార్థులు, ప్రజలకు ముద్రిత పుస్తకాలపై ఆసక్తి పెరగడంతో 18 || నాటికి శతాబ్దం కోట్ల కొలది పుస్తకాలు ప్రచురితమయ్యాయి.

ప్రశ్న 9.
“ముద్రింపబడిన పుస్తకాలు మన జీవితాలలో ఇంకా ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి” అన్న వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? మీ సమాధానానికి కారణాలు తెలపండి. (AS4)
జవాబు:
తాళపత్ర గ్రంథాలు, చేతితో రాసిన పుస్తకాలు పరిమితంగా ఉండడమే కాకుండా, వాటి సాహిత్యం , విజ్ఞానం , భాష చదవడానికి, అర్థం చేసుకోవడానికి సామాన్య ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందిగా ఉండేది. జోహాన్స్ గుటెన్బర్గ్ ముద్రణా యంత్రం కనిపెట్టడం, కాగితాన్ని కనుగొని అచ్చులతో ముద్రణ చేసిన చైనీయులకు ప్రపంచం ఋణపడి ఉంది. అతితక్కువ సమయంలో శాస్త్రసాంకేతిక విజ్ఞానం, శిల్పం, సాహిత్యం , మానవతావాదం, అభివృద్ధి చెందిన భూగోళం, తత్వం, వైద్యశాస్త్ర మూలాలను చదవడం వల్ల అవి మానవ జీవనంలో ప్రముఖ పాత్ర పోషించాయి. విశ్వరహస్యాలు, ఆవిష్కరణలు, నూతన సిద్ధాంతాలు, ప్రకృతి సమాజం, మూఢనమ్మకాలపై సమరం మొ||లగు విషయాలు ముద్రిత పుస్తకాల ద్వారా వెలుగుచూపించి, మానవ అభ్యున్నతికి తోడ్పాటునందించాయి.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 10.
17వ శతాబ్దపు ఐరోపావాసులకు ప్రపంచం ఎలాగ భిన్నంగా అనిపించి ఉంటుందో వివరించండి. (AS1)
జవాబు:
13వ శతాబ్దం ప్రారంభం, 13 శతాబ్దం ముందు ఐరోపాలో పెద్ద సామ్రాజ్యాలు ఏవీ లేవు. పట్టణాలు కూడా క్షీణించాయి. రాజకీయ అధికారం సైనిక, భూస్వాముల చేతుల్లో ఉండేది. రైతాంగంలో అధికభాగం “కట్టు బానిసలుగా” ఉండేవాళ్ళు. ప్రజలు తీవ్ర అభద్రతాభావంలో ఉండేవారు. అయితే 17వ శతాబ్దంలో ఐరోపాలో అనేక నూతన పోకడలు, అనేక రంగాలలో ప్రగతి కనిపించింది. చైనా, అరేబియా, భారతదేశం, ఈజిప్టులతో ఐరోపావాసుల వ్యాపార వాణిజ్యాలు పునరుద్దరించబడ్డాయి. వ్యాపారస్తులు, చేతివృత్తి కళాకారులు నివసించే అనేక పట్టణాలు, నగరాలు ఏర్పడాయి. అనేక సంస్కరణలు, ఆవిష్కరణలు, రచనలు, రూపకల్పనలు చూసి ఐరోపా వాసులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పునరుజ్జీవనం ద్వారా కొత్త మానవతా సంస్కృతి వికసించడం, సాహిత్యం , భవన నిర్మాణం, చిత్రకళలు వంటివి చూసి ఐరోపా వాసులు అమితానందం చెందారు.

ప్రశ్న 11.
పునరుజ్జీవన కాలం నాటి భవన నిర్మాణంలో రెండు ముఖ్యమైన అంశాలను చెప్పండి. (AS6)
జవాబు:
భవనాలలో పొడవాటి స్తంభాలు, కమానులు గుండ్రటి పైకప్పులను ఉపయోగించారు. భవన నిర్మాణంలో ఇది ఒక కొత్త శైలికి దారి తీసింది. వాస్తవానికి ఇది పురాతన రోమన్ శైలి పునరుద్ధరణ మాత్రమే. ఇప్పుడు దీనిని క్లాసికల్ (సాంప్రదాయం) గా వ్యవహరిస్తున్నారు. ఈ కాలంలో మరొక ముఖ్యమైన మార్పు అంతకుముందు కాలంలో మాదిరి కళాకారులు వాళ్ళ సభ్యులైన బృందం పేరుతో కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళ పేరుతో ప్రసిద్ధిచెందసాగారు.

ప్రశ్న 12.
ప్రపంచ అవుట్ లైన్ పటంలో పేజీ నెం. 155 లోని భౌగోళిక అన్వేషణలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 2

ప్రశ్న 13.
పేజీ నెం. 150 లోని నాల్గవ పేరాను చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
యూరప్లో మహిళల పాత్ర నామమాత్రమైనది. సంపన్న, కులీన కుటుంబాల పురుషులు ప్రజా జీవనంలో ముఖ్యపాత్ర పోషించారు. కుటుంబ వ్యవహారాల్లో, వ్యాపారాల్లో, ప్రజా జీవనంలో తమకు వారసులుగా తమ కొడుకులకు చదువులు చెప్పించేవాళ్ళు. అయితే వివాహ సమయంలో మహిళలు తెచ్చిన కట్నంతో పురుషులు తమ వ్యాపారాలను పెంచుకొన్నారు. – కట్న కానుకలు అందించలేని మహిళలు అవివాహితులుగానే ఉండి పోయేవారు. ప్రజా జీవనంలో మహిళల పాత్ర పరిమితమే కాకుండా, మహిళలను గృహ సంరక్షకులుగానే చూసేవారు.

అయితే కొన్ని సందర్భాల్లో పురుషులు ఇతర పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మహిళలు, పురుషుల వ్యాపార లావాదేవీలు చూసేవారు.

పటనైపుణ్యం

1.
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 4 1

2.
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 2

9th Class Social Studies 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 InText Questions and Answers

9th Class Social Textbook Page No.145

ప్రశ్న 1.
ఎనిమిదవ తరగతిలో హైదరాబాద్ రాజ్యంలోని జమిందారీ వ్యవస్థ, ‘వెట్టి’ గురించి చదివారు. యూరపులోని ‘కట్టు బానిసత్వం’తో దీనిని పోల్చండి.
జవాబు:
హైదరాబాద్ రాజ్యంలోని జమిందారీ వ్యవస్థలో కౌలుదారులు, భూస్వాముల వ్యవసాయంలో వెట్టి చాకిరి చేస్తూ, సరియైన ఆదాయం, కూలీ లేకుండ దుర్భర జీవనం సాగించేవాళ్ళు. కష్ట నష్టాలలో ఆదుకొనే భూస్వాములు లేక తరతరాలుగా “వెట్టి” బతుకులతో జీవనం సాగించేవారు. యూరప్ లో రాజకీయ అధికారం సైనిక, భూస్వాముల చేతుల్లో ఉండేది. రైతాంగాన్ని వాళ్ళు నియంత్రించేవాళ్ళు. రైతాంగంలో అధికభాగం “కట్టు బానిసలుగా” ఉండేవారు. యజమానుల అధీనంలో బందీలుగా, వాళ్ళ పొలాల్లో, కర్మాగారాలలో పనిచేయాల్సి వచ్చేది. వాళ్ళ తదుపున యుద్ధాలు కూడా చేయాల్సి వచ్చేది.

ప్రశ్న 2.
పట్టణాల అభివృద్ధికి వ్యాపారం ఎలా దోహదం చేస్తుంది?
జవాబు:
భూస్వాములు, ధనవంతులు, ఉన్నత వర్గాలకు చెందినవారు అధిక పెట్టుబడి పెట్టి వ్యాపారాలు పట్టణాలలో చేసేవారు తద్వారా వారి నివాసాలకు, వారి సుఖవంతమైన జీవనానికి, వలసవచ్చిన కార్మికులను ఆకర్షించడానికి విలువైన కట్టడాలు నిర్మించేవారు. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వానికి, పరిపాలకులకు తమవంతుగా లాభాలలో వచ్చిన వాటాలు విరాళంగా అందచేసేవారు.

ప్రశ్న 3.
పల్లెల్లో కంటే పట్టణాలలో కొత్త ఆలోచనలు గురించి తెలుసుకోటానికి, కొత్త విషయాలు ప్రయత్నించి చూడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:
గ్రామాలలో జీవన విధానం ఒకే విధంగా ఉంటూ ఒకే రకమైన వృత్తితో, కూలి పనులతో నిరంతరం జీవనం సాగించే వాళ్ళు. అయితే పట్టణాలలో తమ ప్రావీణ్యత, నైపుణ్యం, చాకచక్యం చూపించాలంటే కొత్త ఆలోచనలు వివరించాలి. వినూత్నంగా ఆలోచించే వారికి ఎక్కువ జీతాలు, హోదా కలుగుతుంది. తద్వారా వారు ఉన్నతంగా జీవించటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి విజ్ఞానంలో వస్తున్న మార్పులను గమనించి, తమ పనితనాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 4.
బహార్ట్ ప్రకారం కింది వాటిలో ఏది ఆధునిక దృక్పథానికి చెందినది, ఏది మధ్యకాలం నాటికి చెందినది?
అ) తెలుసుకుని, తమ నిర్ణయాలు తాము తీసుకునే సామర్థ్యంలో నమ్మకం ………….. (ఆధునిక దృక్పథానికి చెందినది)
ఆ) మతపర పుస్తకాలు, మతగురువులలో విశ్వాసం ………………….. (మధ్యకాలం నాటిది).
ఇ) దేవుడు అన్ని విషయాలు తెలియచేస్తాడన్న నమ్మకం …………………… (మధ్యకాలం నాటిది)
ఈ) మానవుల హేతువాదంపై విశ్వాసం ………………….. (ఆధునిక దృక్పథం)

9th Class Social Textbook Page No.146

ప్రశ్న 5.
ఇటలీ పటంలో గణతంత్రాలను, మూడు నగర సభలను గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 4 1

9th Class Social Textbook Page No.147

ప్రశ్న 6.
మానవతావాదులు ఎవరు? వారు ఏమి బోధించారు?
జవాబు:
పురాతన గ్రీకు సాహిత్యం మనిషి స్వభావం, ఆసక్తులకు సంబంధించినది కాబట్టి దానిని అధ్యయనం చేసే విద్యార్థులను మానవతావాదులుగా పేర్కొన్నారు. మధ్యయుగాల పండితుల మాదిరి మరణానంతరం జీవితం గురించి కాక ఈ ప్రపంచం గురించి వాళ్ళు వివరించారు. మనిషిని ఈ జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి నమస్తాన్ని, విజ్ఞానశాస్త్రం, కళలు వంటి వాటిని మానవతావాదులు వివరించారు. మూఢనమ్మకాలపై ఆధారపడిన కొన్ని చర్చి ఆచారాలను విమర్శించారు.

9th Class Social Textbook Page No.149

ప్రశ్న 7.
16వ శతాబ్దపు ఇటలీ కళాకారులు తమ పనులలో ఉపయోగించుకున్న వివిధ శాస్త్రీయ అంశాలను వివరించండి.
జవాబు:
16వ శతాబ్దంలోని ఇటలీ భవన నిర్మాణం పురాతన రోము భవనాల నుంచి అనేక ప్రత్యేక లక్షణాలను అనుకరించడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం స్త్రీ, పురుషుల శిల్పాలను మెచ్చుకుంటూ ఇటలీ శిల్పులు, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని అనుకున్నారు. ఎముకల నిర్మాణాల గురించి అధ్యయనం చేయటానికి వైద్యశాస్త్ర ప్రయోగశాలలకు కళాకారులు వెళ్లేవాళ్లు. తమ బొమ్మలు, శిల్పాలు వాస్తవికంగా ఉండేలా చేయటానికి లియొనార్డో డా విన్సి వంటి కళాకారులు శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. శరీర నిర్మాణ శాస్త్రం, రేఖాగణితం, భౌతిక శాస్త్రాలతో పాటు అందానికి సంబంధించిన బలమైన భావన ఇటలీ కళలకు ఒక ప్రత్యేకత.

9th Class Social Textbook Page No.150

ప్రశ్న 8.
అదే కాలంలో భారతదేశంలో ముద్రణా యంత్రం లేదు. శ్రీకృష్ణదేవరాయలు ఒక పుస్తకం రాసాడని అనుకుందాం. వివిధప్రాంతాలలోని పండితులకు అది ఎలా అందేది?
జవాబు:
శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ముద్రణా యంత్రం లేకపోయినా రాయలు రాసిన పుస్తకం వివిధ ప్రాంతాలకు ఆయా ప్రాంతాల రాజోద్యోగులు, రాయబారులు, భటుల ద్వారా చేరవలసిన పండితులకు అందుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 9.
రాజులు, మతగురువులు ముద్రణ యంత్రం పట్ల ఎలా స్పందించి ఉంటారు? దానిని స్వాగతించి ఉంటారా లేక ఆందోళన చెంది ఉంటారా?
జవాబు:
క్రైస్తవ మతాన్ని పాటించటానికి ఒత్తిడి చేసి, చర్చి పోపు ఆధిపత్యాన్ని ప్రచారం చేసిన మతగురువులు, ప్రారంభంలో ప్రజలను ఆలోచించవద్దని, మతగురువులు చెప్పింది నమ్మమని ఒత్తిడి చేసారు. మత ఆధిపత్యం ప్రశ్నించడానికి అవకాశం ఉండేది కాదు. అయితే ముద్రణా యంత్రం రావడంతో రాజులు, మతగురువులు ఆందోళన చెందారు. ఫ్యూడలిజం, రాజుల నిరంకుశత్వం, మతాధికారుల మూఢాచారాలు, ముద్రణ వల్ల ప్రజల ఆలోచనలలో మార్పు వచ్చింది. ప్రజల భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తారంగా ప్రజలలోకి వెళ్ళి తిరగబడతారని, మత గురువుల ఆధిపత్యాన్ని ఎదిరించి, ప్రశ్నిస్తారని ఆందోళన చెందారు.

9th Class Social Textbook Page No.151

ప్రశ్న 10.
పునరుజ్జీవనాన్ని కొత్త యుగం అని కూడా అంటారు. సుఖాలను కోరుకోవడం, సంపద, భోగాలను ఆశించటం, స్వార్థ ప్రయోజనంతో పనిచేయటం సరైనవేనని ప్రజలు భావించసాగారు. స్వార్థ ప్రయోజనాలను వ్యతిరేకిస్తూ, సంపద, సుఖాలను త్యజించాలంటూ ఉండే మత బోధనలకు ఇది విరుద్ధంగా ఉంది. పునరుజ్జీవన మానవతావాదులకున్న ఈ దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
పునరుజ్జీవనం కొత్త యుగమే కాకుండా ప్రజల మేధోపర ఆలోచనలకు, శాస్త్రీయ దృక్పథానికి, విచక్షణా జ్ఞానానికి పరాకాష్ట. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి, వివిధ దశలను, రకరకాల పుస్తకాలను పరిశీలించిన పిదప సుఖాలను కోరుకోవడం, సంపద భోగాలను ఆశించడం, అనుభవించడం, స్వార్థ ప్రయోజనంతో పనిచేయడం సరైనవేనని నేను ఏకీభవిస్తాను. మత. బోధకులు సుఖాలు త్యజించాలంటూ, వారు విలాసవంతమైన జీవనం సాగించారు. ప్రజల బలహీనతలతో మతం ముసుగును కొనసాగించారు. మానవతావాద సంస్కృతిలో మానవజీవితంపై భౌతిక సంపద, అధికారం, శారీరక సుఖాలు వంటివి కోరుకోదగినవే కాని త్యజించవలసిన అవసరం లేదని చెప్పారు. నేనూ ఏకీభవిస్తాను.

9th Class Social Textbook Page No.152

ప్రశ్న 11.
ఆ కాలం మహిళలు గ్రీకు, రోమన్ పుస్తకాలు చదివినందువల్ల ఏ ప్రయోజనం పొందారు?
జవాబు:
అ. గ్రీకు, రోమన్ పుస్తకాలు చదివినందువల్ల పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు ఎలా ధైర్యంగా బ్రతకవచ్చో తెలుసుకున్నారు.
ఆ. స్వేచ్ఛ, సమానత్వం గుర్చి అవగాహన ఏర్పరచుకున్నారు.
ఇ. ఆస్తి, ఆర్థికశక్తి వలన మాత్రమే స్త్రీలు సుఖంగా జీవించగలరని తెలుసుకున్నారు.
ఈ. సమాజంలో గౌరవం పెరిగి ఉన్నతంగా జీవించగలమని తెలుసుకున్నారు.

9th Class Social Textbook Page No.154

ప్రశ్న 12.
కాథలిక్కు చర్చిని ఏ అంశాలలో ప్రొటెస్టెంటులు విమర్శించారు?
జవాబు:
అ. దేవునితో సంబంధం ఏర్పరచుకోవటానికి మతగురువు అవసరం లేదన్నారు.
ఆ. విశ్వాసం ఒక్కటే సరైన జీవనం, స్వర్గ ప్రవేశం కల్పించగలదని చెప్పారు.
ఇ. పాపపరిహార పత్రాలు అమ్మటం, కొనటం తప్పని చెప్పారు.
ఈ. చర్చి, పోప్ దురాశను విమర్శించారు.
ఉ. మతానికి అనవసర ఆచారాలు కూడదన్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 13.
భారతదేశంలోని భక్తి ఉద్యమానికి, ప్రొటెస్టెంటు ఉద్యమానికి మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా? ఆ రెండింటి మధ్య తేడాలు ఏమైనా ఉన్నాయా?
జవాబు:
భగవంతుని యెడ ప్రేమ, సహనం, అహింస, తపస్సు, నిరాడంబరత్వాన్ని నమ్మిన వారు భక్తి ఉద్యమంలో దేవుడొక్కడే అని, రామ్, అల్లా, జీసస్ ఒక్కరేనని చెప్పారు. తమ పాటలు, తత్వాలు ద్వారా సామాన్య ప్రజలను ఆకర్షించారు. విగ్రహారాధన కూడదన్నారు. సంస్కారవంతమైన జీవనం ముఖ్యమన్నారు. ఇతరుల సేవతో తృప్తి పడాలన్నారు. జంతుబలులు, మూఢ విశ్వాసాలు వలదన్నారు. నిరాడంబర జీవనం కావాలన్నారు. అదేవిధంగా, ప్రొటెస్టెంట్ మతంలో దేవునితో సంబంధం ఏర్పరచుకోటానికి మతగురువు అవసరం లేదన్నారు. దేవునిపై విశ్వాస ముంచమన్నారు. ప్రజల నమ్మకాలపై మోసం చేయరాదన్నారు. పేదకు సేవ చేయటం ముఖ్యమన్నారు.

తేడాలు :

  1. భక్తి ఉద్యమంలో అన్ని మతాల సారం ఒక్కటేనన్నారు. కాని ప్రొటెస్టెంట్ లో క్రైస్తవ మతానికి ప్రాధాన్యత నిచ్చారు.
  2. భక్తి ఉద్యమం అన్ని ప్రాంతాలలో ప్రాచుర్యం పొందగా, ప్రొటెస్టెంట్ మతం పట్టణ ప్రాంతానికే పరిమితమైంది.

9th Class Social Textbook Page No.155

ప్రశ్న 14.
పునరుజ్జీవన కాలం నాటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఎవరు? విజ్ఞాన శాస్త్రానికి వాళ్లు చేసిన కృషి ఏమిటి?
జవాబు:
రోజర్ బాకన్ :
లోహాలు, రసాయనాలతో అనేక ప్రయోగాలు చేసాడు. సత్యాన్ని తీవ్రంగా అన్వేషించాడు.

నికోలస్ కోపర్నికస్ :
ఖగోళశాస్త్ర వేత్త. వేధశాలను స్థాపించాడు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అనేక గ్రహాలలో భూమి ఒకటని చెప్పాడు.

టోలమి : భూమి విశ్వానికి కేంద్రమని, నక్షత్రాలు, సూర్యుడు, గ్రహాలు దానిచుట్టూ తిరుగుతున్నవని వివరించాడు.

గెలీలియో : సూక్ష్మదర్శినికి మెరుగులు దిద్దాడు. లోలకంలోని సిద్ధాంతాలను కనుగొన్నాడు. బరువైన వస్తువులు, తేలికైన వస్తువులు ఒకే వేగంతో కిందకు పడతాయని నిరూపించాడు.

9th Class Social Textbook Page No.157

ప్రశ్న 15.
పటం చూసి సముద్ర మార్గాలలో వివిధ అన్వేషణల జాబితా తయారుచేయండి.
జవాబు:
పోర్చుగల్ నావికుడైన ప్రిన్స్ హెన్రీ ఆఫ్రికా పశ్చిమ తీరానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు.

పోర్చుగల్ కి చెందిన బారొలొమ్యి డియాజ్ అన్న నావికుడు ఆఫ్రికాకి దక్షిణ భాగమైన గుడ్ హోప్ అగ్రం దాటి వెళ్ళాడు. వాస్కోడిగామా సముద్రంలో ఆఫ్రికాను చుట్టి ముట్టి 1498లో భారత్ లోని కాలికట్ తీరం చేరాడు. క్రిస్టఫర్ కొలంబస్ అట్లాంటిక్ సముద్రయానం తరువాత 1492లో అక్టోబర్ 12న ఒక దీవిని చేరుకున్నాడు. భారతదేశానికి తూర్పువైపుకి చేరుకున్నానని ఆ ప్రజలను ఇండియన్స్ అన్నాడు.

ఇటలీకి చెందిన అమెరిగో వెస్పూచి అన్న నావికుడు కొలంబస్ కనుగొన్నది ఆసియా కాదని, కొత్త ప్రపంచమని (అమెరికా) అని నిర్ధారించుకున్నాడు. ఫెర్డినాండ్ మాజిల్లాన్ (స్పెయిన్) ఓడలో ప్రపంచాన్ని చుట్టుముట్టి వచ్చాడు. అట్లాంటిక్ సముద్రం దాటి, పసిఫిక్ మహా సముద్రంలోని ఫిలిప్పైన్స్ దీవులను చేరుకున్నాడు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పునరుజ్జీవన కాలం నాటి ప్రముఖ కళాకారుల చిత్రాలను సేకరించి, వాటిని ఒక పుస్తకంలో అంటించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 3

ప్రశ్న 2.
సూర్యుడి చుట్టూ భూమి తిరగటం లేదని నమ్మే మతగురువుకి, గెలీలియోకి మధ్య సంభాషణను ఊహించి రాయండి. (T.Q.)
జవాబు:
సంభాషణ
మతగురువు : బైబిలు, చర్చి బోధనలకు విరుద్ధంగా మాట్లాడుతున్న పాపి గెలీలియోను పిలిపించండి.

గెలీలియో : సెలవివ్వండి పరిశుద్ధులారా!

మతగురువు : భూమి విశ్వానికి కేంద్రం కాదని అంటున్నారట, ఏం బ్రతకాలని లేదా?

గెలీలియో : మన్నించండి! మత గురువుగారు! నాకృషితో సూక్ష్మదర్శినిని కనుగొన్నాను. దీనితో యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఓడ అయిదు మైళ్ళ దూరంలో ఉన్నంత స్పష్టంగా కనిపిస్తుంది. జ్యూపిటర్ ఉపగ్రహాలు, గ్రహ పరిభ్రమణాన్ని స్వయంగా చూసాను.

మతగురువు : కాదు కాదు మీ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోండి లేదా కఠిన శిక్షలకు గురౌతారు. దీర్ఘకాల ఖైదుకి గురి కావలసి ఉంటుంది.

గెలీలియో : “భూమి కదలికలను నేను చూసాను”. గొణుక్కుంటూ బయటకు వచ్చేస్తాడు.

ప్రశ్న 3.
ముద్రణ యంత్రం నుంచి వచ్చే వివిధ ఉత్పత్తులను మనం ఏ ఏ విధాలుగా వాడుతున్నామో తెలియజేస్తూ ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
ముద్రణా యంత్రం నుంచి వచ్చే వివిధ ఉత్పత్తులను మనం అనేక విధాలుగా వాడుతున్నాం. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్వేషణకు, సాహిత్యం , శిల్పం, చిత్రలేఖనం, భవన నిర్మాణ లోతుల అధ్యయనానికి, అంతరిక్ష, భూగోళ, విశ్వాంతర రహస్యాల ఛేదనకు, ఆవిష్కరణలు, రచనలు అభివృద్ధికి, ఆధారాలు సేకరణకు తోడ్పడుతుంది. వైద్యం, విజ్ఞానశాస్త్రం, తత్వం, భూగోళశాస్త్ర అధ్యయనానికి తోడ్పాటునందించింది.