AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

These AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 3rd Lesson Important Questions and Answers చిన్ని శిశువు

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గేయాలు

కింది గేయాల్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. తోయంపు గురులతోడ దూగేటి శిరసు, చింత
కాయల వంటి జడల గముల తోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పాయక యశోదవెంట పాటాడు శిశువూ!
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘పాయక’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
విడువక

ఆ) ‘కనకం’ పర్యాయపదాలు ఏవి?
జవాబు:
బంగారం, స్వర్ణం

ఇ) ‘యశోద’ ఎవరి తల్లి?
జవాబు:
శ్రీకృష్ణుని (పాఠం ప్రకారం)

ఈ) ‘శిశువు’ వ్యుత్పత్తి ఏమిటి?
జవాబు:
ఎక్కువకాలం నిద్రించునది.

2. ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగరాల
నిద్దపుం జేతుల పైడి బొద్దుల తోడ
అద్దపుం జెక్కులతోడ అప్ప లప్ప లని నంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువూ!
ప్రశ్నలు – జవాబులు:
అ) ‘ముద్దు’ దీని ప్రకృతి పదం ఏమిటి?
జవాబు:
ముద్రా / ముద్ర

ఆ) ‘నిద్దపుంజేతులు’ పదాన్ని విడదీయండి.
జవాబు:
నిద్దము + చేతులు

ఇ) ‘అద్దపుం జెక్కులు’ పదానికి విగ్రహవాక్యం ఏమిటి?
జవాబు:
అద్దము వంటి చెక్కులు

ఈ) ‘గద్దించు’ నానార్థాలు ఏమిటి?
జవాబు:
అరచు, మందలించు

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

3. బలుపైన పొట్టమీది పాలచారలతోడ
నులివేడి వెన్న దిన్న నోరి తోడ
చెలగి నేడిదె వచ్చి శ్రీ వేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువూ!
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘శిశువు’ తాగిన పదార్థం ఏమిటి?
జవాబు:
పాలు

ఆ) ‘నులివేడి’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
కొంచెం వేడి

ఇ) ‘నేడిదె’ పదాన్ని విడదీయండి.
జవాబు:
నేడు + ఇదే

ఈ) లోకాలను కాపాడు ఆ స్వామి ఎక్కడ నిలిచాడు?
జవాబు:
లోకాలను కాపాడే ఆ స్వామి వేంకటాద్రిపై నిలిచాడు.

అపరిచిత పద్యా లు

కింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతీ!
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘సుమతీ’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
మంచిబుద్ధి కలవాడు

ఆ) ‘ధన్యుడు’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
పుణ్యవంతుడు / వివేకవంతుడు

ఇ) ‘మాటలాడి’ పదాన్ని విడదీయండి.
జవాబు:
మాటలు + ఆడి

ఈ) ఈ పద్యానికి శీర్షిక (పేరు) రాయండి.
జవాబు:
ధన్యుడు

2. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదా? గిట్టదా?
విశ్వదాభిరామ వినుర వేమ!
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘తల్లిదండ్రులు’ ఏ సమాసం?
జవాబు:
ద్వంద్వ సమాసం

ఆ) తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుణ్ణి వేమన దేనితో పోల్చాడు?
జవాబు:
పుట్టలోని చెదలతో పోల్చాడు

ఇ) వేమన శతకంలోని మకుటం ఏమిటి?
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ

ఈ) ‘పుట్టు’కు వ్యతిరేక పదం రాయండి.
జవాబు:
గిట్టు

3. కోకిలమ్మ చేసికొన్న పుణ్యంబేమి!
కాకి చేసికొన్న కర్మమేమి!
మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు
లలిత సుగుణజాల తెలుగుబాల!
ప్రశ్నలు – జవాబులు :
అ) పై పద్యం ఏ శతకంలోనిది?
జవాబు:
తెలుగుబాల శతకం

ఆ) పై పద్యం రాసినదెవరు?
జవాబు:
జంధ్యాల పాపయ్యశాస్త్రి

ఇ) మర్యాద దేని ద్వారా వస్తుంది?
జవాబు:
మధుర భాషణము వల్ల మర్యాద వస్తుంది.

ఈ) ఈ పద్యంలోని పక్షుల పేర్లు ఏమిటి?
జవాబు:
కోకిలమ్మ, కాకి

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

4. కన్నతల్లి దండ్రి కలహించి విడిపోవ
ప్రేమ లేక పెరుగు పిల్లలిపుడు
నేరగాండలోన జేరు చుండిరి సుమా!
పగ, మనస్సులో న రగులు చుండ.
ప్రశ్నలు – జవాబులు :
అ) తల్లిదండ్రుల ప్రేమ దూరమైన పిల్లలు ఎలా మారుతున్నారు?
జవాబు:
నేరచరితులుగా

ఆ) ఎవరు కలహించి విడిపోతున్నారు?
జవాబు:
తల్లి, తండ్రి

ఇ) నేరగాళ్ళగా మారిన పిల్లల మనసులో ఏమి రగులుతుంటుంది?
జవాబు:
పగ

ఈ) తల్లిదండ్రులు ఎలా ఉంటే మీకిష్టం?
జవాబు:
ప్రేమగా

5. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు
నష్టపెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా
లలితసుగుణజాల తెలుగుబాల.
ప్రశ్నలు – జవాబులు :
అ) ఎవరి మనసు కష్టపెట్టరాదు?
జవాబు:
కన్నతల్లి మనసు

ఆ) దైవ సన్నిభులు ఎవరు?
జవాబు:
తల్లిదండ్రులు

ఇ) ఎవరి పనులు నష్టపెట్టరాదు?
జవాబు:
నాన్న పనులు

ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ పద్యములో గల మకుటం ఏది?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఎటువంటి కృష్ణుడు వేంకటేశ్వర స్వామిగా వెలిశాడు?
జవాబు:
పొట్టమీద పాలచారలతో ఉన్న కృష్ణుడు శ్రీ వేంకటేశ్వర స్వామిగా వెలిశాడు. కొసరి కొసరి తిన్న వెన్న నోటితో వెలిశాడు. సర్వ లోకాలనూ కాపాడడానికి వెలిశాడు.

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

ప్రశ్న 2.
శ్రీ కృష్ణుడు తన తల్లినెందుకు కౌగిలించుకొనేవాడు?
జవాబు:
చిన్నపిల్లలు సాధారణంగా తల్లిని వదిలి ఉండరు. ఉండలేరు. తల్లి పాడే పాటలు, చెప్పే కబుర్లు, ఆడించే ఆటలు పిల్లలకు చాలా ఇష్టం. అందుకే చిన్ని కృష్ణుని కూడా తోటివారు ఆటలకు పిలిస్తే వెళ్లేవాడుకాదు. వారిని గదమాయించేసేవాడు. తల్లిని కౌగిలించుకొనేవాడు. ఆమె దగ్గరే ఉండేవాడు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“చిన్ని శిశువు” పాఠంలోని చిన్ని శిశువు గురించి మీకేం తెలిసింది?
జవాబు:
చిన్ని శిశువు శ్రీకృష్ణుడు. ఆయన జడలు చింతకాయలులా ఉన్నాయి. ఆయన బంగారు మువ్వల గజ్జెలు ధరించాడు. వంకీ ఉంగరాలు ధరించాడు. చేతులకు బంగారు. మురుగులు ధరించాడు. వీటన్నింటినీ బట్టి ఆయన చాలా డబ్బు గలవారి గారాలబిడ్డ అని తెలిసింది. పొట్టమీద పాలచారలున్నాయి. వెన్న తిన్న నోరును బట్టి ఆయనకు వెన్న, పాలు ఇష్టమని తెలిసింది. ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామిగా వెలిశాడు. అన్ని లోకాలను రక్షిస్తున్నాడంటే ఆయన దేవుడని తెలిసింది.

ప్రశ్న 2.
శ్రీకృష్ణుని గురించి మీకు తెలిసినవి వ్రాయండి.
జవాబు:
శ్రీకృష్ణుడు’ దేవకీదేవి, వసుదేవుల బిడ్డ. ఆయన జైలులో జన్మించాడు. ఆయన పుట్టగానే యశోద పక్కలోకి చేర్చాడు వసుదేవుడు. అందుచేత యశోద దగ్గర పెరిగాడు. చాలా అల్లరి చేసేవాడు. చుట్టుప్రక్కల ఇళ్లలో పాలు, పెరుగు, వెన్న దొంగిలించి తాగే సేవాడు. తన స్నేహితులకు పెట్టేసేవాడు. ఇంటికి ఎవరైనా గొడవకు వచ్చి యశోదకు చెబితే ఆమె చీర కొంగుచుట్టుకొని వెనక దాక్కొనేవాడు. అమాయకత్వం నటించేవాడు. నల్లగా ఉండేవాడు.

III. భాషాంశాలు

పర్యాయపదాలు

శిశువు = బిడ్డ, చంటిపాప
కురులు = వెంట్రుకలు, రోమములు
చేతులు = కరములు, హస్తములు
చెక్కులు = చెక్కిళ్లు, కపోలము
నోరు = వాయి, మూతి
జడ = జట, వేణి
మువ్వ = మంజీరము, శింజిని
నిద్దము = సొగసు, అందము
మేను = శరీరం, దేహం
పాలు = క్షీరము, దుగ్ధము
లోకము = జగము, జగతి
చూచుట = కనుట, వీక్షించుట
శిరసు = తల, మస్తకము
అద్దము = ముకురము, దర్పణము
వెన్న – నవనీతము, వెన్నపూస
గములు = గుంపులు, సమూహాలు
కనకం = బంగారం, పైడి
ఉంగరం = అంగుళీయకము, బటువు
గద్దించి = అదలించి, గదమాయించి
పొట్ట = కడుపు, ఉదరము
అద్రి = పర్వతము, కొండ

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

ప్రకృతులు – వికృతులు

శిశువు – నిసుగు
అంబ – అమ్మ
శిరసు – సిరసు
తింత్రిణి, చించా – చింత
జట – జడ
ముద్ర -ముద్దు
శ్రీ – సిరి
అబ్దము – అద్దము
కృష్ణుడు – కన్నడు

వ్యతిరేకపదాలు

చిన్న × పెద్ద
చూడము × చూస్తాము
పాయక × పాసి
వచ్చి × వెళ్లి
పైన × క్రింద

సంధులు : (ఉత్వసంధి)

చూడము + అమ్మా = చూడమమ్మా
తూగు + ఏటి = తూగేటి
పాఱు + ఆడు = పాఱాడు
బలుపు + ఐన = బలుపైన
నేడు + ఇది = నేడిదె
లోకములు + ఎల్ల = లోకములెల్ల

యడాగమం:
అమ్మయిటువంటి = అమ్మ + ఇటువంటి
మొరవంకయుంగరాల . = మొరవంక + ఉంగరాల

సంధులు : ఈ క్రింది పదాలను కలిపి రాయండి.

1. అమ్మ + ఇటువంటి = అమ్మయిటువంటి.
2. మొరవంక + ఉంగరాల = మొరవంకయుంగరాల
3. కట్టిన + అట్లు = కట్టినయట్లు
4. మా + ఊరు = మయూరు
5. మీ + ఇంట = మీయింట

విభక్తులు : ఈ క్రింది ఖాళీలను సరైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి.

1. సింహము ……………… పిల్ల (యొక్క)
2. అడవి ………………… జంతువులుంటాయి. (లో)
3. నలుగురి …………………. మంచిగా ఉండాలి. (తో)
4. పెద్దల ………………. గౌరవించాలి. (ను)
5. మా ఊరి ……………….. బస్సు వచ్చింది. (కి)
6. అతని ………………. నేనేమీ అనలేదు. (ని)
7. వాళ్ల …………………… గొడవ వద్దు. (తో)
8. కృష్ణు …………………. దైవం. (డు)
9. వన ……………….. లో మొక్కలున్నాయి. (ము)
10. మంచి ………………. మారుపేరుగా ఉండాలి. (కి)

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

ఖాళీలు : క్రింది ఖాళీలను సరైన వ్యతిరేక పదాలతో పూరించండి.

1. చిన్న …………… లేకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు. (పెద్ద)
2. చెడును చూడము. మంచిని …………… (చూస్తాము)
3. మంచిని పాయక నేర్చుకోవాలి. చెడును ………………. బ్రతకాలి. (పాసి)
4. బడికి వచ్చి చదవకుండా ……………. పోతే ప్రయోజనం లేదు. (వెళ్లి)
5. పైన, ……………… చూసుకొని నడవాలి. (క్రింద)

IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. భాషాంశాలు

అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

1. మంచిని ఎన్నడు విడువకు.
a) ఎప్పుడు
b) అప్పుడు
c) ఇప్పుడు
d) నిన్న
జవాబు:
a) ఎప్పుడు

2. వృద్ధులకు కురులు తెల్లబడతాయి.
a) శరీరాలు
b) అరచేతులు
c) అరికాళ్లు
d) వెంట్రుకలు
జవాబు:
d) వెంట్రుకలు

3. ఏనుగుల గములు ఊళ్లలోకి వచ్చేస్తున్నాయి.
a) అరుపులు
b) గుంపులు
c) ఘీంకారాలు
d) ఆటలు
జవాబు:
b) గుంపులు

4. కనకము ధర రోజురోజుకూ పెరుగుతోంది.
a) వెండి
b) భూమి
c) బంగారం
d) పెట్రోలు
జవాబు:
c) బంగారం

5. గురువును పాయక జ్ఞానం సంపాదించాలి.
a) సేవించి
b) విడువక
c) బెదిరింపక
d) గౌరవించి
జవాబు:
b) విడువక

6. ఎవరి పిల్లలు వారికి నిద్దముగా కనబడతారు.
a) అందము
b) బుద్ది
c) తెలివి
d) ఆరోగ్యం
జవాబు:
a) అందము

7. శివుడు అద్రి మీద శయనించును.
a) శివలింగం
b) పానపట్టు
c) శ్మశానం
d) కొండ
జవాబు:
d) కొండ

8. మేను ను శుభ్రంగా తోముతూ స్నానం చేయాలి.
a) సబ్బు
b) శరీరం
c) బట్టలు
d) గిన్నె
జవాబు:
b) శరీరం

9. చంటి పిల్లలకు బొద్దులు చేయిస్తారు.
a) దుద్దులు
b) ఉంగరాలు
c) మురుగులు
d) మొలతాళ్లు
జవాబు:
c) మురుగులు

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

10. పిల్లలను గద్దించి ఐనా చదివించాలి.
a) అదలించి
b) కొట్టి
c) తిట్టి
d) నించోపెట్టి
జవాబు:
a) అదలించి

పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

11. వెన్న తినడం అందరికీ ఇష్టమే.
a) నెయ్యి
b) మీగడ
c) నవనీతం, వెన్నపూస
d) నెయ్యి, ఘృతం
జవాబు:
c) నవనీతం, వెన్నపూస

12. జడలో పూలు పెట్టుకోవాలి.
a) జడ్జ, జడము
b) తల, శిరసు
c) జడత, పూలజడ
d) వేణి, జట
జవాబు:
a) జడ్జ, జడము

13. కనకంతో ఆభరణాలు చేయించుకొంటారు.
a) బంగారం, పైడి
b) ఇత్తడి, పుత్తడి
c) రజతం, వెండి
d) డబ్బు, ధనం
జవాబు:
a) బంగారం, పైడి

14. హనుమ మేను పెంచి సీతమ్మను ఓదార్చాడు.
a) కాయం, ఖాయం
b) శరీరం, దేహం
c) బలం, శక్తి
d) భక్తి, నమ్మకం
జవాబు:
b) శరీరం, దేహం

15. పిల్లలు పాలు ఎక్కువ త్రాగాలి.
a) ఉదకం, నీరు
b) పరమాన్నం, క్షీరాన్నం
c) క్షీరము, దుగ్ధం
d) టీ, కాఫీ
జవాబు:
c) క్షీరము, దుగ్ధం

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

ప్రకృతి-వికృతులు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.

16. నిసుగు కు ఏడ్వడానికి విసుగు ఉండదు.
a) నలుసు
b) శిశువు
c) శిష్యుడు
d) చంటిబిడ్డ
జవాబు:
b) శిశువు

17. అంబను మించిన దైవం లేదు.
a) అమ్మ
b) పార్వతీదేవి
c) స్త్రీ
d) అమ్మవారు
జవాబు:
a) అమ్మ

18. సిరసున తలపాగా బాగుంది.
a) తల
b) మస్తకం
c) శిరసు
d) శీర్షము
జవాబు:
c) శిరసు

19. తింత్రిణీ ఫలము బాగుంటుంది.
a) చింత
b) చింతపండు
c) చించా
d) నిమ్మ
జవాబు:
a) చింత

20. చంటిపిల్లల నెక్కువగా ముద్దు పెట్టుకోకూడదు.
a) ముగ్ధ
b) ముద్ర
c) ముదర
d) పట్టుకోవడం
జవాబు:
b) ముద్ర

21. అద్దములో ముఖం చూసుకొంటాం.
a) ఆబ్దికం
b) శతాబ్దం
c) సహస్రాబ్దం
d) అబ్దం
జవాబు:
d) అబ్దం

22. సిరి గలవారు కొద్దిమందే ఉంటారు.
a) శ్రీ
b) డబ్బు
c) డబ్బు
d) సంపద
జవాబు:
a) శ్రీ

23. కన్నడు అల్లరి ఎక్కువ చేశాడు.
a) దొంగ
b) దొంగవాడు
c) కృష్ణుడు
d) శ్రీకృష్ణుడు
జవాబు:
c) కృష్ణుడు

2. వ్యాకరణాంశాలు

ఈ క్రింది ఖాళీలలో సరైన విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.

24. రాముని ……… రావణుడు యుద్ధం చేశాడు.
a) చేత
b) ని
c) తో
d) చే
జవాబు:
c) తో

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

25. చిన్ని కృష్ణు ………. అన్నమయ్య వర్ణించాడు.
a) ని
b) ను
c) చేత
d) తో
జవాబు:
a) ని

26. అన్నమయ్య ………. ఎంత చెప్పినా తక్కువే.
a) ను
b) ని
c) తో
d) గురించి
జవాబు:
d) గురించి

27. కృష్ణు ………. వెన్నదొంగ.
a) ని
b) డు
c) చేత
d) తో
జవాబు:
b) డు

28. బాణం ………… కొట్టాడు .
a) ను
b) తో
c) గూర్చి
d) వలన
జవాబు:
b) తో

29. వృక్షముల ……….. కొట్టరాదు.
a) తో
b) వలన
c) యొక్క
d) ను
జవాబు:
d) ను

30. నల్ల ………. రంగు గలవాడు కృష్ణుడు.
a) ని
b) న
c) తో
d) యొక్క
జవాబు:
a) ని

31. పాము ………. కరవబడ్డాడు.
a) యొక్క
b) ను
c) చేత
d) ని
జవాబు:
c) చేత

32. తెలివి ……… పనులు చేయాలి.
a) ని
b) తో
c) చేత
d) ను
జవాబు:
b) తో

33. పాఠము ………. చదవాలి.
a) గూర్చి
b) తో
c) ని
d) ను
జవాబు:
d) ను

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

సమాసాలు: సరైన సమాస పదాలను, విగ్రహవాక్యాలను గుర్తించి వ్రాయండి.

34. చిన్నిశిశువు – విగ్రహవాక్యం గుర్తించండి.
a) చిన్ని యొక్క శిశువు
b) చిన్నియును, శిశువును
c) చిన్నదైన శిశువు
d) చిన్నితో శిశువు
జవాబు:
c) చిన్నదైన శిశువు

35. మా పాఠము విగ్రహవాక్యం గుర్తించండి.
a) మాదైన పాఠము
b) మా యొక్క పాఠము
c) పాఠము మాది
d) మా కొఱకు పాఠము
జవాబు:
b) మా యొక్క పాఠము

36. తల్లియును తండ్రియును – సమాసపదం గుర్తించండి.
a) తల్లితండ్రి
b) తల్లేతండ్రి
c) తండ్రితల్లి
d) తల్లిదండ్రులు
జవాబు:
d) తల్లిదండ్రులు

37. పనస అను పేరు గల కాయ – సమాసపదం గుర్తించండి.
a) పనసకాయ
b) కాయపనస
c) పనసనుకోయ
d)కాయైనపనస
జవాబు:
a) పనసకాయ

38. తల్లి ప్రేమ – విగ్రహవాక్యం గుర్తించండి.
a) తల్లికి ప్రేమ
b) తల్లియే ప్రేమ
c) తల్లి యొక్క ప్రేమ
d) తల్లిపైన ప్రేమ
జవాబు:
c) తల్లి యొక్క ప్రేమ

39. జడల యొక్క గములు – సమాసపదం గుర్తించండి.
a) జడలనెడి గములు
b) జడలగములు
c) గములనెడిజడలు
d) జలలేగములు
జవాబు:
b) జడలగములు

40. బాలుడైన కృష్ణుడు – సమాసపదం గుర్తించండి.
a) బాలకృష్ణుడు
b) కృష్ణబాలుడు
c) బాల్యకృష్ణ
d) బాలకృష్ణ
జవాబు:
a) బాలకృష్ణుడు

41. కనకపు మువ్వలు – విగ్రహవాక్యం గుర్తించండి.
a) కనకము యొక్క మువ్వలు
b) మువ్వలైన కనకము
c) కనకమైన మువ్వలు
d) కనకముతో మువ్వలు
జవాబు:
d) కనకముతో మువ్వలు

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

42. చల్లగాలి – విగ్రహవాక్యం గుర్తించండి.
a) చల్లనైన గాలి
b) గాలి యొక్క చల్లదనం
c) చలి పెంచే గాలి
d) గాలి వలన చలి
జవాబు:
a) చల్లనైన గాలి

43. పెద్దదైన ప్రశ్న – సమాసపదం గుర్తించండి.
a) పెద్దగా ప్రశ్న
b) ప్రశ్న పెద్దది
c) పెద్ద ప్రశ్న
d) ప్రశ్నే పెద్దది
జవాబు:
c) పెద్ద ప్రశ్న

సంధులు : క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

44. మాయూరు – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) మా + ఊరు
b) మా + యూరు
c) మాయు + ఊరు
d) మాయ + యూరు
జవాబు:
a) మా + ఊరు

45. అక్కడ + ఉన్న – సంధి కలిసిన రూపం గుర్తించండి.
a) అక్కడున్న
b) అక్కడయున్న
c) అక్కడ ఉన్న
d) అకజొన్న
జవాబు:
a) అక్కడున్న

46. అమ్మమ్మ – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) అమ్మా + అమ్మ
b) మ్మ + మ్మ
c) అమ్మ + అమ్మ
d) అమ్మ + మ్మ
జవాబు:
c) అమ్మ + అమ్మ

47. ఎవరు + అది – సంధి కలిసిన రూపం గుర్తించండి.
a) ఎవరిది
b) ఎవరది
c) అదెవరు
d) ఎవరిదో
జవాబు:
b) ఎవరది

48. అదేమిటి – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) అది + ఏమిటి
b) అదేమి + టి
c) అదు + ఏమిటి
d) అది + ఏమిటి
జవాబు:
d) అది + ఏమిటి

49. రామాలయం – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) రామా + ఆలయం
b) రామ + ఆలయం
c) రామా + లయం
d) రాం + ఆలయం
జవాబు:
b) రామ + ఆలయం

50. శత + అబ్ది – సంధి కలిసిన రూపం గుర్తించండి.
a) శతయబ్ది
b) శతంఅబ్ది
c) శతాబ్ది
d) శతమ
జవాబు:
c) శతాబ్ది

51. నన్నోడెనా? – దీని సంధి పేరు గుర్తించండి.
a) అత్వసంధి
b) ఉత్వసంధి
c) సవర్ణదీర్ఘ సంధి
d) యడాగమం
జవాబు:
b) ఉత్వసంధి

52. క్రిందివానిలో ఉత్వసంధి ఉదాహరణ గుర్తించండి.
a) రాకున్నది
b) చీకాకు
c) మీకున్నది
d) పాకేది
జవాబు:
c) మీకున్నది

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

53. మీరందరూ – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) మీర + అందరూ
b) మీరంద + రూ
c) మీరె + అందరూ
d) మీరు + అందరూ
జవాబు:
d) మీరు + అందరూ

నేనివి చేయగలనా?

1. చిన్ని శిశువు గేయాన్ని భావయుక్తంగా, రాగయుక్తంగా పాడగలను. [ ఔను / కాదు ]
2. కీర్తనలోని భావాలను, సొంత మాటలలో చెప్పగలను. [ ఔను / కాదు ]
3. కీర్తనలోని పదాలను సొంతవాక్యాలలో ఉపయోగించగలను. [ ఔను / కాదు ]
4. చిన్నపిల్లల చేష్టలను గురించి రాయగలను. [ ఔను / కాదు ]

చదవండి – ఆనందించండి

సత్యవ్రతం “నారాయణ ! నారాయణ ! అని ఉచ్చరిస్తుంటావు. ఎవరీ నారాయణుడు ? ఎక్కడ ఉంటాడు ? అతని గుణాలు ఏమిటి ? ఏమి చేయగలడు వాడు” అని హిరణ్యకశిపుడు తన పుత్రుణ్ణి అడిగాడు. ‘తండ్రీ ! నారాయణుడంటే ఈశ్వరుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అన్నాడు ప్రహ్లాదుడు. ‘చాలించు నీ ప్రలాపం’ తండ్రికి కోపం వచ్చింది. ‘లేదు తండ్రీ ! ఇది సత్యం. ఆయన సర్వ వ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి మంతుడు’.

“నేనే సర్వశక్తిమంతుణ్ణి మూర్బుడా ! నేనే ఈశ్వరుణ్ణి. నారాయణ, నారాయణ అనే జపం మాని ఇకనుండి నీవు నీ నామాన్ని జపించాలి. నీవు నా నామాన్ని జపించాలి. తెలిసిందా !! ‘లేదు…. మీరు నాకు తండ్రి…., పూజ్యులు’ కాని నేను మీ నామాన్ని జపించలేను. మిమ్మల్ని తండ్రిగా గౌరవించగలను’ అన్నాడు ప్రహ్లాదుడు.

రాజైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి కష్టాలకు లోనుచేసి చంపవలసినదిగా మంత్రిగారిని ఆదేశించాడు. ప్రహ్లాదుణ్ణి సముద్రంలో ముంచారు. కొండపై నుండి క్రిందకు త్రోశారు. కాని ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. హాలికాదేవి ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలో దూకింది. ఆమె అగ్నిలో దూకి భస్మం అయింది. కాని ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు. చివరికి మళ్లీ ప్రహ్లాదునికి నచ్చచెప్పాలని ప్రయత్నించారు. కాని అతను అంగీకరించలేదు. అతని నోటి నుండి కేవలం ‘నారాయణ ! నారాయణ ! అనే మాటలు మాత్రమే వస్తున్నాయి. అప్పుడు హిరణ్యకశిపుడు ‘ఈ స్థంభంలో నారాయుణ్ణి చూపించగలవా ?” అని ప్రహ్లాదుణ్ణి ప్రశ్నించాడు.

‘తండ్రీ ! నారాయణుడు ఇందు గలడు, అందు లేడు అనే సందేహం వద్దు. అంతటా వ్యాపించి ఉంటాడు’ అని చెప్పాడు. వెంటనే హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్థంభాన్ని గట్టిగా కొట్టాడు. అందులో నుండి నృసింహస్వామి ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రహ్లాదుని తండ్రియైన హిరణ్యకశిపుని వధించాడు. భక్తుడైన ప్రహ్లాదుణ్ణి ఆశీర్వదించి వరం ఇచ్చాడు. ‘నీవు తేజశ్శాలివి అవుతావు, మహాత్ముడివి అవుతావు. విద్వాంసుడవు అవుతావు’ ఇలా చెప్పి ఆయన అంతర్థానమైనాడు. ప్రహ్లాదుడు ధన్యుడు. అతని హరిభక్తి ధన్యం.

ఆంధ్రుడై జన్మించుట ఆంధ్ర భాష మాట్లాడుట ఎన్నో జన్మల తపఃఫలం – అప్పయ్య దీక్షితులు

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

These AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 2nd Lesson Important Questions and Answers మాయాకంబళి

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యాలు

కింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కంబళి సాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంత సేపటికి, తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి, తన చేతికర్రను ఒక పొదలో పెట్టి, ఎలాంటి చప్పుడూ చేయకుండా మసల సాగాడు. ఆ కంబళి వల్ల వాడికి అడుక్కు తినటానికి కూడా లేకపోయింది. నగరంలో ఇక తనకెక్కడా భద్రత లేదనుకున్న ముష్టివాడు, ఊరి బయట ఉన్న పాడుబడిన దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) బిచ్చగాడు చేతికర్రను ఎక్కడ దాచాడు?
జవాబు:
బిచ్చగాడు చేతికర్రను పొదలో దాచాడు.

ఆ) “మసలుట” అనగా అర్థం ఏమిటి?
జవాబు:
మసలుట అంటే అటూ ఇటూ తిరుగుట.

ఇ) బిచ్చగాడు చివరకు ఎక్కడకు చేరాడు?
జవాబు:
బిచ్చగాడు పాడుబడిన దేవాలయానికి చేరాడు.

ఈ) ‘అదృశ్యం’ వ్యతిరేకపదం రాయండి.
జవాబు:
ప్రత్యక్షం

2. ఆత్మానందుడు శోభావతీ నగరానికి వచ్చి రాజైన చండీదత్తుని ఏకాంతంగా కలిసి, కంబళి ఇమ్మన్నాడు. అందుకు రాజు “రాజ్య శ్రేయస్సు దృష్ట్యా, ఇది నా దగ్గర ఉండటమే మంచిది” అన్నాడు. అందుకు యోగి “ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు, నీతి బాహ్యమైన పనులకు పురికొల్పుతుంది. ఇలా శతవిధాల చెప్పినా, రాజు తన వాదంతో ఏకీభవించకపోయేసరికి, స్వానుభవంతో తప్ప నీకు ఈ విషయం బోధపడదు” అంటూ నిట్టూర్చాడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) పై పేరాలోని వ్యక్తుల పేర్లు ఏమిటి?
జవాబు:
యోగి ఆత్మానందుడు, రాజు చండీదత్తుడు.

ఆ) రాజు కంబళిని ఎందుకు ఇవ్వనన్నాడు?
జవాబు:
రాజు కంబళిని రాజ్యశ్రేయస్సు దృష్ట్యా ఇవ్వనన్నాడు.

ఇ) ‘నిట్టూర్పు’ విడదీయండి.
జవాబు:
నిడు + ఊర్పు

ఈ) ‘స్వానుభవం’ విగ్రహవాక్యం రాయండి.
జవాబు:
తన యొక్క అనుభవం

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

3. ఆ కంబళి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు. కాబట్టే ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఇమ్మని అడిగాడు. రాజుకు రక్షాబంధనం కట్టాడు. రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే’ కంబళిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు. ఆత్మానందుడు “నీ వద్ద ఈ కంబళి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు” అని నవ్వుతూ దానిని తీసుకున్నాడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) ఆత్మానందుడు రాజును కంబళి ఇమ్మని ఎందుకు అడిగాడు?
జవాబు:
కంబళి దుష్టుల చేతికి వెళితే రాజుకు ప్రమాదం. అందుకే ఆత్మానందుడు రాజును కంబళి అడిగాడు.

ఆ) రాజుకు రక్షాబంధనం కట్టింది ఎవరు?
జవాబు:
రాజుకు రక్షాబంధనం యోగి ఆత్మానందుడు కట్టాడు.

ఇ) ఆత్మానందుడు కంబళి తీసుకుంటూ రాజుతో ఏమన్నాడు?
జవాబు:
ఆత్మానందుడు “నీ వద్ద ఈ కంబళి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు” అన్నాడు.

ఈ) పై పేరాలో చెప్పబడిన నగరం ఏది?
జవాబు:
పై పేరాలో చెప్పబడిన నగరం శోభావతి.

అపరిచిత గద్యాలు

కింది అపరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. శరీరం పసితనం నుంచి కుర్రతనానికి మార్పు చెందుతున్నప్పుడు వ్యక్తిత్వం వికసిస్తుంది. తమకు ఇష్టమైన అంశాన్ని ఎంచుకుని గురువు సమక్షంలో విద్యార్జన చేస్తూ, ఉన్నత లక్ష్యం ఏర్పరచుకునే దశ అది. ప్రపంచంలో ఏదైనా సాధించగలం అన్న దృఢ విశ్వాసంతో, సముద్రమంత విశాలమైన భావాలతో ఆకాశమే హద్దుగా సాగే ఎగిసిపడే అల లాంటి వయసు అది. వాల్మీకి రాముడి ప్రశాంతతతో కూడిన హుందాతనాన్ని, పోతన కృష్ణుడి అల్లరి చేష్టలను చదువరుల కళ్ళకు కట్టి మనసున నాటిన వయసది.
ప్రశ్నలు – జవాబులు :
అ) వ్యక్తిత్వం ఎప్పుడు వికసిస్తుంది?
జవాబు:
శరీరం పసితనం నుంచి కుర్రతనానికి మార్పు చెందుతున్నప్పుడు వ్యక్తిత్వం వికసిస్తుంది.

ఆ) ‘ఎగిసిపడె అల’ అని ఏది చెప్పబడింది?
జవాబు:
ఎగిసిపడె అలలాంటిది వయసు.

ఇ) వాల్మీకి కథానాయకుడు ఎవరు?
జవాబు:
వాల్మీకి కథానాయకుడు రాముడు.

ఈ) కృష్ణుడి అల్లరి చేష్టలను తెలుగువారి గుండెల్లో రాసినదెవరు?
జవాబు:
కృష్ణుడి అల్లరి చేష్టలను తెలుగువారి గుండెల్లో రాసినది పోతన.

2. హనుమంతుడు సాధించిన (సీతమ్మ జాడ తెలుసుకోవడం) అసాధారణ విజయానికి రాముడు పరమానంద భరితుడై అతణ్ణి ఇలా ప్రస్తుతించాడు. “గరుత్మంతుడు తప్ప వేరెవ్వరు నీవు చేసినట్లు చేయలేరు. యజమాని తనకు అప్పగించిన కర్తవ్యం కంటే ఎక్కువగా సాధించేవాడు. సేవకులందరిలో ఉత్తముడు. తాను మరింత చేయగల సమర్థుడై ఉండి కూడా యజమాని ఆదేశాల మేరకు మాత్రమే చేసి అంతకు మించి ప్రయత్నమే చేయనివాడు మధ్యస్థుడు. చివరగా సమర్థుడై ఉండి కూడా యజమాని ఆదేశాలను నిర్వర్తించనివాడు అధముల్లో అధముడైన సేవకుడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) హనుమంతుడు సాధించిన అసాధారణ విజయం ఏమిటి?
జవాబు:
‘సీతమ్మ జాడ తెలుసుకోవడం హనుమంతుడు సాధించిన అసాధారణ విజయం.

ఆ) హనుమంతునితో సమానమైనవారు ఎవరు?
జవాబు:
హనుమంతునితో సమానమైనవారు గరుత్మంతుడు.

ఇ) సేవకులలో ఉత్తముడు ఎవరు?
జవాబు:
యజమాని తనకు అప్పగించిన కర్తవ్యం కంటే ఎక్కువగా సాధించేవాడు సేవకులందరిలో ఉత్తముడు.

ఈ) యజమాని ఆదేశాలను నిర్వర్తించని వాడెవరు?
జవాబు:
యజమాని ఆదేశాలను నిర్వర్తించనివాడు అధముడైన సేవకుడు.

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

3. రచయితలకూ, కళాకారులకూ చాలాకాలం తమ రంగాలలో గణనీయమైన కృషి చేశాక, పేరు ప్రఖ్యాతులు వచ్చాక, వారికి బిరుదులు కాని, సత్కారాలు కాని, పురస్కారాలు కాని, ఎవరైనా ప్రదానం చేస్తే బాగుండును అనిపిస్తుంది. దీనినే కీర్తి కండూతి అని విమర్శిస్తుంటారు కొందరు.
ప్రశ్నలు – జవాబులు :
అ) బిరుదులు ఎవరు కోరుకుంటారు?
జవాబు:
రచయితలు, కళాకారులు బిరుదులను కోరుకుంటారు.

ఆ) బిరుదులు కావాలని ఎప్పుడు కోరుకుంటారు?
జవాబు:
చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాక బిరుదులు రావాలని కోరుకుంటారు.

ఇ) ఇటువంటిదాన్ని ఏమని విమర్శిస్తారు?
జవాబు:
దీనినే కీర్తి కండూతి అని విమర్శిస్తారు.

ఈ) పై పేరా దేని గురించి చెబుతోంది?
జవాబు:
పై పేరా రచయితలు, కవుల గురించి చెబుతోంది.

4. కింది గద్యాన్ని చదివి తప్పొప్పులను గుర్తించండి.

కరోనా వైరస్ చైనాలోని ఊహాన్ నగరంలో పుట్టి అన్ని ప్రాంతాలకు పాకుతోంది. ఇది శ్వాసవ్యవస్థపై పంజా విసిరి ప్రాణాలు హరిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. మంచినీరు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. ముఖానికి మాస్క్ ధరించాలి. దగ్గినా, తుమ్మినా కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి. తరచూ చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.

అ) కరోనా వైరస్ ఊహాన్ నగరంలో పుట్టింది. (తప్పు / ఒప్పు)
జవాబు:
ఒప్పు

ఆ) శ్వాసవ్యవస్థపై పంజా విసిరి ప్రాణాలు తీస్తుంది. (తప్పు / ఒప్పు)
జవాబు:
ఒప్పు

ఇ) మంచినీరు, పండ్లరసాలు తాగాలి. (తప్పు / ఒప్పు)
జవాబు:
ఒప్పు

ఈ) ముఖానికి మాస్క్ ధరించాలి. (తప్పు / ఒప్పు)
జవాబు:
ఒప్పు

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చండీదత్తుని పాత్ర స్వభావం వ్రాయండి.
జవాబు:
చండీదత్తుడు చక్కటి పరిపాలకుడు. తన రాజ్యంలో శాంతి భద్రతలు కాపాడడానికి కృషిచేసేవాడు. మాయా కంబళి సహాయంతో దొంగలను, మోసగాళ్ళను అరికట్టాడు. కొంచెం ఆవేశం ఎక్కువ. అందుకే ఆత్మానందుడు కంబళిని ఇమ్మంటే ఇవ్వలేదు. చంచలకు ఇచ్చాడు. మోసాన్ని గ్రహించాడు. దుర్మార్గులను శిక్షించాడు. తను స్వయంగా తెలుసుకోనిదే దేనిని నమ్మడు.

ప్రశ్న 2.
ఆత్మానందుడు కంబళిని ఎందుకు సృష్టించాడు?
జవాబు:
ఆత్మానందుడు ఒక వృద్ధ యోగి. చాలా మహిమలు కలవాడు. చుట్టుప్రక్కల నుండి వచ్చే భక్తులు ఎక్కువయ్యారు. వారి సమస్యలు చెప్పేవారు. పరిష్కారాలడిగేవారు. దీని వలన తపస్సు చేసుకునేందుకు కుదిరేది కాదు. ఎవరో ఒకరు రావడం వలన ఏకాగ్రత చెడిపోయేది. ముసలితనం వలన తొందరగా ముక్తిని సంపాదించుకోవాలనే ఆత్రుత ఉండేది. భక్తుల నుండి తప్పించుకొనేందుకు మంత్రజలం చల్లి మాయాకంబళి సృష్టించాడు. అది కప్పుకొని మాయమయ్యేవాడు.

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
రాజు దగ్గర కంబళి ఉండకూడదని ఆత్మానందుడు ఎందుకు అన్నాడు? వివరించండి.
జవాబు:
రాజుపైన దేశం ఆధారపడి ఉంటుంది. రాజ్యం కోసం ఎన్నెన్నో కుట్రలు జరుగుతుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రాజు ప్రాణాలకు ప్రమాదం తెచ్చేవారు చాలామంది ఉంటారు. మాయాకంబళి వలన అదృశ్యంగా రాజుపై దెబ్బతీసే అవకాశం ఉంది. ఆ కంబళి శత్రువులు, దురాశాపరుల చేతికి చిక్కితే రాజుకు చాలా ప్రమాదమని ఆత్మానందుడు ముందే గ్రహించాడు. స్నేహాన్ని నటిస్తూ శత్రుత్వం చూపించేవారికి ఆ మాయాకంబళి ,చిక్కితే రాజు ప్రాణాలకి ప్రమాదం అని ఆత్మానందుడు గ్రహించాడు. అందులోనూ రాజైన చండీదత్తుడు ఎవరిమాటా వినడు. తనకు నచ్చినదే చేస్తాడు. అది మరీ ప్రమాదం. అందుచేతనే కంబళిని ఇచ్చేయమన్నాడు. రాజు ఇవ్వలేదు. అయినా రాజును కాపాడడం తన ధర్మం కనుక రక్షాబంధం కట్టాడు. మాయాకంబళి వలన జరిగే అనర్థం తెలుసుకునే అవకాశం కల్పించాడు. కనువిప్పు కలిగిన రాజు కంబళిని తిరిగి ఇచ్చేశాడు.

ప్రశ్న 2.
మాయాకంబళి వలన రాజుకు కలిగిన ప్రమాదం ఏమిటి? ఎలా తప్పించుకున్నాడు?
జవాబు:
బిచ్చగాడి దగ్గర నుండి మాయాకంబళిని రాజు తీసుకున్నాడు. ఆ కంబళి మహిమతో రాజ్యంలో శాంతి భద్రతలు నెలకొల్పాడు.

ఒకరోజు చంచల నాట్యానికి ఆనందించాడు. ఏమి కావాలన్నాడు. మాయాకంబళి కావాలంది. ఇచ్చాడు. అది కప్పుకొని, కోశాధికారి విక్రముని వద్దకు వెళ్లింది. ఆత్మానందుడు కట్టిన రక్షాబంధనం వలన రాజు చంచల వెళ్లడాన్ని స్పష్టంగా చూశాడు. కాని, కారణం తెలియలేదు. రాత్రి విక్రముడు కంబళి కప్పుకొన్నాడు. అదృశ్య రూపంలో రాజుగారి శయన మందిరంలోకి కత్తితో వచ్చాడు. రాజు గమనించి, అతనిని చంపాడు. మాయాకంబళి వలన ప్రమాదం జరగబోయినా రక్షాబంధనంతో తప్పించుకున్నాడు.

II. భాషాంశాలు

పర్యాయపదాలు

పూర్వం = మునుపు, గతంలో
వృద్దుడు = ముసలివాడు, ముదుసలి
తరచుగా = ఎక్కువగా, పదేపదే
కంబళి = దుప్పటి, రగ్గు
శిల = రాయి, ఉపలము
హిమాలయ పర్వతం = మంచుకొండ, తుహినాద్రి
మహిమ = మహత్తు, మహాత్మ్యం
మాయ = మోసం, దగా
జలం = నీరు, ఉదకం
మార్గం = దారి, బాట
స్పృహ = స్పందన, చైతన్యం
వార్త = విషయం, సమాచారం
బిచ్చగాడు = ముష్టివాడు, యాచకుడు
కాలు = అంఫ్రి, చరణము
కర్ర = కాష్టము, బెత్తము
దొంగలు = చోరులు, తస్కరులు
రూఢీ = నిర్ధారణ, నిశ్చయం
మనిషి మానవుడు, నరుడు
పాపము = దోషము, దురితము
చేయి = హస్తము, కరము
శిక్ష = దండన, నిగ్రహము
జీవితం = బ్రతుకు, జీవనయాత్ర
కత్తి = ఖడ్గం, కరవాలం
మందిరం = గృహము, ఇల్లు
దిక్కు = దిశ, ఆశ
నిద్ర = కునుకు, నిదుర
భటుడు = భృత్యుడు, సేవకుడు
వ్యాపారి = వర్తకుడు, వ్యాపారస్తుడు
ధర = మూల్యం, వెల
దుస్తులు = వస్త్రాలు, వలువలు
ప్రమాదం = కష్టం, ఆపద
దేవాలయం = గుడి, కోవెల
రాత్రి = రేయి, రజని
ప్రాణం = ఉసురు, జీవము
రాజు = ప్రభువు, పరిపాలకుడు
శాంతి = ప్రశాంతి, శాంతము
కొండ = గిరి, పర్వతం
శయనాగారం = పడకగది, పడకటిల్లు
ముప్పు = ప్రమాదం, ఆపద
దుష్టులు = దుర్మార్గులు, చెడ్డవారు
భయం = అధైర్యం, పిఱికితనం
నవ్వు = హాసము, హసనము

వ్యతిరేకపదాలు

పూర్వం × అ పూర్వం
తెలిసి × తెలియక
రహస్యం × బట్టబయలు
సుఖం × దుఃఖం
దుష్టులు × శిష్టులు
చౌక × ప్రియం
అదృశ్యం × దృశ్యం
దొంగ × దొర
పాపం × పుణ్యం
భయం × నిర్భయం
భద్రత × అభద్రత
సహాయం × అసహాయం
బయట × లోపల
ఇష్టం × అయిష్టం, అనిష్టం
స్వార్థం × నిస్వార్థం
ఆనందం × విచారం
వచ్చి × రాక
ఇవతల × అవతల
మంచి × చెడు
పాతది × క్రొత్తది
కొను × అమ్ము
ప్రత్యక్షం × పరోక్షం
ప్రయత్నం × అప్రయత్నం
ఉత్తముడు × అధముడు
దురాశ × సదాశ
నీతి × అవినీతి
దగ్గర × దూరం
శాంతి × అశాంతి
చచ్చు × పుట్టు
నవ్వు × ఏడ్పు

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

ప్రకృతి – వికృతులు

హిమము – ఇగము
వృద్ధు – పెద్ద
యోగి – జోగి
మంత్రము – మంతరము
భిక్షము – బిచ్చము
దేవాలయము – దేవళము
ఆశ్చర్యము – అచ్చెరువు
మనుష్యుడు – మనిసి భుజము
రాత్రి – రాతిరి, రేయి
రాజు – రాయలు
విధము – వితము
ప్రాణము – పానము
సుఖము – సుగము, సుకము
ముఖము – మొగము, మోము
ఆజ్ఞ – ఆన
సహాయము – సాయము
ప్రజ – పజ
నాట్యం – నట్టువం

ఖాళీలు : క్రింది ఖాళీలను సరైన వ్యతిరేక పదాలతో పూరించండి.

1. ఆనందంగా ఉండాలి కాని ………….. గా ఉండకూడదు. (విచారం)
2. అందరూ సుఖం కోరతారు కాని …………. కోరుకోరు. (దుఃఖం)
3. ఏదైనా ప్రత్యక్షంగా మాట్లాడాలి ……………. లో మాట్లాడకూడదు. (పరోక్షం)
4. పాపం చేయకూడదు …………. చేయాలి. (పుణ్యం)
5. స్వార్థం పనికిరాదు. …………….. గా జీవించాలి. (నిస్స్వార్థం)
6. దేనికీ భయం వద్దు ……………. గా జీవించాలి. (నిర్భయం)
7. ప్రయత్నం చేస్తే వస్తుంది …………. గా ఏదీ రాదు. (అప్రయత్నం)
8. నీతిగా బ్రతకాలి …………….. గా కాదు. (అవినీతి)
9. నవ్వుతూ ఉండాలి …………… పనికిరాదు. (ఏడ్పు)
10. సుఖం అంటే ఇష్టం కాని కష్టమంటే ……….. (అనిష్టం)

కర్త : ఈ క్రింది వానిలో కర్తను గుర్తించి వ్రాయండి.

1. రాముడు వానిని చంపెను.
జవాబు:
రాముడు

2. నేను సినిమాను చూశాను.
జవాబు:
నేను

3. లంకకు వారధిని వానరులు కట్టారు?
జవాబు:
వానరులు

4. చల్లగా గాలి వీచెను.
జవాబు:
గాలీ

5. రక్షకభటులు దొంగలను పట్టుకొన్నారు.
జవాబు:
రక్షక భటులు

6. దేశమును సైనికులు రక్షిస్తున్నారు.
జవాబు:
సైనికులు

7. మాయాకంబళి మహిమ కలది.
జవాబు:
మాయాకంబళి

8. ధర్మాత్ములు ఇతరులను తమవారను కొంటారు.
జవాబు:
ధర్మాత్ములు

9. కాలము అతిక్రమించరానిది
జవాబు:
కాలము

10. కృష్ణుడు వెన్నను తినెను.
జవాబు:
కృష్ణుడు

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

సంధులు: ఈ క్రింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.

1. ఆత్మానందుడనే = ఆత్మానందుడు + అనే – ఉత్వసంధి
2. వాడని = వాడు + అని – ఉత్వసంధి
3. ఎవరైనా = ఎవరు + ఐనా – ఉత్వసంధి
4. వచ్చని = వచ్చు + అని – ఉత్వసంధి
5. తనకెక్కడా = తనకు + ఎక్కడా – ఉత్వసంధి
6. లేదను = లేదు + అను – ఉత్వసంధి
7. తహతహలాడు = తహతహలు + ఆడు – ఉత్వసంధి
8. రాదని = రాదు + అని – ఉత్వసంధి
9. ప్రత్యక్షమయ్యాడు = ప్రత్యక్షము + అయ్యాడు – ఉత్వసంధి
10. తనకియ్యుమని = తనకు + ఇయ్యుము + అని – ఉత్వసంధి

ఈ క్రింది ఉత్వసంధి పదాలను కలిపి రాయండి.

1. ఉండటము + ఏ = ఉండటమే
2. అవకాశాలు + ఉన్నాయి = అవకాశాలున్నాయి
3. ఎందుకు + ఐనా = ఎందుకైనా
4. చకితుడు + ఐనాడు = చకితుడైనాడు
5. వస్తున్నాడు + అని = వస్తున్నాడని
6. భరితుడు + ఐ = భరితుడై
7. లేడు + అని = లేడని
8. ఆత్మానందుడు + ఉన్న = ఆత్మానందుడున్న
9. ప్రమాదము + ఓ = ప్రమాదమో
10. ఎవరు + ఐనా = ఎవరైనా

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

ఈ క్రింది పేరాలోని భాషాభాగాలను గుర్తించి వ్రాయండి.

దశరథుని పెద్ద కొడుకు శ్రీరాముడు. అతను చాలా మంచివాడు. సీతను పెళ్లి చేసుకొన్నాడు. శివ ధనుస్సు, విరిచి ఔరా అనిపించి, పెళ్లి చేసుకొన్నాడు. అబ్బ ! ఎంత చక్కని జంట అని దేవతలు కొనియాడారు.

1. నామవాచకం : దశరథుడు, కొడుకు, శ్రీరాముడు, సీత, శివధనుస్సు, పెళ్లి, జంట, దేవతలు
2. సర్వనామం : అతను, వాడు
3. విశేషణం : పెద్ద, చాలా, మంచి, చక్కని
4. క్రియ : చేసుకొన్నాడు, విరిచి, అనిపించి, అని, కొనియాడారు
5. అవ్యయం : అబ్బ, ఔరా

IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. భాషాంశాలు

అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

1. హిమాలయపర్వతం చల్లగా ఉంటుంది.
a) మంచుకొండ
b) కొండ
c) గిరి
d) అది
జవాబు:
a) మంచుకొండ

2. ఏకాగ్రతతో చేస్తే ఏ పనినైనా సాధించవచ్చు.
a) అదేపనిగా
b) పదేపదే
c) అవధానం
d) తరచుగా
జవాబు:
c) అవధానం

3. ఏ వస్తువుకైనా ఒక ధర ఉంటుంది.
a) మూలం
b) మూల్యం
c) భద్రత
d) చోటు
జవాబు:
b) మూల్యం

4. మంచి వార్త పదిమందికీ చెప్పాలి.
a) పేపరు
b) పత్రిక
c) కథ
d) విషయం
జవాబు:
d) విషయం

5. ప్రమాదం వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కోవాలి.
a) ధనం
b) ఆపద
c) పాము
d) దొంగతనం
జవాబు:
b) ఆపద

6. కనీసం వారానికి ఒకసారైనా దేవాలయమునకు వెళ్లాలి.
a) గుడి
b) మందిరం
c) గోపురం
d) పుణ్యక్షేత్రం
జవాబు:
a) గుడి

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

7. ఒక విషయాన్ని రూఢి చేసుకోనిదే నలుగురికీ చెప్పకూడదు.
a) నిజం
b) సత్యం
c) యధార్థం
d) నిర్ధారణ
జవాబు:
d) నిర్ధారణ

8. దేవుని మహత్తును మనం కనిపెట్టలేము.
a) గొప్పతనం
b) ఆధిక్యం
c) మహిమ
d) పనితనం
జవాబు:
c) మహిమ

9. రాజు చేతిలో కత్తి ఉంటుంది.
a) కరవాలం
b) గద
c) విల్లు
d) బాణం
జవాబు:
a) కరవాలం

10. రానురాను మనిషి స్వార్థపరుడై పోతున్నాడు.
a) డబ్బు
b) నరుడు
c) డబ్బు-ఆమె
d) స్త్రీ
జవాబు:
b) నరుడు

పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

11. వృద్ధుడు గౌరవింపతగినవాడు.
a) ముదుసలి, ముసలివాడు
b) తాత, తాతయ్య
c) తండ్రి తండ్రి, తల్లి తండ్రి
d) బోసినోరు, ముడత మొకం
జవాబు:
a) ముదుసలి, ముసలివాడు

12. అనవసరంగా జలం వృథా చేయకూడదు.
a) డబ్బు, ధనం
b) బంగారం, పసిడి
c) పదవి, అధికారం
d) నీరు, ఉదకం
జవాబు:
d) నీరు, ఉదకం

13. ఎవరి ప్రాణం వారికి తీపి.
a) శరీరం, కాయం
b) మనసు, ఆత్మ
c) ఉసురు, జీవము
d) జీవితం, గాలి
జవాబు:
c) ఉసురు, జీవము

14. చేయి కలిపితే కరోనా వస్తోంది.
a) హస్తం, కరము
b) ముక్కు నాసిక
c) ముఖం, వదనం
d) తుమ్ము, గాలి
జవాబు:
a) హస్తం, కరము

15. మంచు కొండ చల్లగా ఉంటుంది.
a) చల్లని, శీతలం
b) గిరి, పర్వతం
c) రాయి, బండ
d) రాళ్లు, మెట్టలు
జవాబు:
b) గిరి, పర్వతం

16. పాపము చేయకూడదు.
a) దురితము, దోషము
b) తప్పు, నింద
c) కినుక, కోపం
d) తప్పు, దుర్మార్గం
జవాబు:
a) దురితము, దోషము

17. సాధారణంగా వ్యాపారి తనలాభం చూసుకొంటాడు.
a) ధనవంతుడు, ధనికుడు
b) అధికారి, గొప్పవాడు
c) రాజు, ప్రభువు
d) వర్తకుడు, వ్యాపారస్తుడు
జవాబు:
d) వర్తకుడు, వ్యాపారస్తుడు

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

18. కత్తితో చెలగాటం ఆడకూడదు.
a) నిప్పు, అగ్ని
b) ఖడ్గం, కరవాలం
c) వరద, గోదావరి
d) ప్రాణం, గాలి
జవాబు:
b) ఖడ్గం, కరవాలం

19. ఎవ్వరినీ మాయ చేయకూడదు.
a) మంత్రం, ఆగమం
b) మ్రొక్కు వేడు
c) దగా, మోసం
d) ప్రార్థన, యాచన
జవాబు:
c) దగా, మోసం

20. ధరకు ధర పెరిగిపోతుంది.
a) వెల, మూల్యం
b) విలువ, గొప్ప
c) గౌరవం, ఖ్యాతి
d) కీర్తి, యశస్సు
జవాబు:
a) వెల, మూల్యం

ప్రకృతి-వికృతులు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.

21. హిమము చల్లగా ఉంటుంది.
a) ఇమము
b) ఇగము
c) ఇంకు
d) హిమ
జవాబు:
b) ఇగము

22. పెద్ద వారిని గౌరవించాలి.
a) పెద్ద
b) ముసలి
c) ముదుసలి
d) వృద్ధు
జవాబు:
d) వృద్ధు

23. ఏ విధముగానైనా మంచిచేయాలి.
a) విధి
b) విధం
c) వితము
d) వితానము
జవాబు:
c) వితము

24. ఎప్పుడూ మొగము పై చిరునవ్వు ఉండాలి.
a) ముఖము
b) మొహము
c) మోహము
d) మోఖము
జవాబు:
a) ముఖము

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

25. ప్రభుత్వ ఆజ్ఞ పాటించాలి.
a) అన్న
b) ఆజ్ఞప్తి
c) ఆనతి
d) ఆన
జవాబు:
d) ఆన

26. ప్రజలందరూ క్షేమంగా ఉండాలి.
a) పజ
b) పజ్జి
c) పెజ
d) పిజ్జ
జవాబు:
a) పజ

27. జబ్బ సలుపుతోంది.
a) బుజము
b) భుజము
c) రెక్క
d) చేయి
జవాబు:
b) భుజము

28. ఆమె నాట్యం బాగా చేసింది.
a) నటన
b) నాటకం
c) నట్టువం
d) నృత్యం
జవాబు:
c) నట్టువం

29. జోగి మాయాకంబళిని సృష్టించాడు.
a) ఆత్మానందుడు
b) యోగము
c) వృద్ధుడు
d) యోగి
జవాబు:
d) యోగి

30. అచ్చెరువున విచ్చిన కలువలు చూశారు.
a) ఆశ్చర్యము
b) ఆ చెరువు
c) చెరువులో
d) కొలను
జవాబు:
a) ఆశ్చర్యము

2. వ్యాకరణాంశాలు

కర్త : ఈ క్రింది వానిలో కర్తను గుర్తించి వ్రాయండి.

31. రామాయణమును వాల్మీకి రచించెను.
a) రామాయణం
b) ను
c) వాల్మీకి
d) రచించెను
జవాబు:
c) వాల్మీకి

32. మాధురి పుస్తకంలో పద్యం చదివింది.
a) మాధురి
b) పుస్తకం
c) పద్యం
d) చదివింది
జవాబు:
a) మాధురి

33. బడిలో పనులను రామయ్య చేశాడు.
a) బడి
b) పనులు
c) చేశాడు
d) రామయ్య
జవాబు:
d) రామయ్య

34. తెల్లటి పాలను ఇచ్చింది .ఆవు.
a) తెల్లటి
b) పాలు
c) ఇచ్చింది
d) ఆవు
జవాబు:
d) ఆవు

35. సీతారాములు అడవికి వెళ్లారు?
a) సీత
b) రాముడు
c) సీతారాములు
d) అడవి
జవాబు:
c) సీతారాములు

36. వేదవ్యాస మహర్షి 18 పురాణాలు రచించెను.
a) వేదవ్యాస మహర్షి
b) వేద వ్యాసుడు
c) పురాణాలు
d) మహర్షి
జవాబు:
a) వేదవ్యాస మహర్షి

37. ఆవు అందంగా, తెల్లగా, ఆరోగ్యంగా ఉంది.
a) అందం
b) తెలుపు
c) ఆవు
d) ఆరోగ్యం
జవాబు:
c) ఆవు

38. రాముడు రావణుని సీత కొరకు చంపెను.
a) రాముడు
b) రావణుడు
c) సీత
d) చంపెను
జవాబు:
a) రాముడు

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

39. చల్లగా వీచెను గాలి అన్నాడు.
a) చల్లగా
b) వీచెను
c) గాలి
d) అన్నాడు
జవాబు:
c) గాలి

40. ధర్మరాజుకు భీష్ముడు నీతులు చెప్పెను.
a) ధర్మరాజు
b) భీష్ముడు
c) నీతులు
d) చెప్పెను
జవాబు:
b) భీష్ముడు

ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలను కోరిన విధంగా వ్రాయండి.

41. రాజు చాలా తెలివైనవాడు – భాషాభాగం గుర్తించండి.
a) నామవాచకం
b) సర్వనామం
c) క్రియ
d) విశేషణం
జవాబు:
a) నామవాచకం

42. కంబళి చాలా మహిమ గలది.
a) నామవాచకం
b) క్రియ
c) అవ్యయం
d) విశేషణం
జవాబు:
d) విశేషణం

43. యోగి మహిమలు జనం చూస్తారు.
a) సర్వనామం
b) క్రియ
c) విశేషణం
d) అవ్యయం
జవాబు:
b) క్రియ

44. అబ్బబ్బ! ఈ జనంతో పడలేకపోతున్నాను.
a) కర్త
b) క్రియ
c) అవ్యయం
d) విశేషణం
జవాబు:
c) అవ్యయం

45. కిందివానిలో సర్వనామం గుర్తించండి.
a) రాముడు
b) అది
c) అందం
d) అయ్యో
జవాబు:
b) అది

46. క్రిందివానిలో విశేషణం గుర్తించండి.
a) తెల్లటి
b) ఆవు
c) పాలు
d) ఇచ్చింది
జవాబు:
a) తెల్లటి

47. క్రిందివానిలో అవ్యయం గుర్తించండి.
a) అయ్యో
b) అయ్య
c) ఆమె
d) ఎందుకు
జవాబు:
a) అయ్యో

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

48. క్రిందివానిలో క్రియను గుర్తించండి.
a) అందం
b) మందం
c) మందిరం
d) చూశాను
జవాబు:
d) చూశాను

49. క్రిందివానిలో నామవాచకం గుర్తించండి.
a) రాముడు
b) అది
c) అక్కట
d) వచ్చాడు
జవాబు:
a) రాముడు

50. కృష్ణుడు తెలివిగా వెన్నను దొంగిలించెను. – దీనిలో కర్తను గుర్తించండి.
a) తెలివి
b) వెన్న
c) కృష్ణుడు
d) దొంగిలించెను
జవాబు:
c) కృష్ణుడు

సంధులు: ఈ క్రింది వాటిని కోరిన విధంగా వ్రాయండి.

51. కలవాడని – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) కలవాడ + అని
b) కలవాడె + అని
c) కలవాడు + అని
d) కలవాడా + అని
జవాబు:
c) కలవాడు + అని

52. ఎవరు + ఐనా – సంధి కలిపిన రూపం గుర్తించండి.
a) ఎవరైనా
b) ఎవరేనా
c) ఎవరున్నా
d) ఎవరుయైనా
జవాబు:
a) ఎవరైనా

53. నగరమంతా – దీని సంధి పేరు వ్రాయండి.
a) అత్వసంధి
b) ఉత్వసంధి
c) ఇత్వసంధి
d) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
b) ఉత్వసంధి

54. కిందివానిలో ఉత్వసంధి పదం గుర్తించండి.
a) రాజేంద్రుడు
b) రాజాధిరాజు
c) రాజోద్యోగి
d) రాజైన
జవాబు:
d) రాజైన

55. క్రిందివానిలో ‘తహతహలాడు’ విడదీసిన రూపం గుర్తించండి.
a) తహతహలు + ఆడు
b) తహ + తహలాడు
c) తహతహలన్ + ఆడు
d) తహతహలున్ + ఆడు
జవాబు:
a) తహతహలు + ఆడు

56. తనకు + ఇయ్యమని – సంధి కలిసిన రూపం గుర్తించండి,
a) తనకుయ్యమని
b) తనకునియ్యమని
c) తనకియ్యమని
d) తనకుయియ్యమని
జవాబు:
c) తనకియ్యమని

57. క్రిందివానిలో ఉత్వసంధి పదం గుర్తించండి.
a) ఉందని
b) అక్కడున్న
c) ఆహాహా
d) ఊరొకటి
జవాబు:
d) ఊరొకటి

58. రాజాజ్ఞను ఎవరైనా పాటించాలని చెప్పాలి – వీనిలో ఉత్వసంధి పదం గుర్తించండి.
a) రాజాజ్ఞ
b) ఎవరైనా
c) పాటించాలని
d) చెప్పాలి
జవాబు:
b) ఎవరైనా

59. ఆత్మానందుడు భక్తుల నుండి తప్పించుకోవాలని మాటాలాడాడు – దీనిలో ఉత్వసంధి పదం గుర్తించండి.
a) ఆత్మానందుడు
b) భక్తుల నుండి
c) తప్పించుకోవాలని
d) మాటలాడాడు
జవాబు:
d) మాటలాడాడు

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

60. క్రిందివానిలో ఉత్వసంధి పదం గుర్తించండి.
a) ఊరూరు
b) గురూత్తముడు
c) భానూదయం
d) పేరేది
జవాబు:
d) పేరేది

నేనివి చేయగలనా?

1. పాఠంలోని కథను సొంత మాటల్లో చెప్పగలను. [ ఔను / కాదు ]
2. పాఠంలోని కథను నేను సొంతంగా చదవగలను. రాయగలను. [ ఔను / కాదు ]
3. పాఠంలోని పదాలను సొంత వాక్యాలలో ఉపయోగించగలను. [ ఔను / కాదు ]
4. కథను ఊహించి రాయగలను. [ ఔను / కాదు ]

చదవండి – ఆనందించండి

మనిషి

యూనాను (గ్రీకు) దేశంలో జాంథస్ అనే పేరుగల ఒక ధనవంతుడు ఉండేవాడు.

ఈసప్ అనేవాడు అతనికి బానిసగా ఉండేవాడు. ఈసప్ తెలివితేటలు గలవాడు. జాంథస్ ఈసపన్ను ఒకనాడు ఇట్లా ఆదేశించాడు. – ‘పోయి చూచిరా, నీటి తొట్టి (బాత్ టబ్) వద్ద ఎందరు మనుషులు ఉన్నారు? అక్కడకు వెళ్ళి నేను స్నానం చేసి రావాలి.’ తిరిగివచ్చి అతడు యజమానితో చెప్పాడు – ‘అయ్యా నీటి తొట్టివద్ద ఒకే ఒక మనిషి ఉన్నాడు, జాంథస్ ఈసపను వెంట పెట్టుకొని స్నానాలగది దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అక్కడ అడుగుతీసి అడుగు పెట్టటానికి కూడా చోటులేదు. ఆయనకు కోపం వచ్చింది. ఏమిరా అబద్ధం చెప్పావు. సిగ్గులేదా? వ్యర్ధుడా! నీవు ఏమని చెప్పావు? స్నానాలతొట్టి దగ్గర ఒకే ఒక మనిషి ఉన్నాడన్నావు. మరి ఈ గుంపు ఎక్కడ నుండి వచ్చింది?

ఈసప్ వినయపూర్వకంగా ఇలా జవాబు చెప్పాడు. అయ్యా! నేను సరిగా ఉన్న విషయమే చెప్పాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు త్రోవలో ఒక పెద్దరాయి పడివుంది. వచ్చేపోయేవాళ్ళకు అది తగులుతోంది. అది తగిలి వారు క్రిందపడుతున్నారు. దానిని తొలగిద్దామన్న ఆలోచన ఏ ఒక్కరికీ కలుగలేదు. కొంచెం సేపటి తరువాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడు తన శక్తి అంతా ఉపయోగించి త్రోవలో నుండి దానిని తొలగించాడు. స్నానాలగది వద్దకు వెళ్ళాను. అక్కడ ఒక నిరుపేద బిచ్చగత్తె నిలుచుని వుండగా చూశాను. ఆమె చాలా సేపటి నుండి అక్కడే నిలుచొని వుంది. స్నానం చేస్తున్నవారిని ఆమె నీరు అడిగింది. కాని ఏ ఒక్కరు ఆమెవైపు చూడలేదు. త్రోవలో రాయి తొలగించిన వ్యక్తే బిచ్చగత్తెకు మంచినీళ్ళు ఇచ్చాడు.

అయ్యా ! ఇప్పుడు మీరే చెప్పండి. స్వార్థపరులు, తమకోసం తాము జీవించేవాళ్ళు ఇతరుల కష్టాన్ని తొలగించనివారు వీరు మనుషులుగా పిలవబడటానికి యోగ్యులా ?? నాకు మాత్రం అక్కడ ఆ ఒకే ఒక వ్యక్తి కనిపించాడు. అతనిలో మానవత్వం వుంది. అందుకే నేను చెప్పాను. అక్కడ ఒకే ఒక మనిషి ఉన్నాడు, అని. జాంథస్ కు ఇదంతా వినేసరికి ఎంతో సంతోషం వేసింది.

“నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి. నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి”

“జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ”
జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి.

AP Board 7th Class Telugu Solutions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు

SCERT AP Board 7th Class Telugu Guide Answers 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 12th Lesson Questions and Answers స్ఫూర్తి ప్రదాతలు

7th Class Telugu 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers

ప్రశ్నలు – జవాబులు

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
స్కౌట్స్ లో విశేష సేవలందించిన విద్యార్థులకు ఏయే అవార్డులు ఇస్తారు?
జవాబు:
ప్రాథమిక స్థాయి నుండి కళాశాల స్థాయి వరకూ చదివే పిల్లలకు స్కౌట్స్ గైడ్స్ సంస్థ శిక్షణ నిస్తుంది. ఇందులో కార్యక్రమాలలో పాల్గొని విశేష సేవలందించిన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో రాజ్య పురస్కార్, దేశ స్థాయిలో రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేస్తారు.

ప్రశ్న 2.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలు ఎందుకు పిలువబడ్డారు?
జవాబు:
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ మొదలైన 16 భాషలలో 40 వేల పాటలను బాలు పాడారు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రఖ్యాతి గడించారు. అంతేకాదు ఏ నటుడికి పాడితే అతని గొంతును అనుకరించి పాడేవారు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమ న్యాయ నిర్ణేతగా, వ్యాఖ్యాతగా ఎందరో వర్ధమాన గాయకులను తయారుచేశారు. అందుచేతనే బాలును బహుముఖ ప్రజ్ఞాశాలిగా పిలుస్తారు.

AP Board 7th Class Telugu Solutions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 3.
కవిశేఖర ఉమర్ ఆలీషా తెలుగు సాహిత్యా నికి ఎలాంటి కృషి చేశారు?
జవాబు:
తెలుగుభాషపై మమకారంతో 16వ ఏటనే ‘విద్యావిలాసం’ అనే శతకం రచించారు. 18వ ఏట మణిమాల నాటకం వ్రాశారు. అనసూయ, కళ, విషాద సౌందర్యం, దానవ వధ, చంద్రగుప్త, మహాభారత కౌరవ రంగం, విచిత్ర బిల్హణీయం అనే నాటికలు, తారామతి, శాంత, పద్మావతి మొదలైన నవలలు వ్రాశారు. ‘జల్లుర్భా’ అనే యునానీ వైద్యగ్రంథం రచించారు. స్త్రీ, సామాజిక సమస్యలు ప్రస్తావించి, పరిష్కారాలు చూపారు. దాదాపు 50 పుస్తకాలు రచించి తెలుగు సాహిత్యానికి సేవ చేశారు.

ప్రశ్న 4.
కోడి రామమూర్తిని కలియుగ భీముడని ఎందుకంటారు?
జవాబు:
స్పెయిన్లో జరిగిన ఎడ్లపోటీలో ఎద్దును గాలిలోకి లేపి గిరగిరా త్రిప్పి విసిరేశాడు కోడి రామ్మూర్తి. కాలికి ఇనుప గొలుసులతో కారును కడితే, కారును అంగుళం కదలనీయకుండా ఆపిన మహాబలవంతుడు. ఊపిరి .బిగపట్టి ఒళ్లంతా గొలుసులు కట్టించుకొని ఊపిరి వదిలితే అవన్నీ పటపటా తెగిపోయేవి. రొమ్ముపై బండరాళ్లు పెట్టించుకొని వాటిని పగలకొట్టించుకొనేవాడు. అందుచేతనే కోడి రామ్మూర్తిని కలియుగ భీముడనేవారు.

AP Board 7th Class Telugu Solutions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాడిచర్లవారు అనుభవించిన జైలు జీవితం ఎటువంటిది?
జవాబు:
ఆంధ్ర తిలక్ గా ప్రసిద్ధులైన గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారు వెల్లూరు సెంట్రల్ జైల్ జీవితం చాలా దారుణంగా అనుభవించారు.

ఆకట్టుకోవడానికి రెండు గోచీలు, మూర పొడవు ఉన్న రెండు తువ్వాళ్లు ఇచ్చారు. పడుకోవడానికి చిన్న ఈత చాప, తినడానికి మట్టి మూకుడు, తాగడానికి మట్టిముంత, మల, మూత్ర విసర్జనకు మరో మట్టి చట్టి ఇచ్చారు. కాలికి లావుపాటి కడియాలు వేశారు. మెడకు మరో కడియం వేశారు. కొయ్యముక్కను వాటిలో దూర్చారు. తలబోడి చేయించారు. తినడానికి రాగి సంకటి ముద్ద పెట్టారు. దానిలో రాళ్లు, పుల్లలు, పురుగులు ఉండేవి. ఇలాంటి కఠిన కారాగార జీవితాన్ని ఆయన 3 సంవత్సరాలు అనుభవించారు.

ప్రశ్న 2.
అన్నారుల పాలిట .అపర అన్నపూర్ణగా డొక్కా సీతమ్మను ఎందుకు పిలుస్తారు?
జవాబు:
డొక్కా సీతమ్మగారు .నిరంతరం అన్నదానం చేసేది. ఒకసారి ఆమె అంతర్వేది వెళుతుంటే ఒక పెళ్లి బృందం కనిపించింది. వారు ఆకలితో మాట్లాడుకొనే మాటలను వింది. వారు డొక్కా సీతమ్మగారింటికి వెడితే అన్నం పెడతారు. చంటి పిల్లలకు పాలిస్తారు. అప్పటిదాకా ఓర్చుకోండి. అని ఒక పెద్దావిడ చెప్పడం వింది. వెంటనే తన – ప్రయాణం విరమించుకొంది. డొక్కా సీతమ్మగారు వారి కంటే ముందుగా, తన ఇంటికి వెళ్లింది. చక్కగా వంట చేసింది. వాళ్లు రాగానే తృప్తిగా భోజనాలు పెట్టింది. ఒకసారి ఒక తహసీల్దారుకు గరిక వేళ్లతో పచ్చడి చేసి భోజనం పెట్టింది.

ఈ విధంగా అన్నార్తుల పాలిట అపర అన్నపూర్ణగా డొక్కా సీతమ్మగారు ప్రసిద్ధి పొందింది.

AP Board 7th Class Telugu Solutions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 3.
స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులు చేసే సేవా కార్యక్రమాల గురించి వ్రాయండి.
జవాబు:
స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు.

ముసలివారిని రోడ్లు దాటిస్తారు. మూగజీవుల దాహార్తిని తీర్చి, సేవలు చేస్తారు. మొక్కలను నాటుతారు. రోజూ నీళ్లు పోస్తారు. అనారోగ్యంగా ఉన్నవారికి సహాయం చేస్తారు. జాతరలలో క్యూలను ఏర్పాటు చేస్తారు. నిరక్షరాస్యులకు చదువు చెబుతారు. దేవాలయాల వద్ద, ఉత్సవాలలో, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినపుడు, ఆపదలో, అవసరంలో ఉన్న వారికి స్వచ్ఛందంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అవసరమైన సేవలు చేస్తారు.

AP Board 7th Class Telugu Solutions 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ

SCERT AP Board 7th Class Telugu Guide Answers 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 11th Lesson Questions and Answers బాలచంద్రుని ప్రతిజ్ఞ

7th Class Telugu 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 7th Class Telugu Solutions 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ 1

ప్రశ్న 1.
చిత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
చిత్రంలో ఇద్దరు వీరులు ఉన్నారు. ఇద్దరూ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నవారే.

ప్రశ్న 2.
చిత్రంలో ఉన్న మహనీయుల గొప్పతనం గురించి చర్చించండి.
జవాబు:
భగత్ సింగ్ :
భగత్ సింగ్ 1907 సెప్టెంబరు 28వ తేదీన ఫైసలాబాద్ జిల్లా పంజాబులో జన్మించాడు. నవ జవాన్ భారతసభ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ కీర్తి కిసాన్ పార్టీని నడిపాడు. ఆయన తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతీ దంపతులు. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు. భారత బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమానహక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజులు నిరాహారదీక్షను చేపట్టాడు. లాలాలజపతిరాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు భగత్ సింగ్ ను 1931 మార్చి 23వ తేదీన లాపూర్ లో ఉరితీసారు. అప్పటికి ఆయన వయస్సు 23 సంవత్సరాలు.

అల్లూరి సీతారామరాజు :
అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విజయనగరం దగ్గరలోని పాండ్రంగిలో జన్మించాడు. సీతారామరాజు స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లాలోని మోగల్లు. సీతారామరాజు తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ, వెంకట రామరాజు. ఆరవ తరగతిలోనే తన తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి కుటుంబం పేదరికంతో చాలా బాధలు పడ్డారు. సీతారామరాజు చించినాడలో గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. రాజమండ్రిలో 6వ తరగతి, రామచంద్రపురంలో 7వ తరగతి, కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో 3rd ఫారమ్ చదివాడు. 1918 వరకు తునిలోనే ఉన్నారు.

ఆ కాలంలో చుట్టుపక్కల కొండలు అడవుల్లో తిరుగుతూ గిరిజనుల జీవనవిధానం గమనించాడు. తెల్లదొరల దోపిడీని అరికట్టడానికి గిరిజనులను ఏకం చేసి గెరిల్లా యుద్ధ పద్దతులను నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేసాడు. మన్యంలో విప్లవాన్ని సృష్టించి బ్రిటిష్ వారికి కంటిపై కునుకు లేకుండా చేసాడు. 1924 మే 27న కొయ్యూరు గ్రామ సమీపంలో సీతారామరాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరుపరచారు. బంధీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు కట్టేసి ఏ విచారణ , లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. అప్పటికి సీతారామరాజు వయసు 26 ఏళ్ళు.

AP Board 7th Class Telugu Solutions 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ

ప్రశ్న 3.
మీకు తెలిసిన యోధుల గురించి మాట్లాడండి.
జవాబు:
నేతాజీ సుభాష్ చంద్రబోస్ :
ఈయన 1897 జనవరి 23వ తేదీన కటక్ లో జన్మించాడు. భారత జాతీయ ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు. ఆయన తల్లిదండ్రులు జానకీనాథబోస్, ప్రభావతీ దేవి. 11 సార్లు స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయులచే కారాగారంలో నిర్భందించబడ్డాడు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరుతోట కూలీలు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసాడు. బ్రిటిష్ వారితో యుద్ధాన్ని జర్మనీ, జపాన్ల సాయంతో సాగించాడు. 1945 ఆగష్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడంటారు. కానీ ప్రమాదం నుండి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.

ఝాన్సీ లక్ష్మీబాయి :
ఝాన్సీ లక్ష్మీబాయి 1828 నవంబరు 19న మహారాష్ట్రలో సతారలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి. వీరిది . సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె చిన్నప్పటి పేరు మణికర్ణిక. ముద్దుగా ‘మను’ అని పిలిచేవారు. ఆమె 4వ ఏటనే తల్లి మరణించింది. చిన్నతనంలోనే గుర్రపు స్వారీ, కత్తియుద్ధం నేర్చుకొంది.

ఆమెను 13వ ఏట ఝాన్సీ రాజు గంగాధరరావు ఆమెను పెండ్లాడాడు. గంగాధరరావు మరణానంతరం ఝాన్సీని బ్రిటిషువారు కైవసం చేసుకోవాలనుకొన్నారు. కాని లక్ష్మీబాయి అంగీకరించలేదు. తిరుగుబాటు చేసింది. బ్రిటిషువారికి కంటిమీద కునుకు లేకుండా గెరిల్లా పోరాటాలు చేసింది. చివరకు బ్రిటిషువారి దుర్మార్గానికి 1858 జూన్ 18న గ్వాలియర్లో మరణించింది. ఆమె తండ్రిని బ్రిటిషువారు ఉరితీశారు. ఆమె వారసుడిగా దామోదర్ రావుని ప్రకటించారు.

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

అవగాహన-ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలోని ద్విపద పాదాలను రాగయుక్తంగా పాడండి.
జవాబు:
ఉపాధ్యాయుని అనుసరించి, స్పష్టంగా, భావయుక్తంగా, స్వల్ప రాగయుక్తంగా పాడండి.

ప్రశ్న 2.
బాలచంద్రుడు ఎవరితో ఏమన్నాడో చెప్పండి.
జవాబు:
బాలచంద్రుడు తల్లితో పలికెను. తను యుద్ధరంగంలో చెలరేగి నలగాముని సైన్యాన్ని నాశనం చేస్తానన్నాడు.

ప్రశ్న 3.
బాలచంద్రునికి తల్లి ఏమని చెప్పిందో ఊహించి చెప్పండి.
జవాబు:
బాలచంద్రుడు చాలా చిన్నవాడనీ, యుద్ధరంగంలో తట్టుకోలేడని భావించి ఉంటుంది. కాని బాలచంద్రుని మాటలు విన్నాక అతని పౌరుషాన్ని గ్రహించింది. ఒక వీరమాతగా కొడుకును యుద్ధానికి వెళ్లమని ప్రేరేపించి ఉంటుంది. వీరుడిగా విజయం సాధించి తిరిగి రమ్మని రక్తతిలకం దిద్ది ఆశీర్వదించి, యుద్ధరంగానికి పంపి ఉంటుంది.

AP Board 7th Class Telugu Solutions 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ

ప్రశ్న 4.
కింది గీతాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
పల్లవి: విశ్వభారత వీర లేవోయీ
– ప్రగతి పథముల వెంట పదవోయీ

చ : స్వాతంత్ర్య వీరుండు రాణా ప్రతాపుండు
నీ జాతి వాడురా ప్రళయాగ్ని వీవురా
వీరాభిమన్యుండు పలనాటిబాలుండు
నీ సహోదరులురా లయ ఝంఝ వీవురా ||వి||

చ : ధీర ఝాన్సీరాణి నీ వీరమాతరా
కాకతీ రుద్రమ్మ నీ సోదరేనురా
మగువ మాంచాల నీ బంగారు వదినరా
వీరవంశము నీది వీర రక్తమ్మురా ||వి||

చ: పదునాల్గు భువనాల నిన్నడు మొనగాడు
లేడురా జగదేక వీరుడవు నీవెరా
శివ సముద్రమ్మువై బడబాగ్ని జ్వాలవై
లంఘించి వెలుగరా లోకాలనేలరా ||వి||

ప్రశ్నలు :
అ) గేయంలో స్వతంత్ర వీరుడెవరు?
జవాబు:
గేయంలో రాణా ప్రతాపుడు స్వతంత్ర వీరుడు.

ఆ) కవి వీరాభిమన్యునితో ఎవరిని పోల్చాడు?
జవాబు:
వీరాభిమన్యునితో పల్నాటి బాలచంద్రుని పోల్చాడు.

ఇ) గేయంలోని వీరవనితల పేర్లు రాయండి.
జవాబు:
ఝాన్సీరాణి, కాకతీ రుద్రమ్మ, మగువ మాంచాలలు గేయంలో పేర్కొన్న వీరవనితలు.

ఈ) కవి ఎవరికి ప్రేరణను కలిగిస్తున్నాడు?
జవాబు:
విశ్వభారత వీరునికి కవి ప్రేరణ కల్గిస్తున్నాడు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
బాలచంద్రుని పరాక్రమాన్ని ఎవరెవరితో పోల్చడం జరిగింది?
జవాబు:
బాలచంద్రుని పరాక్రమాన్ని ప్రళయకాలంలో భైరవునితో పోల్చేరు. సైంధవుని చంపి వెళ్ళిన అర్జునునితో పోల్చారు. భీమునితో, హనుమంతునితో పోల్చారు. శ్రీరామునితో పోల్చారు. మంధర పర్వతంతో పోల్చారు.

ప్రశ్న 2.
బాలచంద్రుని పరాక్రమాన్ని రామాయణ, భారత, భాగవత వీరులతో పోల్చిన అంశాలను వివరించండి.
జవాబు:
బాలచంద్రుని భారతంలోని అర్జునుడు, భీముడుతో పోల్చారు. సైంధవ వధలో అర్జునునితో పోల్చారు. గదా యుద్ధంతో కౌరవులను చెల్లాచెదురు చేసిన భీమునితో పోల్చారు.

రామాయణంలో హనుమంతునితో, రామునితో పోల్చారు. లంకాదహనం చేసిన హనుమంతునితో పోల్చారు. రాక్షసులతో యుద్ధంలో శ్రీరామునితో పోల్చారు.

భాగవతంలో త్రిపురాసుర సంహారం చేసిన శివునితో పోల్చారు.

ప్రశ్న 3.
బాలచంద్రుడు తనను ఎదిరించలేరనడానికి చెప్పిన పోలికలేవి?
జవాబు:
తనను తాను దావాగ్నితో పోల్చుకున్నాడు. శత్రు సైన్యాన్ని అడవితో పోల్చాడు. శత్రు సైన్యాన్ని సముద్రంతో, తనను బడబాగ్నితో పోల్చుకున్నాడు. తనను పులితో, శత్రువులను జంతువులతో పోల్చాడు. తనను డేగతో, వారిని కొంగలతో పోల్చాడు. తనను సివంగితో, వారిని జింకలతో పోల్చాడు. తనను తాను మిరియపు గింజతో పోల్చుకున్నాడు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటలలో రాయండి.
జవాబు:
యుద్ధానికి పోవద్దని చెప్పిన తన తల్లి ఐతమ్మతో బాలచంద్రుడు ఈ క్రింది విధంగా అన్నాడు. తనను భయపెట్ట వద్దన్నాడు. తన పరాక్రమం నలగామునకు తెలుసునన్నాడు. ప్రళయకాలంలో కాలభైరవుని వంటివాడినన్నాడు. సైంధవుని చంపేవేళ అర్జునునిలాంటి వాడినన్నాడు. భీముడు, హనుమ, శ్రీరామచంద్రుని వంటి వీరుడనన్నాడు. తను మంధర పర్వతం వంటి వాడనన్నాడు.. ఫాలాక్షుని వలె నలగాముని సైన్యాన్ని నశింప చేస్తానన్నాడు.

తనను తాను దావాగ్నితో, బడబాగ్నితో, పులితో, డేగతో, సివంగితో, మిరియపు గింజతో, పోల్చుకున్నాడు. శత్రు సైన్యాన్ని అడవితో, సముద్రంతో, జంతువులతో, జింకలతో పోల్చాడు. తన తల్లితో ఇవన్నీ చెప్పాడు.

ప్రశ్న 2.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన ఇద్దరు వీరుల గురించి రాయండి.
జవాబు:
నేతాజీ సుభాష్ చంద్రబోస్ :
ఈయన 1897 జనవరి 23వ తేదీన కటక్ లో జన్మించాడు. భారత జాతీయ ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు. ఆయన తల్లిదండ్రులు జానకీనాథబోస్, ప్రభావతీ దేవి. 11 సార్లు స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయులచే కారాగారంలో నిర్భందించబడ్డాడు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరుతోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసాడు. బ్రిటిష్ వారితో యుద్ధాన్ని జర్మనీ, జపాన్ల సాయంతో సాగించాడు. 1945 ఆగష్టు 18న తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడంటారు. కానీ ప్రమాదం నుండి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.

ఝాన్సీ లక్ష్మీబాయి :
ఝాన్సీ లక్ష్మీబాయి 1828 నవంబరు 19న మహారాష్ట్రలో సతారలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి. వీరిది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె చిన్నప్పటి పేరు మణికర్ణిక. ముద్దుగా ‘మను’ అని పిలిచేవారు. ఆమె 4వ ఏటనే తల్లి మరణించింది. చిన్నతనంలోనే గుర్రపు స్వారీ, కత్తియుద్ధం నేర్చుకొంది.

ఆమెను 13వ ఏట ఝాన్సీ రాజు గంగాధరరావు ఆమెను పెండ్లాడాడు. గంగాధరరావు మరణానంతరం ఝాన్సీని బ్రిటిషువారు కైవసం చేసుకోవాలనుకొన్నారు. కాని లక్ష్మీబాయి అంగీకరించలేదు. తిరుగుబాటు చేసింది. బ్రిటిషువారికి కంటిమీద కునుకు లేకుండా గెరిల్లా పోరాటాలు చేసింది. చివరకు బ్రిటిషువారి దుర్మార్గానికి 1858 జూన్ 18న గ్వాలియర్లో మరణించింది. ఆమె తండ్రిని బ్రిటిషువారు ఉరితీశారు. ఆమె వారసుడిగా దామోదర్ రావుని ప్రకటించారు.

AP Board 7th Class Telugu Solutions 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ

ప్రశ్న 3.
తల్లి ఐతమ్మకి, బాలచంద్రునికి మధ్య జరిగిన సంభాషణను రాయండి.
జవాబు:
ఐతమ్మ : బాబూ ! నువ్వు యుద్ధానికి వెళ్లవద్దు.

బాల : భయపడకమ్మా ! నేను మహావీరుడను.

ఐతమ్మ : ఆ నలగాముడి సైన్యం ప్రళయ భీకరమైనది బాబూ !

బాల : అమ్మా ! నేను కాలభైరవుడినై నశింప చేస్తాను.

ఐతమ్మ : వాళ్లది కౌరవ సైన్యంలా చాలా పెద్దది బాబూ !

బాల : నేను అర్జునుడనై, భీముడినై మట్టి కరిపిస్తా.

ఐతమ్మ : ఆ నలగాముడు రావణాసురుడి వంటి వాడురా?

బాల : నేను హనుమంతుడినై వాడి లంకను కాలుస్తా, శ్రీరామచంద్రుడినై వాడిని అంతం చేస్తాను.

ఐతమ్మ : ఆ నలగాముడి సైన్యం త్రిపురాసురులు వలె భయంకరమైన వాళ్లురా?

బాల : నేను ఫాలాక్షుడినై త్రిపురాసుర సంహారం చేస్తా, నువ్వేం భయపడకు. వీర తిలకం దిద్దు అమ్మా !

ఐతమ్మ : (నవ్వుతూ) అలాగే ! నాయనా ! విజయుడివై తిరిగిరా ! బాబూ !

భాషాంశాలు

అ) కింద గీతగీసిన పదానికి అర్ధాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : కౌరవ సైన్యం కురుక్షేత్ర రణములో మరణించింది.
రణము = యుద్ధము
సొంతవాక్యం : యుద్ధములో వెన్ను చూపకూడదు.

1. భోగిమంటలో వేసిన వస్తువులు కాలి భస్మం అవుతాయి.
భస్మం = బూడిద
సొంతవాక్యం : సగర కుమారుల బూడిదరాశులపై భగీరథుడు గంగను ప్రవహింప చేశాడు.

2. జలధిలోని నీరు ఉప్పగా ఉంటుంది.
జలధి = సముద్రం
సొంతవాక్యం : సముద్రంపై ప్రయాణం సరదాగా ఉంటుంది.

3. హిమాలయ శైలము మంచుతో కప్పబడి ఉంటుంది.
శైలము = కొండ
సొంతవాక్యం : కొండలలో వేసవిలో అగ్ని రగులుతుంది.

4. పృథ్వి గుండ్రంగా ఉంటుంది.
పృథ్వి = భూమి
సొంతవాక్యం : భూమిపై జంతువులలో ఏనుగు పెద్దది.

ఆ) అర్ధాలను జతపరచండి.

1. మది అ) వేడుక
2. ఉర్వీశుడు ఆ) పరాక్రమం
3. దళము ఇ) మహారాజు
4. విక్రమము ఈ) అగ్ని
5. సంతోషము ఉ) అడవి
6. వనము ఊ) మనస్సు
7. దహనుడు ఋ) సైన్యం

జవాబు:

1. మది ఊ) మనస్సు
2. ఉర్వీశుడు ఇ) మహారాజు
3. దళము ఋ) సైన్యం
4. విక్రమము ఆ) పరాక్రమం
5. సంతోషము అ) వేడుక
6. వనము ఉ) అడవి
7. దహనుడు ఈ) అగ్ని

ఇ) కింద ఇచ్చిన పదానికి సమానార్థక పదాలు వాక్యాలలో ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి.

1. బాలచంద్రుడు రణంలోకి దూకాడు. కాని రాజులకు యుద్ధకాంక్ష తగదు.
సమరం : రణం, యుద్ధం

2. జ్వలనుడు అడవినీ దహించాడు. అగ్ని ధాటికి చెట్లన్నీ కాలిపోయాయి.
వహ్ని = జ్వలనుడు, అగ్ని

3. దేవతలు అమృతం కోసం అంబుధిని మథించారు. ఉదధి నుండి చంద్రుడు పుట్టాడు.
సముద్రం = అంబుధి, ఉదధి

4. పుడమిపై కనకవర్షం కురిసింది. రైతులు ధరణిపై బంగారం పండిస్తున్నారు.
పసిడి = కనకం, బంగారం
భూమి = పుడమి, ధరణి

AP Board 7th Class Telugu Solutions 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ

ఈ) కింది వానిలో ప్రకృతి వికృతులను జతపరచండి.

1. పుత్రుడు అ) పసువు
2. రాక్షసుడు ఆ) పుడమి
3. పృథ్వి ఇ) బొట్టె
4. పశువు ఈ) రక్కసుడు

జవాబు:

1. పుత్రుడు ఇ) బొట్టె
2. రాక్షసుడు ఈ) రక్కసుడు
3. పృథ్వి ఆ) పుడమి
4. పశువు అ) పసువు

ఉ) కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.
1. భయం × నిర్భయం
2. న్యాయం × అన్యాయం
3. భువి × ఆకాశం
4. జయం × అపజయం

వ్యాకరణాంశాలు

గసడదవాదేశ సంధి

అ) కింది వాక్యాలను పరిశీలించండి.

1. కల్నల్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలర్పించాడు. అతడు గొప్పవాడుగదా.
2. అందరు నిజముదెలిసి మసలుకోవాలి.
3. పాండవులు విరాటమహారాజు కొలువుసేసిరి.
4. లతకు ఏమి చేయాలో పాలువోక ఉంది.

గీత గీసిన పదాలను విడదీయండి.
ఉదా : గొప్పవాడు + దా : గొప్పవాడుగదా
1. నిజము + తెలిసి = నిజము దెలిసి
2. కొలువు + చేసిరి = కొలువు సేసిరి
3. పాలు + పోక = పాలువోక

పై ఉదాహరణల్లో ప్రథమావిభక్తి ప్రత్యయాలైన డు-ము-వు-లు పూర్వపదం చివర ఉన్నాయి. పరుషాలైన క-చ-ట-త-ప లు పరపదం మొదట ఉన్నాయి. అప్పుడు వాటి స్థానంలో గ-స-డ-ద-వ లు ఆదేశంగా వచ్చాయి. ఒకానొక సమయంలో గసడదవలు రాకపోతే అవే రూపాలు యథాతథంగా ఉంటాయి. ఇలా రెండు విధాలుగా సంధి జరగడాన్ని గసడదవాదేశ సంధిలో గమనించవచ్చు.

సప్తమీ విభక్తి

ఆ) కింది వాక్యాలు చదవండి.

AP Board 7th Class Telugu Solutions 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ 2
పై వాక్యాలను సరిచేసి తిరిగి రాయండి.
ఉదా : సరయునది తీరమందు కోసలదేశం ఉంది.

1. చాణుక్యుడు మాటల యందు నేర్పరి.
2. కాశీయందు గంగానది ఉంది.
3. తల్లికి పిల్లల యందు అనురాగం ఉంది.
4. గరుత్మంతునికి తల్లియందు భక్తి ఉంది.

పై పట్టికను గమనిస్తే ‘అందు’ అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది. ఇలా వాక్యంలోని కొన్ని, పదాల మధ్యన చేరే ‘అందున్, నన్’ అనే ప్రత్యయాలను సప్తమీ విభక్తిగా చెప్పవచ్చు. సాధారణంగా సామీప్య, విషయ సంబంధాన్ని, అంతటా వ్యాపించటాన్ని గురించి చెప్పేటప్పుడు ‘సప్తమీ విభక్తి’ని ఉపయోగిస్తారు.

ఇ) కింది ఖాళీలను పూరించండి.

సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు
ఉదా : వాయుపుత్రుడు వాయువు యొక్క పుత్రుడు షష్టీతత్పురుష సమాసం
1. మా ఇల్లు మా యొక్క ఇల్లు షష్టీతత్పురుష సమాసం
2. నా పుస్తకం నా యొక్క పుస్తకం షష్టీతత్పురుష సమాసం
3. తల్లి మనసు తల్లి యొక్క మనసు షష్టీతత్పురుష సమాసం
4. రాజు సైన్యం రాజు యొక్క సైన్యం షష్టీతత్పురుష సమాసం

AP Board 7th Class Telugu Solutions 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ

ఈ) సంధి పదాలను విడదీసి రాయండి.
ఉదా : ఫాలాక్షుడు = ఫాల + అక్షుడు – సవర్ణదీర్ఘ సంధి
1. ప్రళయాబ్ది = ప్రళయ + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి
2. భయమేల = భయము + ఏల – ఉత్వ సంధి
3. బాలుడని = బాలుడు + అని – ఉత్వ సంధి
4. బడబాగ్ని = బడబ + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
5. నీవిప్పుడు = నీవు + ఇప్పుడు – ఉత్వ సంధి
6. వ్రాలినయట్లు = వ్రాలిన + అట్లు – యడాగమం
7. తీర్చినయట్లు = తీర్చిన + అట్లు – యడాగమం
8. ఎదురెవ్వరు = ఎదురు + ఎవ్వరు – ఉత్వ సంధి
9. బాలుడనని = బాలుడను + అని – ఉత్వ సంధి
10. పశుగణంబెదురే = పశుగణంబు + ఎదురె – ఉత్వ సంధి

ప్రాజెక్టుపని

మీకు తెలిసిన వీరవనితల చిత్రాలను సేకరించండి. వారి గురించి రాయండి.
జవాబు:
రాణి రుద్రమదేవి :
కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిగిన మహారాణి రుద్రమదేవి. కాకతీయ వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యా లను పరిపాలించిన వీరవనితలలో అగ్రగణ్యురాలు రుద్రమదేవి.

ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవ చక్రవర్తి. ఆయనకు మగపిల్లలు లేరు. అందుచేత రుద్రాంబను కుమారుడిలా పెంచాడు. రుద్రదేవుడని నామకరణం చేశాడు. ఆమెను వీరభద్రుడికిచ్చి వివాహం చేశాడు.

క్రీ.శ. 1269లో ‘రుద్రమహారాజు’ అనే బిరుద నామంతో రుద్రమదేవి సింహాసనం అధిష్టించింది. స్త్రీని. పరిపాలకురాలిగా అంగీకరించని సామంతులు కొందరు తిరుగుబాటు చేశారు. రుద్రమ వారిని సమర్థవంతంగా అణచివేసింది. దేవిగిరి రాజుతో చేసిన యుద్ధం చాలా పెద్దది. కీలకమైనది. దిక్కు లేక అతను సంధికి దిగి వచ్చి మూడుకోట్ల సువర్ణాలు యుద్ధ పరిహారంగా ఇచ్చాడు. రుద్రమదేవికి రాయగజ కేసరి, ఘటోధృతి అనే బిరుదులున్నాయి. మార్కొపోలో రుద్రమ గురించి వివరంగా వ్రాశాడు. చక్కటి పరిపాలన నందించిన వీరవనిత రుద్రమదేవి.

ఝాన్సీ లక్ష్మీబాయి :
ఝాన్సీ లక్ష్మీబాయి 1828 నవంబరు 19న మహారాష్ట్రలో సతారలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి. వీరిది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె చిన్నప్పటి పేరు మణికర్ణిక. ముద్దుగా ‘మను’ అని పిలిచేవారు. ఆమె 4వ ఏటనే తల్లి మరణించింది. చిన్నతనంలోనే గుర్రపు ” స్వారీ, కత్తియుద్ధం నేర్చుకొంది.

ఆమెను 13వ ఏట ఝాన్సీ రాజు గంగాధరరావు ఆమెను పెండ్లాడాడు. గంగాధరరావు మరణానంతరం ఝాన్సీని బ్రిటిషువారు కైవసం చేసుకోవాలనుకొన్నారు. కాని లక్ష్మీబాయి అంగీకరించలేదు. తిరుగుబాటు చేసింది. బ్రిటిషువారికి కంటిమీద కునుకు లేకుండా గెరిల్లా పోరాటాలు చేసింది. చివరకు బ్రిటిషువారి దుర్మార్గానికి 1858 జూన్ 18న గ్వాలియర్లో మరణించింది. ఆమె తండ్రిని బ్రిటిషువారు ఉరితీశారు. ఆమె వారసుడిగా దామోదర్ రావుని ప్రకటించారు.

చమత్కార పద్యం

కం. తోక వెనకాలనుండును అని
టీకప్పున నుండు మండుటెండలనుండున్
మోకాలు ముందునుందును
ఆకాశము పైననుండు అద్దిరభన్నా

పై పద్యములో చమత్కారాన్ని గమనించండి.

భావం :
ఈ పద్యంలో తోక వెనకాల, టీకప్పులో, మండుటెండలు, మోకాలుకు ముందు, ఆకాశం పైన ఏముంటుందని అడిగారు. ఇది ఒక చమత్కార పద్యము. పైకి అలా కనబడుతున్నా పద్యములో సమాధానం ఉంది. తోక ఎప్పుడూ వెనకాలే ఉంటుంది. టీ – కప్పులో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి. మీకు పద్య చమత్కారం అర్థమౌతుంది.

ఉపాధ్యాయులకు సూచనలు

1. పల్నాటి వీరచరిత్రను సేకరించి చదవండి. విద్యార్థుల చేత చదివించండి.
2. పోరాటపటిమ పెంపొందించుకోడానికి ఉపకరించే మహనీయుల జీవిత చరిత్రలను కథారూపంలో విద్యార్థులకు వినిపించండి.
ఉదా : అల్లూరి సీతారామరాజు, రాజా రామ్మోహన్ రాయ్, గాంధీజీ, శివాజీ, భగత్సింగ్ మొదలైనవారు.

కవి పరిచయం

కవి పేరు : శ్రీనాథుడు.
ఉద్యోగం : పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు.
బిరుదులు : కవిసార్వభౌముడు.
రచనలు :
మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండం, హరవిలాసం, పల్నాటి వీరచరిత్రం, క్రీడాభిరామం మొదలైనవి.

ప్రత్యేకతలు : ఆయన రచించిన చాటు పద్యాలు చాలా ప్రఖ్యాతిని పొందాయి.

గేయాలు – అర్థాలు – భావాలు

1. అని తల్లి పలికిన ననియె బాలుండు
“భయమేల గొల్పెదు భామ నీ విపుడు
నలగాము డెరుగును నాదుశౌర్యంబు
ప్రళయకాలమునాటి భైరవురీతి
సైంధవవధ వేళ సాహసస్ఫూర్తి
విజయుడు రణములో విహరించునట్లు
కౌరవ సేనలో గదబట్టిదూరి
వడముడిరణమున వ్రాలినయట్లు
వాయుపుత్రుడు లంక వడితోడఁజొచ్చి
భస్మంబుగావించి ప్రబలినభంగి
రాక్షసరణములో రామచంద్రుండు
వీరపరాక్రమవిధి జెందినట్లు
జలధిమధ్యంబున సారెకుదిరుగు
మందర శైలంబుమాడ్కిఁ దోఁపంగ
ఫాలాక్షుఁడతి రౌద్రపటిమ మీఱంగ
త్రిపురముల్ గాలిచి తీర్చినయట్లు
అర్థాలు :
శౌర్యంబు = పరాక్రమము
భైరవుడు = శివుడు
ప్రళయకాలము = సృష్టి అంతమయ్యే సమయం
రణము = యుద్ధము
విజయుడు = అర్జునుడు
వడముడి = భీముడు
వాయుపుత్రుడు = హనుమంతుడు
వడి = వేగం
భస్మంబు = బూడిద
ప్రబలుట = విజృంభించుట
జలధి = సముద్రం
సారెకు = చక్రానికి
ఫాలాక్షుడు = శివుడు
శైలము = పర్వతం
మాడ్కి = వలె
రౌద్రపటిమ = రౌద్రం యొక్క గొప్పతనం

భావం :
తల్లి పలికిన తర్వాత బాలచంద్రుడు మాట్లాడు తున్నాడు. అమ్మా ! నీకు భయం వద్దు. నలగామరాజుకు బాలచంద్రుని పరాక్రమం తెలుసు. ప్రళయకాలంలో భైరవుడిలా, సైంధవ వధ జరిగేటపుడు అర్జునుడు రణరంగంలో తిరిగినట్లు తిరుగుతాను. కౌరవ సేనలోకి గదపట్టి దూరిన భీమసేనుడులా ప్రవేశిస్తాను. రాక్షసులతో యుద్ధంలో శ్రీరామచంద్రుడిలా ప్రవేశిస్తాను. సముద్రం మధ్యలో చక్రమై తిరిగిన మందర పర్వతంలా కనబడతాను. శివుడు రౌద్రంలో త్రిపురాలు కాల్చినట్లు నలగాముని సైన్యాన్ని కాలుస్తానని బాలచంద్రుడు తల్లితో అన్నాడు.

AP Board 7th Class Telugu Solutions 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ

2. స్థావర జంగమ సకలవస్తువుల
ప్రళయాభై ముంచంగఁ బరగినరీతి
కామభూపదళము గడగడవణక
విక్రమక్రమశక్తి విడివడచొచ్చి
పృథ్విపై పీనుఁగు పెంటలుగాఁగ
విహరింతు మదిలోన వేడుకకొలఁది
ఉర్వీశు దళముల కురుమనిపిడుగ
గర్వించుపగవారి కంటిలో నెరుస
ఎదురెవ్వరే నాకు నీభువిలోన
నలగాముబలముల నలినలిచేసి
వండంగ తరగిన వడుపుననరికి
నెత్తురుమడుగులు నిండంగఁ జేతు
దహనునికడ్డంబె దట్టమౌ వనము
బడబాగ్ని నార్చునే పాధోథిమించి
భయదమౌపులికిని పశుగణం బెదురె
స్వాతికొక్కెరగుంపు సాళ్వంబు కెదురె
జింకలకదుపులు సివ్వంగికీడె
చిన్న మిర్యమునం చెడునె కారంబు
బాలుఁడనని నన్ను భావింపవలదు”
అనిన బాలుని మాట కైతమ్మ పలికె
అర్థాలు :
స్థావరము = కదలనివి
జంగమము = కదిలేవి
సకల వస్తువులు = అన్ని వస్తువులు
అబ్ది = సముద్రం
పరగిన = అతిశయించిన
రీతి = ప్రకారంగా (విధంగా)
కామభూపదళము= కామరాజు యొక్క సైన్యం
విడివడడం = విడిపోవడం
పృథ్వి = భూమి
పీనుగుపెంటలు = శవాలదిబ్బలు
వేడుక = ఉత్సవం
ఉర్వీశుడు = రాజు
దళము = సైన్యం
ఉరుమని = ఉరుములు లేని
పగవారు = శత్రువులు
కంటిలో నేరుసు = కంట్లో నలక
ఎదురు = ఎదిరించేవారు
నలినలిచేసి = పిండి పిండిచేసి
మడుగు = కొలను
దహనుడు = అగ్ని
వనము = అడవి
బడబాగ్ని = సముద్రంలో ఉండే అగ్ని
పాధోథి = సముద్రం
భయదము = భయమును కలిగించేది
పశుగణం = జంతువులు
కొక్కెర = కొంగ
సాళ్వము = డేగ
కదుపులు = సమూహాలు
సివ్వంగి = సివంగిఁ ఆడసింహం

భావం :
ప్రళయకాలంలో సమస్త వస్తువులను సముద్రంలో శివుడు ముంచినట్లుగా యుద్ధంలో నలగాముని సైన్యాన్ని ముంచుతాను. నలగామరాజు గడగడా వణికేలా వాళ్ల సైనిక శక్తి విడిపోయి భూమి మీద శవాల దిబ్బలయ్యేలా చేస్తాను. మనసులో ఉత్సాహం పెరుగుతుండగా నలగాముని సైన్యంపై ఉరమని పిడుగులా పడతాను. గర్వంతో ఉన్న శత్రువుకు కంటిలో నలుసునౌతాను. నాకు ఈ భూమండలంలో ఎదురెవ్వరూ లేరు. నలగాముని సైన్యాన్ని పిండిగుండా కింద నలిపేస్తాను. వండడానికి అనువైన కూర ముక్కలులా వారిని తరిగేస్తాను. నెత్తురు మడుగులు కట్టిస్తాను. దట్టమైన అడవి అగ్నికి అడ్డమా? బడబాగ్నిని. సముద్రం ఆర్పగలదా? భయంకరమైన పెద్దపులికి జంతువులు లెక్కా? డేగకు కొంగలు లెక్కా? జింకల గుంపులు సివంగికి లెక్కా? మిరియపు గింజ చిన్నదైనా కారం తగ్గదు కదా ! నేను బాలుడననుకోకు ! అని బాలుడు తల్లితో పలికెను.

AP Board 7th Class Telugu Solutions 10th Lesson ప్రియ మిత్రునికి

SCERT AP Board 7th Class Telugu Guide Answers 10th Lesson ప్రియ మిత్రునికి Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 10th Lesson Questions and Answers ప్రియ మిత్రునికి

7th Class Telugu 10th Lesson ప్రియ మిత్రునికి Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 7th Class Telugu Solutions 10th Lesson ప్రియ మిత్రునికి 1

ప్రశ్న 1.
చిత్రం ఏ విషయాన్ని తెలియజేస్తుంది?
జవాబు:
పోస్టుబాక్సులోంచి పోస్టుమేన్ ఉత్తరాలు తీస్తున్నాడు. అంటే లేఖలు చాలా వచ్చాయని తెలుస్తోంది. సెల్ ఫోనులో మాటల ద్వారా ఇతరులకు సమాచారం అందించవచ్చు. అలాగే వాట్సాప్, జిమెయిల్, ఎస్.ఎమ్.ఎస్లు, ట్విట్టర్, ఫేస్ బుక్ – ఇవన్నీ సమాచారం పంపే సాధనాలని తెలుస్తోంది.

ప్రశ్న 2.
లేఖల బదులుగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాధనాలు ఏవి?
జవాబు:
ఫోన్ :
ఫోన్ ద్వారా ఇతరులకు సమాచారం చెబుతాం.

వాట్సాప్ :
వాట్సాప్ ద్వారా కొన్ని బృందాలకు కాని, వ్యక్తిగతంగా కాని సమాచారం పంపుతాం.

జిమెయిల్ :
దీని ద్వారా ఒక వ్యక్తికి, లేదా కంపెనీకి సమాచారం పంపుతాం. ఎస్.ఎమ్.ఎస్ : ఇది కూడా జి.మెయిల్ లాగే ఉపయోగిస్తుంది. ఫేస్ బుక్, ట్విట్టర్లు కూడా సమాచారం పంపడానికి ఉపయోగపడతాయి.

AP Board 7th Class Telugu Solutions 10th Lesson ప్రియ మిత్రునికి

ప్రశ్న 3.
మీ మిత్రులకు, బంధువులకు ఏఏ సందర్భాల్లో లేఖలు రాస్తారు?
జవాబు:
ఆనందం కానీ, బాధ కానీ కలిగినపుడు బంధువులకు లేఖలు వ్రాస్తాం. ఇంట్లో పెళ్ళిళ్లు, గృహప్రవేశాలు మొదలైనవి చేసుకొనేటపుడు బంధువులకు, మిత్రులకు శుభలేఖలు పంపుతాం. ఏదైనా పిక్ నిక్ లేదా తీర్థయాత్రలకు, పెళ్లిళ్లు మొదలైన వాటికి వెళ్లి వచ్చినపుడు, మిత్రులకు, మామయ్యకు ఉత్తరాలు వ్రాస్తాను. మాకు నచ్చిన, నచ్చని విషయాలు వారితో పంచుకొంటాం.

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

అవగాహన-ప్రతిస్పందన

ప్రశ్న 1.
డబ్బు ముఖ్యమా? ఆనందం ముఖ్యమా? మీ అభిప్రాయం చెప్పండి (వ్రాయండి).
జవాబు:
రెండూ ముఖ్యమే. డబ్బు లేకపోతే తిండి, గుడ్డ, గూడు ఏవీ దొరకవు. మనం బ్రతకడమే జరగదు. అందుచేత డబ్బు ముఖ్యమే. కానీ, అవసరాన్ని మించిన డబ్బు అక్కర్లేదు. మనం జీవించడానికి సరిపడా డబ్బు ఉండాలి. అప్పుడింక డబ్బు సంపాదనకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. అప్పుడు ఆనందమే గొప్పది. ఆనందంగా జీవించాలంటే అందరితో కలిసి మెలిసి ఉండాలి. ఆనందంగా జీవిస్తూనే డబ్బు సంపాదించాలి. డబ్బే ముఖ్యం కాదు. జీవితంలో ఆనందం కూడా ముఖ్యమే.

ప్రశ్న 2.
స్నేహం యొక్క గొప్పతనం గురించి మీ మాటల్లో చెప్పండి (వ్రాయండి).
జవాబు:
స్నేహం అనేది ఒక గొప్ప వరం. ఒక మంచి స్నేహితుడు వంద పుస్తకాల కంటే ఎక్కువ. మనకు బాధ కలిగితే అది స్నేహితునితో చెప్పుకొంటే సగం తగ్గుతుంది. ఆనందం చెప్పుకొంటే రెట్టింపవుతుంది. మన దగ్గర డబ్బులు లేకపోతే స్నేహితుడే ఇస్తాడు, ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టడు. మనమేమైనా రహస్యాలు చెబితే ఎవ్వరికీ చెప్పడు. మనలో మంచి లక్షణాల గురించి పదిమందికీ చెబుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే స్నేహానికి సాటి వచ్చే సంపద, పదవీ, కావ్యం మొదలైనవేవీ ప్రపంచంలో లేవు. స్నేహంతో స్నేహమే పోల్చగలం.

ప్రశ్న 3.
నిరాశ వలన కలిగే నష్టాలను గురించి తెలపండి.
జవాబు:
ఆశ మనిషిని బ్రతికిస్తుంది. నిరాశ చంపుతుంది అంటారు. నిరాశ వలన ఉత్సాహం పోతుంది. ఆడుకోలేం, పాడుకోలేం, చదువుకోలేము, ఏ పనినీ చేయలేము. దేని గురించి ఆలోచించలేము. ఒక్కొక్కసారి జీవితం మీద కూడా విరక్తి కలుగుతుంది. అందుచేత నిరాశ అతి ప్రమాదకరమైనది, ఒక్కొక్కసారి నిరాశ కలిగినా, కొద్ది సేపటికి కోలుకోవాలి. దాని నుండి బైటపడాలి. ఆశను పెంచుకోవాలి. నిరాశతో అన్నీ కోల్పోతాం. ఆశ ఉంటే దేనినైనా సాధిస్తాం.

AP Board 7th Class Telugu Solutions 10th Lesson ప్రియ మిత్రునికి

ప్రశ్న 4.
కింది గద్యం చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
గార్గి మహాపండితురాలే కాక బ్రహ్మజ్ఞానం గల మహావిజ్ఞాని. ఆనాటి మహర్షులలో అగ్రేసరుడు, బ్రహ్మజ్ఞాని అయిన యజ్ఞవల్క్యునితో పలుమార్లు వాద ప్రతివాదాలు చేసిన మహాపండితురాలు. పురుషులతో పాటు ఉపనయనం చేసుకుని యజ్ఞోపవీతాన్ని (జంధ్యం) ధరించి శాస్త్ర చర్చలు చేసిన విదుషీమణి. ఈమె జనక మహారాజు ఆస్థాన పండితురాలు. పురుషులతో పాటు స్త్రీలకు సమాన ప్రతిపత్తే కాకుండా ఏ విషయంలోనూ స్త్రీలు పురుషులకు తీసిపోరని చాటిన మహిళ గార్డి.
ప్రశ్నలు :
అ) మహర్షులలో అగ్రేసరులు ఎవరు?
జవాబు:
మహర్షులలో యజ్ఞవల్క్యుడు అగ్రేసరుడు.

ఆ) బ్రహ్మ జ్ఞానం గల మహావిజ్ఞాని ఎవరు?
జవాబు:
బ్రహ్మ జ్ఞానం గల మహాజ్ఞాని గార్గి.

ఇ) యజ్ఞోపవీతం అనే పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
యజ్ఞోపవీతం అంటే జంధ్యం అని అర్థం.

ఈ) గార్గి ఎవరి ఆస్థాన పండితురాలు?
జవాబు:
జనక మహారాజుకు గార్గి ఆస్థాన పండితురాలు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
లలిత కళలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
లలితకళలు 5. అవి

  1. సాహిత్యం
  2. సంగీతం
  3. నృత్యం
  4. శిల్పం
  5. చిత్రలేఖనం.

ప్రశ్న 2.
ముఖం చూడగానే మానవుని అంతరాత్మ ఎలా తెలుస్తుంది?
జవాబు:
మానవుని ఆత్మకు మానవుని మనసు ప్రతిబింబం. మానవుని మనసుకు మానవుని ముఖం యొక్క ఆకారం ప్రతిబింబం. అందుకనే మానవుని ముఖం చూడగానే అతని అంతరాత్మ తెలుస్తుంది.

ప్రశ్న 3.
మానవులంతా ఒక్కటే అనే భావాన్ని సంజీవదేవ్ ఎలా వివరించారు?
జవాబు:
మైత్రి, ప్రేమ, స్వార్థం లేకపోవడం వంటి లక్షణాలున్న మానవులంతా ఒక్కటే. వారెంత దూరాన ఉన్నా అందరూ దగ్గరివారే. వయసులు వేరైనా వారంతా ఒకటే. కులాలు, రంగులు వేరైనా అందరూ ఒకటే. దేశం, మతం, జాతి వేరైనా అందరూ ఒకటే. మైత్రి, ప్రేమ, నిస్స్వార్థం ఉంటే మానవులు అంతా ఒకటేనని సంజీవదేవ్ చెప్పారు.

AP Board 7th Class Telugu Solutions 10th Lesson ప్రియ మిత్రునికి

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
రచయిత లేఖలో పేర్కొన్న అంశాలను మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
రచయిత ఈ లేఖను 25.11.64న తన మిత్రుడు నారాయణ రాజుగారికి తుమ్మపూడి నుండి వ్రాశారు.

వారు వ్రాసిన ఉత్తరం చదివి తనూ తన భార్యా ఆనందించినట్లు వ్రాశారు. ఒకనాటి రాత్రి వారు తమ ఇంటికి, . వచ్చినందుకు రచయిత చాలా ఆనందపడినట్లుగా వ్రాశారు.

తమలో ఉన్న ప్రేమ, మైత్రి, నిస్స్వార్థతే తమను కలిపినట్లు వ్రాశారు. అవి ఎవ్వరినైనా కలుపుతాయి అన్నారు. ఒక వ్యక్తి ముఖం చూస్తే ఆత్మ తెలుస్తుందన్నారు. లలితకళల గురించి అవి ఇచ్చే ఆనందం గురించి వ్రాశారు. తనకు నిరాశ, నిరుత్సాహం, విచారం వంటివి ఉండవని రచయిత తన లేఖను ముగించారు.

ప్రశ్న 2.
లలితకళల్లో మీకు నచ్చిన అంశం గురించి రాయండి.
జవాబు:
1) సాహిత్యం :
నాకు లలితకళలలో సాహిత్యమంటే చాలా ఇష్టం. సాహిత్యంలో మంచి మంచి కథలు, కల్పనలు, పాటలు, పద్యాలు, వర్ణనలు మొదలైనవన్నీ ఉంటాయి. చక్కగా అవన్నీ చదువుకోవచ్చు. వినవచ్చు. ఆనందించ వచ్చును.

2) సంగీతం :
సాహిత్యం అయితే చదువుకొన్న వారికే ఆనందం కల్గిస్తుంది. కానీ సంగీతం చదువురాని వారిని కూడా ఆనందపరుస్తుంది. కళ్లు కనిపించని వారు కూడా చెవులతో విని ఆనందించవచ్చు. సంగీతం వింటుంటే బాధలన్నీ మరచిపోతాం. రోగాలను తగ్గించే శక్తి కూడా సంగీతానికి ఉందిట. మనుషులనే కాదు చెట్లను, పాములను, జంతువులను, పక్షులను కూడా సంగీతం ఆనందపరుస్తుంది. అందుకే నాకు సంగీతమంటే చాలా ఇష్టం.

3) చిత్రలేఖనం :
లలితకళలలో నాకు చిత్రలేఖనమంటే ఇష్టం. చదువురాని వారిని, చెవిటి వారిని కూడా ఆకర్షించి ఆనందపరిచేది చిత్రలేఖనం. అందుకే చిత్రలేఖనం అంటే నాకిష్టం. సృష్టిలోని దేన్నైనా చిత్రించి, ఆనందింపచేయగల చిత్రకారులంటే నాకు చాలా గౌరవం. చిత్రలేఖనం కూడా పశువులను, పక్షులను ఆకర్షించి ఆనందింప చేస్తుంది. ఇప్పటి మన సినిమాలకు మూలం చిత్రలేఖనమే కదా.!

4) శిల్పం :
నాకు లలితకళలలో శిల్పమంటే ఇష్టం. ఎందుకూ పనికిరాని బండరాయిని కూడా భగవంతుడుగా తీర్చిదిద్ది, మానవులలో భక్తి భావాన్ని పెంచే శిల్పికి సాటివచ్చేవారు ఎవ్వరూ లేరు. ఈ రోజు దేవాలయాలు, మ్యూజియమ్ లు, అందమైన భవనాలు, రాజభవంతులు నిర్మించేది శిల్పులే. కళ్లు లేకపోయినా, చెవిటి వారినైనా ఆనందింప చేసేది శిల్పకళే. అంధులు కూడా చేతితో తడిమి శిల్పం యొక్క సౌందర్యాన్ని తెలుసుకోగలరు. ఆనందిస్తారు. అందుకే నాకు లలితకళలలో శిల్పకళ అంటే చాలా ఇష్టం.

5) నృత్యం :
నాకు లలితకళలలో నృత్యమంటే ఇష్టం. సంగీతం, సాహిత్యం కళ్ళు, చెవుల ద్వారా ఆనందం కల్గిస్తాయి. చిత్రలేఖనం, శిల్పం – కంటి ద్వారా ఆనందం కలిగిస్తాయి. కాని నృత్యం కళ్లు, చెవులు ద్వారా మనసుకు చాలా ఆనందాన్ని కల్గిస్తుంది. నృత్యంలో సాహిత్యం (పాట), సంగీతం (గానం), అభినయం (శిల్పం), కోపం మొదలైనవి వ్యక్తపరచడం భంగిమ (చిత్రలేఖనం) ఉంటాయి. కనుక దీనిలో అన్ని లలితకళలూ ఉంటాయి. అందుకే నాకు నృత్యం అంటే చాలా ఇష్టం.
(సూచన : పై వానిలో ఏది ఇష్టమైనవారు దాని గురించి వ్రాయాలి.)

ప్రశ్న 3.
ఏదైనా ఒక పండుగ / దర్శనీయ స్థలం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

లేఖ
విజయవాడ,
xxxxx.

ప్రియమైన రాజేష్ కు,

నీ మిత్రుడు సతీష్ వ్రాయు లేఖ.
ఇక్కడందరం క్షేమంగా ఉన్నాం. అక్కడ మీరంతా క్షేమంగానే ఉన్నారనుకొంటున్నాను.
సంక్రాంతి సెలవులకు మామయ్య గారింటికి విశాఖపట్టణం వెళ్లాము. మా ఇంట్లో అందరం వెళ్లాము.

అక్కడ మా మామయ్య చాలా ప్రదేశాలు చూపించాడు. కనకమహాలక్ష్మి గుడి నాకు చాలా నచ్చింది. విశాఖ ” .. పట్టణానికి కనకమహాలక్ష్మి గ్రామదేవతట. గుడిలో అమ్మవారి విగ్రహంపైన మూయలేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటుందట. అదే ఆవిడకు సంతోషమట.

రామకృష్ణా బీచ్ కు వెళ్లాం. సముద్ర కెరటాలతో చాలా సేపు ఆడుకొన్నాం. పూర్తిగా తడిసిపోయాం . చాలామంది జనం వచ్చారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరం తెగతడిసిపోయాం . ఫోటోలు కూడా తీసుకున్నాం. అవన్నీ నీకు వాట్సాప్ లో పంపుతాను.

నువ్వు సెలవులలో ఎక్కడికి వెళ్లావో వ్రాయి. మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారాలని చెప్పు.

ఇట్లు,
నీ స్నేహితుడు,
సతీష్ వ్రాలు.

చిరునామా :
కె. రాజేష్, నెం. 12,
7వ తరగతి,
గాంధీ మున్సిపల్ హైస్కూల్,
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా.

భాషాంశాలు

అ) కింద గీతగీసిన పదానికి అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : మైత్రి ఉన్న వ్యక్తి ఎంతదూరంలో ఉన్నా దగ్గర ఉన్నట్లే లెక్క
మైత్రి : స్నేహం
ప్రతి విద్యార్థి తోటి విద్యార్థులతో స్నేహంగా ఉండాలి.

1. కళ మానవుని బాధను తాత్కాలికంగా తొలగిస్తుంది.
తాత్కాలికం = అప్పటికి మాత్రమే
సొంతవాక్యం : డబ్బు వలన అప్పటికి మాత్రమే సుఖం కలుగుతుంది.

2. సులోచనా నేను కూడా అమితంగా సంతోషించాము.
అమితంగా = ఎక్కువగా
సొంతవాక్యం : దేనినీ ఎక్కువగా తినకూడదు.

3. ముఖం చూడగానే అంతరాత్మ తేజం– తెలిసిపోతుంది.
తేజం = కాంతి
సొంతవాక్యం : విద్య వలన ముఖంలో తేజం పెరుగుతుంది.

4. నేను జీవితంలో సంకల్పించుకున్న కార్యాలు ఎక్కువగా ఉన్నాయి.
కార్యాలు = పనులు
సొంతవాక్యం : ఎన్ని ఆటంకాలు వచ్చినా మన పనులు మనం మానకూడదు.

5. సఫలం కాకపోయినా కూడా నిరుత్సాహపడను.
సఫలం = ఫలించడం
సొంతవాక్యం : పనిచేస్తే తప్పక ఫలించడం జరుగుతుంది.

AP Board 7th Class Telugu Solutions 10th Lesson ప్రియ మిత్రునికి

ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలను (పర్యాయపదాలు) గుర్తించి రాయండి.

1. పూర్వకాలంలో ఉత్తరాలు రాసేవారు. లేఖలు సమాచారం చేరవేయడానికి ఉపయోగిస్తారు. జాబురాసే అలవాటును అందరూ నేర్చుకోవాలి.
జవాబు:
ఉత్తరాలు, లేఖలు, జాబులు

2. శోకంతో మనసు వికలమవుతుంది. బాధ కలిగినపుడు ఏడుపు వస్తుంది.
జవాబు:
శోకం, ఏడుపు

3. సమాజంలో మంచి సేవచేసిన వారికి కీర్తి కలుగుతుంది. అలాంటి వారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి.
జవాబు:
కీర్తి, పేరు, ప్రఖ్యాతి

ఇ) కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.

1. కథ అ) కర్జము
2. ముఖము ఆ) విద్దె
3. కీర్తి ఇ) కత
4. విద్య ఈ) మొగము
5. కార్యము ఉ) సిరి
6. శ్రీ ఊ) కీరితి

జవాబు:

1. కథ ఇ) కత
2. ముఖము ఈ) మొగము
3. కీర్తి ఊ) కీరితి
4. విద్య ఆ) విద్దె
5. కార్యము అ) కర్జము
6. శ్రీ ఉ) సిరి

ఈ) కింద ఇచ్చిన పదాలకు వ్యతిరేక పదాలను జతపరచండి.

1. సుఖం అ) అస్పష్టమైన
2. సఫలం ఆ) శాశ్వతం
3. నిస్వార్థం ఇ) దుఃఖం
4. స్పష్టమైన ఈ) విఫలం
5. తాత్కాలికం ఉ) స్వార్థం

జవాబు:

1. సుఖం ఇ) దుఃఖం
2. సఫలం ఈ) విఫలం
3. నిస్వార్థం ఉ) స్వార్థం
4. స్పష్టమైన అ) అస్పష్టమైన
5. తాత్కాలికం ఆ) శాశ్వతం

ఉ) కింది పదాలకు సొంతవాక్య ప్రయోగం చేయండి.
ఉదా : మా ఊరి గుడిలోని ఉత్సవాలు తాత్కాలికంగా వాయిదా వేశారు.
అమితంగా, అనురాగం, సఫలం, విఫలం, ప్రతిబింబం, ఎండమావులు; ఆనందం, నిస్వార్థం, చింత, కల

1. అమితంగా – = ఎక్కువగా
సొంతవాక్యం : తల్లి పిల్లలను అమితంగా ప్రేమిస్తుంది.

2. అనురాగం = ప్రేమ
సొంతవాక్యం : పక్షులు, జంతువుల పట్ల అనురాగం పెంచుకోవాలి.

3. సఫలం = నెరవేరడం
సొంతవాక్యం : మంచి పనులెప్పుడూ సఫలం అవుతాయి.

4. విఫలం : నెరవేరకపోవడం
సొంతవాక్యం : దేవతలతో యుద్ధంలో ఎప్పుడూ రాక్షసులే విఫలం అయ్యారు.

5. ప్రతిబింబం = ప్రతిమ
సొంతవాక్యం : నూతిలో తన ప్రతిబింబాన్ని చూసి, సింహం మోసపోయింది.

6. ఎండమావులు = మృగతృష్ణలు
సొంతవాక్యం : ఎండమావులు చూసి మోసపోకూడదు.

7. ఆనందం = సంతోషం
సొంతవాక్యం : ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలి.

8. నిస్స్వార్థం = స్వార్థం లేకపోవడం
సొంతవాక్యం : గురువులు నిస్స్వార్థంతో విద్య నేర్పుతారు.

9. చింత = విచారం
సొంతవాక్యం : దేని గురించి చింత పెట్టుకోకూడదు.

10. కల = స్వప్నం
సొంతవాక్యం : కలలలో తేలిపోతే ఏ పనీ పూర్తికాదు.

AP Board 7th Class Telugu Solutions 10th Lesson ప్రియ మిత్రునికి

ఊ) కింది వరుసలో సంబంధంలేని పదాన్ని గుర్తించి సున్నా “O” చుట్టండి. వృత్తంలోని పదాన్ని ఉపయోగించు కొని వాక్యాలు రాయండి.

AP Board 7th Class Telugu Solutions 10th Lesson ప్రియ మిత్రునికి 2

ఋ) కింద ఇచ్చిన పదపట్టికను గమనించండి. వాటిలో పొడుపుకథలకు సంబంధించిన పదాలు ఉన్నాయి. వాటి ఆధారంగా కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 7th Class Telugu Solutions 10th Lesson ప్రియ మిత్రునికి 3

1. అక్కాచెల్లెళ్లు ఏడుస్తారు. అయితే దగ్గర చేరలేరు.
జవాబు:
కళ్లు

2. అరవైకన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్ళు తాగు.
జవాబు:
వల

3. మూత తెరిస్తే ముత్యాల పేరు.
జవాబు:
దంతాలు

4. ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెఱువునిండే.
జవాబు:
టెంకాయ

5. మా తాత రెండుబొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది. ఒకటి ఆడదు.
జవాబు:
తిరగలి

6. ఇల్లు, వాకిలితో కదులుతూ ఉంటుంది. వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది.
జవాబు:
నత్త

7. ఎన్ని కళ్ళు ఉన్నా రెండు కళ్ళతో చూసేది.
జవాబు:
నెమలి

8. ఒకటే అక్షరం, అదే లేకపోతే ఈ ప్రపంచంలో మనుష్యులే ఉండరు.
జవాబు:
స్త్రీ

వ్యాకరణాంశాలు

వాక్యం
అ) కింది వాక్యాలను చదవండి.

1. సుమేధ పాఠాన్ని చదువుతున్నది.
2. సాహిత్య పూలు కోస్తున్నది.
3. అరుణ వంట చేసింది.
4. సృజన నాట్యం చేసింది.
5. బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు.

పై వాక్యాలలోని కర్త – కర్మ – క్రియలను గుర్తించండి.

కర్త కర్మ క్రియ
1. సుమేధ పాఠం చదువుతున్నది
2. సాహిత్య పూలు కోస్తున్నది
3. అరుణ వంట చేసింది
4. సృజన నాట్యం చేసింది
5. బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు

పై ఉదాహరణల్లో కర్త – కర్మ – క్రియ ఉన్నాయి. అవి సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తున్నాయి. అలా ఇస్తే దానిని వాక్యం అంటారు.

యడాగమసంది

ఆ) కింది వాక్యాలు చదవండి.

1. సెలయేరు పక్కన భరద్వాజమహర్షి ఆశ్రమం ఉంది.
2. రవి స్నేహితుడు పుస్తకాలు ఇంటికి వచ్చియిచ్చాడు.
3. మాయమ్మ నాకు అన్నం పెట్టింది.
4. మాయయ్య నిన్న విజయవాడకు వెళ్లాడు.
5. మాయిల్లు మమతల పొదరిల్లు.

ఇ) గీత గీసిన పదాలను విడదీయండి.
ఉదా : సెలయేరు : సెల + ఏరు
1. వచ్చియిచ్చాడు = వచ్చి + ఇచ్చాడు
2. మాయమ్మ = మా + అమ్మ
3. మాయయ్య = మా + అయ్య
4. మాయిల్లు = మా + ఇల్లు

పై ఉదాహరణలో పూర్వ స్వరంగా ‘అ’ వుంది. పరస్వరంగా ‘ఏ’ ఉంది. సంధి జరిగే అవకాశం లేదు. అందుచేత పరస్వరానికి ముందుగా ‘య్’ ఆగమంగా వచ్చింది. కనుక ఇది ‘యడాగమ’ సంధి.

AP Board 7th Class Telugu Solutions 10th Lesson ప్రియ మిత్రునికి

ఈ) కింది పదాల మధ్య ‘య’ కారం చేర్చిరాయండి.

1. మంచి + అదను = మంచియదను
2. పది + ఆరువేల = పదియారువేలు
3. పాడి + ఆవు = పాడియావు
4. ఏలి + ఉన్న = ఏలియున్న
5. నా + అనుభవం = నాయనుభవం

ప్రాజెక్టుపని

గొప్ప వ్యక్తులు రాసిన లేఖలను సేకరించి, తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
గురజాడ, నెహ్రూ మొదలైన వారి లేఖలు. సుభాషితం కాదు

సభాషితం

పర హితము సేయు నెవ్వడు
పరమ హితుండగును భూత పంచకమునకుం
బర హితమె పరమధర్మము
పర హితునకు నెదురు లేదు పర్వేందుముఖీ !

భావం :
ఓ పార్వతీ ! ఎవరు ఇతరులకు సహాయం చేస్తారో వారు ప్రకృతికి ఇష్టమైన స్నేహితులవుతారు. ఇతరులకు సహాయం చేయడానికి మించిన ధర్మం లేదు. అలా సహాయం చేసేవారు లోకంలో కీర్తిమంతులౌతారు.

ఉపాధ్యాయులకు సూచనలు

1. సంజీవదేవ్ రాసిన ‘సంజీవదేవ్ లేఖలు’, ‘లేఖల్లో సంజీవదేవ్’ రచనలను పరిశీలించండి.
2. విద్యార్థులకు ప్రముఖులు రాసిన లేఖలు పరిచయం చేయండి.

కవి పరిచయం

AP Board 7th Class Telugu Solutions 10th Lesson ప్రియ మిత్రునికి 4
రచయిత పేరు : సూర్యదేవర సంజీవదేవ్
జననం : గుంటూరు జిల్లాలోని మంగళగిరి తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడిలో 3.7.1914న జన్మించారు.

రచనలు :
తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపారూపాలు మొదలైనవి.

ప్రత్యేకతలు :
వీరు కవి, రచయిత, తత్త్వవేత్త, చిత్రకారుడు. 14 భాషలు వ్రాయగలరు, చదవగలరు. ప్రకృతి ఆస్వాదన ఆయనకిష్టం. సమకాలీన ప్రపంచ మేధావులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. దేశవిదేశాలలోని చిత్రకారులు, కవులు, మేధావులు సంజీవదేవ్ కోసం తుమ్మపూడి గ్రామానికి వచ్చేవారు.

కఠిన పదాలకు అర్థాలు

1. ప్రియమిత్రులు ……… మీ సంజీవదేవ్
అర్థాలు :
ప్రియము = ఇష్టము
అత్యంత = చాలా ఎక్కువ
ఉత్తరం = లేఖ
సోదరి = చెల్లెలు లేక అక్క (తోబుట్టువు)
అమితం = ఎక్కువ
మించిన = ఎక్కువైన
సుదూరం= చాలాదూరం
దిగంతాలు = దిక్కుల చివరలు
అస్పష్టం = స్పష్టంకానిది
స్వప్నం = కల
అనుభూతి = అనుభవం
మైత్రి = స్నేహం
నిస్స్వార్ధత = స్వార్థం లేకపోవడం
మానవులు = మనుషులు
వర్ణము = రంగు, కులము
ఆత్మ = జీవాత్మ
ముఖము = వదనం
ఆకృతి = ఆకారం
ప్రతిబింబం = ప్రతిమ
దిగులు = స్వల్పమైన మానసిక బాధ
చింత= విచారం
నృత్యం = నాట్యం
చిత్రలేఖనం = బొమ్మలు గీయడం
తాత్కాలికం అశాశ్వతం
ఎండమావి = ఎడారిలో నీరు ఉన్నట్లు కనబడేవి (మృగతృష్ణ)

AP Board 7th Class Telugu Solutions 10th Lesson ప్రియ మిత్రునికి

పరిశీలించండి.

తుమ్మపూడి,
గుంటూరు జిల్లా,
522330.

డా|| సంజీవదేవ్, D.Lit.,
21.11.89.
ప్రియమిత్రులు ఆచార్యజీ,

అందినాయి మీ ఉత్తరం, జ్ఞాపిక’ కవితా, సంతోషం. అమ్మాయి పేరు “మానసరవళి” అయినందుకు ఆనందం. బాగున్నది. పేరుకు తగినట్లుగా ఆమె రాణించగలదని ఆకాంక్ష. మరోసారి మానసరవళికి మా శుభాకాంక్షలు తెలుపుచున్నాము. తనయతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటున్నందుకు ఆహ్లాదం. ఆరోగ్యంగా ఉండటం మాత్రమే చాలదు, ఆనందంగా కూడా ఉండాలి. అయితే, ఆరోగ్యం లేనిది ఆనందం కూడా జనించదు.

ఇక మీ కవిత విషయం . నూతన భావాలతో, అందుకు తగిన పదాలతో మీ కవిత కమనీయ కాంతితో మధుర సరాగాన్ని వెదజల్లుతోంది. ఆనందాన్ని, ఆలోచనను కూడా సమానంగా పంచిస్తూంది అది !

కవిగా జీవించటం మంచిదే కానీ, దానికి తోడు రవిగా కూడా ప్రకాశించాలి. ఆ ప్రకాశంలో స్వల్పంగా చీకటి మరకలున్నా భయపడాల్సిన అవసరం లేదు. స్వల్పంగా అంధకార బిందువులు లేని పూర్ణ ప్రకాశాన్ని మనిషి భరించలేడు. నీడలేని కాంతిలో శాంతి కొంత వెలవెలబోతుంది. అందుకే light and shade కావాలి కొరత గల పూర్ణత్వం కావాలి. Shadow and substance కావాలి.

Light and shade మధ్య జీవితం ఈ పల్లె పరిసరాల్లో నలుపు తెలుపుగా సాగిపోతూనే ఉంది. చల్లచల్లగా, వెచ్చవెచ్చగా శీతాకాల శోభ శోభాయమానంగా నిరంతరం అనంతాన్ని ప్రదర్శిస్తూనే ఉంది.

మీ
సంజీవదేవ్.

సూచన :
పై లేఖను పరిశీలించండి. లేఖల ఆవశ్యకతను గురించి చర్చించండి.
జవాబు:
పై లేఖను పరిశీలిస్తే చాలా విషయాలు తెలిశాయి. సంజీవదేవ్ గారి చేతివ్రాత గురించి తెలిసింది. ఆయనకు ఎందరో ఉత్తరాలు వ్రాసేవారని తెలిసింది. ఉత్తరాలు వ్రాసిన వారందరికీ ఓపికగా జవాబులు వ్రాసేవారు. వారు తనకు వ్రాసిన లేఖలను నిర్మొగమాటంగా విశ్లేషించేవారు. సలహాలు చెప్పేవారు. బాగున్న విషయాలను మెచ్చుకొనే వారని తెలిసింది. ఇది 1989లో నవంబరు, 21న వ్రాసిన లేఖ. అది జాగ్రత్త చేసినందువలన లేఖలోని విషయాలు మనకు తెలిశాయి. ఇలాగే లేఖల వలన చాలా ప్రయోజనాలున్నాయి.

AP Board 7th Class Telugu Solutions 9th Lesson హితోక్తులు

SCERT AP Board 7th Class Telugu Guide Answers 9th Lesson హితోక్తులు Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 9th Lesson Questions and Answers హితోక్తులు

7th Class Telugu 9th Lesson హితోక్తులు Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 7th Class Telugu Solutions 9th Lesson హితోక్తులు 1

ప్రశ్న 1.
చిత్రాన్ని గమనిస్తే మీకు ఏమి అర్థమయ్యింది?
జవాబు:
చిత్రంలో ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఉన్నారు. అది ఒక తరగతి గది. ఆదర్శవంతమైన తరగతి గది. విద్యార్థులు అల్లరి చేయకుండా క్రమశిక్షణతో కూర్చొన్నారు. ఉపాధ్యాయుడు చెప్పేది శ్రద్ధగా వినాలని కూర్చొన్నారు. విద్యార్థులందరూ ఏకరూప దుస్తులు ధరించారు. ఉపాధ్యాయుడు కూడా పాఠం చెప్పడానికి సిద్ధమౌతున్నాడు.

ప్రశ్న 2.
మీకు తెలిసిన మహనీయుల హితోక్తులు కొన్నింటిని చెప్పండి. వ్రాయండి)
జవాబు:

  1. ప్రార్థించే పెదవులకన్నా సేవించే చేతులు మిన్న – మథర్ థెరిస్సా
  2. చెడు వినవద్దు. చెడు కనవద్దు. చెడు మాట్లాడవద్దు – గాంధీజీ
  3. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో – కందుకూరి వీరేశలింగం పంతులుగారు.
  4. సత్యం పలుకు ధర్మంగా ప్రవర్తించు – ఉపనిషత్తు
  5. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ – ఉపనిషత్తు
  6. మనిషికి మంచి మనసుండాలే కాని, నానా విధాల సంపదలూ వాటంతట అవే వస్తుంటాయి – తులసీదాసు
  7. తెలివైనవారు తమ మాటలతో విలువైన కాలాన్ని హరించరు. వాళ్లెప్పుడూ కాలాన్ని కాపాడటానికి మాటల పొదుపు పాటిస్తారు. – బ్రూస్ బర్టన్
  8. ఎంతటి కాళరాత్రిలోనైనా గంటకి అరవై నిమిషాలే. కనుక మనసు చతికిలబడకూడదు. – ఎడ్మండ్ బర్క్
  9. రేపటిది ఈ రోజు. ఈ రోజు చేయవలసినది ఇప్పుడే చేయాలి – కబీరు
  10. మనం ఓ మనిషి గురించి తెలుసుకోవాలంటే, అతను దూరంగా పెట్టే వ్యక్తులను గురించి తెలుసుకోవాలి. – జోసఫ్. పి. సాలక్

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
దివ్యాంగుల పట్ల ఎలాంటి మానవత్వం చూపాలి?
జవాబు:
దివ్యాంగులను హేళన చేయకూడదు. వారి బలహీనతలను చూసి నవ్వకూడదు. అనుకరించకూడదు. వారికి అన్ని విధాలుగా సహాయం చేయాలి. కాళ్లు సరిగా లేక నడవడానికి ఇబ్బందిపడేవారికి చేయూత నివ్వాలి. అంధులకు దారి చూపాలి. ఈ విధంగా వారికి అడుగడుగునా సహాయం అందిస్తూ అండగా నిలబడాలి. ధైర్యం చెప్పాలి.

AP Board 7th Class Telugu Solutions 9th Lesson హితోక్తులు

ప్రశ్న 2.
‘పంచతంత్ర కథలు’ ఎలాంటి నీతిని బోధించాయి?
జవాబు:
పంచతంత్ర కథలు చక్కటి నీతులను బోధించాయి. దీనిలో

1) మిత్రభేదం :
మిత్రులని విడదీయడం ద్వారా కావలసింది సాధించడం ఎలాగో ఈ కథలలో ఉంటుంది.

2) మిత్రలాభం :
మిత్రులని సంపాదించడం. దాని ద్వారా కలిగే ప్రయోజనాలు ఈ కథలలో ఉంటుంది.

3) కాకోలూకీయం :
కాకులు, గుడ్లగూబలు ప్రధాన పాత్రలుగా ఈ కథలు నడుస్తాయి.

4) లోభ ప్రణాశం :
ఈ కథలలో సంపదలను కోల్పోవడానికి రకరకాల పరిస్థితులు వివరించబడతాయి.

5) అసంప్రేక్ష్యకారిత్వం :
బుద్దిహీనతతో చెడు చేయాలని కోరడం, దాని పర్యవసానాలు ఉంటాయి.

పై వానిలో మొదటి నాలుగు భాగాలలో అంటే మిత్రభేదం, మిత్రలాభం, కాకోలూకీయం, లోభ ప్రణాశములలో జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా కథలు ఉంటాయి. 5వ దైన అసంప్రేక్ష్యకారిత్వంలో మాత్రం మానవులు ప్రధాన పాత్రలుగా కథలుంటాయి.

ఈ కథలన్నీ లోకజ్ఞానం కల్గించేవి. మానవుడు క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడాలంటే ఎలా ప్రవర్తించాలో వివరిస్తాయి. ఈ కథలు చదివితే కచ్చితంగా సమాజంలో ఎలా బ్రతకాలో తెలుస్తుంది.

ప్రశ్న 3.
మీకు తెలిసిన గొప్ప శతక కవుల పేర్లు కొన్ని చెప్పండి. (వ్రాయండి)
జవాబు:

  1. పోతన – భాగవతము
  2. పక్కి అప్పల నరసయ్య – కుమార శతకం
  3. మారద వెంకయ్య – భాస్కర శతకం
  4. పోతులూరి వీరబ్రహ్మం – కాళికాంబ సప్తశతి
  5. గువ్వల చెన్నడు – గువ్వలచెన్న శతకం
  6. ఏనుగు లక్ష్మణకవి – సుభాషిత రత్నావళి
  7. చుక్కా కోటి వీరభద్రమ్మ – నగజా శతకం
  8. గద్దల శాంయూల్ – హితోక్తి శతకం

ప్రశ్న 4.
కింది అపరిచిత పద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
తే॥ ఒక్క రోజీవు వీడుల సూడ్వకున్న
తేలిపోవును మా పట్టణాల సొగసు !
బయటపదునమ్మ ! బాబుల బ్రతుకులెల్ల
ఒక క్షణమ్మీవు గంప క్రిందకును దింప.

ప్రశ్నలు – జవాబులు :
అ) ఈ పద్యం ఎవరి గురించి చెబుతోంది?
జవాబు:
ఈ పద్యం పారిశుద్ధ్య కార్మికుల గురించి చెబుతోంది.

ఆ) పట్టణాల అందానికి కారణం ఏమిటి?
జవాబు:
వీథులను శుభ్రంగా ఊడ్వడమే పట్టణాల అందానికి కారణం.

ఇ) పట్టణపు అందాన్ని చూసి గర్వపడేది ఎవరు?
జవాబు:
పట్టణపు అందాన్ని చూసి గర్వపడేది పరిపాలకులు.

ఈ) ‘నిముషం’ అనే అర్థాన్ని కలిగిన పదం ఏది?
జవాబు:
పై పద్యంలో ‘నిముషం’ అనే అర్థాన్ని కలిగిన పదం క్షణము.

వ్యక్తీకరణ సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి గురించి రాయండి.
జవాబు:
కవి పేరు : రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
తల్లిదండ్రులు : అలివేలు మంగమ్మ, కృష్ణమాచార్యులు గార్లు
జననం : అనంతపురం జిల్లా, కంబదూరు మండలం, రాళ్లపల్లి గ్రామంలో 23. 1. 1893న జన్మించారు.

రచనలు :
సారస్వతాలోకము, అన్నమాచార్య కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం, నిగమశర్మ అక్క నాచన సోముని నవీన గుణములు, రాయలనాటి రసికత మొదలైనవి ప్రసిద్ధ రచనలు.

బిరుదులు :
గానకళాసింధు, సంగీత కళారత్న; కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి 1970లో ఫెలోషిప్, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.

ప్రత్యేకతలు :
రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ’ పాట రచించారు. తండ్రి గారి వద్ద సంస్కృతం, తెలుగు, కన్నడ భాషలు నేర్చుకొన్నారు. తల్లిగారు సంగీత గురువులు, ఆమె వద్ద సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో కీర్తనలు, పాటలు నేర్చుకొన్నారు. మేనమామ ప్రోత్సాహంతో ఫిడేలు కూడా నేర్చుకొన్నారు.

ప్రశ్న 2.
మంచి వారితో స్నేహం ఎలాంటిది?
జవాబు:
మంచి వారితో స్నేహం రాతిమీద గీసిన గీత వంటిది. ఎప్పటికీ పోదు. ఎట్టి పరిస్థితులలోనూ ఆ స్నేహం చెడిపోదు. ఎన్ని వివాదాలు వచ్చినా ఆ స్నేహం పాడవ్వదు.

ప్రశ్న 3.
లోభితనం పనికిరాదని కవి ఎందుకు అన్నాడు?
జవాబు:
లోభితనం అంటే అవసరమైనచోట కూడా ఖర్చు పెట్టకపోవడం. అవసరమైన ఖర్చులను మానేస్తే అనవసరమైన ఇబ్బందులు పడాలి. ఉదాహరణకు డబ్బులు ఖర్చైపోతాయని సరైన ఆహారం తినకపోతే పోషకాహార లోపం వలన అనేక అనారోగ్యాలు వస్తాయి. ఆ అనారోగ్యాలను మొదటే గుర్తించి, వైద్యుని వద్దకు వెళితే, తక్కువ ఖర్చుతో తగ్గుతాయి. డబ్బులు ఖర్చేతాయని వైద్యం చేయించుకోకపోతే ప్రాణం మీదకి వస్తుంది. అప్పుడు లక్షలు ఖర్చౌతాయి. అందుకే పెద్దలు ‘లోభికి ఖర్చెక్కువ’ అన్నారు. కాబట్టే కవిగారు లోభితనం పనికి రాదన్నారు.

AP Board 7th Class Telugu Solutions 9th Lesson హితోక్తులు

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
రాహువు నోటిలో చిక్కిన చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడని కవి ఎందుకు అభిప్రాయపడ్డాడు?
జవాబు:
రాహువు నోటిలో చిక్కినా చంద్రుడు అమృత కిరణాల్ని కురిపిస్తాడు. నిజానికి చంద్రునికి అది మరణావస్థ, అయినా అమృతాన్ని కురిపిస్తున్నాడు. అంటే ఇతరులకు మంచి చేయాలి అనేది చంద్రుని పద్ధతి. తనకు మరణం వస్తున్నా తన మంచి పద్ధతిని తాను విడిచి పెట్టలేదు. అలాగే గొప్పవారు లోక క్షేమం కోసం తమ బాధల్ని లెక్క చేయరు. చిట్టచివరి క్షణం వరకూ ఇతరులకు ఉపకారాలు చేస్తూనే ఉంటారు. తమకు ప్రాణం పోయే స్థితిలో కూడా లోకక్షేమాన్నే కోరుకొంటారు. లోకం మేలు కోసమే తపిస్తారు. అది మంచివాళ్ల లక్షణం. అందుకే కవిగారు చంద్రుడి గురించి చెప్పారు.

ప్రశ్న 2.
మనిషికి ‘ఆత్మాభిమానం’ ఎందుకు ఉండాలి?
జవాబు:
మనిషికి ఆత్మాభిమానం చాలా అవసరం. ఆత్మాభిమానం అంటే తనపై తనకు గౌరవం. ఆత్మాభిమానం కలవారు ఎవరి దగ్గరా దేనికీ ఎప్పుడూ చేయి చాపరు. ప్రాధేయపడరు. తమ పనిని తాము చేసుకొంటారు. దేన్నైనా సాధిస్తారు. ఎంత కష్టాన్నైనా భరిస్తారు. కానీ, ఇతరులకు లోకువకారు. గౌరవంగా జీవిస్తారు. ఆత్మాభిమానం కలవారు మోసం చేయరు. అబద్దాలాడరు. ఎవరినీ నొప్పించరు. ఇతరులు బాధపడేలా ప్రవర్తించరు. ఉచితంగా దేనినీ ఆశించరు. ఎవరైనా ఇచ్చినా తీసుకోరు. అటువంటి ఆత్మాభిమానం కలవారి వల్లనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం సుసంపన్నం అవుతుంది.

భాషాంశాలు

అ) పాఠం ఆధారంగా అడిగిన పదాలకు ఎదురుగా అర్థాలను ఊహించి రాయండి.
గహ్వరము, కిరణములు, సజ్జనుడు, స్నేహము, సంపద, చివరి, కొంచెం, దారి

1. మైత్రి = స్నేహము
2. సిరి = సంపద
3. కరములు = కిరణములు
4. మంచివాడు = సజ్జనుడు
5. సుంత = కొంచెం
6. తెరువు = దారి
7. గుహ = గహ్వరము
8. అంత్య = చివరి

ఆ) కింది పదాలకు పర్యాయపదాలు పదవిజ్ఞానంలో వెతికి రాయండి.

1. స్నేహము = నేస్తం, మిత్రుడు
2. మనిషి = నరుడు, మానవుడు
3. పుడమి = భూమి, భువి
4. సంపద = ఐశ్వర్యం, ధనం
5. మూర్ఖుడు = అవివేకి, అజ్ఞాని
6. ధనం = డబ్బు, సిరి
7. యధార్థం = సత్యం, నిజం

వ్యాకరణాంశాలు

అ) కింది వాక్యాలను గమనించండి.

1. రామలక్ష్మణులు రాక్షసులఁజూసిరి.
2. రాజు రోజూ బడికి రాఁగలడని అనుకుంటున్నాను.
3. అర్జునుడు కర్ణుని ప్రాణముఁదీసెను.
4. ప్రవరుడు ఆకులఁబసరు పూసుకొని హిమాలయాలకు వెళ్ళాడు.

గీత గీసిన పదాలను విడదీయండి.
ఉదా : రాక్షసులఁజూసిరి = రాక్షసులన్ + చూసిరి

1. రాఁగలడని = రాస్ + కలడు + అని
2. ప్రాణముఁదీసెను = ప్రాణమున్ + తీసెను
3. ఆకులఁబసరు = ఆకులన్ + పసరు

పై ఉదాహరణల్లో పూర్వపదం చివర ‘S’ అనే ద్రుతము ఉన్నది. పరపదంలో క-చ-ట-త-ప అనే పరుషాలు ఉన్నాయి. సంధి జరిగిన తరువాత క-గ, చ-జ, ట-డ, త-ద, ప-బ గా మారడాన్ని గమనించవచ్చు. ఇలా పరుషముల స్థానంలో సరళములు ఆదేశంగా వచ్చాయి. కావున ఇది సరళాదేశ సంధి అవుతుంది.
ఆపుడు : రాక్షసులన్ + జూచిరి
రాన్ + కలడని
ప్రాణమున్ + దీసెను
ఆకులన్ + బసరు – అని ఏర్పడ్డాయి కదా !

పైన వచ్చినవి ‘ఆదేశ సరళములు’ అని మీకు తెలుసు కదా ! అలా ఆదేశంగా వచ్చిన సరళాలకు ముందు ద్రుతము(న్) ఉంది కదా ! ఇప్పుడది బిందు, సంశ్లేషలుగా మారుతుంది. బిందువు రెండు రకాలు అవి.
1) అర్ధబిందువు (c), 2) పూర్ణ బిందువు (0) సంశ్లేష అంటే నకారపు పొల్లు (ద్రుతము) పక్కనున్న హల్లుతో కలిసి పోతుంది. ఈ 3 మార్పులు రాకుండా అలాగైనా ఉండిపోతుంది. క్రింద నిచ్చిన రూపాలను గమనించండి.
AP Board 7th Class Telugu Solutions 9th Lesson హితోక్తులు 2

ఆ) కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
ఉదా : చేయుచుండగ = చేయుచున్ + ఉండగా – ఉకార వికల్ప సంధి

1. గొన్ననేమి = కొన్నను + ఏమి – ఉత్వసంధి
2. వానికెపుడు = వానికి + ఎపుడు – ఇత్వసంధి
3. సజ్జనాళి = సజ్జన + ఆళి – సవర్ణదీర్ఘ సంధి
4. అళించుచూడ = అళించు + చూడ – గసడదవాదేశ సంధి
5. నోటనెట్లు = నోటను + ఎట్లు – ఉత్వసంధి

షష్ఠీ విభక్తి

ఇ) కింది పట్టికను గమనించండి. జతపరచండి.
AP Board 7th Class Telugu Solutions 9th Lesson హితోక్తులు 3

పై పట్టికలోని పదాలను ఉపయోగించి వాక్యాలు తయారు చేయండి.
ఉదా : 1. సూర్యుని యొక్క కిరణాల వల్ల పద్మాలు విచ్చుకున్నాయి.
2. భీముని యొక్క భుజ బలము గొప్పది.
3. నా యొక్క పుస్తకములు ఎక్కడ ఉన్నాయని అంబేడ్కర్ అన్నాడు.
4. దశరథుని యొక్క కుమారులు నలుగురు.
5. రాజు యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
6. చంద్రుని యొక్క కాంతికి కలువలు వికసించాయి.

పై వాక్యాల్లో పదాల మధ్యన చేరిన ‘యొక్క’ అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది. ఇలా వాక్యంలో పదాల మధ్య చేరే కిన్-కున్-యొక్క-లోన్-లోపలన్ అనే ప్రత్యయాలను షష్ఠీ విభక్తి అంటారు. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు ‘యొక్క’, జాతి, గుణాల గురించి తెలిపేటప్పుడు ‘లో-లోపల’, క్రియతో సంబంధాన్ని కలుగచేసేటప్పుడు ‘కి’ ప్రత్యయాలను ఉపయోగించాలి.

AP Board 7th Class Telugu Solutions 9th Lesson హితోక్తులు

ఈ) కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి.
ఉదా : మానవ మానసము = మానవుని యొక్క మానసము
1. కోకిలశాబకము= కోకిల యొక్క శాబకము
2. కింకిణీ ధ్వనులు = కింకిణి యొక్క ధ్వనులు
3. సూర్యాత్మజ = సూర్యుని యొక్క ఆత్మజ

ప్రాజెక్టుపని

ప్రశ్న 1.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి రచనలు సేకరించండి. పరిశీలించండి.
జవాబు:
1941లో పెనుగొండలో జరిగిన రాయలసీమ మహాసభలలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు స్వయంగా రచించి, ఆలపించిన పెనుగొండ గేయం.

చనిన నాళుల తెలుగుకత్తులు
సానవెట్టిన బండ ఈ పెనుగొండ కొండ
రంధ్రముల ప్రవహించు శత్రుల
రక్తధారల త్రావిత్రేచిన
ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్ముల కరితినీలపు దండ
ఈ పెనుగొండ కొండ.
వెరపు లెరుగని బిరుదు నడకల
విజయనగరపు రాచ కొడుకులు
పొరల బోయగ కరడు కట్టిన పచ్చినెత్తురు కొండ
ఈ పెనుగొండ కొండ.
తిరుమలేశుని కీర్తి తేనెలు,
బెరసిదించిన కాపు కవనపు నిరుపమ .
ద్రాక్షా రసంబులు నిండి తొలికెడు కుండ ఈ
పెనుగొండ కొండ……

ప్రశ్న 2.
తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కవుల చిత్రాలు సేకరించండి. వాటిని తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:

సభాషితం

తే.గీ. || వెలది మాతా పితృ పరాయణులకు స్వర్గ
లోక గోలోకములు బ్రహ్మలోక మైన
గృచ్ఛములు గావు సూవె తర్పితుల వెంట
దల్లిదండ్రుల వెంట సాధ్యము త్రిలోకి.

తాత్పర్యం :
సీతా ! తల్లిదండ్రుల్ని సేవించే బిడ్డలకు స్వర్గలోకం, గోలోకం, బ్రహ్మలోకం కూడా అందలేదనే బాధ ఉండదు. తల్లిదండ్రులను సేవించడం తోటే త్రిలోకాలు సాధ్యమవుతాయి.

ఉపాధ్యాయులకు సూచనలు

ప్రశ్న 1.
రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ స్వర పరచిన అన్నమయ్య సంకీర్తనలను సేకరించండి.
జవాబు:
1. పల్లవి : అలరులు గురియగ – నాడెనదే
అలకల గులుకుల – నలమేలు మంగ ||అలరు||

చరణము :
1. అరవిర సొబగుల – నతివలు మెచ్చగ
అరతెర మరుగున – నాడెనదే
వరుసగ పూర్వదు – వాళపు తిరుపుల
హరిఁగరగింపుచు – నలమేలు మంగ ||అలరు||

2. మట్టపు మలపుల – మట్టెల కెంపుల
తప్పెడి నడపుల – దాచెనదే
పెట్టిన వజ్రపు – పెండెపుదళుకులు
అట్టిటు చిమ్ముచు – నలమేలు మంగ ||అలరు||

3. చిందుల పాటల – శిరిపాటల యాటల
అందెల మ్రోతల – నాడెనదే
కందువ తిరువెం – కటపతి మెచ్చగ
అందపు తిరువుల – నలమేలు మంగ ||అలరు||

2. పల్లవి : ఆకటివేళల నలపైన వేళలను
వేకువ హరినామమే దిక్కు మతిలేదు ||ఆకటి||

చరణము :
1. కొఱమాలి ఉన్నవేళ కులము చెడిన వేళ
చెఱవడి వొనరులచేఁ జిక్కిన వేళ
వొఱపైన హరినామ మొక్కటే గతిగాక
మఱచి తప్పినవైన మతిలేదు తెరగు ||ఆకటి||

2. ఆపద వచ్చిన వేళ యారడిఁ బడిన వేళ
పాపపు వేళ భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతిగాక
మాపుదాకా బొరలిన మరిలేదు తెలుగు ||ఆకటి||

3. సంకెలఁ బెట్టిన వేళ చంపఁ బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గలిగాక
మంకు బుద్ది బొరలిన మరిలేదు తెరగు ||ఆకటి||

ప్రశ్న 2.
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ రాసిన వ్యాసాలు సేకరించండి.

కవి పరిచయం

AP Board 7th Class Telugu Solutions 9th Lesson హితోక్తులు 4

కవి పేరు : రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
తల్లిదండ్రులు : అలివేలు మంగమ్మ, కృష్ణమాచార్యులు గార్లు
జననం : అనంతపురం జిల్లా, కంబదూరు మండలం, రాళ్లపల్లి గ్రామంలో 23.1. 1893న జన్మించారు.

రచనలు :
సారస్వతాలోకము, అన్నమాచార్య కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం, నిగమశర్మ అక్క నాచన సోముని నవీన గుణములు, రాయలనాటి రసికత మొదలైనవి ప్రసిద్ధ రచనలు.

బిరుదులు :
గానకళా సింధు, సంగీత కళారత్న, కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి 1970లో ఫెలోషిప్, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.

ప్రత్యేకతలు :
రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ పాట రచించారు. తండ్రి గారి వద్ద సంస్కృతం, తెలుగు, కన్నడ భాషలు నేర్చుకొన్నారు. తల్లిగారు సంగీత గురువులు, ఆమె వద్ద సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో కీర్తనలు, పాటలు నేర్చుకొన్నారు. మేనమామ ప్రోత్సాహంతో ఫిడేలు కూడా నేర్చుకొన్నారు.

పద్యాలు – ప్రతి పదార్థాలు – భావాలు

1. ఆ.వె. నీటిమీది వ్రాత నిజము దుర్జనమైత్రి,
చేయుచుండఁగనె నశించుచుండు
అదియె సజ్జనాళియందుఁజల్పితి మేని
రాతగీచినట్టి గీత గాదె?
అర్థాలు :
దుర్జన మైత్రి = చెడ్డవారితో స్నేహం
నిజము = నిజంగా
నీటిమీది వ్రాత = నీటిమీద వ్రాసిన అక్షరాల వంటిది
చేయుచుండగనె = స్నేహం చేస్తుంటేనే
నశించుచుండు = నశించిపోతుంది
అదియే = ఆ స్నేహమే
సజ్జనాళియందున్ = మంచివారితో
సల్పితిమి + ఏని = చేసినట్లయితే
రాతిమీది = రాతిమీద
గీచినట్టి = గీసినటువంటి
గీతగాదె = గీత వలె (శాశ్వతంగా) ఉంటుంది

భావం :
చెడ్డవాడితో స్నేహం నీటిమీద వ్రాత వంటిది. ఆ స్నేహం చేస్తుంటేనే నీటి మీది వ్రాతలా నశిస్తుంది. అదే స్నేహాన్ని మంచివారితో చేస్తే ఱతిమీద గీతలాగా శాశ్వతంగా ఉంటుంది.

AP Board 7th Class Telugu Solutions 9th Lesson హితోక్తులు

2. ఆ.వె. లోభివాని చేతిలో సిరి యెంతగా
వెలయుచున్న సుంత ఫలములేదు
తెరువు నడుచు వేళఁగఱకు వేసవి యెండ
మాడు వానికిఁ దననీడవోలె
అర్థాలు :
లోభివాని = ఖర్చు పెట్టనివాని
చేతిలో = చేతిలో ఉన్న
సిరి = డబ్బు (సంపద)
ఎంతగా = ఎంత ఎక్కువగా
వెలయుచున్న = ప్రకాశిస్తున్నా
తెరువు = మార్గంలో
నడుచువేళ = నడుస్తున్న సమయంలో
కఱకు = కఠినమైన, దట్టమైన
వేసవి ఎండ = వేసవికాలపు ఎండలో
మాడువానికి = మాడిపోతున్న వానికి
తన నీడవోలె = అతని నీడవలనే
సుంత = కొంచెం కూడా
ఫలములేదు = ప్రయోజనం లేదు

భావం :
దట్టమైన వేసవికాలపు ఎండలో ప్రయాణించే వాడికి తన నీడ వలన ప్రయోజనం లేనట్లే లోభి వాని చేతిలోని డబ్బు వలన కూడా ఏ ప్రయోజనం ఉండదు.

3. ఆ.వె. ఎంత యలుకగొన్న నేమి సత్పురుషుల
నోటనెట్లు చెడ్డమాట వెడలు
రాహువదన గహ్వరమున నున్నను జంద్రు మీది
కరములమృతరసమె కురియుఁగా గాదె !
అర్థాలు :
రాహు = రాహువు యొక్క
వదన = ముఖమునందలి
గహ్వరమున = గుహలో (నోటిలో)
ఉన్నను = చిక్కినా
చంద్రు = చంద్రుని యొక్క
కరములు = కిరణాలు
అమృతరసమె = అమృత వర్షాన్ని
కురియుగాన్ + కాదె = కురిపిస్తాయి కదా
అలాగే = అలాగే
ఎంత అలుకన్ + కొన్నన్ + ఏమి = ఎంత కోపం వచ్చినా
సత్పురుషులు = మంచివారి
నోటన్ = నోటి నుండి
ఎట్లు = ఏ విధంగా
చెడ్డమాట = చెడుమాట
వెడలు = వస్తుంది? (రాదు కదా !)

భావం :
రాహువు నోటిలో చిక్కిన చంద్రుడు తన కిరణాలతో అమృతవర్షం కురిపించినట్లుగా గొప్పవారికి కోపం వచ్చినా వారి నోటి నుండి మంచి మాటలే వస్తాయి కాని, చెడ్డమాటలు రావు.

AP Board 7th Class Telugu Solutions 9th Lesson హితోక్తులు

4. ఆ.వె. మానవంతుఁడై నవాని మనం బంత్య
దశలఁగూడ నున్నతంబె యగును
మునిగిపోవు వేళలను సూర్యకిరణముల్
మీఁది ప్రక్కఁగాదె మెఱయుచుండు !
అర్థాలు :
మానవంతుడైన = పౌరుషవంతుడైన
వాని = వాని యొక్క
అంత్యదశలన్ = చివరిదశలో
కూడ = కూడా
మనంబు = మనస్సు
ఉన్నతంబె = ఉన్నతంగానే
అగును = ఉంటుంది (ఎలాగంటే)
మునిగిపోవు వేళలను= అస్తమించే సమయంలో కూడా
సూర్యకిరణముల్ = సూర్యకిరణాలు
మీది= పైన,
ప్రక్కన్ = ప్రక్కలను
మెఱయుచుండు = కాంతులను వెదజల్లుతాయి
కాదె = కాదా !

భావం :
పౌరుషవంతుని చివరి దశలో కూడా అతని మనస్సు ఉన్నతంగానే ఉంటుంది. ఎలాగంటే అస్తమించే సూర్యుడు కూడా అన్ని వైపులకు తన కాంతులను వెదజల్లుతాడు కదా !

AP Board 7th Class Telugu Solutions 8th Lesson ఎద

SCERT AP Board 7th Class Telugu Guide Answers 8th Lesson ఎద Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 8th Lesson Questions and Answers ఎద

7th Class Telugu 8th Lesson ఎద Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 7th Class Telugu Solutions 8th Lesson ఎద 1

ప్రశ్న 1.
చిత్రంలో ఏమేమి గమనించావు?
జవాబు:
చిత్రంలో కొండలు, చెట్లు, వాటి దిగువున గుడిసెలు గమనించాను. అక్కడ రకరకాల మనుషులను, జంతువులను, పక్షులను కూడా గమనించాను.

ప్రశ్న 2.
చిత్రంలోని వారు ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలోని పిల్లలు కొంతమంది పాఠశాలకు వెడుతున్నారు. కొంతమంది చదువుకొంటున్నారు. ఒకామె వంట వండుతోంది. కొంతమంది స్త్రీలు గంపలతో సరుకులు మోసుకొని వెడుతున్నారు. చిత్రంలో అందరూ స్త్రీలు, చిన్నపిల్లలే ఉన్నారు. అందరూ ఏవో పనులు చేసుకొంటున్నారు.

AP Board 7th Class Telugu Solutions 8th Lesson ఎద

ప్రశ్న 3.
ప్రకృతితో సంబంధం కలిగి జీవనం సాగిస్తున్నవారి గురించి చెప్పండి.
జవాబు:
ప్రకృతితో దగ్గరి సంబంధం కలిగి, ప్రకృతిలో కలిసిపోయి గిరిజనులు జీవిస్తారు. వారు అడవులలోని కొండచీపుర్లు, షీకాయి, చింతపండు మొదలైనవి సేకరించి అమ్ముకొని జీవిస్తారు. వారికి మాయామర్మం తెలియదు. చాలా అమాయకులు.

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
సకాలంలో వర్షాలు పడనపుడు రైతులు చూసే ఎదురుచూపులకు గల కారణాలను మీ మాటల్లో చెప్పండి. . (వ్రాయండి)
జవాబు:
సకాలంలో వర్షాలు పడితే పంటలు పండుతాయి. అప్పులు తీరతాయి. తిండికి లోటుండదు. వర్షాలు పడకపోతే దుక్కి దున్నిన పొలంలో విత్తనాలు చల్లలేరు. మొలకలు రావు. పంటలు పండవు. అందుకే రైతులు వర్షం కోసం విపరీతమైన ఆత్రుతతో ఎదురుచూస్తారు. ఏ కాలంలో చేయవలసిన పని అప్పుడే చేయాలి. వర్షాలు ఆలస్యమైతే అదను దాటిపోతుంది. అదను దాటితే విత్తనాలు చల్లినా పంట దిగుబడి తగ్గిపోతుంది.

ప్రశ్న 2.
పోలమ్మ వర్షం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నదో మీ మాటల్లో చెప్పండి. (వ్రాయండి)
జవాబు:
పోలమ్మ పొలంలో ధాన్యం చల్లింది. వర్షం వస్తేనే అవి మొలకెత్తుతాయి. వరిచేను తయారౌతుంది. వర్షం లేక గోగు మొక్కలు కూడా వాడిపోతున్నాయి. వర్షం వస్తే అవీ బ్రతుకుతాయి. అందుకే పోలమ్మ వర్షం కోసం ఎదురు చూస్తోంది.

ప్రశ్న 3.
పోలమ్మకు నిద్ర పట్టకపోవడానికి గల కారణాన్ని సొంతమాటల్లో చెప్పండి. (వ్రాయండి)
జవాబు:
పోలమ్మకు గతమంతా గుర్తుకు వచ్చింది. అడవులు తగ్గిపోవడం వలన వర్షాలు రావని అందరూ అనే మాటకు కలవరపడింది. తమ గ్రామం రూపురేఖలు మారిపోవడం గుర్తుకు వచ్చింది. తను ప్రేమించడం, ఇద్దరు పిల్లలకు తల్లి అవ్వడం గుర్తుకు వచ్చింది. తమకు పట్టాలివ్వడం గుర్తుకు వచ్చింది. ఇన్ని ఆందోళనలతో పోలమ్మకు నిద్రపట్టలేదు.

AP Board 7th Class Telugu Solutions 8th Lesson ఎద

ప్రశ్న 4.
కింది కరపత్రాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
జవాబు:
ప్రజలారా !

ప్రకృతి దేవుడు మనకిచ్చిన వరం. ప్రకృతిలోని సమస్త జీవకోటిని కాపాడటం మన బాధ్యత. చెట్లు, నదులు, సమస్త జీవరాశి ప్రకృతిలో అంతర్భాగం. మనం నిర్లక్ష్యంగా చెట్లను నరుకుతూ పోవడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ప్లాస్టికను విచక్షణారహితంగా వాడటం వలన భూమి కలుషితం అవుతుంది. చెత్తా, చెదారాలతో నదులను కలుషితం చెయ్యడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా జంతువులు, పక్షులు తమ ఉనికిని కోల్పోతాయి. కాబట్టి పర్యావరణ పరిరక్షణకు మనం నడుంబిగిద్దాం. ఇది మనందరి బాధ్య త.

ఇట్లు
పర్యావరణ పరిరక్షణ సమితి, అమరావతి.

ప్రశ్నలు – జవాబులు:
అ) పర్యావరణ పరిరక్షణకు మనం ఏం చేయాలి?
జవాబు:
పర్యావరణాన్ని పరిరక్షించాలంటే చెట్లను నరకకూడదు. ప్లాస్టిక్ వాడకూడదు.

ఆ) పర్యావరణ సమతుల్యత ఎందుకు దెబ్బతింటోంది?
జవాబు:
చెత్తా చెదారాలతో నదులను కలుషితం చేయడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.

ఇ) ఈ కరపత్రాన్ని ఎవరు ప్రచురించారు?
జవాబు:
ఈ కరపత్రాన్ని పర్యావరణ పరిరక్షణ సమితి, అమరావతివారు ప్రచురించారు.

ఈ) కరపత్రం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. .
జవాబు:
పక్షులు, జంతువులు ఎందుకు తమ ఉనికిని కోల్పోతున్నాయి?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కొండ భూముల్లో వరి పంటతో పాటు ఇంకేం పండుతున్నాయి?
జవాబు:
కొండ భూములలో నీరు నిలువ ఉండదు. వర్షాలు కొండలపై పడినా నీరు లోయలలోకి వెళ్లిపోతుంది. అయినా కొండ భూములలో గిరిజనులు వ్యవసాయం చేస్తారు.

ఇక్కడ కాఫీ తోటలు, మామిడి, తేయాకు, వరి, జీడి మామిడి తోటలు మొదలైనవి పెంచుతారు. అక్కడక్కడ వరి, జొన్న, రాగులు మొదలైనవి కూడా పండిస్తారు.

ప్రశ్న 2.
పోలమ్మ నిద్రపోతున్న తన పిల్లలను చూసి ఎందుకు ఆనందపడింది?
జవాబు:
పోలమ్మ బాల్యంలో చదువుకోలేదు. అసలు బడికే పోలేదు. వాళ్ల తల్లిదండ్రుల వెనక పశువులను కాయడంతో బాల్యం గడిచిపోయింది. తన పిల్లలు బడికి వెడుతున్నారు. చదువుకొంటున్నారు. ఇంట్లో కూడా దీపం దగ్గర కూర్చొని చదువుకొంటున్నారు. నిద్రపోతున్నప్పుడు కూడా పుస్తకాల్ని వదలలేదు. తమ దగ్గరే పెట్టుకొని నిద్రపోతున్నారు. అందుకే పోలమ్మ నిద్రపోతున్న తన పిల్లలను చూసి ఆనందపడింది.

ప్రశ్న 3.
వర్షం పడిన తరువాత పోలమ్మ పొలం వెళ్లే దారిలో ప్రకృతి ఎలా ఉంది?
జవాబు:
పోలమ్మ పొలం చేరే దారిలో ఎటుచూసినా వర్షపు నీరే. ఇంకిపోయిన నూతుల్లో నీరు, పల్లపు మళ్లలో నీరు, ఎండిపోయిన చెరువుల నిండుగా నీరు. తలలు వాల్చిన గోగుమొక్కలు తలెత్తి ఊగుతున్నాయి. ఉదయపు కాంతిలో కొండలు పచ్చలు పరిచినట్లుగా ఉన్నాయి. ఊటగెడ్డలో నీరు గలగలమంటోంది. దాహం తీరిన పక్షులు ఆనందపు కేరింతలు కొడుతున్నాయి.

AP Board 7th Class Telugu Solutions 8th Lesson ఎద

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పోలమ్మ గతాన్ని తలచుకొన్నప్పుడు ఆమెకు గుర్తొచ్చిన అంశాలేవి?
జవాబు:
పోలమ్మకు చాలా విషయాలు గుర్తొచ్చాయి. ఆమె చిన్నతనంలో జరిగిన పెద్ద తగువు గుర్తొచ్చింది. తగువులు తగ్గాక భూమిలేని వారికి పట్టాభూములిచ్చారు. ప్రస్తుతం ఉన్నదదే భూమి. దోమల వలన వచ్చిన (మలేరియా) జబ్బుతో ఆమె తల్లిదండ్రులు పోయారు. దోమల నివారణకు వచ్చిన వారిలో ఒకతనిని పోలమ్మ ప్రేమించింది. ఫలితంగా ఇద్దరు పిల్లల తల్లయింది. ఆ భర్త రావాలంటే వస్తాడు. లేకుంటే రాడు. కూలిపని చేసుకొని పిల్లలను పోషిస్తోంది. ఊళ్లో బడి పెట్టారు. పిల్లలకు తిండి; బట్టలు, చదువులు ఉచితంగా లభిస్తున్నాయి. ఈ విధంగా పోలమ్మకు అన్నీ గుర్తుకు వచ్చాయి.

ప్రశ్న 2.
మనకు అన్నం పెట్టే రైతు గొప్పతనాన్ని తెలుపుతూ మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు:
మనకు అన్నం పెట్టే రైతు ఎండనక, వాననక విశ్రాంతి లేకుండా చేలో కష్టపడతాడు. దుక్కి దున్నుతాడు. విత్తనాలు చల్లుతాడు. పంటకు ఎరువులు వేస్తాడు. పురుగుమందులు చల్లుతాడు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటాడు. పాములు, జెల్టులు, తేళ్లకు భయపడడు. పంటను కంటికి రెప్పలా కాపాడతాడు. వరి పనలు కోసి, వరి కుప్ప వేస్తాడు. సమయం చూసి కుప్ప నూరుస్తాడు. మనందరికీ భోజనాలకు లోటు లేకుండా బియ్యం అందిస్తాడు. తన సుఖం చూసుకోడు. తను తిన్నా తినకపోయినా పదిమందికి ఆహారాన్నందించే ధన్యజీవి రైతు. ఎవ్వరి దగ్గరా ఏదీ అడగడు. తనను అడిగిన వారికి లేదనడు. ఇతరుల సంపదలను, సుఖాలను చూసి ఈర్ష్యపడడు. తను సుఖపడాలని కోరుకోడు. కష్టపడడంలోనే ఆనందాన్ని వెతుక్కొంటాడు. పదిమందికీ అన్నం పెట్టడంలోనే తృప్తి చెందుతాడు.

భాషాంశాలు

అ) కింది వాక్యాలను చదివి గీతగీసిన పదాలకు అర్థాన్ని రాయండి.
ఉదా : అమ్మానాన్నలు తమ బిడ్డల్ని ఏ లోటు లేకుండా పెంచుతారు.
లోటు = లోపం

1. చిటపట చినుకులు నేలను తాకగానే మొలకలు పుట్టుకొస్తాయి.
మొలక = మొక్క

2. వర్షానికి తిరుమల ఘాటు రోడ్డులో మట్టిపెళ్ళలు జారి అడ్డుగా పడ్డాయి.
మట్టి పెళ్ళలు = మట్టి బెల్లులు

3. పారిజాత పుష్పాలు కోసిన వెంటనే వాడిపోతాయి.
వాడిపోవు = వడలిపోవు

4. కరోనా వ్యాప్తితో ప్రతి ఒక్కరు కలవరం చెందుతున్నారు.
కలవరం = ఆందోళన

5. కష్టసమయంలో గుండె దిటవు చేసుకొని జీవించాలి.
దిటవు = స్థిమితం

AP Board 7th Class Telugu Solutions 8th Lesson ఎద

ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాల కింద గీత గీయండి.
ఉదా : చెట్లను నరకకూడదు. వృక్షాలు మనకు మేలు చేస్తాయి.

1. వర్షాలు పడి పంటలు పండాయి. వానలు కురిసి చెరువులు నిండాయి.
2. భూమాతను నమ్మినవారికి తల్లి ఆశీర్వాదం కూడా ఉంటుంది.

ఇ) కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.

1. నిద్ర అ) ఆస
2. దీపము ఆ) నిదుర
3. పుస్తకము ఇ) దివ్వె
4. పక్షి ఈ) పొత్తం
5. ఆశ ఉ) పక్కి
6. మూలిక ఊ) దిటవు
7. దృఢ ఋ) మొలక

జవాబు:

1. నిద్ర ఆ) నిదుర
2. దీపము ఇ) దివ్వె
3. పుస్తకము ఈ) పొత్తం
4. పక్షి ఉ) పక్కి
5. ఆశ అ) ఆస
6. మూలిక ఋ) మొలక
7. దృఢ ఊ) దిటవు

ఈ) కింది పదాలతో సొంతవాక్య ప్రయోగం చేయండి.
ఉదా : గోదావరినది గలగల ప్రవహిస్తోంది.
తహతహ – కటకట – పదేపదే – కాపలాకాయు – తలలు వంచు – కళ్ళముందు మెదలడం – చెదిరిపోవు – పరుగులుతీయు – కేరింతలు – మనసు దిటవుచేసుకొను

1. తహతహ = ఆత్రుత
సొంతవాక్యం : చదువుకొనే వయస్సులో డబ్బు సంపాదనకు తహతహలాడకూడదు.

2. కటకట = అయ్యయ్యో !
సొంతవాక్యం : కటకటా ! ఎంత కష్టము వచ్చినది.

3. పదేపదే = మాటిమాటికి
సొంతవాక్యం : పెద్దలను పదేపదే అడగకూడదు.

4. కాపలాకాయు = రక్షించడం
సొంతవాక్యం : చంటి పిల్లలను కాపలాకాయకపోతే ఎటో వెళ్లిపోతారు.

5. తలలు వంచు = తప్పు ఒప్పుకొను
సొంతవాక్యం : పౌరుషవంతులెప్పుడూ తలలు వంచుకోరు.

6. కళ్లముందు మెదలడం = గతం గుర్తుకురావడం.
సొంతవాక్యం : నా చిన్నతనంలో నేను చేసిన అల్లరి పనులింకా నా కళ్లముందు మెదులుతున్నాయి.

7. చెదిరిపోవు = మాయమైపోవు
సొంతవాక్యం : నాకు మెలకువ రావడంతో కల చెదిరిపోయింది.

8. పరుగులుతీయు = పారిపోవు
సొంతవాక్యం : మాష్టారిని చూసి విద్యార్థులు తరగతిలోకి పరుగులు తీశారు.

9. కేరింతలు = ఆనందంతో పెట్టే కేకలు
సొంతవాక్యం : పసిపాప చాక్లెట్ చూసి కేరింతలు కొట్టింది.

10. మనసు దిటవు చేసుకొను = మనసును గట్టిపరుచుకొను
సొంతవాక్యం : కష్టాలు వచ్చినపుడే మనసు దిటవు చేసుకోవాలి.

ఉ) కింది వాటిలో నిత్య ఏకవచనాలను, నిత్య బహువచనాలను గుర్తించండి.

వడ్లు, కందులు, అందరు, తెలుపు, మినుములు, పెసలు, ఇత్తడి, ఇనుము, కంచు . నిత్య ఏకవచనాలు : ఇనుము, తెలుపు, ఇత్తడి, కంచు నిత్య బహువచనాలు : కందులు, వడ్లు, అందరు, మినుములు, పెసలు

AP Board 7th Class Telugu Solutions 8th Lesson ఎద

ఊ) కింది వాక్యాలలో గీతగీసిన పదాలను గమనించండి. అలాంటివి మీరూ రాయండి. .

  1. తల్లి గంగమ్మ ఇలాంటి గోరం సెయ్యదుగాక సెయ్యదు.
  2. నేలతల్లి అలాగ అనదుగాక అనదు.
  3. ఆడు మూర్ఖ్యుడు ఇనడు గాక ఇనడు.
  4. అది మొండిది ఎళ్లదు గాక ఎళ్లదు.
  5. ఆడికి బుద్ధి రాదు గాక రాదు.
  6. రాముడు దరమం తప్పుడు గాక తప్పుడు.
  7. సంటోడు వజ్రం తినడు గాక తినడు.
  8. ఆడు పెల్లాన్ని సూడడు గాక సూడడు.
  9. ఈడు కూడు ఎట్టడు గాక ఎట్టడు.
  10. ఇలాంటి ఊసులు అవ్వవు గాక అవ్వవు.

వ్యాకరణాంశాలు

క్రియ

అ) కింది వాక్యాలు చదవండి. గీతగీసిన పదాలను గమనించండి.

1. నవ్య పాట పాడింది.
2. రాజు అన్నం తిన్నాడు.

గీతగీసిన పదాలను గమనిస్తే ఎవరెవరు ఏ ఏ పనులు చేశారో తెలుస్తున్నది. ఇలా ఒక వాక్యంలో పనిని తెలిపే పదానికి ‘క్రియ’ అని పేరు.

సమాపక క్రియ – అసమాపక క్రియ

ఆ) కింది వాక్యాలు చదవండి. గీతగీసిన పదాలను గమనించండి.

1. ధర్మరాజు అన్నదానం చేశాడు.
2. భీముడు కీచకుని చంపాడు.

పై వాక్యాలను గమనించారు కదా ! వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలచిన భావాన్ని పూర్తిచేస్తున్నది. కావున – ఇది ‘సమాపక క్రియ’.

ఇ) కింది వాక్యాలు చదవండి. గీతగీసిన పదాలను గమనించండి.

1. శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి.
2. కర్ణుడు కవచకుండలాలను దానమిచ్చి.

పై వాక్యాలను గమనించారు కదా ! వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలచిన భావాన్ని పూర్తిచేయడం లేదు. కావున ఇది ‘అసమాపక క్రియ’.

అత్వసంధి

ఈ) కింది వాక్యాలను గమనించండి.

  1. సీతక్క భరతమాతకు వందనం చేసింది.
  2. రామయ్యకు చెట్లు అంటే ఇష్టం.
  3. పాఠశాల సమయపాలనను వెంకప్ప పాటిస్తాడు.
  4. కరోనా లాంటి వ్యాధులు రాకుండుటకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  5. అచ్యుతరావు మేనల్లుడు బాగా చదివి గొప్పవాడయ్యాడు.

పై ఉదాహరణలను గమనిస్తే పూర్వస్వరంగా ‘అ’ ఉంది. కావున ఇది (అకార సంధి) అత్వసంధి.

AP Board 7th Class Telugu Solutions 8th Lesson ఎద

ఉ) గీత గీసిన పదాలను విడదీయండి.
1. సీతక్క = సీత + అక్క
2. రామయ్య = రామ + అయ్య
3. వెంకప్ప = వెంక + అప్ప
4. రాకుండుట = రాక + ఉండుట
5. మేనల్లుడు = మేన + అల్లుడు

ప్రాజెక్టుపని

గ్రామీణ వాతావరణాన్ని సూచించే చిత్రపటాన్ని గీచి తరగతి గదిలో ప్రదర్శించి వివరించండి.
జవాబు:

చమత్కార పద్యంతం

శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షం
డవిరళముగ శేషునిపై
బవళించుట నల్లిబాధ పడలేక సుమీ !

భావం :
నల్లి బాధ పడలేక శివుడు కొండపై, సూర్యచంద్రులు ఆకాశంలో, విష్ణువు ఆదిశేషునిపై నిద్రించారని, చమత్కారం.

ఉపాధ్యాయులకు సూచనలు

1. భూషణం గారి కొత్తగాలి కథలను, ఇతర రచనలను పరిశీలించండి.
2. ‘గిరిజనుల జీవన శైలి, పోడు వ్యవసాయ పద్ధతుల గురించి చదివి విద్యార్థులకు తెలియజేయండి. జ.
జవాబు:
వ్యవసాయం :
ఇది చాలా ప్రాచీనమైన సంప్రదాయ వ్యవసాయ పద్ధతి. పోడు వ్యవసాయంలో భూమిని మారుస్తారు. దీనికి నాగలిని ఉపయోగించరు. దీనికి ఒక చిన్న గొడ్డలి ఉపయోగిస్తారు. కొంత భూభాగంలో చెట్లను నరికి, మోడులు కాల్చేస్తారు. ఆ కాల్చిన బూడిద పంటకు బాగా ఉపయోగిస్తుంది. ఎరువులు వాడరు. ఇది రెండు మూడు సంవత్సరాలు వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఈ వ్యవసాయంలో జొన్నలు, సజ్జలు, కూరలు మొదలైనవి పండిస్తారు. రెండు మూడు సంవత్సరాలకు కలుపు మొక్కలు పెరిగిపోతాయి. ఆ భూమిని వదిలేసి మరో చోటికి వెడతారు. ఇక్కడ 15 సంవత్సరాలలో మళ్లీ అడవి పెరిగిపోతుంది. ఈ వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందులు వాడరు కనుక ఈ పంటలు ఆరోగ్యానికి మంచిది. ఈ పోడు వ్యవసాయంపై మనదేశంలో 6,20,000 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.

పోడు వ్యవసాయం వలన అడవులు నష్టపోతున్నాం. మోడులు కాల్చినపుడు వచ్చే పొగ వలన కార్బన్ డయాక్సైడ్ కూడా సమస్యగా మారుతుంది.

కవి పరిచయం

కవి పేరు : బోనం నాగభూషణం
జననం : విజయనగరం జిల్లాలోని మేరంగి గ్రామంలో 1.7.1938న జన్మించారు.
వృత్తి : ఉపాధ్యాయులు
ప్రవృత్తి : రచనలు చేయడం

రచనలు :
భూషణం కథలు, ఏదిసత్యం – ఏదసత్యం, కొండగాలి, అడవంటుకుంది, కొత్తగాలి కథా సంకలనం మొదలైనవి.

ప్రత్యేకతలు :
వీరి తొలి కథ చిత్రగుప్త పత్రికలో ప్రచురితమైంది. శూలపాణి, భూషణం వీరి కలం పేర్లు. 21.5.1999న స్వర్గస్తులయ్యారు.

అర్థాలు – భావాలు

1. పోలమ్మకి ……… మామూలైపోయింది.
అర్థాలు :
కుదురు = కుంది
నిశ్చింత = ఏ ఆలోచనా లేకుండా
ఈడు = వయస్సు
అయ్య = తండ్రి
బాల్యం = చిన్నతనం
కునుకు = నిద్ర
మడి = వరిపొలము
మొలక = మొక్క
ఆశ = కోరిక
గుంపు = సమూహం
గుమ్మరించడం = ఒంపడం
నిరాశ = ఆశలేకపోవడం
మేఘాలు = మబ్బులు

2. ఇవాళ సాయంత్రం ……. కొంత తెలిసింది.
అర్థాలు :
గోగు మొక్కలు = గోంగూర మొక్కలు
ముసురు = కమ్ముకొను (వాన)
కలికాలం = కలియుగం
భీతి = భయం
మెదిలి = సంచరించి
కలవరం = ఆందోళన
విత్తనం = బీజం
సెక్క = చెక్క (చిన్న వరిపొలం)
కటకట = ఆందోళన
తగువు = గొడవ
శబ్దము = చప్పుడు
పశువు = జంతువు
మేత న = తిండి
విషయం = సమాచారం

3. భూములు కొలిచేరు …. ఆమెకి నిద్రపట్టింది:
అర్థాలు :
పట్టాలు = భూమికి సంబంధించిన కాగితాలు
జబ్బులు = రోగాలు
పోయేరు = మరణించేరు
రెక్కలు = జబ్బలు
చెయ్యి చాచడం = అడగడం
లోటు = వెలితి
బడి = పాఠశాల
ఏకైక = ఒకే ఒక
ఆధారం = ఆలంబన
వర్తమానం = ప్రస్తుతం
ఎదమళ్లు = విత్తనాలు జల్లిన పొలములు

AP Board 7th Class Telugu Solutions 8th Lesson ఎద

4. పోలమ్మ నిద్ర ……. చుట్టూ తిరిగింది.
అర్థాలు :
ఉత్సాహం = హుషారు
కళకళగా = కలకలలాడుతూ
ఊటగెడ్డ = ఊటకాల్వ
ఇంపు = ఇష్టం
కేరింత = కేక
గంగతల్లి = గంగమ్మ (నీరు)
గోరం = ఘోరం
మట్టితల్లి = భూమాత
తెలదు = తెలియదు
దరణి = ధరణి = భూమి
బూదేవత = భూ దేవత
ఎద = హృదయం
పండుతాది = పండుతుంది

AP Board 7th Class Telugu Solutions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

SCERT AP Board 7th Class Telugu Guide Answers 7th Lesson కప్పతల్లి పెళ్ళి Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 7th Lesson Questions and Answers కప్పతల్లి పెళ్ళి

7th Class Telugu 7th Lesson కప్పతల్లి పెళ్ళి Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 7th Class Telugu Solutions 7th Lesson కప్పతల్లి పెళ్ళి 1

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరున్నారు?
జవాబు:
చిత్రంలో ఇద్దరు వ్యక్తులున్నారు.

ప్రశ్న 2.
రైతులు దేనికోసం ఎదురుచూస్తున్నారు?
జవాబు:
రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.

AP Board 7th Class Telugu Solutions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

ప్రశ్న 3.
వర్షాలు కురవకపోతే ఏమౌతుంది?
జవాబు:
వర్షాలు కురవకపోతే పంటలు పండవు. ‘మొక్కలు పెరగవు. తినడానికి తిండి ఉండదు. త్రాగడానికి కూడా మంచినీరు ఉండదు. ఉన్న చెట్లు కూడా ఎండిపోతాయి. ఆక్సిజన్, నీరు లేక మరణాలు సంభవిస్తాయి. భూమి ఎడారిగా మారిపోతుంది.

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
గేయాన్ని రాగయుక్తంగా పాడుతూ అభినయించండి.
జవాబు:
ఉపాధ్యాయుని అనుసరించండి.

ప్రశ్న 2.
వర్షం వచ్చే ముందు ఆకాశం ఎలా ఉంటుందో చెప్పండి.
జవాబు:
వర్షం వచ్చే ముందు ఆకాశంలో మబ్బులు వస్తాయి. ఆ మేఘాలు నల్లగా ఉంటాయి. దట్టంగా చీకటి అలుముకుంటుంది. ఆకాశంలో వెలుతురు తగ్గిపోతుంది. ఆకాశంలో మెరుపులు వస్తాయి. చల్లటి గాలి వీస్తుంది. తర్వాత వర్షం ప్రారంభమవుతుంది.

ప్రశ్న 3.
మీరు చూసిన పెళ్లిలోని ఆచారాలను గురించి మీ సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
మా అక్క పెళ్లిలోని ఆచారాలను పరిశీలించాను. పెళ్లికి 15 రోజులు ముందు వినాయకునికి బియ్యం మీదు కట్టారు. అప్పటినుండి పెళ్లి పనులు ప్రారంభించారు. పెళ్లికి 2 రోజుల ముందు పెళ్లికూతుర్ని చేశారు. పందిరి వేశారు. పేరంటం పెట్టారు. మా చెల్లిని తోడ పెళ్లికూతుర్ని చేశారు. పెళ్లికి పంతులుగారు వచ్చి మంత్రాలు చదివారు. మా అమ్మ, నాన్న, అక్కచేత ఏవో పూజలు చేయించారు. అక్కడ మా బావ, వాళ్ల అమ్మ నాన్నలతో కూడా పూజలు చేయించారు. తర్వాత మా బావ, మా అమ్మ, నాన్న పీటలపై ఉన్నారు. మా అక్కను అలంకరించిన బుట్టలో కూర్చోపెట్టి మా మామయ్యలు తెచ్చారు. మా బావ ఎదురుగా కూర్చోబెట్టారు. తెర అడ్డం పెట్టారు. ఒకరి తలపై ఒకరిచేత జీలకర్ర, బెల్లం పెట్టించారు. మా బావ మా అక్కమెడలో మంగళసూత్రం కట్టాడు. తర్వాత తలంబ్రాలు పోసుకున్నారు. బ్యాండుమేళం వాయించారు. బాణాసంచా కాల్చారు. చాలామంది భోజనాలు చేశారు. మా అక్క, బావలను ఆశీర్వదించారు.

AP Board 7th Class Telugu Solutions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

ప్రశ్న 4.
కింది గేయాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
చేయి చేయి కలిపేద్దాం – ఇంకుడు గుంతలు తవ్వేద్దాం
వర్షపు నీటిని పట్టేద్దాం – భూగర్భ జలాలను పెంచేద్దాం
చెరువులన్నీ నింపేద్దాం – బంగరు పంటలు పండిద్దాం
మొక్కలెన్నో నాటేద్దాం – కరువు కాటకాలను తరిమేద్దాం
ప్రకృతిమాతను రక్షిద్దాం – హాయిగ మనము జీవిద్దాం.
ప్రశ్నలు :
1. భూగర్భ జలాలను ఎలా పెంచాలి?
జవాబు:
ఇంకుడు గుంతలు తవ్వి, వర్షపు నీటిని వాటిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచాలి.

2. కరువుకాటకాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
జవాబు:
పంటలు పండించి, మొక్కలను పెంచితే కరువు కాటకాలు రావు.

3. మనం దేనిని రక్షించాలి?
జవాబు:
మనం ప్రకృతిని రక్షించాలి.

4. ఈ కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ప్రకృతిని రక్షిస్తే ప్రయోజనం ఏమిటి?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఇంద్రుని ప్రయాణంతో ప్రకృతిలో వచ్చిన మార్పులను కవయిత్రి ఎలా వర్ణించింది?
జవాబు:
ఇంద్రుడు దేవతలకు రాజు. అతను రథంపై ప్రయాణమయ్యాడు. ఆయన రథం యొక్క వేగానికి వచ్చిన గాలితో చెట్లు ఊగి గాలి వేసింది. ఆ గాలీ కప్పతల్లి పెళ్లికి విసనకర్రలతో విసురుతున్నట్లుగా కవయిత్రి వర్ణించింది.

ఇంద్రుని రథ చక్రాలు బండరాళ్లపై దొర్లుతుంటే వచ్చే చప్పుళ్లు (ఉరుములను) మేళతాళాలుగా వర్ణించారు. ఆ రథ వేగానికి ఆకాశంలో వచ్చే మెరుపులు కప్పతల్లి మెరుపులకు బాణాసంచా కాలిస్తే వచ్చే వెలుగులతో పోల్చారు.

ప్రశ్న 2.
కప్పల పెళ్లికి, వానకు గల సంబంధమేమిటో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కప్పల పెళ్లికి, వానకు గల సంబంధం ప్రకృతి సిద్ధమైనది. వర్షాకాలం రానంత వరకూ కప్పలెక్కడా ఎక్కువగా కనబడవు. వాటి బెకబెకలు వినబడవు. వర్షాలు ఎక్కువగా పడినపుడే కప్పలు అన్నీ పెళ్లివారిలా కలకలలాడుతూ వస్తాయి. బోదురు కప్పలు బెకబెకలాడుతూ పెళ్లి హడావుడి చేస్తాయి. సంతానం కలుగుతుంది. అందుకే కప్పలకు పెళ్లి చేస్తే వర్షం వస్తుందనే ఆచారం ఏర్పడింది.

ప్రశ్న 3.
కప్పల పెళ్లి వెనక దాగి ఉన్న గ్రామీణుల ఆలోచనను తెలియజేయండి.
జవాబు:
కప్పలకు, వానలకు విడదీయలేని సంబంధం ఉంది. ప్రకృతిలోని జీవులను, ప్రకృతిని కాపాడేవారంటే భగవంతునికి ఇష్టం. ధర్మంగా ప్రవర్తించే వారి వలననే నెలకు మూడు వర్షాలు కురుస్తాయి. ధర్మంలో భాగమే పెండ్లిళ్లు మొదలైనవి. కప్పలకు పెళ్లి చేసి ఊరేగిస్తే వరుణుడు సంతోషపడతాడు.

కప్పల పెళ్లిని చూసిన ఆయన మనసు కరుగుతుంది. ఆ కరిగిన మనసే వర్షధారలుగా భూమిపై కురుస్తుంది. ఆ వర్షం వలన పంటలు పండుతాయి. అందుచేత వర్షాలు కురవడం ఆలస్యమైతే గ్రామీణులు కప్పలకు పెళ్లిళ్లుచేసి ఊరేగిస్తారు. చేసిన పనికి ఫలితం ఎప్పుడూ రాకమానదని గ్రామీణుల నమ్మకం. ఆ నమ్మకమే మన జీవితాలకు అవసరమని గ్రామీణుల అభిప్రాయం, ఆలోచన.

AP Board 7th Class Telugu Solutions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కప్పతల్లి పెళ్లి గేయ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కప్పతల్లి పెళ్లి జరుగుతోంది చూద్దాం రండి. ఆ పెళ్లికి వరుణదేవుడు కావిళ్లతో నీళ్లు ఒంపినాడు. వీధులన్నీ నీటితో – నింపేశాడు. స్వర్గానికి అధిపతియైన దేవేంద్రుడు తన రథం ఎక్కి ప్రయాణమయ్యాడు. ఆ రథం వేగానికి ఆకాశం నుండి గాలులు వీస్తున్నాయి. ఆ గాలులకు ఊగే చెట్లు పెళ్లివారికి విసనకర్రలతో గాలి వీస్తున్నట్లుగా ఉన్నాయి.

ఆ రథ చక్రాలు బండరాళ్లపై దొర్లుతూ చేసే చప్పుళ్లు (ఉరుములు) కప్పతల్లి పెళ్లికి మేళతాళాలులాగా ఉన్నాయి. ఆ రథ వేగానికి వచ్చే కాంతి బాణసంచాలా ఉంది. బోదురు కప్పల అరుపులు కూడా మేళతాళాలులా ఉన్నాయి.

కప్పమ్మ గడప తొక్కింది. ఇంటిచూరు శుభమంది. వర్షంలో కప్పలు గంతులు వేస్తున్నాయి. ఇక పొలంలో బంగారం లాంటి పంట పండుతుంది.

ప్రశ్న 2.
ప్రజల నమ్మకాలపై ఆధారపడ్డ ఏదేని మీ ప్రాంత ఉత్సవం గురించి రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ జాతరకు నెల ముందు నుండి అమ్మవారి గరగలు ఊరేగిస్తారు. ఆ గరగలు ఇంటింటికీ వస్తాయి. అందరూ వాటికి భక్తితో బియ్యం ఇస్తారు. పసుపునీళ్లు పాదాలపై పోస్తారు. పువ్వులు, గాజులు, చీరెలు, పళ్లు, బియ్యం, డబ్బులు ఇస్తారు. గరగలెత్తాక ఊర్లోని ఆడపడుచులు ఎవ్వరూ ఊరు వదిలి ఎక్కడికీ వెళ్లరు. అమ్మవార్లకు చీరెలు పెట్టనిదే – పుట్టినరోజులు, పండుగలు మొదలైనవి ఏవి వచ్చినా కొత్తబట్టలు కట్టుకోరు. అమ్మవారికి నిర్ణయించిన రోజున చలిమిడి, పానకం పోస్తారు.

జాతర చాలా అట్టహాసంగా జరుగుతుంది. జాతరనాడు రాత్రి 2 గంటలకు నిప్పుల గుండం వేస్తారు. చిన్నపిల్లలు, వృద్ధులతో సహా అందరూ నిప్పుల గుండం తొక్కుతారు. ఎవ్వరికీ కాళ్లు కాలవు. అనారోగ్యాలుంటే తగ్గుతాయి. అందరూ కులమత భేదాలు లేకుండా పాల్గొంటారు.

ప్రశ్న 3.
కప్పతల్లి పెళ్లిలో ప్రకృతి పాత్రను కవయిత్రి ఎలా భావించిందో వివరించండి.
జవాబు:
కప్పతల్లి పెళ్లిని ప్రకృతే చేసింది. ఆ పెళ్లికి నీటిని వరుణదేవుడు వర్షం రూపంలో సమకూర్చాడు. చెట్లు విసనకర్రల వలే గాలిని వీచాయి. ఇంద్రుడు తన రథం యొక్క వేగం వలన పుట్టిన మెరుపులతో బాణసంచా కాల్పులు జరిపాడు. ఆ రథం బండరాళ్లపై దొర్లిన చప్పుడూ, బోదురు కప్పల బెకబెకలు బాజా భజంత్రీలు మేళతాళాలయ్యాయి. ఈ విధంగా కప్పతల్లి పెళ్లిలో ప్రకృతి పాత్రను కవయిత్రి భావించారు.

పువ్వులు కొడికీ వెళ్లరు. అమ్మవార్లకు నీరయించిన రోజున చలిమిడి, టెలకు నిప్పుల గుండం వేస్తారు తగ్గుతాయి
కంపోసారు.

భాషాంశాలు

అ) కింది వాక్యాలను చదవండి. గీతగీసిన పదాలకు అర్ధాలు రాసి, వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : గగనతలము నుంచి నేడు గాలులు వీచాయి.
గగనతలం = ఆకాశమార్గం
సొంతవాక్యం : పక్షులు ఆకాశమార్గంలో స్వేచ్ఛగా ఎగురుతాయి.

1. రాజు రథంపై పయనం అయ్యాడు.
పయనం = ప్రయాణం
సొంతవాక్యం : అనుకొన్న ప్రయాణం మానకూడదు.

2. మీకు శుభం కలుగుగాక.
శుభం = మంచి
సొంతవాక్యం : అందరికీ మంచి కలగాలి.

3. మా పొలంలో కనక వర్షం కురిసింది.
కనకం = బంగారం
సొంతవాక్యం : బంగారం కంటే కాలం విలువైనది.

4. పల్లెటూర్లో కావిళ్ళతో నీళ్ళను తెస్తారు.
కావిళ్ళు = నీటిని తేవడానికి ఉపయోగించేవి.
సొంతవాక్యం : నీటిని తేవడానికి ఉపయోగించేవి కావిళ్లు కదా ! వాటితో పాలు, ధాన్యం వగైరా అన్నీ తెస్తారు.

5. పండగకి వాడ వాడలా దేవుణ్ణి ఊరేగిస్తారు.
వాడ = వీధి.
సొంతవాక్యం : ప్రతి వీధిలోనూ దేవుడు ఊరేగుతాడు.

AP Board 7th Class Telugu Solutions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

ఆ) కింది వాక్యాలలో సమానార్ధక పదాలను (పర్యాయ పదాలు) గుర్తించి రాయండి.

1. మంచివారి మాటలు వినాలి. వారి పలుకులు బంగారు తునకలు.
వాక్కులు = మాటలు, పలుకులు

2. పొలంలో బంగారం పండింది. ఇల్లు కనకంతో నిండింది.
పసిడి = బంగారం, కనకం

3. కప్పతల్లి పెళ్లి జరుగుతోంది. పెద్దలందరూ వివాహానికి వచ్చారు.
పరిణయం = పెళ్లి, వివాహం

ఇ) కింద ఇచ్చిన ప్రకృతి, వికృతులను జతపరచండి.

1. ప్రయాణం అ) తలము
2. రథము ఆ) బత్తెము
3. స్థలము ఇ) పయనం
4. భత్యము ఈ) అరదము

జవాబు:

1. ప్రయాణం ఇ) పయనం
2. రథము ఈ) అరదము
3. స్థలము అ) తలము
4. భత్యము ఆ) బత్తెము

ఈ) కింది పదాలను వ్యతిరేక పదాలతో జతపరచండి.

1. శక్యం అ) నేడు
2. శుభం ఆ) అశక్యం
3. నాడు ఇ) అశుభం

జవాబు:

1. శక్యం ఆ) అశక్యం
2. శుభం ఇ) అశుభం
3. నాడు అ) నేడు

ఉ) కింది గళ్లలో పాఠంలోని పదాలను గుర్తించండి. వాటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
AP Board 7th Class Telugu Solutions 7th Lesson కప్పతల్లి పెళ్ళి 2
ఉదా : బాజాలు
1. బడబడా భం
2. శక్యము
3. కప్ప
4. పెళ్ళి
5. శుభం
6. బహుబాగు

ఉదా : బాజాలు : మా అక్క పెళ్లికి బాజాలు వాయించారు.

1. బడబడా : తలుపులు బడబడా కొట్టకూడదు.
2. శక్యము : కృషి చేస్తే శక్యము కానిది లేదు.
3. కప్ప : కప్పులు వానాకాలం కనబడతాయి.
4. పెళ్ళి : పెళ్లికి దుబారా ఖర్చులు చేయకూడదు.
5. శుభం : మంచిగా ఆలోచిస్తే శుభం కలుగుతుంది.
6. బహుబాగు : ఈ పదకేళి బహుబాగుగా ఉంది.

వ్యాకరణాంశాలు

ద్రుతము

అ) కింది వాక్యాలను పరిశీలించండి.

1. బాలచంద్రుడు అభిమన్యునివలెన్ పోరు సలిపెను.
2. ఆర్యా ! మాయందున్ దయచూపుడు.
3. మీరు వచ్చినన్ సంతోషించెదను.
4. బాలుని కొట్టినన్ ఏడ్చును.
5. భూమి రాజు చేతన్ పాలించబడెను.

పై వాక్యాలలోని గీతగీసిన పొల్లు హల్లు (న్) తొలగించి వాక్యాలను మళ్ళీ రాయండి.

ఉదా : 1. బాలచంద్రుడు అభిమన్యుని వలె పోరు సలిపెను.
2. ఆర్యా ! మాయందు దయ చూపుడు.
3. మీరు వచ్చిన సంతోషించెదను.
4. బాలుని కొట్టిన ఏడ్చును.
5. భూమి రాజు చేత పాలించబడెను.

పై ఉదాహరణల్లో ‘స్’ తొలగించినా అర్థంలో మార్పు రావడం లేదు. ఇటువంటి ‘న’ కారాన్ని ద్రుతము అంటారు. ఇది ప్రస్తుత వ్యవహారంలో లేదు. ప్రాచీన సాహిత్యంలోని పద్యాలలో ఎక్కువగా కనిపిస్తుంది.

త్రికము

ఆ) కింది వాక్యాలను గమనించండి.
1. అతడు ఎచ్చోటనైనా జీవించగలడు.
2. ఇక్కడ వర్షం పడుతోంది.
3. ఎక్కడ ఉన్నా మన మాతృభూమిని మరవవద్దు.
4. అచ్చోటు నివాసయోగ్యము కాదు.
5. అక్కడ చలి ఎక్కువగా ఉంది.

గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
ఉదా : ఎచ్చోటు – ఏ + చోటు

1. ఇక్కడ = ఈ + కడ
2. ఎక్కడ = ఏ + కడ
3. అక్కడ = ఆ + కడ
4. అచ్చోటు = ఆ + చోటు

పై ఉదాహరణల్లో పదాలను విడదీసినప్పుడు పూర్వపదంగా ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు వచ్చాయి. వీటినే ‘త్రికములు’ అంటారు.

ఆమ్రేడితం

ఇ) కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీసి రాయండి.

1. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి.
2. మేము అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్తుంటాం.
3. విందు భోజనంలో ఏమేమి పదార్థాలు వడ్డించారు.
4. మా ఊరికి చిట్టచివర బడి ఉంది.
5. ఆ పట్టణం నట్టనడుమ కోనేరు ఉంది.
ఉదా : అప్పుడప్పుడు = అప్పుడు + అప్పుడు
1. అక్కడక్కడ = అక్కడ + అక్కడ
2. ఏమేమి = ఏమి + ఏమి
3. చిట్టచివర = చివర + చివర
4. నట్టనడుమ = నడుమ + నడుమ
5. పట్టపగలు = పగలు + పగలు

పై పదాలను విడదీసినప్పుడు పూర్వపదం, పరపదం రెండింటిలోను ఒకేపధం కనిపిస్తుంది. ఇలా రెండూ ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవపదాన్ని ఆమ్రేడితం అంటారు. ఈ

పంచమీ విభక్తి

ఈ) క్రింది వాక్యాలను పరిశీలించండి.
1. వర్షాల వలన కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
2. కృష్ణుడి వలన పాండవులు యుద్ధంలో విజయం-సాధించారు.
3. కరువుకాటకాల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
4. పల్లెటూరి కంటె పట్నంలో కాలుష్యం ఎక్కువ.
5. శ్రీనాథుని కంటె నన్నయ ముందువాడు.

పై వాక్యాల్లో ‘వలన కంటె – పట్టి’ అనే ప్రత్యయాలు వాక్యాన్ని అర్థవంతంగా మార్చాయి. ఇలాంటి ప్రత్యయాలు వస్తే దాన్ని పంచమీ విభక్తి అంటారు. అపాయం, భయం, పరాజయం, విరామం వంటి సందర్భాలను చెప్పేటప్పుడు పదాల చివర ‘వలన’ అనే ప్రత్యయం వస్తుంది. ఇతరము, పూర్వము, పరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు ‘కంటె’ అనే ప్రత్యయం వస్తుంది.

AP Board 7th Class Telugu Solutions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

ఉ) గేయంలోని ద్విత్వాక్షర, సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి.

ద్విత్వాక్షర పదాలు :
1) కప్ప 2) తల్లి 3) పెళ్ళి 4) కావిళ్ళు 5) నీళ్లు 6) శుభమన్న 7) రాళ్ళు 8) కళ్ళు 9) కప్పమ్మ 10) తొక్కినది 11) వానలమ్మా 12) వాడలన్నీ 13) రథమెక్కి 14) ఒళ్లు 15) సుమ్మా 16) గొప్ప 17) పోవుచున్నాడు 18) మెరుపులమ్మ 19) తెప్పించి 20) చెప్ప 21) పండుతాయమ్మా

సంయుక్తాక్షర పదాలు :
1) భత్యాలు 2) చక్రములు 3) స్వర్గాధినాథుడు 4) దొర్లించి 5) శక్యము 6) చెట్లు

ఊ) కింది పదాలను విడదీయండి. సంధి పేర్లు రాయండి.
ఉదా : స్వర్గాధినాథుడు : స్వర్గ + అధినాథుడు = సవర్ణదీర్ఘ సంధి

1. పరవశమౌను = పరవశము + ఔను = ఉత్వ సంధి
2. శుభమన్న = శుభము + అన్న = ఉత్వ సంధి
3. మెరుపులమ్మ = మెరుపులు + అమ్మ = ఉత్వ సంధి
4. రథమెక్కి = రథము + ఎక్కి = ఉత్వ సంధి

ఋ) కింది పదాలను కలిపి రాయండి.
ఉదా : కప్ప + అమ్మ = కప్పమ్మ
1. కప్పలు + ఎగిరే = కప్పలెగిరే
2. పండుతాయి + అమ్మ = పండుతాయమ్మ
3. వాడలు + అన్నీ = వాడలన్నీ
4. చేసినారు + ఏ = చేసినారే

ఋ) కింది వాక్యాలలో ప్రత్యయాల కింద గీత గీయండి. విభక్తులను రాయండి.
ఉదా : విద్యను అర్థించు వానిని విద్యార్థి అంటారు. – ద్వితీయ విభక్తి

1. విద్యావంతుడు అందరిచే పూజించబడతాడు. – తృతీయా విభక్తి
2. విద్యార్థులు జ్ఞానం కొరకు యాత్ర చేశారు. – చతుర్తీ విభకి
3. తల్లిదండ్రులు పిల్లలను ప్రాణము కంటే అధికంగా ప్రేమిస్తారు. – పంచమీ విభక్తి
4. అమరావతిలోని శిల్పాలు చూడముచ్చటగా ఉన్నాయి. – షష్ఠీ విభక్తి
5. మా పురము నందు జనులు సేవాగుణం కలిగినవారు. – సప్తమీ విభక్తి
6. ఓయీ ! మునీశ్వరా ! ఇటు రమ్ము. – సంబోధనా ప్రథమా విభక్తి

ప్రాజెక్టుపని

అ) మీ ప్రాంతంలో జరిగే జాతరలకు సంబంధించిన వివరాలను సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
మా ప్రాంతంలో అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ జాతరకు నెల ముందు నుండి అమ్మవారి గరగలు ఊరేగిస్తారు. ఆ గరగలు ఇంటింటికీ వస్తాయి. అందరూ వాటికి భక్తితో బియ్యం ఇస్తారు. పసుపునీళ్లు పాదాలపై పోస్తారు. పువ్వులు, గాజులు, చీరెలు, పళ్లు, బియ్యం, డబ్బులు ఇస్తారు. గరగలెత్తాక ఊళ్లోని ఆడపడుచులు ఎవ్వరూ ఊరు వదిలి ఎక్కడికీ వెళ్లరు. అమ్మవార్లకు చీరెలు పెట్టనిదే – పుట్టినరోజులు, పండుగలు మొదలైనవి ఏవి వచ్చినా కొత్తబట్టలు కట్టుకోరు. అమ్మవారికి నిర్ణయించిన రోజున చలిమిడి, పానకం పోస్తారు.

జాతర చాలా అట్టహాసంగా జరుగుతుంది. జాతరనాడు రాత్రి 2 గంటలకు నిప్పుల గుండం వేస్తారు. చిన్నపిల్లలు, వృద్ధులతో సహా అందరూ నిప్పుల గుండం తొక్కుతారు. ఎవ్వరికీ కాళ్లు కాలవు. అనారోగ్యాలుంటే తగ్గుతాయి. అందరూ కులమత భేదాలు లేకుండా పాల్గొంటారు.

AP Board 7th Class Telugu Solutions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

ఆ) క్రింది నినాదాలు చదవండి. ఇలాంటివి మీరూ తయారుచేయండి.
జవాబు:

  • మనిషికొక మొక్క పెంచుదాం – జీవకోటికి ప్రాణదాతలవుదాం.
  • చెట్లు నరికితే దుర్భిక్షం – చెట్లు పెంచితే సుభిక్షం.
  • చెట్లు పెంచితే ఉండవు ఇక్కట్లు – చెట్లే మన ప్రగతికి మెట్లు.
  • మొక్కలు నాటుదాం – చక్కగా బ్రతుకుదాం.
  • చెట్టుపై వేస్తే గొడ్డలి – అదే నీ భవితకు గొడ్డలి పెట్టు.

చమత్కార పద్యం

మామిడేలపూచు మండు వేసంగిని !
బాలుడేల పోవు పసుల వెంట
రాజు సేవ నేల రహిజేర్చు చుండును !
మూటనొక్క మాట ముద్దు కృష్ణ !

భావం :
మామిడిచెట్టు వేసవిలోనే ఎందుకు పూతపూస్తుంది? బాలుడు పశువుల వెంట ఎందుకు పోతాడు? రాజు సేనను ఎందుకు పెంచుతాడు?

(పై మూడు ప్రశ్నలకు ఒకే సమాధానం ‘కాయ’.) మామిడి పూసేది కాయడానికే.. బాలుడు పశువుల వెంట పోవడం చాటిని కాయడానికే. సేన కూడా ప్రజలను కాయడానికి. అంటే కాపాడడానికే అని అర్థం.

ఉపాధ్యాయులకు సూచనలు
చావలి బంగారమ్మ గారి రచనలను సేకరించి చదవండి.

కవి పరిచయం

కవయిత్రి పేరు: చావలి బంగారమ్మ
జననం : తూర్పుగోదావరి జిల్లా మోడేకుర్రులో 1897లో జన్మించారు. వీరిది కొంపెల్ల వారి పండిత కుటుంబం కనుక కవిత్వం ఉగ్గుపాలతో వచ్చింది.
రచనలు :
1930లో ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ ద్వారా ఈమె కవితలు వెలుగులోకి వచ్చాయి. 1958లో 42 కవితలతో ‘కాంచన విపంచి’ పేరుతో సంకలనం చేశారు. అవి భారతి, ఉదయిని, జ్వాల, ఆంధ్రపత్రికలలో ప్రచురితమైనవి.

ప్రత్యేకత :
ఈమె కవితలలో సరళత, స్పష్టత, లయాత్మకత కన్పిస్తాయి. భావ కవిత్వంలో స్మృతి కవిత్వం ఒకటి. తన సోదరుడు కొంపెల్ల జనార్ధనరావును స్మరిస్తూ స్మృతి కవిత్వం వ్రాసింది. ఈమె 11 1970లో కాలం చేశారు.

గేయాలు – అర్థాలు – భావాలు

1. కప్పతల్లి పెళ్లి నేడూ – చూడారే
కావిళ్ళనీళ్ళోంపినాడు !
వరుణదేవుడు వంపినాడూ – ఓ చెలీ
వాడలన్నీ నింపినాడు.!

గగనతలము నుంచి నేడు – వీవెనలు
చెట్లచే వేయించినాడు !
స్వర్గాధినాథుడు నేడూ – రథమెక్కి
పయనమై పోవుచున్నాడు !

భత్యాలు లేకనేవాడు – పెళ్లికి
బాజాలు వేయించినాడు!
బండరాళ్ళ పైని వాడు – చక్రములు
బడబడా దొర్లించినాడు!
అర్థాలు :
కావిడి = ఒక వెడల్పైన వెదురుబద్దకు రెండు చివర్లా ఉట్టెలు కట్టి, వాటిలో బిందెలు పెట్టి నీళ్లు తెచ్చుకొంటారు. (వెదురు బద్దను కావిడి బద్ద అంటారు) ఉట్లునే మట్టులు అంటారు. కావిడి బద్దను భుజంపై పెట్టు కొని నీరు తెస్తారు.
వాడలు = వీధులు
గగనము = ఆకాశం
తలము = స్థలము
వీవెన = విసనకర్ర
స్వర్గాధినాథుడు = దేవేంద్రుడు
పయనము = ప్రయాణము
భత్యము = ఖర్చుల కోసం ఇచ్చే డబ్బు
బాజా = డోలు

భావం :
కప్పతల్లి పెళ్లి జరుగుతోంది చూడండి. వరుణ దేవుడు కావిళ్లతో (పెళ్లికి) నీళ్లు పంపాడు. అన్ని వీధులూ వర్షపు నీటితో నింపేశాడు. పెళ్లివారికి నీటికి లోటు లేకుండా వరుణదేవుడు చేశాడు. స్వర్గానికి అధిపతియైన దేవేంద్రుడు రథమెక్కి ప్రయాణమై వెళుతున్నాడు. ఆ వేగానికి ఆకాశ వీధి నుండి వాయుదేవుడు వీచేగాలి పెళ్లి వారికి విసనకజ్జలతో గాలి వీస్తున్నట్లుంది. బండరాళ్లపై దేవేంద్రుని రథం పరుగెడుతోంది. ఆ ధ్వనినే ఉరుములంటారు. ఆ ఉరుములు కప్పతల్లి పెళ్లికి బాజాలు లాగా ఉన్నాయి.

AP Board 7th Class Telugu Solutions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

2. ‘బాణసంచా వెలితి లేదే – పెళ్లికి
బహుబాగుగా జేసినారే
కళ్ళు చెదిరే మెరుపులమ్మా – చూడగా
వొళ్ళు పరవశమౌనుసుమ్మా !

కప్పమ్మ పెళ్లికోయంచూ – మేళములు
గొప్పగా తెప్పించినారే !
చెప్ప శక్యము కాదు వేరే – బోదురూ
కప్పలా మేళములురారే !

కప్పమ్మ గడప తొక్కినది – శుభమన్న
సూచనలు చూరు చెప్పినది !
కప్పలెగిరేవానలమ్మా – పొలములో
కనకాలెపండుతాయమ్మా !
అర్థాలు :
బాణసంచా = మందుగుండు సామగ్రి
వెలితి = లోటు
ఒళ్లు = శరీరం
పరవశం = తన్మయం
మేళము = వాయిద్యాలు
చూరు = ఇంటి పెణక అంచు
కనకం = బంగారం
శక్యము = సాధ్యము
కప్ప = మండూకం
పెళ్లి = వివాహం

భావం :
ఇంద్రుని రథచక్రాల వేగానికి ఆకాశంలో మెరుపులు పుట్టాయి. అవి కప్పతల్లి పెళ్లికి బాణా సంచా కాలుస్తుంటే వస్తున్న వెలుగులులా ఉన్నాయి. అవి చూస్తే తన్మయత్వం కలుగు తోంది. బోదురు కప్పల అరుపులు పెళ్లికి మేళతాళాలులా ఉన్నాయి. కప్పతల్లి మా ఇంటి గడప దగ్గర కొచ్చింది. అది శుభసూచన అని చూరు నుండి కారుతున్న నీరు చెప్పింది. కప్పలు ఎగిరి గంతులు వేసేటంత వాన కురిసింది. ఇక ఈ వర్షంతో పొలంలో బంగారం పండుతుంది. అంటే మంచి పంటలు పండుతాయి.

AP Board 7th Class Telugu Solutions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

సారాంశం

ఈ రోజు కప్పతల్లి పెళ్లి చూడడానికి రండి. వరుణదేవుడు కావిళ్లతో నీళ్లు పంపాడు. మొత్తం వాడలన్నీ || నీటితో నింపేశాడు.

ఆకాశం నుండి గాలులు వీస్తున్నాయి. అవి చెట్లచేత పెళ్లివారికి విసనకర్రలతో విసిరిస్తున్నట్లుంది. స్వర్గాధి నాథుడైన దేవేంద్రుడు రథం ఎక్కి పెళ్లికి వెడుతున్నాడు. బండరాళ్లపై అతని రథచక్రాలు దొర్లుతున్నాయి. ఆ చప్పుడు పెళ్లి బాజాలులా ఉన్నాయి.

పెళ్లిలో బాణాసంచాలేని వెలితి కూడా లేదు. ఆకాశంలో వచ్చే మెరుపులు పెళ్లికి బాణాసంచాలా ఉన్నాయి. ఈ అవన్నీ చూస్తుంటే పరవశం కల్గుతోంది.

కప్పమ్మ పెళ్లికి మేళాలు కూడా చాలా ఘనంగా ఉన్నాయి. ఆ మేళాలు చెప్పశక్యం కానంత బాగున్నాయి. అవే బోదురుకప్పల అరుపులు.

కప్పమ్మ గెంతుతూ గడప తొక్కింది. చూరు నుండి కారుతున్న వర్షపునీరు శుభం అంది. కప్పలెగిరి గెంతేటంత వాన వస్తోంది. ఇంక ఈ వర్షానికి పొలంలో బంగారం లాంటి పంట పండుతుంది.

AP Board 7th Class Telugu Solutions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు

SCERT AP Board 7th Class Telugu Guide Answers 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 6th Lesson Questions and Answers మన విశిష్ట ఉత్సవాలు

7th Class Telugu 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు Textbook Questions and Answers

ప్రశ్నలు – జవాబులు

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
గుణదల మేరీమాత ఉత్సవానికి మాతృక ఏమిటో తెలపండి.
జవాబు:
లూర్థు నగర శివారులో కొండ దిగువకు వంటచెరుకు కోసం బెర్నాడెప్ అనే బాలిక వెళ్లింది. ఆమెకు మేరీమాత కనబడింది. మాట్లాడింది. ఆమె ఆ విషయాన్ని తల్లికి, ఇతరులకు చెప్పింది. అది ఫిబ్రవరి 11వ తేది. దానిని మాతృకగా చేసుకొని 1924 నుండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన గుణదలలో మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి.

ప్రశ్న 2.
కోటప్పకొండ తిరునాళ్ళలో గల మానవీయ కోణం ఏమిటి?
జవాబు:
వ్యవసాయంలో ముఖ్య భూమిక పోషించేవి ఎద్దులు. ఆ ప్రాంత రైతులు ఎద్దులను కన్నబిడ్డలవలే చూసుకొంటారు. కోడె దూడలు, ఎద్దులు, తమ ఇళ్లలోని బిడ్డలు క్షేమంగా ఉండాలని మొక్కు కొంటారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మొక్కులు తీర్చుకొంటారు.

AP Board 7th Class Telugu Solutions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు

ప్రశ్న 3.
అహిబిలం పార్వేట ఉత్సవం ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
పరి అనగా గుర్రం, వేట అనగా దుష్టశిక్షణ. ఇది దుష్ట శిక్షణ గురించి జరిగేది. కనుమనాడు అహోబిల నృసింహ స్వామి ఉత్సవమూర్తిగా బయటకు వస్తారు. చుట్టుప్రక్కల 35 గ్రామాలకు వెళతారు. 41వ రోజు ఆ ఊరేగింపు ఉంటుంది. పాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు జరిగే తన వివాహానికి 35 గ్రామాల ప్రజలను ఆయనే ఆహ్వానిస్తారు.

ప్రశ్న 4.
లేపాక్షి ఉత్సవాల గురించి మీ సొంతమాటలలో వ్రాయండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో రెండు రోజులు ఉత్సవాలు జరుగుతాయి. వీటిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. యక్షగానాలు, హరికథలు కూడా ఉంటాయి. నృత్య, గాన, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకొంటాయి. ఆలయాలనలంకరిస్తారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సిరిమానోత్సవం జాతర గురించి వ్రాయండి.
జవాబు:
సిరిమాను అంటే సంపదలిచ్చే పెద్ద చెట్టు అని అర్థం. ఈ సిరిమానోత్సవం విజయనగరంలో జరుగుతుంది. లక్షలాదిగా భక్తులు వస్తారు.

ఒకసారి విజయనగర రాజు’ విజయ రామరాజు యుద్ధానికి వెడతాడు. ఆయన చెల్లెలు పైడిమాంబ వెళ్లవద్దంటుంది. ఆయన వినడు. యుద్ధానికి వెడతాడు. ఆయనను చూడడానికి ఆమె వెనకనే బయల్దేరుతుంది. తన అన్నను తాండ్ర పాపారాయుడు చంపేశాడని దారిలోనే తెలుస్తుంది. తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొంటుంది. కొంతకాలానికి స్నేహితురాళ్ల కలలో కనబడి చెరువులో విగ్రహమైనట్లు చెప్పింది. గుడి కట్టాలంది. బెస్తవారు వలలతో గాలించారు. విగ్రహం తీశారు. గుడి కట్టారు. విజయదశమి తరువాతి మంగళవారం విగ్రహం ప్రతిష్ఠించారు.

అందుకే ప్రతి ఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం సిరిమానోత్సవం చేస్తారు. పూజారి చెప్పిన సిరిమానును 15 రోజుల ముందు సేకరిస్తారు. సిరిమానుపై పూజారిని కూర్చోపెట్టి ఉత్సవం చేస్తారు. ఆ ఉత్సవంలో పైడిమాంబ పూజారిపై వాలి అన్ని విషయాలూ చెబుతుంది. పూజారి ధాన్యం ఇస్తాడు. ఆ ధాన్యపుగింజలు తమ పొలంలో వేసుకొంటే పంటలు బాగా పండుతాయని నమ్మకం.

ప్రశ్న 2.
“మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ” ఎందుకో వ్రాయండి.
జవాబు:
హిందూ, ముస్లింలు ఐకమత్యంతో జరుపుకొనే పండుగలలో రొట్టెల పండుగ ఒకటి. ఇది నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. ఈ పండుగలో మహిళలు అత్యధికంగా పాల్గొంటారు.

ఒకప్పుడు గండవరం ‘వద్ద జరిగిన యుద్ధంలో 12 మంది ఇస్లాం వీరులు మరణించారు. వారి మొండేలను వారి గుర్రాలు దుర్గామిట్ట చెరువు వద్దకు చేర్చాయి. అక్కడే సమాధులు నిర్మించారు. దానికి ‘బారహ్ షహీద్’ అని పేరు.

నెల్లూరును పాలించిన ఆర్కాటు నవాబు భార్యకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. దర్గామిట్ట చెరువు వద్ద రజక దంపతులున్నారు. వారికి కలలో 12 మంది వీరులు కనిపించారు. తమ సమాధులపై మట్టి ఆమెకు లేపనంగా పూస్తే అనారోగ్యం తగ్గుతుందన్నారు. అది రాజగురువు ద్వారా రాజుకు తెలిసింది. .అలాగే చేశారు. నవాబు భార్యకు అనారోగ్యం తగ్గింది.

దీనికి కృతజ్ఞతగా ఆయన భార్యతో వచ్చారు. ‘బారాషహీద్’ సందర్శించారు. ప్రార్థనలు చేశారు. రొట్టెలను పంచారు. దర్గాను అభివృద్ధి చేశారు.

అప్పటి నుండి తమ కోరికలు తీరినందుకు జాతరనాడు రొట్టెలు పంచుతారు. మరునాడు గంధోత్సవం జరుగుతుంది. 3వ రోజు స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొంటారు.

AP Board 7th Class Telugu Solutions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు

ప్రశ్న 3.
సంస్కృతి సంప్రదాయాలను మన వారసత్వ సంపదగా తరువాతి తరానికి ఎలా అందించాలో తెలియజేయండి.
జవాబు:
మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జాతరలు, ఉత్సవాలు, పండుగలు చాలా జరుగుతాయి. వీటి వెనుక ఉన్న మూలసూత్రం ఒకటే, జాతి, కుల, మత, లింగ, వర్గ, వయో భేదాలేవీ లేకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలి.

పిండివంటలతో భుజించాలి.. ఇరుగుపొరుగు వారికి వాటిని ఇచ్చి, వారిచ్చినవి తీసుకోవాలి. దీని వలన అందరూ మనవాళ్లే అనే భావన కలుగుతుంది. దీనిని పిల్లలకు అలవాటు చేయాలి.

సిరిమానోత్సవం, రొట్టెల పండుగ, ప్రభల తీర్థం ఏదైనా సరే, అందరూ తలో చేయ్యీ వేయనిదే అవ్వదు. . పెద్దలు ప్రారంభించిన దానిని వారి పర్యవేక్షణలో తర్వాతి తరంవారు ( పిల్లలు) ఆచరించాలి. ఇలాగే తరతరాలు అంతరాలు లేకుండా అందరూ పాల్గొనాలి. అప్పుడే మన వారసత్వ సంస్కృతి, సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లుతాయి.

AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం

SCERT AP Board 7th Class Telugu Guide Answers 5th Lesson పద్య పరిమళం Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 5th Lesson Questions and Answers పద్య పరిమళం

7th Class Telugu 5th Lesson పద్య పరిమళం Textbook Questions and Answers

వినడం – అలోచించి మాట్లాడడం
AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం 1

ప్రశ్న 1.
చిత్రాన్ని గమనించండి. చిత్రంలో ఎవరెవరున్నారు?
జవాబు:
చిత్రంలో గురువుగారు, శిష్యులు ఉన్నారు.

ప్రశ్న 2.
మీకు తెలిసిన ఇలాంటి నీతి పద్యాలు చెప్పండి. (వ్రాయండి)
జవాబు:
1) దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వ వర్ధనంబు విద్యాధనంబురా
లలిత సుగుణ జాల తెలుగుబాల

2) అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినుర వేమ

AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం

ప్రశ్న 3.
మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి. (వ్రాయండి)
జవాబు:
బద్దెన, వేమన, కవి చౌడప్ప, ఏనుగు లక్ష్మణకవి, నార్ల చిరంజీవి, బమ్మెర పోతన మొదలగువారు.

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగంతో, భావానికి తగినట్లుగా పాడండి.
జవాబు:
స్పష్టమైన ఉచ్చారణతో భావయుక్తంగా, సంధి సమాస పదాలను విడదీస్తూ ఒకసారి, కలిపి రెండుసార్లు, స్వల్పరాగంతో ఉపాధ్యాయులు పద్యపఠనం చేస్తారు. దానిని విద్యార్థులు జాగ్రత్తగా గమనించాలి. ఉపాధ్యాయుడు పద్యం చెబుతుంటే చెప్పాలి. దోషాలు సవరించుకోవాలి. తప్పులు లేకుండా స్పష్టంగా మీ ఉపాధ్యాయుని వలె మీరూ సొంతంగా చదవాలి.

ప్రశ్న 2.
మానవ జీవితంలో ధనం యొక్క అవసరాన్ని గురించి మీ మాటల్లో చెప్పండి.
జవాబు:
ధనం వలన స్నేహాలు పెరుగుతాయి. ధనం వలన స్నేహితులూ ఎక్కువైతారు. విరోధాలు పెరుగుతాయి. విరోధులూ ఏర్పడతారు. ధనం వలన సభలలో గౌరవం, గొప్పతనం పెరుగుతుంది. ఎంతమంచి గుణాలు కలవారికైనా ధనం వలన మాత్రమే పైన చెప్పినవన్నీ ఏర్పడతాయి.

ప్రశ్న 3.
వృద్ధులకు సేవ చేయవలసిన అవసరాన్ని గురించి మీ మాటల్లో చెప్పండి.
జవాబు:
వృద్ధులకు సేవ చేస్తే పండితులకు కూడా మనపై ప్రేమ కలుగుతుంది. మెచ్చుకొంటారు. బుద్ధిమంతుడంటారు. – మహాజ్ఞాని అంటారు. పవిత్రమైన చరిత్ర కలవాడంటారు. మంచి ధర్మాత్ముడంటారు. మన కీర్తి, జ్ఞానం, బుద్ధి, పవిత్రత, ధర్మ బుద్ధి పెరగాలంటే వృద్ధులకు సేవ చేయాలి.

AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం

ప్రశ్న 4.
కింది పద్యం చదివి భావం రాయండి.
జవాబు:
చందమామ ఇచ్చు చల్లని వెన్నెల
తేనెటీగ ఇచ్చు తీపి మధువు
మనిషివైన నీవు మరిఏమి తక్కువ
మంచిమాట లెపుడు మరువవద్దు !

భావం :
చందమామ చల్లని వెన్నెలనిస్తుంది. తేనెటీగ తియ్యని తేనెనిస్తుంది. నీవు మనిషివి. తక్కువ వాడవు కాదు. చల్లని, తియ్యని మాటలు మాట్లాడడం మరచిపోకు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
క్షమ వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
జవాబు:
క్షమ వలన సంపద కలుగుతుంది. మంచి మాట (విద్య) వస్తుంది. సౌఖ్యాలన్నీ కలుగుతాయి. దయామయుడైన శ్రీహరి మెప్పును కూడా క్షమ వలన పొందవచ్చును.

ప్రశ్న 2.
వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞానవంతుని లక్షణాన్ని గురించి ఏమని చెప్పారు?
జవాబు:
ఇతరులను తిడితే మన నోరు పాపంతో బురద ప్రదేశంగా మారుతుంది. పెద్దలను స్తుతిస్తే నోరు పవిత్రం అవుతుంది. కనుక జ్ఞానవంతుడు తన నోటితో మంచి మాటలనే మాట్లాడతాడని వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞానవంతుని లక్షణాన్ని గురించి చెప్పారు.

ప్రశ్న 3.
వృద్ధులను ఎందుకు సేవించాలి?
జవాబు:
వృద్ధులకు సేవ చేస్తే పండితులకు కూడా మనపై ప్రేమ కలుగుతుంది. మెచ్చుకొంటారు. బుద్ధిమంతుడంటారు. ఈ – మహాజ్ఞాని అంటారు. పవిత్రమైన చరిత్ర కలవాడంటారు. మంచి ధర్మాత్ముడంటారు. మన కీర్తి, జ్ఞానం, బుద్ధి, పవిత్రత, ధర్మ బుద్ధి పెరగాలంటే వృద్ధులకు సేవ చేయాలి.

AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం

ప్రశ్న 4.
సత్యవాక్కువలన కలిగే ప్రయోజనాలు ఏవి?
జవాబు:
సత్యం మాట్లాడడం వలన కీర్తి పెరుగుతుంది. సత్యం మాట్లాడడం వలన జన్మ వలన వచ్చిన అజ్ఞానం నశిస్తుంది. సత్యం వలన మన స్వభావం స్థిరంగా ఉంటుంది. అందుచేత సత్యవాక్కుతో సమానమైన వ్రతం లేదు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా”? అనే విషయాన్ని కవి ఎలా తెలియజేశారు?
జవాబు:
బంగారం అగ్నిలో కాలుతుంది. సుత్తి దెబ్బలను భరిస్తుంది. మంచి ఆభరణంగా తయారౌతుంది. మెరిసిపోతుంది. అలాగే భవిష్యత్తు బాగుండాలంటే బాధలను ఓర్చుకోవాలి. అని కవిగారు చెప్పారు. బంగారం అగ్నికి భయపడినా, సుత్తి దెబ్బలకు భయపడినా ఆభరణంగా తయారవ్వదు. అందరినీ ఆకర్షించేటంత మెరుపును సంపాదించలేదు కదా ! అలాగే భవిష్యత్తు బాగుండాలంటే బాధలకు భయపడకూడదు. ఓర్చుకోవాలి, అని కవిగారి భావన.

ప్రశ్న 2.
“రాగిపై పూసిన బంగారం చెదిరిపోవును” అని కవి అనడంలో ఆంతర్యం ఏమిటి?
జవాబు:
బంగారం వస్తువుగా తయారవ్వాలంటే కొద్దిగా రాగి కలపాలి. బంగారం విలువైనది. రాగికి విలువ తక్కువ. రాగి పైన బంగారం పూత వేస్తే అదంతా బంగారమే అనిపిస్తుంది. కానీ, కొంతకాలానికి ఆ విలువైన బంగారు పూత పోతుంది. విలువ తక్కువైన రాగి బయట పడిపోతుంది.

అలాగే తప్పు పనిని చేసి, దానిని నేర్పుగా కప్పి పుచ్చినా కొద్దికాలమే దాగుతుంది. ఎప్పటికైనా తప్పు బయటపడి పోతుంది. తప్పుచేసినపుడు అంగీకరించాలి. అప్పుడు గౌరవం నిలబడుతుందని కవి భావన.

ప్రశ్న 3.
మహాత్ములకు ఉండవలసిన సహజ లక్షణాలు ఏవి?
జవాబు:
మహాత్ములకు సంపద లేకపోయినా, బంగారు ఆభరణాలు లేకపోయినా పరవాలేదు. వారి చేతులకు నిత్యం – దానం చేసే గుణం ఉండాలి. నోటితో నిజం మాత్రమే చెప్పాలి. గురువుల పాదాలకు నమస్కరించే శిరస్సు ఉండాలి. జబ్బలలో మొక్కవోని బలం ఉండాలి. మనసులో మంచి నడత ఉండాలి. చెవులు మంచి విద్యలను వినాలి. ఇవి మహాత్ములకు సహజంగా ఉండాలి. ఉంటాయి. అందుకే అవే వారికి మంచి కాంతివంతమైన ఆభరణాలని కవిగారు చెప్పారు.

ప్రశ్న 4.
ఈ పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి లక్షణాలను రాయండి.
జవాబు:
ఓర్పు వలన సంపద కలుగుతుంది. మంచి చదువు వస్తుంది.. సౌఖ్యాలు కలుగుతాయి. దయామయుడైన విష్ణువు కూడా ఓర్పుగల వారిని మెచ్చుకొంటాడు. కనుక ఓర్పుతో ఉండాలి. ధనం వలన స్నేహం, వైరం, కీర్తి కలుగుతుంది. వృద్ధులను సేవించాలి. పరులను తిట్టకూడదు. పెద్దలను కీర్తించాలి. సత్యమునే మాట్లాడాలి. గురుభక్తి కలిగి ఉండాలి. వినయం కలిగి ఉండాలి. విద్యలపై నమ్మకం ఉండాలి. నిరంతరం అభ్యాసం చేయాలి. నేర్చుకొన్న దానిని జ్ఞాపకం ఉంచుకోవాలి. పునశ్చరణ చేయాలి.

భవిష్యత్తు బాగుండాలంటే బాధలకు భయపడకూడదు. ఓర్చుకోవాలి. తప్పును కప్పి పుచ్చుకోకూడదు. నిత్యం దానాలు చేయాలి. నిజం పలకాలి. గురువులకు భక్తితో నమస్కరించాలి, బలంగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.

ఈ విధంగా ఈ పాఠంలోని పద్యాల ఆధారంగా చాలా మంచి లక్షణాలను నేర్చుకొన్నాం.

భాషాంతాలు

అ) కింది వాక్యాలను చదవండి. గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : మనిషికి ధనంపై మోహం ఉండరాదు.
మోహం = కోరిక

1. క్షమ వలన సిరి లభిస్తుంది.
క్షమ = ఓర్పు

2. స్నేహితులతో వైరం మంచిదికాదు.
వైరం = విరోధం

3. తామరలు పంకిలం నుండి వికసిస్తాయి.
పంకిలం = బురద ప్రదేశం

4. భాస్కరుడు లోకానికి వెలుగునిస్తాడు.
భాస్కరుడు = సూర్యుడు

ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలను (పర్యాయ పదాలు) గుర్తించి రాయండి.

1. కరముతో అన్నం తింటాము. హస్తములో జాతక రేఖలుంటాయి.
చేయి = కరము, హస్తము

2. ధనమే అన్నింటికీ మూలం. సంపద లేక పేదలు ఆకలితో పస్తులుంటున్నారు.
సిరి = ధనము, సంపద

3. ఆడపిల్ల చదువు అవనికే వెలుగు. భూకంపం వల్ల పుడమి కుంగుతుంది.
భూమి = అవని, పుడమి

4. కంసాలి పసిడితో ఆభరణాలు చేస్తాడు. ఆడవారికి పుత్తడిపై మమకారం ఎక్కువ.
కనకం = పసిడి, పుత్తడి

ఇ) కింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి.
ఉదా : పాపం × పుణ్యం

1. ధర్మం × అధర్మం
2. సురులు × అసురులు
3. విద్య × అవిద్య
4. చెడు × మంచి

AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం

ఈ) కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.

1. విద్య అ) అంచ
2. అగ్ని ఆ) విద్దె
3. ధర్మము ఇ) మొగము
4. హంస ఈ) అగ్గి
5. ముఖము ఉ) దమ్మము

జవాబు:

1. విద్య ఆ) విద్దె
2. అగ్ని ఈ) అగ్గి
3. ధర్మము ఉ) దమ్మము
4. హంస అ) అంచ
5. ముఖము ఇ) మొగము

పదకేళి

ఉ) కింది పదపట్టిక ఆధారంగా శతకాలను, శతక కర్తలను గుర్తించండి. వాటి చుట్టూ గీతగీసి ఖాళీలలో రాయండి.
AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం 2
ఉదా : పక్కి అప్పల నరసయ్య రాసిన శతకం?
జవాబు:
కుమార

1. ధూర్జటి రాసిన శతకం?
జవాబు:
కాళహస్తీశ్వర

2. వీరబ్రహ్మం గారు రాసిన శతకంలోని మకుటం
జవాబు:
కాళికాంబ

3. మారద వెంకయ్య రాసిన శతకం?
జవాబు:
భాస్కర

4. తెలుగుబాల శతక కర్త?
జవాబు:
కరుణశ్రీ

5. కంచర్ల గోపన్న రాసిన శతకం?
జవాబు:
దాశరథి

6. సుమతీ శతకం రాసిందెవరు?
జవాబు:
బద్దెన

7. నార్ల చిరంజీవి రాసిన శతకం?
జవాబు:
తెలుగుపూలు

8. సిరిసిరి మువ్వ శతక కర్త?
జవాబు:
శ్రీ శ్రీ

9. కాళికాంబ సప్తశతి శతక మకుటంలోని పక్షి?
జవాబు:
హంస

10. సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు?
జవాబు:
ఏనుగు

వ్యాకరణాంశాలు

అ) కింద విడదీసిన పదాలను కలిపి రాయండి.
ఉదా : జనులు + ఎల్ల = జనులెల్ల
1. దెబ్బలకు + ఓర్చి = దెబ్బలకోర్చి
2. సొమ్ములు + అగుచు = సొమ్ములగుచు
3. సూర్యుడు + ఒక = సూర్యుడొక
4. బాధలు + ఓర్చుకున్న = బాధలోర్చుకున్న

పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివర ‘ఉ’ ఉంది. రెండవ పదం (పర పదం) మొదట ‘అ, ఇ, ఎ’. వంటి అచ్చులున్నాయి. ఇలా ‘ఉ’ కారానికి అచ్చులు పరమైతే సంధి తప్పక జరిగి ‘ఉకార సంధి’ రూపాలు : ఏర్పడుతాయి.

కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
ఉదా : సౌఖ్యములెల్లన్ = సౌఖ్యములు + ఎల్లన్ (ఉకార సంధి)

1. పంకిలమౌను = పంకిలము + ఔను (ఉకార సంధి)
2. కార్యములెల్ల = కార్యములు + ఎల్ల (ఉకార సంధి)

ఆ) కింది విడదీసిన పదాలను కలిపి రాయండి.
ఉదా : శుద్ది + అగును = శుద్ధియగును

1. లేని + అప్పుడున్ = లేనియప్పుడున్, లేనప్పుడున్
2. మూసిన + అంతటన్ = మూసినంతటన్, మూసినయంతటన్
3. ప్రేమ + ఒసంగ = ప్రేమొసంగ, ప్రేమయొసంగ
4. ముట్టక + ఉండదదేట్లు = ముట్టకుండదదెట్లు, ముట్టకయుండదదెట్లు

పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివర ‘అ, ఇ’ వంటి అచ్చులున్నాయి. రెండవ పదం (పర పదం) మొదట అ, ఉ, ఒ వంటి అచ్చులు ఉన్నాయి. ఇక్కడ పూర్వ, పర పదాల మధ్య సంధి జరగనప్పుడు ‘య్’ ఆగమంగా వచ్చి ‘యడాగమ సంధి’ రూపాలు ఏర్పడుతాయి.

ఇ) కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
ఉదా : కాళికాంబ = కాళిక + అంబ (సవర్ణదీర్ఘ సంధి)

1. గురూపదేశం = గురు + ఉపదేశం (సవర్ణదీర్ఘ సంధి)
2. చరణాభివాదనం = చరణ + అభివాదనం (సవర్ణదీర్ఘ సంధి)
3. విద్యార్థి = విద్యా + అర్థి (సవర్ణదీర్ఘ సంధి)
4. ఋషీశ్వరుడు = ఋషి + ఈశ్వరుడు (సవర్ణదీర్ఘ సంధి)

పైన విడదీసిన పదాలు. సంస్కృత పదాలు, వాటిని గమనించండి. మొదటి పదాల చివర ‘అ, ఇ, ఉ’ లలో ఏదో ఒకటి ఉంది. రెండవ పదాల మొదట కూడా అవే అచ్చులు (ఉ – ఉ, అ – అ, అ – అ, ఇ – ఈ) ఉన్నాయి కదా ! మొదటి పదం చివర, రెండవ పదం మొదట (అ, ఇ, ఉ, ఋ) లలో ఒకే అచ్చు ఉంటే అవి కలిసినపుడు దీర్ఘం వస్తుంది. గమనించండి.

1. (ర్) + ఉ = ర్ ఊ = రూ
2. (ణ్) అ + అ = ణ్ ఆ = ణా
3. (ద్‌య్) ఆ + అ = య్ ఆ = ద్యా
4. (ష్) ఇ + ఈ = ష్ ఈ = షీ

ఏర్పడ్డాయి కదా ! దీనిని సవర్ణదీర్ఘ సంధి అంటారు. ఎందుకంటే సవర్ణములు అంటే అవే అక్షరాలు మొదటి పదం చివర, రెండవ పదం మొదట ఉండి, అవి కలసి వాని దీర్ఘాలుగా ఏర్పడ్డాయి కనుక.

AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం

ఈ) కింద గీతగీసిన పదాలలోని ప్రత్యయాలను గుర్తించి, ఏ విభక్తులో రాయండి.
ఉదా : వృద్ధ జనుల యొక్క సేవ = షష్ఠి విభక్తి

1. పరులను తిట్ట నోరు = ద్వితీయా విభక్తి
2. సుత్తి దెబ్బలకు ఓర్చి = షష్ఠీ విభక్తి
3. గురువు యందు భక్తి = సప్తమీ విభక్తి
4. ఆంధ్ర పుత్రుడా ! మేలుకో = ఓ – సంబోధన ప్రథమా విభక్తి
5. విద్య చేత వర్థిల్లుము = తృతీయా విభక్తి
6. వృక్షము అవనిని రక్షించును = ప్రథమా విభక్తి
7. క్షమ వలన సిరి కలుగును = పంచమీ విభక్తి
8. పరుల కొరకు జీవించుము = చతుర్డీ విభక్తి

ఉ) కింది వాక్యాలను చదవండి. గీతగీసిన పదాలను విడదీసి రాయండి.

1. మాయమ్మ వంట రుచికరంగా చేస్తుంది.
2. దుక్కిటెద్దు రంకె వేసింది.
3. పిల్లల మనసు చిగురుటాకు వంటిది.
4. సుమతి గుణవంతురాలు.
5. గంగవ్వ బీదరాలు.
ఉదా : బీదరాలు = బీద + (ర్) ఆలు
1. మాయమ్మ = మా + (య్) అమ్మ
2. దుక్కిటెద్దు = దుక్కి + (ట్) ఎద్దు
3. చిగురుటాకు చిగురు + (ట్) ఆకు
4. గుణవంతురాలు = గుణవంత + (ర్) ఆలు

పై ఉదాహరణల్లో పూర్వ పర స్వరాలకు మధ్యలో య్ -ట్ – ర్ లు అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఇలా చేరడాన్ని ‘ఆగమం’ అంటారు.

ఆదేశం

ఊ) కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను విడదీయండి.

1. తల్లిదండ్రులకు కష్టం కలిగించరాదు.
2. సుధ సంతలో కూరగాయలు కొన్నది.
3. రాజుకు గుఱ్ఱపుకళ్ళెం దొరికింది.
4. కరోనా సోకకుండా ఉండాలంటే కాలుసేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

ఉదా : తల్లిదండ్రులు = తల్లి + తండ్రి + (లు)

1. కూరగాయలు = కూర + కాయ + (లు)
2. గుఱ్ఱపుకళ్ళెం = గుఱ్ఱము + కళ్లెం
3. కాలుసేతులు = కాలు + చేయి + తి + తు + (లు)

పై ఉదాహరణలలో పూర్వ, పర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. ఇలా ఒక అక్షరం స్థానంలో మరో అక్షరం రావడాన్ని ‘ఆదేశం’ అంటారు.

చతుర్థి విభక్తి

ఋ) కింది పట్టికను గమనించండి. పట్టిక ఆధారంగా జతపరచి రాయండి.
AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం 3
ఉదా : తిండి గింజల కొరకు పావురాలు నేలపై వాలాయి.

1. వంట కొరకు = వంట కొఱకు కట్టెలు కొట్టబడినవి.
2. గాలి కొరకు = గాలి కొఱకు కిటికీలు తెరిచారు.
3. వామనుని కొరకు = వామనుని కొఱకు బలి మూడడుగుల నేల దానం చేశాడు.
4. సూర్యోదయం కొరకు = సూర్యోదయం కొలుకు, పద్మాలు వేచి ఉన్నాయి.
5. దశరథుడు పుత్రసంతానం కొరకు = దశరథుడు పుత్రసంతానం కొలకు పుత్రకామేష్టి యాగం చేశాడు.

పై వాక్యాలలో ‘కొరకు’ ప్రత్యయం పదాల మధ్య చేరింది. ఈ విధంగా “కొరకున్, కై” అనే ప్రత్యయాలు చేరితే దానిని చతుర్థి విభక్తి అంటారు. పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యాలలో ఈ ‘చతుర్థి విభక్తి’ వస్తుంది. ఆధునిక కాలంలో ‘కొరకు’ ప్రత్యయానికి బదులు ‘కోసం’ అనే పదాన్ని వాడుతున్నారు.

ప్రాజెక్టుపని

శతక కవులకు సంబంధించిన విషయాలను సేకరించి కింది పట్టికను తయారుచేయండి.
జవాబు:
AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం 4
AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం 5

చమత్కార పద్యం

చలన శక్తి గలదు జంతువు గాదది
చేతులెపుడు తిప్పు శిశువు గాదు
కాళ్ళు లేవు సర్వకాలంబు నడచును
దీని భావమేమి తిరుమలేశ !

వివరణ :
ఇది పొడుపు కథ. తెలుగు సాహిత్యంలో ప్రత్యేకస్థానం ఉన్న వీటి సృష్టికర్తలు పల్లె ప్రజలే. కాలక్షేపం కోసం అడిగే చిన్న చిన్న ప్రశ్నలను “పొడుపు కథలు” అంటారు.

భావం :
కదిలే శక్తి ఉన్నా ఇది ప్రాణికాదు. పసిపిల్లల్లాగా చేతులు కదుపుతుంది కాని ఇది శిశువు కాదు. కాళ్ళు లేవు కాని 24 గంటలూ నడుస్తూనే ఉంటుంది. దీని అర్థం ఏమి ఓరి దేవుడా ! (తిరుమలేశ)
జవాబు:
గడియారం :
(కాలాన్ని / సమయాన్ని తెలపటానికి గడియారంలోని ముల్లులు తిరుగుతూనే ఉంటాయి. కదిలే శక్తి ప్రాణులకే ఉంటుంది. గడియారంలోని ముల్లులు కదులుతున్నా గడియారం ప్రాణికాదు కదా !)

AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం

మీకు తెలుసా?

శౌరి
శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు. వసుదేవుని తండ్రి శూరుడు. శ్రీకృష్ణుడు శూరుని మనువడు కాబట్టి ఆయనకు – ‘శారి’ అని పేరు వచ్చింది.

భవమోహపాశములు
‘భవము’ అనగా పుట్టుక, ఉనికి అని, ‘మోహము’ అనగా వలపు, భ్రాంతి అని, ‘పాశము’ అనగా త్రాడు, . బంధము అని అర్థాలు. ఈ మూడింటిని కలిపి భవమోహపాశములు అంటున్నారు. పుట్టుకతో వచ్చే కోరిక సంబంధ బాంధవ్యాలను ‘భవమోహపాశములు’ అంటారు.

కవుల పరిచయం

1) పోతన:

కవి పేరు : బమ్మెర పోతన
జననం : క్రీ.శ. 1450లో జనగాం జిల్లాలోని బమ్మెరలో జన్మించారు. 15వ శతాబ్దపు కవి.
తల్లిదండ్రులు : లక్కమాంబ, కేసయ దంపతులు
రచనలు : భోగినీ దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, శ్రీమదాంధ్ర మహాభాగవతం.
బిరుదులు : సహజకవి
ప్రత్యేకతలు :
మహా భక్తకవి, తన భాగవతాన్ని నరులకు అంకితం ఇవ్వనని, శ్రీరామునకే అంకితం ఇచ్చాడు. వ్యవసాయం చేసుకొని జీవించాడు. ఎవ్వరి దగ్గరా చేయి చాపని ఆత్మాభిమాని.

2) పక్కి అప్పల నరసయ్య

కవి పేరు : పక్కి అప్పల నరసయ్య
కాలం : 16వ శతాబ్దం
రచనలు : కుమార శతకం, కుమారీ శతకం

3) మారద వెంకయ్య:

కవి పేరు : మారద వెంకయ్య
కాలం : 1550 – 1650 (16వ శతాబ్దం)
నివాసం : శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రాంతాలలో నివసించిన కళింగ కవి.
ప్రత్యేకతలు :
ఈయన ఇంటి పేరును మారయ, మారవి అని కూడా అంటారు. అరసవిల్లి సూర్యదేవాలయం లోని సూర్యభగవానుని సంబోధిస్తూ భాస్కర శతకం వ్రాశాడు. దీనిలో దృష్టాంతాలంకారాలు ఎక్కువగా ఉపయోగించాడు.

4) పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కవి పేరు : పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
జననం : వై.యస్.ఆర్. కడపజిల్లా, కందిమల్లయ్య పల్లెలో క్రీ.శ. 1610లో జన్మించారు. (17వ శతాబ్దం)
తల్లిదండ్రులు : ప్రకృతాంబ, పరిపూర్ణమాచార్యులు దంపతులకు జన్మించారు. వీరపాపమాంబ, వీరభోజయా చార్య దంపతులు పెంచారు.
భార్య : గోవిందమ్మ
కుమార్తె : వీర నారాయణమ్మ
రచనలు : కాలజ్ఞానం, కాళికాంబ హంస కాళికాంబ శతకం. 1693లో సమాధి చెందారు.

5) గువ్వల చెన్నడు

కవి పేరు : గువ్వల చెన్నడు జననం : వై.యస్. ఆర్. కడపజిల్లా, రాయచోటి ప్రాంతం.
ప్రత్యేకతలు : లోకనీతిని, రీతిని పరిశీలించి సమాజ శ్రేయస్సు కోసం శతకం రచించాడు.
రచనలు : గువ్వల చెన్న శతకం
కాలం : 17వ శతాబ్దం

6) ఏనుగు లక్షణకవి:

కవి పేరు : ఏనుగు లక్ష్మణకవి
కాలం : 18వ శతాబ్దం
జననం : తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం
తల్లిదండ్రులు : పేరమాంబ, తిమ్మకవి
రచనలు :
సుభాషిత రత్నావళి, రామేశ్వర మాహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, సూర్యశతకం, గంగా మహాత్మ్యం మొదలైన 11 గ్రంథాలను రచించాడు.
ప్రత్యేకతలు :
వీరి ఇంటి పేరు పైడిపాటి. వీరి ముత్తాతగారు పైడిపాటి జలపాతమాత్యుడు. ఆయనకు పెద్దాపురం సంస్థానాధీశులు ఏనుగును బహుమానంగా ఇచ్చారు. అప్పటి నుండీ వీరి ఇంటిపేరు ఏనుగుగా మారింది.

7) చుక్కాకోటి వీరభద్రమ్మ:

కవి పేరు : ‘చుక్కా కోటి వీరభద్రమ్మ
నివాసం : వల్లూరుపాలెం, కృష్ణాజిల్లా
కాలం : 20వ శతాబ్దం
రచన : నగజా శతకం (1940లో అచ్చయింది)

8) గద్దల శాంయూల్ :

కవి పేరు : గద్దల శాంయూల్
కాలం : 20వ శతాబ్దం
రచన : హితోక్తి శతకం

9) జెండామాన్ ఇస్మాయిల్:

కవి పేరు : జెండామాన్ ఇస్మాయిల్
నివాసం : కర్నూలు
రచనలు : లలిత కల్పవల్లి – తెలుగు తల్లి (పద్య సంకలనం), అఖిలలోక మిత్ర – ఆంధ్ర పుత్ర శతకం, సూక్తి సుధా లహరి శతకం
వృత్తి : తెలుగు ఉపాధ్యాయుడు
అవార్డులు :
2002లో జిల్లాస్థాయి, 2003లో రాష్ట్రస్థాయి, 2006లో జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందారు.

ప్రత్యేకతలు :
పాఠ్యపుస్తక రచయిత, బాల సాహిత్యానికి, పద్య రచనకు చాలా కృషి చేశారు. ‘మహతి’ సాహితీ సంస్థను నెలకొల్పారు. దానికి కార్యదర్శిగా పనిచేశారు.

కాలం : ఆగస్టు 5, 2020 వరకు జీవించారు. తన 66వ ఏట స్వర్గస్తులయ్యారు.

పద్యాలు – అర్థాలు – భావాలు

1. కం|| క్షమ గలిగిన సిరి గలుగును
క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్
క్షమ గలుగఁ దోన కలుగును
క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుఁడు తండ్రీ ! – ఆంధ్ర మహాభాగవతం
అర్థాలు :
తండ్రీ = ఓ నాన్నా !
క్షమన్ = ఓర్పు
కలిగిన = ఉంటే
సిరి = డబ్బు
కలుగును = కలుగుతుంది
క్షమన్ = ఓర్పు
కలిగిన = ఉంటే
వాణి = మంచిమాట (సరస్వతి)
కలుగు = ఉంటుంది
క్షమన్ = ఓర్పు
కలుగన్ = ఉంటే
తోన = దానితోనే
సౌఖ్యము లెల్లన్ = సౌకర్యాలన్నీ
తెచ్చును = తెస్తుంది
కలుగును = కలుగుతాయి
క్షమన్ = ఓర్పును
కలిగిన = కలిగి ఉంటే
సదయుడు = కరుణామయుడైన
శౌరి = శ్రీహరి
మెచ్చు = మెచ్చుకొంటాడు

భావం :
ఓ తండ్రీ ! ఓర్పు కలిగితే సంపద కలుగుతుంది. మంచిగా మాట్లాడడం (చదువు) వస్తుంది. సౌఖ్యాలన్నీ క్షమతోనే వస్తాయి. కరుణామయుడైన శ్రీహరి కూడా ఓర్పుగల వానిని మెచ్చుకొంటాడని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో అన్నాడు.

AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం

2. కం||| ధనమే మైత్రినిఁదెచ్చును
ధనమే వైరమును దెచ్చు ధనమే సభలన్
ఘనతను దెచ్చును నెంతటి
గొనముల కుప్పలకునైన గువ్వలచెన్నా ! -గువ్వల చెన్న శతకం
అర్థాలు :
గువ్వలచెన్నా = ఓ గువ్వల చెన్నా !
ఎంతటి = ఎంతగొప్ప
గొనముల = గుణాల కుప్పలకునైన = రాశులకు (కలవారికైనా)
ధనమే = డబ్బే
మైత్రినిన్ = స్నేహాన్ని
తెచ్చును తెస్తుంది
ధనమే = డబ్బే
వైరమును = విరోధాన్ని
తెచ్చు = తెస్తుంది
ధనమే = డబ్బే
సభలన్ = కొలువులలో కలిగిన
ఘనతనున్ = గొప్పతనాన్ని కూడా

భావం :
ఓ గువ్వలచెన్నా ! ఎంత గొప్ప గుణవంతుల కైనా ధనమే స్నేహాన్ని పెంచుతుంది. డబ్బే విరోధం తెస్తుంది. సభలలో గొప్పతనాన్ని కూడా డబ్బే తెస్తుంది.

3. కం|| వృద్ధ జన సేవఁజేసిన
బుద్ధి విశేషజ్ఞుడనుచుఁబూత చరితుడున్
సద్ధర్మశాలియని బుధు
లిద్దరఁ బొగడెదరు ప్రేమయెసంగ కుమారా ! – కుమార శతకం
అర్థాలు :
కుమారా ! = ఓ కుమారుడా !
వృద్ధజన = ముసలివారి
సేవన్ = సేవను
చేసిన = చేస్తే
బుద్ధి = తెలివిగలవాడు
విశేషజ్ఞుడు . = అన్నీ తెలిసినవాడు
అనుచున్ = అంటూ
పూత = పవిత్రమైన
చరితుడున్ = చరిత్ర కలవాడు
సత్ = మంచి
ధర్మశాలి = ధర్మాత్ముడు
అని = అని అంటూ
ప్రేమ, ఆప్యాయత
ఎసంగ = అతిశయించగా
ఈ + ధరన్ = ఈ లోకంలో (ఈ భూమిపై)
బుధులు = పండితులు
పొగడెదరు = మెచ్చుకొంటారు

భావం :
ఓ కుమారా ! పెద్దలకు సేవ చేస్తే తెలివైనవాడని, విశేషమైన జ్ఞానం కలవాడనీ, పవిత్రుడనీ, మంచి ధర్మాత్ముడని ఈ భూలోకంలోని పండితులు ప్రేమతో మెచ్చుకొంటారు.

4. ఆ.వె||పరుల దిట్ట నోరు పాప పంకిల మౌను
పెద్దలను నుతింప శుద్ధియగును
నోటి మంచి తనము పాటించు సుజ్ఞాని
కాళికాంబ ! హంస కాళికాంబ ! – కాళికాంబ సప్తశతి
అర్థాలు :
కాళికాంబ = కాళికామాతా !
హంస = పరమాత్మ స్వరూపమైన
కాళికాంబ = ఓ కాళికామాతా !
పరులన్ = ఇతరులను
తిట్ట = తిడితే
నోరు = మననోరు
పాప = పాపముతో
పంకిలము = బురదకల ప్రదేశం
ఔను = అవుతుంది
పెద్దలను = పెద్దవారిని
నుతింప = స్తోత్రము చేస్తే
శుద్ధి = పవిత్రం
అగును = ఔతుంది – అందుకే
సుజ్ఞాని = మంచి జ్ఞానము కలవాడు
నోటి = నోరు యొక్క
మంచితనము = మంచితనాన్ని (మంచిగా మాట్లాడే పద్ధతిని)
పాటించు = ఆచరిస్తాడు

భావం :
కాళికామాతా ! పరమాత్మ స్వరూపిణివైన ఓ కాళికా మాతా ! ఇతరులను తిడితే మన నోరు పాపమనే బురద కల ప్రదేశమౌతుంది. పెద్దలను స్తుతిస్తే పవిత్రం’ ఔతుంది. అందుకే మంచి జ్ఞానము కలవాడెప్పుడూ నోటితో మంచి మాటలనే మాట్లాడతాడు.

AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం

5. కం|| సత్యమె యశముకు మూలము
సత్యమె భవమోహపాశ సంసృతి బాపున్
సత్యమె శీలము నిలుపును
సత్యముతో నెట్టివ్రతము చాలదు నగజా – నగజా శతకం
అర్థాలు :
నగజా = హిమాలయ పర్వతం యొక్క కుమార్తెవైన పార్వతీ దేవి !
సత్యమె = నిజం చెప్పడమే
యశముకు = కీర్తికి
మూలము = ప్రధానమైనది
సత్యమె = నిజమైన ప్రవర్తనే (నిజం చెప్పడమే)
సంసృతి – సంసారమునందలి
భవ = పుట్టుక వలన వచ్చిన
మోహపాశము = అజ్ఞానం అనే పాశమును
బాపున్ = నశింపచేస్తుంది
సత్యమె = నిజమే
శీలము = మన నడతను
నిలుపును = కాపాడుతుంది
సత్యముతో = నిజం చెప్పడంతో
ఎట్టివ్రతము = ఏ రకమైన నోము
చాలదు = సరిపోదు

భావం :
ఓ హిమాలయ పర్వత కుమార్తెవైన పార్వతీదేవీ! సత్యం చెప్పడమే కీర్తికి కారణం, సత్యం చెప్పడం వలననే సంసారంలో పుట్టుక వలన. వచ్చిన అజ్ఞాన బంధాన్ని నశింప చేస్తుంది. సత్యమే మన నడతను నిలుపుతుంది. అందుకే సత్యవ్రతాన్ని మించిన వ్రతం లేదు.

6. కం||గురుభక్తియు విద్యల పై
తరగని విశ్వాస సంపద వినయము నిరం
తర సాధన, ధారణ పున
శ్చరణము విద్యార్థికి యవసర లక్షణముల్ – హితోక్తి శతకం
అర్థాలు :
గురుభక్తియు = గురువులపై భక్తీ
విద్యలపై = చదువులపై
తరగని = తగ్గని
విశ్వాస సంపద = విశ్వాసమనే ఐశ్వర్యం
వినయము = అణకువ
నిరంతరం = ఎల్లప్పుడూ
సాధన = అభ్యాసం
ధారణ = జ్ఞాపకశక్తి
పునః = తిరిగి
చరణము = గురుచేసుకోవడం
విద్యార్థికి = చదువుకొనేవానికి
అవసర = కావలసిన
లక్షణముల్ = లక్షణాలు

భావం :
గురువులపట్ల భక్తి, చదువులపట్ల అపార నమ్మకం, పెద్దలపట్ల వినయం, నిరంతరం కష్టపడేతత్వం, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం (ధారణ), నేర్చుకున్న అంశాన్ని వల్లె వేసుకోవడం అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరం.

AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం

7. ఆ.వె.|| చూడనగ్నిఁ గాలి సుత్తి దెబ్బలకోర్చి
మేలి సొమ్ములగుచు మెరియుఁ బసిడి
బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా
అఖిల లోకమిత్ర ! ఆంధ్రపుత్ర ! – ఆంధ్రపుత్ర శతకం
అర్థాలు :
అఖిల = అన్ని
లోక = లోకాలకూ
మిత్ర = స్నేహితుడా !
ఆంధ్రపుత్ర = తెలుగుబిడ్డా !
చూడన్ = ఆలోచించగా
పసిడి = బంగారం
అగ్నిన్ = నిప్పులతో
కాలి = కాలి
సుత్తిదెబ్బలకు = సుత్తి దెబ్బలకు
ఓర్చి = ఓర్చుకొని
మేలి = విలువైన
సొమ్ములగుచు = ఆభరణాలవుతూ
మెరయున్ = మెరుస్తుంది కదా ! (అలాగే)
బాధలు = కష్టాలను
ఓర్చుకొన్న = తట్టుకొంటే
భవిత = భవిష్యత్తు
వర్ధిల్లురా = వృద్ధి చెందుతుంది

భావం :
ఓ ఆంధ్ర పుత్రుడా ! బంగారం అగ్నిలో కాలి, సుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది. అదే విధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.

8. ఉ||చేసిన దుష్టచేష్ట నదిచెప్పక, నేర్పునఁగప్పిపుచ్చి తా
మూసినయంతటన్, బయలుముట్టక యుండదదెట్లు, రాగిపై
బూసిన బంగరుం జెదరి పోవగడంగిన నాడు నాటికిన్
దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగ భాస్కరా ! – భాస్కర శతకం
అర్థాలు :
భాస్కరా – ఓ సూర్య దేవా!
దుష్టచేష్టన్ = తప్పుడు పనిని
చేసిన = చేసినట్లైతే
అది = దానిని
చెప్పక = ఎవ్వరికీ చెప్పకుండా
నేర్పునన్ = నైపుణ్యంతో
కప్పిపుచ్చి = దాచి ఉంచి
తాన్ = తాను
మూసిన = దాచిపెట్టినా
అంతటన్ = ఐనా
బయలుముట్టక = బయట పడక
ఉండదు = ఉండదు కదా !
అది = ఆ.విషయం
ఎట్లు = ఎలాగంటే
రాగిపై = రాగిపైన
పూసిన = పూసినటువంటి
బంగరున్ = బంగారం
చెదరిపోవన్ = చెదరిపోవడం
కడంగిన = ప్రారంభించిన
నాడు = రోజున
నాటికిన్ = అప్పటికి
తాసిన = తాపడం చేసిన
రాగి = రాగిని
జనులెల్లన్ = జనమందరూ
ఎఱుంగన్ = తెలుసుకొనేలా
కానబడదా = కనిపించదా

భావం :
ఓ సూర్యదేవా ! తప్పుడు పనులు చేసి ఎవ్వరికీ చెప్పకుండా నైపుణ్యంతో దాచినా బయటపడక మానదు. అదెలాగంటే, రాగిపై బంగారం పూసినా కొంత కాలానికి బంగారం చెదిరిపోయి తాపడం కిందనున్న రాగి అందరికీ తెలుస్తుంది కదా !

AP Board 7th Class Telugu Solutions 5th Lesson పద్య పరిమళం

9. చ|| కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం
గురుచరణా భివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్
వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్
సురుచిరభూషణంబులివి శూరులకున్ సిరి లేనియప్పుడున్ – సుభాషిత రత్నావళి
అర్థాలు :
సిరి = డబ్బు
లేని అప్పుడున్ = లేనప్పుడు కూడా
శూరులకున్ = పౌరుషవంతులకు
కరమున = చేతియందు
నిత్యదానము = నిత్యమూ దానం చేయడం
ముఖంబున = నోటిని
సూనృతవాణి = సత్యమైన మాట
ఔదలన్ = శిరస్సున్
గురు = గురువు యొక్క
చరణ = పాదములకు
అభివాదనము = నమస్కారము దోః
దోঃ= భుజములు
యుగంబునన్ = రెండిటియందునూ
అకుంఠిత = తగ్గని
వీర్యము = బలము
వర = శ్రేష్టమైన
హృదయంబునన్ = మనసులో
విశద = కచ్చితమైన
వర్తనము = ప్రవర్తన
వీనులన్ = చెవులయందు
అంచిత విద్య = ఒప్పిదయైన విద్య
ఇవి = ఇవి
సురుచిర = మంచి కాంతివంతమైన
భూషణములు = ఆభరణాలు

భావం :
పౌరుషవంతులకు సిరిలేక పోయినప్పుడు కూడా చేతులకు దానం చేసే గుణం, నోటికి నిజం చెప్పడం, గురువుగారి పాదాలకు నమస్కరించడం శిరస్సుకు, భుజాలకు మొక్కవోని బలం, శ్రేష్ఠమైన హృదయంలో మంచి ప్రవర్తన, చెవులకు ఒప్పిదమైన విద్య అనేవి మంచి కాంతివంతమైన ఆభరణాలు.

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

SCERT AP Board 7th Class Telugu Guide Answers 4th Lesson మఱ్ఱిచెట్టు Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 4th Lesson Questions and Answers మఱ్ఱిచెట్టు

7th Class Telugu 4th Lesson మఱ్ఱిచెట్టు Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు 1

ప్రశ్న 1.
చిత్రాన్ని గమనించండి. మాట్లాడండి.
జవాబు:
పై చిత్రంలో ఒకడు గొడ్డలితో చాలా చెట్లు కొట్టేశాడు. అతను ఒక పెద్ద చెట్టు క్రింద సేద దీరదామని వస్తున్నాడు. తనను కూడా నరికేస్తాడేమోనని పెద్దచెట్టు భయపడింది. తమ జాతికే చెందిన కర్రవెళ్లి గొడ్డలిలో దూరి అతనికి సహాయం చేస్తున్నందుకు ఆ కర్రవైపు పెద్దచెట్టు కోపంగా చూసింది. అతను పెద్ద చెట్టు నీడలో సేద దీరాడు. దాని పళ్లు తిన్నాడు. తను కూడా సహాయమే చేసినందుకు తనమీద తనకే అసహ్యం వేసింది. మళ్లీ ఆలోచించింది. తనను చంపడానికి వచ్చిన వారికి కూడా సహాయం చేసే గొప్ప వృక్షజాతిలో పుట్టినందుకు ఆనందించింది. సహాయం పొంది కూడా చంపడానికి గొడ్డలెత్తే మానవజాతి పై జాలి పడింది.

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
చుట్టూ ఉన్న పరిసరాలలో మానవులకు మేలుచేసే చెట్లు/పక్షులు/జంతువులను గురించి వారి మాటల్లో చెప్పండి. (రాయండి)
జవాబు:
1) మేలు చేసే చెట్లు :
మేమందరం మేలు చేసే చెట్లమే. మీకు ‘నీడనిస్తాం. నిమ్మ, మామిడి, అరటి, కొబ్బరి, బొప్పాయి ఇలా ఎన్ని పేర్లని చెప్పుకోం. మేమంతా మానవులకు, పశువులకు, పక్షులకు, కీటకాలకి అంతెందుకు ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవికీ, ఆహారాన్ని ఇస్తాం. నీడ నిస్తాం. అన్ని జీవులూ మామీద ఆధారపడతాయి. కాని, మేమెవ్వరి మీదా ఆధారపడం, మేము సొంతంగా ఆహారం తయారుచేసుకొంటాం. గాలి, సూర్యకాంతి, మా ఆకులలోని పచ్చదనాన్ని ఉపయోగించుకొని, ఆహారాన్ని తయారుచేస్తాం. అది మీరు తింటారు. మీకు ఆక్సిజన్ అందించేది కూడా మేమే. మీరు మాకేమీ ఉపకారం చేయక్కర్లేదు. మాకు అపకారం తలపెట్టకండి చాలు. ఇప్పటికే సరైన గాలి, చల్లదనం, వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా బుద్ధిలేదు. మమ్మల్ని బ్రతకనివ్వరు. మేం లేకపోతే మీ బ్రతుకు దుర్బరం. అది తెలుసుకోండి. ఐనా వినకపోతే మీ ఖర్మ. (ఈ విధంగా చెప్పండి)

2) పక్షులు :
ప్రకృతిలో మా పక్షుల కిలకిలలు .మీకు వీనుల విందు చేస్తాయి. మా బ్రతుకు మేం బతుకుతుంటే మమ్మల్ని మీరు బతకనివ్వటల్లేదు. మీ ఆహారం కోసం మమ్మల్ని చంపుకొని తింటున్నారు. అయినా సహించాం. మా జాతికి చెందిన కోడి మిమ్మల్ని నిద్ర లేపుతుంది. కోడికి పల్లెటూరి గడియారమని పేరు. కోడిని పకోడిగా చేసుకొని తినేస్తున్నారు. మీ రాక్షసానందం కోసం మా కాళ్లకు కత్తులు కట్టి పోరాటాలు పెడుతున్నారు. నెమలి పింఛం అంత అందమైనదేదీ ఈ సృష్టిలో లేదు. ఆ నెమలి కూడా మీకు బలైపోతుంది. కొంతమంది దయామూర్తులు పక్షి ప్రేమికులు మమ్మల్ని పెంచుతూ కాపాడుతున్నారు. మీ ఆనందం కోసం మమ్మల్ని బాధ పెట్టకండి. చంపకండి.

3) జంతువులు :
మేము జంతువులం. మా బాధ వర్ణనాతీతం. మా బాధలకు ఎక్కువగా కారణమయ్యేది మానవులే. మాలోని ఆవులు, గేదెలు, మేకలు మీకు త్రాగడానికి పాలనిస్తున్నాయి. మా పాలు తాగి బలం పొంది, మమ్మల్నే కోసుకొని తినేస్తున్నారు. మీ ఇళ్లలో పెళ్లి వచ్చినా, చావు వచ్చినా మాకు చావు తప్పదు. మాకు పులులు, సింహాలు కంటే కూడా మాన్క “తేనే భయం. పులులు, సింహాలకే మీరంటే భయం. మీ మూర్ఖత్వానికి మాలోనూ, పక్షులలోనూ కొన్ని రకాల జాతులు నశించిపోయాయి. అక్కడక్కడా జంతు ప్రేమికులుండబట్టి ఈ మాత్రమైనా బతుకుతున్నాం. లేకపోతే మాకసలు బతుకే లేదు.

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

ప్రశ్న 2.
మీరు చూసిన / విన్నటువంటి బాధ / సంతోషం గురించి మీ మాటల్లో చెప్పండి.
జవాబు:
నేను చూసిన బాధ :
ఒకసారి అమలాపురం దగ్గర ఉన్న ఒక గ్రామంలో గ్యాస్ లీకై మండిన సందర్భంలో చాలామంది శరీరాలు కాలిపోయాయి. ఒళ్లంతా కాలిపోయి మంటపుట్టి వాళ్లందరూ గోలగోలగా ఏడుస్తుంటే నాకూ ఏడుపొచ్చేసింది. చాలా సేపు ఏడ్చాను. మా అమ్మా, నాన్న ఎంత ఊరుకో పెట్టినా ఏడుపు ఆగలేదు. ఇది జరిగి చాలాకాలమైంది. కానీ, ఇప్పటికీ చలిమంటంటే కూడా నాకు భయమే.

నేను చూసిన సంతోషం :
మా అక్క లావణ్య పెళ్లి జరిగి రెండేళ్లయింది. మా ఇంటికి చాలామంది చుట్టాలు వచ్చారు. బోలెడన్ని పిండివంటలు చేసారు. ఎన్నో ఆటలు ఆడుకున్నాం. మా లావణ్యక్కను పెళ్లికూతుర్ని చేసిన రోజు అక్క చాలా సిగ్గుపడింది. ఆ సిగ్గు చూసి అందరూ ఒకటే నవ్వు. మా మాధురక్క ఐతే మరీ నవ్వేసింది. మా శివ బావగారు తెగ ఆటపట్టించారు. పెళ్లి పిలుపులకు, బ్యాండు మేళంతో ఊరంతా తిరిగాం. పెళ్లిలో కూడా మేమందరం చాలా ఆనందంగా తిరిగాం. మేమంతా పెళ్లి కొడుకైన సృజిత్ కు కారం కిళ్లీ ఇచ్చి ఏడిపించాం. ఆ పెళ్లి వేడుకలు నాకు చాలా సంతోషాన్నిచ్చాయి.

ప్రశ్న 3.
మఱ్ఱి చెట్టు నిస్వార్ధ బుద్ధితో పక్షులకు, మానవులకు ఎలాంటి సహాయాన్ని అందిస్తోందో మీ మాటల్లో చెప్పండి.
జవాబు:
మఱ్ఱిచెట్టు నిస్వార్థ బుద్ధితో మానవులకు, పక్షులకు ఆశ్రయం కల్పించింది. మానవులకు చెట్టు కింద నీడ నిచ్చింది. పక్షులు చెట్టుపైన గూళ్లు కట్టుకొని నివసించేలాగా ఆశ్రయం కల్పించింది.

ప్రశ్న 4.
కింది వచనం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
స్వామి వివేకానంద అమెరికా, బ్రిటన్ వంటి సంపన్నదేశాలను దర్శించారు. భారతదేశానికి తిరిగి ప్రయాణమయినప్పుడు అక్కడి పత్రికా విలేఖరులు “మీ మాతృభూమి పట్ల మీ అభిప్రాయం ఏమిటి?” అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా “భారతదేశాన్ని లోగడ ప్రేమించాను. కాని ఇప్పుడు భారతభూమిలోని ప్రతి ధూళికణం నాకు అత్యంత పవిత్రం. అది నాకొక తీర్థస్థానం” అని సగర్వంగా చెబుతారు. ఈ విధంగా కనిపించిన తల్లి మీద ఎలాంటి మాతృభావన ఉంటుందో మనకు జన్మభూమి అయిన భారతదేశం మీద కూడా అలాంటి మాతృభావన కలిగి ఉండాలనే ఉద్దేశాన్ని ప్రకటించారు.
ప్రశ్నలు:
1) వివేకానందుణ్ణి పరాయి దేశంలో పత్రికా విలేఖరులు ఏమని ప్రశ్నించారు?
జవాబు:
వివేకానందుని మాతృభూమి పట్ల ఆయన అభిప్రాయాన్ని గూర్చి పత్రికా విలేఖరులు ప్రశ్నించారు.

2) విలేఖరుల ప్రశ్నకు వివేకానందుడు ఏమని సమాధానం చెప్పారు?
జవాబు:
భారతదేశాన్ని గతంలో తాను ప్రేమించానన్నాడు. కాని ఇప్పుడు భారతభూమిలోని ప్రతి ధూళికణం తనకు అత్యంత పవిత్రమైనదని అన్నాడు. భారతదేశం తనకొక తీర్థ స్థానమని పత్రికా విలేఖరులకు వివేకానందుడు చెప్పాడు.

3) మాతృభావన ఎవరి యెడల కలిగి ఉండాలని ప్రకటించారు?
జవాబు:
మన జన్మభూమి అయిన భారతదేశం ఎడల మనం మాతృభావన కలిగి ఉండాలని వివేకానందుడు ప్రకటించాడు.

4) వచనాన్ని చదివి ‘శీర్షిక’ను నిర్ణయించండి.
జవాబు:
ఈ పేరాకు ‘వివేకానందుని వివేకం’ అనే శీర్షికను నిర్ణయించాను.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మఱ్ఱి చెట్టు చెప్పిన నవ్వు తెప్పించే సంఘటన ఏది?
జవాబు:
మఱ్ఱిచెట్టు క్రింద కూర్చొన్న వాళ్లు చెట్టుపైన ఉన్న పక్షులను కొట్టేవారు. అది చూసి ఒక కాకి సహించలేకపోయింది. అది కూడా అదే చెట్టుపై గూడు కట్టుకొని ఉంటుంది. చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా ఉత్సాహంగా, గొప్పగా, మాట్లాడుతుంటే సరిగ్గా గురి చూసి, అతనిపై కాకి రెట్ట వేసేది. అప్పుడతని వెర్రిమొహం చూసి అందరూ ఘోల్లున. నవ్వేవారు. ఈ లోగా కాకి ఎగిరిపోయేది. ఆ సంఘటనకు మఱ్ఱిచెట్టుకూ నవ్వు వచ్చేది.

ప్రశ్న 2.
పక్షి కథను గురించి మఱ్ఱిచెట్టు ఏమి చెప్పింది?
జవాబు:
ఒకరోజు పిట్టలు కొట్టేవాడొకడు వచ్చాడు. భయంతో పక్షులన్నీ పారిపోయాయి. పిల్లలున్న ఆడపక్షులు మాత్రం పిల్లలను విడిచి వెళ్లలేక, గూళ్లలోనే కూర్చున్నాయి. పిట్టలు కొట్టేవాడు గూళ్లను పొడుస్తాడని వాటికీ తెలుసు. కానీ, ఏం చేస్తాయి? పిల్లలను వదిలి వెళ్లలేక ఉండిపోయాయి.

ఒక పక్షి మాత్రం గూటిదాకా వెళ్లలేకపోయింది. ఒక కొమ్మను అంటిపెట్టుకొని కూర్చొంది. కొమ్మ చిన్నది. పక్షి పెద్దది. అందుచేత అది వేటగాడికి కనిపించింది. బాకు కట్టి ఉన్న పెద్ద వాసంతో పిట్టలు కొట్టేవాడు దానిని పొడిచాడు. ఆ పక్షి కేరుమంది. దానిని బుట్టలో వేసుకొని వెళ్లిపోయాడు.

ప్రశ్న 3.
నరసింహులు బాల్యాన్ని గురించి మద్దిచెట్టు ఏమని నెమరువేసుకొంది?
జవాబు:
నరసింహులు గ్రామ సర్పంచ్. అతడు బాల్యంలో ఆకతాయితనంగా తిరిగేవాడు. చెరువులో ఈత కొట్టేవాడు. మఱ్ఱి చెట్టెక్కి కొమ్మలు విరిచేవాడు. గోలచేసేవాడు. చెట్టుపై ఉన్న పక్షులను తోలేసేవాడు. మరీ చిన్నప్పుడు బడి ఎగొట్టేవాడు. పలకా, పుస్తకాలతో తొర్రలో దాక్కొనేవాడు. ఊడలతో ఉయ్యాలలూగేవాడని అతని బాల్యాన్ని మఱ్ఱిచెట్టు గుర్తుచేసుకుంది.

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మఱ్ఱిచెట్టు హక్కులను గురించి మాట్లాడవలసి వచ్చిన సందర్భాన్ని వివరించండి.
జవాబు:
తన నీడను కూర్చొని మానవులు అస్తమానూ హక్కుల గురించి మాట్లాడుకొనేవారు. కొమ్మలను ఆశ్రయించుకొని బతుకుతున్న పక్షులను బాధించేవారు. అది తమ హక్కులా భావించేవారు. తనను అడగకుండానే తన నీడను చేరేవారు. హాయిగా సేదతీరేవారు. కబుర్లు చెప్పుకొనేవారు. కాని, పక్షులకూ హక్కులుంటాయని ఆలోచించరు. చెట్లకు హక్కులుంటాయని తెలుసుకోరు. వాటికున్న జీవించే హక్కును హరించే హక్కు తమకుందని భావించే మనుషుల ఆలోచనా ధోరణికి మజ్జి చెట్టుకు అసహ్యం వేసింది. అదే హక్కుల గురించి మాట్లాడవలసిన సందర్భంగా ఏర్పడింది.

ప్రశ్న 2.
మఱ్ఱి చెట్టు తనకు – గ్రామానికి ఉన్న సంబంధాన్ని చెప్పిన విధానాన్ని మీ మాటల్లో రాయండి.
జవాబు:
మఱ్ఱిచెట్టు గ్రామస్తులతో తనకు ఉన్న అనుబంధాన్ని చక్కగా చెప్పింది. గ్రామస్తులు చెప్పుకొనే సంగతులన్నీ తనకు తెలుసు. ఎవరికి వారే తామే ఉన్నామనుకొని రహస్యాలు చెప్పుకొనేవారట. తాము చెట్టు క్రింద నీడలో ఆశ్రయం. పొందుతూనే దానిమీద ఉన్న పక్షులను కొట్టేవారు. అది తమ హక్కుగా భావించేవారు. ఇవన్నీ మానవులలోని దుర్లక్షణాలు. వీటిని చక్కగా వివరించింది. పిట్టలు కొట్టేవాడు ఒక పక్షిని చంపిన దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించి చెప్పింది. అది చాలా హృదయ విదారకమైన దృశ్యం.

పాతకాలంనాటి మనుషులకు ఈ రోజులలో మనుషులకు తేడాలను బాగా చెప్పింది. ఆ రోజులలో ఎవరైనా చెట్ల కొమ్మలు విరుస్తున్నా, పక్షులను, జంతువులను కొడుతున్నా చూసినవారు గదమాయించేవారు. నేటి రోజులలో ఆ పద్ధతి పోయింది. ఎవ్వరూ ఎవరినీ పట్టించుకోవడంలేదు.

చిన్నతనంలో నరసింహులు చేసిన అల్లరిని గుర్తు చేసుకొంది. అతను సర్పంచ్ అయినందుకు ఆనందించింది. కాని, అతను తనను నరకడానికి వచ్చాడని తెలిసి బాధపడింది. ఈ విధంగా ప్రతి విషయాన్నీ మఱ్ఱిచెట్టు చక్కగా వివరించింది.

ప్రశ్న 3.
మానవుల వలె చెట్లు / పక్షులు, జంతువులు మాట్లాడగలిగితే ఎలా ఉంటుందో మీ మాటల్లో వివరించండి.
జవాబు:
మానవుల వలే చెట్లు / పక్షులు / జంతువులు మాట్లాడగలిగితే అవి అనే మాటలకు మానవుడు ఈ భూమి మీద బతకలేడు. అతను చేసే అరాచకాలను ప్రకృతి ప్రశ్నించకే మూర్ఖుడిలా, ఉన్మాదిలాగా తయారయ్యాడు. కొన్నివేల హెక్టార్ల అడవులను మనిషి నాశనం చేశాడు. భూమండలం మీద కాలుష్యం పెంచాడు. ఆక్సిజన్ కొరత ఏర్పరిచాడు. వేడిని పెంచాడు. వర్షాలు రాకుండా చేశాడు. చెట్లు మాట్లాడితే ఈ అరాచకాలకు ఏనాడో అడ్డుకట్ట పడేది. భూలోకం స్వర్గలోకంలా ఉండేది.

ఆదిమానవుని కాలంలో పక్షులను, జంతువులను వేటాడి చంపాడు. ఆధునికుడయ్యాక పెంపకం పేరుతో చంపుతున్నాడు. అనేక పక్షి, జంతు జాతులు ఆనవాలు కూడా లేకుండా పోయాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు మానవుని నూతన ఆవిష్కరణలు, సైన్సు అభివృద్ధి పక్షుల, జంతువుల నాశనానికి వచ్చింది. అవి మాట్లాడితే భూమండలం కిలకిలలతో కలకలలాడుతూ ఉండేది.

భాషాంశాలు

అ) కింది వాక్యాలను చదివి గీత గీసిన పదాలకు అర్ధాన్ని రాయండి.
ఉదా : గాల్వన్ లోయలో కల్నల్ సంతోష్ బాబు ధైర్య సాహసాలకు చైనా సైన్యం విస్తుపోయింది.
విస్తుపోవు – ఆశ్చర్యపడు

1. జంతువులు, పక్షులు వంటి ప్రాణుల యెడల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించరాదు.
జవాబు:
నిర్దాక్షిణ్యం – దయలేకపోవడం

2. జడివానతో వీచే పెనుగాలి చెట్లను పెళ్ళగిస్తుంది.
జవాబు:
పెళ్ళగించు – పెకలించు

3. దండకారణ్యంలో రాముని సత్తువ రాక్షసులను వణికించింది.
జవాబు:
సత్తువ – బలం

4. 2025 నాటికి భారతదేశం ఇదమిద్ధంగా విశ్వగురుస్థానాన్ని చేరుతుంది.
జవాబు:
ఇదమిద్ధం – కచ్చితం

ఆ) కింది పదాలకు పర్యాయపదాలను పద విజ్ఞానం నుండి గ్రహించండి.

1. నెపం – కారణం, మిష
2. ఆశ్రయం – అండ, ఆలంబన
3. అపేక్ష – కాంక్ష, కోరిక

ఇ) కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.

1. హృదయము అ) సత్తువ
2. నిభ ఆ) ఎద
3. సత్వము ఇ) పత్తనము
4. పట్టణము ఈ) నెపము

జవాబు:

1. హృదయము ఆ) ఎద
2. నిభ ఈ) నెపము
3. సత్వము అ) సత్తువ
4. పట్టణము ఇ) పత్తనము

ఈ) కింది పదాలకు సొంతవాక్య ప్రయోగం చేయండి.
ఉదా : సీత, సావిత్రి కబుర్లు చెప్పుకొంటున్నారు.

మనసులో పెట్టుకొను – తరతరాలు – విశ్రాంతి – చీటికీ మాటికీ – చూడముచ్చట – చెవిలో పడటం జ్ఞాపకం – అపేక్ష – ఆశ్రయం – అల్లాడిపోవు – అస్తమానం – మరుపుకురానంత – గొంతునులమటం – ఉయ్యాలలూగు – ఆగతాయి పనులు.
జవాబు:
1) మనసులో పెట్టుకొను = ఎవ్వరికీ చెప్పకపోవడం.
సొంతవాక్యం : మంచిని మనసులో పెట్టుకొని తిరిగి ఉపకారం చేయాలి.

2) తరతరాలు = వంశంలోని అనేకమంది.
సొంతవాక్యం : గాంధీజీని తరతరాలు గుర్తుపెట్టుకుంటారు.

3) విశ్రాంతి = విరామము
సొంతవాక్యం : విశ్రాంతి లేకుండా కష్టపడితే విజయం వరిస్తుంది.

4) చీటికీ మాటికీ = ఎక్కువసార్లు
సొంతవాక్యం : చీటికీ మాటికీ బడి మానేస్తే చదువురాదు కదా !

5) చూడముచ్చట = చూడడానికి అందంగా ఉండడం.
సొంతవాక్యం : చంటి పిల్లల అల్లరి చూడముచ్చటగా ఉంటుంది.

6) చెవిలో పడటం = వినబడటం
సొంతవాక్యం : మంచిమాటలు చెవిలో పడటం అదృష్టం.

7) జ్ఞాపకం = గుర్తు
సొంతవాక్యం : వృద్ధులకు చిన్నతనం జ్ఞాపకం వస్తుంటుంది.

8) అపేక్ష = కోరిక
సొంతవాక్యం : ధనం పైన మితిమీరిన అపేక్ష పనికిరాదు.

9) ఆశ్రయం = ఆలంబన
సొంతవాక్యం : పేదలకు ఆశ్రయం ఇవ్వాలి.

10) అల్లాడిపోవు = బాధపడు
సొంతవాక్యం : వేసవిలో నీరు దొరకక కొందరు అల్లాడిపోతారు.

11) అస్తమానం = పదేపదే
సొంతవాక్యం : అస్తమానం ఆడుకోకూడదు. చదువుకోవాలి.

12) మరుపుకురానంత = మరిచిపోలేనంత
సొంతవాక్యం : ఎవరి విజయం వారికి మరుపురానంత ఆనందం ఇస్తుంది.

13) గొంతునులమటం = పీకనొక్కడం, చంపడం
సొంతవాక్యం : ఎవ్వరినైనా గొంతునులమటం తప్పు, మహాపాపం.

14) ఉయ్యాలలూగు = హాయిని అనుభవించు
సొంతవాక్యం : పిల్లలు ఆనందంతో ఉయ్యాలలూగుతారు.

15) ఆగతాయి పనులు = అల్లరి పనులు
సొంతవాక్యం : ఆగతాయి పనులు చేస్తే అపఖ్యాతి వస్తుంది.

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

ఉ) కింది పదాలను ఏ అర్థంలో – సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకోండి.
ఉదా : కాలక్షేపం : ‘సమయాన్ని వృథాగా గడుపుట’ అనే అర్థంలో ఉపయోగిస్తారు.

1) హృదయ విదారకం :
మనసుకు చాలా బాధ కలిగించేదానిని వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు.

2) గుండెలు అలసిపోయేటట్టు :
విపరీతంగా ఏడుస్తున్న లేక బాధతో పరుగెడుతున్న సందర్భం వివరించేటపుడు ఇది ఉపయోగిస్తారు.

3) ముక్కు మీద వేలేసుకొను :
ఊహకందని పరిస్థితిని చూసి ఆశ్చర్యపడే వారి గురించి వివరించే సందర్భంలో ఇది ఉపయోగిస్తారు.

4) గుండె చెరువగు :
భరించలేనంత దుఃఖం కలిగిన దానిని గురించి వివరించే సందర్భంలో ఇది ఉపయోగిస్తారు.

5) హృదయం ముక్కలవడం :
అనుబంధానికి పూర్తి వ్యతిరేకంగా ఏదైన జరిగి బాధ కలిగిన సందర్భంలో వివరించేటపుడు ఇది ఉపయోగిస్తారు.

6) పొట్టన పెట్టుకును :
కాపాడగలిగీ కాపాడకుండా ఒకరి మరణానికి కారణమైన వారి గురించి వివరించే సందర్భంలో ఇది ఉపయోగిస్తారు.

వ్యాకరణాంశాలు

అ) కింది వాక్యాలు చదవండి.

1. వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు.
2. వ్యాసుడు సంస్కృతంలో భారతాన్ని రచించాడు.
3. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు.
4. ఎర్రన తెలుగులో హరివంశాన్ని రచించాడు.
5. పోతన తెలుగులో భాగవతాన్ని రచించాడు.

ఆ) గీత గీసిన పదాలను విడదీసిరాయండి.
ఉదా : రామాయణాన్ని = రామాయణము + ని
1. భారతాన్ని = భారతము + ని
2. కల్పవృక్షాన్ని = కల్పవృక్షము + ని
3. హరివంశాన్ని = హరివంశము + ని
4. భాగవతాన్ని = భాగవతము + ని

పై ఉదాహరణల్లోని వాక్యాల్లో క్రియకు ముందు ఎవరిని / దేనిని / వేనిని అని ప్రశ్నిస్తే (వాల్మీకి సంస్కృతంలో దేనిని రచించారు?) వచ్చే సమాధానాన్ని ‘కర్మ’ అని చెప్పవచ్చు. అలాంటి పదాలకు చివర ద్వితీయా విభక్తి ప్రత్యయమైన ని/ను (రామాయణాన్ని) చేరటాన్ని గమనించవచ్చు.

సకర్మకం – లకర్మకం

ఇ) కింది వాక్యాలను చదవండి.

1. కౌసల్య రాముని చూసి సంతోషించింది.
2. సుమిత్ర లక్ష్మణుని ఆశీర్వదించింది.
3. కైకేయి భరతుని రాజుగా చూడదలచింది.
4. శత్రుఘ్నుడు శత్రువులను జయించగలడు.

పై ఉదాహరణల్లో క్రియకు ముందు ఎవరిని / దేనిని / వేనిని (కౌసల్య ఎవరిని చూసి సంతోషించింది) అనే పదాన్ని ఉంచినపుడు సమాధానం వస్తోంది. కనుక ఈ వాక్యాలను ‘సకర్మకాలు’ అంటారు.

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

ఈ) కింది వాక్యాలు చదవండి.

1. దశరథుడు మరణించాడు.
2. జటాయువు నేలకూలాడు.
3. సూర్యుడు ఉదయిస్తున్నాడు.
4. సంపాతి ఎగురుతున్నాడు.

పై ఉదాహరణల్లో క్రియకు ముందు దేనిని / వేనిని / ఎవరిని అనే పదాన్ని ఉంచినప్పుడు ఎలాంటి సమాధానం రావడం లేదు. అంటే ఈ వాక్యాలలో కర్మ లేదని అర్థం. కనుక పై వాక్యాలను ‘అకర్మకాలు’ అంటారు.

ఇత్వ సంధి

ఉ) కింది వాక్యాలను గమనించండి.

1. కొండపల్లి విహార యాత్రకు వెళ్లి ఏమేమి బొమ్మలు కొన్నారు?
2. ఏమంటివి? మంచిని పంచమంటివా?
3. వసతి గృహ విద్యార్థులు సంక్రాంతికింటికి వెళ్లాలని అనుకుంటున్నారు.
4. మంచినెంచు వారు మానవులే?
5. మంచి కొంచెం చేసినా పదింతలు ఫలితాన్ని ఇస్తుంది.
6. సిరిగల వానికెయ్యెడల చేసిన మేలు నిష్ఫలం బగున్.

ఊ) గీత గీసిన పదాలను విడదీయండి.
ఉదా : ఏమేమి = ఏమి + ఏమి (ఇది ఇత్వ సంధి కాదు. ఆమ్రేడిత సంధి)
1. ఏమంటివి = ఏమి + అంటివి
2. సంక్రాంతికింటికి = సంక్రాంతికిన్ + ఇంటికి
3. మంచినెంచు = మంచిని + ఎంచు
4. పదింతలు = పది + ఇంతలు
5. వానికెయ్యెడల = వానికిన్ + ఎయ్యెడల

పై ఉదాహరణలలో విడదీసిన పదాలలో పూర్వ స్వరంగా ‘ఇ’ కారం ఉంది. ఇలా పూర్వస్వరంగా ‘ఇ’ ఉండి దానికి ఏదైనా అచ్చు పరమైనపుడు జరిగే సంధి కార్యాన్ని “ఇకారసంధి” అంటారు. పైన 2వ, 5వ ఉదాహరణలలో విడదీసినపుడు సంక్రాంతికిన్, వానికిన్, అని ఉంది. రెండు పదాలలోనూ చివర “నకారపు పొల్లు” ఉంది కదా ! ‘నకారపు పొల్లు’ను ‘ద్రుతము’ అంటారు. ‘ద్రుతము’ అంటే (అవసరం లేకపోతే) కరిగిపోవునది అని అర్థం.

ఇక్కడ ఇత్వసంధి కలిసినపుడది ,కరిగిపోయింది. సంక్రాంతికింటికి, వానికెయ్యెడల అనే రూపాలేర్పడ్డాయి. ద్రుతము కరగకపోతే “సంక్రాంతికినింటికి, వానికి నెయ్యెడల” అనే రూపాలుకూడా ఏర్పడతాయని గ్రహించండి. ఇది వైకల్పిక సంధి కదా ! పైన చెప్పిన సంక్రాంతికి నింటికి, వానికి నెయ్యెడల అనేవి సంధి రానప్పటి రూపాలని గుర్తుంచుకోండి.

ఋ) కింది పదాలను విడదీయండి. పూర్వ స్వరాన్ని గమనించండి.

1. అమ్మగారింట్లో = అమ్మగారి + ఇంట్లో ‘8’లోని హ్రస్వ ఇకారం)
2. అత్తగారింట్లో – అత్తగారి + ఇంట్లో (‘8’లోని హ్రస్వ ఇకారం)
3. చేతికందెడు = చేతికి(న్) + అందెడు (‘కి’లోని హ్రస్వ ఇకారం)
4. చిన్నదైనా – చిన్నది + ఐనా (‘ది’లోని హ్రస్వ ఇకారం)
5. లేనిదంటు – లేనిది + అంటు (‘ది’లోని హ్రస్వ ఇకారం)

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

ఋ) కింది వాక్యాలను చదవండి. ‘కర్మ’ ను గుర్తించి గీత గీయండి.

1. నేను చెరువు గట్టునే పుట్టాను.
2. నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను.
3. పక్షి కేరుమని అరిచింది.
4. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు.
5. మర్రి చెట్టు పాలు, కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తవి.
6. మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు.

ఎ) పై వాక్యాల నుండి సకర్మక – అకర్మక వాక్యాలను విడదీసి రాయండి.
సకర్మక వాక్యాలు :
1. నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను.
2. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు.
3. మర్రిచెట్టు పాలు, కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తవి.
4. మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు.

అకర్మక వాక్యాలు :
1. నేను చెరువు గట్టునే పుట్టాను.
2. పక్షి కేరుమని అరిచింది.

ఏ) పాఠం ఆధారంగా కొన్ని సకర్మక వాక్యాలు గుర్తించండి. రాయండి.

  1. పై భాగాన్నంతా కట్టెల క్రింద కొట్టారు.
  2. ఆ రహస్యాలను మనసులో పెట్టుకొని ఉండేదాన్ని.
  3. అనేక విషయాలు చెప్పుకొంటూ ఉండేవారు.
  4. పులిజూదం ఆడుకొనేవారు.
  5. నేను గాలివీస్తూ ఉండేదానిని.
  6. నా మాట నిస్సంకోచంగా నమ్మవచ్చు.
  7. నా వేళ్లే నాకు ఆహారాన్ని సమకూర్చి పెట్టినై
  8. నా నీడన మనుష్యులు విశ్రాంతిని పొందుతారు.
  9. నా నీడన మనుష్యులు చల్లదనాన్ని అనుభవిస్తారు.
  10. కాకి గూడును కట్టుకొని ఉంది.

ఐ) పాఠం ఆధారంగా కొన్ని అకర్మక వాక్యాలు గుర్తించండి. రాయండి.

  1. ఆ కొమ్మను ఆకులు కూడా ఉన్నాయి.
  2. కొన్ని పక్షులు భయంతో లేచిపోయినై
  3. పిట్టలు కొట్టేవాడు క్రింద ఉన్నాడు.
  4. ఇదంతా చూస్తూ నిలబడిపోయాను నేను.
  5. ఆ పక్షి కొంచెం పెద్దది.
  6. రోజులలా మారినై.
  7. మానవుల దృష్టి మారిపోయింది.
  8. నరసింహులు మా గ్రామపంచాయితీ ప్రెసిడెంటు అయ్యాడు.
  9. నిన్న మొన్నటి వరకు ఆగతాయితనంగా తిరిగేవాడు.
  10. కాని, అతను అందుకు రాలేదు.

ప్రాజెక్టుపని

చుట్టూ వున్న పరిసరాలలో మానవులకు మేలు చేసే (వేప/రావి/తులసి/తుమ్మ ఏదైనా చెట్టు చిత్రాన్ని గీయండి. దాని గురించి రాయండి.
జవాబు:
వేప :
AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు 2
వేపచెట్టు ఆరోగ్య ప్రదాయిని. వేపచెట్టు గాలి తగిలితే ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు నయమౌతాయి. వేపాకులు నీళ్లలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే శరీరంపై దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. వేప పుల్లతో పళ్లు తోముకుంటే పళ్లు గట్టిపడతాయి. పిప్పిపళ్లు, పుచ్చుపళ్లు వంటివి ఉండవు. పరగడుపున వేపచిగుళ్లు నమిలితే కడుపులో నులిపురుగులు పోతాయి. షుగరు వ్యాధి కూడా అదుపులో ఉంటుంది. వేప కలపను గుమ్మాలకు ఉపయోగిస్తారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కనుకనే వేపచెట్టును అమ్మవారిగా పూజిస్తారు. ప్రదక్షిణలు చేస్తారు.

తులసి :
AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు 3
తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ప్రతి ఇంటిలోను గుమ్మానికి ఎదురుగా తులసికోట కట్టుకొని, దానిలో తులసి మొక్కను వేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తులసిమొక్కలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి విష్ణుతులసి, రెండవది లక్ష్మీ తులసి. విష్ణుతులసి కొంచెం నల్లగా ఉంటుంది. తులసి ఆకులను పూజలలో ఉపయోగిస్తారు. విష్ణువుకు తులసిమాలలు అలంకరిస్తారు. తులసి తీర్థం త్రాగి ఉపవాసం ప్రారంభిస్తారు. ఉపవాసం ముగించడానికి కూడా తులసి తీర్థం త్రాగుతారు.

మందుల తయారీలో ఎక్కువగా విష్ణు తులసిని ఉపయోగిస్తారు. తులసి ఆకుల రసం ఆయుర్వేదంలో వాడతారు. ఇంటి వైద్యంగా కూడా ఉపయోగిస్తారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె . జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రోగాలు నయం చేయడానికి తులసిని ఉపయోగిస్తారు. తులసిలో అధిక మోతాదులో యూజినాల్ ఉండడం వలన నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఒక్కమాటలో తులసి మనపాలిట ఆరోగ్యలక్ష్మి.

సుభాషితం

మేలైనను గీడైనను
శీలవతీ ! మనుజుడెద్ది సేయు బరులకున్
వాలయంబుగ నది ఫల
కాలంబున గుడుచు వేరుగలుగదు చెపుమా !

భావం :
ఓ సదాచార సంపన్నురాలా ! మానవుడు ఇంకొకరికి మేలు చేసినా, కీడు చేసినా దానికి సంబంధించిన ఫలితాన్ని అనుభవించి తీరుతాడు. ఫలితం అనుభవించుటలో ఇంకో విధంగా జరగనే జరగదు.

ఉపాధ్యాయులకు సూచనలు

  1. ‘మాకూ ఉన్నాయి స్వగతాలు’ రచనను సేకరించండి. చదవండి.
  2. ‘నీతి చంద్రిక’ కథలను విద్యార్థులతో చదివించండి.

కవి పరిచయం

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు 4
రచయిత పేరు : త్రిపురనేని గోపీచంద్
జననం : కృష్ణాజిల్లా, అంగలూరులో 8. 9. 1910లో జన్మించారు.
తల్లిదండ్రులు : పున్నమాంబ, రామస్వామి చౌదరి.
చదువు : బి.ఎ. న్యాయవాద పట్టా (‘లా’ డిగ్రీ)
ఉద్యోగాలు : న్యాయవాది (కొంతకాలం), ఆంధ్రరాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్, ఆకాశవాణిలోనూ పనిచేశారు.

రచనలు :
ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు – కొడుకులు, మాకూ ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు మొదలైనవి.

అవార్డులు : వీరి రచన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’కు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. 8.9.2011న గోపీచంద్ శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తపాలాబిళ్ల విడుదల చేసింది.

ప్రత్యేకతలు :
గోపీచంద్ దర్శక నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించారు. ఆయన జీవితమే ఒక చైతన్య కు స్రవంతి. ఆయన 2.11. 1962న స్వర్గస్తులయ్యారు.

పదాలు – అర్థాలు

1. నేనిప్పుడే……… జ్ఞాపకం వుంది.
అర్థాలు :
లాట్లు = పోగులు, గుట్టలు (వస్తువుల)
నాశనం = నిర్మూలనం
కబుర్లు = మాటలు
ముఖమార్జన = పళ్లుతోముకొని ముఖం శుభ్రం చేసుకోవడం
రహస్యాలు = మర్మాలు
చెవిలో పడడం = వినబడడం
గ్రామస్తులు = గ్రామంలోనివారు
కుర్రకారు = యువత
విస్తుపోవడం = ఆశ్చర్యపోవడం
పులిజూదం = పులి – మేక ఆట
అర్థించుట = యాచించుట
చీటికీమాటికీ = చాలాసార్లు
అపేక్ష = ఆశ, అభిమానం
విత్తు = విత్తనం
ఇదమిద్దంగా = కచ్చితంగా
ఆశ్రయం = అండ
కసి = కోపం
భేదం = తేడా
నిత్యం = ఎల్లప్పుడూ
ఏటికికోటికి = ఎప్పుడైనా
జ్ఞాపకం = గుర్తు
హృదయం ముక్కలవడం = మనసుకు చాలా బాధ కలగడం
దారుణం = ఘోరం
అవిసిపోవడం = పగిలిపోవడం

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

2. ఒకరిమీద ………… కూర్చున్నారంటారా?
అర్థాలు :
సత్తువ = బలం
నిమ్మ = చెమ్మ
కించిత్ = కొద్దిగా
స్వార్థం = కేవలం తన గురించి
స్వభావం = తన యొక్క ఆలోచన
ఇబ్బంది = అసౌకర్యం
అల్లాడు = గిలగిల లాడు, బాధపడు
ముక్కుమీద వేలు వేసుకోవడం = ఊహించని దాన్ని చూసి ఆశ్చర్యపోవడం
ఘోరాపచారం = దారుణమైన తప్పు

3. అవి రెట్టలు వేస్తున్నవంటారా? …………. ఆ పిట్టలవాడు.
అర్థాలు :
అనాకారపు పనులు = వికృత చేష్టలు
కశ్మలం = మలినము, మురికి
సంపర్కం = కలయిక
పట్టుబడడం = అలవడడం
హింసించటం = బాధపెట్టడం
హృదయం ద్రవించడం = చాలా బాధ కలగడం
పరిసరాలు = చుట్టుప్రక్కలు
అపాయం = ప్రమాదం
అలలు = కెరటాలు
ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడం = చాలా భయపడడం
పసిగట్టు = గ్రహించు
కొన = చివర
బాకు = కత్తి
వాసం = దూలం

4. ఇదంతా………. లూగుతుండేవాడు.
అర్థాలు :
నులమడం = నలపడం
పెల్లగించి = వెలికితీసి
స్పృహ = తెలివి
నిర్దాక్షిణ్యంగా = దయలేకుండా
పొట్టను పెట్టుకోవడం = చంపడం
దృష్టి = ఆలోచన
ఆగతాయితనంగా = అల్లరి చిల్లరగా, బాధ్యత లేకుండా

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

5. ఆ నరసింహులు ……. నా ధర్మం !
అర్ధాలు :
సన్మానం = సత్కారం
చూడముచ్చటగా = అందంగా
పురస్కరించి = గౌరవించి
పార్కు = ఉద్యానవనం
అభ్యుదయం = అభివృద్ధి
పంథా = మార్గం
జోహారు = నమస్కారము
అర్పించడం = ఇవ్వడం
గుండె చెరువవ్వడం = చాలా బాధ కలగడం
నిర్లక్ష్యం = పట్టించుకోకపోవడం
విస్తరి = భోజనం చేయడానికి ఉపయోగించే ఆకు
ఘనకార్యం = గొప్ప పని
వడ్రంగి = కర్రతో సామానులు చేసే వ్యక్తి
కుప్ప = పోగు
మొండము = కాండము
సమూలంగా = పూర్తిగా
కుళ్లగించు = పెల్లగించు, పెకలించు
కొన ఊపిరి = చివరి శ్వా స
రంగరించి = కలిపి

AP Board 7th Class Telugu Solutions 3rd Lesson చిన్ని శిశువు

SCERT AP Board 7th Class Telugu Solutions 3rd Lesson చిన్ని శిశువు Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 3rd Lesson Questions and Answers చిన్ని శిశువు

7th Class Telugu 3rd Lesson చిన్ని శిశువు Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 7th Class Telugu Solutions 3rd Lesson చిన్ని శిశువు 1

ప్రశ్న 1.
పై చిత్రాలు చూడండి. చిత్రాల గురించి మాట్లాడండి.
జవాబు:
పై చిత్రాలలో శిశువు యొక్క పెరుగుదల ఉంది. శిశువు నేర్చుకొనే ఆటల గురించి ఉంది. మొదటి బొమ్మలో 5 నెలలలోపు వయస్సు గల శిశువు ఉన్నాడు. కాళ్లు, చేతులు కదల్చడం మాత్రమే చేయగలడు. రెండవ బొమ్మలోని శిశువుకు సుమారు 6, 7 నెలల వయసుంటుంది. బోర్లా పడడం వచ్చింది. మూడవ బొమ్మలోని శిశువుకు 8, 9 నెలల వయసుంటుంది. పాకడం వచ్చింది. నాల్గవ బొమ్మలో శిశువుకు ఒక సంవత్సరంలోపు వయసు ఉంటుంది. బొమ్మలతో ఆడుకోవడం, నడక వచ్చింది. ఐదవ బొమ్మలోని శిశువుకు 3 సంవత్సరాలలోపు వయస్సు ఉంటుంది. ఆడుకోవడం, పరుగెత్తడం, సైకిల్ తొక్కడం కూడా వచ్చేసింది.

ప్రశ్న 2.
పిల్లలు ఎవరెవరు ఏమి చేస్తున్నారో ఊహించి చెప్పండి.
జవాబు:
ఒకటవ బొమ్మలోని శిశువు కాళ్లు, చేతులు కదిలిస్తున్నాడు. రెండవ బొమ్మలో బోర్లాపడ్డాడు. 3వ బొమ్మలోని శిశువు పాకుతున్నాడు. నాల్గవ బొమ్మలోని శిశువు బొమ్మలతో ఆడుకొంటున్నాడు. ఐదవ బొమ్మలోని శిశువు చిన్న సైకిల్ తొక్కుతున్నాడు.

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
చిన్ని శిశువు గేయాన్ని భావయుక్తంగా, రాగయుక్తంగా పాడండి.
జవాబు:
సూచన: ఉపాధ్యాయులు పాడే విధానం గమనించండి. అనుసరించండి. స్వరయుక్తంగా, స్వల్ప తాళంతో పాడితే – బాగుంటుంది.

AP Board 7th Class Telugu Solutions 3rd Lesson చిన్ని శిశువు

ప్రశ్న 2.
పిల్లల బాల్యాన్ని మీ సొంతమాటల్లో చెప్పండి. (వ్రాయండి.)
జవాబు:
పిల్లల బాల్యం చూడముచ్చటగా ఉంటుంది. 5 నెలల వరకు కాళ్లూ, చేతులు మాత్రమే. కదల్చగలరు. క్రమేణా ‘ బోర్లాపడడం, పాకడం, నడవడం, పరుగెత్తడం మొదలైనవన్నీ నేర్చుకొంటారు. పుట్టిన కొన్నిరోజుల వరకూ చూపుకాని, మెడకాని నిలబెట్టలేరు. క్రమేణా చూపు, మెడ, నడుమూ నిలబెడతారు. అందరినీ గుర్తు పడతారు. నవ్వుతారు. ఆకలి, కోపం, భయం మొదలైనవి కూడా క్రమేణా తెలుస్తాయి. ఏడుపు తప్ప ఏమీరాని శిశువు కాలక్రమేణా మాటలు, పాటలు, పద్యాలు మొదలైనవి చెప్పే స్థాయికి చేరుతుంది.

ప్రశ్న 3.
తల్లికి బిడ్డలపై ఎలాంటి మమకారం ఉంటుందో చెప్పండి.
జవాబు:
తల్లి మమకారాన్ని దేనితోనూ పోల్చలేము. పిల్లల కోసం తన ప్రాణాలైనా ఇస్తుంది. పిల్లలకు ఆకలి వేసినా, బాధ – కలిగినా తల్లి ప్రాణం గిలగిలలాడుతుంది. తల్లికి తన పిల్లల కంటే విలువైనది ఏదీ ఈ లోకంలో లేదు. తన పిల్లల కంటే అందమైనదేదీ ఈ ప్రపంచంలో లేదంటుంది. తల్లికి పిల్లలే లోకం. వారు నవ్వితే ఆమె సంతోషిస్తుంది. పిల్లలు తింటే తల్లి తన కడుపు నిండినట్లు భావిస్తుంది. తన నోముల పంటగా పిల్లలను భావిస్తుంది.

ప్రశ్న 4.
కింది కీర్తనను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద, రామ గోవిందా జోజో జోజో
పాలవారాశిలో పవళించినావు,
బాలుగా మునులకు అభయమిచ్చినావు,
మేలుగా వసుదేవుకుదయించినావు,
బాలుడై ఉండి గోపాలుడైనావూ జోజో జోజో
నందు నింటను జేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముగ్గురంగా జోజో జోజో

ప్రశ్నలు :
1) అన్నమయ్య జోల పాటలో ఎవరిని గురించి వర్ణించాడు?
జవాబు:
అన్నమయ్య జోల పాటలో కృష్ణుని గురించి వర్ణించాడు.

2) కృష్ణుడు ఎవరి ఇంట పెరిగాడు?
జవాబు:
కృష్ణుడు నందునింట పెరిగాడు.

3) కృష్ణుడు ఎవరికి పుత్రుడుగా జన్మించాడు?
జవాబు:
కృష్ణుడు వసుదేవునికి పుత్రుడుగా జన్మించాడు.

4) మునులకు అభయమిచ్చినది ఎవరు?
జవాబు:
బాలకృష్ణుడు మునులకు అభయమిచ్చాడు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చిన్ని శిశువు జడల గురించి రాయండి.
జవాబు:
చిన్ని శిశువు యొక్క జుట్టు బాగా ఎక్కువగా ఉంది. ఆ జుట్టుతో తల ఊగుతోంది. అతని జడలు చింతకాయల వలే ఉన్నాయి.

AP Board 7th Class Telugu Solutions 3rd Lesson చిన్ని శిశువు

ప్రశ్న 2.
చిన్ని కృష్ణుడు ఎలాంటి ఆభరణాలు ధరించాడు?
జవాబు:
చిన్ని కృష్ణుడు కాళ్లకు బంగారు మువ్వల గజ్జెలు ధరించాడు. వేళ్లకు వంకీల ఉంగరాలు (అందే ఉంగరాలు) ధరించాడు. అందమైన చేతులకు బంగారు మురుగులు (కడియాలు) ధరించాడు.

ప్రశ్న 3.
అన్నమయ్యను గురించి రాయండి.
జవాబు:
తాళ్లపాక అన్నమాచార్యులు :
జననం : కడప జిల్లా, రాజంపేట మండలం, తాళ్లపాక గ్రామంలో జన్మించారు.
తల్లిదండ్రులు: లక్కమాంబ, నారాయణసూరి అనే పుణ్యదంపతులు.

రచనలు :
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32 వేల సంకీర్తనలు, 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వేంకటాచల మహాత్మ్యం మొదలైనవి ఆయన రచనలు.

అంకితం : అన్నమయ్య తన రచనలను శ్రీవేంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు.

ప్రత్యేకతలు :
దక్షిణాపథంలో భజన సంప్రదాయం , పద కవితా శైలిని ప్రారంభించిన తొలి వాగ్గేయకారుడు. 1) చందమామ రావే, జాబిల్లిరావే…… 2) జో అచ్యుతానంద జోజో ముకుందా వంటి పాటలు అన్నమయ్య రచించినవే. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. 95 సంవత్సరాలు జీవించాడు. 23.2.1503న వేంకటేశ్వర స్వామిలో లీనమయ్యాడు.

బిరుదులు :
పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగమ సార్వభౌముడు అనే బిరుదులు సమకాలీనులు సాదరంగా ఇచ్చారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చిన్ని శిశువు పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి.
జవాబు:
చిన్ని కృష్ణుని వంటి చిన్న శిశువును ఎప్పుడూ చూసి ఉండము.

ఆయన శిరస్సు దట్టమైన జుట్టుతో ఊగుతోంది. ఆయన జడలు చింతకాయల వలె ఉన్నాయి. పాదాలకున్న బంగారు గజ్జెల మువ్వలు మ్రోగుతుంటాయి. తన తల్లియైన యశోదను విడువకుండా ఆమె వెనుకే తిరుగాడుతూ ఉంటాడు.

చిన్ని కృష్ణుని వేళ్లు వంకీల ఉంగరాలు (అందె ఉంగరాలు)తో మెరుస్తున్నాయి. అందమైన ఆయన చేతులు బంగారు మురుగులు (కంకణాలు)తో మెరుస్తున్నాయి. అద్దాల వంటి ఆయన చెక్కిళ్లు ముద్దు ముద్దుగా ఉన్నాయి. ఆడుకొందుకు పిల్లలను దగ్గరకు పిలుస్తూ ‘అప్పలప్పల’ని ఎవరైనా అంటే వారిని అదలించి చిన్ని కృష్ణుడు యశోదను కౌగిలించుకొంటాడు.

పుష్టిగల చిన్ని కృష్ణుని పొట్ట మీద పాలచారలు అందంగా ఉన్నాయి. కొసరి కొసరి వెన్న తినిన నోటితో అతిశయించి దిగివచ్చాడు. ఇప్పుడు వేంకటేశ్వరస్వామిగా వేంకటాద్రిపై వెలిశాడు. అన్ని లోకాలనూ రక్షిస్తున్నాడు. అని అన్నమయ్య తన గేయంలో వివరించాడు.

AP Board 7th Class Telugu Solutions 3rd Lesson చిన్ని శిశువు

ప్రశ్న 2.
అన్నమయ్య చెప్పిన శిశువుకి, మీరు చూసిన శిశువుకి గల పోలికలు రాయండి.
జవాబు:
అన్నమయ్య చెప్పిన శిశువు లక్ష్మీపతియైన శ్రీకృష్ణుడు. నేను చూసిన శిశువు నాలుగిళ్లలో పనిచేసుకొనే నిరుపేద మహిళ బిడ్డ.

జుట్టు విషయంలో ఇద్దరూ సమానమే. ఇద్దరిదీ దట్టమైన జుట్టే. ఇద్దరి జడలు చింతకాయల లాగే ఉన్నాయి. కాని, శ్రీకృష్ణుడు బంగారు గజ్జెలు ధరించాడు. ఆ మువ్వలు గలగలా మ్రోగేవి. నేను చూసిన పిల్లవాని కాళ్లు మట్టి కొట్టుకుపోయి ఉంటాయి. కనీసం కాళ్లకు ఊళ్లు కూడా లేవు. ఇద్దరూ తల్లిని విడిచి పెట్టరు. శ్రీకృష్ణుని వేళ్లకు వంకీల ఉంగరాలు ఉన్నాయి. చేతులకు బంగారు మురుగులున్నాయి. నేను చూసిన పిల్లవానికి బంగారు ఉంగరాలు, మురుగులు లేవు. దిష్టి తగలకుండా వాళ్లమ్మ కట్టిన నల్లదారం మాత్రమే చేతికి ఉంది.

కృష్ణుని బుగ్గలు నున్నగా అద్దాలలా మెరిసిపోతున్నాయి. వీడికి సరైన పోషణ లేక బుగ్గలు లోతుకుపోయి ఉంటాయి. ఆయన పొట్ట పుష్టిగా పాలచారలతో ఉంటుంది. వీడికి ‘బల్ల’ అనే వ్యాధి రావడం వల్ల పొట్ట ఎత్తుగానే ఉంటుంది. దాని నిండా మట్టి చారలే. ఆయనది వెన్న తిన్న నోరు.. వీడిది గంజి తాగిన నోరు. ఆయన వేంకటేశ్వర స్వామిగా వెలిశాడు. వీడు దరిద్రానికి ప్రతిరూపంగా ఎదుగుతున్నాడు. ఆయన లోకాలను రక్షిస్తున్నాడు. వీడిని చూసి లోకం చిరాకు పడుతోంది. గేలి చేస్తోంది.

ప్రశ్న 3.
చిన్నపిల్లల చేష్టల గురించి మీ మాటల్లో రాయండి.
జవాబు:
చిన్నపిల్లల చేష్టలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందరూ చూస్తూ, ముద్దు చేస్తుంటే ఏడుస్తారు. ఎవ్వరూ తమవైపు చూడకపోతే నవ్వుతారు. కింద నుంచో పెడితే మూత్రం పోయరు. పక్కవేసి పడుకోబెట్టగానే పోసేస్తారు. ఏది పడితే అది నోట్లో పెట్టేసుకొంటారు. లాక్కొంటే ఏడుస్తారు. కొంతమంది పిల్లలు నడవలేరు. నడుస్తామని మారాం చేస్తారు. ఎత్తుకొంటే ఏడుస్తారు. బాగా నడక వచ్చాక నడవరు. ఎత్తుకోమని ఏడుస్తారు. అన్నప్రాశన జరిగే వరకు అన్నం కంచాలు లాగేస్తారు. అన్నప్రాశన అయ్యాక అన్నం తినరు. తల్లిని ఏడిపిస్తారు. చిన్నతనంలో పిల్లలు అన్నం తినడానికి ఏడుస్తారు. పెద్దయ్యాక తల్లిదండ్రులకు పెట్టడానికి ఏడుస్తారు. చకచకా పాకడం, పరుగెత్తడం చేస్తారు. ప్రమాదాలలో పడతారేమోనని పెద్దవారికి భయం.

భాషాంశాలు

అ) కింది గీత గీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : ఈ రోజు పైడి ధర పెరిగింది.
పైడి = బంగారం
సొంతవాక్యం : స్త్రీలకు బంగారు ఆభరణాలు శోభనిస్తాయి.

1. చిన్ని కృష్ణుడికి నవనీతం అంటే ఇష్టం.
జవాబు:
నవనీతం = వెన్న
సొంతవాక్యం : వెన్నను కాచిన నెయ్యి వచ్చును.

2. చిన్న పిల్లల కురులు నిగనిగలాడుతుంటాయి.
జవాబు:
కురులు = వెంట్రుకలు
సొంతవాక్యం : తిరుమలలో చాలామంది తలవెంట్రుకలు ఇస్తారు.

3. తల్లికి శిశువు సంరక్షణ ముఖ్యం.
జవాబు:
శిశువు = చిన్నపిల్ల / చిన్నపిల్లవాడు
సొంతవాక్యం : చిన్నపిల్లలు తల్లిని వదిలి ఉండలేరు.

4. గణపతికి ఏనుగు శిరస్సు ఉంటుంది.
జవాబు:
శిరస్సు = తల
సొంతవాక్యం : తలను చక్కగా దువ్వుకొని బడికి వెళ్లాలి.

ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలు (పర్యాయ పదాలు) గుర్తించి రాయండి.
ఉదా : మేను = దేహం, తనువు, కాయం
1. ఇది పుత్తడి బొమ్మ, అది స్వర్ణ దేవాలయం.
జవాబు:
బంగారం = పుత్తడి, స్వర్ణం

2. కిటికి దర్పణం బాగుంది. రేఖ చేతిలో ముకురం ఉంది.
జవాబు:
అద్దం = దర్పణం, ముకురం

3. మా అయ్య పొలానికి వెళ్ళాడు. మా స్నేహితుని నాన్న ఉపాధ్యాయుడు.
జవాబు:
తండ్రి = అయ్య, నాన్న

4. ఆమె శిరోజాలు పొడవుగా ఉన్నాయి, ఈమె కేశాలు పొట్టిగా ఉన్నాయి.
జవాబు:
కురులు = శిరోజాలు, కేశాలు

AP Board 7th Class Telugu Solutions 3rd Lesson చిన్ని శిశువు

ఇ) కిందివానిలో ప్రకృతి, వికృతులను జతపరచండి.

1. తింత్రిణి అ) పాలు
2. పయసు ఆ) కన్నడు
3. భృంగారం ఇ) చింత
4. కృష్ణుడు ఈ) చేత
5. చేష్ట ఉ) బంగారు

జవాబు:

1. తింత్రిణి ఇ) చింత
2. పయసు అ) పాలు
3. భృంగారం ఉ) బంగారు
4. కృష్ణుడు ఆ) కన్నడు
5. చేష్ట ఈ) చేత

ఈ) కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.
1. చిన్న × పెద్ద
2. కోపం × శాంతం
3. తిని × తినక
4. పైన × క్రింద
5. వేడి × చల్లన

ఉ) కింది పదపట్టికను చదవండి. పట్టిక ఆధారంగా కొన్ని పదాలు రాయండి.
AP Board 7th Class Telugu Solutions 3rd Lesson చిన్ని శిశువు 2
ఉదా : మువ్వలు
1. శిశువు
2. శిరసు
3. పైడి
4. పాలు
5. అన్నమయ్య

వ్యాకరణాంశాలు

నిత్యం

కింది వాక్యాలను చదవండి. గీతగీసిన పదాలను పరిశీలించండి.
1. టంగుటూరి ప్రకాశం పంతులు తెల్లవారికి సింహస్వప్నం.
2. చుక్కలు మిలమిల మెరుస్తాయి ఎందుకని?
3. కొత్తగా వచ్చిన వ్యక్తిని మీరెవరు? అని నాన్న అడిగాడు.
4. మా రాజు మనసైన రాజు.
5. ప్రజలు అల్లూరి సీతారామరాజెక్కడని అడిగారు.

కింది పదాలను విడదీసి రాయండి.
ఉదా : ప్రకాశమతడు = ప్రకాశము + అతడు
1. ఎందుకని = ఎందుకు + అని
2. మీరెవరు = మీరు + ఎవరు
3. మనసైన = మనసు + ఐన
4. రాజెక్కడ = రాజు + ఎక్కడ

పై పదాలలో పూర్వ స్వరంగా ‘ఉ’ ఉంది. దాని పరస్వరంగా ‘అ’, ‘ఇ’, ‘ఉ’, ‘ఏ’, ‘ఒ’ వంటి ఏదైనా అచ్చుపరమైన సందర్భంలో సంధి తప్పకుండా జరుగుతుంది. సంధి అంటే పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడం అని తెలుసుకున్నాం. ఈ విధంగా తప్పకుండా జరిగే సంధిని నిత్యం అంటారు.

నిషేధం

కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను పరిశీలించండి.

1. కొత్తబట్టలు మాయమ్మ ఇచ్చింది.
2. మాయయ్య వ్యవసాయం చేస్తున్నాడు.
3. ఓయమ్మ! నీ కుమారుడు అల్లరి పిల్లవాడు.
4. రాముని దూతయితడు.
5. మాయిల్లు గాంధీనగర్ లో ఉంది.

కింది పదాలను విడదీయండి. సంధి జరగని విధానాన్ని గమనించండి.
ఉదా : మాయమ్మ = మా + అమ్మ
1. మాయయ్య – మా + అయ్య
2. ఓయమ్మ = ఓ + అమ్మ
3. దూతయితడు = దూత + ఇతడు
4. మాయిల్లు = మా + ఇల్లు

పూర్వ స్వరంగా ‘ఆ’ అనే అచ్చు ఉంది. పర స్వరంగా ‘అ’ ఉన్నప్పటికీ వాటి మధ్య సంధి జరగలేదు. అప్పుడు ఆ రెండు స్వరాల మధ్యన అదనంగా ‘య్’ వచ్చి చేరింది. ఈ విధంగా సంధి జరగని స్థితిని ‘నిషేధం’ అంటారు.

వైకల్పికం

కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను గుర్తించండి.

1. ప్రతి ఒక్కరికి మంచి మనసైన మిత్రుడు ఉండాలి.
2. మా మేనత్త చాలా మంచిది.
3. గంపలతో పూలెత్తవలెను.
4. హరి ! మీరు ఏమంటిరి

విడదీసిన పదాలను కలిపి రాయండి.
ఉదా : మనసు + ఐన = మనసైన, మనసయైన

1. మేన + అత్త = మేనత్త, మేనయత్త
2. పూలు + ఎత్తి : పూలెత్తి (ఉత్వసంధి నిత్య సంధి కనుక యడాగమ రూపం ఉండదు)
3. ఏమి + అంటిరి = ఏమంటిరి, ఏమియంటిరి

పై ఉదాహరణలో సంధి ఒకసారి నిత్యంగా మరొకసారి నిషేషంగా జరుగుతుంది. అనగా ఒకచోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించక పోవడం ఉంటుంది. ఇలా జరిగే విధానాన్ని వైకల్పికం అంటారు.

బహుళం

కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీయండి.

1. మా పెద్దన్న మామిడి పండు తిన్నాడు.
2. మా వదిన పుట్టినిల్లు నెల్లూరు.
3. నేను వేసవి సెలవుల్లో మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మేనయత్త ప్రేమగా చూసింది.
4. నేను నిద్రలో ఒకానొక సమయంలో ఉలిక్కిపడతాను.

కింది పదాలను విడదీయండి.
ఉదా : మనమున్నాము = మనము + ఉన్నాము
1. పెద్దన్న = పెద్ద + అన్న
2. పుట్టినిల్లు = పుట్టిన + ఇల్లు
3. మేనత్త, మేనయత్త = మేన + అత్త
4. ఒకానొక = ఒక + ఒక

పై ఉదాహరణలను గమనించండి. అన్నిటిలోనూ పూర్వపదం చివర ‘అ’ అనే అచ్చు ఉంది. పరపదం (రెండవ పదం) మొదట కూడా అ, ఇ, ఒ…. ఇలాగ ఏదో ఒక అచ్చే ఉంది. కాని, నాలుగు పదాలలోనూ నాలుగు రకాలుగా జరిగింది కదా !

1. పెద్ద + అన్న = పెద్దన్న – ఇక్కడ సంధి నిత్యంగా జరిగినట్లు చూపారు. కాని, ‘పెద్దయన్న’ అనే రూపం కూడా ఉండవచ్చు.
రామ + అయ్య = రామయ్య – ఇక్కడ సంధి నిత్యంగా జరిగింది. ‘రామయయ్య’ అనే రూపం లేదు కనుక.

2. వెల + ఆలు = వెలయాలు – ఇక్కడ మొదటి పదం చివర ‘అకారం’ ఉంది. రెండవపదం మొదట కూడా ‘ఆ’ అనే అచ్చు ఉంది. కాని సంధి జరగలేదు. యడాగమం వచ్చింది. ‘వెలయాలు’ అయ్యింది. అందుచేత ‘వెలాలు’ అనకూడదు. ఇది సంధి అస్సలు జరగని రూపం.

3. మేన + అత్త = మేనత్త, మేనయత్త – ఇక్కడ సంధి జరిగినపుడు ‘మేనత్త’ అనే రూపం ఏర్పడింది. సంధి జరగనపుడు మేనయత్త అనే రూపం ఏర్పడింది. దీనిని ‘విభాష రూపం’ అంటారు. దీనినే వికల్పం, వైకల్పికం అని కూడా అంటారు.

4. ఒక + ఒక = ఒకానొక – ఇక్కడ సంధి నిత్యంగా జరగలేదు. కనుక ‘ఒకొక’ అనే రూపం ఏర్పడలేదు. విభాషగానూ జరగలేదు. కనుక ‘ఒకయొక’ అనే రూపం ఏర్పడలేదు. సంధి జరగనపుడు వచ్చే ‘యడాగమం’ రాలేదు. కాని, మధ్యలో ‘నకారం’ వచ్చి ‘ఒకానొక’ అనే రూపం ఏర్పడింది. దీనిని అన్యకార్యం అంటే ‘ఇతర విధంగా’ సంధి ఏర్పడిందని అంటారు.

మొత్తం మీద బహుళం అంటే నాలుగు విధాలుగా ‘సంధి’ జరుగుతుందని తెలుసుకోండి. 1) నిత్యం 2) విభాష లేదా వైకల్పికం 3) సంధి లేకపోవడం 4) అన్యకార్యం అర్థమైంది కదూ !

తృతీయా విభక్తి

కింది పట్టికను గమనించండి.

1. బోయవాడు బాణం తో పక్షిని కొట్టాడు.
2. దేవుని భక్తి శ్రద్ధల పూజించాడు.
3. వాల్మీకి 24 వేల శ్లోకాల రామాయణం రచించాడు.
4. కుశలవులు సప్తస్వరాల పాట పాడారు.

వాక్య రూపంలో రాయండి.
ఉదా : బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు.
1. దేవుని భక్తి శ్రద్ధలతో పూజించాడు.
2. వాల్మీకి 24వేల శ్లోకాలతో రామాయణం రచించాడు.
3. కుశలవులు సప్తస్వరాలతో పాట పాడారు.

పై వాక్యాలలో ‘తో’ అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది. వాక్యంలోని పదాల మధ్య చేరే చేతన్, చేన్, తోడన్, తోన్, అనే ప్రత్యయాలను తృతీయా విభక్తి అంటారు. సాధారణంగా కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని గురించి చెప్పే సందర్భంలో ‘తృతీయా విభక్తి’ని ఉపయోగిస్తారు.

ఊ) కింది సమాస పదాలను విగ్రహ వాక్యాలుగా రాయండి.
ఉదా : యశోద మేను = యశోద యొక్క మేను

1. చిన్ని శిశువు = చిన్నదైన శిశువు
2. వేషభూషణములు = వేషమును, భూషణమును
3. పెద్దపొట్ట = పెద్దదైన పొట్ట
4. చింతకాయలు = చింత అను పేరు గల కాయలు

AP Board 7th Class Telugu Solutions 3rd Lesson చిన్ని శిశువు

ఋ) కింది పదాలను విడదీయండి.
ఉదా : వెన్నదిన్న = వెన్న + తిన్న
1. వేంకటాద్రి = వేంకట + అద్రి
2. తూగేటి = తూగు + ఏటి
3. లోకములెల్ల = లోకములు + ఎల్ల

చమత్కార పద్యం

యోథెవ్వడు కురుబలమున?
మాధవ సఖుడేమి యెక్కి మరి తిరుగాడున్?
సాధించెనెవని రాముడు?
రాధేయుడు నందినెక్కి రావణుగెల్చెన్.

భావం :
కౌరవ సైన్యంలో యోధుడెవరు? శివుడు ఏ వాహనాన్ని ఎక్కి తిరుగుతాడు? ‘రాముడు ఎవరిపై విజయాన్ని సాధించాడు? కర్ణుడు, నందినెక్కి, రావణాసురుని గెల్చాడు.

(పై మూడు పాదాలలోని ప్రశ్నలకు సమాధానం చివరి పాదంలోనే ఉంది.)

ప్రాజెక్టుపని

ప్రశ్న 1.
అన్నమయ్య కీర్తనలను మరికొన్ని సేకరించండి. వాటిని చార్టుమీద రాసి ప్రదర్శించండి.
జవాబు:
అన్నమయ్య కీర్తనలు:

1. ఆంజనేయ అనిలజ హనుమంతా నీ
రంజకపు చేతలు సురలకెంత వశమా !
తేరి మీద నీ రూపు తెచ్చిపెత్తి ఆర్జునుడు
కౌరవుల గెలిచే సంగర భూమిని
సారెకు భీముడు పురుషామృగము తెచ్చుచోట
నీ రోమములు కావా నిఖిల కారణము
నీ మూలమున గాదే నెలవై సుగ్రీవుడు
రాముని గొలిచి కపిరాజాయెను
రాముడు నీవంక నేపో రమణి సీతాదేవి
ప్రేమముతో మగువ పెండ్లాడెను.
బలురైత్యులను దుంచబంటు తనము మించ
కలకాలమును నెంచ కలిగితిగా
అల శ్రీ వేంకటపతి అండనె మంగాంబుధి
నిలయపు హనుమంత నెగడితిగా

2. అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె
వింతవింత విధముల వీడునా బంధములు
మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా
తనువెత్తి ఫలమేది దయకలుగు దాకా
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము ||అంతరంగ||
చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా
ఎదుట తానురాజైతే ఏలెనా పరము ||అంతరంగ||
పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా
జీవించి ఫలమేది చింతదీరు దాకా
వేవేల ఫలమేది వేంకటేశు గన్న దాకా
భావించి తాదేవుడైతే ప్రత్యక్షమౌనా ||అంతరంగ॥

AP Board 7th Class Telugu Solutions 3rd Lesson చిన్ని శిశువు

ప్రశ్న 2.
త్యాగయ్య కీర్తనలను సేకరించండి. వాటిని చార్టుమీద రాసి ప్రదర్శించండి.
జవాబు:
1. పల్లవి : ఎందరో మహానుభావులు అందరికీ వందనములు || ఎందరో ||
అను పల్లవి : చందురు వర్ణుని అందచందమును హృదయార విందమున జూచి బ్రహ్మానందమనుభవించు వా || రెందరో ||

చరణం :
సామగాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యు
మానస వనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొగడనే వా . || రెందరో ||

సరగున నాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము సేయువా || రెందరో ||

పతితపావనుడనే పరాత్పరు గురించి
బరమార్ధమగు నిజమార్గముతోను బాడుచును,
సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా || రెందరో ||

హరి గుణమణులగు సరములు గళమున
శోభిల్లు భక్త కోటు లిలలో తెలివితో చెలిమితో
గరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువా || రెందరో ||

హొయలు మీఱ నడులు గల్గు సరసుని సదా
గనుల జూచుచును, పులక శరీరులయి ముదంబునను యశము గల వా || రెందరో ||

పరమభాగవత మౌనివరశశి విభాకర సనకసనందన దిగీశ
సురకింపురుష కనక కశిపుసుత నారద తుంబురు పవన సూను
బాలచంద్రధర శుక సరోజభవ భూసురవరులు పరమపావనులు
ఘనులు శాశ్వతులు కమలభవ సుఖము సదానుభవము గలవా .. || రెందరో ||

నీ మేను నామ వైభవమ్ములను నీ పరాక్రమ ధైర్యముల శాంతమా
నసము నీవులను వచన సత్యమును రఘువర నీ యెడ సద్భక్తియు
జనించకను దుర్మతములనను కల్గిజేసి నట్టి నీ యద
నెటింగి సతతంబునను గుణ భజనానంద కీర్తనము జేయువా || రెందరో ||

భాగవత రామాయణ గీతాది శ్రుతిశాస్త్ర పురాణపు మర్మములన్
శివాది షణ్మతముల గూఢముల ముప్పది ముక్కోటి సురాంత
రంగముల భావముల నెఱిగి భావరాగ లయాది సౌఖ్యముచే
చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వా || రెందరో ||

ప్రేమ ముప్పిరిగొనువేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజను తునికి నిజదాసు || రెందరో ||

2. పల్లవి : గిరిరాజ సుతాతనయ ! సదయ !
అను పల్లవి : సురనాథ ముఖార్చిత పాదయుగ !
పరిపాలయ యామిభ రాజముఖ !

చరణము : గణనాథ ! పరాత్పర ! శంకరా
గమవారినిధి రజనీకర !
ఫణిరాజ కంకణ ! విఘ్న నివా
రణ ! శాంభవ ! శ్రీ త్యాగరాజ నుత !

మీకు తెలుసా?

చతుర్దశ భువనాలు : 14 లోకాలు (సప్త అధో లోకాలు – 7, సప్త ఊర్ధ్వ లోకాలు – 7)
సప్త అధో లోకాలు : 1) అతలం 2) వితలం 3) సుతలం 4) తలాతలం 5) రసాతలం 6) మహాతలం 7) పాతాళం
సప్త ఊర్ధ్వ లోకాలు : 1) భూలోకం 2) భువర్లోకం 3) సువర్లోకం 4) మహర్లోకం 5) జనోలోకం 6) తపోలోకం 7)గుత్యలోకం

ఉపాధ్యాయులకు సూచనలు

  1. అన్నమయ్య సంకీర్తనలను సేకరించండి. వాటిని వినండి.
  2. అన్నమయ్య జీవితం గురించి తెలుసుకోండి.
  3. అన్నమయ్య సంకీర్తనలను పాడే విధానాన్ని విద్యార్థులకు తెలపండి.

కవి పరిచయం

కవి పేరు : తాళ్లపాక అన్నమాచార్యులు
జననం : కడప జిల్లా రాజంపేట మండలం, తాళ్లపాక గ్రామంలో జన్మించారు.

తల్లిదండ్రులు : లక్కమాంబ, నారాయణసూరి అనే పుణ్యదంపతులు.

రచనలు : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32 వేల సంకీర్తనలు, 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వేంకటాచల మాహాత్మ్యం మొదలైనవి ఆయన రచనలు.

అంకితం : అన్నమయ్య తన రచనలను శ్రీవేంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు.

ప్రత్యేకతలు :
దక్షిణాపథంలో భజన సంప్రదాయం, పద కవితా శైలిని ప్రారంభించిన తొలి వాగ్గేయకారుడు. 1) చందమామ రావే, జాబిల్లిరావే……. 2) జో అచ్యుతానంద జోజో ముకుందా వంటి పాటలు అన్నమయ్య రచించినవే. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. 95 సంవత్సరాలు జీవించాడు. 23.2. 1503న వేంకటేశ్వర స్వామిలో లీనమయ్యాడు.

బిరుదులు :
పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగము సార్వభౌముడు అనే బిరుదులు సమకాలీనులు సాదరంగా ఇచ్చారు.

పద్యాలు – అర్థాలు – భావాలు

1.ప|| చిన్ని శిశువూ చిన్ని శిశువూ
ఎన్నడుం జూడమమ్మ యిటువంటి శిశువూ ||
చ|| తోయంపు గురులతోడ దూగేటి శిరసు, చింత
కాయల వంటి జడల గముల తోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పాయక యశోదవెంట పాటాడు శిశువూ || చిన్ని ||
అర్థాలు :
ఎన్నడున్ = ఎప్పుడూ
తోయము = పరివారము (దట్టమైన)
కురులు = వెంట్రుకలు
తూగుట = ఊగుట
గములు = సమూహాలు, గుంపులు
కనకము = బంగారం
పాయక = విడువక
పాఱాడు = తిరుగాడు

భావం :
చిన్ని కృష్ణుని వంటి శిశువును ఎప్పుడూ చూడమమ్మా ! దట్టమైన వెంట్రుకలతో ఊగే శిరస్సు, చింతకాయల వంటి జడలతో ఉంటాడు, ఆయన పాదాలకున్న బంగారు గజ్జలలోని మువ్వలు మోగుతుంటాయి. తన తల్లియైన యశోదను ఒక్కక్షణం కూడా విడవకుండా ఆమె వెంట తిరుగాడే చిన్ని కృష్ణుని వంటి శిశువు నెన్నడూ చూడమమ్మా !

AP Board 7th Class Telugu Solutions 3rd Lesson చిన్ని శిశువు

2. చ|| ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగరాల
నిద్దపుం జేతుల పైడి బొద్దుల తోడ
అద్దపుం జెక్కులతోడ అప్ప లప్ప లని నంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువూ || || చిన్ని ||

చ|| బలుపైన పొట్టమీది పాలచారలతోడ
నులివేడి వెన్న దిన్న నోరి తోడ
చెలగి నేడిదె వచ్చి శ్రీవేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువూ || చిన్ని ||
అర్థాలు :
వ్రేళ్లు = వేళ్లు
మొరవంక ఉంగరాలు = వంకీ ఉంగరాలు
నిద్దము = అందము
బొద్దులు = మురుగులు
చెక్కులు = చెక్కిళ్లు (బుగ్గలు)
అద్దము = ముఖం చూసుకొనే గాజు బిళ్ల
అప్పలప్పలు = ఒక ఆట, పిల్లలను దగ్గరకు పిలవడంలోని అనుకరణ
గద్దించి = అదలించి
మేను = శరీరం
బలుపు = పుష్టి
చార = గీత
నులివేడి = కొద్దిగా అడిగి
చెలగి = అతిశయించి
నేడు = ఈరోజు
అది = పర్వతం
పైడి = బంగారు

భావం :
ముద్దుల కృష్ణుని వేళ్ల వంకీ ఉంగరాలు అందంగా ఉన్నాయి. అందమైన ఆ చేతులు బంగారు మురుగులతో మెరుస్తున్నాయి. అతని బుగ్గలు నున్నగా అద్దాలలాగ మెరిసిపోతున్నాయి. పిల్లలు అప్పలప్పలంటే వారిని అదలించి యశోదను, కౌగిలించుకొంటాడు. పుష్టిగా ఉన్న చిన్ని కృష్ణుని పొట్టమీద పాలచారలతో, మరికొంచెం అడిగి తిన్న వెన్న నోటితో అతిశయించిన శ్రీకృష్ణుడే. ఈ రోజు క్రిందికి దిగివచ్చేడు. వేంకటాచలంపై వేంకటేశ్వరునిగా వెలిశాడు. అన్ని లోకాలనూ రక్షిస్తున్నాడు. అని అన్నమయ్య వర్ణించాడు.

సారాంశం

అన్నమయ్య భక్తితో రచించిన గేయమిది. దీనిలో బాలకృష్ణుని గురించి భక్తిగా వర్ణించాడు.

చిన్నికృష్ణుని వంటి చిన్ని శిశువును మనం ఎన్నడూ చూసి ఉండము.

దట్టమైన తలవెంట్రుకలతో ఊగే శిరస్సుతో ఉంటాడు. చింతకాయల వంటి జడలతో చిన్నికృష్ణుడు ఉన్నాడు.

బంగారు మువ్వలు గల కాలి గజ్జెలతో యశోదను విడువకుండా ఆమె వెనుకనే పారాడతాడు. ఇటువంటి చిన్ని శిశువును మనమెప్పుడూ చూడలేదు.

ముద్దుగా ఉన్న వేళ్లతో ఉంటాడు. వంకీల ఉంగరాలతో చిన్ని కృష్ణుని వేళ్లు ముద్దు ముద్దుగా ఉంటాయి. ! బంగారు మురుగులతో చేతులు మెరుస్తూ ఉంటాయి. చిన్ని కృష్ణుని బుగ్గలు అద్దాల లాగా మెరుస్తూ ఉంటాయి. పిల్లలంతా ‘అప్పలప్పలు’ అని ఆటలకు పిలిస్తే, వాళ్లను కసిరి, యశోదను కౌగిలించుకొంటాడు చిన్ని కృష్ణుడు. ! ఇటువంటి ముద్దుల కృష్ణుని మనమెప్పుడూ చూడలేదు.

నిండైన బొజ్జ మీద పాలచారలతో ఉంటాడు. వాళ్లమ్మను బెలిపించి కొసరి కొసరి తిన్న వెన్న నోటితోనే ! తిరుమల వేంకటాద్రిపై వెలిశాడు. లోకాలన్నీ కాపాడుతున్నాడు. ఇటువంటి చిన్ని శిశువును మనం ఎప్పుడూ చూడలేదు.