AP Board 7th Class Social Studies Important Questions and Answers English & Telugu Medium

Andhra Pradesh SCERT AP State Board Syllabus 7th Class Social Studies Chapter Wise Important Questions and Answers in English Medium and Telugu Medium are part of AP Board 7th Class Textbook Solutions.

Students can also read AP Board 7th Class Social Studies Solutions for exam preparation.

AP State Syllabus 7th Class Social Studies Important Questions and Answers English & Telugu Medium

AP 7th Class Social Studies Important Questions and Answers in English Medium

7th Class Social Important Questions Sem 1

AP 7th Class Social Important Questions Sem 2

AP 7th Class Social Chapter Wise Important Questions in Telugu Medium

7th Class Social Important Questions Sem 1

AP 7th Class Social Important Questions Sem 2

AP 7th Class Social Studies Important Questions and Answers in English Medium (Old Syllabus)

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

These AP 7th Class Social Important Questions 1st Lesson విశ్వం మరియు భూమి will help students prepare well for the exams.

AP Board 7th Class Social 1st Lesson Important Questions and Answers విశ్వం మరియు భూమి

ప్రశ్న 1.
విశ్వం ఆవిర్భావం గురించిన సిద్ధాంతమును వివరించండి.
జవాబు:
విశ్వం ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ఒక సిద్ధాంతం మహా విస్ఫోటన సిద్ధాంతం (బిగ్ బ్యాంగ్).

మహా విస్ఫోటన సిద్ధాంతం :
విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మహా విస్పోటన (బిగ్ బ్యాంగ్) సిద్ధాంతాన్ని మొదట జార్జి లెమైటర్ అనే ఒక బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ప్రస్తుత విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికీ విస్తరిస్తోందని అతను గట్టిగా నమ్మాడు. ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేది.

అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా, అది పేలిపోయి విశ్వమంతా చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి. విశ్వం యొక్క విస్తరణ నేటికీ జరుగుతూనే ఉంది.
AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 1

ప్రశ్న 2.
సౌర కుటుంబ ఆవిర్భావం గురించిన సిద్ధాంతాలను తెల్పండి.
జవాబు:
సౌర కుటుంబం ఆవిర్భావం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు.
1) భూ కేంద్రక సిద్ధాంతం :
ఈ సిద్ధాంతాన్ని టాలెమి అనే ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి. ఈ సిద్ధాంతం భూమి విశ్వానికి కేంద్రమని నమ్ముతుంది.

2) సూర్య కేంద్రక సిద్ధాంతం :
ఈ సిద్ధాంతాన్ని పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం, సూర్యుడు కేంద్రస్థానంలో ఉండి, గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి.
AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 2

3) గ్రహాలు మరియు ఉపగ్రహాలు :
నీహారిక (నెబ్యులర్) పరికల్పన ప్రకారం, గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలున్నాయి. వాటిలో భూమి ఒకటి.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 3.
సౌర కుటుంబం గురించి మీకేమి తెలుసో వ్రాయండి.
జవాబు:

  1. మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు ఎనిమిది గ్రహాలతో రూపొందించబడింది.
  2. ఆ గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు (అంగారకుడు), బృహస్పతి (గురుడు), శని, వరుణుడు మరియు ఇంద్రుడు.
    AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 3
  3. సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు మరియు ఉల్కలు కూడా ఉన్నాయి.
  4. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 మిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌరకుటుంబం ఆవిర్భవించింది.

ప్రశ్న 4.
పర్యావరణం అంటే ఏమిటో విపులంగా తెలియజేయండి.
జవాబు:

  1. ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణం అని అంటారు.
  2. ఇది సహజ మరియు మానవ నిర్మిత అంశాల రెండింటి కలయిక.
  3. ఇది మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ. ఇది, మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, జీవించే భూమి వంటి వాటిని మనకు అందిస్తుంది.
  4. ఇది కంటికి కనిపించని ఎన్నో రకాల సూక్ష్మజీవులు, జంతువులు, మొక్కలు మరియు మానవులను కలిగి ఉంటుంది.

ప్రశ్న 5.
శిలావరణము అనగానేమి? శిలావరణము గురించి వివరించండి.
జవాబు:

  1. భూమి యొక్క రాతి పొరను శిలావరణము అంటారు.
  2. శిలావరణము (లిథోస్పియర్) అనే పదం “లిథో” మరియు “స్పెరా” అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది.
  3. లిథో అంటే “రాయి” మరియు “స్పెరా” అంటే “గోళం” లేదా “బంతి” అని అర్థం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న “ప్రపంచ ధరిత్రీ దినోత్సవం”.
  4. ఇది రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొంది, మట్టి యొక్క పలుచని పొరతో కప్పబడి ఉంటుంది.
  5. ఇది పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలైన వివిధ భూభాగాలతో కూడిన క్రమరహిత ఉపరితలం.
  6. ఈ భూస్వరూపాలను మూడు శ్రేణులుగా విభజించారు. మొదటి శ్రేణి, రెండవ శ్రేణి మరియు మూడవ శ్రేణి.

ప్రశ్న 6.
పర్యావరణం యొక్క అంశాలను తెలుపు ఫ్లో చార్టును గీయండి.
జవాబు:
పర్యావరణం యొక్క అంశాలను సహజ, మానవ మరియు మానవ నిర్మిత అంశాలు అని మూడు భాగాలుగా వర్గీకరించవచ్చు.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 4

ప్రశ్న 7.
భూమి యొక్క అంతర్భాగంను విశదీకరించండి.
జవాబు:

  1. మనం గమనిస్తే భూమి నిర్మాణం కోడి గ్రుడ్డుకి ఉన్నటువంటి వివిధ పొరల మాదిరిగా ఉంటుంది.
  2. ఈ పొరలు ఒకదానికొకటి మందంలో మరియు వాటి భౌతిక మరియు రసాయన కూర్పులో భిన్నంగా ఉంటాయి.
    AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 5
  3. భూమి మూడు పొరలను కలిగి ఉంటుంది. వాటికి ఈ క్రింది విధంగా పేర్లు పెట్టారు.
    1) భూ పటలము,
    2) భూ ప్రావారము,
    3) భూ కేంద్రము.

ప్రశ్న 8.
జలావరణము అనగానేమి? వివరంగా తెలియజేయండి.
జవాబు:

  1. భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమిష్టిగా జలావరణము అంటారు.
  2. “హైడ్రోస్పియర్” (జలావరణము) అనే పదం ‘హైడర్’ మరియు ‘స్పెరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ‘హైడర్’ అంటే నీరు మరియు ‘స్పెరా’ అంటే గోళం లేదా బంతి అని అర్థం.
  3. జలమును సమృద్ధిగా కలిగి ఉన్న ఏకైక గ్రహం కనుక భూమిని “జలయుత గ్రహం” అని పిలుస్తారు.
  4. మన గ్రహం మీద జీవం యొక్క ఉనికి ప్రధానంగా నీరు మరియు గాలి పైన ఆధారపడి ఉంది.
  5. భూమి యొక్క ఉపరితలం సుమారు 2/3 వ వంతు (71%) నీటితో ఆవరించి ఉంది.
  6. కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది.
  7. మిగిలిన 99% నీరు మంచు, ఉప్పు నీరు మొదలగు రూపంలో ఉంటుంది.
  8. జలావరణము నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉంటుంది.
  9. నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ళ పొరల మధ్య లోతుగా ఉంటుంది. దీనిని భూగర్భ జలం అంటారు.
  10. జలావరణము అన్ని జీవులకు నీటిని అందిస్తుంది.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 9.
వాతావరణంలోని వాయువులు మరియు పొరలను (ఆవరణాలను) గూర్చి తెల్పండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 6

  1. వాతావరణం అనేక వాయువుల మిశ్రమం.
  2. నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోని ముఖ్యమైన వాయువులు.
  3. ఆక్సిజన్ “ప్రాణ వాయువు”గా పరిగణించబడుతుంది. ఆక్సిజన్ లేకుండా ప్రాణం లేదు.
  4. వృత్త రేఖా చిత్రం (వాతావరణంలోని వాయువులు) మీకు వాతావరణం యొక్క వివిధ వాయువుల శాతాన్ని తెలుపుతుంది.
  5. వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుండి ఐదు పొరలుగా విభజించబడింది.
  6. అవి ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము, ధర్మో ఆవరణము మరియు ఎక్సో ఆవరణము.
  7. వీటి మధ్య కచ్చితమైన సరిహద్దు లేదు.

ప్రశ్న 10.
మానవ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణంల గురించి వివరించండి.
జవాబు:

  1. మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. ఇది వ్యక్తి, కుటుంబం, సమాజం, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది.
  2. చారిత్రకంగా స్థిర జీవితం ఏర్పడిన తరువాత, మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడం ప్రారంభించారు.
  3. ఇది మానవ పర్యావరణ స్థాపనకు దారితీసింది.
  4. మానవ నిర్మిత పర్యావరణం : మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు.
  5. ఇది భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మరియు స్మారక చిహ్నాలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

ప్రశ్న 11.
కాలుష్యం అనగానేమి? వాయు కాలుష్య కారకాలను పేర్కొని, వాయు కాలుష్య ప్రాధాన్యతను తెల్పండి.
జవాబు:

  1. పర్యావరణంలోనికి వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు.
  2. ఇది గాలి, నీరు మరియు నేల యొక్క రసాయన, భౌతిక మరియు జీవ లక్షణాలలో అవాంఛనీయ మార్పు తెస్తుంది.
  3. ఇది అన్ని జీవులలో ఆరోగ్య సమస్యలకు కారణమౌతుంది.
  4. వాయు కాలుష్యం యొక్క కారకాలు : బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్ల వర్షం, ఇంధన వినియోగం, పారిశ్రామిక ధూళి, క్లోరో ఫ్లోరో కార్బన్లు మొదలైనవి.
  5. వాయు కాలుష్యం ప్రభావం : గాలి కాలుష్యం వల్ల భూగోళం వేడెక్కడం, వాతావరణంలో మార్పులు రావడం, ఆమ్ల వర్షాలు కురవడం, పొగమంచు ఎక్కువగా కురవడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత, జంతు జాతులు అంతరించిపోవడం మరియు శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు వంటివి సంభవిస్తాయి.

ప్రశ్న 12.
నీటి కాలుష్యం అనగా నేమి? దీనికి కారణాలేవి?
జవాబు:
1) నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక, జీవ లేదా రసాయనిక మార్పు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడి నట్లయితే దానిని నీటి కాలుష్యంగా పరిగణిస్తారు.

2) నీటి కాలుష్యానికి కారణాలు :
వివిధ వ్యర్థాల కారణంగా నీరు కలుషితమవుతుంది. అవి, ఎ) పారిశ్రామిక కాలుష్యాలలో అనేక రకాల సేంద్రీయ మరియు అకర్బన కాలుష్య కారకాలు ఉన్నాయి. ఉదా : కాగితం మరియు కాగితపు గుజ్జు, రంగులు వేసే వస్త్ర పరిశ్రమలు. 2) ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు కూడా నీటి కాలుష్యం సమస్యను తీవ్రమైన పర్యావరణ సమస్యగా మార్చాయి.

ప్రశ్న 13.
గాలి, నీరు వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గాలు తెల్పుము.
జవాబు:
గాలి, నీరు వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గాలు:

  1. పర్యావరణ విద్యను పాఠ్యాంశాల్లో తప్పనిసరిగా చేర్చాలి.
  2. పునర్వినియోగం చేయడం మరియు పునరుత్పాదన చేయడం ద్వారా పునరుత్పాదక వనరుల సామర్థ్యాన్ని పెంచడం.
  3. మన అటవీ సంపదను కాపాడటానికి ఎక్కువ మొక్కలను నాటడం.
  4. పునరుత్పాదకతకు వీలు కాని వనరులకు ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం.
  5. బయోగ్యాస్ మరియు బయో ఇంధనాల వాడకాన్ని పెంచడం.
  6. పారిశ్రామిక వ్యర్థాలను నదీ జలాల్లో కలపడం మానుకోవాలి. విలువైన సముద్ర జీవులను కాపాడుకోవడానికి ఇది అవసరమైన చర్య.

ప్రశ్న 14.
విపత్తు అనగానేమి? విపత్తు రకాలు ఏవి? వాటి నివారణ పద్దతులేవి?
జవాబు:
విపత్తు:

  1. విపత్తు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం.
  2. దీనివలన విస్తృతమైన మానవ, శారీరక, ఆర్థిక లేదా పర్యావరణ నష్టం సంభవిస్తుంది.
  3. ఇది సమాజానికి దాని స్వంత వనరులను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని దూరం చేస్తుంది.

విపత్తుల రకాలు :
ఎ) ప్రకృతి విపతులు : ప్రకృతి విపత్తు అనేది ఒక సహజ ప్రక్రియ లేదా దృగ్విషయం . దీనివల్ల ప్రాణ నష్టం, గాయం లేదా ఇతర ఆరోగ్య ప్రభావాలు, ఆస్తి నష్టం, జీవనోపాధి మరియు – సేవను కోల్పోవడం, సామాజిక మరియు ఆర్థిక అంతరాయం లేదా పర్యావరణ నష్టం సంభవిస్తాయి.
ఉదా :
కరువు : ఉపరితల నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితి.

బి) మానవకారక విపత్తులు :
ఇవి సాంకేతిక లేదా మానవ ప్రమాదాల పర్యవసానాలు.

నివారణ పద్దతులు :
సంసిద్ధత, ప్రమాదాల నివారణకు భద్రతా చిట్కాలు పాటించడం ద్వారా గాయాలు కాకుండా నివారించడం మరియు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం, విపత్తుల గురించి సమాచారం కలిగి ఉండటం, అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్లడానికి ప్రణాళికను కలిగి ఉండటం, అత్యవసర వస్తు సామగ్రి అందుబాటులో ఉండటం, ప్రమాదం జరిగినప్పుడు మీ ఇంటిలో సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవడం వంటివి ప్రమాద సమయంలో నష్టాలను తగ్గిస్తాయి.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 15.
విపత్తు నిర్వహణ అనగానేమి ? విపత్తు నిర్వహణ ఎలా చేపడతారు?
జవాబు:

  1. ఏదైనా (విపత్తు) ప్రమాదం లేదా ముప్పును నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైన చర్యలతో ప్రణాళిక రూపొందించడం, నిర్వహించడం మరియు అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియను విపత్తు నిర్వహణ అంటారు.
  2. విపత్తు తీవ్రత లేదా పరిణామాలను తగ్గించడం, ఏదైనా విపత్తును ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉండడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, అనుకోకుండా సంభవించే విపత్తుల పట్ల సత్వరంగా స్పందించడం, విపత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనా వేయడాన్ని విపత్తు నిర్వహణ అంటారు.
  3. భారతదేశంలో విపత్తు నిర్వహణ ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం మరియు పునరావాసం కల్పించడం వంటి అంశాలకు సంబంధించినది.
  4. పదవ ప్రణాళిక : పదవ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ “అభివృద్ధి అంశం”గా నిర్ణయించబడింది. పదవ ప్రణాళిక విపత్తుల నియంత్రణ కోసం విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, నిర్దిష్ట అభివృద్ధి పథకాలు సూచించినది.

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No.7

విశ్వం అనే పదం లాటిన్ పదమైన “యూనివర్సమ్” నుండి ఉద్భవించింది. దీని అర్థం “మొత్తం పదార్థం” మరియు “మొత్తం అంతరిక్షం”. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది. ఖగోళ శాస్త్రవేత్త అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తియే ఖగోళ శాస్త్రవేత్త.

7th Class Social Textbook Page No.9

కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరం. కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

7th Class Social Textbook Page No.11

“పర్యావరణం” (ఎన్విరాన్మెంట్) అనే పదం ఫ్రెంచ్ పదం అయిన ఎన్నిరోనర్ అంటే ‘పొరుగు’ అనే అర్థం నుంచి ఉత్పన్నమైంది. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

7th Class Social Textbook Page No. 17

శిలావరణము (లిథోస్పియర్) అనే పదం ‘లిథో’ మరియు ‘స్పైరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ‘లిథో’ అంటే ‘రాయి’ మరియు ‘స్పైరా’ అంటే “గోళం” లేదా “బంతి” అని అర్థం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22 ను “ప్రపంచ ధరిత్రీ దినోత్సవం”గా జరుపుకుంటాము.

7th Class Social Textbook Page No. 19

హైడ్రోస్పియర్ (జలావరణము) అనే పదం ‘హైడర్’ మరియు ‘స్పైరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ‘హైడర్’ అంటే నీరు మరియు ‘స్పైరా’ అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం మార్చి 22ను “ప్రపంచ జల దినోత్సవం”గా జరుపుకుంటాము.

7th Class Social Textbook Page No. 21

వాతావరణం (అట్మాస్ఫియర్) అనే పదం ‘అట్మోస్’ మరియు ‘స్పైరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ‘అట్మోస్’ అంటే ఆవిరి అని మరియు ‘స్పైరా’ అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16ను “ప్రపంచ ఓజోన్ దినోత్సవం”గా జరుపుకుంటాము.

7th Class Social Textbook Page No. 23

జీవావరణం (బయోస్పియర్) అనే పదం గ్రీకు పదాలైన ‘బయోస్’ మరియు ‘స్పైరా’ నుండి ఉద్భవించింది. ‘బయోస్’ అంటే జీవం మరియు ‘స్పైరా’ అంటే గోళం లేదా బంతి.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

7th Class Social Textbook Page No. 29

  1. వరద అనేది సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహం.
  2. భూకంపం అనగా భూమి అంతర్భాగంలో ఆకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడం.

AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు

These AP 6th Class Social Important Questions 12th Lesson సమానత్వం వైపు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 12th Lesson Important Questions and Answers సమానత్వం వైపు

ప్రశ్న 1.
వైవిధ్యం ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
వైవిధ్యం ఎలా ఏర్పడుతుందంటే :

  • భారతదేశం అనేక భిన్నత్వాలు కలిగిన దేశం. మనం అనేక భాషలు మాట్లాడతాం. వివిధ రకాల ఆహారం తీసుకుంటాం. రక రకాల పండుగలు జరుపుకుంటాం. భిన్న మతాలను ఆచరిస్తాం.
  • అనేక వందల సంవత్సరాల క్రితం – ప్రజలు స్థిరనివాసం కొరకు, వ్యాపారం చేయుటకు కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేశారు.
  • తరుచుగా వారు వారి కొత్త ప్రాంతాలలో స్థిరపడటం ప్రారంభించారు. దీని ఫలితంగా పాత, కొత్త సంస్కృతుల కలయిక వలన ఈ ప్రాంతాలు భిన్నత్వం కలిగిన ప్రాంతాలుగా మారాయి.
  • అదే విధంగా ప్రజలు వారు నివసించే భౌగోళిక ప్రాంతానికి అనుగుణంగా వారి జీవన విధానాలను మార్చు కున్నప్పుడు కూడా భిన్నత్వం ఏర్పడుతుంది.
  • ఉదాహరణకు సముద్ర తీరంలోని జీవనశైలి ఎడారి ప్రాంత జీవనశైలికి భిన్నంగా ఉంటుంది.
  • అదే విధంగా వారి పని రకం కూడా ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న 2.
వివక్షత ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
వివక్షత ఎలా ఏర్పడుతుందంటే :

  • భారతదేశ వైవిధ్యాలతో కూడిన దేశం కానీ అన్ని వైవిధ్యాలకు తగిన ప్రాధాన్యత లభించటం లేదు.
  • మనం మనలాగే కనిపించే, మాట్లాడే దుస్తులు ధరించే, ఆలోచించే వ్యక్తులతో సురక్షితంగా, భద్రంగా ఉన్నట్లు భావిస్తాం.
    AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 1
  • మనం మనకు పరిచయం లేని కొత్త వ్యక్తులను చూసినపుడు వారిని అర్థం చేసుకోకుండానే వారి మీద కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలను ఏర్పరుచుకుంటాం.
  • ఇలా ప్రజలు ప్రతికూల అభిప్రాయాలను, పక్షపాత ధోరణిని అవలంబించడం వలన వివక్షత ఏర్పడుతుంది.

AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు

ప్రశ్న 3.
కుల వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది? కుల వివక్షత అంటే ఏమిటి?
జవాబు:
కుల వ్యవస్థ ఎలా ఏర్పడిందంటే :

  • ప్రజలు జీవనోపాధి కొరకు బోధన, వడ్రంగి, కుమ్మరి, నేతపని, చేపలు పట్టుట, వ్యవసాయం వంటి వివిధ రకాల వృత్తులను చేపట్టారు.
  • కొన్ని రకాల వృత్తులకు మాత్రమే ఎక్కువ గౌరవం లభించేది.
  • శుభ్రపరచడం, చెత్తను పోగు చేయుట వంటి పనులు తక్కువ విలువ కలిగినవిగాను, ఆ వృత్తులు చేసే వ్యక్తులను దూరంగా ఉంచడం వంటివి చేసేవారు.
  • ఈ నమ్మకమే కులవ్యవస్థకు పునాది.

కుల వివక్షత అంటే:

  • కుల వ్యవస్థలో కొన్ని వర్గాలు లేదా సమూహాలు’ పై స్థాయిలో లేక కింది స్థాయిలో ఉంచబడ్డాయి.
  • పై స్థాయిలో ఉంచబడినవారు ఉన్నత కులాలుగాను తమను తాము అగ్ర కులాలుగాను ఉన్నతులుగాను భావించేవారు.
  • కింది స్థాయిలో ఉంచబడిన వారిని అనర్హులుగా, అణగారినవారిగాను పరిగణించారు.
  • అణగారినవారిగా పరిగణింపబడే వీరికి కేటాయింపబడిన వృత్తి తప్ప వేరే వృత్తి చేపట్టడానికి అనుమతి లేకుండా కులనియమాలు విధించబడ్డాయి.
  • అగ్రకులాల వారు అనుభవించే హక్కులు నిమ్న కులాల వారిని అనుభవించనీయకపోవడమే కుల వివక్షత.

ప్రశ్న 4.
స్త్రీ హక్కుల కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు ఏవి?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 2

  • జనాభాలో సగభాగం స్త్రీలు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ అవకాశాలు, కుటుంబ నిర్ణయాలు తీసుకోవడంలో సమాన అవకాశాలు కల్పించబడలేదు.
  • పుట్టుక రీత్యా స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానులే కాబట్టి వారిద్దరికీ సమానమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక హక్కులు ఉంటాయి.
  • పలువురు సంఘసంస్కర్తలు స్త్రీ హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా పోరాడారు. అలా పోరాడిన వారిలో సావిత్రీబాయి ఫూలే ఒకరు.
  • ఆమె మహారాష్ట్రకు చెందిన భారతీయ సంఘ సంస్కర్త, విద్యావాది, కవయిత్రి. ఆమె భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయినిగా కీర్తించబడ్డారు.
  • బ్రిటీష్ వారి పరిపాలనలో ఆమె తన భర్త జ్యోతిరావు ఫూలే తో కలిసి భారతదేశంలో స్త్రీ హక్కుల ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.
  • ఆమెను “భారతీయ స్త్రీ వాద మాతా మహి” అని కీర్తిస్తారు.
  • ఫూలే తన భర్తతో కలిసి పూనెలోని భిడేవాడలో భారతదేశంలోనే ప్రథమ బాలికల పాఠశాలను స్థాపించారు.
  • కుల, లింగ వివక్షత వలన ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారు.

ప్రశ్న 5.
ప్రాంతీయ వివక్షత అనగా నేమి?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 3
ప్రాంతీయ వివక్షత అనగా :
ఇది ఒక వ్యక్తి నివాస స్థలం లేదా జన్మ స్థలం ఆధారంగా ఈ చూపే వివక్షత. ఉదాహరణకు గ్రామాల పట్ల పట్టణాలు, చిన్న పట్టణాల పట్ల పెద్ద నగరాలు, గిరిజన ప్రాంతాల పట్ల మైదాన ప్రాంతాలు చూపే వివక్ష. ఇది పక్షపాతం లేదా మూసధోరణి కారణంగా మొదలవుతుంది.

ప్రశ్న 6.
దివ్యాంగుల పట్ల వివక్షత అని దేనిని భావిస్తారు?
జవాబు:
PWD చట్టం – 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వ్యక్తులను దివ్యాంగులుగా పరిగణిస్తారు. వారిలో కొందరు పుట్టుకతో లేదా ప్రమాదాలలో శరీర భాగాలను కోల్పోవచ్చు. కొంతమంది వారిని అగౌరవం లేదా అవమానం పాలు చేస్తారు. ఇలాంటి వాటిని దివ్యాంగుల పట్ల వివక్షతగా భావిస్తాం.
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 4

ప్రశ్న 7.
భారతదేశంలో అసమానతలకు గల మూలకారణాలేమిటి?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 5
ఈ అసమానతలు, వివక్షతలకు మూల కారణాలు :

  1. అవిద్య
  2. అధికారం
  3. నమ్మకాలు
  4. వృత్తులు
  5. సంపద
  6. సంప్రదాయాలు మన సమాజంలో ఈ అసమానతలను, వివక్షను సృష్టించాయి.

ప్రశ్న 8.
అసమానత (వివక్షత)ల ఫలితాలను పేర్కొనండి.
జవాబు:
అసమానతల ఫలితాలు :

  • అసమానతలు దీర్ఘకాలిక సామాజిక, ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీస్తాయి.
  • అసమానతలు సామాజిక అశాంతికి దారితీస్తాయి.
  • అసమానతలు ప్రజల్ని పేదరికంలోకి నెట్టివేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి.
  • ఇది నేరాల పెరుగుదలకు, వ్యాధుల విస్తరణకు, పర్యావరణ క్షీణతకు దారితీస్తుంది.
  • సుస్థిర అభివృద్ధిని సాధించలేం.
  • ప్రపంచ వ్యాప్తంగా కొందరు వ్యక్తుల సామర్థ్యాలు వెలుగులోకి రాకుండానే ఉండిపోతాయి.

ప్రశ్న 9.
సమానత్వ సాధనకు రాజ్యాంగంలో పొందు పరిచిన అంశాలు ఏవి?
జవాబు:
సమానత్వ సాధనకు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు :

  • 14వ నిబంధన : చట్టం ముందు అందరూ సమానం.
  • 15(1)వ నిబంధన : మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు.
  • 16వ నిబంధన : ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమానావకాశాలు.
  • 17వ నిబంధన : అంటరానితనాన్ని పాటించడం నిషేధం. దీన్ని పాటించినవారు చట్ట ప్రకారం శిక్షించబడతారు.
    అణచివేతకు గురైన వర్గాలకు సమాన స్థాయిని కల్పించేటందుకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి.
  • 21(ఎ) నిబంధన : 6-14 వయసులో ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ప్రభుత్వం చట్టం ద్వారా మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రెండు విధాలుగా సమానత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది.

ప్రశ్న 10.
అసమానతలు, వివక్షతలూ లక్ష్యసాధనను అడ్డుకుంటాయా? ఒక ప్రముఖ వ్యక్తిని ఆధారంగా తీసుకుని (ఏ.పి.జే అబ్దుల్ కలాం) వివరించండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 6
డా|| ఏ.పి.జె. అబ్దుల్ కలాం : డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం భారతదేశపు 11వ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గొప్ప శాస్త్రవేత్త మరియు గొప్ప రచయిత. ఒక పేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ, జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఆయన తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయన రాసిన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్” అన్న పుస్తకంలో ఇలా అంటాడు. “మనమందరం లోపల ఒక దైవాగ్నితో జన్మించాం. ఈ అగ్నికి రెక్కలిచ్చి ప్రపంచమంతటినీ ఆ మంచితనపు వెలుగులతో నింపడానికి మనం ప్రయత్నించాలి” ఆయన ఇంకా ఇలా అంటారు “మనకందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు కానీ మన ప్రతిభను అభివృద్ధి ఏ.పి.జె. అబుల్ కలాం చేసుకోవడానికి అందరమూ సమాన అవకాశాన్ని కలిగి ఉన్నాం”.

ప్రశ్న 11.
క్రింది వారి గురించి నీకేమి తెలుసో వివరించండి.
1) డా॥ ఆనందీబాయి జోషి 2) డా|| నెల్సన్ మండేలా
జవాబు:
1) డా|| ఆనందీబాయి జోషి :
భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు. తన మగబిడ్డ పుట్టిన పదిరోజులకే వైద్యం అందక మరణించాడు. ఈ విషాదం తనను వైద్యవిద్య చదివేలా ప్రేరేపించింది. 1886లో వైద్యురాలిగా పట్టా అందుకున్నారు. భారతదేశానికి తిరిగివస్తూండగా ఆమె క్షయ వ్యాధికి గురయ్యారు. 1887లో పూనెలో మరణించారు.
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 7

2) డా|| నెల్సన్ మండేలా :
దక్షిణాఫ్రికా పూర్వ అధ్యక్షుడైన నెల్సన్ మండేలా 27 సంవత్సరాల జైలు జీవితం తర్వాత 1990లో విడుదలయ్యారు. జాతివివక్ష విధానానికి విజయవంతంగా ముగింపు పలికారు. జాతిపరంగా విభజితమై ఉన్న దేశంలో శాంతిని నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1990లో భారతరత్న అవార్డును స్వీకరించారు. ఆయనను “దక్షిణాఫ్రికా గాంధీ” అని పిలుస్తారు.
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు 8

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

These AP 6th Class Social Important Questions 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 11th Lesson Important Questions and Answers భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 1.
‘సంస్కృతి’ భావనను వివరించండి.
జవాబు:
‘సంస్కృతి’ భావన :

  • ఒక కొత్త వ్యవస్థని సృష్టించుకోవడం కోసం ముందు తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకుని దానిని భావితరాలకు అందించడానికి జరిగే నిరంతర ప్రక్రియే సంస్కృతి.
  • ఇది ఒక విలువైన మరియు ప్రత్యేకమైన సంపద, సామాజిక పరిణామంలో నిరంతరంగా కొనసాగే ప్రక్రియ.
  • ‘సంస్కృతి’ అను పదం యొక్క అర్థం విస్తృతమైనది. సమగ్రమైనది.
  • సమాజంలో సభ్యులుగా మానవుడు సంపాదించిన జ్ఞానం, నమ్మకాలు, కళలు, నీతులు, చట్టం, ఆచారాలు, అలవాట్లు, ఇతర సామర్థ్యాలలో సంస్కృతి ఉంటుంది.
  • సంస్కృతి అనేది సమాజంలో నివసించే ప్రజల జీవన విధానం.
  • సంస్కృతి యొక్క ముఖ్యాంశం సమూహంలో ప్రసారం చేయబడిన సంప్రదాయ ఆలోచనల మీద ఆధారపడి ఉంది.

ప్రశ్న 2.
లిపి మన దేశంలో ఎలా అభివృద్ధి చెందింది? కొన్ని ప్రసిద్ది రచనలు రాయండి.
జవాబు:

  • రాతి లిపి మనం చదవడానికి మరియు రాయడానికి ఉపయోగపడుతుంది. ప్రజలు పురాతన కాలంలో బట్టలు, ఆకులు, చెట్ల బెరడు మొదలైన వాటిపై రాసేవారు.
  • ఎండిన ఆకులపై రాయడానికి వారు సూది వంటి వాటిని ఉపయోగించేవారు.
  • ప్రారంభంలో వారు బొమ్మలు మరియు గుర్తులను గీసేవారు. క్రమక్రమంగా లిపి అభివృద్ధి చెందింది. అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లోనూ ‘బ్రాహ్మీ’ లిపిని ఉపయోగించాడు.
  • ప్రసిద్ధ పురాణాలైన వాల్మీకి రామాయణం మరియు వ్యాస మహాభారతం సంస్కృతంలో రాయబడ్డాయి.
  • భాష అభివృద్ధి చెందటం వల్ల ప్రసిద్ధ రచనలు ఉనికిలోకి వచ్చాయి.
  • ఆర్యభట్ట ఆర్యభట్టీయం’ అనే పుస్తకం రాశారు.
  • ఆయుర్వేదానికి పునాది వేసిన పుస్తకాలు ‘చరక సంహిత’ మరియు సుశ్రుత సంహిత’. శస్త్రచికిత్సలపై రాయబడిన గ్రంథమే సుశ్రుత సంహిత.

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 3.
‘భిన్నత్వంలో ఏకత్వం’ అంటే ఏమిటి? భిన్నత్వానికి గల కారణాలు ఏవి?
జవాబు:
భారతీయ సంస్కృతిని ఒక ప్రత్యేకమైనదిగా పిలవడానికి ‘భిన్నత్వంలో ఏకత్వమే’ ప్రముఖమైనది. భారతీయ సంస్కృతి క్రియాశీలకం మరియు సమ్మిళితం.
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 1

భిన్నత్వానికి గల కారణాలు :

  1. విశాలమైన దేశం.
  2. అనేక జాతుల అనుసంధానం.
  3. భౌగోళిక మరియు శీతోష్ణస్థితి అంశాలలో తేడాల కారణంగా వైవిధ్యం

ఎన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరూ తామంతా భారతీయులమని భావిస్తారు. ఈ ఏకత్వ భావననే ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని అంటారు.

ప్రశ్న 4.
భారత రాజ్యాంగం గుర్తించి భాషలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
భారత రాజ్యాంగం 22 భాషలను గుర్తించినది (8వ షెడ్యూల్)
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 2

ప్రశ్న 5.
భారతదేశంలో ‘మతం’ పరిణామం గూర్చి రాయండి.
జవాబు:
భారతదేశంలో అనేక మతాలు ఉన్నప్పటికీ భారతీయులంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు.

  • ఎక్కడైతే ప్రజలు నివాసముంటారో, అక్కడ కొన్ని రకాల ఆచారాలు మరియు సంప్రదాయాలు ప్రారంభమవుతున్నాయి.
  • ఈ ఆచారాలు మరియు సంప్రదాయాలు, వనరులు, పర్యావరణం, వాతావరణ పరిస్థితులు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి.
  • నేటి మత విశ్వాసాలు కూడా ఇటువంటి ఆచార సంప్రదాయాలపై ఆధారపడి ఉన్నాయి.
  • అయినప్పటికీ ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కొన్ని ఆచార వ్యవహారాలు సాధారణంగా ఉన్నాయి.
  • మతం అనేది ఒక ఆధ్యాత్మిక చింతన. ఇది సుఖమయ జీవితం గడపటానికి కొన్ని విలువులను పాటించమనిబోధిస్తుంది.

ప్రశ్న 6.
హిందూ మతం గురించి, ప్రధాన లక్షణాలు గూర్చి తెల్పండి.
జవాబు:
హిందూ మతం :

  • ప్రపంచంలోని మతాలలో హిందూ మతం చాలా పురాతనమైనది. ఇది ఒక జీవన విధానం మరియు దీనిని “సనాతన ధర్మం” అనికూడా పిలుస్తారు.
    AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 3
  • విశ్వమానవ మూల సూత్రాలపై ఆధారపడినదే హిందూ మతం.
  • హిందూ మతంలో అనేక రకాల పూజా విధానాలు కలవు. అనేక మార్గాల ద్వారా భగవంతుడిని చేరవచ్చు.
  • అన్ని జీవులలో మరియు నిర్జీవులలో కూడా భగవంతుడు ఉన్నాడని ఈ మతం తెలియజేస్తుంది.
  • వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం మరియు మహాభారతం హిందువుల పవిత్ర గ్రంథాలు.
  • విష్ణువు, శివుడు, ఆదిశక్తి, రాముడు మరియు కృష్ణుడు హిందువులు ఆరాధించే దేవతలు.
  • సంక్రాంతి, దసరా, దీపావళి మొదలైనవి హిందువులు జరుపుకునే కొన్ని పండుగలు.
  • భారతదేశంలోని అమర్‌నాథ్, బద్రీనాథ్, వారణాసి, పూరి, సింహాచలం, శ్రీశైలం, భద్రాచలం, తిరుమల, కంచి మదురై, శబరిమలై, రామేశ్వరం వంటి అనేక దేవాలయాలను హిందువులు సందర్శిస్తారు.

హిందూ మత ప్రధాన లక్షణాలు :

  • మానవసేవే మాధవ సేవ.
  • విశ్వమానవ కుటుంబం. (వసుదైక కుటుంబం)
  • ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని పొందడం. (తపస్సు)
  • చతుర్విధ పురుషార్థాలను అభ్యసించడం (ధర్మం, అర్థం, కామం, మోక్షం వంటి నాలుగు రకాల అభ్యాసాలు) ‘హిందూ’ అనే పదం ‘సింధు’ అనే పదం నుండి వచ్చింది.
  • నాలుగు ఆశ్రమాలను ఆచరించడం వాటి పేర్లు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం.

ప్రశ్న 7.
తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయం గూర్చి నీకు ఏమి తెలుసు?
జవాబు:

  • ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర ప్రదేశాలలో చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇది శేషాచలం కొండలలో కలదు. దీనిని హిందువులు పవిత్ర దేవాలయంగా భావిస్తారు.
    AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 4
  • హిందువుల ప్రకారం, విష్ణువు యొక్క అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి.
  • ఇక్కడి దేవుణ్ణి శ్రీనివాస, గోవింద మరియు బాలాజీ అని పిలుస్తారు.
  • తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రసిద్ది చెందినవి.

ప్రశ్న 8.
జైన మతం ఆవిర్భావం గురించి, సిద్ధాంతాల గురించి వివరించండి.
జవాబు:
జైన మతం :

  • జైన మతం ఒక ప్రాచీన భారతీయ మతం.
  • ఈ మతాన్ని అనుసరించే వారిని జైనులు అంటారు.
  • ఇరవై నాలుగు మంది ‘తీర్థంకరులు’ ఈ మతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.
  • జైన అనే పదం ‘జిన’ అనే సంస్కృత పదం నుండి వచ్చింది.
  • మహావీరుడు మిక్కిలి ప్రసిద్ధిచెందిన తీర్థంకరుడు అతను ఒక యువరాజు.
  • అతను ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి అన్నింటినీ వదిలి, 12 సంవత్సరాలు అనేక ప్రదేశాలను సత్యాన్వేషణ కోసం సందర్శించాడు.
  • జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం ‘మోక్షం’ సాధించడం.
  • కైవల్యం లేదా జినను సాధించినప్పుడు, ఆత్మ కర్మల నుండి విముక్తి పొందుతుంది.
  • ఆ ఆనంద స్థితినే ‘మోక్షం’ అంటారు. తీర్థంకరులు జైనులకు ఆధ్యాత్మిక గురువులు. మహావీరుడు చివరి తీర్థంకరుడు.
  • మహావీరుని బోధనలను అతని అనుచరులు అనేక గ్రంథాలలో సంకలనం చేశారు. ఆ గ్రంథాలను ‘అంగాలు’, అంటారు. ‘అంగాలు’ జైనుల పవిత్ర గ్రంథాలు.

జైన మత సిద్ధాంతాలు : (పంచ వ్రతాలు)

  1. అహింస – Non violence
  2. సత్యం – Truthfulness
  3. ఆస్తేయం – Non-stealing
  4. అపరిగ్రహం – Non-possessiveness
  5. బ్రహ్మచర్యం – Centeredness

ఈ జాబితాలో బ్రహ్మచర్యమును మహావీరుడు చేర్చాడు. పై ఐదు సిద్ధాంతాలను అనుసరించడానికి, మహావీరుడు మూడు మార్గాలను సూచించాడు. వాటిని త్రిరత్నాలు అంటారు.

త్రిరత్నాలు :

  1. సమ్యక్ దర్శనం – సరైన విశ్వాసం
  2. సమ్యక్ జ్ఞానం – సరైన జ్ఞానం
  3. సమ్యక్ చరిత్ర – సరైన ప్రవర్తన

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 9.
గోమఠేశ్వర ఆలయం గురించి నీ కేమి తెలుసు?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 5

  • గోమఠేశ్వర ఆలయం కర్ణాటకలోని శ్రావణబెళగొళ వద్ద ఉంది.
  • ఇది చారిత్రక జైన దేవాలయం.
  • గోమఠేశ్వర విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహాలలో ఒకటి.
  • దీని ఎత్తు 57 అడుగులు. దీనిని బాహుబలి అంటారు.

ప్రశ్న 10.
సాంచి స్థూపం గురించి నీకేమి తెలుసు?
జవాబు:

  • సాంచి వద్ద ఉన్న స్థూపం గొప్ప బౌద్ధ స్మారక కట్టడాలలో ఒకటి.
  • ఇది బౌద్ధ కళ మరియు నిర్మాణ శైలిని తెలియజేస్తుంది.
  • ఇది భారతదేశంలో గల పురాతన రాతి నిర్మాణాలలో ఒకటి.
  • దీనిని క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించాడు.
  • ఇది మధ్య భారతదేశంలో సంరక్షించబడిన పురాతన స్థూపాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.
    AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 6

ప్రశ్న 11.
బౌద్ధమత ఆవిర్భావం, బౌద్ధమత బోధనల గురించి వివరించండి.
జవాబు:
బౌద్ధమతం :

  • బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. అతను లుంబిని వనం (నేపాల్)లో జన్మించాడు.
  • అతని మొదటి పేరు సిద్ధార్థుడు.
  • జ్ఞానోదయం అయిన తరువాత బుద్ధుడయ్యాడు.
  • సిద్ధార్థుడు కపిలవస్తు పాలకుడైన, శుదోధనుడు మరియు అతని రాణి మాయాదేవికి జన్మించాడు.
  • సిద్ధార్థుడికి యశోదరతో వివాహం జరిగింది. ఆ దంపతులకు “రాహుల్”. అనే కుమారుడు జన్మించాడు.
  • ఒకరోజు సిద్ధార్థుడు తన ప్రయాణంలో ఒక రోగి, ఒక వృద్ధుడు, ఒక సన్యాసి మరియు ఒక మృతదేహాన్ని చూశాడు. అప్పుడు సిద్ధార్థుడు జీవితం యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకున్నాడు.
  • అతను తన రాజ్యాన్ని మరియు కుటుంబాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళాడు. అతను సత్యం మరియు శాంతికోసం పరిశోధించాడు.
  • కఠినమైన ధ్యానంలో కూర్చున్నాడు. 6 సంవత్సరాల తరువాత, అతనికి జ్ఞానోదయం అయింది.
  • అతను జ్ఞానోదయం పొందిన చెట్టుకు ‘బోధి వృక్షం’ అని పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్ లోని కుశినగర్ లో సిద్ధార్థుడు స్వర్గస్థుడైనాడు.
  • బుద్ధుని ప్రకారం, మోక్షం సాధించడమే జీవిత పరమార్థం. మోక్షాన్ని బలుల ద్వారా లేదా ప్రార్థనల ద్వారా సాధించలేము.
  • మధ్యే మార్గం (అష్టాంగ మార్గం)ను అనుసరించడం ద్వారా మోక్షం సాధించవచ్చని తెలిపాడు. అహింసా సిద్ధాంతాలపై బౌద్ధమతం ఆధారపడి ఉంది.
  • త్రిపీఠకాలు బౌద్ధమత పవిత్ర గ్రంథాలు. అవి బుద్ధుని జీవితం, బోధనలు మరియు తాత్విక ఉపన్యాసాల సమాహారం. గౌతమ బుద్ధుని బోధలను ఆర్య సత్యాలు అంటారు.

ఆర్య సత్యాలు :

  • ప్రపంచం దుఃఖమయం.
  • దుఃఖం కోరికల వల్ల కలుగుతుంది.
  • కోరికలను త్యజించడం ద్వారా మోక్షం పొందవచ్చు.
  • అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు.

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 12.
క్రైస్తవ మత సిద్ధాంతం గురించి వివరించండి.
జవాబు:
క్రైస్తవ మతం ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఆచరింపబడే మతం. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిలు.

క్రైస్తవ మత సిద్ధాంతం :

  • మానవులందరూ దేవుని పిల్లలు.
  • పాపాలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడపండి.
  • నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని కూడా ప్రేమించండి.
  • ఒక చెంపపై కొట్టినప్పుడు, మరొక చెంప చూపించు. మానవ సేవే మాధవ సేవ.

ప్రశ్న 13.
ఇస్లాం మత ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త గురించి, వారి బోధనల గూర్చి తెలుపుము.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 7

  • మహమ్మదు ప్రవక్త లేదా అల్లా యొక్క దూతగా భావిస్తారు.
  • అల్లా యొక్క బోధనలు ‘ఖురాన్’ అనే పుస్తకంలో రాయబడింది.
  • ఇది ముస్లింల పవిత్ర గ్రంథం.
  • మహమ్మద్ ప్రవక్త మానవులందరూ సోదరులని బోధించాడు.
  • సమస్త మానవాళికి ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పాడు.
  • మహమ్మద్ ప్రవక్త దేవుడు ఒక్కడే అని బోధించాడు.

మహమ్మద్ ప్రవక్త బోధనలు :

  • మానవులందరూ అల్లాచే సృష్టించబడ్డారు.
  • మానవులందరూ దేవుని ముందు సమానం.
  • దేవునికి ఆకారం లేదు కాబట్టి విగ్రహారాధన సరియైనది కాదు.
  • ప్రతి ముస్లిం దేవుని సేవకునిగా మారి నిజాయితీగా ఉండాలి.

ప్రశ్న 14.
ఈ క్రింది వానిని గురించి నీకేమి తెలుసో వ్రాయండి.
ఎ) సెయింట్ పీటర్స్ బసిలికా (చర్చి)
బి) కాబా
సి) స్వర్ణదేవాలయం
జవాబు:
ఎ) సెయింట్ పీటర్స్ బసిలికా (చర్చి) :
ప్రపంచంలోని ప్రసిద్ధ చర్చి రోమన్ కాథలిక్ చర్చి. ఇది వాటికన్ నగరంలో కలదు. రోమన్ కాథలిక్ చర్చికి అధిపతిని పోప్ అంటారు. వాటికన్ నగరం ప్రపంచంలోనే అతి చిన్న దేశం.
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 8

బి) కాబా :
ప్రసిద్ధ మక్కా మసీదు (సౌదీ అరేబియా) మధ్యలో ఉన్న భవనమే కాబా. ముస్లింలకు పవిత్రమైన నగరం మక్కా ముస్లిం భక్తులు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ (తీర్థయాత్ర)కు మక్కాకు వెళ్ళాలనుకుంటారు.
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 9

సి) స్వర్ణదేవాలయం :
పంజాబ్ లోని అమృతసర్ నగరంలో స్వర్ణదేవాలయం ఉంది. ఇది పవిత్రమైన గురుద్వారా మరియు సిక్కులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం.
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 10

ప్రశ్న 15.
సిక్కుమతం గురించి వివరించండి.
జవాబు:

  • సిక్కు మతం స్థాపకుడు గురునానక్.
  • సిక్కు అనేది ఒక విశ్వాసం మరియు దాని అనుచరులను “సిక్కులు” అంటారు.
  • సిక్కు అనే పదానికి విద్యార్థి లేదా శిష్యుడు అని అర్థం.
  • సిక్కుల “పదిమంది గురువులలో” మొదటివాడు గురునానక్.
  • సిక్కుల ఆలయాన్ని ‘గురుద్వారా’ అంటారు. సిక్కుల పవిత్ర గ్రంథం ‘గురుగ్రంథ్ సాహెబ్’.

ప్రశ్న 16.
భారతదేశంలోని ప్రధాన భాషలను అవి మాట్లాడే రాష్ట్రాలలో గుర్తించండి.
జవాబు:

  1. జమ్ముకాశ్మీర్ – కాశ్మీరి
  2. పంజాబ్ – పంజాబి
  3. గుజరాత్ గుజరాతి
  4. మహారాష్ట్ర – మరాఠి
  5. గోవా – కొంకణి
  6. కర్ణాటక – కన్నడ
  7. తమిళనాడు – తమిళం
  8. కేరళ – మళయాళం
  9. ఆంధ్రప్రదేశ్ – తెలుగు
  10. తెలంగాణ – తెలుగు
  11. ఒడిషా – ఒడియా
  12. పశ్చిమ బెంగాల్ – బెంగాలీ
  13. అసోం – అస్సామి
  14. సిక్కిం – నేపాలి
  15. నాగాలాండ్ – నాగామి
  16. మణిపూర్ – మణిపురి
  17. మిజోరాం – మిజో
  18. మేఘాలయా – ఖాసి
  19. అరుణాచల్ ప్రదేశ్ – నైషి
  20. మిగతా రాష్ట్రాలలో – హిందీ

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 11

ప్రశ్న 17.
వర్థమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, వీరి యొక్క జననం, జన్మస్థలం, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, బిరుదులు, మరణం గూర్చి తెల్పుము.
జవాబు:
i) వర్థమాన మహావీరుడు :
పేరు : వర్థమానుడు
జననం : క్రీ.పూ. 599
జన్మస్థలం : వైశాలి
తల్లిదండ్రులు : సిద్ధార్థ, త్రిషాల
జీవిత భాగస్వామి : యశోద
బిరుదులు : మహావీర జిన
మరణం : క్రీ.పూ. 527

ii) గౌతమ బుద్ధుడు
పేరు : సిద్దారుడు
జననం : క్రీ.పూ. 563
జన్మస్థలం : లుంబిని
తల్లిదండ్రులు : సుదోధనుడు, మాయాదేవి
జీవిత భాగస్వామి : యశోధర
కుమారుడు : రాహుల్
బిరుదులు : గౌతముడు, బుద్ధుడు
మరణం : క్రీ.పూ. 483

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 18.
భారతదేశ సంస్కృతి మరియు వారసత్వం గూర్చి తెలిపి, వాని సమైక్యత ఎలా సాధ్యమైంది? (సాధ్యమైంది)
జవాబు:

  • భారతదేశం సువిశాలమైనది. మన దేశంలో అనేక మతాలు, కులాలు, తెగలు, భాషలు, నృత్యరీతులు, శిల్పకళలు, ఆహారం, వేషధారణ, ఆచారాలు మరియు సంప్రదాయాలు కలవు. భారతదేశానికి గొప్ప సంస్కృత మరియు వారసత్వం కలదు. ఇది ఒక విభిన్నమైనది. ప్రపంచంలో దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు కలదు.
  • భారతదేశంలో సంప్రదాయాలు ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వేరు వేరుగా ఉంటాయి.
  • ఇది అనేక ఆచార సంప్రదాయాల సమ్మిళితం.
  • భారతదేశంలో అనేక ఆచార, సాంప్రదాయాలు ఉన్నప్పటికీ, భారతీయులందరి మధ్య సోదర భావం కలదు.
  • అన్ని మతాలవారు ఇతర మతపరమైన వేడుకల్లో చురుకుగా పాల్గొంటారు. ఉదాహరణకు దీపావళి, హోలీ, కడప దర్గాలోని ఉరుసు ఉత్సవం, రక్షాబంధన్ మరియు నెల్లూరులోని రొట్టెల పండుగ. దీనిద్వారా ప్రాథమికంగా అన్ని మతాలు సమానమని, చివరికి దేవుని సన్నిధికి దారితీస్తున్నాయనే వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు.
  • ఒక మతం వారు తమ సొంత ఉనికిని కోల్పోకుండా ఇతర మతాలతో కలిసి ఒకే వేదికపై చేసే సహజీవనం ఇది.

ప్రశ్న 19.
బౌద్ధ, జైన మతాలలోని కొన్ని సారూప్యాలను వ్రాయండి.
జవాబు:

  1. ఈ రెండు మతాల వ్యవస్థాపకులు గణసంఘాలలో జన్మించారు.
  2. ఇద్దరూ చిన్నవయస్సులోనే ఇంటిని వదిలి పరివ్రాజకులయ్యారు.
  3. ఇద్దరూ ధ్యానం, తపస్సు ద్వారా జ్ఞానాన్ని పొందారు.
  4. రెండు మతాలు సత్య, అహింసలను బోధించాయి.
  5. రెండు మతాలు వ్యక్తిత్వ ఉన్నతి ప్రభోదించాయి.

ప్రశ్న 20.
వైవిధ్యభరితమైన వారసత్వమున్న భారతదేశంలో నివసించటం మీ జీవితాన్ని ఎలా సుసంపన్నం చేస్తుంది?
జవాబు:
భారతదేశంలో జన్మించడం, జీవించడమే నాకు పెద్ద సంపద క్రింద లెక్క. ఇక్కడ పుట్టిన వేదాలు మనిషినేగాక మానును కూడా ఎలా గౌరవించాలో చెబుతాయి. వేదాంతాలు ‘నేను’ అంటే ఏమిటో తెలియచేస్తాయి. ఇక్కడ పుట్టిన బౌద్దం, ఇక్కడకొచ్చిన క్రైస్తవం తోటి మానవుణ్ణి, జంతువును కూడా ఎలా ప్రేమించాలో చెబుతాయి. ఇక్కడ కొచ్చిన ఇస్లాం చెడు మీద మంచి విజయం ఎలా సాధించాలో చెబుతుంది. ఇలాంటి వారసత్వమున్న దేశంలో జీవించడం నాకు కోట్ల ఆస్తితో సమానం.

ప్రశ్న 21.
వేర్వేరు మతాలలోని ఏకత్వాన్ని తెలిపే అంశాల పట్టికను తయారు చేయండి.
జవాబు:
వేర్వేరు మతాలలోని ఏకత్వాన్ని తెలిపే అంశాల పట్టిక :

  1. మార్గాలు, మతాలు వేరైనా దేవుడొక్కడే.
  2. చాలా మతాలవారికి శుక్రవారం మంచిరోజు.
  3. పూజా సమయానికి ముందు శరీరాన్ని శుభ్రపరచుకోవడం.
  4. భగవంతుని ధ్యానించే వారు ఆ సమయంలో తలపైన వస్త్రాన్ని కప్పుకోవడం.
  5. మండల (40 రోజుల) దీక్షలు పాటించడం. (ఈస్టర్, అయ్యప్ప 41 దినములు, రంజాన్ 30 దినములు).
  6. భగవంతుని పునరుత్థానాన్ని అందరూ నమ్మడం.
  7. అహింస, సత్యపాలన మొదలైనవి ఆచరించడం మొదలగునవి.

ప్రశ్న 22.
కరెన్సీ నోటును చూసి దానిపైనున్న వివిధ లిపులను గుర్తించండి. ఏయే భాషలలో దీనిమీద రాసి ఉన్నాయి. ఒకే లిపిలో వివిధ భాషలు రాసి ఉన్నాయి. అవి ఏవి?
జవాబు:
ఉదా : 20 రూపాయల నోటును తీసుకుంటే దానిమీద 15 భాషలలో వ్రాయబడి ఉన్నది.

  1. అస్సామీ – కుడిటక.
  2. బెంగాలీ – కుడిటక
  3. గుజరాతీ – వీస్ రుపియా
  4. కన్నడ – ఇప్పట్టురుపయగలు
  5. కాశ్మీరీ – ఊహ్ రోపియి
  6. కొంకణి – వీస్ రుపియా
  7. మళయాళం – ఇరుపట్ రూపా
  8. మరాఠీ – వీస్ రుపియా
  9. నేపాలీ – బీస్ రుపియా
  10. ఒరియా – బకాదాహకా
  11. పంజాబ్ – వీహ్ రుపయే.
  12. సంస్కృతం – వింశతి రూప్యకా
  13. తమిళం – ఇరుపదు రూపాయ్
  14. తెలుగు – ఇరువది రూపాయలు
  15. ఉర్దు – బీస్ రుపియాన్

వీటిలో అస్సామీ, బెంగాలీ ఒకే లిపిలోనూ, గుజరాతీ, మరాఠీ, కొంకణి ఒకే లిపిలో ఉన్నాయి.

ప్రశ్న 23.
మీ పరిసరాలలో భిన్నత్వం ఉందని తెలిపే రెండు ఉదాహరణలు తెలపండి.
జవాబు:
మా పరిసరాలలో భిన్నత్వం ఉందని తెలపడానికి ఈ క్రింది రెండు అంశాలు ఉదాహరణలు.

  1. మాది ఆంధ్రప్రదేశ్ లో ఒక నగరం. మేమంతా తెలుగువారము. కాని మానగరంలో అనేక భాషలవారున్నారు. ఇందుకు
    ఉదా : మా ఊరిలో ఉన్న తమిళపాఠశాల, గురునానక్ కాలని.
  2. మాది భారతదేశము. ఎక్కువమంది హిందువులుండే దేశము. కాని ఇక్కడ అనేక మతాలవారున్నారు. ఇందుకు
    ఉదా : కాశీలో విశ్వేశ్వరుని మందిరము, నాగపట్నంలో వేళాంగిణీ మాత చర్చి, జుమ్మా మసీదు.

AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

ప్రశ్న 24.
మత విశ్వాసాల మధ్య గల పోలికలను, భేదాలను పట్టిక రూపంలో రాయండి.
జవాబు:
పోలికలు :

  1. అందరి భావాలు దేవుడొక్కడే అని చెబుతున్నాయి.
  2. పరలోక జీవితాన్ని విశ్వసిస్తున్నాయి.
  3. ప్రేమ తత్వాన్ని బోధిస్తున్నాయి.
  4. తోటి ప్రాణి మంచిని కోరుతున్నాయి.

భేదాలు:

  1. భగవంతుని రూపాలలో భేదాలున్నాయి.
  2. ప్రార్థనా విధానాలలో భేదాలున్నాయి.
  3. ‘పునర్జన్మ’ సిద్ధాంతం నమ్మికలో భేదాలున్నాయి.
  4. మతాన్ని అర్థం చేసుకోవటంలో కూడా భేదాలున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా అర్థం చేసుకుని వాటిని వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రశ్న 25.
ప్రపంచ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.
అ) జెరూసలేం ఆ) మక్కా ఇ) కేరళ రాష్ట్రం ఈ) చెన్నె ఉ) సింధూనది ఊ) రోమ్ ఎ) అమృతసర్
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు 12

AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన

These AP 6th Class Social Important Questions 10th Lesson స్థానిక స్వపరిపాలన will help students prepare well for the exams.

AP Board 6th Class Social 10th Lesson Important Questions and Answers స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 1.
భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా ఏర్పాటు చేసిన విధమును వివరించండి.
జవాబు:
భారతదేశంలో స్థానిక స్వపరిపాలన, రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని సూచిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 స్థానిక స్వపరిపాలవను సూచిస్తుంది. ఈ ఆర్టికల్ మన జాతిపిత గాంధీజీ అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చబడింది. భారత పార్లమెంట్ రెండు సవరణలు చేసింది. 1992వ సంవత్సరంలో చేయబడిన 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను, 74వ సవరణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనలను ఏర్పాటు చేశాయి. ఈ సవరణల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయితీ రాజ్ చట్టం 1994ను చేసి రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది.

ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక స్వపరిపాలన గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని స్థాయిల్లో కలదు? అవి ఏవి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994 గ్రామీణ ప్రాంతాల్లో మూడు అంచెల స్థానిక స్వపరిపాలనలను ఏర్పాటు చేసింది. అవి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయితీ, మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ మరియు – జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్.

AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 3.
గ్రామ పంచాయితీలోని వార్డుల గురించి తెలుపుము.
జవాబు:
సాధారణంగా ప్రతి గ్రామాన్ని కొన్ని వార్డులు (వీధులు, కాలనీలు)గా విభజిస్తారు. ప్రతి వార్డులో ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది. ప్రతివార్డు నుంచి ఒక సభ్యుడు గ్రామపంచాయితీకి ఎన్నికవుతారు. అతనిని “వార్డు సభ్యుడు” అని పిలుస్తారు. ఈ విధంగా ప్రతి వీధి / ప్రాంతం నుంచి ఒక వ్యక్తి గ్రామ పంచాయితీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రతి గ్రామ పంచాయితీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులుంటారు. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయితీ ఎన్నికలలో పోటీ చేయవచ్చు.

ప్రశ్న 4.
గ్రామ పంచాయితీల్లో రిజర్వేషన్లు ఏ విధంగా అమలవుతున్నాయి?
జవాబు:
ఇంతకుముందు మన సమాజంలో స్త్రీలు ఎన్నికలలో పోటీచేయడం, వార్డు మెంబరు గానో, సర్పంచ్ గానో ఎన్నిక కావడం అంత సులభం కాదు. ఎందుకంటే స్థానిక సంస్థలలో పురుషుల ఆధిక్యం ఉంది. దీనివల్ల సగం జనాభాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ స్త్రీలకు స్థానిక సంస్థలలో 1/3 వంతు స్థానాలను కేటాయించింది. మన రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లు 50% కు పెంచడం జరిగింది.

అలాగే షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదిక ప్రకారం స్థానాలు కేటాయించారు. ఆ విధంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ఈ సంస్థలలో అన్ని వర్గాలవారికీ ప్రాతినిధ్యం లభిస్తుంది.

ప్రశ్న 5.
గ్రామ సర్పంచ్ గురించి నీకేమి తెలుసు?
జవాబు:
సర్పంచ్ గ్రామ పంచాయితీకి పెద్ద. గ్రామానికి మొదటి పౌరుడు. గ్రామ పంచాయితీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సర్పంది. రోజువారి కార్యకలాపాలు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. గ్రామ పంచాయితీకి వచ్చే ఆదాయం, వ్యయాలకు కూడా సర్పంచే బాధ్యత వహిస్తాడు. ఆ విధంగా సర్పంచ్ గ్రామ పంచాయితీలో చాలా బాధ్యతలు కలిగి ఉంటాడు. చాలా గ్రామాలలో సర్పంచ్ క్రియాశీలకంగా ఉండడం వల్ల అభివృద్ధి చెందిన విషయం మనకు తెలుసు.

ప్రశ్న 6.
గ్రామ పంచాయితీ విధులను తెలుపుము.
జవాబు:
గ్రామ పంచాయితీ విధులు :
AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన 1

  • నీటి వనరులు, రోడ్లు, మురుగునీరు, పాఠశాల భవనాలు ఎరియు ఇతర ఉమ్మడి వనరుల నిర్మాణం మరియు నిర్వహణ
  • స్థానికంగా పన్నులు విధించటం మరియు వసూలు చేయడం.
  • ఉషాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడం

ప్రశ్న 7.
గ్రామ పంచాయితీ ఆర్థిక వనరులను గూర్చి తెల్పండి.
జవాబు:
గ్రామ పంచాయితీ ఆర్థిక వనరులు :

  • ఇళ్ళు, మార్కెట్, స్థలాలు మొదలైన వాటిపై పన్నులు వసూలు.
  • రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ ల నుండి మంజూరయే నిధులు మరియు రుణాలు.
  • స్థానిక ప్రజల నుండి విరాళాలు.

AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 8.
గ్రామ సచివాలయం ఏర్పాటు, లక్ష్యాలను వివరించండి.
జవాబు:
మన రాష్ట్రంలో అక్టోబర్ 2, 2019న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడింది. ప్రతి 2000 మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది. ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది గ్రామ నిర్వాహకులు (ఉద్యోగులు) ఉంటారు. గ్రామ సచివాలయం యొక్క ప్రధాన లక్ష్యం ప్రజలకు సమర్ధవంతంగా, పారదర్శకంగా మరియు జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను అందించడం, సేవలు గ్రామ వాలంటీర్ల ద్వారా వారికి కేటాయింపబడిన ఇళ్ళకు అందించడం జరుగుతుంది.

ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్ లోని మొదటి పురపాలక సంఘం గురించి మీకు తెలుసా?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని మొదటి పురపాలక సంఘం గురించి తెలుసు, అది భీముని పట్నం పురపాలక సంఘం. దీనినే భీమిలి అని కూడా పిలుస్తారు. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. దీనిని 1861లో స్థాపించారు. ఇది 2011లో 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఇది భారతదేశంలోని పురాతన మునిసిపాలిటీలలో ఒకటి.

ప్రశ్న 10.
మండల పరిషత్, జిల్లా పరిషత్ల నిర్మాణం గూర్చి వివరించండి.
జవాబు:
మండల పరిషత్, జిల్లా పరిషల నిర్మాణం: ప్రతి మండలంలో సుమారు 20 నుండి 40 గ్రామ పంచాయితీలు ఉంటాయి. జిల్లాలోని అన్ని మండల పరిషత్తులు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (MPTCS) సభ్యులను ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. మండల పరిషత్ లో కొందరు సభ్యులు (కో – ఆప్టెడ్ సభ్యులు) నియమించబడతారు. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (MPTC) సభ్యులు తమలో ఒక సభ్యుడిని’ మండలాధ్యక్షునిగాను, మరొకరిని ఉపాధ్యాక్షుని గాను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ సభ్యులను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల (ZPTCS) నుండి ఓటర్లు నేరుగా ఎన్చుకొంటారు. జిల్లా పరిషత్ కొంతమంది సభ్యులు (కో- ఆప్టెడ్ సభ్యులు) నియమించబడతారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ZPTC) సభ్యులు తమలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్ గాను, మరొకరిని వైస్ ఛైర్మన్ గాను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకొంటారు. జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ జిల్లాలోని పంచాయితీల కార్యకలాపాలను సమన్వయం చేస్తాయి. పంచాయితీల ప్రణాళికలను ఆమోదించి నిధుల కేటాయింపును సమన్వయపరుస్తాయి.

ప్రశ్న 11.
నగర పంచాయితీ, పురపాలక సంఘంల నిర్మాణం గూర్చి వివరించండి.
జవాబు:
నగర పంచాయితీ నిర్మాణం : ప్రతి నగర పంచాయితీలో వార్డు కౌన్సిలర్లు మరియు ఛైర్మతో ఒక కమిటీ ఉంటుంది. ప్రతి నగర పంచాయితీ కమిటీలో కనీసం పదిమంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. నగర పంచాయితీ నోటిఫైడ్ ఏరియా కమిటీ (N.A.C.) సభ్యులు ఆయా వార్డుల నుండి వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన ఐదు సంవత్సరాలకొకసారి ఎన్నుకోబడతారు.’ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు మరియు మహిళలకు సీట్లు కేటాయించబడ్డాయి. ‘కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నగర పంచాయితీలోని వార్డుల నుండి ఎన్నుకోబడతారు. పురపాలక సంఘం నిర్మాణం : ప్రతి మున్సిపాలిటీలో ఎన్నిక కాబడిన సభ్యులు అయిన “కౌన్సిలర్లు” మరియు నామినేటెడ్ సభ్యులతో ఒక మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది. మునిసిపల్ కౌన్సిలను ఏర్పాటుచేయడానికి గాను, మున్సిపాలిటీ యొక్క ప్రాంతాన్ని వార్డులుగా విభజిస్తారు. ప్రతి ఐదేళ్ళకొకసారి వార్డు కౌన్సిలర్లను నేరుగా ఎన్నుకుంటారు. ఈ కౌన్సిలర్లు మరియు కౌన్సిల్ యొక్క ఇతర సభ్యులు కలిసి మున్సిపల్ ఛైర్మనను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు.

AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 12.
పురపాలక సంఘం ఏ విధంగా పనిచేస్తుందో సోదాహరణంగా వివరించండి.
జవాబు:
పురపాలక సంఘాలు చాలా పనులు చేస్తాయి. ఉదా : నీటి సరఫరా, వీధి దీపాలు, కొత్త రోడ్లు వేయడం, మరమ్మత్తులు, మురికి కాలువల మరమ్మత్తు, నిర్వహణ, చెత్తను తొలగించడం, పాఠశాలలను నడపడం, చౌకదుకాణాలు, ఆసుపత్రుల నిర్వహణ మొదలయినవే కాకుండా ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తాయి. ఇవన్నీ చేయడానికి మానవ వనరులు అవసరం చాలా ఉంది. కేవలం, కౌన్సిలర్లు / కార్పొరేటర్ల వల్ల ఈ పనులు కావు. ఈ పనుల కోసం పురపాలక సంఘాలు చాలా మంది ఉద్యోగులను, అధికారులను, అకౌంటెంట్లను, గుమస్తాలను నియమిస్తుంది.

అలాగే ప్రతి మున్సిపాలిటీని ఎన్నో విభాగాలుగా విభజిస్తారు. ప్రతి విభాగానికి ఒక అధికారిని నియమించి ఆయనకు బాధ్యతలు అప్పజెప్పుతారు. ఉదాహరణకు నీటి సరఫరా విభాగం, విద్యుత్ సరఫరా విభాగం మొదలయినవి పురపాలక సంఘంలో విభాగాలు. మరి కౌన్సిలర్లు ఏం చేస్తారు అని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి కౌన్సిలర్లు ప్రజలతో ఎల్లప్పుడు కలిసి ఉండి వారి అవసరాలు, సమస్యలు పురపాలక సమావేశంలో చర్చిస్తారు.

వివిధ రకాల పనులు చేపట్టడానికి పురపాలక సంఘానికి కొన్ని కమిటీలు ఉంటాయి. వీటిలో కౌన్సిలర్లకు ముఖ్య భూమిక ఉంటుంది. ఈ కమిటీలు వివిధ విభాగాలు చేస్తున్న పనిని పరిశీలిస్తాయి. ఇది పురపాలక ప్రణాళికను కూడా తయారు చేస్తాయి. తరువాత ప్రతిపాదనలను తయారు చేసి, పురపాలక సంఘాల సమావేశంలో చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలను అధికారులు, ఉద్యోగులు అమలుపరుస్తారు. ప్రతివార్డు కౌన్సిలరూ తన వార్డు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. అలా చేస్తూనే ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలపట్ల సానుకూల దృక్పథం కలిగి ఉంటారు.

ప్రశ్న 13.
పురపాలక సంఘంనకు నిధులు ఎలా సమకూరతాయి?
జవాబు:
పురపాలక సంఘం నిధులు :
పురపాలక సంఘం ఎన్నో రకాల పన్నులను విధిస్తుంది. ఉదా : ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలపై పన్ను, దుకాణాలపై పన్ను, సినిమా టికెట్ల మీద పన్ను మొదలైనవి. పన్నుల మీద వచ్చే ఆదాయం పురపాలక సంస్థల పనులకు సరిపోదు. ఈ సంస్థ ప్రభుత్వం మంజూరు చేసే నిధులపై ఆధారపడుతుంది. ప్రభుత్వం ఎన్నో రకాల పనులకు (రోడ్లు వేయడానికి, నీటి ట్యాంక్ నిర్మించడానికి, మున్సిపాలిటీ రోజువారీ పనులకు) నిధులను మంజూరు చేస్తుంది.

AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 14.
మున్సిపల్ కార్పోరేషన్ నిర్మాణం గూర్చి తెలుపుము.
జవాబు:
మున్సిపల్ కార్పోరేషన్ నిర్మాణం : ప్రతి మున్సిపల్ కార్పోరేషన్ “కార్పొరేటర్లు” అని పిలువబడే ఎన్నుకోబడిన సభ్యులు మరియు నామినేటెడ్ సభ్యులను కలిగి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం, మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రాంతాన్ని విభాగాలుగా (వార్డులు) విభజిస్తాయి. ప్రతి వార్డు నుండి కార్పొరేటర్లు ప్రతి ఐదు సంవత్సరాలకు నేరుగా ఎన్నుకోబడతారు. ఈ కార్పొరేటర్లు మరియు ఇతర సభ్యులు కలిసి కార్పొరేషన్ మేయర్‌ను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకొంటారు.

ప్రశ్న 15.
క్రింది ఫ్లోచార్టును పరిశీలించి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానము లివ్వండి.
AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన 2
i) ఒక పట్టణం జనాభా 4,80,000. అయితే ఆ పట్టణం ఏ స్థానిక సంస్థ అవుతుంది.?
జవాబు:
మున్సిపల్ కార్పోరేషన్

ii) NAC అనగా నేమి?
జవాబు:
నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (కమిటి)

iii) 40,000 నుండి 3,00,000 జనాభా ఉన్న స్థానిక సంస్థనేమంటారు?
జవాబు:
పురపాలక సంఘం

iv) దేని ఆధారంగా పట్టణ స్థానిక సంస్థలను 3 రకాలుగా విభజించారు?
జవాబు:
జనాభా ప్రాతిపదికన

పట నైపుణ్యం

ప్రశ్న 16.
a) పటాన్ని గుర్తించుట :
ఈ క్రింది వాటిని గుర్తించుము. 1. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు 2. రాష్ట్ర రాజధాని
AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన 3

b) పటాన్ని చదువుట :
ఈ క్రింది పటాన్ని గమనించి ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 6th Class Social Important Questions Chapter 10 స్థానిక స్వపరిపాలన 4

1. అనంతపురానికి ఉత్తరాన ఉన్న జిల్లా ఏది?
జవాబు:
కర్నూలు

2. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాన ఉన్న జిల్లా ఏది?
జవాబు:
శ్రీకాకుళం

3. ఒడిశాను ఆనుకుని ఉన్న ఒక జిల్లా పేరు వ్రాయుము.
జవాబు:
శ్రీకాకుళం

4. పశ్చిమ గోదావరి, గుంటూరుకు మధ్యన ఉన్న జిల్లా ఏది?
జవాబు:
కృష్ణా జిల్లా

5. నీ వుండే జిల్లాకు ఎరుపు రంగు వేయుము.
జవాబు:
విద్యార్థి కృత్యం

AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం

These AP 6th Class Social Important Questions 9th Lesson ప్రభుత్వం will help students prepare well for the exams.

AP Board 6th Class Social 9th Lesson Important Questions and Answers ప్రభుత్వం

ప్రశ్న 1.
ప్రభుత్వం అనగా నేమి? సాధారణంగా ప్రభుత్వం ఎన్ని విభాగాలు కల్గి ఉంటుంది? అవి ఏవి?
జవాబు:
ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ, వారి కొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాని “ప్రభుత్వం” అంటారు. సాధారణంగా ప్రభుత్వం మూడు విభాగాలను కలిగి ఉంటుంది. అవి :

  1. శాసన నిర్మాణ శాఖ
  2. కార్యనిర్వహక శాఖ
  3. న్యాయశాఖ

AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం 1

ప్రశ్న 2.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎన్ని రకాలు కలవు? అవి ఏవి? వివరించుము.
జవాబు:
ప్రస్తుత ప్రపంచంలో చాలా దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భారతదేశం కూడా ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో రెండు రకాలు ఉన్నాయి. అవి :

ప్రత్యక్ష ప్రజాస్వామ్యం :
ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు.
ఉదాహరణకి :
స్విట్జర్లాండ్. ఈ దేశంలో పౌరుల ఒక ప్రదేశంలో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు లేదా చట్టాలు చేస్తారు. ఇక్కడ తక్కువ జనాభా ఉన్నందున ఇది సాధ్యమైంది.

పరోక్ష ప్రజాస్వామ్యం (ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం) :
ప్రజాస్వామ్యం యొక్క ఈ రూపంలో, ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. అధికంగా జనాభా ఉండటం వల్ల, భారతదేశంతో సహా చాలా దేశాలు పరోక్ష ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాయి.

AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 3.
ఎన్నికలు అనగానేమి? ప్రజాస్వామ్యంలో ఎన్నికల పాత్ర ఏమిటి?
జవాబు:
ఎన్నికలు :
ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని “ఎన్నికలు” అంటారు. పరోక్ష ప్రజాస్వామ్య విజయం ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికలు ఇక్కడ కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి, ఎన్నికలు స్వేచ్చగా మరియు నిష్పక్షపాతంగా జరగాలి.
AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం 2

ప్రశ్న 4.
భారతదేశంలో విశ్వజనీన ఓటుహక్కుల గూర్చి తెలుపుము.
జవాబు:
భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు మహిళలకు మరియు కొన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, ఒక నిర్దిష్ట వయస్సు (ప్రస్తుతం 18 సంవత్సరాలు) పొందిన అందరికీ ఓటు హక్కు ఉంది. (విశ్వజనీన వయోజన ఓటుహక్కు).

ప్రశ్న 5.
భారతదేశంలో ఎన్ని స్థాయిల్లో ప్రభుత్వం ఉంది? ఎందుకు అలా ఏర్పాటు చేసారు?
జవాబు:
భారతదేశం అత్యధిక జనాభా కలిగిన విశాలమైన దేశం. కాబట్టి దేశ వ్యాప్తంగా ప్రజల అవసరాలు మరియు ఆ సమస్యలను గుర్తించడం కష్టం. కాబట్టి, వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది. అవి :
1. జాతీయ స్థాయి – కేంద్ర ప్రభుత్వం,
2. రాష్ట్ర స్థాయి – రాష్ట్ర ప్రభుత్వం,
3. స్థానిక స్థాయి – స్థానిక ప్రభుత్వం.

AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం 3

ప్రశ్న 6.
వివిధ రకాల ప్రభుత్వ రూపాల గురించి సవివరంగా తెల్పండి.
జవాబు:
వివిధ రకాల ప్రభుత్వాలు :
రాచరికం మరియు ప్రజాస్వామ్యం వంటి అనేక రకాల ప్రభుత్వాలు ప్రాచీన కాలం నుండి నేటి వరకు పనిచేస్తున్నాయి.

రాచరికం :
మునుపటి అధ్యాయంలో అశోకుడు, చంద్రగుప్తుడు వంటి చక్రవర్తులు లేదా రాజులు పరిపాలించిన సామ్రాజ్యాలు గురించి మీరు తెలుసుకున్నారు. ఒకరాజు లేదా రాణి చేసే పాలనను “రాచరికం” అంటారు. రాజు లేదా రాణి వారసత్వంగా అధికారంలోకి వస్తారు. ఉదాహరణకు అశోకుడు, తన తండ్రి బిందుసారుడు తరువాత అధికారంలోకి వచ్చాడు. కొంతమంది చక్రవర్తులు అన్ని అధికారాలను తామే కలిగి ఉంటారు.

కానీ మరికొందరు ప్రభుత్వంలోని ఇతర శాఖల అధికారులతో పంచుకుంటారు. కాబట్టి, పౌరులకు రాజును బట్టి హక్కులు మరియు సౌకర్యాలు ఉండవచ్చు. ఉదాహరణకు ప్రజలు ఇతర రాజుల పాలన కంటే అశోకుని పాలనలో ఎక్కువ స్వేచ్ఛ మరియు సౌకర్యాలను పొందారు.

ప్రజాస్వామ్యం :
ఇది ప్రజలు నడుపుతున్న ప్రభుత్వ రూపం. ఇక్కడ ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి అనుమతి ఉంది. అందువల్ల అతను / ఆమె నేరుగా లేదా వారి ప్రతినిధుల ద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో లేదా చట్టాలు, తీసుకోవడంలో పాల్గొంటారు. రాచరికం వంటి ఇతర రకాల ప్రభుత్వాలలో కంటే ప్రజాస్వామ్యంలోని పౌరులు ఎక్కువ హక్కులు మరియు సౌకర్యాలు పొందుతారు. ఇక్కడ అధికారం వారసత్వంగా పొందలేము.

ప్రశ్న 7.
క్రింద ఇవ్వబడిన ఫ్లోచార్టును పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానలివ్వండి.
AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం 4
ఎ) భారతదేశంలో ఏ విధమైన ప్రజాస్వామ్యం కలదు?
జవాబు:
పరోక్ష ప్రజాస్వామ్యం

బి) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏ దేశంలో కలదు?
జవాబు:
స్విట్జర్లాండ్.

సి) పరోక్ష ప్రజాస్వామ్యంలో చట్టాలు, నియమాలు ఎవరు రూపొందిస్తారు?
జవాబు:
ఎన్నికైన ప్రతినిధులు

డి) ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని సం||రాలకు ఓటు హక్కు లభిస్తుంది?
జవాబు:
18 సం||రాలకు పై బడినవారికి. ప్రజాస్వామ్యం రకాలు (ఫ్లోచార్టు)

AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 8.
క్రింది చిత్రంను పరిశీలించి, ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన జవాబు లివ్వండి.
AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం 5
ఎ). చిత్రంలోని వ్యక్తి ఏ దేశ అధ్యక్షుడు?
జవాబు:
అమెరికా

బి) ప్రజాస్వామ్యానికి జన్మస్థలం ఏది?
జవాబు:
గ్రీసు.

సి) ప్రజాస్వామ్యం అనగానేమి?
జవాబు:
ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.

డి) చిత్రంలోని వ్యక్తి ఎవరు?
జవాబు:
అబ్రహం లింకన్.

ప్రశ్న 9.
ఈ క్రింది పటాన్ని గమనించి ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 6th Class Social Important Questions Chapter 9 ప్రభుత్వం 6
1. భారతదేశంలో ఉత్తరాన ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు:
భారతదేశంలో ఉత్తరాన ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్,

2. అండమాన్, నికోబార్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి?
జవాబు:
అండమాన్, నికోబార్ దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి.

3. గోవా ఏ సముద్రం ఒడ్డున ఉన్నది?
జవాబు:
గోవా అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నది.

4. భారతదేశం మధ్యలో ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
భారతదేశం మధ్యలో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్,

5. నాగాలాండకు, మిజోరంకు మధ్యన ఏ రాష్ట్రం కలదు?
జవాబు:
నాగాలాండకు, మిజోరంకు మధ్యన ఉన్న రాష్ట్రం మణిపూర్.

6. భారతదేశానికి సరిహద్దుగా ఉన్న రాచరిక దేశం ఏది?
జవాబు:
భూటాన్.

AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

These AP 6th Class Social Important Questions 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 8th Lesson Important Questions and Answers రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 1.
క్రింది వారిని గురించి నీకు తెలిసిన రెండు వాక్యాలు రాయండి.
1) మెగస్తనీస్ 2) కౌటిల్యుడు
జవాబు:
1) మెగస్తనీస్ :
మెగస్తనీస్ ఒక గ్రీకు రాయబారి. అతను చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు. అతను ‘ఇండికా’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇది మౌర్యుల కాలపరిస్థితులు. వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక ఆధార గ్రంథం.

2) కౌటిల్యుడు :
కౌటిల్యుడిని ‘విష్ణుగుప్తుడు’ మరియు ‘చాణక్యుడు’ అని కూడా పిలుస్తారు. అతను చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి ‘అర్థశాస్త్రము’ అతను రచించిన ప్రముఖ గ్రంథం.

ప్రశ్న 2.
అశోకుని శిలాశాసనాల గురించి తెల్పండి. ఏదైనా ఒక శాసనం గురించి విపులంగా వివరించండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 1
13వ నంబరు రాతి శాసనంలో అశోకుడు కళింగయుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది. ‘దిగువ శిలా శాసనాన్ని పరిశీలించండి. ప్రాకృత లిపిలో అక్షరాలతో చెక్కబడిన శిలాశాసనం యొక్క అర్థం తెలుగులో ఈ కింది విధంగా భావించవచ్చును.

ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు లక్షలమంది చని పోతారు మరియు అంతకంటే ఎక్కువ సంఖ్యలో సైనికులు బందీలుగా దొరుకుతారు. అందువలనే నేను విచారంగా ఉన్నాను. బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకొనుటే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను. నేను ఈ శాంతి సందేశాన్ని భవిష్యత్ తరాల కొరకు లిఖిస్తున్నాను. దీనివలన నా వారసులు ఎవ్వరూ కూడా యుద్ధం గురించి ఆలోచించరు. దానికి బదులుగా వారు ధర్మాన్ని వ్యాప్తి చేయడం గురించే ఆలోచిస్తారు. (ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో ‘దమ్మము’ అని పిలుస్తారు.)

అశోకుడు ఇలాంటి చాలా శిలాశాసనాలను తన రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో చెక్కించాడు. ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ శిలాశాసనాల ముఖ్య ఉద్దేశం. అశోకుడు శిలాశాసనాలపై చెక్కబడి ఉన్న ధర్మ సూత్రాలను నిరక్షరాస్యులకు తెలియజెప్పేందుకు ప్రత్యేక అధికారులను నియమించాడు.

AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 3.
అశోకుడు ప్రజల కొరకు చేపట్టిన ప్రజోపయోగ కార్యక్రమాలేవి?
జవాబు:
నీరు, ఆహారం పవిత్రమైనవని అశోకుడు ఒక బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకున్నాడు. తన ప్రజలందరికీ అందాలని సంకల్పించుకున్నాడు. అనంతరం అశోకుడు రోడ్డుకు రెండువైపులా చెట్లు నాటించాడు. చెట్లు రోడ్లపై ప్రయాణించేవారికి నీడను ఇవ్వడంతోపాటు ఆకలితో ఉన్నవారికి పండ్లను ఇవ్వడం ద్వారా ఆకలిని తీర్చేవి. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు బావులు తవ్వించాడు.

అశోకుని కాలంలో ప్రజలకు మంచి రవాణా సౌకర్యాలు కలవు. రహదారులు తన సువిశాల సామ్రాజ్యంలోని వేర్వేరు సంస్కృతులు గల ప్రజలను కలిపాయి. రవాణా మరియు వాణిజ్య సౌకర్యాలు సులభతరమయ్యాయి. విశాలమైన భారతదేశంలో రాజకీయ ఐక్యత సాధ్యమైంది. మనుషులు, జంతువులకు కూడా వైద్య సంరక్షణ కొరకు వైద్యశాలలు ఏర్పాటు చేయబడినవి.

ప్రశ్న 4.
శాతవాహనుల గురించి నీకు ఏమి తెలియును, వాణిజ్యము, మతము గూర్చి ప్రాధాన్యతనిస్తూ వ్రాయుము.
జవాబు:
శాతవాహనులు :
మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత దక్కన్ ప్రాంతంలో అనేక తెగల పెద్దలు ఆ ప్రాంతాన్ని చిన్నచిన్న రాజ్యాలుగా విభజించుకొని పరిపాలన ప్రారంభించారు. అలా ఏర్పడిన రాజులలో శాతవాహనులు ఒకరు. శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలోని ధాన్యకటకం’ నుండి పరిపాలించారు. అది కృష్ణానదీ తీరంలో కలదు.

శాతవాహన కాలంలో ఉన్న ఓడ నాణేలు ప్రసిద్ది చెందినవి. అవి సముద్ర వ్యాపారంలో ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని మరియు నౌకాదళ శక్తిని తెలియజేస్తాయి. అంతర్జాతీయ వ్యాపారంపై శాతవాహనులు మంచి పట్టును కలిగి ఉన్నారు. రోమ్ దేశాలతో వీరికి మంచి వ్యాపార సంబంధాలు కలవు.

శాతవాహనులు హిందూమతాన్ని అనుసరించారు. బౌద్ధమతాన్ని కూడా ప్రోత్సహించారు. నాగార్జునకొండ మరియు అమరావతి శాతవాహన కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు. ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించి ఉన్నాడని చెప్పబడుతున్నది.

ప్రశ్న 5.
చాళుక్యులు వాస్తు శిల్పకళకు చేసిన సేవను వివరింపుము. పట్టడగల్ లోని దేవాలయం గురించి వర్ణింపుము.
జవాబు:
చాళుక్యులు వాస్తుశిల్పకళకు ఎంతో సేవ చేశారు. వారి కాలంలో ‘వెశారా’. అను నూతన వాస్తుశిల్ప కళారీతి అభివృద్ధి చెందింది. దక్షిణ భారతదేశములోని ‘ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలోని ‘నగారా’ వాస్తుశిల్ప కళాకృతుల మేలి కలయికే ‘వెశారా’. పల్లవ రాజైన మొదటి మహేంద్రవర్మ రెండవ పులకేశిని యుద్ధంలో ఓడించి కావేరి నదిని దాటి వెళ్ళాడు. చోళ, చేత, పాండ్య రాజులతో చాళుక్యులు మంచి స్నేహసంబంధాలు నెలకొల్పారు.
AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 2
కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం పట్టడగల్. ఈ గ్రామంలో పది దేవాలయాలు కలవు. అందులో నాలుగు దేవాలయాలు నగర నిర్మాణ శైలిలో ఉండగా మరొక నాలుగు దేవాలయాలు ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నవి. విరూపాక్ష దేవాలయం మరియు సంగమేశ్వర ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉండగా, పాపనాథ ఆలయం నగారా నిర్మాణ శైలిలో ఉన్నది.

ప్రశ్న 6.
చాళుక్యులు గురించి నీకు ఏమి తెలియును?
జవాబు:
చాళుక్యులు :
దక్షిణ మరియు మధ్య’ భారతదేశంలో ఎక్కువ భాగాలను క్రీ.పూ. 600-1200 మధ్య చాళుక్యరాజులు పరిపాలించారు. తొలి చాళుక్యరాజులలో ఒకరైన రెండవ పులకేశి కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. రెండవ పులకేశి మరొక ప్రసిద్ది చెందిన చాళుక్యరాజు. నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్ష చక్రవర్తి ఇతనిని ఓడించాడు. ఈ విజయాన్ని కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలోని ఐహోలు శిలాశాసనములో పేర్కొనబడినది. రెండవ పులకేశి కొలువులో ఉన్న రవికీర్తి ఐహోలు శాసనాన్ని తయారు చేశాడు.

ప్రశ్న 7.
క్రింది పటమును పరిశీలించి ప్రశ్నలకు సమాధానములు ఇవ్వండి.
AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు
అ. అజంతా, ఎల్లోరా గుహలు ఏ రెండు నదుల మధ్య ఉన్నాయి?
జవాబు:
తపతి, గోదావరి.

ఆ. గుప్తుల రాజధాని నగరం ఏది?
జవాబు:
పాటలీపుత్ర

ఇ. గుప్తుల కాలంలోని ముఖ్యమైన రేవు పట్టణం ఏది?
జవాబు:
జరుకచ్చా.

ఈ. అమరావతి ఏ నది ఒడ్డున ఉన్నది?
జవాబు:
కృష్ణానది.

AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 8.
ఈ క్రింది వాటిని గుర్తించండి.
1. పాటలీపుత్ర
2. కళింగ
3. ఉజ్జయిని
4. సువర్ణగిరి
5. తక్షశిల
AP 6th Class Social Important Questions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 3

AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

These AP 6th Class Social Important Questions 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం will help students prepare well for the exams.

AP Board 6th Class Social 7th Lesson Important Questions and Answers సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 1.
ఉపనిషత్తుల గురించి వివరించుము.
జవాబు:
వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం. ఉపనిషత్తులనగా అర్థం ‘వచ్చి చేరువగా కూర్చోవడం, ఇవి ఉపాధ్యాయులు – మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు. “మనం ఎక్కడి నుంచి వచ్చాము? లేదా మరణం తరువాత మనం ఎక్కడకు వెళతాము?” వంటి ప్రశ్నలకు ఈ పుస్తకాలు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాయి.

ప్రశ్న 2.
మహాజన పదాలలో నగర ప్రజల జీవన విధానంను వివరించండి.
జవాబు:
మహాజన పదాలలో నగర జీవనం :
మహాజనపదాలలోని పట్టణాలలో ఇప్పటివలే తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పని చేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది బానిస సేవకులు, మిగతావారు వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి పనివారు. ఈ వృత్తి పనివారు ఏం తయారు చేసేవారు? అన్ని ప్రముఖ నగరాలలో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారు చేసేవారు. చక్కని వస్త్రాలను నేసి మహాజనపదాలలోని ధనవంతులకు అమ్మేవారు. వాళ్ళు బంగారం, వెండి ఆభరణాలను కూడా తయారు చేసేవారు. పురావస్తు తవ్వకాలలో వారు చేసిన ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన పాత్రలు, పరికరాలు బయల్పడ్డాయి.

వారు చెక్కతో బళ్ళను, గృహోపకరణాలను తయారు చేసేవారు. సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు. నీటిని తెచ్చేవారు. చెక్కతోను, ఏనుగు దంతంతోను బొమ్మలు తయారుచేసే అనే రకాల పనివాళ్ళు ఉండేవారు. వీళ్ళు తయారు చేసిన వస్తువులలో కొన్ని మాత్రమే తవ్వకాలలో బయటపడ్డాయి. పుస్తకాల ద్వారా వాళ్ళ గురించి మరింత తెలుసుకోవచ్చు.

వృత్తి పనివారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్థులు కూడా ఉండేవారు. అంతేకాక వివిధ దేశాలలో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకువచ్చి ఆయా జనపదాలలో అమ్మేవారు. వాళ్ళు వ్యాపార నిమిత్తం పరివారంతో పాటూ ఎద్దులు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలలపాటు నదులు, మైదానాలు, కొండలు మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. వాళ్ళకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతులలో డజన్ల కొద్దీ సేవకులతో, బానిసలతో పని చేయించుకుంటూ విలాసవంతమైన జీవనం సాగించేవారు.

AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 3.
‘గణ’ అనగానేమి?
జవాబు:
‘గణ’ అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం. ‘సంఘ’ అంటే ‘శాసన సభ’ . గణ – సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణ రాజ్యం.

ప్రశ్న 4.
రాజ్యం అంటే ఏమిటి?
జవాబు:
“రాజ్యం” అంటే రాజు లేదా రాణి పాలించే భూభాగం. ఒక రాజ్యంలో (రాజరికం) ఒక కుటుంబం వంశ పారంపర్యంగా చాలా కాలం పాటు పాలిస్తే అది రాజవంశం అవుతుంది. సాధారణంగా ఈ రాజ్యాలు సనాతన వైదిక సంప్రదాయాలకు కట్టుబడి ఉంటాయి.

ప్రశ్న 5.
‘వజ్ర’ గణకు ప్రాధాన్యత నిస్తూ, గణ రాజ్యంలోని పాలనా విధానము, పతనము గురించి వివరించుము.
జవాబు:
మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక్, ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాలలో వేలమంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను ‘రాజు’ అని పిలుచుకునేవారు. వాళ్ళు సంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాల తరువాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. ప్రఖ్యాత బోధకులయిన వీరిని అన్ని మహాజనపదాలూ గౌరవించేవి. ఈ గణ రాజ్యాలను జయించటానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. చివరకు గుప్త రాజులు గణ రాజ్యాలను జయించారు.
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 1

ప్రశ్న 6.
గాంధార శిల్పకళ గురించి నీకేమి తెలియును?
జవాబు:
గాంధార శిల్పకళ :
గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది. ఇది గ్రీకు కళతో ప్రభావితమైనది.
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 2
ఈ శిల్పం యొక్క ప్రత్యేక లక్షణాలు వాస్తవికత, సరైన కొలతలతో, సున్నితమైన పనితనం. చాలా గౌతమ బుద్దుని చిత్రాలు ఈ శైలిలో చెక్కబడినవి.

ప్రశ్న 7.
ఈ చిత్రం సుమారు 2000 సంవత్సరాల కాలంనాటి సాంచి స్థూపానికి చెందినది. ఈ చిత్రంలో రాజును ఎలా గుర్తిస్తావు?
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం
జవాబు:
రాజు పట్టణ కోట నుండి గుర్రాల రథం ద్వారా వస్తున్నాడు. రథసారధి చాలా సాదాసీదాగా ఉన్నాడు. ప్రక్కన ఉన్న వ్యక్తి ప్రత్యేక అలంకరణలో ఉండడం మూలంగా ఆయనను రాజుగా గుర్తిస్తాను.

ప్రశ్న 8.
ప్రక్క పటాన్ని గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 3
1. అస్మక ఏ నది ఒడ్డున కలదు?
జవాబు:
అస్మక గోదావరి నది ఒడ్డున ఉన్నది.

2. అవంతికి ఉత్తరాన ఉన్న జనపదం ఏమి?
జవాబు:
అవంతికి ఉత్తరాన ఉన్న జనపదం ‘మత్స్య’.

3. కోసల, వజ్జిలకు మధ్యలో ఉన్న జనపదం ఏది?
జవాబు:
కోసల, వజ్జికి మధ్యలో ఉన్న జనపదం మలయ లేదా మల్ల జనపదం.

4. ఈ జనపదాలు భారతదేశానికి ఏ భాగాన ఎక్కువగా ఉన్నాయి?
జవాబు:
ఈ జనపదాలు భారతదేశానికి ఉత్తర భాగాన ఎక్కువగా ఉన్నాయి.

5. దక్షిణ భారతదేశంలో మహాజనపదం ఏమి?
జవాబు:
దక్షిణ భారతదేశంలో మహాజనపదం ‘అస్మక’.

ప్రశ్న 9.
ప్రక్క పటాన్ని గమనించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 6th Class Social Important Questions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 4

1. ‘కాంభోజ’ కు దక్షిణాన ఉన్న మహాజనపదం ఏది?
జవాబు:
గాంధారా

2. ‘నేపాల్’ సరిహద్దులో ఉన్నటువంటి మహాజనపదాలు ఏవి?
జవాబు:
కోసల, మలయ, వట్టి

3. ఈ మహాజనపదాల పేర్లతో ‘చేప’ అని అర్ధం వచ్చేది ఏది?
జవాబు:
మత్స్య

AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు

These AP 6th Class Social Important Questions 6th Lesson తొలి నాగరికతలు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 6th Lesson Important Questions and Answers తొలి నాగరికతలు

ప్రశ్న 1.
సింధూలోయ నాగరికత ఏ ప్రాంతాల మధ్య, ఎప్పుడు వికసించింది?
జవాబు:
సింధూనది మరియు ఘగ్గర్ – హక్రా నదీ ప్రాంతంలో సింధూలోయ నాగరికత వికసించింది. ఈ నదులు ప్రవహించిన గుర్తులను ఉపగృహ దృశ్యాలు మరియు ఇతర ఆధారాల ద్వారా కనుగొనడం జరిగింది. పంజాబ్ హరియానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని సుమారు 1500 ప్రదేశాలలో బయటపడినది. అంతేగాక ఆఘనిస్థాన్, పంజాబ్, సింధూ బెలూచిస్తాన్ (పాకిస్తాన్) ప్రాంతాల్లో కూడా ఈ నాగరికత బయటపడింది. హరప్పా నాగరికత క్రీ.పూ. 2500 – 1700 సంవత్సరాల మధ్య వికసించింది.

ప్రశ్న 2.
సింధూ నాగరికత నాటి పట్టణ ప్రణాళిక సౌకర్యాలను గురించి వివరిస్తూ మహాస్నానవాటిక గూర్చి ప్రాధాన్యత ఇవ్వండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు 1
హరప్పా నాగరికత కాలం నాటి నగరాలన్నియు ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి. నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి. పట్టణాలలో విశాలమైన రహదారులు కలవు మరియు ప్రజలందరికీ మంచినీటి కొరకు బావులు ఉండేవి. మొహంజోదారోలో గొప్ప స్నానవాటిక (ప్రజలు అందరూ స్నానాలు చేయడానికి విశాలమైన కొలను) కలదు, దీనికి నాలుగు వైపుల గదులు కలవు. పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజులలో ప్రజలందరూ ఒక చోటకు చేరినప్పుడు ఈ స్నానవాటికను ఉపయోగిస్తారు. హరప్పా నగరంలో ఆరు పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు కలవు. లోథాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు.

ప్రశ్న 3.
సింధూ ప్రజల సాంఘిక జీవనం గురించి వివరించండి.
జవాబు:
సాంఘిక జీవనం :
స్త్రీలు, పురుషులు కూడా అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారు. స్త్రీలు కంఠాభరణాలు, మోచేతి ఆభరణాలు, చేతి వేళ్ళకు రింగులు, గాజులు, చెవి రింగులు, ముక్కు పుడకలు ధరించేవారు. స్త్రీలకు అలంకరణ సామగ్రి గురించి, పరిమళద్రవ్యాల గురించి తెలుసు.

వినోదాలు :
నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం సింధూ ప్రజల వినోదాలు. ఎద్దుల పోటీలు వీరి యొక్క ప్రధాన వినోదం. పిల్లలు బొమ్మలు మరియు ఎద్దుల బండ్ల బొమ్మలతో ఆడుకొనేవారు.

నైపుణ్యాలు :
చిన్న చిన్న అమ్మతల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారుచేసేవారు. నాట్యకత్తె విగ్రహం మరియు బాగా గడ్డం (పూజారి) పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహం వంటివి ఈ కాలంలో కనిపించేవి.

AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 4.
ఆర్యుల జన్మస్థానము గురించి పండితులు వెలిబుచ్చిన అభిప్రాయాలను తెల్పుము.
జవాబు:
ఆర్యుల పుట్టు పూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు కలవు. ఆర్యులు మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆర్ట్స్ పర్వతాలలోని తూర్పు భాగం నుంచి వచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహాలకు చెందినవారేనని ఒక అభిప్రాయమూ కలదు. కొంతమంది చరిత్రకారులలో ఆర్యుల స్వస్థలం భారతదేశమే అనే అభిప్రాయము కలదు.

ప్రశ్న 5.
వైదిక వాజ్మయము (వేద సాహిత్యము) గురించి నీకేమి తెలియును?
జవాబు:
1. ఋగ్వేదము :
ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం

2. యజుర్వేదము :
యజ్ఞయాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలియ జేయును.

3. సామవేదము :
ఇది పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం, భారతీయ సంగీతము యొక్క మూలాలు ఇందులో కలవు.

4. అధర్వణ వేదము :
ఇది శ్లోకాలు మరియు పాటల సంకలనం. వేదాలే కాక బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు కలవు.

5. బ్రాహ్మణాలు : వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపములో కలదు.

6. అరణ్యకాలు :
విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయును.

7. ఉపనిషత్తులు :
ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు.

ప్రశ్న 6.
వేదకాలం నాటి మత విశ్వాసాల గురించి వివరించండి.
జవాబు:
తొలివేదకాలం :
ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. దేవుడిని అనేక విధాలుగా ఆరాధించి చేరుకోవచ్చని నమ్మేవారు. ప్రపంచమంతా ఒకే చైతన్యం (ఆత్మ) వ్యాపించి ఉంటుందని నమ్మేవారు. ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మించాడని వీరి నమ్మకం. వీరు యజ్ఞాలు చేసేవారు.

మలి వేదకాలం :
మతపరమైన కార్యక్రమాలు సంక్లిష్టమయ్యాయి. యజ్ఞాలు, యాగాలు తరచుగా చేసేవారు. విష్ణువు, శివుడు, స్కంధుడు మొదలైన దేవతలను పూజించేవారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి మొ||న ఇతర దేవతలు ప్రాముఖ్యత పొందారు.

ప్రశ్న 7.
తొలి, మలి వేదకాలం నాటి రాజకీయ జీవనం గూర్చి తెలుపుము.
జవాబు:
తొలి వేదకాలం నాటి రాజకీయ జీవనం : ఆర్యులు తెగలుగా నివసించేవారు. తెగల నాయకుడిని ‘రాజన్’ అంటారు. రాజు నియంతలాగా పరిపాలించేవాడు కాదు. రాజుకు పరిపాలనా విషయములో సలహాలు ఇచ్చేందుకు ‘సభ’ మరియు ‘సమితి’ అను రెండు సభలు ఉండేవి. రాజు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాడు.

మలి వేదకాలం నాటి రాజకీయ జీవనం :
మలి వేద కాలంలో రాజు మరింత శక్తిమంతుడైనాడు. ‘సభ’ మరియు సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. రాజరికం వారసత్వంగా మారింది. రాజులు తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేథ, రాజసూయ యాగాలు చేసేవారు.

AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు

ప్రశ్న 8.
ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు
ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం
AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు 2
పైన ఇవ్వబడిన సమాచారం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సరియైన సమాధానములు రాయండి.
1) వేదాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
వేదాలు నాలుగు, అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం

2) ఇతిహాసాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
ఇతిహాసాలు రెండు అవి రామాయణం, మహాభారతం.

3) పై సమాచారం ఆధారంగా ఏమి తెలుసుకోవచ్చు?
జవాబు:
ఆర్యుల గురించి తెలుసుకోవచ్చు.

4) ఆది కావ్యం అని దేనినంటారు?
జవాబు:
రామాయణం.

5) మహాభారతాన్ని ఎవరు రచించారు?
జవాబు:
వేద వ్యాసుడు.

AP 6th Class Social Important Questions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

These AP 6th Class Social Important Questions 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం will help students prepare well for the exams.

AP Board 6th Class Social 5th Lesson Important Questions and Answers సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 1.
వేట, ఆహార సేకరణ సులభమైన విషయంగా నీవు భావిస్తున్నావా? అవును/కాదు. మీ జవాబును సమర్థించుము.
జవాబు:
ఈ వేట, ఆహార సేకరణ అంత సులభమైన విషయం కాదు. చెట్లు లేదా మొక్కల ద్వారా ఆహార సేకరణ చేయాలంటే వాటి భాగాలలో దేన్ని తింటారో తెలిసి ఉండాలి. పండ్లు ఏ కాలంలో పక్వానికి వస్తాయో తెలియాలి. వేటాడటానికి, ఆ ప్రాంతంలో సంచరించే జంతువులు, పక్షుల అలవాట్లు, జీవన విధానం వేటగాళ్ళకు తెలిసి ఉండాలి. వేటాడే సమయంలో అప్రమత్తత చురుకుదనం, ఏకాగ్రత ఉండాలి. ఈ విషయాలను ఆది మానవులు తమ పూర్వీకుల నుండి పాటల రూపంలో, కథల రూపంలో తెలుసుకునేవారు. వాటిని తమ సంతతికి తెలియ
జేసేవారు, ఆది మానవులు జంతు చర్మాలను, ఆకులను దుస్తులుగా వాడేవారు.

ప్రశ్న 2.
ఆది మానవులు సంచార జీవనం గడపటానికి కారణమేమిటి?
జవాబు:
ఆది మానవులు సంచార జీవనం గడిపేవారని మనం తెలుసుకున్నాం. ఒక ప్రాంతంలో మొక్కల ద్వారా, జంతువుల ద్వారా లభించే ఆహారం పూర్తిగా అయిపోయేంత వరకు వారు అక్కడే ఉండి తర్వాత ఆహారం కొరకు మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. సాధారణంగా వివిధ కారణాల వల్ల జంతువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళుతుంటాయి. ఆహార అన్వేషణలో భాగంగా ఆది మానవులు వాటిని వేటాడుతూ వెళ్లేవారు. కొన్ని ప్రత్యేక కాలములోనే చెట్లు పండ్లనిస్తాయి. తమ మనుగడ కోసం, ఆహార సేకరణలో భాగంగా ఆది మానవులు పండ్లు దొరికే ప్రాంతానికి వెళ్లేవారు. మానవులు, జంతువులు, మొక్కలు జీవించడానికి నీరు అవసరం. వేసవి కాలంలో నీటి వనరులయిన సరస్సులు, కుంటలు, నదులు, ఎండిపోతాయి. కావున నీరు లభించే ప్రాంతానికి ఆది మానవులు వలస వెళ్లేవారు.

AP 6th Class Social Important Questions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 3.
అది మానవులు నిప్పును దేనికి ఉపయోగించారు?
జవాబు:
ఆది మానవులు నిప్పును కనుగొన్నారు. నిప్పుతో ఆహారాన్ని వండుకొని తినే విధానానికి నాంది పలికింది. క్రూర మృగాలను తరిమివేయడానికి, తాము నివసించే గుహలలో వేడిని, వెలుగును నింపడానికి, చెక్కను గట్టిపరచి ఉపయోగించడానికి నిప్పు వారికి ఉపయోగపడింది. ఈ విధంగా నిప్పు ఆది మానవులకు అనేక విధాలుగా – ఉపయోగపడింది. కావున వారు నిప్పును పవిత్రంగా భావించారు.

ప్రశ్న 4.
ఆది మానవుల గురించి మనం ఎలా తెలుసుకోగలం?
జవాబు:
పురావస్తు తవ్వకాలలో లభించిన (దొరికిన) పనిముట్లు ద్వారా మనం ఆది మానవుల గురించి తెలుసుకోవచ్చు. వారు రాళ్లతోను, కర్రలతోనూ, ఎముకలతోనూ తయారు చేసిన పనిముట్లను విస్తృతంగా ఉపయోగించారు. ఈ పరికరాలను వారు జంతువుల చర్మం తీయడానికి, చర్మం శుభ్రం చేయడానికి ఉపయోగించారు. రాతి పనిముట్లను జంతువుల నివాసం ఎముకలు కోయడానికి వాడారు. భూమిలో నుంచి ఆహారంగా ఉపయోగించే దుంపలను, వేర్లను తవ్వి తీయడానికి ఈ పరికరాలను ఉపయోగించారు. జంతువుల వేటకు విల్లు, అంబులను (ధనుస్సు, బాణాలను) తయారు చేసుకొన్నారు. ఈ పరికరాలతో వారి వేట సులువుగా సాగేది.

ప్రశ్న 5.
పురావస్తు శాస్త్రవేత్తలు అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని గుహల ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలను అధ్యయనం చేసేవారిని ‘పురావస్తు శాస్త్రవేత్తలు’ అంటారు. పురావస్తు శాస్త్రజ్ఞులు కర్నూలు జిల్లా గుహలలో ఆది మానవులకు చెందిన అనేక రాతి పనిముట్లను కనుగొన్నారు. ఈ జిల్లాలో బేతంచర్ల, బనగానపల్లె ప్రాంతాలలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి, రాతి పనిముట్లను దాచుకోవడానికి ఈ గుహలను ఆదిమానవులు కొన్నివేల సంవత్సరాలు ఉపయోగించారు.

జంతువుల ఎముకలు, రాతి పనిముట్లు ముఖ్యంగా సూక్ష్మరాతి పరికరాలు, ఎముకలతో చేసిన పనిముట్లని, ఈ గుహలలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎముకలతో చేసిన’ పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు.

ప్రశ్న 6.
ఆది మానవుల చిత్రకళ గురించి నీకు ఏమి తెలుసు?
జవాబు:
ఆది మానవులు గుహలలోనూ, రాతి స్థావరాలలోనూ నివసించేవారు. గుహల గోడలపై, రాతిస్థావరాలపై ఆది మానవులు జంతువులను, వారు వేటాడే సంఘటనలనూ చిత్రించారు. వారు కొన్ని రకాల రంగు రాళ్లను పిండి చేసి, జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు.

ప్రశ్న 7.
ఆది మానవుల కాలంలో ఏది వ్యవసాయానికి నాంది పలికింది?
జవాబు:
క్రమంగా పచ్చదనం విస్తరించడంతో ఏ ప్రాంతాలలో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో, విత్తనా నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో మానవులు, పరిశీలన చేయడం ప్రారంభించారు. తమకు కావలసిన గింజలను ఏరుకొని, వాటిని విత్తి, ఆహారపు మొక్కలుగా పండించడం క్రమక్రమంగా నేర్చుకున్నారు. ఇది వ్యవసాయానికి నాంది పలికింది. మానవులు వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు, సెనగ, మునగ పంటలను పండించారు.

AP 6th Class Social Important Questions Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం

ప్రశ్న 8.
ఆది మానవులు సంచార జీవనం నుండి స్థిర జీవనంను ఎందుకు ఏర్పరచుకున్నారు?
జవాబు:
ఆది మానవులు వ్యవసాయం చేసే సమయంలో కొన్ని విషయాలు గమనించారు. విత్తనాల నుండి మొక్కలు రావడం, వాటి నుండి పంట చేతికి రావడానికి కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు పడుతుందని గమనించారు. పంటలకు నీరు పెట్టడానికి, జంతువులు, పక్షుల నుండి వాటిని : కాపాడటానికి పంట పండే ప్రదేశాలలో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు.

ప్రశ్న 9.
వ్యవసాయ, పశుపోషకులు ఉపయోగించిన పనిముట్ల గురించి వివరంగా తెల్పండి.
జవాబు:
ఆనాటి వ్యవసాయదారులకు అడవులను చదును చేయడానికి పనిముట్లు అవసరమయ్యాయి. వీటిని నవీన రాతి పనిముట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. ఆనాటి వ్యవసాయ దారులు అనువైన రాతిని మరొక రాతిపై సాన పెట్టడం ద్వారా గొడ్డళ్లు లాంటి పరికరాలను తయారు చేసుకొన్నారు. ఇలా సాన పెట్టిన గొడ్డళ్ళకు కొయ్య పెట్టి బిగించేవారు. వీటితో చెట్లను నరికేవారు. ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు. రుబ్బురోలు, రోకలితో ధాన్యంను మరియు ఇతర మొక్కల ఉత్పత్తులు దంచేవారు.

AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

These AP 6th Class Social Important Questions 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 4th Lesson Important Questions and Answers ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

ప్రశ్న 1.
పర్వతాలు అనగానేమి? వీని గురించి నీకేమి తెలుసు?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు
భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు పర్వతాలు పర్వతాలు కింది భాగంలో విశాలంగానూ, పై భాగంలో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయి. పరిసరాల కంటే ఇవి బాగా ఎత్తులో, కొన్నిసార్లు మబ్బుల కంటే ఎత్తుగా ఉంటాయి. పర్వతాలపై ఎక్కువ ఎత్తుకి వెళ్లేకొద్దీ శీతోష్ణస్థితి చల్లగా ఉంటుంది. భారతదేశం హిమాలయాల వంటి పెక్కు ఉన్నత పర్వత శ్రేణులను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్తయిన భూస్వరూపాలలో ఎక్కువ – భాగం కొండలు.

ప్రశ్న 2.
పీఠభూములు అంటే ఏవి? ఇక్కడ శీతోష్ణస్థితి పరిస్థితి ఎలా ఉంటుంది?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు
పీఠభూములు అనగా ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు. ఇవి పరిసరాల కంటే ఎత్తయిన సమ ఉపరితలం గల బల్లపరుపు భూములు. పీఠభూములు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైపుల నిటారుగా ఉండి సున్నితమైన వాలు కలిగి ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న కొన్ని పీఠభూములలో శీతోష్ణస్థితి కఠినంగా ఉండి నివాస యోగ్యమైన పరిస్థితులు లేవు. ‘తక్కువ ఎత్తులో ఉండే మిగిలిన పీఠభూములలో చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

ప్రశ్న 3.
పీఠభూములు ఆర్థికంగా ఏ విధంగా లాభదాయకమైనవని చెప్పవచ్చు?
జవాబు:
సాధారణంగా పీఠభూములు ఖనిజసంపదను కలిగి ఉంటాయి. అందువలన ఎక్కువ భాగం గనులు పీఠభూములలోనే ఉంటాయి. సున్నపురాయి, మాంగనీస్, రాతినార, ఇనుపఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్ సిలికా మొదలగు ఖనిజాలు పీఠభూమి ప్రాంతాలలో లభిస్తాయి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. ఈ లావా పీఠభూములు పత్తి పండించడానికి అనుకూలమైన సారవంతమైన నల్లరేగడి నేలలకి ప్రసిద్ధి. పీఠభూములు అనేక సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా నిలిచి ఉన్నాయి.

ప్రశ్న 4.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులను తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ గురించి మీకు తెలిసిన విశేషాలు రాయండి.
జవాబు:
భారతదేశంలో గల 28 రాష్ట్రాలలో ఇది ఆగ్నేయ దిక్కులో గల ఒక రాష్ట్రం. భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. ఉత్తరాన చత్తీస్ఫడ్, ఒడిశా రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన తెలంగాణా, నైఋతిలో కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం దీనికి సరిహద్దులు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది భారతదేశంలో విస్తీర్ణత పరంగ ఏడవ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా పదవ పెద్ద రాష్ట్రం. కోస్తా ఆంధ్ర, రాయలసీమ అనే రెండు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉన్నది.

1. కోస్తా ఆంధ్ర :
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్న 9 జిల్లాలను కోస్తా ఆంధ్రగా పిలుస్తారు. ఈ ప్రాంతం కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైన నేలలను, అధిక జన సాంద్రతను కలిగి ఉన్నది.

2. రాయలసీమ :
ఈ ప్రాంతం రాతిపొరలు, పొడి నేలలతో కూడిన 4 జిల్లాల సమాహారం. ఇక్కడి అల్ప మరియు అనిశ్చిత వర్షపాతం వ్యవసాయానికి అంతగా అనుకూలం కాదు.

ప్రశ్న 5.
పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంకు సంబంధించిన ఏ మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయబడ్డాయి?
జవాబు:
పోలవరం ప్రాజెక్టు నిర్మించడం వలన తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయబడినవి. వరరామ చంద్రపురం, కూనవరం, చింతూరు, భద్రాచలం మండలాలు తూర్పు గోదావరి జిల్లాలోనూ, బూర్గుంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ విలీనం చేయబడినవి.

ప్రశ్న 6.
తూర్పు కనుమలను వివిధ జిల్లాల్లో స్థానికంగా ఏ పేర్లతో వ్యవహరిస్తారో రాయండి.
జవాబు:

తూర్పు కనుమలను వివిధ జిల్లాల్లో స్థానికంగా క్రింది పేర్లతో వ్యవహరిస్తారు.

కొండల పేర్లుజిల్లా పేరు
1. యారాడ మరియు అనంతగిరి కొండలువిశాఖపట్నం
2. బైసన్ కొండలు మరియు పాపి కొండలుతూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు
3. మొగల్ రాజపురం, కొండపల్లి కొండలుకృష్ణ
4. బేరంకొండ, నాగార్జున కొండ, కోటప్పకొండగుంటూరు
5. వేలికొండలుఎస్.పి.ఎస్. ఆర్. నెల్లూరు
6. నల్లమల్ల, ఎర్రమలకర్నూలు
7. వేలికొండలు, పాలకొండలువై.ఎస్.ఆర్. కడప
9. శేషాచలం, హార్సిలీ కొండలుచిత్తూరు
10. పెనుకొండ, మడకశిరకొండలుఅనంతపురం

AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 1

ప్రశ్న 7.
“ఆంధ్రాకాశ్మీర్” అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఇది ఎక్కడ ఉంది?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 2
లమ్మసింగి/లంబసింగి, విశాఖపట్నం మన్య ప్రాంతంలోని చింతపల్లి మండలంలో మారుమూల ప్రాంతం. ఇక్కడ చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనిని ‘ఆంధ్రాకాశ్మీర్’గా పిలుస్తారు.

ప్రశ్న 8.
పోడు వ్యవసాయం గురించి రాయండి.
జవాబు:
కొండ ప్రాంతాలలో ‘పోడు’ అనేది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి. దీనినే ‘స్థల మార్పిడి’ వ్యవసాయం లేదా ‘ఝూమ్’ వ్యవసాయం అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిలో, ప్రజలు అడవిలో కొంత ప్రాంతాన్ని చదును చేసి కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండిస్తారు. తరువాత భూసారం తగ్గడం వలన వేరే స్థలానికి మారతారు. జొన్న, మొక్కజొన్న మొదలగు పంటలను ఈ పద్ధతిలో పండిస్తారు.

ప్రశ్న 9.
గిరిజనులు అడవులపై ఏ విధంగా ఆధారపడతారు?
జవాబు:
పోడు వ్యవసాయం, పెరటి తోటలనుండి వచ్చే దిగుబడి వీరి కుటుంబాలు సంవత్సరం పొడవునా జీవించడానికి సరిపోదు. కాబట్టి వివిధ రకాల అటవీ ఉత్పత్తుల సేకరణ, వేట వారి జీవినంలో కీలక భూమికను పోషిస్తాయి. వివిధ రకాల పళ్లు దుంపలు, గింజలు ఆకుకూరలు సేకరించడానికి, చిన్న జంతువులను వేటాడడానికి అడవిపైనే ఆధారపడతారు.

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏదైనా ఒక గిరిజన సమూహం గూర్చి వివరించండి.
జవాబు:
వ్యవసాయం పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న చెంచులు ఒక గిరిజన సమూహం. భారత ప్రభుత్వం వీరిని ఒక నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది. వారు ప్రాచీన కాలం నుండి నల్లమల అటవీ ప్రాంత నివాసులు. సాంప్రాదాయకంగా వారు వేటగాళ్లు. వీరు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వ్యాపించారు.
AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 3
ప్రభుత్వం వీరిని స్థిర వ్యవసాయంలోకి తీసుకురావడానికి వారి వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా చాలా ప్రయత్నాలు చేస్తోంది. వారిలో విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పాఠశాలలను నివాస సౌకర్యాలతో నడుపుతోంది. ప్రభుత్వం 1989లో శ్రీశైలంలో ఇంటెగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వారి మౌఖిక సాహిత్యం మానవ భావాలు మరియు ఆలోచనల యొక్క పురాతన రికార్డులలో ఒకటిగా పరిగణించబడుతుంది. (The chenchus by – Haimendorf పుస్తకం ఆధారంగా)

ప్రశ్న 11.
రాయలసీమ ప్రాంతం ఎందుకు కరవు పీడిత ప్రాంతంగా ఉన్నది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని పీఠభూమి ప్రాంతం దక్కన్ పీఠభూమిలోని తూర్పుభాగానికి చెందినది కాగా రాయలసీమ ఈ ప్రాంతంలో కలదు. ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఇక్కడ అల్ప, అనిశ్చిత వర్షపాతంతో బాటు చాలాసార్లు అసలు వర్షమే కురవకపోవడం సర్వ సాధారణం. అందువలనే ఇది కరవుపీడిత ప్రాంతంగా ఉన్నది.

ప్రశ్న 12.
రాయలసీమ (పీఠభూమి) ప్రాంతంలోని నేలల గురించి వివరించండి.
జవాబు:
ఇక్కడి నేలలు నల్లరేగడి, లేటరైట్, ఎర్రనేలలు మరియు ఇసుకనేలల రకానికి చెందినవి. కడప, కర్నూలు జిల్లాల్లో నల్లరేగడి నేలలు కలవు. రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్న ఎర్రమట్టి నేలలకు వీటిని నిల్వ ఉంచుకునే , సామర్థ్యం లేకపోవడంతో భూమిని సాగు చేయకుండానే వదిలివేస్తారు. పీఠభూమి ప్రాంతాలలో అక్కడక్కడ ఉండే చౌడు నేలల్లో ఎక్కువగా సున్నం, క్షారలవణాలు ఉంటాయి. కాబట్టి ఆ నేలలు పంటలు పండించడానికి అనుకూలంగా ఉండవు.

AP 6th Class Social Important Questions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

ప్రశ్న 13.
రాయలసీమ (పీఠభూమి) ప్రాంతంలోని నీటి వనరుల గురించి తెలియజేయండి.
జవాబు:
పీఠభూమి ప్రాంతాలలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల రైతులు వర్షపునీటిని నిల్వ చేసుకుంటారు. భూగర్భజలాలను వాడుకుంటారు. పూర్వకాలంలో వర్షపునీటిని నిల్వ ఉంచుకోవడానికి చెరువులు తవ్వేవారు. పీఠభూమి ప్రాంతాలలో సహజంగా ఉండే అగాధాలు, చిన్న కొండలవలన చెరువులను నిర్మించడం సులభం. చిన్న చిన్న చెరువులు నీటిని నిల్వచేయడానికి ఉపయోగపడితే, నూతులు భూగర్భ జలాలని వెలికి తీయడానికి ఉపయోగపడతాయి. ఇటీవల కాలంలో రైతులు ఎక్కువగా నూతులకు బదులు గొట్టపు బావులను వాడుతున్నారు. అయితే పీఠభూమి ప్రాంతంలో గొట్టపుబావులను తవ్వడం చాలా ఖర్చుతో కూడిన పని. కొద్దిమంది రైతులు మాత్రమే ఎక్కువ ధనాన్ని దీనికొరకు వెచ్చించగలుగుతున్నారు. ఎక్కువ భూములున్న 5-10 శాతం రైతులకు మాత్రమే గొట్టపు బావులున్నాయి. మిగిలిన వారు వర్షం పైనే ఆధారపడుతున్నారు. పెరుగుతున్న గొట్టపుబావుల సంఖ్య వలన భూగర్భ జల మట్టాలు తగ్గిపోతున్నాయి.

ప్రశ్న 14.
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు తీర మైదాన స్వరూపం గురించి వివరించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు తీర మైదానం కృష్ణా గోదావరి డెల్టాలో తప్ప శ్రీకాకుళంలోని వంశధార, నెల్లూరులోని పెన్నా డెల్టా ప్రాంతాలలో ఇరుకుగా ఉంటుంది. ఈ మైదానాలలో ప్రసిద్ధి పొందిన (కొల్లేరు మంచినీటి సరస్సు), పులికాట్ (ఉప్పునీటి సరస్సు) సరస్సులు కలవు. కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ, పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలోనూ కలదు.

ఆంధ్రప్రదేశ్ లోని ఈ విశాల తీరమైదానం రైతులకు, వ్యవసాయానికి గొప్ప కానుక వంటిది. ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి మాత్రమే కాక మైదాన ప్రాంతంలోని చాలాభాగంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండిస్తారు. అందువలనే ఈ ప్రాంతం అధిక జనాభాకీ జనసాంద్రతకీ కూడా పెట్టింది పేరు.

ప్రశ్న 15.
అత్యల్ప వర్షపాతం మరియు భూగర్భజలం తగ్గుదల వలన ఎటువంటి ముప్పు పొంచి ఉందో తెల్పండి.
జవాబు:
అత్యల్ప వర్షపాతం మరియు భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉదా : రాయదుర్గం, కళ్యాణదుర్గం మొదలగు ప్రాంతాలు. ఈ ప్రాంతాలలోని నేలలు క్రమంగా రాతిమయంగా మారిపోవడమే కాక ఎడారీకరణ ముప్పు కూడా పొంచి ఉంది.

ప్రశ్న 16.
క్రింది వానిని ఉదాహరణలతో నిర్వచించండి.
1) నగదు పంట 2) ఆహార పంట 3) ఆక్వాకల్చర్ (జలసేద్యం) దీనివలన ఏర్పడే సమస్యలు ఏవి?
జవాబు:
1. నగదు పంట :
ఇది రైతుకి ఎక్కువ ఆదాయాన్ని లాభాన్ని ఇచ్చేది. వీటిని వ్యాపార / వాణిజ్య పంటలుగా కూడా వ్యవహరిస్తారు.
ఉదా : వేరుశనగ, పసుపు, చెరకు, పొగాకు మొదలగునవి.

2. ఆహార పంట :
ఆహార పంటలు సామాన్యంగా వినియోగం కొరకు సాగు చేసేవి.
ఉదా : వరి, చిరుధాన్యాలు, కూరగాయలు – వీటిని కూడా వినియోగానికి పోగా మిగిలిన వాటిని అమ్ముతారు.

3. ఆక్వాకల్చర్ (జలసేద్యం) :
ఆహారం కొరకు జలచరాలను పెంచుటను (సాగు చేయుటను) ‘ఆక్వాకల్చర్’ అంటారు. ఉదా : రొయ్యలు, చేపలు, పీతలు మొదలగునవి. ఇటీవలికాలంలో కోస్తా జిల్లాల్లో చాలామంది రైతులు ఆక్వాకల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. వరి పండించే పొలాలను చాలాభాగం చేపల చెరువులుగా మారుస్తున్నారు. ఈ రకమైన మార్పు నీటి కాలుష్యానికి తద్వారా వరి పండించే పొలాలకి నీరు అందించే చెరువులలోని నీరు కలుషితం కావడానికి కారణమవుతోంది.

ప్రశ్న 17.
క్రింద ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ పటం పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానములివ్వండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 7
1) రాయలసీమలో ఎన్ని జిల్లాలు కలవు?
జవాబు:
4

2) కోస్తా ఆంధ్రాలో ఎన్ని జిల్లాలు కలవు?
జవాబు:
9

3) ఆంధ్రప్రదేశ్ కు ఏ దిక్కున ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలదు?
జవాబు:
ఉత్తరం

4) డెల్టా ఏ జిల్లాలో ఉన్నాయి?
జవాబు:
ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు.

5) తూర్పు దిక్కున సరిహద్దుగా ఏమి ఉంది?
జవాబు:
బంగాళాఖాతం.

AP 6th Class Social Important Questions Chapter 3 పటములు

These AP 6th Class Social Important Questions 3rd Lesson పటములు will help students prepare well for the exams.

AP Board 6th Class Social 3rd Lesson Important Questions and Answers పటములు

ప్రశ్న 1.
చిత్తు చిత్రం, మాన చిత్రం (పటం)నకు వ్యత్యాసమేమి?
జవాబు:

చిత్తుచిత్రంపటం
చిత్తు చిత్రం అనేది ముఖ్యంగా స్కేల్ ఉపయోగించ కుండా గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. ఈ చిత్తు చిత్రంలో స్కేల్, దిక్కులు చూపకండానే గీయవచ్చు.పటం అనగా మొత్తం భూమిని గాని లేదా అందులోని ఒక భాగం గురించి గానీ ఒక సమ ఉపరితలంపై స్కేలుకి అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది. దిక్కులు, స్కేలు, చిహ్నాలు మొదలైనవి ఇందులోని ముఖ్యమైన అంశాలు.

ప్రశ్న 2.
గ్లోబు, పటాలను ఏయే సందర్భాలలో ఉపయోగిస్తామో వివరించండి.
జవాబు:
గ్లోబుని ఉపయోగించడంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే గ్లోబు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం – ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు గ్లోబు ఉపయోగం తక్కువ. అటువంటి పరిస్థితులలో మనం పటాలను ఉపయోగిస్తాం.

ప్రశ్న 3.
మీరు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి, ప్రధాన దిక్కులు ఏవో వివరించండి.
జవాబు:
ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడినట్లయితే ఎదురుగా ఉన్నది తూర్పుదిక్కు వెనుక అంటే వీపుభాగం వైపు వున్నది పడమరనీ, ఎడమవైపు ఉన్నది ఉత్తర దిక్కునీ, కుడివైపు ఉన్నది దక్షిణ దిక్కునీ సూచిస్తుంది. ఈ , నాలుగు దిక్కుల్లోనూ ఉత్తర దిక్కుని ప్రధానదిక్కుగా భావిస్తాం. అందువలనే అన్ని పటాలలోనూ కుడిచేతివైపు పైన N అనే అక్షరం, బాణం గుర్తు ఉంటాయి. మనకి ఉత్తరదిక్కు తెలిస్తే, మిగిలిన దిక్కులని సులభంగా కనుక్కోవచ్చును. ప్రధాన దిక్కులు నాలుగు – ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర, వీటిని ప్రధాన దిక్కులు అంటారు.

AP 6th Class Social Important Questions Chapter 3 పటములు

ప్రశ్న 4.
‘స్కేలు’ అనగానేమి? దీనిని ఎందుకు ఉపయోగిస్తాం?
జవాబు:
స్కేల్ పటంలోని మరొక ముఖ్యమైన అంశం. భూమిపై కల వాస్తవ దూరానికీ పటంలో చూపబడిన దూరానికీ కల నిష్పత్తినే ‘స్కేలు’ అని పిలుస్తాం. పటంలో రెండు ప్రాంతాల మధ్య కల దూరాన్ని లెక్కించడానికి స్కేల్ ఉపయోగిస్తాం.

ప్రశ్న 5.
పటాలు ఎన్ని రకాలు? అవి ఏవి? వివరణాత్మకంగా తెల్పండి.
జవాబు:
పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

  1. రాజకీయ పటాలు
  2. భౌతిక పటాలు
  3. విషయ నిర్దేశిత పటాలు.

1. రాజకీయ పటాలు :
గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను చూపేవి రాజకీయ పటాలు.

2. భౌతిక పటాలు :
పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గూర్చి వివరిస్తాయి.

3. విషయ నిర్దేశిత పటాలు :
ఈ పటాలను భూమి వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలుమార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను గురించి వివరించడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 6.
స్కేల్ ఆధారంగా పటాలలో రకాలు ఎన్ని? అవి ఏవి? సోదాహరణంగా వివరించండి.
జవాబు:
స్కేల్ ఆధారంగా పటాలలో రకాలు :
అ. పెద్ద తరహా పటాలు : ఇవి చిన్న ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. వీటిని భూనైసర్గిక పటాలు (topo graphic maps) భూ సరిహద్దులను తెలిపే పటాలు (cadastral maps) గా విభజించవచ్చును. భూసరిహద్దులను తెలిపే పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందినవి కాగా భూనైసర్గిక పటాలు భూ ఉపరితలం యొక్క వివరాలను చూపుతాయి.

ఆ. చిన్న తరహా పటాలు :
ఇవి పెద్ద ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. ప్రపంచం, ఖండాలు లేదా దేశాలు మొదలగునవి. ఇవి రెండు రకాలు – గోడ పటాలు మరియు అట్లాస్. గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. వాటిని తరగతి గదిలో బోధన కొరకు మరియు పరిపాలనా పరంగాను ఉపయోగిస్తారు. అవి రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు వంటి సాధారణ మరియు ముఖ్యమైన అంశాలను చూపుతాయి.

AP 6th Class Social Important Questions Chapter 3 పటములు

ప్రశ్న 7.
జి.పి.ఎస్ మరియు వెబ్ ఆధారిత పటాల వలన ఎటువంటి సమాచారం పొందవచ్చు?
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 3 పటములు 1
జి.పి.ఎస్ అనగా ప్రస్తుతం విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ (Global Positioning System) భూమ్మీద ఉండే వస్తువులను గుర్తించడానికి 10 ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ.

వెబ్ ఆధారిత పటాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాలు గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చును. సాంప్రదాయక పటాలకి అదనంగా ఈ పటాల ద్వారా అనేక ప్రదేశాలను ఉపగ్రహ, విహంగ వీక్షణ చేయవచ్చును.

ప్రశ్న 8.
ఖండాలు అనగానేమి? ఖండాలు ఎన్ని అవి ఏవి? మహాసముద్రాలు అనగానేమి? మహాసముద్రాలు ఎన్ని అవి ఏవి? వీటిని ప్రపంచ పటంలో గుర్తించండి.
జవాబు:
విశాల భూభాగాలను ఖండాలు అని, జలభాగాలను మహాసముద్రాలు అని పిలుస్తాం. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా మరియు ఆస్ట్రేలియా ఖండాలు కాగా పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటిక్ మరియు ఆర్కిటిక్ మహాసముద్రాలు.
AP 6th Class Social Important Questions Chapter 3 పటములు 2

ప్రశ్న 9.
బ్రాడ్ గేజ్ రైల్వే, కచ్చారోడ్లు, పక్కారోడ్లు, చెట్లు, ఇళ్ళు, నదులను, మాన చిత్రంలో ఏ విధమైన చిహ్నాలు/గుర్తులతో చూపిస్తారో వాటిని గీయండి.
జవాబు:
AP 6th Class Social Important Questions Chapter 3 పటములు 3

ప్రశ్న 10.
పై మాన చిత్రాన్ని పరిశీలించి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానము లిమ్ము.
AP 6th Class Social Important Questions Chapter 3 పటములు 4
i) చర్చికి ఏ దిశలో నది ప్రవహిస్తుంది?
జవాబు:
తూర్పు

ii) మసీదు ఏ గ్రామంలో ఉంది?
జవాబు:
బొందపల్లి.

iii) ఏ రెండు గ్రామాల మధ్య పోలీస్ స్టేషన్ కలదు?
జవాబు:
రామాపురం, కృష్ణాపురం

iv) కృష్ణాపురంలోని దేవాలయానికి వెళ్ళటానికి ఎటువంటి రోడ్డు కలదు?
జవాబు:
కచ్చారోడ్డు.

v) పై చిత్రంలో ఎటువంటి రైలుమార్గంను సూచిస్తుంది?
జవాబు:
బ్రాడ్ గేజ్ రైల్వే

vi) రైలు మార్గానికి ఉత్తరాన ఉన్న గ్రామమేది?
జవాబు:
బొందపల్లి

vii) పై పటంలోని పాఠశాలలో మీరు ఉన్నారని అనుకోండి. పాఠశాల నుంచి బయటకు వస్తుంటే ఏ దిశ వైపుకి నడుస్తుంటారు?
జవాబు:
దక్షిణ దిశలో

viii) నది ఒడ్డున ఉన్న ప్రార్ధన మందిరం ఏమిటి?
జవాబు:
(గుడి) దేవాలయం