AP Board 8th Class Telugu లేఖలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions 8th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu లేఖలు

1. విహార యాత్రను వివరిస్తూ తండ్రికి లేఖ :
జవాబు:

ఏలూరు,
x x x x x

పూజ్యులైన నాన్నగారికి నమస్కారములు.

నేను క్షేమంగానే ఉన్నాను. అక్కడ అందరూ క్షేమమని తలుస్తాను. ఇటీవల నేను నా మిత్రులతో కలిసి హైదరాబాదు విహారయాత్రకు వెళ్ళి వచ్చాను. ఆ విశేషాలు ఈ లేఖలో తెలియజేస్తున్నాను.

గడచిన బుధవారం సాయంకాలం ఏలూరులో రైలు ఎక్కి తెల్లవారేసరికి హైదరాబాదు చేరాం. అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని నగరదర్శనానికి బయలుదేరాం.

ఆ నగర శోభను చూస్తుంటే నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఎక్కడ చూసినా ఫ్లెఓవర్ బ్రిడ్జీలు చూడముచ్చటగా ఉన్నాయి. ట్యాంక్ బండ్ పై గల విగ్రహాలు చూపరులను అట్టే ఆకర్షించేలా ఉన్నాయి.

ముఖ్యంగా సాలార్‌జంగ్ మ్యూజియం, నెహ్రూ జంతుప్రదర్శనశాల, చార్మినార్, బిర్లామందిర్, పబ్లిక్ గార్డెన్స్, రామోజీ ఫిల్మ్ సిటీ, గోలకొండ కోట వంటివి యాత్రికులను బాగా ఆకర్షిస్తాయి. రెండు రోజులపాటు అక్కడి దర్శనీయ స్థలాలను చూసి మరల రైలులో సరదాగా పాటలు పాడుకొంటూ జోక్స్ వేసుకొంటూ కాలం తెలియకుండా తిరుగు ప్రయాణం చేశాం. అమ్మగారికి నా నమస్కారాలు.

ఇట్లు,
తమ కుమారుడు,
రాళ్ళబండి సిద్ధార్థ.

చిరునామా :
శ్రీరాళ్ళభండి శ్రీనివాస్ గారు,
కానూరు,
పెనమలూరు మండలం, కృష్ణాజిల్లా.

2. వార్షికోత్సవమును గూర్చి మిత్రునకు లేఖ :
జవాబు:

అమలాపురం,
x x x x x

ప్రియ మిత్రుడు శ్రీరాంకుమార్‌కు,

ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. గడచిన బుధవారం మా పాఠశాల వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా రంగురంగుల తోరణాలతో అలంకరించాం. సాయంత్రం 6 గం||లకు సభ ప్రారంభింపబడింది. ఆ సభకు మా ప్రాంత ఎం.ఎల్.ఏ. గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నివేదిక చదివి వినిపించారు. ముఖ్య అతిథిగారు విద్యార్థులంతా బాగా చదువుకోవాలని చక్కని సందేశం ఇచ్చారు. ఆటల పోటీలలోనూ, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలోనూ గెలుపొందిన వారికి బహుమతులు పంచిపెట్టబడ్డాయి. ఆ తరువాత పిల్లలచే నాటికలు వేయబడ్డాయి.

మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం గూర్చి వ్రాయగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
వి. దిలీప్ కుమార్.

చిరునామా :
గార్లపాటి శ్రీరాంకుమార్,
10వ తరగతి,
ఎస్.పి.వి.కె.ఆర్. హైస్కూలు,
దొమ్మేరు – ప.గో.జిల్లా, పిన్ : 534 351.

AP Board 8th Class Telugu లేఖలు

3. సందర్శించిన ఒక ప్రదేశాన్ని గూర్చి వివరిస్తూ మిత్రునికి లేఖ.
(లేదా)
చూసిన విజ్ఞానయాత్రా విశేషాలను వివరిస్తూ మిత్రునికి లేఖ.
జవాబు:

హైద్రాబాదు,
x x x x x

ప్రియ మిత్రుడు శంకరు,

నేను క్షేమంగా ఉన్నాను. మీరంతా క్షేమమని తలుస్తాను. నేను ఇటీవల ఆగ్రా వెళ్ళివచ్చాను. అక్కడి విశేషాలు నీకు వివరిస్తాను.

ఆలో ముఖ్యంగా చూడదగ్గది తాజ్ మహల్. షాజహాన్ దంపతుల పవిత్ర ప్రణయానికి శాశ్వత చిహ్నమే తాజమహల్. దాన్ని చూసి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అది ఒక ఎత్తైన వేదిక మీద ఉన్న చలువరాతి కట్టడం. దానికి నాలుగువైపులా నాలుగు చంద్రకాంత శిలా స్తంభాలున్నాయి. ప్రధాన భవనం లోపల గోడలు మణులతో చెక్కబడి ఉన్నాయి. యమునా నదీతీరంలో ఉన్న ఆ తాజ్ మహల్ సౌందర్యం చూసి ఆనందించవలసిందే గాని చెప్పడానికి వీలుకాదు. అందుకే ప్రపంచంలోని ఏడు వింతలలో తాజ్ మహల్ కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు. నీవు కూడా అవకాశం దొరికినప్పుడు తాజ్ మహల్ తప్పక చూడవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
ఆర్ శ్రీనివాస్.

చిరునామా :
కె. శంకరరావు,
S/O సత్యనారాయణరావు గారు,
ఆర్.ఆర్. నగర్,
విజయవాడ – 520 012.

4. మీ వీధిలో పారిశుధ్య పరిస్థితిని (అపరిశుభ్రతను) గూర్చి వివరించుచు సంబంధిత అధికారికి లేఖ వ్రాయుము.
జవాబు:

పామర్రు,
x x x x x

మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి గారికి నమస్కరించి మోహన్ వ్రాయు విన్నపము.

అయ్యా,
నేను కరణం గారి వీధిలో నివాసం ఉంటున్నాను. మా వీధిలో ఎక్కడ చూసినా చెత్త, దుమ్ము, మురికి ప్రత్యక్షమవుతాయి. చెత్త పారెయ్యడానికి చెత్త కుండీలు లేవు. మురికినీరు కాలువలు నిండిపోయి రోడ్డుమీదే ప్రవహిస్తుంది. ఇక దుర్గంధం చెప్పడానికి వీలులేదు. ఆ మురికి వల్ల దోమల బాధకూడా ఎక్కువైంది. దీనివల్ల మలేరియా సోకే ప్రమాదముంది. కాబట్టి మావీధి పారిశుధ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవల్సిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
వి.యస్. మోహన్.

చిరునామా :
ఆరోగ్యశాఖాధికారి గారు,
పురపాలక సంఘ కార్యాలయం,
పామర్రు, కృష్ణాజిల్లా.

AP Board 8th Class Telugu లేఖలు

5. నచ్చిన రాజకీయ నాయకుని గురించి మిత్రునికి లేఖ :
జవాబు:

నెల్లూరు,
x x x x x

ప్రియ స్నేహితురాలు పద్మకు,

నేను క్షేమముగా ఉన్నాను. నీ క్షేమసమాచారములు తెలుపగలవు. నీవు ఈ మధ్య నాకు వ్రాసిన ఉత్తరములో నాకు నచ్చిన రాజకీయ నాయకుని గురించి వ్రాయమన్నావు కదా ! అందుకే ఈ లేఖ వ్రాయుచున్నాను.

నాకు నచ్చిన రాజకీయ నాయకుడు భారత మాజీ ప్రధాని, ‘భారతరత్న’ అవార్డు గ్రహీత శ్రీ మొరార్జీ దేశాయ్. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనిన మహోన్నత నాయకులలో ఆయన ఒకరు. గాంధీజీ ఆదర్శాలకోసం జీవితాంతము పాటుబడిన వ్యక్తి మొరార్జీ. ఉన్నతమైన విలువలు, ఆదర్శమైన విధానాలకు కట్టుబడిన వ్యక్తిగా మొరార్జీ ప్రపంచ ప్రఖ్యాతి పొందినారు. మొరార్జీ ఏనాడు పదవులను ఆశించలేదు, పదవులే ఆయనను జీవితాంతం ఆశించినాయి. నైతిక విలువలకు మొరార్జీ గొప్ప ఉదాహరణ. అందులకే ఆయన అంటే నాకు ఎంతో ఇష్టము.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
పి. శశికళ.

చిరునామా :
వి. పద్మ,
10వ తరగతి, బాలికోన్నత పాఠశాల,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.

6. మీ పాఠశాలలో జరిగిన జాతీయ పండుగను గూర్చి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

చెరుకూరు,
x x x x x

ప్రియ మిత్రుడు ప్రవీణ్ కుమార్‌కు,

ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ఇటీవల మా పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ‘ఫిబ్రవరి 21 న బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా చక్కనైన సూక్తులు రాసిన చార్టులు తగిలించి, అలంకరించాం. మన మాతృభాషను కాపాడిన, కాపాడుతున్న ఎందరో మహనీయులైన వారి చిత్రపటాలు సేకరించి, ప్రదర్శనగా ఉంచాం. ప్రక్కనే వారు మాతృభాష కోసం చేసిన కష్టాన్ని క్లుప్తంగా రాసి, ఉంచాం. గిడుగు, గురజాడ వంటి మహనీయులకు పెద్దపీట వేసాం. ఆ సభకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త “ఆర్ష విద్యాసాగర్, మధురభారతి” శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిని ఆహ్వానించాం. వారి ఉపన్యాసం ఎలా సాగిందంటే బీడునేల మీద వాన చినుకులు పడిన విధంగా మమ్మల్ని ఉత్తేజితులను చేసింది. ఆ తర్వాత మాలో కొంతమంది మాతృభాష గొప్పదనాన్ని గురించి మాట్లాడారు. అలాగే మీ పాఠశాలలో జరిగిన విశేషాలను లేఖ వ్రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
డి. ప్రవీణ్ కుమార్,
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
బాపట్ల, గుంటూరు జిల్లా.

7. ఇటీవల మీ పాఠశాలలో నిర్వహించబడిన ‘అమ్మకు వందనం’ కార్యక్రమంలోని విశేషాలను తెలుపుతూ మీ సోదరికి లేఖ రాయండి.
జవాబు:

లేఖ

చెరుకూరు,
x x x x x

ప్రియమైన పద్మావతి అక్కకు,

మేము ఇక్కడ క్షేమం. మీరు అక్కడ క్షేమమని తలుస్తాను. నేను బాగా చదువుతున్నాను. ఇటీవల మా పాఠశాలలో ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి తల్లిని
పిలిపించారు. ఆ తల్లులకు వారి పిల్లల చేత కాళ్ళు కడిగించి, పాదాల మీద పూలు వేసి, నమస్కరించమన్నారు. మేమంతా అట్లా చేసి, అమ్మల ఆశీస్సులు తీసుకొన్నాము. నేను, మరికొంతమంది విద్యార్థులు అమ్మ గొప్పదనాన్ని గురించి మాట్లాడాము. అమ్మ కళ్ళలో ఏదో తెలియని ఆనందం కనిపించింది. దానిని ఎప్పుడూ పోకుండా చూసుకోవాలని అనుకున్నాను. బావగారు, పిల్లలు ఏం చేస్తున్నారు ? అందరినీ అడిగానని చెప్పు.

ఇట్లు,
నీ తమ్ముడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
ఎస్. పద్మా వతి,
W/o ఎస్. పూర్ణచంద్ర,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

AP Board 8th Class Telugu లేఖలు

8. మామూలు వాక్యాలు కూడా సరైన పదాలు జోడించి అందంగా వివరిస్తూ రాస్తే వర్ణనాత్మక వాక్యాలు అవుతాయి కదా! అలాగే మీరు కూడా మంచి పదాలతో మీకు నచ్చిన ఒక కథను వర్ణిస్తూ రాయండి.
జవాబు:
వర్ణనాత్మక కథ :

ప్రేమే పరమాన్నం

ఆప్యాయతతో ఆదరించిన వారింట పచ్చడన్నం తిన్నా తృప్తిగా ఉంటుంది. అదే ప్రేమ నటిస్తూ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా ఆ భోజనం రుచించదు. అంటే నిజమైన రుచి వంటకంలో లేదు. వండి వడ్డించిన వారి మనసులో ఉంది. దానికి ఉదాహరణే ఈ కథ.

పాండవులు పాచికల ఆటలో మోసపోయి 12 యేండ్లు అడవుల్లో, ఒక యేడాది మారువేషాల్లో బతికి అరణ్య, అజ్ఞాత వాసాలు పూర్తి చేసుకొన్నారు. తిరిగి రాజ్యాన్ని అప్పగించమంటూ కృష్ణుడి ద్వారా కౌరవులకు రాయబారం పంపారు పాండవులు. అప్పుడు కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళగా, దుర్యోధనుడు శ్రీకృష్ణుణ్ణి మచ్చిక చేసుకొని, తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నించి, కపట ప్రేమను ఒలకబోస్తాడు. కానీ కృష్ణుడు తాను కౌరవుల అతిథిగా రాలేదని, పాండవుల రాయబారిగా వచ్చానని చెబుతాడు. ఆ రాత్రి బసకు ధృతరాష్ట్రుని మంత్రి విదురుని ఇంటికి వెళతాడు. ఆయన భోగభాగ్యాల లాలస లేక నిరాడంబర జీవితాన్ని గడుపుతుంటాడు. తన ఇంటి తలుపు తట్టిన కృష్ణుని చూసి నివ్వెరపోయాడు. అంతులేని ఆనందంతో చేతులు జోడించాడు. అపరిమితమైన ప్రేమతో స్వాగతం పలికాడు.

శ్రీకృష్ణునికి పాదపూజ చేస్తాడు. ఆకలిగా ఉందన్న ఆయనకు అరిటాకు వేసి, ఇంటిలో ఉన్న కొన్ని అరటిపళ్ళు పెడతాడు విదురుడు. శ్రీకృష్ణునికి భక్తిపూర్వక నైవేద్యంగా ప్రేమతో వడ్డించింది ఆ ఇంటి ఇల్లాలు. విదురుడు వింజామరతో విసురుతున్నాడు. వారి ఆదరాభిమానాలకు వాసుదేవుడు కరిగిపోయాడు. ఆ దంపతులు భక్తి పారవశ్యంలో కృష్ణుణ్ణి చూస్తూ అరటిపండ్లు ఒలిచి పండును పక్కన పెట్టి తొక్కను ఇస్తుంటే వాటినే ఆరగించాడు ఆ పరమాత్మ. తర్వాత గమనించిన దంపతులు తేరుకొని మన్నించమని ప్రార్థిస్తారు. భక్తులకు తాను దాసుణ్ణని, వారు మనసు పెట్టి సమర్పించింది ఏదైనా సరే స్వీకరిస్తానని చెప్తాడు.

ఎదుటి వారికి ఇచ్చేది ఏదైనా సరే అణకువతో ఇవ్వాలి. అహంకారం లేని సమర్షణను ఆనందంగా స్వీకరించడానికి భగవంతుడైనా నిరుపేద ముంగిటికి వస్తాడు. తన భక్తులు తనకేమిచ్చారో చూడకుండా ఎలా ఇచ్చారన్న దానికే పెద్దపీట వేస్తాడు.

AP Board 8th Class Telugu వ్యాసాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions 8th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu వ్యాసాలు

1. వాతావరణ కాలుష్యం

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. వాతావరణం పరిశుభ్రంగా ఉండి, చక్కటి ఆరోగ్యకరంగా ఉంటే మానవుని జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మానవునికి హానికరమైన పదార్థాలు వాతావరణంలో కలిసి ఉంటే దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికినీరు మొదలైనవి వాతావరణ కాలుష్యానికి కారణాలు. కర్మాగారాల వల్ల నదులన్నీ మురికినీటితో నిండిపోయి జలకాలుష్యం ఏర్పడుతోంది. పరిశ్రమలవల్ల గాలి కలుషితమవుతోంది. మోటారువాహనాల వల్ల నగరాలలోను, పట్టణాలలోను ధ్వని కాలుష్యం ఎక్కువవుతోంది.

వాతావరణ కాలుష్యం చాలా భయంకరంగా తయారయింది. పారిశ్రామికీకరణ వల్ల ఈ సమస్య మరీ ఘోరంగా తయారయింది. వాతావరణ కాలుష్యం మానవుని మనుగడకే పెద్ద సవాలుగా పరిణమించింది. దీనివల్ల ఉదరకోశవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి.

వాతావరణ కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికలు తయారుచేసి అమలు చేయాలి. పరిశ్రమలు, కర్మాగారాలు మానవుల నివాసాలకు దూరంగా నెలకొల్పాలి. ప్రతి వ్యక్తి తన ఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశం ఉన్నచోట మొక్కలను విరివిగా పెంచాలి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు పరిశోధనలు చేసి వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు చేయాలి.

2. బాల కార్మికులు

నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ.) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేటట్లు చూడాలి.

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

మన రాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపు మాపేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది.

బాలకార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

AP Board 8th Class Telugu వ్యాసాలు

3. కరవు నివారణోపాయాలు

అనావృష్టి వల్ల కరవు వస్తుంది. కరవును క్షామం అని కూడా అంటారు. సామాన్య వర్షపాతంలో 75% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘కరవు’గాను, 50% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరవు’ గాను భారత వాతావరణ శాఖ నిర్వచించింది.

ఋతుపవనాల నియమరహిత స్వభావం వల్ల దేశంలో ఏదో ఒకచోట ప్రతి సంవత్సరం తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. ఎక్కువగా వాయవ్య భారతదేశం, ఆ తరువాత దక్షిణ మరియు మధ్య భారతదేశంలో తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులు అతిగా కరవులు సంభవించే రాష్ట్రాలు.

నివారణోపాయాలు :

  1. కరవు పీడిత ప్రాంతాలలో భూమిశిస్తు పూర్తిగా తొలగించడం గానీ, తగ్గించడం గానీ చేయాలి.
  2. క్షామపీడిత ప్రాంతాలలో ప్రజలు తిరిగి వ్యవసాయం చేసుకొనేందుకు వీలుగా ఆర్థిక సహాయం అందించడం, నీటి పారుదల సౌకర్యాలు కలిగించడం వంటివి చేయాలి.
  3. ఆయా ప్రాంతాలను బట్టి ఏయే పంటలు వేస్తే బాగా పండుతాయో వ్యవసాయదారులకు సూచనలివ్వాలి.
  4. పండిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కలిగించాలి.
  5. తుపానులు వచ్చినపుడు తట్టుకొని, నిలబడి పంటనిచ్చే కొత్త రకాలను శాస్త్రజ్ఞులు కనిపెట్టాలి.
  6. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడాలి.

కరవు నష్టాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం “కరవుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక” (Drought prone area programme) ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలో నీటిపారుదల, మృత్తికా పరిరక్షణ, వనీకరణ మొదలగు పథకాలున్నాయి. ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా మానవతా దృష్టితో కరవుపీడిత ప్రాంతీయులను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించాలి.

4. పర్యావరణ సంరక్షణ

భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్తా, చెదారమే కాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి. జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగేనీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగేనీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజీ వ్యవస్థ అరకొరగా ఉంది. దీనివల్ల కలరా, మలేరియా, ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.

యంత్రాలవల్ల, వాహనాల వల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. 1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్య నివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

AP Board 8th Class Telugu వ్యాసాలు

5. విద్యార్థులు – క్రమశిక్షణ

విద్యను అర్థించేవారు విద్యార్థులు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనని కలిగి ఉండటం. నిజానికి క్రమశిక్షణ అన్ని వర్గాలవాళ్ళకీ, అన్ని వయస్సుల వాళ్ళకీ అవసరమే. అయితే విద్యార్థులు భావిభారత పౌరులు! జాతి భవిష్యత్తు వాళ్ళమీదే ఆధారపడి ఉంది. “మొక్కై వంగనిదే మానై వంగునా !” అన్నారు. చిన్నప్పుడే క్రమశిక్షణ అలవడటం సాధ్యం. పెద్దయిన తర్వాత మనిషి మారటం చాలా కష్టం. అందుకని విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉండాలి.

అయితే విద్యార్థుల్లో క్రమశిక్షణ ఎందుకు లోపిస్తోంది? అనే అంశాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది. అందుకు కొన్ని కారణాలు :

  1. కావలసిన కోర్సులో సీటు దొరకకపోవడం – కావలసిన రంగంలో ఉద్యోగం దొరకకపోవడం.
  2. రాజకీయ పార్టీల, నాయకుల ప్రభావం, జోక్యం.
  3. విద్యాలయాల్లో అవినీతి, అవకతవకల పరంపరలు !
  4. ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చెయ్యడం.
  5. తల్లిదండ్రుల అశ్రద్ధ, అలసత్వం.

ఇన్ని కారణాలతో పాటు పేర్కొనవలసిన మరొక రెండు ముఖ్యమైన అంశాలున్నాయి – ఒకటి సినిమా, రెండు టి.వి ! ఈ రెండూ మానసిక వికాసానికి,
జ్ఞానాభివృద్ధికి ఉద్దేశించబడ్డాయి. కానీ పాశ్చాత్య విషసంస్కృతి ప్రభావంచే ఈ రెండు ప్రసార సాధనాలూ యువకులపై, విద్యార్థుల పై “స్లోపాయిజన్” లా పని చేస్తున్నాయి.

విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడాలంటే ముందుగా –

  1. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణులపై కఠిన వైఖరి అవలంబించాలి.
  2. విద్యారంగంలోని అవకతవకల్ని, అవినీతిని (లీకేజీ, మాస్ కాపీయింగ్ సంప్రదాయాల్ని) అరికట్టాలి.
  3. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, ఆదర్శవంతంగా ప్రవర్తిస్తూ బోధనకి అంకితమవ్వాలి.
  4. రాజకీయ పార్టీల నీడ కూడా విద్యాలయాలపై పడకూడదు.
  5. విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ ఉండాలి.
  6. విద్యార్థుల్లో దేశభక్తి, సచ్ఛీలత, సహనం అలవడేలా తగిన చర్యలు తీసుకోవాలి.

క్రమశిక్షణ ఇతరులు బలవంతంగా రుద్దినట్లు ఉండకూడదు. ఆత్మగౌరవానికి సంబంధించినదిగా, ఆత్మశక్తికి సంబంధించినదిగా, జీవితధ్యేయంగా క్రమశిక్షణను అలవరచుకోవాలి. అప్పుడు విద్యార్థులతో పాటు దేశం కూడా అక్షరజ్యోతిగా వెలిగి అభివృద్ధి బాటలో పయనిస్తుంది.

AP Board 8th Class Telugu వ్యాసాలు

6. దూరదర్శన్

విజ్ఞానశాస్త్ర ప్రగతికి, మానవుడి ప్రతిభకి నిదర్శనం టెలివిజన్ దృశ్యతరంగాలను గాలిలో ప్రసారం చేయటం ద్వారా దృశ్యాలు చూడగలుగుతున్నాం. శబ్దతరంగాల ద్వారా శబ్దం వింటున్నాం. టెలివిజనను మానవుడి ప్రతిసృష్టిగా పేర్కొనాలి. ఇది బ్రిటన్లో 1936లో మొదట వ్యాప్తిలోకి వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్ బర్డ్ 1928లో కనిపెట్టాడు.

టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. టి.వి.లు లేని ఊరులేదు. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. టి.వి.ల ద్వారా ప్రభుత్వం, వాణిజ్య సంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మన సంస్కృతిని, కళలను కాపాడుకోవచ్చు. మనం చూడలేని ప్రదేశాలు చూడవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని మన ముందు నిలబెట్టేది టెలివిజన్. విద్యారంగంలో, వైద్యరంగంలో, వాణిజ్యరంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో నేడు టెలివిజన్‌కు తిరుగులేని స్థానం ఉంది. “వీడియో” పరిజ్ఞానానికి టి.వి. మూలకారణం. నిరక్షరాస్యత నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్.

విదేశీ చానల్స్ ప్రసారం వల్ల యువత నిర్వీర్యమవుతోంది. మన సంస్కృతిని విస్మరిస్తున్నారు. సినిమాల వ్యామోహం, సెక్స్ వ్యామోహం ఎక్కువై పెడదారి పడుతున్నారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం పిల్లలపై టి.వీ.లు దుష్ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడైంది. కాబట్టి టెలివిజన్ ని మంచికి ఉపయోగించుకొనేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రైవేట్ ఛానల్సను నియంత్రించి వాటిపై సెన్సారు అధికారాన్ని కలిగి ఉండాలి. అప్పుడే టి.వి. వల్ల సత్రయోజనాలుంటాయి.

7. వరకట్న సమస్య

వరునికిచ్చు కట్నం వరకట్నం. దాని వల్ల సమాజంలో ఏర్పడే సమస్యని వరకట్న సమస్య అంటారు. వరకట్నం కేవలం ఆడపిల్ల తల్లిదండ్రులకే కాదు కుటుంబం మొత్తానికి కూడా అదొక దుర్భర సమస్యగా తయారైంది. అసలు కట్నం అంటే కానుక. పెళ్ళి సందర్భంగా ఇచ్చే కానుక క్రమక్రమంగా కట్నమైంది. పూర్వకాలంలో కన్యాశుల్కం ఉండేది. డబ్బు ఇచ్చి కన్యల్ని కొనుక్కొనే వాళ్ళు. ఆధునిక కాలంలో దాని స్థానంలో వరకట్నం వచ్చింది. ఇప్పుడు పెళ్ళి సమయంలో పెళ్ళికూతురు తల్లిదండ్రులు పెళ్ళికొడుక్కి ఇచ్చే ధనం లేదా సంపదని వరకట్నం అంటున్నారు. కొందరు డబ్బు కట్నంగా ఇస్తే మరికొందరు భూములు ఇస్తారు.

వరకట్నం తీసుకోవడం గానీ, ఇవ్వడం గానీ నేరమని చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని పాటిస్తున్నదెవరు ? చట్టాన్ని కాపాడవలసిన అధికారులే వరకట్నం ఇస్తున్నారు – తీసుకుంటున్నారు. కంచే చేను మేస్తోంది ! వరకట్నం ఇవ్వనని ఎవరైనా శపథం చేస్తే అమ్మాయికి పెళ్ళికాని పరిస్థితి కూడా ఏర్పడుతోంది ! ఆశ్చర్యం ఏమిటంటే అమ్మాయికి కట్నం ఇవ్వలేక నానా బాధలు పడ్డవారే, అబ్బాయి పెళ్ళి దగ్గరికి వచ్చేటప్పటికి కట్నం ఇవ్వాలని పట్టుబడతారు.

వరకట్న నిర్మూలనం సాధ్యమవ్వాలంటే ముందుగా పెద్దలలో మార్పు రావాలి. శాఖాంతర, కులాంతర, ప్రేమ వివాహాలను ప్రోత్సహించాలి. యువతీయువకులు ఆదర్శాలతో ఈ వరకట్నమనే దురాచారాన్ని రూపు మాపాలి. అమ్మాయికి ఇవ్వటం, అబ్బాయికి తీసుకోవటం రెండూ అక్రమమేనన్న ఆలోచన కలగాలి. కట్నం అనేది బానిసవ్యాపారమన్న ప్రచారం సాగాలి. రేడియోలు, టీ.వీ.లు, సాహిత్యం ద్వారా వరకట్న దురాచారం గురించి ప్రజలకి తెలియజెయ్యాలి. వరకట్న నిషేధ చట్టాన్ని ప్రజలు అమలుపరచాలి. అప్పుడే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుంది లేదా ‘తంటా’ అవుతుంది !

8. గ్రంథాలయాలు

“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో – కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నది సూక్తి. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాల ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించేవి వున్నాయి. తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం (Library) అంటారు.

అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నాళం కృష్ణారావు మొదలైన వాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు. గ్రంథాలయ మహాసభలు నిర్వహించి పుస్తకాలను సేకరించి భద్రపరిచారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలున్నాయి. అమెరికాలో గల ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోము నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’, ‘బ్రిటిష్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరొందాయి. మన దేశంలో చెన్నైలోని “కన్నెమరా” గ్రంథాలయం, తంజావూరులోని “సరస్వతీ మహలు”, వేటపాలెంలోని “సారస్వత నికేతనం”, హైదరాబాదులోగల “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం కూడా నెలకొల్పబడింది.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి.

గ్రంథాలయాల వల్ల చాలా లాభాలున్నాయి :

  1. గ్రంథాలయాలు మనిషిని మనిషిగా మారుస్తాయి.
  2. మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి.
  3. దేశాభ్యుదయానికి, సమాజవికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
  4. గ్రంథపఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.
  5. గ్రంథాలు తండ్రివలె ఆదేశిస్తాయి. తల్లివలె లాలిస్తాయి. మిత్రుని వలె ఆదుకుంటాయి. గురువువలె ప్రబోధిస్తాయి.

గ్రంథాలయాధికారులు పుస్తకాలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి. డబ్బును దుర్వినియోగం చెయ్యకుండా మంచి పుస్తకాలనే కొనాలి. హాని కలిగించే పుస్తకాలను నిర్మొహమాటంగా తిరస్కరించాలి. పోటీ పరీక్షలకి, ఉద్యోగ పరీక్షలకి, చదువుకి కావలసిన పాఠ్య గ్రంథాలు, క్విజ్ పుస్తకాల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం గ్రంథాలయోద్యమాన్ని నీరుకార్చకుండా తగిన శ్రద్ధవహిస్తే సమాజం అభ్యుదయ పథంలో పయనిస్తుంది.

AP Board 8th Class Telugu వ్యాసాలు

9. కంప్యూటర్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్ లో ‘డేటా’ (Data) ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్ఛితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్‌ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా హార్డువేర్, సాఫ్ట్వేర్ అనే పదాలను వింటూ ఉంటాం. హార్డువేర్ అంటే కంప్యూటర్ పరికరాలు. సాఫ్ట్ వేర్ అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన పద్ధతిని తెలిపేది.

కంప్యూటర్లను ఉపయోగించి ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగాహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైనవాటి టిక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. కంప్యూటర్ ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు.

అయితే కంప్యూటర్లని వాడటం వల్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందనీ, నిరుద్యోగ సమస్య పెరుగుతుందని కొందరి వాదన. ఇది కొంతవరకు నిజమే. ఆ మాత్రంచేతనే ఆధునిక విజ్ఞానాన్ని త్రోసిరాజనడం న్యాయం కాదు. కాబట్టి భావిభారత పౌరులైన విద్యార్థులు కంప్యూటర్ విద్య ఆవశ్యకతను గుర్తించి తప్పక దాన్ని అభ్యసించాలి.

10. జాతీయ సమైక్యత

ఒక దేశంలో పుట్టి పెరిగిన వారంతా ఒక జాతి వారని చెప్పవచ్చు. మనది భారతజాతి. భాష, మతం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఒక్క టైనా, కాకున్నా ఒకే ప్రభుత్వం కిందనున్న ప్రజలంతా ఒకే జాతి అని చెప్పవచ్చు. మతాలు వేరయినా, భాషలు, రాష్ట్రాలు వేరయినా జాతి అంతా కలసి ఉండటమే జాతీయ సమైక్యత అంటారు.

మన భారతీయులలో కనిపించే దౌర్బల్యం అనైక్యత. మతం పేరిటనో, అధికారాన్ని ఆశించో మన రాజులొకరితో ఒకరు కయ్యాలాడుకొని విదేశీయుల పాలనలో దేశాన్ని పడవేశారు. నేటికీ మన దేశాన్నత్యాన్ని సహింపలేని విదేశాలున్నాయి. ఆ దేశాలతో మన జాతి సమైక్యతకు భంగం కలిగించే కొన్ని శక్తులు, మన దేశంలోనే ఉండి పొత్తు పెట్టుకొంటున్నవి. అట్టి అవాంఛనీయ శక్తులను తుదముట్టించి మన జాతినంతా ఒకే తాటిపై నిలపాలి. మనం ఏ రాష్ట్రం వారమైనా, ఏ భాషను మాట్లాడే వారమైనా మనమందరం భారతీయులమనే మాట మరువరాదు.

కొందరు మత కలహాలు పెంచి వారిలో భేదాలు రెచ్చగొట్టి హత్యలకు, లూటీలకు, గృహదహనాలకు సిద్ధపడుతున్నారు. దీనివల్ల ప్రజలలో ఇతర మతంవారిపై ద్వేషం పెరుగుతుంది. కొందరికి ప్రాంతీయ దురభిమానం, మరికొందరికి తమ భాషలపై ‘మోజు ఎక్కువ. స్వభాషాభిమానం ఉండటం మంచిదే. కానీ పరభాషపై ద్వేషం ఉండకూడదు. భాషా రాష్ట్రాలుగా విభజించిన తరువాత ప్రాంతీయ దురభిమానాలు పెరిగి నదీ జలాల కొరకు, తమ ప్రాంతాల అభివృద్ధి కొరకు పరస్పరం కలహించుకొంటున్నారు.

మన జాతిలో అనైక్యతను పోగొట్టి ఐక్యపరచటానికి ప్రభుత్వం జాతీయ సమైక్యతా మండలిని స్థాపించింది. భారత జాతి అంతా ఒక్కటే అని బోధిస్తున్నది. జాతీయ సమైక్యత వల్ల దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా విదేశాలలో భారత జాతి కీర్తిపతాకలు రెపరెపలాడతాయి.

11. మతసామరస్యం

భారతీయ సమాజంలోని వ్యక్తులకు మతం అనేది పుట్టుక నుండి సంక్రమిస్తుంది. అదే విధంగా మతము యొక్క ప్రభావం వ్యక్తిపై పుట్టుక నుండి మరణించే వరకు ఉంటుంది. ప్రపంచంలో అధిక ప్రభావం కలిగిన ముఖ్యమైన మతాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. ఎవరికి వారు వారి మతం గొప్పదిగా భావించడం జరుగుతుంది. ఒకనాటి సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి, ఆనాటి సమాజంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి మతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న మతాలను ఏడు రకాలుగా విభజించవచ్చు.

1) హిందూమతం, 2) ముస్లింమతం, 3) క్రైస్తవమతం, 4) బౌద్ధమతం, 5) జైనమతం, 6) సిక్కుమతం, 7) పార్సీ, యూదుమతం. భారతీయ సమాజంలో హిందూమతం వారే ఎక్కువగా ఉన్నప్పటికీ అనేక కారణాలవల్ల మతాల మధ్య వ్యత్యాసాలు, సంఘర్షణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ విధమైన మతతత్వానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి : 1) ప్రజలలో స్వార్థబుద్ధి 2) మహమ్మదీయులలో ఆర్థిక బలహీనతల కారణంగా మైనార్టీలకు ఎక్కువ సౌకర్యాలను కలిగించాలనే వారి వాదన 3) ప్రాంతీయతత్త్వం మొదలైన కారణాలవల్ల భారతీయ సమాజంలో మతతత్త్వం వెర్రితలలు వేస్తోంది. మతతత్వానికి మరొక ముఖ్యకారణం మతంతో రాజకీయాలు మిళితమై ఉండటం.

మతాన్ని రాజకీయాల్లో చేర్చటంవల్ల భారత్ నుండి పాకిస్థాన్ విడిపోయింది. నేడు సిక్కుమతం వారు భారత్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడతామని అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. మరో ప్రక్క ‘రామజన్మభూమి – బాబ్రీ మసీదు’ వివాదం మతసమస్యగా తయారయింది. భారతదేశంలో మతకలహాలు తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. అల్ప సంఖ్యాకులకు, అధిక సంఖ్యాకులకు మధ్య పరస్పర విశ్వాసం, సామరస్యం లోపించడంతో ఈ భయానక వాతావరణం ఏర్పడి అల్లర్లు, అలజడులు, ఆస్తినష్టం, ప్రాణనష్టం తరచు ఏర్పడుతూనే ఉన్నాయి. వివిధ రాజకీయ పక్షాలు పాక్షిక ప్రయోజనాల సాధన కోసం మతకలహాలను ఒక ఆయుధంగా ఉపయోగించుకొంటున్నాయి.

ఈ విధమైన పరిస్థితులను చక్కదిద్దాలంటే ప్రజలు చైతన్యవంతులై రాజకీయ నాయకుల బూటకపు మాటలకు మోసపోక పరమత సహనం కలిగిఉండాలి. మత సామరస్యంతో అందరూ కలిసిమెలసి జీవించడం నేర్చుకోవాలి.

AP Board 8th Class Telugu వ్యాసాలు

12. జనాభా సమస్య (కుటుంబ నియంత్రణ)

జనాభా ఎక్కువగుట వలన సమస్య ఏర్పడటాన్ని జనాభా సమస్య అంటారు.
“అమెరికాలో డాలర్లు పండును
ఇండియాలో సంతానం పండును”

అని తెలుగులో బాలగంగాధరతిలక్ అనే కవి వ్యంగ్యంగా భారతీయులకి సంతానంపై గల మక్కువ తెలిపాడు. జనాభా సమస్య ఏర్పడటానికి ఈ క్రింది కారణాలు ముఖ్యం 1) సంతానం ఎక్కువగా ఉండటం గొప్పదనంగా భావించడం. 2) ఆడపిల్లలు లేదా మగపిల్లలు కావాలనే కోరికలు. 3) చిన్నప్పుడే వివాహాలు చెయ్యటం. 4) నిరక్షరాస్యత. 5) మత విశ్వాసాలు.

ఇన్ని కారణాల వల్ల రాను రాను జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. జనాభా సమస్యను పరిష్కరించటానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికా విధానం రూపొందించింది.
జనాభా సమస్య నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలు :

  1. ‘కుటుంబ నియంత్రణ’ ను అన్ని మతాల ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
  2. జనాభా సమస్య వల్ల ఏర్పడే నష్టాలను ప్రజలకు తేటతెల్లం చెయ్యాలి.
  3. స్త్రీల కంటే పురుషులు కుటుంబ నియంత్రణ చికిత్స చేసుకోవటం తేలిక. అని చెప్పాలి.
  4. కుటుంబ నియంత్రణకి ప్రోత్సాహం కలిగించే సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలి.
  5. ఆడయినా, మగయినా ఒకటేనన్న భావాన్ని కలిగించాలి.
  6. కుటుంబ నియంత్రణ పాటించడం పాపమనే భావనని తొలగించాలి.

అప్పుడు మాత్రమే జనాభా పెరుగుదలను అరికట్టడం సాధ్యమవుతుంది. జనాభా సమస్య వల్ల నష్టాలు ఇవి –

  1. జనాభా పెరుగుదల వల్ల ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య, కాలుష్య సమస్యల వంటివి ఎక్కువవుతాయి.
  2. విద్యాలయాలలో సీట్లు లభించక విద్యావకాశాలు తగ్గిపోతాయి.
  3. దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుంది.
  4. “అందరికీ ఆరోగ్యం ” అనేది సాధ్యం కానేరదు.
  5. సంతానం ఎక్కువగా వుంటే తల్లిదండ్రులపై భారం ఎక్కువై పిల్లల్ని సక్రమంగా పెంచి పోషించలేరు.
  6. జనాభా ఇదే విధంగా పెరుగుతూవుంటే బట్టకీ, ఇంటికీ కూడా కరవు తప్పదు.

అందువల్ల ప్రభుత్వం జనాభా సమస్య నిర్మూలనకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ‘చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం’ అని బోధించడమే కాదు. నాయకులు, అధికారులు తాము కూడా పాటించాలి. కుటుంబ నియంత్రణ పాటించని వారిని శిక్షించే చట్టం రూపొందించాలి. అప్పుడే దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుంది.

13. విజ్ఞానయాత్రలు

విజ్ఞానయాత్రలు లోకజ్ఞానాన్ని కలిగించేవి. అయినా ఇవి వినోదయాత్రలుగా, విహారయాత్రలుగా వ్యవహారంలో ఉన్నాయి. అంటే కొన్ని ప్రత్యేక స్థలాలకి ప్రయాణం చేయటం వల్ల విజ్ఞానం సంపాదించవచ్చు. విజ్ఞానమే కాకుండా వినోదం కూడా లభిస్తుంది.

పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచారవ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది. ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తోందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. అది కేవలం “Bookish knowledge”. జలవిద్యుత్ కేంద్రానికి వెళ్ళి, అది పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాల అవగాహనకు యాత్రలు ఎంతో అవసరం.

విజ్ఞానయాత్రల వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు – 1) లోకజ్ఞానం అలవడుతుంది. 2) మానసిక విశ్రాంతి లభిస్తుంది. 3) విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు. 4) పదిమందితో ఏవిధంగా మెలగాలో అనుభవం వస్తుంది. 5) స్నేహితులను పొందే అవకాశం లభిస్తుంది. 6) జాతి సమైక్యత, దేశ సమైక్యతకి దోహదం చేస్తాయి. 7) కవులకి, చిత్రకారులకి, మానసిక రోగులకి స్ఫూర్తిని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

ఇటువంటి విజ్ఞాన యాత్రల్లో చాలా రకాలున్నాయి-1) ప్రకృతికి సంబంధించినవి – ఊటీ, హిమాలయాలు, జోగ్ జలపాతం మొదలగునవి. 2) చారిత్రక సంబంధమైనవి-ఎల్లోరా, రామప్పగుడి, చార్మినార్ మొదలగునవి. 3) శాస్త్ర సంబంధమైనవి-బిర్లా ప్లానిటోరియం, పరిశ్రమలు, అణుకేంద్రాలు మొదలగునవి. 4) మత సంబంధమైనవి-కాశీ, మక్కా, వాటికన్, తిరుపతి మొదలగునవి.

ఈ యాత్రల పట్ల విద్యార్థి దశనుండే ఉత్సాహం ఏర్పడేలా చూడాలి. విద్యార్థిగా ఉన్నప్పుడే లోకజ్ఞానం అలవడితే జీవితం సంపన్నమవుతుంది – అర్థవంతమవుతుంది. ఉపాధ్యాయుల, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయుల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులలో ఐకమత్యానికి కూడా ఈ యాత్రలు తోడ్పడతాయి.

విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం యువకులకో లేదా విద్యార్థులకో, కళాకారులకో అనుకోవటం సరికాదు. అన్ని వయస్సులవాళ్ళకీ, అన్ని వృత్తులవాళ్ళకీ అవసరమే. కూపస్థ మండూకం లాగా జీవించటం మానవుడి నైజం కాదు కాబట్టి విజ్ఞానయాత్రలు అత్యంతావశ్యకాలు.

14. వార్తాపత్రికలు

వార్తలను అందించే పత్రికలను “వార్తా పత్రికలు” (News papers) అంటారు. వార్తలను ఇంగ్లీషులో NEWS అంటారు గదా! ఆ అక్షరాలను బట్టి కొందరు ఈ విధమైన వివరణ ఇస్తారు – N అంటే North, E అంటే East, W అంటే West, S అంటే South. కాబట్టి ప్రపంచం నలుమూలలా జరిగే సంఘటనలను అందించేవి వార్తా పత్రికలు అనే వివరణ సమంజసంగానే కనిపిస్తుంది.

ప్రాచీనకాలంలో వార్తలను చేరవేయటానికి మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని వాడేవారు. “వార్తాహరులు”, “రాయబారులు” ఉండేవారు. కానీ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత ముద్రణాయంత్రాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ‘అచ్చు’కి ప్రాముఖ్యం లభించి వార్తా పత్రికల వ్యాప్తి జరిగింది.

ప్రపంచంలో మొట్టమొదటగా వెనిస్ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు. సుమారు క్రీ.శ. 1620 నాటికి వార్తా పత్రికలు వచ్చినట్టు తెలుస్తోంది. భారతదేశంలో మొదటి వార్తాపత్రికగా “ఇండియా గెజిట్”అని కొందరు, “బెంగాల్ గెజిట్”అని మరికొందరు పేర్కొంటున్నారు. క్రీ.శ. 1850 నుంచి మన దేశంలో పత్రికల ప్రచురణ అధికమైంది. కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, ఖాసా సుబ్బారావు, సి.వై. చింతామణి, గోరా, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఎ.బి.కె. ప్రసాద్ మొదలైనవారు సంపాదకులుగా తెలుగువార్తా పత్రికల ప్రాచుర్యానికి ‘ఎంతో కృషి చేశారు.

ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రభూమి, వార్త అనే దినపత్రికలు తెలుగునాట విశేష ఆదరణ పొందాయి.

వార్తా పత్రికల వల్ల లాభాలు చాలా ఉన్నాయి. అవి :

  1. మానవుడి మేధ వికసిస్తుంది.
  2. ఆర్థిక, రాజకీయ, విద్య, క్రీడ, వ్యవసాయ, సాహిత్యాదిరంగాలలోని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.
  3. సమాజంలో అట్టడుగున పడి కనిపించని వాస్తవాలెన్నో పత్రికల ద్వారా తెలుస్తాయి.
  4. రచయితలకు, యువతకు, కళాకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారవేత్తలకు, రైతులకు ఇంకా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ వార్తా పత్రికలు కరదీపికలు.
  5. జాతీయాభివృద్ధికి, జాతి సమైక్యతకి దోహదపడతాయి.
  6. ప్రభుత్వానికీ, ప్రజలకీ మధ్య వారధి వలె తోడ్పడతాయి. అంటే ప్రభుత్వ పథకాలూ, లోపాలూ ప్రజలకి తెలియజేస్తాయి. ప్రజల కష్టనష్టాలూ, సమస్యలూ, అభిప్రాయాలూ ప్రభుత్వానికి తెలియజేస్తాయి.

కొన్ని పత్రికలు నిష్పాక్షికంగా ఉండి అధికారుల అవినీతిని, అక్రమాలని బహిరంగపరుస్తున్నాయి. మరికొన్ని అశ్లీలానికీ, నీతిబాహ్యమైన అంశాలకీ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛని కాపాడాలి. సంపాదకులు, పత్రికా నిర్వాహకులు పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యకుండా నైతిక బాధ్యత కలిగి ఉండాలి.

AP Board 8th Class Telugu వ్యాసాలు

15. స్వచ్ఛభారత్

‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికి పేటలు, గంగ, గోదావరి వంటి నదుల జలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్చతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శన్ వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson స్ఫూర్తి ప్రదాతలు

8th Class Telugu ఉపవాచకం 6th Lesson స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. నెల్లూరు జిల్లా సంగం మండలంలో గాంధీ జనసంఘం ఒక మారుమూల గిరిజన గ్రామం. యానాదులు, ఎరుకల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన పద్మశ్రీ వెన్నెలకంటి రాఘవయ్యగారు గిరిజనులకోసం నిర్మించిన | గ్రామం ఇది. రెక్కాడితేగాని డొక్కాడని వీరు ఊరిపక్కనే ఉన్న కాలువలో చేపలు పట్టి అమ్ముకుంటూ, వ్యవసాయం, కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ఆ కుగ్రామంలో మల్లి మస్తానయ్య కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళ గురించి గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ఊళ్లలో కూడా చెప్పుకుంటారు. కారణం ఏమిటంటే పూటగడవడం కూడా కష్టంగా ఉండే ఆ కుటుంబంలోంచి ఆడపిల్లతో సహా నలుగుర్నీ బడికి పంపి చదివిస్తుండడమే. మస్తానయ్య కాస్త అక్షరజ్ఞానం ఉన్నవాడు. చదువు విలువ తెలిసినవాడు. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసేవాడు. ఇంట్లో తిండికి, బట్టకు లేకపోయినా పిల్లల పుస్తకాలకు మాత్రం కొరత రాకూడదనుకునేవాడు. అలాంటి నిరుపేద కుటుంబంలో 1974 సెప్టెంబరు 3వ తేదీన మస్తాన్ బాబు జన్మించాడు.
ప్రశ్నలు :
1. గాంధీ జనసంఘం ఏ జిల్లాలోని ఏ మండలంలో ఉంది?
జవాబు:
గాంధీ జనసంఘం నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఉంది.

2. గాంధీ జనసంఘం గిరిజన గ్రామాన్ని ఎవరు నిర్మించారు?
జవాబు:
గాంధీ జనసంఘం గిరిజన గ్రామాన్ని వెన్నెలకంటి రాఘవయ్య నిర్మించాడు.

3. కాస్త అక్షరజ్ఞానం కలవాడు ఎవరు?
జవాబు:
కాస్త అక్షరజ్ఞానం కలవాడు మస్తానయ్య.

4. మస్తాన్ బాబు ఏ తేదీన జన్మించాడు?
జవాబు:
మస్తాన్ బాబు 3.9. 1974వ తేదీన జన్మించాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

2. ఒకరోజు స్నేహితులతో కలిసి గుట్టలు ఎక్కడానికి వెళ్ళాడు. అదే అతడి పర్వతారోహణకు బీజం పడినరోజు. రాళ్ళు, ముళ్ళు దాటుకుంటూ కొండనెక్కడం అతనికి తెలియని ఆనందాన్నిచ్చింది. స్నేహితులంతా వంటచెరకు సేకరిస్తుంటే పొదల మధ్య కాలిబాట చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. చేతిలో ఉన్న కత్తితో నాగజెముడు పొదలు నరుకుతుంటే ఆ చెట్లకుండే తెల్లని పాలు చింది కళ్ళలో పడ్డాయి. అంతే కళ్ళు మండిపోతుంటే ఏడుస్తూ బాధ తట్టుకోలేక కిందపడి దొర్లసాగాడు. ఇంతలో స్నేహితులు వచ్చారు. అందరూ కలిసి వైద్యశాలకు తీసుకుపోయారు. ఈ వార్త తండ్రికి చేరింది. కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆసుపత్రికి చేరారు. డాక్టరు మందులిచ్చి | భయపడాల్సిందేమీ లేదని చెప్పి ఇంటికి పంపాడు.

ప్రశ్నలు:
1. మస్తాన్ గుట్టలు ఎక్కడానికి ఎవరితో వెళ్ళాడు?
జవాబు:
మస్తాన్ గుట్టలు ఎక్కడానికి స్నేహితులతో వెళ్ళాడు.

2. స్నేహితులందరూ మస్తాన్ ను ఎక్కడికి తీసుకొని వెళ్ళారు?
జవాబు:
స్నేహితులందరు మస్తాన్ ను వైద్యశాలకు తీసుకొని వెళ్ళారు.

3. ఏ పొదలను నరుకుతుంటే తెల్లని పాలు చిందాయి?
జవాబు:
నాగజెముడు పొదలను నరుకుతుంటే తెల్లని పాలు చిందాయి.

4. హూటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నది ఎవరు?
జవాబు:
హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.

3. 1962వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుండి ఐ.ఎ.యస్.కు ఎంపికయిన నాదెళ్ళ యుగంధర్ నాయుడిది అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామం. వీరి శ్రీమతి ప్రభావతి. ఈ దంపతులకు 1967లో సత్య నాదెళ్ళ జన్మించారు. కలెక్టరుగా, ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రణాళికాసంఘ సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేసిన యుగంధర్ మంచి అధికారిగా మన్ననలు అందుకున్నారు. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన సత్య బాల్యం నుంచే తెలివితేటలు ప్రదర్శించేవాడు. తండ్రికున్న కార్యదీక్షా లక్షణాల్ని పుణికిపుచ్చుకొని పెరిగాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిగా అందరితో కలవిడిగా ఉండడం, అందర్నీ కలుపుకొనిపోవడం, నిజాయితీగా వ్యవహరించడం, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయటం, అవసరాల్లో ఉన్నవారిని ఆదరించటం, చేయూతనివ్వడం లాంటి సర్వోన్నత లక్షణాలను అలవరుచుకున్నాడు. సత్యకు క్రికెట్ అంటే ఎంతో మక్కువ. క్రికెట్ జట్టులో సభ్యుడిగా, తన ప్రతిభను నిరూపించుకొని కెప్టెన్ గా కొనసాగాడు. క్రికెట్ బృందాన్ని సమన్వయపరిచే క్రమంలోనే నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నానని ఆటలు ఆడటం ద్వారా మాత్రమే ఒత్తిడిని అధిగమించడం, విజయం కోసం పోరాడడం వంటి గుణాలు అలవడతాయనీ తాను నమ్ముతానని ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ళ చెప్పారు. పాఠశాల విద్య పూర్తయిన తరువాత మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివి 1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బి.ఇ డిగ్రీ పొందారు. ఆ తరువాత అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సులో మాస్టర్స్ డిగ్రీ, షికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ పొందారు.
ప్రశ్నలు :
1. సత్య నాదెళ్ళ ఏ జిల్లాలో జన్మించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ అనంతపురంలో జన్మించాడు.

2. సత్య నాదెళ్ళ ఏ సంవత్సరంలో జన్మించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ 1967లో జన్మించాడు.

3. సత్య నాదెళ్ళకు ఏ ఆట అంటే ఇష్టం?
జవాబు:
సత్య నాదేళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.

4. షికాగో యూనివర్సిటీ నుండి ఏ డిగ్రీ పొందాడు?
జవాబు:
చికాగో యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మిని స్టేషన్లో మాస్టర్ డిగ్రీ పొందారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

4. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించటంతోపాటు మరింత కష్టపడవలసి ఉందని ఈ సందర్భంగా ‘సత్య’ వ్యాఖ్యానించాడు. టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ కి సి.ఇ.వో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఏడాదికి 112 కోట్ల వేతనం తీసుకునే ఉద్యోగిగా తమ సంస్థలో నవకల్పనలకే పెద్దపీట వేస్తామని చెప్పారు. సత్య నాదెళ్ళ జీవితభాగస్వామి శ్రీమతి అనుపమ. వీరికి ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటం వల్ల అలాంటి పిల్లల కొరకు హైదరాబాద్ లో ఒక పాఠశాలను స్థాపించారు. ‘నేను నిర్మించటాన్ని, నిరంతరం నేర్చుకోవడాన్ని ఇష్టపడతాను. పట్టుదల, కార్యదక్షత, నిజాయితి, నాయకత్వం, సేవాభావం అనే లక్షణాలను సాధించినపుడే ఎంతటి క్లిష్టమైన విజయశిఖరాలనైనా అధిరోహించగలుగుతాం” అంటూ ఆ చరిత్రని నిరూపించిన సత్య నాదెళ్ళ నేటి యువతరానికి చక్కని రోల్ మోడల్.
ప్రశ్నలు :
1. సత్య నాదెళ్ళ జీవిత భాగస్వామి పేరు ఏది?
జవాబు:
సత్య నాదేళ్ళ జీవిత భాగస్వామి పేరు శ్రీమతి అనుపమ.

2. సత్య నాదెళ్ళ ఎవరి కోసం హైదరాబాద్ లో పాఠశాలను ప్రారంభించాడు?
జవాబు:
సత్య నాదేళ్ళ బుద్ధిమాంద్యం గల పిల్లల కోసం ఒక పాఠశాలను స్థాపించాడు.

3. సత్య నాదెళ్ళకు ఏడాదికి జీతం ఎంత?
జవాబు:
సత్య నాదేళ్ళకు ఏడాదికి జీతం 112 కోట్లు.

4. టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చివేసిన అరుదైన సంస్థలలో అగ్రగామి సంస్థ ఏది?
జవాబు:
టెక్నాలజీ ప్రపంచాన్నే మార్చివేసిన అరుదైన సంస్థలలో అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్.

5. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, తుమ్మపూడి గ్రామంలో కీ.శే. సూర్యదేవర రామదేవరాయలు, వెంకాయమ్మ దంపతులకు 1914వ సంవత్సరం జూలై నెల 3వ తేదీన సంజీవ్ దేవ్ జన్మించాడు. నాలుగేళ్ళ వయస్సులోనే అతని తల్లి మరణించింది. కొంతకాలం వారి చిన్నాన్న సూర్యదేవర వెంకటకృష్ణయ్యగారివద్ద పెరిగాడు. ఆ తరువాత కృష్ణాజిల్లాలోని కోనాయపాలెంలో అమ్మమ్మ సంరక్షణలో మేనమామ ఇంట పెరిగాడు. విద్యాభ్యాసమంతా ఇంటి దగ్గరే కొనసాగింది. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపేవాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో చక్కని ప్రావీణ్యం సంపాదించాడు. అయితే 13 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి తనను గారాబంగా పెంచుతున్న ” అమ్మమ్మ కూడా చనిపోయింది. మరికొంతకాలానికి తాను అమితంగా ప్రేమించే తన గారాల చెల్లి కూడా చనిపోవడంతో జీవితంలో విషాదం తప్ప మరేమీ మిగలలేదని తల్లడిల్లిపోయాడు. అక్కున చేర్చుకుని అదరించేవారు లేక ఒంటరితనాన్ని భరించలేక 18 సంవత్సరాల వయస్సులో హిమాలయాలకు వెళ్ళిపోయాడు.
ప్రశ్నలు:
1. సంజీవ్ దేవ్ ఎక్కడ జన్మించాడు?
జవాబు:
సంజీవ్ దేవ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మకూరు గ్రామంలో జన్మించాడు.

2. సంజీవ్ తల్లిదండ్రుల పేర్లు ఏమి?
జవాబు:
సంజీవ్ తల్లిదండ్రుల పేర్లు సూర్యదేవర రామ దేవరాయలు, వెంకాయమ్మ.

3. సంజీవ్ కు ఏ భాషల్లో ప్రావీణ్యం ఉంది?
జవాబు:
సంజీవ్ కు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం ఉంది.

4. సంజీవ్ ఎందుకు హిమాలయాలకు వెళ్ళాడు?
జవాబు:
సంజీవ్ ఒంటరితనాన్ని భరించలేక తన 18వ సంవత్సరంలో హిమాలయాలకు వెళ్ళాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

6. అనేక భాషలను సొంతంగా నేర్చుకుని బహుభాషావేత్తగా రూపొందినట్లుగానే చిత్రకళను కూడా సొంతంగా అభ్యసించి చిత్రకారుడయ్యాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా ముందు చిత్రకళా విమర్శకుడై యాభై సంవత్సరాల వయస్సు దాటాక కుంచె చేతపట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు. సాహిత్యాన్ని, చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని, శిల్పాన్ని గురించి విడివిడిగా వివరించడమేకాక లలితకళలన్నింటిలోను అంతర్లీనంగా ఉన్న సంబంధ బాంధవ్యాలను, తాత్వికతలను తులనాత్మకంగా విశ్లేషించారు. ఆయన ప్రతిభను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం డి.లిట్ తో సత్కరించింది. కళలు, సాహిత్యం , సమాజ అభ్యున్నతికి దోహదపడేవిగా ఉండాలని కాంక్షించి జీవితాంతం దానికోసమే కృషిచేసిన కళాతత్వవేత్త సంజీవ్ దేవ్ 25-8-1999న ఇహలోక యాత్రను ముగించాడు. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్వయంకృషితో అద్భుత ప్రతిభను ప్రదర్శించిన సంజీవ్ దేవ్ జీవనవిధానం మనందరికీ ఆనంద దాయకం
ప్రశ్నలు :
1. సంజీవ్ చిత్రకళను ఎలా అభ్యసించాడు?
జవాబు:
సంజీవ్ చిత్రకళను సొంతంగా అభ్యసించి చిత్రకళా కారుడయ్యాడు.

2. దేనిని చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు?
జవాబు:
కుంచె చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు.

3. సంజీవ్ ను సత్కరించిన విశ్వవిద్యాలయం ఏది?
జవాబు:
సంజీవ్ ను సత్కరించిన విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం.

4. సంజీవ్ ఏ తేదీన మరణించాడు?
జవాబు:
సంజీవ్ 25-8-1999న మరణించాడు.

7. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

సీతారామరాజు 1897లో పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో క్షత్రియ కుటుంబంలో జన్మించారు. గుర్రపుస్వారీ, మూలికావైద్యం, జ్యోతిష్యంలో పట్టు సంపాదించాడు. ఆంగ్లేయుల విధానాలకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో 1922 నుంచి 1924 మే వరకు తెగువతో పోరాడిన వీరుడు సీతారామరాజు. అన్నవరం, శంఖవరం, రంపచోడవరం పోలీస్ రాణాలపై దాడిచేసి ఆంగ్లేయులకు చెమటలు పట్టించాడు. ఈ మన్యం వీరుని కుతంత్రంతో చుట్టుముట్టి రూథర్‌ఫోర్డ్ నేతృత్వంలోని సేనలు కాల్చి చంపాయి.
ప్రశ్నలు :
1. సీతారామరాజు జన్మస్థలం ఏది?
జవాబు:
పశ్చిమ గోదావరి జిల్లా ‘మోగల్లు’.

2. సీతారామరాజుకు ఏ విషయాలలో పట్టు ఉంది?
జవాబు:
గుర్రపుస్వారీ, మూలికా వైద్యం, జ్యోతిష్యంలో

3. ఆంగ్లేయులకు ఏ కారణంతో ఆగ్రహం కలిగింది?
జవాబు:
వీరి విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, వారి పోలీస్ ఠాణాలపై దాడి చేయడం వల్ల.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
సీతారామరాజును ఎవరి నేతృత్వంలోని సేనలు కాల్చాయి?

8. కింది సంభాషణ చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పద్మావతి : మిత్రులారా ! బాగున్నారా !
పూజిత : బాగున్నాము. మీ పాఠశాలలో జూలై 4న ఏదో ఉత్సవం జరిపినట్లున్నారు. ఏమిటది?
పద్మావతి : అవును. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించాము.
పూజిత : మీ పాఠశాలలో ఆయన జయంతిని ఎలా నిర్వహించారు?
పద్మావతి : ఆ రోజు ఉదయం పాఠశాల ప్రార్థనా సమావేశంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాం.
హరిత : మా ప్రధానోపాధ్యాయుల వారు అల్లూరి వారిని గురించి చెప్పి రంప విప్లవాన్ని వారు నడిపిన తీరు, ధైర్యాన్ని గురించి వివరించారు.
పూజిత : అలాగా ! ఆ మహావీరుని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి?
పద్మావతి : పాఠశాల గ్రంథాలయాలలో ఆ వీరుని జీవితచరిత్ర గురించి శ్రీ ఎం.వి.ఆర్. శాస్త్రి, శ్రీ ఎం. చలపతిరావు వంటివారు రాసిన పుస్తకాలున్నాయి చదువు.
పూజిత : అలాగే !
హరిత : నా దగ్గర పుస్తకం ఉంది ఇమ్మంటారా?
పూజిత : ఇవ్వు. చదివి మళ్ళీ ఇచ్చేస్తాను. ఉంటాను.
ప్రశ్నలు :
1. పై సంభాషణలో ‘పుట్టిన రోజు’ అనే అర్థం వచ్చే పదం ఉంది. వెతికి రాయండి.
జవాబు:
జయంతి.

2. అల్లూరి సీతారామరాజు నడిపిన విప్లవోద్యమం ఏది?
జవాబు:
రంప విప్లవోద్యమం.

3. పై సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది?
జవాబు:
పద్మావతి, పూజిత, హరితల మధ్య సంభాషణ జరిగింది.

4. చనిపోయిన ప్రముఖుల పట్ల గౌరవం, అభిమానం ప్రకటిస్తూ మాట్లాడే మాటలను ఏమంటారు?
జవాబు:
నివాళులు అర్పించడం.

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి.

ప్రశ్న 1.
సాహసవీరుడు మస్తాన్ బాబు జీవితచరిత్ర నుండి మీరేమి నేర్చుకున్నారు?
జవాబు:
మన రాష్ట్రంలో ఎందరో సాహసవీరులు ఉన్నారు. వారిలో మస్తాన్‌బాబు ప్రసిద్ధుడు. ఈయన జీవిత చరిత్ర అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మస్తాన్‌బాబు నెల్లూరు జిల్లాలోని ఒక కుగ్రామంలో 3-9-1974వ తేదీన జన్మించారు. వీరిది నిరుపేద కుటుంబం. తండ్రి అక్షర జ్ఞానం కలవాడు. చదువు విలువ తెలిసినవాడు. అందువల్లనే మస్తాన్ బాబు చదువుకోసం ఎంతో కష్టపడ్డారు.

మస్తాన్ బాబు మాత్రం చదువుపట్ల ఆసక్తి చూపేవాడు కాదు. తండ్రి మందలించినా వినిపించుకోలేదు. అల్లరిచిల్లరగా తిరిగేవాడు. తండ్రి ఆందోళన చెంది మస్తాన్ బాబును కోరుకొండ సైనిక స్కూలులో చేర్పించాడు. మస్తాన్ బాబు స్కూల్ లోని ఉదయ్ భాస్కర్ విగ్రహాన్ని తదేకంగా చూశాడు. ఉదయ్ భాస్కర్ ఆ పాఠశాల పూర్వ విద్యార్థి. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహనీయుడు.

మస్తాన్ ఐ.ఐ.టిలో బి.టెక్ లో చేరాడు. తండ్రి ఎన్నో ఇబ్బందులు పడి కుమారుడిని చదివించాడు. చదువు పూర్తికాగానే సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. ఇంతలోనే తండ్రి మరణం మస్తాన్ ని బాగా కుంగదీసింది. లక్షలాది జీతాన్ని కూడా వదులుకొని తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాడు. అందుకోసం గంధోతిలోయను చేరాడు. దాని కోసం కొత్త సాధన చేశాడు. శారీరకంగా శ్రమ చేశాడు. హిమాలయాల్లోని కాంచనగంగ కనుమలను చేరుకున్నాడు. శ్రమించి ఎవరెస్టు శిఖరంపై కాలుమోపాడు. జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు. నాలుగు శిఖరాలను దాటి తిరిగివస్తుండగా 600 కి.మీ. దిగువన మంచు తుపాను భయంకరంగా వచ్చింది. మస్తాన్ తలదాచుకున్న గుడారాన్ని కబళించి వేసింది. ఏ పర్వతాలను ప్రాణప్రదంగా భావించాడో ఆ పర్వాతాలలోనే తనువు చాలించాడు. దేశమంతా ఆ సాహసవీరునికి నివాళులను అర్పించింది.

ఈ విధంగా మస్తాన్ ఎన్నో కష్టాలను అనుభవించి చివరకు లక్ష్యం చేరుకున్నాడు. లక్షల రూపాయల ఉద్యోగాన్ని వదులుకున్నాడు. తాను కలలుకన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. వీరమరణం పొందాడు. ఆ మహనీయుని కార్యదక్షత, దృఢసంకల్పం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకం కావాలి. తింటానికి తిండి లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగులేకపోయినా అందరితో కలిసిమెలిసి నవ్వుతూ ఉండడం మనం తప్పక నేర్చుకోవాలి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 2.
కార్యదక్షత, దృఢసంకల్పం మనకు మార్గదర్శనం చేస్తాయి. చర్చించండి.
జవాబు:
కార్యదక్షత, దృఢసంకల్పం మనకు మార్గదర్శనం చేస్తాయి. ఎందుకంటే ఒక పనిని సాధించాలంటే ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటిది లక్ష్యం సాధించాలంటే ఎంతో శ్రమచేయవలసి ఉంటుంది. అన్ని పరిస్థితులు, సదుపాయాలు, అవకాశాలు సరిగ్గా ఉంటే లక్ష్యసాధన సులభం అవుతుంది. లక్ష్యం అనేది ఉన్నతంగా ఉంటే, దాన్ని సాధించడానికి ఎన్నో ఆటంకాలు, సమస్యలు ఎదురవుతాయి. వాటిని చాకచక్యంగా ఎదుర్కొని విజయాన్ని వరించాలి. కార్యదీక్ష, పట్టుదల ఉంటే ఎంతటి అసాధ్యాలను అయినా సుసాధ్యం చేయగలమని నమ్మాలి.

ఇలాంటి కార్యదక్షత, దృఢసంకల్పం గల వారిలో పర్వతారోహకుడు మస్తాన్‌వలి ప్రముఖుడు. కుటుంబ పరిస్థితులు బాగులేకపోయిన, ఆర్థిక పరిస్థితులు అడ్డంకులుగా నిలిచినా వాటిని లెక్కచేయలేదు. లక్షలాది రూపాయల ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా భావించాడు. తాను కలలుగన్న పర్వతారోహణను చేయాలనుకున్నాడు. ఉద్యోగాన్ని వదులుకున్నాడు. శారీరకంగా కృషి చేశాడు. ఎన్నో ఇబ్బందులను పడి చివరకు లక్ష్యాన్ని చేరుకున్నాడు. అందరికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు.

ఆయన కార్యదీక్ష, దృఢసంకల్పం అందరికి ఆదర్శంగా నిలిచింది. లక్ష్యాన్ని సాధించి తిరుగుప్రయాణంలో తన ప్రాణాలను కోల్పోయాడు. తాను బాగా ప్రేమించిన శిఖరాలపైనే వీరమరణం పొందారు. మస్తాన్‌బాబు నుంచి విద్యార్థులందరు స్ఫూర్తి పొందాలి. కార్యదీక్షపై శ్రద్ధ వహించాలి. కష్టాలను అధిగమించే మనస్సును పెంపొందించుకోవాలి. అందరికి ఆదర్శంగా నిలవాలి. ఇదే మన ముందు తరాలకు అందించే గొప్ప కానుక.

ప్రశ్న 3.
సత్య నాదెళ్ళ వ్యాపారదిగ్గజంగా మారడానికి తోడ్పడిన అంశాలేమిటి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంది మేధావులు ఉన్నారు. వారు ప్రపంచంలోని వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తెలుగువారి మేధాసంపత్తిని దశదిశలా విస్తరింపజేశారు. వారిలో సత్య నాదెళ్ళ సుప్రసిద్ధులు. ఈయన వైఫల్యాలను ఎదుర్కొనడమేగాదు, వైఫల్యాల నుండి ఏమి నేర్చుకున్నామనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు.

సత్య నాదెళ్ళ 1967లో అనంతపురంలో విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. అందువలనే చిన్నతనం నుండే అన్ని విషయాలలోనూ అసమాన ప్రతిభను కనబరిచేవాడు. తండ్రి నుండి కార్యదక్షను పుణికిపుచ్చుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం, అవసరాల్లో ఆదుకోవడం మొదలైన ఉత్తమ లక్షణాలు ఇతనిలో ఉన్నాయి. ఒత్తిడిని అధిగమించగలిగే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకున్నాడు. దేశవిదేశాల్లో విద్యను పూర్తి చేశాడు. వ్యాపార రంగంలో మాస్టర్ డిగ్రీ పొందారు.

వీరి ప్రతిభను గుర్తించి ఎన్నో సంస్థలు ఉద్యోగంలో చేరమని ఆహ్వానించాయి. 1992లో మైక్రోసాఫ్ట్ వ్యాపార సేవల రంగంలో కీలకపాత్ర పోషించాడు. ఐదేళ్ళలో కంపెనీ వ్యాపారాన్ని 6 వేల కోట్ల నుండి 31 వేల కోట్లకు దాటించాడు. కొంత కాలం బిల్ గేట్సకు టెక్నాలజీ సలహాదారుగా ఉన్నాడు. ఆధునాతన సాఫ్ట్ వేర్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈయన కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. అకుంఠితమైన సత్య నాదెళ్ళ కార్యదీక్ష అందరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

ఈయనకు గల అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, నిరంతర దీక్ష, నాయకత్వ ధోరణి ఇవన్నీ అందరినీ ఆకర్షించాయి. ఏడాదికి 112 కోట్ల వేతనం తీసుకునే ఉద్యోగిగా ఎంతో గర్వించారు. ఈయన సేవల వల్ల సాఫ్ట్ వేర్ ఎంతో ఘనత సాధించింది. కరెంటు బిల్లు నుండి క్రయోజనిక్ రాకెట్ ఇంజన్ దాకా ప్రతిచోటా సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. కంప్యూటర్ అక్షరాస్యత అవసరంగా మారిన కాలం ఇది. ఈయనకు గల పట్టుదల, కార్యదక్షత, నిజాయితి, నాయకత్వం, సేవాభావం అనే లక్షణాలే ఈయనకు విజయశిఖరాలు అధిరోహించేలా చేశాయి.

ప్రశ్న 4.
డా|| సంజీవ్ దేవ్ తమ రచనలు, చిత్రాల ద్వారా సమాజానికి ఏమి తెలియజేస్తున్నారని మీరు భావిస్తున్నారు?
జవాబు:
ప్రకృతే మనకు గురువు, దైవం, ఆప్తమిత్రుడు. మనకు ఎదురయ్యే సమస్యలన్నింటికీ ప్రకృతి నుండే పరిష్కారం లభిస్తుంది. ప్రకృతిని ప్రేమించగలిగితే ప్రజాజీవితం సాధ్యమవుతుందని విశ్వసించే వారిలో ముఖ్యుడు డా|| సంజీవ్ దేవ్. వీరు 3. 7.1914వ తేదిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం – తుమ్మకూరు గ్రామంలో జన్మించాడు. వీరు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపేవారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు.

18 సంవత్సరాల వయసులో హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ స్వామి పవిత్రానంద దగ్గర శిష్యరికం చేస్తూ పాశ్చాత్య తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. మానవ జీవితం గురించి, ప్రకృతి గురించి పరిశోధన చేశాడు.

డా|| సంజీవ్ దేవ్ ఈ ప్రయాణంలో ఎందరో ప్రముఖులను కలిశాడు. ఈయన గొప్ప ప్రకృతి ప్రేమికుడు కావడంతో కవిగానే కాకుండా చిత్రకళా విమర్శకునిగా కూడా పేరు పొందాడు. కొంతకాలం తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వచ్చి సొంత ఊరిని మించిన స్వర్గం లేదని భావించాడు. తనకు సన్నిహితులైన చిత్రకారుడు ఎస్.వి. రామారావు, భావకవి కృష్ణశాస్త్రి, నవలారచయిత చలం, కథారచయిత బుచ్చిబాబు మొదలగువారితో కవిత్వ చర్చలు చేసేవారు.

ఈయన గొప్ప మానవతావాది. దేశవిదేశాల నుండి ఎంతోమంది భిన్న అంశాలపై ఆయనకు ఉత్తరాలు రాసేవారు. గొప్ప లేఖా రచయిత కావడంతో వారందరికీ ఓపికగా ప్రత్యుత్తరాలిస్తూ సందేహ నివృత్తి చేసేవారు. ఈయన మనం ఆనందంగా జీవించడంతోపాటు ఇతరులను కూడా సంతోషపెట్టడమే సర్వమతాలసారం అని ప్రకటించారు. ఈయన కవి, చిత్రకారుడు మాత్రమే కాదు గొప్ప మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కూడా.

డా|| దేవ్ గారు ఎన్నో భాషలను నేర్చుకున్నారు. బహుభాషావేత్తగా, విమర్శకుడిగా గుర్తింపు పొందారు. కుంచె చేతబట్టి అద్భుతమైన వర్ణచిత్రాలను రూపొందించాడు. సాహిత్యాన్ని, చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని, శిల్పాన్ని గురించి విడివిడిగా వివరించడమే కాకుండా లలితకళలన్నింటిలోను అంతర్లీనంగా ఉన్న సంబంధ బాంధవ్యాలను తాత్వికతలను తులనాత్మకంగా విశ్లేషించు వీరు 25.8.1999న పరమపదించారు. వీరు స్వయంకృషితో, ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వీరి జీవనవిధానం అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ మహామనీషి మరణించినా వీరి రచనలు, చిత్రాలు, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 5.
మన జీవితానికి స్ఫూర్తినిచ్చేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరి గురించి రాయండి.
జవాబు:
మన జీవితానికి స్ఫూర్తినిచ్చేవారు ఎందరో ఉన్నారు. అలనాటి రాముడు మొదలుకొని గాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖులే కాక వెలుగులోకి రాని మహనీయులు ఎందరో ఉన్నారు. ఎందరు ఉన్నా నా తొలి ప్రాధాన్యం మాత్రం అమ్మానాన్నలే. వారే లేకపోతే మనం ఎక్కడున్నాం, ఎవరో ఒకరి పేరు పెట్టి ఏదో ఒకటి రాయవచ్చు. కానీ అమ్మనాన్నల గొప్పదనాన్ని గుర్తించి కూడా వేరొకర్ని కీర్తించడం సబబేనా ? కాదు కదా ! అందుకే మరి మా అమ్మా నాన్నల గురించి చెబితే స్వార్థం అంటారుగా. అందుకే వారిని మనసులో తలుచుకొంటూ వారి స్థానాన్ని, వారి ప్రేమను మీ ముందుంచుతాను.

ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది అమ్మ అయితే, ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు నాన్న. కన్ను మూసే వరకు ప్రేమించేది అమ్మ. కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది నాన్న. జీవితం అమ్మది. జీవనం నాన్నది. ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది. ఆకలి విలువ తెలిసేలా నాన్న చేస్తాడు. అమ్మ భద్రత. నాన్న బాధ్యత. పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది. పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు. నడక అమ్మది. నడవడిక నాన్నది. తన అనుభవాలను విద్యలా అమ్మ బోధిస్తే, నీ అనుభవమే విద్య అని తెలిసేలా చేస్తాడు నాన్న. అమ్మ ఆలోచనైతే, నాన్న ఆచరణ.

అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకోగలవు. కానీ నాన్న ప్రేమను నువ్వు నాన్నవు అయ్యాకే తెలుసుకోగలవు మిత్రమా !

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson జీవ గడియారాలు

8th Class Telugu ఉపవాచకం 5th Lesson జీవ గడియారాలు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. చురుకుగా ఉండే సమయాన్ని ఆధారం చేసుకొని జంతు ప్రపంచంలోని జంతువులను రెండు వర్గాలుగా విభజించారు. దివాచరాలు-పగలు చురుగ్గా ఉండేవి. నిశాచరాలు – రాత్రివేళ చురుగ్గా ఉండేవి.

మన ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలు, దోమలు ఇత్యాదులు రాత్రివేళ మాత్రమే బయటకు వస్తాయి. పగలు విశ్రాంతి తీసుకుంటాయి. పిచ్చుకలు, కాకులు, ఆవులు, ఇతర జంతువులు పగలు చురుగ్గా ఉంటాయి. మానవునితో సహవాసం చేస్తున్నందుకుగాను కుక్క పిల్లి వంటి జంతువులు పగటివేళ మేలుకుని ఉన్నా, రాత్రిళ్లు మాత్రం చురుగ్గా ఉంటాయి. కారణం సహజసిద్ధంగా అవి రాత్రిళ్లు ఆహారం కోసం వేటాడతాయి. ఈ జీవులను శాస్త్రవేత్తలు రకరకాల పరీక్షలకు గురిచేసారు. ఉదాహరణకు రాత్రిపూట సంచరించే గబ్బిలాన్ని పగటి సమయంలో చీకటి గదిలో ఉంచడం, పగటిపూట సంచరించే ఉడతను రాత్రిపూట పగటిలా వెలుగులో వుంచడం వంటివి. అన్ని పరీక్షలలోనూ, జీవులన్నీ, ఈ దైనందిన లయలను నిర్దిష్ట క్రమంలోనే ప్రదర్శిస్తాయి అని రుజువైంది.
ప్రశ్నలు :
1. గబ్బిలాలు పగటిపూట ఏ గదిలో ఉంటాయి?
జవాబు:
గబ్బిలాలు పగటిపూట చీకటిగదిలో ఉంటాయి.

2. పగలు మాత్రమే విశ్రాంతి తీసుకునే జంతువులు ఏవి?
జవాబు:
ఎలుకలు, బొద్దింకలు, కోతులు మొదలైనవి పగలు విశ్రాంతి తీసుకుంటాయి.

3. రాత్రిళ్ళు ఆహారం కోసం వేటాడే జంతువులు ఏవి?
జవాబు:
రాత్రిళ్ళు ఆహారం కోసం వేటాడే జంతువులు కుక్కలు, పిల్లులు.

4. ప్రపంచంలోని జంతువులను ఎన్ని వర్గాలుగా విభజించారు?
జవాబు:
ప్రపంచంలోని జంతువులను రెండు వర్గాలుగా విభజించారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

2. ఈ దైనందిన లయలు జంతువులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మొక్కలలో కూడా ఇవి ఉంటాయి. కొన్ని చెట్ల ఆకులు మన మాదిరిగా రాత్రికాగానే నిద్రపోయి తెల్లవారగానే మేలుకుంటాయి. చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కలలో ఆకులు ఉదయం నిక్కబొడుచుకొని ఉండి, సాయంత్రానికి వాలిపోతాయి. అలాగే పూలు వికసించడం కూడా. ఈ మొక్కలను పూర్తిగా చీకటిలో ఉంచినా, లేదా 24 గంటలూ వెలుగులో ఉంచినా వాటి పనిలో మార్పురాదు. ఒక మల్లెపూవును పగటివేళ కటిక చీకటిగదిలో ఉంచినా కూడా వికసింపచేయడం సాధ్యం కాదు. ఈ విధంగా సూర్యుని వెలుతురు ఆధారం చేసుకొని జీవులు చూపే, ఈ మార్పులను పగటిలయలు – ‘డయర్నల్ రిథమ్స్’ అంటారు.
ప్రశ్నలు:
1. ఏ పూవును పగటివేళ, కటికచీకటి గదిలో ఉంచినా వికసింపచేయడం సాధ్యం కాదు?
జవాబు:
మల్లెపూవును పగటివేళ కటిక చీకటిలో ఉంచినా వికసింపచేయడం సాధ్యం కాదు.

2. జీవగడియారాలకు గల మరొక పేరు ఏమి?
జవాబు:
జీవగడియారాలకు గల మరొక పేరు శరీరధర్మ గడియారాలు.

3. లయలు జంతువులకు మాత్రమే కాకుండా వేటికి ఉంటాయి?
జవాబు:
లయలు జంతువులకు మాత్రమే కాకుండా మొక్కలకు కూడా ఉంటాయి.

4. ఏ జాతికి చెందిన ఆకులు ఉదయం పూట నిక్కపొడుచుకొని ఉంటాయి?
జవాబు:
చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కల ఆకులు ఉదయం పూట నిక్కపొడుచుకొని ఉంటాయి.

3. సీతాకోకచిలుకలు పుట్టిన వెంటనే సూర్యతాపానికి గురికాకుండా ఉండడానికి తెల్లవారుఝామునే ప్యూపా నుండి బయటకు వస్తాయి. కీటకాలు మకరందం లభించే సమాయల్లో చురుగ్గా ఉంటాయి. మొక్కలు కూడా కీటకాలు చురుగ్గా ఉండే సమయాల్లోనే పుష్పాలు వికసింపచేస్తాయి. ఇది పరస్పర సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.

ఒక జీవి పుట్టిన నాటి నుండి ఏర్పడిన ఈ లయలు, ఆ జీవి బాహ్యపరిస్థిలులు మారినా లయలు మాత్రం మారవు. అందుకే కాబోలు పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతో కానిపోవు అంటారు మనవాళ్లు.
ప్రశ్నలు:
1. సీతాకోకచిలుకలు ఎందుకోసం ప్యూపా నుండి బయటకు వస్తాయి?
జవాబు:
సీతాకోక చిలుకలో సూర్యతాపానికి గురికాకుండా ఉండడానికి వీలుగా ప్యూపా నుండి బయటకు వస్తాయి.

2. కీటకాలు ఏ సమయాల్లో చురుగ్గా ఉంటాయి?
జవాబు:
కీటకాలు మకరందం లభించిన సమయాల్లో చురుగ్గా ఉంటాయి.

3. ఈ పేరాలోని సామెత ఏది?
జవాబు:
ఈ పేరాలోని సామెత – “పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానిపోవు”.

4. మొక్కలు ఏ సమయాల్లో పూలను వికసింపచేస్తాయి?
జవాబు:
మొక్కలు కీటకాలు చురుగ్గా ఉండే సమయాల్లో పుష్పాలు వికసింపచేస్తాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

4. సముద్రపు ఒడ్డున నివసించే ఫిడ్లర్ క్రాబ్’ అనే వాయులీన పీత, ఉదయం ముదురు రంగులో ఉండి, రాత్రిళ్ళు లేతరంగులకు మారిపోతుంది. బహుశః శత్రువులనుండి రక్షించుకోవడానికి కాబోలు ఈ రంగులు మార్చడం, దాన్ని ఎప్పుడూ వెలుతురు ఉండే ఎ.సి.గదిలోకి మార్చినా, రంగుల మార్పిడిలో మాత్రం తేడా రాలేదు. అంటే సూర్యునితో సంబంధం లేకుండానే ఈ లయ కొనసాగుతుందన్నమాట. “పీత కష్టాలు పీతవి”. అలాగే నిద్రగన్నేరు మొక్కలో ఆకుల కదలిక ఈ కోవకు చెందినదే.

మానవులలో ఆహారం తీసుకోవడం ఒక అలవాటుగా మారడం వలన ఈ లయలో కొంత మార్పు ఉండవచ్చు. ప్రతిరోజూ నియమబద్ధంగా ఆహారం తీసుకొనే వారికి, నిర్ణీత సమయానికే ఆకలి వేస్తుంది. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేసేవారికి రోజులో ఒకసారి మాత్రమే ఆకలి వేస్తుంది. అలాగే నిద్ర, మెలకువ కూడా,
ప్రశ్నలు :
1. సముద్రపు ఒడ్డున నివసించే వాయులీన పీత పేరు ఏమి?
జవాబు:
సముద్రపు ఒడ్డున నివసించే వాయులీన కేత ఫిడ్లర్ క్రాబ్.

2. వాయులీన పీత ఎందుకు రంగులను మార్చుకుంటుంది?
జవాబు:
వాయులీన పీత శత్రువుల నుండి రక్షించుకోవడానికి రంగులను మారుస్తుంది.

3. నిర్ణీత సమయానికి ఎవరికి ఆకలి వేస్తుంది?
జవాబు:
ప్రతిరోజు నియమబద్ధంగా ఆహారం తీసుకొనే వారికి నిర్ణీత సమయానికి ఆకలి వేస్తుంది.

4. సంవత్సరం పొడవునా ఏవి సమానంగా ఉండవు?
జవాబు:
సంవత్సరం పొడవునా పగలు, రాత్రి సమానంగా ఉండవు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

5. మొక్కలు చైతన్యవంతంగా ఉన్నప్పుడే పోషకాలు అందించడం ద్వారా వృధావ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడి సాధించవచ్చు. చేపలు, రొయ్యలు ఎప్పుడు ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటాయో, తెలియడం వలన చేపల చెరువు శుభ్రంగా ఉండటమే కాక వృధా వ్యయం తగ్గుతుంది. కోళ్ల ఫారంలో ఎక్కువ సమయం వెలుగు ఉంచడం వలన గ్రుడ్లు ఉత్పత్తి పెరగడం రైతులందరికీ తెలిసిందే. పగలు తక్కువ ఉన్న కాలంలో గొర్రెలలో ఉన్ని ఎక్కువవుతుంది. కాబట్టి ఎండాకాలం చీకటిలో ఉంచడం వలన ఉన్ని ఉత్పత్తి ఎక్కువ చేయవచ్చు. ఇక మన సంగతి, రక్తంలో కొలెస్టరాల్, గ్లూకోజ్ శాతం లయబద్ధంగా మారుతుంటుంది. కాబట్టి ఏ సమయంలో మనం మందులు వాడితే పూర్తి స్థాయిలో ఫలితం ఉంటుందో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఆస్తమా రోగులలో రాత్రిళ్లు శ్వాస సమస్యలు అధికమౌతాయి. అందుచేత ఎడ్రినలిన్ అనే ఇంజక్షన్ రాత్రిళ్ళు ఇస్తారు. అలాగే ఇన్సులిన్ ఇంజక్షన్ రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగినపుడే ఇవ్వాలి.
ప్రశ్నలు:
1. ఏ రకంగా మొక్కల నుండి అధిక దిగుబడిని సాధించవచ్చు?
జవాబు:
మొక్కలు చైతన్యవంతంగా ఉన్నప్పుడే పోషకాలు అందించడం ద్వారా వృధా వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడిని సాధింపవచ్చు.

2. గొర్రెలలో ఎప్పుడు ఉన్ని ఎక్కువగా ఉంటుంది?
జవాబు:
గొర్రెలలో పగలు తక్కువ ఉన్న కాలంలో ఉన్ని ఎక్కువగా ఉంటుంది.

3. ఆస్తమా రోగుల్లో రాత్రిళ్ళు ఏ సమస్యలు అధికం అవుతాయి?
జవాబు:
ఆస్తమా ఉన్న రోగుల్లో రాత్రిళ్ళు శ్వాససంబంధమైన సమస్యలు అధికమౌతాయి.

4. ఇన్సులిన్ ఇంజక్షన్ ఎప్పుడు ఇవ్వాలి?
జవాబు:
ఇన్సులిన్ ఇంజక్షన్ రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగినప్పుడే ఇవ్వాలి.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి.

ప్రశ్న 1.
డయర్నల్ రిథమ్స్ అంటే ఏమిటి? వివరించండి.
జవాబు:
భూమిపై నివసించే జీవులన్నింటిలో జరిగే కార్యకలాపాలు నిర్ణీత సమయాలను అనుసరించి ఆవృత్తి అవుతుంటాయి. మానవులలో ఎన్ని గంటలకు నిద్రపోవాలి? ఎన్ని గంటలకు నిద్రలేవాలి? ఎప్పుడు భోజనం చేయాలి ? అనే విషయాలు మనం ఆరేడు నెలల వయసులో ఉన్నప్పుడే స్థిరపడిపోతాయి. ఈ గడియారాలు మనకు కనిపించకపోయినా వాటి ప్రభావం తెలుస్తూనే ఉంటుంది. మనకు అనుభవంలోకి వచ్చే, మనకు కనపించకుండా మన శరీరంలో ఉన్న ఈ జీవగడియారాలే మూలం.

మానవుల్లాగే జంతువులు కూడా ఈ భూమ్మీద తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. జంతువుల విషయానికొస్తే చురుకుగా ఉండే సమయాన్ని ఆధారం చేసుకొని జంతు ప్రపంచంలోని జంతువులను రెండు వర్గాలుగా విభజించారు. అవి :
1) దివాచరాలు (పగలు చురుగ్గా ఉండేవి)
2) నిశాచరాలు (రాత్రివేళ చురుగ్గా ఉండేవి)

మన ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలు, దోమలు, ఇత్యాదులు రాత్రివేళ మాత్రమే బయటకు వస్తాయి. పగలు ఇవి విశ్రాంతి తీసుకుంటాయి. పిచ్చుకలు, కాకులు, ఆవులు, ఇతర జంతువులు పగలు చురుగ్గా ఉంటాయి. కుక్క పిల్లి వంటి జంతువులు పగటివేళ మేలుకుని ఉన్నా, రాత్రిళ్ళు ఆహారం కోసం వేటాడతాయి. ఈ జీవులను శాస్త్రవేత్తలు రకరకాలుగా పరీక్షలు చేశారు. ఉదాహరణకు రాత్రిపూట సంచరించే గబ్బిలాన్ని పగటి సమయంలో చీకటి గదిలో ఉంచడు. పగటిపూట సంచరించే ఉడతను రాత్రిపూట పగటిలా వెలుగులో ఉంచడం వంటివి. అన్ని పరీక్షలలోనూ, జీవులన్నీ ఈ దైనందిన లయలను నిర్దిష్ట క్రమంలోనే ప్రదర్శిస్తాయని ఋజువైంది.

ఈ దైనందిన లయలు జంతువులకు పరిమితం అనుకుంటే పొరపాటే. మొక్కలలో కూడా ఇవి ఉంటాయి. కొన్ని చెట్ల ఆకులు మన మాదిరిగానే రాత్రికాగానే నిద్రపోయి తెల్లవారగానే మేలుకుంటాయి. చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కలలో ఆకులు ఉదయం నిక్కబొడుచుకుని ఉండి, సాయంత్రానికి వాలిపోతాయి. అలాగే పూలు వికసించడం కూడా అంతే. ఈ మొక్కలను పూర్తిగా చీకటిలో ఉంచినా, లేదా 24 గంటలూ వెలుగులో ఉంచినా వాటి పనిలో మార్పు రాదు. ఒక మల్లెపువ్వును పగటివేళ కటిక చీకటిగదిలో ఉంచినా కూడా వికసింపజేయడం సాధ్యం కాదు. ఈ విధంగా సూర్యుని వెలుతురు ఆధారం చేసుకొని జీవులు చంపే ఈ మార్పులను పగటిలయలు – “డయర్నల్ రిథమ్స్” అని అంటారు. ఈ విధంగా మానవులు, జంతువులు మరియు మొక్కలు దైనందిన లయలు ఈ డయర్నల్ రిథమ్స్ ని ఆధారం చేసుకొని నడుస్తుంటాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

2. జెట్ బాగ్ అంటే ఏమిటి? వివరించండి.
జవాబు:
మానవులలో, జంతువులలో, మొక్కలలో ఉండే జీవగడియారాల వల్లనే అవి ఎప్పుడు ఏ పనిచేయాలో నిర్ధారణ జరుగుతుంది. జీవుల శరీరంలోని గడియారంలో ఏ పని సమర్థవంతంగా చేయగలదో నిర్ణయిస్తుంది. మొక్కలు సూర్యుడు ఉండే పగటివేళలోనే ఆహారాన్ని తయారు చేయగలుగుతాయి. అంటే రాత్రివేళ ఆకులు విస్తరించి ఉండడం వలన ఉపయోగం ఉండదు. మనం చేతి గడియారం చూసుకొని ఏ పని ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటాం. అలాగే సీతాకోకచిలుకలు పుట్టిన వెంటనే సూర్య తాపానికి గురికాకుండా ఉండడానికి తెల్లవారుఝామునే ప్యూపా నుండి బయటకు వస్తాయి. కీటకాలు మకరందం లభించే సమయాల్లో చురుగ్గా ఉంటాయి. మొక్కలు కూడా కీటకాలు చురుగ్గా ఉండే సమయాల్లోనే పుష్పాలు వికసింపజేస్తాయి. ఇది పరస్పర సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రతిరోజు నియమం ప్రకారం భోజనం చేసేవారికి నిర్ణీత సమాయానికే ఆకలి వేస్తుంది. రోజుకు ఒకసారి భోజనం చేసేవారికి ఒకసారి మాత్రమే ఆకలి వేస్తుంది. అలాగే నిద్ర, మెలకువ, కూడా అంతే. ప్రతిరోజు జీవుల శరీరంలోని ఈ కనిపించని గడియారం తనకు తాను సరిచేసుకుంటుంది. ఈ గడియారాన్ని మనం కృత్రిమంగా కూడా సరిచేయవచ్చు.

మనం విమానంలో ఖండాంతర ప్రయాణం చేసినప్పుడు అక్కడి రాత్రి, పగలు షిఫ్ట్ లో పనిచేసేవారికి, ఈ తేడాను అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా నిర్ణీత సమయం మించి మేల్కొనడం సాధ్యం కాదు. ఈ విధంగా శరీరంలోని లయలను అలవాటు ద్వారా కృత్రిమంగా సరిచేయడాన్ని “జెట్ లాగ్” అంటాము.

“జెట్ బాగ్” అనేది కృత్రిమ ప్రక్రియ. ఇది కేవలం ప్రయత్నం, అలవాటు ద్వారానే కొనసాగించబడుతుంది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు

3. జీవగడియారాలు పాఠం నుండి మీరు ఏమి గ్రహించారో సంక్షిప్తంగా గ్రహించండి.
జవాబు:
మానవ జీవన విధానంలో నిర్దిష్ట సమయంలో కార్యకలాపాలను నిర్దిష్ట సమయంలో నిర్వహించాలంటే దానికి గడియారం చాలా అవసరం. గడియారాలు రాకముందు మనిషికి సమయాన్ని తెలియజేసిన, ఇప్పటికీ తెలియజేస్తున్న జీవ గడియారం కోడిపుంజు. ఇది రోజులో నిర్ణీత సమయాలలో చాలాసార్లు కూస్తుంది. కోడిపుంజు ఇలా కూయడానికి కారణం దాని శరీరంలో ఉన్న, ఎవరికీ కనిపించని గడియారం.

దాని ప్రభావం వల్ల అది అప్రయత్నంగానే కూస్తుంది. మనుషుల్లో కూడా ఎప్పుడు భోంచేయాలి? ఎప్పుడు నిద్రపోవాలి? ఎప్పుడు మేల్కొనాలి? అనేది మన శరీరంలో కనిపించకుండా ఉన్న ఈ జీవగడియారాల వల్లనే తెలుస్తుంది. 24 గంటల కాలంలో ఒక జీవి ప్రదర్శించే దైనందిన కార్యకలాపాలను ‘దైనందిన లయలు’ లేదా సర్కేడియన్ రిథమ్స్ అని అంటారు. ఈ లయలు గడియారంలో 24 గంటలను పోలి యుంటాయి. అందువల్ల వీటిని జీవగడియారం లేదా శరీర ధర్మగడియారం అనవచ్చు.

మన చేతి గడియారం మాదిరిగానే జీవుల శరీరంలోని గడియారం ఏ సమయంలో జీవి ఒక పనిని సమర్థవంతంగా చేయగలదో నిర్ణయిస్తుంది. మొక్కలు సూర్యుడు ఉండే పగటివేళలోనే ఆహారాన్ని తయారు చేయగలుగుతాయి. సీతాకోకచిలుకలు పుట్టిన వెంటనే సూర్యతాపానికి గురికాకుండా ఉండడానికి తెల్లవారుఝామునే ప్యూపా నుండి బయటకు వస్తాయి. కీటకాల మకరందం లభించే సమయాల్లో చురుగ్గా ఉండడం కూడా ఈ “జీవ గడియారాల” ద్వారానే జరుగును. ఒక జీవికి పుట్టిన నాటి నుండి ఏర్పడిన లయలు, ఆ జీవి బాహ్య పరిస్థితులు మారినా లయలు మాత్రం మారవు. అందుకే మన పెద్దలు “పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కాని పోవు” అంటారు.

తెలతెలవారుతుండగానే సందడిచేసే కాకులు, చీకటి పడగానే ముడుచుకుపోయే ఆకులు, 21 రోజులు రాగానే గుడ్డులోంచి బయటకు వచ్చే కోడిపిల్ల ఇలా ఎన్నెన్నో ప్రకృతి నియమాలను తెలియజేస్తాయి. ఇంత లయబద్దంగా కదులుతున్న ప్రకృతిని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే ప్రకృతి తన గురించి తెలుసుకోమంటే నిరంతరం సవాళ్ళు విసురుతూనే ఉంటుంది. ఈ ప్రకృతి నియమాలు, జీవుల దైనందిన కార్యకలాపాలు ఈ జీవ గడియారాల వల్లనే నిరంతరంగా, నిర్దిష్టంగా, నియమిత సమయాలకనుగుణంగా పనిచేస్తున్నాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson మధుపర్కాలు

8th Class Telugu ఉపవాచకం 4th Lesson మధుపర్కాలు Textbook Questions and Answers

I. అవగాహన-ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. పుట్టన్నది రెండు నిట్టాళ్ళపాక. అవి నెత్తిమీద నీడకోసం వేసుకున్న నిట్టాళ్ళు, అసలా ఇంటికి నిట్టాళ్ళు ఆ దంపతులే. పుట్టన్నా, సీతమ్మా ఒక్కటే ఎత్తు. భౌతికంగానే కాదు… ఆత్మలో కూడా సమానమైన ఎత్తులోనే ఉంటారు. ఒకటిగా ఉన్న ఆత్మను రెండుచేసి, రెండింటికి రెండు శరీరాలు కల్పించి, భూలోకంలో కొన్నాళ్ళు ఆడుకురండని ఆ విధాత పంపాడా, అనిపిస్తుంది వారిని చూస్తే.

పుట్టన్న వృత్తి బట్టలనేత. రోజుకు ఏ నాలుగుగంటలో తప్ప, చేతిలో కండెను పడుగులో నుంచి అటూ యిటూ గిరాటువేస్తూ, వస్త్రం నేస్తూనే ఉంటాడు. సీతమ్మ రాట్నం దగ్గర నుంచి లేవదు. వడివడిగా చిలపలు తోడటం, కండెలు చుట్టడం, పడుగు వేసినప్పుడు భర్తతోపాటు గంజిపెట్టడం, కుంచె తీయడం ఆమె విధులు. ఏ సమయంలో కూడా | వారు ‘కాయకష్టం చేస్తున్నాం’ అనే భావాన్ని బయట పెట్టేవారు కాదు. అదో యజ్ఞంగానే చూసుకునేవారు. ఒక్క కండె చుడితే సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి. ఒక జానెడునేస్తే పుట్టన్న పెదవుల మీద పొట్లపువ్వులు పూచేవి.
ప్రశ్నలు :
1. పుట్టన్న వృత్తి ఏది?
జవాబు:
పుట్టన్న వృత్తి బట్టలనేత వృత్తి.

2. సీతమ్మ ఎక్కడి నుండి లేవదు?
జవాబు:
సీతమ్మ రాట్నం దగ్గర నుండి లేవదు.

3. పుట్టన్న దంపతులు దేనిని యజ్ఞంగా భావించేవాళ్ళు?
జవాబు:
పుట్టన్న దంపతులు వృత్తిని యజ్ఞంగా భావించేవాళ్ళు.

4. ఎప్పుడు సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి?
జవాబు:
ఒక్క కండె చుడితే సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

2. పుణ్యం, ధర్మం జీవితానికి పెట్టని కోటలుగా భావిస్తూ జీవిస్తున్న పుట్టన్నకు, ధనం మీద ఆశలేదు. మూడు పూటలా కడుపును గంజితో నింపడం ఒక్కటే అతని ఆశయం. సీతమ్మ కూడా అంతకుమించి ఏమీ కోరదు. కాకపోతే గోవుకు మేత ఒకటి కావాలి. కాని, కొమ్ము చెంబులతో పాలకు వచ్చేవారంతా, చిట్టూ, తవుడూ, తెలకపిండి చెక్కలు, కానుకలుగా తెస్తూనే ఉంటారు. ఊరి ఆసామి …… కుప్ప నూర్పిళ్ళ కాలంలో అడక్కుండానే వరిగడ్డి తెచ్చి అతని దొడ్లో వామి పెట్టి పోతారు. జనపకట్టలు తెచ్చి ఇంటిమీద ఎండేసి పోతారు. పుట్టన్న వద్దని బ్రతిమాలినా వినరు. “నీ గోవు కామధేనువు పుట్టన్నా” అని వారు నవ్వుకొని వెళ్ళి పోతారు.
ప్రశ్నలు :
1. జీవితానికి పెట్టని కోటలు ఏవి?
జవాబు:
పుణ్యం ధర్మం అనేవి జీవితానికి పెట్టని కోటలు.

2. పుట్టన్నకు దేని మీద ఆశ లేదు?
జవాబు:
పుట్టన్నకు ధనం మీద ఆశ లేదు.

3. ఊరి ప్రజలు పుట్టన్నను ఏమని ప్రశంసించేవారు?
జవాబు:
ఊరి ప్రజలు పుట్టన్నను ‘నీ గోవు కామధేనువు పుట్టన్నా” అని ప్రజలు ప్రశంసించేవారు.

4. పుట్టన్న ఆశయం ఏమిటి
జవాబు:
మూడు పూటలా కడుపును గంజితో నింపడం ఒక్కటే పుట్టన్న ఆశయం.

3. అప్పుడే సందెవెలుగులు దూసుకువస్తున్నాయి. గానుగచెట్టు చిటారు కొమ్మకు అతికించినట్లుగా నెలవంక కనిపిస్తున్నాడు. పుట్టన్న వాకిట్లోకి రాగానే ఆవు “అంబా” అని అరిచింది. పుట్టన్నకు పట్టరాని దుఃఖం వచ్చింది. వెళ్ళి దాని మెడ కౌగలించుకొన్నాడు. “నా మీద కోపం వచ్చిందా ? అమ్ముతున్నానని బాధపడుతున్నావా ? ఏం చెయ్యను, ఆచారం కోసం అమ్ముకోవలసి వచ్చింది. నువ్వెక్కడున్నా ప్రతిరోజూ వచ్చి చూస్తా……. నిన్ను దైవం లాగా కొలుస్తున్నా. నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడుతారు నన్ను?” అని మెడ వదలి ఉత్తరీయంతో దాని ఒళ్ళంతా తుడిచాడు. దానిని
విడవలేక విడవలేక ఊళ్లోకి వెళ్ళాడు.
ప్రశ్నలు :
1. నెలవంక ఎలా కనిపిస్తున్నాడు?
జవాబు:
నెలవంక గానుగచెట్టు చిటారుకొమ్మకు అతికించి నట్లుగా కనిపిస్తున్నాడు.

2. పట్టరాని దుఃఖం ఎవరికి వచ్చింది?
జవాబు:
పట్టరాని దుఃఖం పుట్టన్నకు వచ్చింది.

3. పుట్టన్న వాకిట్లోకి రాగానే అరిచింది ఏది?
జవాబు:
పుట్టన్న వాకిట్లోకి రాగానే గోవు “అంబా” అని ముద్ర వేసింది.

4. పుట్టన్న దేనిని అమ్ముకోవలసి వచ్చింది?
జవాబు:
పుట్టన్న గోవును అమ్ముకోవలసి వచ్చింది.

4. ఆ రోజే బయలుదేరి బస్తీకి వెళ్ళాడు. నూలు తెచ్చాడు. ఆ నాలుగు రోజులు అతడు మగ్గం గోతిలో నుంచి లేవలేదు. సీతమ్మ రాట్నం వదలలేదు. నాలుగురోజులు గడిచాయి. తెల్లారే లగ్నం ….. ఆ సందెవేళ ఆముదం దీపాలు – అటూఇటూ పెట్టి నేత నేస్తున్నాడు పుట్టన్న. ఇంతట్లోనే చెరువుగట్టున మేళాలు మ్రోగినాయి. “పెళ్ళివారు దిగారు” అంది సీతమ్మ. “ఇంకొక్క ఘడియలో నేత పూర్తి అవుతుంది” అన్నాడు పున్న. మరి కాసేపటికి పల్లకి, దాని వెంట బళ్ళూ ఆ వీధినే వచ్చాయి. సీతమ్మ చూడటానికి బైటికి వెళ్ళింది. ఇలాయి బుడ్ల వెలుతుర్లో పెళ్ళికొడుకును చూచింది. వెంట ఇరవై బళ్లున్నాయి. అన్నీ వాళ్ళ ఇల్లు దాటిపోయేదాకా నిలబడి చూచి ఇంట్లోకి వచ్చింది సీతమ్మ “పెళ్ళికొడుకు కళ్ళూ, ముఖం బాగానే ఉన్నాయి. పాతికేళ్ళుంటాయి. అయినా ఫరవాలా! ఈడుగానే ఉంటాడు. పార్వతి మాత్రం ఒడ్డూ పొడుగూ లేదూ” అంది.
ప్రశ్నలు :
1. ఇలాయి బుడ్ల వెలుతురులో ఎవరిని చూసింది?
జవాబు:
ఇలాయి బుడ్ల వెలుతురులో పెండ్లి కొడుకును చూసింది

2. పుట్టన్న బస్తీకి వెళ్ళి ఏమి తెచ్చాడు?
జవాబు:
పుట్టన్న బస్తీ నుండి నూలు తెచ్చాడు.

3. చెరువు గట్టున ఏవి మ్రోగాయి?
జవాబు:
చెరువు గట్టున మేళాలు మ్రోగాయి.

4. సీతమ్మ దేనిని వదలలేదు?
జవాబు:
సీతమ్మ రాట్నం వదలలేదు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

5. తెల్లవారింది. పాపయ్యగారింట్లో పెళ్ళి వైభవంగా జరుగుతోంది. అర ఎకరం పందిరి వేసినా జనం పట్టక కిటకిటలాడిపోతున్నారు. ఒక పందిరి గుంజనానుకొని సీతమ్మ నిలబడింది, ఆవిడకు కొంచెం పక్కగా పుట్టన్న ఉన్నాడు. నూతన దంపతులు తలంబ్రాలు పోసుకుంటున్నారు. సన్నాయిపాట సాగిపోతోంది, సంతోష తరంగాలుగా. పిల్ల తల్లితండ్రులు ఒకరినొకరు ఎరగనంత క్రొత్తగా చూచుకుంటున్నారెందుకో. పుట్టన్న తన ధర్మం నెరవేర్చుకొన్నానన్న ఆనందంలో మునిగిపోయాడు. లగ్నం అయింది. ‘అందరు భోజనాలకు పదండి’ అన్న కేకలు నాలుగువైపుల నుంచి వినిపించాయి. అంతా వెళ్ళినా పుట్టన్న, సీతమ్మ గోడ ప్రక్కగా నిలబడి – ఏదో చెప్పుకొని నవ్వుతున్నారు. పాపయ్య చూశాడు వారిని. “ఏం అక్కా నువ్విక్కడే ఉన్నావు – బావయ్య అలిగాడా? కలిగిందేదో పెడతాం. అంత అలిగితే ఎలా బావా” అన్నాడు.
ప్రశ్నలు :
1. ఎవరి ఇంట్లో పెండ్లి వైభవంగా జరిగింది?
జవాబు:
పాపయ్య గారి ఇంట్లో పెండ్లి వైభవంగా జరిగింది.

2. సీతమ్మ ఎలా నిలబడింది?
జవాబు:
సీతమ్మ పందిరి గుంజకు ఆనుకొని నిలబడింది.

3. నూతన దంపతులు వేటిని పోసుకున్నారు?
జవాబు:
నూతన దంపతులు తలంబ్రాలు పోసుకున్నారు.

4. నలువైపులా ఏ కేకలు వినిపించాయి?
జవాబు:
నలువైపులా “భోజనానికి పదండి” అనే కేకలు వినిపించాయి.

6. మధుపర్కాలు తీసుకొని వెళ్ళి ఇచ్చిందాక ఒక దీక్షతో ఉన్నారు పుట్టన్న దంపతులు. ఆ కార్యం నెరవేరింది. వారి మనసులో బరువు తగ్గింది. తగ్గిన తర్వాత ఆవు మీద బెంగ అధికమైంది. ఎలాగో మనస్సుకు సంతృప్తి తెచ్చుకొని నిద్రపోయారు. కాని నిద్రలో వారికాగోమాత ప్రత్యక్షమైంది. పుట్టన్నకు ఆవు ‘అంబా’ అని అరుస్తూన్నట్లు వినిపించింది. దిగ్గునలేచి వెళ్ళి ఇంటి మీద ఉన్న జనప కట్ట తీసుకుని గానుగచెట్టు దగ్గరికి వెళ్ళాడు. బిక్కు బిక్కు మంటూ కట్టుకొయ్య కనిపించింది. అతడి మనస్సు చిట్లి, కొన్ని బెల్లులూడిపోయినట్లయింది. తిరిగివచ్చి ఇంట్లో పడుకొన్నాడు. నిద్ర రావడం లేదు. ఆవు ముట్టెతెచ్చి అతని పొట్టమీద నెట్టి గోకమన్నట్లుగా తోచింది. గభాలున లేచి కూర్చున్నాడు. చూపు చూరులోకీ, మనస్సు శూన్యంలోకి చొచ్చుకుపోతోంది. “నువ్వు పోసిన పాలు త్రాగి పసి పిల్లలు గుక్కలు మాని నిద్రపోతున్నారు.” అని పూజారి అన్నమాటలు వినిపించినాయి. ఆ భావాన్ని తరుముకొంటూ వెనకనుంచి పసిపిల్లల ఏడ్పులు వినిపించినాయి. చెవులు గట్టిగా మూసుకొని “సీతా” అని పిలిచాడు. ఆమె లేచింది. తన అనుభూతి అంతా చెప్పాడు.
ప్రశ్నలు :
1. పుట్టన్న దంపతులకు దేని మీద బెంగ పెరిగింది?
జవాబు:
పుట్టన్న దంపతులకు ఆవుమీద బెంగ పెరిగింది.

2. నిద్రలో ఏది ప్రత్యక్షమైంది?
జవాబు:
నిద్రలో గోమాత ప్రత్యక్షమయింది.

3. శూన్యంలోనికి ఏది చొచ్చుకొని పోయింది?
జవాబు:
శూన్యంలోనికి మనస్సు చొచ్చుకొని పోయింది.

4. ఎవరు గుక్కలు మాని నిద్రపోతున్నారు?
జవాబు:
పసిపిల్లలు గక్కలు మాని నిద్రపోతున్నారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

7. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

దీనితో ముడిపడిన సమస్య అసలు వివాహాలను జరిపే తీరు ఎంతవైభవంగా, ఎంత ధనవ్యయం చేసి జరిపిస్తే అంత ఘనతగా పరిగణించడం మన సమాజంలో పరిపాటి. నిరాడంబరంగా వివాహం జరపడానికి సంఘం హర్షించదు. ఇందువల్ల ఎంత శక్తిహీనుడైనా అప్పో సప్పో చేసి ఘనంగా వివాహం జరిపినట్టు అనిపించుకోవలసి వస్తున్నది. అంతేకాదు, వివాహ సమయంలో బంధువులు, మిత్రులు, వధూవరులకు చదివించే కానుకల హెచ్చుతగ్గులు కూడా ప్రతిష్ఠకు సంబంధించిన విషయంగా పట్టించుకునే స్థితికి మన సంఘం దిగజారిపోయింది. ఈ దురాచారాల నిర్మూలనకు శాసనాలు అవసరమే కావచ్చు కానీ అంతకంటే ముఖ్యంగా వీటి పట్ల ఏహ్యభావాన్ని ప్రజలలో కలిగించడం ముఖ్యం.
ప్రశ్నలు :
1. వివాహం ఎలా జరగడాన్ని సంఘం హర్షించదు?
జవాబు:
వివాహం నిరాడంబరంగా జరగడాన్ని సంఘం హర్షించదు.

2. ‘వధూవరులు” అనేది జంట పదం. అలాంటి జంటపదం పై పేరాలో ఉంది గుర్తించి రాయండి.
జవాబు:
హెచ్చుతగ్గులు

3. శక్తికి మించి వివాహాలు ఘనంగా జరిపించడం, విలువైన బహుమతులివ్వడం వంటివి ఎటువంటివని రచయిత ఉద్దేశ్యం?
జవాబు:
దురాచారాలని రచయిత ఉద్దేశ్యం

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ పేరా దేని గురించి చెపుతుంది?

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పుట్టన్న దంపతుల ఆచారమేమిటి ? దాన్ని కొనసాగించడానికి ఆయన చేసిన త్యాగమేమి?
జవాబు:
పుట్టన్న వృత్తి బట్టలు నేయటము. అతని భార్య సీతమ్మ రాట్నం వడికేటప్పుడు భర్తకు సహాయపడేది. తరతరాలుగా వచ్చే బాంధవ ముద్ర చెరిగిపోకుండా కాపాడుకోవడం అతని ముఖ్య ఆశయం.

ఆ గ్రామంలో ఏ ఇంట్లో పెళ్ళి జరిగినా పుట్టన్న స్వయంగా నేసి, మధుపర్కాలు పంపిస్తాడు. అది ఆ పుట్టన్న దంపతుల ఆచారం. మధుపర్కాలకు వారు పైకం ఏమీ తీసుకోరు. ఆ మధుపర్కాలు కట్టుకొని కొత్త దంపతులు పీటల మీద కూర్చుని, తలంబ్రాలు పోసుకోవడం – దానిని పుట్టన్న దంపతులు చూడడం మామూలు.

క్రమంగా పుట్టన్న దంపతులు అలా ఉచితంగా మధుపర్కాలు ఇవ్వడంతో బీదవారయ్యారు. ఆ గ్రామంలో పెద్దకాపు పాపయ్య గారింట్లో వారి అమ్మాయి పార్వతికి పెళ్ళి కుదిరింది. పాపయ్య ఆ విషయం సీతమ్మకు చెప్పి, పుట్టన్నకు చెప్పమన్నాడు. మధుపర్కాలు నేయడానికి పుట్టన్న వద్ద నూలు లేదు. పుట్టన్న దగ్గర ఒక ఆవు ఉంది. దాని పాలు పితికి రోజూ గ్రామంలో చంటి పిల్లలకు ఉచితంగా వారు పాలు పోసేవారు. నూలు కొనడం కోసం అప్పుచెయ్యడం పుట్టన్నకు ఇష్టం లేక, ఆ ఆవును అచ్చన్నగారికి అమ్మేశాడు. ఈ విధంగా తమ ఆచారం కొనసాగించడానికి పుట్టన్న ఆవును అమ్మి త్యాగం చేశాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

ప్రశ్న 2.
ఈ కథవల్ల పల్లెటూళ్ళలోని మనుషుల మధ్య ఆత్మీయతానుబంధాలు ఎలా ఉన్నాయని మీకనిపించింది?
జవాబు:
పల్లెటూళ్ళలోని వారు ఎప్పుడూ కలసిమెలసి జీవిస్తారు. ఒకరిపట్ల ఒకరు ఆత్మీయతానుబంధాలు కలిగి ఉంటారు. ఇతరులను మోసం చేయటం, వారిపట్ల ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉండటం చేయరు. ఎదుటివారికి సంతోషం వచ్చినా, దుఃఖం కలిగినా అన్నిట్లో పాలుపంచుకుంటారని అనిపించింది.

పుట్టన్న దంపతులు తమ ఆవుపాలు పిల్లలకు పాలకోసం వచ్చే వారికి ఉచితంగా పోసేవారు. ఆ గ్రామంలో ఏ ఇంట్లో పెళ్ళి జరిగినా వారు ఆ నూతన దంపతులకు స్వయంగా నేసి మధుపర్కాలు ఇస్తారు. దాని కోసం పైకం ఏమీ తీసుకోరు. అలాగే వారింటికి పాలకోసం వచ్చేవారంతా చిట్టు, తవుడు, తెలగపిండి, చెక్కలు కానుకలుగా వీరికి ఇచ్చేవారు. కుప్పనూర్పిళ్ళ కాలంలో వరిగడ్డి తెచ్చి పుట్టన్న దొడ్డిలో మేత వేసేవారు.

గ్రామంలో పురుషులు ఆడవారిని అక్కలుగా, చెల్లెళ్ళుగా పిలిచేవారు. పురుషులు వరుసలు కలిపి ‘బావ’ అని పిలిచేవారు. పాపయ్య కాపు పుట్టన్నను “బావా” అని, సీతమ్మను “అప్పా” అని పిలుస్తాడు.

మధుపర్కాలు ఉచితంగా ఇచ్చే తన ఆచారం కోసం పుట్టన్న తనకు ఇష్టమైన ఆవును సైతం అమ్మివేశాడు. ఆవును అమ్మివేశాక పుట్టన్న ఇంటికి పాలకోసం వచ్చిన పూజారి, పుట్టన్నను “ఋషి” వంటివాడని మెచ్చుకున్నాడు.

మధుపర్కాలు పుట్టన్న ఇంటి నుండి పట్టుకు వెళ్ళడానికి మేళతాళాలతో రావడం, సీతమ్మకు కుంకం పెట్టి తాంబూలం ఇవ్వడం, పెళ్ళి భోజనాల దగ్గర పాపయ్య, పుట్టన్న దంపతుల పరిహాసం మాటలూ, ఆ గ్రామ ప్రజల మధ్యన ఉన్న అనుబంధాలకు నిదర్శనాలు. పాపయ్యగారి అల్లుడు తనకు మామగారిచ్చిన మాన్యాన్ని, పుట్టన్న దంపతులకు మధుపర్కాల మాన్యంగా ఇవ్వడం, అందుకు పాపయ్య అంగీకరించడం, ఆ గ్రామ ప్రజల మధ్యగల ఆత్మీయతానుబంధాలను గుర్తు చేస్తున్నాయి.

ప్రశ్న 3.
పుట్టన్న దంపతుల మంచితనాన్ని వర్ణిస్తూ పది వాక్యాలు రాయండి.
(లేదా)
మధుపర్కాలను ఉచితంగా పంపే ఆచారాన్ని కాపాడుకునేందుకు పుట్టన్న దంపతులు అష్టకష్టాలు పడ్డారు. వారి మంచితనాన్ని తెలిపేలా పది వాక్యాలు రాయండి.
జవాబు:
పుట్టన్న దంపతులు ఆదర్శదంపతులు. మంచితనం మూర్తీభవించిన వారు. పుట్టన్న చేసే ప్రతి మంచిపనికి సహకరిస్తూ, అతనికి చేదోడువాదోడుగా ఉండే ఉత్తమ ఇల్లాలు సీతమ్మ.

పుట్టన్న దంపతులు చేనేత వృత్తిగా జీవించేవారు. వారి గ్రామం పాలవెల్లి. అందులో వారు పువ్వుల వంటివారు. ఆ గ్రామంలో పెళ్ళిళ్ళు అయిన కొత్త దంపతులందరికీ ఉచితంగా ఆ దంపతులు మధుపర్కాలను వేసి ఇచ్చే మహాదాతలు. పుట్టన్న దంపతులు శారీరకంగానే కాక, మానసికంగా కూడా వారి మనస్సులు ఒకటే. వారికి ఒక ఆవు ఉండేది. దానిని మేపి, దాని పాలు చంటిపిల్లల కోసం కొమ్ముచెంబులతో వచ్చే ఊరి వారికి ఉచితంగా పోసేవారు. అందరికీ పాలు పోశాక అతనికి ఖాళీ చెంబు మిగిలేది.

ఆ గ్రామంలో ఏ పెళ్ళి జరిగినా ఆ దంపతులకు మధుపర్కాలు నేసి ఇవ్వడం ఆ దంపతులకు ఆచారం. క్రమంగా ఉచితంగా ఇచ్చే మధుపర్కాలతో వారి సంపాదన హరించింది. పాపయ్య కాపు గారి అమ్మాయి పెళ్ళికి మధుపర్కాలు నేసి ఇయ్యడానికి నూలు లేక తమకు ఎంతో ఇష్టమైన ఆవును సైతం ఆ దంపతులు అమ్ముకున్నారు. తరతరాలుగా వచ్చే ఆచారాన్ని పోగొట్టుకోవడం కన్నా, గోవును వదులుకోవడం మంచిదని వారు నిర్ణయించారు. అప్పుచేయడం పుట్టన్నకు అసలు ఇష్టం లేదు. ఇక ఉచితంగా మధుపర్కాలు అందించలేక గ్రామం నుండి వెళ్ళిపోడానికి కూడా వారు సిద్ధం అయ్యారు.

పాపయ్య గారి అల్లుడు పుట్టన్న మంచితనం గుర్తించి వారికి ఆవును తిరిగి ఇప్పించి, రెండెకరాల మధుపర్కాల మాన్యం ఇచ్చాడు. దీని ద్వారా మంచి చేసేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని తెలుస్తోంది.. తాము మంచిగా ఉంటూ, ఎదుటివారు మంచిగా మెలిగేలా ఆదర్శప్రాయమైన జీవనం సాగించిన పుట్టన్న దంపతులు మంచిక మారురూపాలు.

ప్రశ్న 4.
ఈ పాఠంలోని అల్లుడు గారి పాత్ర ద్వారా ఎలాంటి ఆదర్శాన్ని గ్రహించారు?
జవాబు:
పాఠంలో పాసయ్య కాపు గారి అల్లుడు చాలా మంచివాడు. ధనవంతుడు, తన పెళ్ళికి మధుపర్కాలు ఉచితంగా నేసి ఇచ్చిన పుట్టన్న దంపతులు నూలు కోసం తమ ఆవును అమ్ముకున్నారని, వారు ఆ గ్రామంలోని పసిపాపకు ఆ ఆవుపాలను ఉచితంగా పోసేవారని తెలిసికొన్నాడు. పుట్టన్న ఆవును అచ్చన్నకు అమ్మేశాడని తెలుసుకొని, పుట్టన్నకు అచ్చన్న ఇచ్చిన డబ్బును, అచ్చన్నకు తిరిగి ఇచ్చివేశాడు. ఆవును పుట్టన్న ఇంటి దగ్గర తిరిగి కట్టివేయనునీ అచ్చన్నకు చెప్పాడు.

అంతేకాకుండా, తనకు మామగారు కానుకగా ఇచ్చిన రెండెకరాల మాన్యాన్ని పుట్టన్న దంపతుల పేర రాయించే ఏర్పాటు చేశాడు. ఆ డబ్బుతో వారు గ్రామస్థులకు ఉచితంగా మధుపర్కాలు శాశ్వతంగా ఇచ్చే ఏర్పాటును చేశాడు. ఆవునూ, మాన్యాన్ని తీసుకోడానికి, పుట్టన్నను ఒప్పించాడు.

ఈ పాత్ర ద్వారా మంచిపనులు చేసేవారికి మనం సాయంచేయాలని, మనకు దేవుడిచ్చిన సంపదను మంచికార్యాలు చేయడానికి, మంచికార్యాలు చేసేవారికి సాయం చేయడానికి వినియోగించాలని గ్రహించాము.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

ప్రశ్న 5.
మధుపర్కాలు పాత్రలలో ఆచారాలు పాటించడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పుట్టన్న పొరుగూరికి వెళ్లిపోదాం అనుకున్నాడు కదా ! దీనిపై నీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
పుట్టన్న దంపతులు ఆదర్శ దంపతులు. మంచితనం మూర్తీభవించిన వారు. పుట్టన్న చేసే ప్రతి మంచి పనికి సహకరిస్తూ అతనికి చేదోడు వాదోడుగా ఉండే ఉత్తమ ఇల్లాలు సీతమ్మ. పున్న దంపతులు చేనేత వృత్తిగా జీవించేవారు. ఆ గ్రామంలో పెళ్ళిళ్ళు అయిన కొత్త దంపతులందరికీ ఉచితంగా పుట్టన్న దంపతులు మధుపర్కాలను వేసి ఇచ్చే మహాదాతలు. క్రమంగా ఉచితంగా ఇచ్చే మధుప్కూలతో వారి సంపాదన హరించింది. పాపయ్య కాపు కూతురి పెళ్ళి మధుపర్కాలు నేసి ఇవ్వడానికి నూలు లేక ఇంట్లో ఉన్న అవును అమ్ముకున్నారు పుట్టన్న దంపతులు. అప్పుచేయడం ఇష్టంలేని ఆ దంపతులు ఊరు విడిచి వెళ్ళిపోదామనుకున్నారు. ఆ సమయంలో ఎవరున్నా ఇలాగే ఆలోచించేవారు.

“తనకు మాలిన ధర్మం పనికిరాదన్నది” పెద్దల మాట. కానీ పుట్టన్న దంపతులు తాగడానికి గంజినీళ్ళే అయినా దానధర్మాలు విడువలేదు మాట తప్పి, పూర్వపు ఆచారాన్ని విడిచి ఆ వూరిలో బ్రతకలేమని భావించి, పొరుగూరు వెళదామన్నాడు. అలా అనడంలో కూడా అయిష్టమే ఉంది కాని సంతోషం లేదు. బాధలో అన్న మాటే గాని, నిజంగా వెళ్ళాలని కాదు అని నా అభిప్రాయం.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson గులాబి అత్తరు

8th Class Telugu ఉపవాచకం 3rd Lesson గులాబి అత్తరు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. “ఇంకేమంటే మనవి చేసుకున్నాను గదా,
గోల్కొండ తరవాత పెద్దాపురమే చూడతగ్గదని విన్నానని ? ముందు తమరిది చిత్తగించకోరుతున్నాను.” ఇలా అని, భాను, మూత తెరిచి ఒక చిన్న పెట్టి దివాంజీ ముందు వుంచాడు. లోపల, ఎర్రని ముఖముల్ గుడ్డ అతికించిన చక్కని పెట్టి అది. అందులో ఒక చిన్న సీసా. చక్కని నగిషీ పనితో
యెంతో ముచ్చటగా వుందది. సీసాలో సగానికి పైగా అత్తరు వుంది. అది చూసి అక్కడివారందరూ గుటకలు మింగారు.
ప్రశ్నలు :
1. గోలకొండ తరువాత చూడదగినది ఏది?
జవాబు:
గోలకొండ తరువాత చూడదగినది పెద్దాపురం.

2. అత్తరు సీసా ఎలా ఉంది?
జవాబు:
అత్తరు సీసా చక్కని నగిషీ పనితో ఎంతో ముచ్చటగా ఉంది.

3. సీసాలో ఎంత అత్తరు ఉంది?
జవాబు:
సీసాలో సగానికి పైగా అత్తరు ఉంది.

4. అత్తరు సీసా చూసి అక్కడివారు ఏమి చేశారు?
జవాబు:
అత్తరు సీసా చూసి అక్కడివారు గుటకలు మింగారు.

2. “పెద్దాపురం ప్రభువులకు నజరు పెట్టుకుందామని తయారుచేశానది. గోల్కొండ నవాబుగారికి వట్టివేళ్ళ అత్తరు మిక్కిలి ప్రియం అని తెలిసి అదెంత శ్రద్ధగా తయారుచేశానో, పెద్దాపురం మహారాజులుంగారికి గులాబీ అత్తరు మిక్కిలి ప్రీతిపాత్రం అని తెలిసి అదీ అంతే శ్రద్ధగానూ తయారుచేశాను. ఆ సీసాలో ఉన్నది ఒక్కటే తులం – దీని నిమిత్తం కాశ్మీరం జాతి పువ్వులు వాడాను. ఢిల్లీ పరిసరాల్లో పారశీక జాతులే ఎక్కువ. కాశ్మీరజాతి చాలా అరుదుగా దొరుకుతుంది. అందుచేత, ఆ కాస్త అత్తరూ తయారు కావడానికి దాదాపుగా రెండేళ్ళు పట్టింది మహాప్రభూ” అని వివరించి చెప్పాడతను.

ఇది విని అక్కడివారు; దాని విశిష్టతా, విలువ ఊహించుకుని చాలా ఆనందించారు; కాని “ఆశ్చర్యమా?”
ప్రశ్నలు :
1. ఎవరికి నజరు పెట్టుకుందామని తయారు చేశాడు?
జవాబు:
పెద్దాపురం ప్రభువులకు నజరు పెట్టుకుందామని తయారు చేశాడు.

2. పెద్దాపురం మహారాజుకి ప్రీతిపాత్రం అయినది ఏది?
జవాబు:
పెద్దాపురం ప్రభువులకు గులాబీ అత్తరు ప్రీతి పాత్రమైనది.

3. గులాబీ అత్తరులో ఏ జాతి పువ్వులు వాడారు?
జవాబు:
గులాబీ అత్తరులో కాశ్మీరుజాతి పువ్వులు వాడారు.

4. ఢిల్లీ పరిసరాల్లో ఏ జాతులు ఎక్కువ?
జవాబు:
ఢిల్లీ పరిసరాల్లో పారశీక జాతులెక్కువ.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

3. ప్రతిఘటనలు అతిక్రమించగలిగితేనే జీవితానికి విజయం చేకూరుతుంది. కాని, ఒక్కొక్క జీవితానికి హృదయం పునాది అయితే, మరొక్క జీవితానికి మేధస్సు ప్రధానం అయి ఉంటుంది.

ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువయిపోతుంది. అక్కడ సానుభూతి కూడా ఉండదు. ఏ జీవితానికి పునాది హృదయమో అది కళాబంధురం అవుతుంది. అక్కడే కళలకు పరిణతి ఉంటుంది. అక్కడే కళలకు వినియోగం కూడా అక్కడే తన్మూలంగా కలిగే ఆనందానుభవమూ ఉంటుంది. అలాంటి ఆనందం తాననుభవించాలన్నా, ఇతర్లకు కలిగించాలన్నా ఆ కళాశీలి, తప్పనిసరిగా మహామేధావి అయివుండాలి.

కళావేత్తలోనే – కళాసాధనలోనే తన జీవితం పరిపక్వం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే? ఎవరి సంకల్పం విశుద్ధమో, ఎవరి హృదయం కళామయమో, ఎవరి దీక్ష అనన్య సామాన్యమో, ఎవరి ప్రాప్యం లోక కళ్యాణమో ఆ కళాశీలుల నిర్మాణాలే ద్వంద్వ భూయిష్టమైన భౌతికజగత్తులో ధ్రువతారలయి మెరుస్తూ ఉంటాయి.

నిజంగా షుకురల్లీ ఖాను అలాంటి కళాశీలి. అతని అత్తరు అలాంటి ధ్రువతార.
ప్రశ్నలు :
1. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ ఏది తక్కువౌతుంది?
జవాబు:
ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువయిపోతుంది.

2. వేటిలోనే ఒక జీవితాన్ని పరిపక్వం చేసుకుంటూ ఉండాలి?
జవాబు:
కళావేత్తలోనే, కళారాధనలోనే తన జీవితం పరిపక్వం చేసుకుంటూ ఉండాలి.

3. నిజమైన కళాశీలి ఎవరు?
జవాబు:
నిజమైన కళాశీలి షుకురలీఖాన్.

4. కళాశీలి తప్పనిసరిగా ఏమై ఉండాలి?
జవాబు:
కళాశీలి తప్పనిసరిగా మహామేధావి అయి ఉండాలి.

4. తన అత్తర్లకు విలువ కేవలం డబ్బే అయితే అందుకోసం అతనింత దూరం రానక్కర్లేదు. ఉన్నవూరే కదలనక్కర్లేదు. అసలు, ఢిల్లీ నగరమే ఒక మహాదేశం అంత. అక్కడే ఎందరో ప్రభువులూ, సంపన్నులు ఉన్నారు. వారిలో ఎందరో రసికులున్నారు. అతని అత్తర్లు కళ్ళకద్దుకునేవారు వందల వేలమంది ఉన్నారు.

అయితే, పెద్దాపురం ప్రభువు, శ్రీశ్రీశ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజు రసికత ఢిల్లీలో గుబాళించింది. ఢిల్లీ పాదుషా రసికతకే వంకలు దిద్దింది. అంచేత ఖాను ఆగలేకపోయాడు. దీక్ష పట్టాడు. తపస్సులో కూచున్నాడు. అపూర్వ సాధన చేశాడు. తహతహలాడిపోయాడు. రెక్కలు కట్టుకువచ్చి మరీ వాలాడు.

కాని, షష్టి గడియలూ పువ్వులతోనే కాలంగడిపే అతనికి, ఇక్కడ ప్రభుదర్శనం గగనపుష్పం అయిపోయింది. అపూర్వమైన జాతిరత్నం గులకరాళ్లతో కూడుకుపోయి వుండినట్టనిపించిదతనికి వచ్చి వచ్చి ముళ్ళకంచె ల్లోనూ, మురికి గుంటల్లోనూ పడిపోయినట్టు బాధపడ్డాడతను.
ప్రశ్నలు:
1. ఢిల్లీ నగరంలో ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
ఢిల్లీ నగరంలో ఎందరో ప్రభువులు, సంపన్నులు ఉన్నారు.

2. అత్తర్లు కళ్ళకద్దుకునేవారు ఎంతమంది ఉన్నారు?
జవాబు:
అత్తర్లు కళ్ళకద్దుకునేవారు వందల వేల మంది ఉన్నారు.

3. పెద్దాపురం మహారాజు ఎవరు?
జవాబు:
పెద్దాపురం ప్రభువు శ్రీశ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి

4. పేరాలోని రెండు జాతీయాలు ఏవి?
జవాబు:
తహతహలాడిపోవు, గగనపుష్పం.

5. తెల్లవారడం తడవుగా వెళ్ళి రాణేదారు పాదాల మీద వాలిపోయాడు ఖాను. ఇంతవరకూ అంత గొప్ప అత్తర్లు పెద్దాపురం కోటకు రాలేదన్న సంగతి రాణేదారుకి తెలుసు. ఖానుకి మంచి సన్మానం జరగడం దివాంజీకి సుతరామూ ఇష్టం లేదు. ఇది తెలుసు ఇతనికి. బుర్ర ఎగిరిపోడానికి కయినా ఒప్పుకుంటాడు గానీ భాను సరయిన ధర చెప్పడు ఇదీ తెలుసు అతనికి. అయితే మాత్రం మహారాజు చూశాడంటే భాను అత్తర్లు విడిచిపెట్టడు. ఈ విషయాన్ని ఆ సమయంలో దివాంజీ దగ్గర వుండిన వారందరూ గుర్తించేశారు.
ప్రశ్నలు:
1. ఖాను ఎవరి పాదాల మీద వాలిపోయాడు?
జవాబు:
భాను ఠాణేదారు పాదాలమీద వాలిపోయాడు. ఉంది.

2. భానుకి సన్మానం జరగడం ఎవరికి ఇష్టం లేదు?
జవాబు:
భానుకి సన్మానం జరగడం దివాంజీకి సుతరామూ ఇష్టం లేదు.

3. అత్తరు చూశాడంటే విడిచిపెట్టనిది ఎవరు?
జవాబు:
అత్తరును చూశాడంటే విడిచిపెట్టనిది మహారాజు.

4. ఈ పేరా ఆధారంగా దివాంజీ ఎలాంటి స్వభావం గలవాడు?
జవాబు:
ఈ పేరా ఆధారంగా దివాంజీ అసూయాపరునిగా తెలుస్తుంది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

6. సీసా భళ్ళుమంది. సీసా పెంకులు ఘళ్ళున చెదిరిపడ్డాయి. రాజసఖుల హృదయాలు రువ్వుమన్నాయి. ఆ ప్రదేశం అంతా అత్తరు సౌరభంతో గుమ్మంది. అందరూ ఆ పరిమళానికి మత్తెక్కుతున్నట్టయ్యారు.

ఒక క్షణానికి తెలివివచ్చి అందరూ కళ్ళెత్తి చూసేటప్పటికి, హఠాత్తుగానూ అప్రయత్నంగానూ వెనక్కి తిరిగి చూసి ఖాను కొయ్యయిపోయాడు.

అదేమిటో అని అందరూ వెనక్కి తిరిగి చూడగా, పంచకళ్యాణి మీద శ్రీ శ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహాద్భుతమైన గులాబి అత్తరు సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ. ఎక్కడివీ సమనోహర సుగంధ పరిమళాలు అని అరకంట చూస్తూ నిలిచి ఉన్నాడు.

మోర పైకెత్తుకుని, పంచకళ్యాణి గుర్రం సైతం అద్భుతాన్ని ఆస్వాదిస్తూ ఉండుండి సప్రయత్నంగా ఊపిరి తీసుకుంటోంది.
ప్రశ్నలు :
1. రాజ సభ్యుల హృదయాలు ఏమైనాయి?
జవాబు:
రాజసఖుల హృదయాలు ఠువ్వుమన్నాయి.

2. మహారాజు దేని మీద వెళ్తున్నాడు?
జవాబు:
మహారాజు పంచకళ్యాణి మీద వెళ్తున్నాడు.

3. కొయ్యబారిపోయింది ఎవరు?
జవాబు:
కొయ్యబారిపోయింది ఖాను.

4. ఏ పరిమళానికి అందరు మత్తెక్కిపోయారు?
జవాబు:
గులాబీ అత్తరు పరిమళానికి అందరు మత్తెక్కి పోయారు.

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“గులాబీ అత్తరు” కథను సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
శ్రీశ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజు పెద్దాపురాన్ని పరిపాలించే ప్రభువు. ఆ రాజు యొక్క రసికత ఢిల్లీ వరకు వ్యాపించింది. ఆ వార్త విని ఢిల్లీ నగరవాసి అయిన షుకురల్లీఖాన్ ఎలాగైనా ఆ పెద్దాపురం ప్రభువును కలిసి తన అత్తరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నాడు.

షుకురలీఖాను ఎంతో సుమధుర సువాసనలు గుభాళించే అత్తరులను తయారు చేయడంలో పెట్టింది పేరు. ఈ భాను చేసే అత్తరుకు ఢిల్లీ ప్రభువులందరూ ముగ్ధులయ్యేవారు. ఖాను అత్తరు తయారీలో బాగా ఆరితేరినవాడు. అయితే పెద్దాపురం ప్రభువుకు తన అత్తరు గుభాళింపు చూపించి మంచి పేరు సంపాదించాలనుకున్నాడు. అందుకు గాను ఆ రాజ్యంలో కొలువులో పనిచేస్తున్న ఠాణేదారు సహాయంతో రాజ భవనానికి వచ్చాడు. రాజ కొలువులో జవానులు, పెద్ద మనుషులు, దివాంజీ ఉండడం గమనించి తన అత్తరు సీసా బిరడా తీసి, వెంటనే బిగించాడు. ఆ సుమధుర సువాసనకు అక్కడి వారందరికీ ఒక్కసారిగా మత్తెక్కినట్లయింది. అందరూ తమ ముక్కులకు పని చెప్పారు. అందరూ ఆ వాసనకు ముగ్ధులయ్యారు.

కాని దివాంజీ మాత్రం ఆ పరిమళాన్ని అసహ్యించుకున్నాడు. ఇది చూచి ఖాను నిరాశపడ్డాడు. ఎట్టకేలకు దివాంజీని కలిసి తాను అత్తరు వ్యాపారినని, తన వద్ద సువాసనతో కూడిన గులాబీ అత్తరు ఉందని చూపించాడు. కాని దివాంజీ ఆసక్తిని చూపలేదు. దాంతో నిరాశగా తిరిగి వెళ్ళాడు. మరుసటిరోజు ఖాను మళ్ళీ దివాంజీని కలిసే ప్రయత్నం చేశాడు. కానీ నిరాసే ఎదురైంది. తాను రెండు సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన గులాబీ అత్తరు సీసాను కోపంగా కోట గోడవద్ద విసిరికొట్టాడు. అది పగిలిపోయింది. దాని వాసన అంతటా వ్యాపించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న రాజు గారు అక్కడి పరిమళానికి ముగ్ధుడయ్యాడు.

ఖాను ఆశ నెరవేరింది. దివాంజీ ఎన్ని యుక్తులు పన్నినా, అనుమతి ఇవ్వకపోయినా తన గులాబి అత్తరు ప్రభువుల దృష్టిలో పడింది. తన సంకల్పసిద్ధి నెరవేరింది. తన ప్రయత్నానికి దేవుడే ప్రతిఫలాన్ని ఇచ్చాడని ఎంతో సంతోషించాడు. ప్రయత్నం ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది.

ప్రశ్న 2.
షుకురభీ ఖాన్ స్వభావం ఎలాంటిది?
జవాబు:
‘గులాబీ అత్తరు’ అనే పాఠ్యభాగంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. వాటిలో షుకురలీఖాన్ పాత్ర ప్రముఖమైంది. ఖాను ఒక అత్తరు వ్యాపారి. అతడు తయారుచేసే అత్తరుకు అందరు ముగ్గులవుతారు. ఢిల్లీ నవాబుతో ఎన్నో సత్కారాలు పొందాడు. ప్రశంస, కీర్తి కోసం నిరంతరం శ్రమపడే స్వభావం భానుది. ఖాను చేసిన అత్తరు పరిమళాన్ని ఆస్వాదించినవారు ఒక్కక్షణం మత్తెక్కినట్లు అవుతారు.

దక్షిణ దేశంలో పెద్దాపురం ప్రభువు కీర్తి దశదిశల వ్యాపించింది. అది తెలుసుకొని ఖాను రెండు సంవత్సరాలపాటు శ్రమించి తయారు చేసిన గులాబీ అత్తరును తీసుకొని పెద్దాపురం సమీపించాడు. రాజును సమీపించి అత్తరు ఇచ్చి కీర్తి ప్రతిష్ఠలను పొందాలని భావించాడు. రాజదర్శనం చాలా కష్టం అయింది. ఆ కొలువు కూటంలో ఉన్న దివాంజీని కలిసాడు. రాజదర్శనం కలిగించమని కోరాడు. కొన్నిరకాల అత్తరులను చూపించాడు. దివాంజీ ఆసక్తిని చూపలేదు. ఫలితం దక్కలేదు. కోపంతో ఖాను ఆ అత్తరు సీసాను ప్రాకారం పై కొట్టాడు. తన శ్రమ వృథా అయిందని భావించాడు.

గులాబి అత్తరు సీసా పగిలి ఆ పరిమళం, సౌరభం ఆ ప్రాంతం అంతా వ్యాపించిన సమయంలో రాజావారు అక్కడికే రావడం, ఆ సౌరభానికి ముగ్ధుడవ్వడం చూసి ఎంతో సంబరపడిపోయాడు. తన ప్రయత్నం ఫలించినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్న కృతజ్ఞతాశీలి. మాటల్లో నేర్పరి. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగల ధీరత్వం గల వ్యాపారి. లాభంతో పాటు, కీర్తిని ఆశించే కీర్తితత్పరుడు. అతని అత్తరు ధ్రువతార వంటిది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 గులాబి అత్తరు

ప్రశ్న 3.
పెద్దాపురం ప్రభువు ఎవరు? ఆయన గురించి రాయండి.
జవాబు:
దక్షిణ భారత దేశంలో పెద్దాపురం ప్రభువు శ్రీ శ్రీ శ్రీ శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి ప్రసిద్ధుడు. ఈయన గొప్ప రసికరాజు. ఈయన కీర్తి దశదిశల విస్తరించింది. ఢిల్లీ వరకు విస్తరించింది. ప్రజలను ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా రాజ్యాన్ని పాలించాడు. ఉదార స్వభావం కలవాడు. పరిపాలనలో తన కార్యనిర్వహణా చతురతను ప్రదర్శించేవాడు. ఎంతటి సమస్యనైనా తన మేధా సంపత్తితో చక్కగా పరిష్కరించేవాడు. తన రాజ్యంలో అందరికి న్యాయం జరగాలని ఆకాంక్షించాడు. దివాంజీకి గొప్ప పదవిని ఇచ్చి గౌరవించాడు. అయితే దివాంజీ నమ్మకద్రోహం చేసేవాడు. దివాంజీ తన ముందు నటిస్తున్నాడనే విషయం తెలియక ఆయనకు గౌరవం ఇచ్చేవాడు.

పెద్దాపురం రాజావారు ఎంత సరసులో ఆయన పరివారం అంత విరసులు. పెద్దాపురంలోని ప్రజలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండేవారు. పంచకళ్యాణి గుర్రంపై నగర సంచారం చేస్తూ ఉండేవారు. ఖాను తన కోసం కష్టపడి రెండు సంవత్సరాల సమయం వెచ్చించి తయారుచేసిన గులాబి అత్తరును కోపంతో విసిరివేయగా అది పగిలి ఆ సువాసన అంతటా వ్యాపించగా, ఆ పరిమళాన్ని నిలబడి ఆశ్వాదించిన సువాసన ప్రియుడు. మహాద్భుతమైన గులాబి అత్తరు సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ, ఆ సుమధుర, సుమనోహర సుగంధ పరిమళాలకు ఎంతో ముగ్ధుడయ్యాడు. దక్షిణ దేశానికంతటికీ జాతిరత్నం శ్రీవత్సవాయి ప్రభువు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 2nd Lesson గుశ్వం

8th Class Telugu ఉపవాచకం 2nd Lesson గుశ్వం Textbook Questions and Answers

I. అవగాహన-ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. గుశ్వం నాటిక హాస్యంతో కూడినది. ఎందుకంటే శిష్యులు పదాలు సరిగా పలకలేక పోవడం గుఱ్ఱం బదులు : | గుల్లం అనడం నవ్వు తెప్పిస్తుంది. గుర్రంలో ‘గు’, అశ్వంలో ‘శ్వం’ కలిపి ‘గుశ్వం’ అనే పదం వారు తయారు చెయ్యడం హాస్యానికి కారణం. గుర్రానికి గుడ్డు ఉండదని కూడా తెలియని వాళ్ళ అమాయకత్వం, ఆ అయోమయాన్ని గురువు గారికి కూడా తగిలించి వాళ్ళు గుర్రం గుడ్డు తెస్తామనగానే ఆయన తలూపి పది వరహాలివ్వడం నవ్వు పుట్టిస్తుంది. బూడిద గుమ్మడికాయను గుడ్డు అని చెప్పగానే నమ్మేయడం గుమ్మడికాయ పగిలిపోతే ఆ శబ్దానికి బెదిరి కుందేలు పరుగెత్తడం చూసి ఆ కాయలోంచే కుందేలు వచ్చి ఉంటుందని వారు భావించి దానివెంట పరుగెత్తడం మరీ విడ్డూరం. ఇలా ఈ కథలో ప్రతి సన్నివేశమూ నవ్వు పుట్టిస్తుంది ఈ నాటికలో. –
ప్రశ్నలు :
1. శిష్యుల అమాయకత్వం ఎలాంటిది?
జవాబు:
గుర్రానికి గుడ్డు ఉండదని తెలియకపోవడం శిష్యుల అమాయకత్వం.

2. పరమానందయ్య శిష్యులు ఎలాంటివారు?
జవాబు:
పరమానందయ్య శిష్యులు అమాయకులు.

3. ‘గుశ్వం’ నాటిక దేనితో కూడినది ?
జవాబు:
‘గుశ్వం’ అనే నాటిక హాస్యంతో కూడినది.

4. శిష్యులు దేనిని గుర్రం గుడ్డుగా భావించారు?
జవాబు:
శిష్యులు బూడిద గుమ్మడికాయను గుర్రం గుడ్డుగా భావించారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

2. పరమానందయ్యగారు పేరు పొందిన గురువు. ఆయన దగ్గర శిష్యులు అమాయకులు. ఏ పని చెప్పినా అయోమయంగా చేస్తారు. వాళ్ళకు గురువుగారు ఒక రోజు గుర్రం గురించి చెప్పాలనుకున్నారు. చెన్నడు అనే శిష్యుడికి గుఱ్ఱం అని పలకమంటే అ పలకలేని చెన్నడు గుల్లం అన్నాడు. గున్నడు అనే శిష్యుడు ఇంకో పేరు చెప్పమంటే గురువు ‘అశ్వం’ అని చెప్పాడు. అశ్వమనే పేరు నాదంటే నాదని ఆ యిద్దరు కొట్లాడుకుంటూ గుర్రంలోని ‘గు’, అశ్వంలోని ‘శ్వం’ కలిపి ‘గుశ్వం’ అనే పేరు తయారుచేశారు. గురువుగారు వారిని విసుక్కుంటూ నాకు గుర్రమెక్కాలనే కోరిక తీరిక కనీసం మీకు గుర్రం గురించి చెబుదామనుకుంటే ఆ పేరు గూడ నేర్చుకోలేకపోయారు. అంటుంటే తిన్నడు అనే మరోశిష్యుడు పది వరహాలిస్తే గుర్రం గుడ్డు కొనుక్కొస్తానని చెప్పి చెన్నడు, గున్నడు ఇద్దర్నీ
వెంటబెట్టుకొని ఒక బూడిద గుమ్మడికాయను కొనుక్కొని వస్తుంటే దారిలో అది కిందపడి పగిలింది.
ప్రశ్నలు:
1. పేరు పొందిన గురువు ఎవరు?
జవాబు:
పేరు పొందిన గురువు పరమానందయ్య.

2. శిష్యులు ఏ పని చేసినా ఎలా చేస్తారు?
జవాబు:
శిష్యులు ఏ పని చేసినా అయోమయంగా చేస్తారు.

3. గుర్రాన్ని సంస్కృతంలో ఏమని అంటారు?
జవాబు:
గుర్రాన్ని సంస్కృతంలో ‘అశ్వం’ అని అంటారు.

4. బూడిద గుమ్మడికాయను దేనిగా భావించారు?
జవాబు:
బూడిద గుమ్మడికాయను గుర్రం గుడ్డుగ భావించారు.

3. ఇంతలో పరమానందయ్య గారి మరో శిష్యుడు, ‘తిన్నడు’ వచ్చి, గుర్రం గుడ్డును పట్టేశాననీ, పది వరహాలిస్తే అది వారికి ఇచ్చి గుర్రం గుడ్డు మోసితెస్తానన్నాడు. గురువుగారు కూడా ఆ మాటనమ్మి శిష్యులకు డబ్బిచ్చి పంపారు. శిష్యులు ఆ డబ్బు ఇచ్చి గుర్రం గుడ్డు అని బూడిద గుమ్మడికాయను కొని మోసి తెస్తుండగా ఆ కాయ పగిలిపోయింది. అప్పుడే అక్కడ తిరుగుతున్న కుందేలు పిల్లను చూసి, శిష్యులు గుర్రం పిల్ల పారిపోయిందని, దానికై వెతికి, పట్టుకోలేక ఏడుస్తూ వచ్చి గురువుగారికి చెప్పారు. బూడిదగుమ్మడికాయ ముక్కల్ని చూసి, శిష్యులూ, తానూ కూడా, తెలివితక్కువ పని చేశామని గురువుగారు తెలిసికొన్నారు.

ఇంతలో బూడిదగుమ్మడికాయ అమ్మిన పెద్దమనిషి, కుందేలు పిల్లను పట్టి తెచ్చి, పదివరహాలనూ గురువుగారికి తిరిగి ఇచ్చాడు. జరిగిన విషయం అంతా గురువుగారికి చెప్పాడు.
ప్రశ్నలు:
1. తిన్నడు ఎవరు?
జవాబు:
తిన్నడు పరమానందయ్య శిష్యుడు.

2. కుందేలు పిల్లను శిష్యులు దేనిగా గుర్తించారు?
జవాబు:
కుందేలు పిల్లను గుర్రం పిల్లగా గుర్తించారు.

3. పది వరహాలు ఇస్తే ఏది తెస్తామని శిష్యులు చెప్పారు?
జవాబు:
పది వరహాలు ఇస్తే గుర్రం గుడ్డును తెస్తామని చెప్పారు.

4. పెద్దమనిషి దేనిని అమ్మాడు?
జవాబు:
పెద్దమనిషి బూడిద గుమ్మడికాయను అమ్మాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

4. గుఱ్ఱము అనే మాట తెలుగు అనీ, అశ్వము అనే మాట సంస్కృతము అనీ గురువుగారు చెప్పారు. అయితే ఆ రెండు మాటలు వస్తే సంస్కృతము, తెలుగుభాషలు పూర్తిగా తమకు వచ్చేస్తాయని గున్నడు అంటాడు.

మరో శిష్యుడు తిన్నడు, గుర్రం గుడ్డు అనుకొని, బూడిద గుమ్మడికాయను పది వరహాలిచ్చి కొన్నాడు. గుర్రం గుడ్డు పెట్టదని కూడా ఆ శిష్యులకు తెలియదు. వారు పరమ మూర్ఖులు. వారికి గురుభక్తి ఎక్కువ. గురువుగారు చచ్చిపోతే తాము బతికే అంత తెలివి తక్కువ వాళ్ళము కాము అని వారు తమ గురుభక్తిని ప్రకటిస్తారు.

పరమానందయ్యగారి శిష్యులు అతి తెలివిని చూపిస్తారు. గుర్రము కొంటే అది తన్నుతుందనీ, గుడ్డును కొని, దాని పిల్లను పెంచితే ఆ గుర్రం పిల్ల తాము చెప్పిన మాట వింటుందనీ వారు గురువు గారికి ధర్మసూక్ష్మాన్ని వివరిస్తారు.

ఆ గురువుగారు తమకు చెప్పిన మాటలు గురువుగారికే తిరిగి వారు అప్పచెపుతారు. గుర్రం గుడ్డు తొందరగా కొనాలనీ, ‘ఆలస్యం అమృతం విషం’ అని గురువుగారికి వారు గుర్తు చేస్తారు.
ప్రశ్నలు:
1. గుర్రం గుడ్డు అనుకొని బూడిద గుమ్మడికాయను కొన్న శిష్యుడు ఎవరు?
జవాబు:
తిన్నడు గుర్రం గుడ్డు అనుకొని బూడిద గుమ్మడ కాయను కొన్నాడు.

2. అతి తెలివిని ప్రదర్శించినది ఎవరు?
జవాబు:
పరమానందయ్య శిష్యులు అతి తెలివిని ప్రదర్శిస్తారు.

3. ఆలస్యం అమృతం విషం అని గుర్తు చేసినది ఎవరు?
జవాబు:
ఆలస్యం అమృతం విషం అని గుర్తు చేసినది శిష్యులు.

4. గుర్రం అనే పదాన్ని సంస్కృతంలో ఏమని అంటారు?
జవాబు:
గుర్రం అనే పదాన్ని సంస్కృతంలో ‘అశ్వం’ అని అంటారు.

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఈ నాటకం వేయడానికి ఒకరు గురువుగాను, ముగ్గురు శిష్యులుగా, ఇంకొకరు పెద్దమనిషిగా ఉండాలి. నాటకంలోని సంభాషణలను అభ్యాసం చేయండి. పాత్రలకనుగుణంగా దుస్తులు ధరించాలి. అలంకరించుకోవాలి. తరగతిలో / పాఠశాలలో ప్రదర్శించాలి.
జవాబు:
నాటకం మీ తరగతిలో ప్రదర్శించండి.

ప్రశ్న 2.
“గుశ్వం” నాటకాన్ని కథగా సొంతమాటల్లో పది వాక్యాల్లో రాయండి.
జవాబు:
పరమానందయ్యగారికి చెన్నడు, గున్నడు అనే శిష్యులు ఉన్నారు. గురువుగారు చెన్నడికి ‘గుజ్జము’ అనే మాట చెప్పారు. అతడు దాన్ని గుల్లము అని పలుకుతాడు. అపుడు గున్నడు, చెన్నడి నోరు చిన్నదనీ గుఱ్ఱం, బండి వాడినోరు పట్టడం లేదనీ చెప్పాడు. గురువుగారు ‘అశ్వము’ అని మరో మాట చెప్పాడు. గున్నడు, చెన్నడు కలసి, గుఱ్ఱములో ‘ఱ్ఱ’ తీసి, అశ్వములోని ‘శ్వ’ అక్కడ పెట్టి, ‘గుశ్వం’ అనే మాట తయారుచేశారు. గురువుగారు అది తప్పని చెప్పి, వాళ్ళను మందలించి వారికి ‘తురగము’ అని మరో మాట చెప్పారు.

ఇంతలో పరమానందయ్య గారి మరో శిష్యుడు, ‘తిన్నడు’ వచ్చి, గుర్రం గుడ్డును పట్టేశాననీ, పది వరహాలిస్తే అది వారికి ఇచ్చి గుర్రం గుడ్డును మోసితెస్తానన్నాడు. గురువుగారు కూడా ఆ మాటనమ్మి శిష్యులకు డబ్బిచ్చి పంపారు. శిష్యులు ఆ డబ్బు ఇచ్చి గుర్రం గుడ్డు అని బూడిద గుమ్మడికాయను కొని మోసి తెస్తుండగా ఆ కాయ పగిలిపోయింది. అప్పుడే అక్కడ తిరుగుతున్న కుందేలు పిల్లను చూసి, శిష్యులు గుర్రం పిల్ల పారిపోయిందని, దానికై వెతికి, పట్టుకోలేక ఏడుస్తూ వచ్చి గురువుగారికి చెప్పారు. బూడిద గుమ్మడికాయ ముక్కల్ని చూసి, శిష్యులూ, తానూ కూడా, తెలివితక్కువ పని చేశామని గురువుగారు తెలిసికొన్నారు.

ఇంతలో బూడిద గుమ్మడికాయ అమ్మిన పెద్దమనిషి, కుందేలు పిల్లను పట్టి తెచ్చి, పదివరహాలనూ గురువుగారికి తిరిగి ఇచ్చాడు. జరిగిన విషయం అంతా గురువుగారికి చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

ప్రశ్న 3.
“గుశ్వం” నాటిక హాస్యంతో కూడినది కదా! ఎందుకో వివరంగా పది వాక్యాల్లో రాయండి.
జవాబు:
పరమానందయ్యగారు శిష్యుడికి ‘గుఱ్ఱం’ అనే మాట చెపితే చెన్నడనే శిష్యుడు “గుల్లము” అంటాడు. ‘గుఱ్ఱము’ అనే
మాటలో బండి ‘ఱ’ ఉంది అని గురువుగారంటే, అందుకే గుల్లము, బండి ‘ఱ’, ఒక్కసారిగా తన నోట పట్టడం లేదని శిష్యుడంటాడు. గున్నడు అనే మరో శిష్యుడు, చెన్నడి నోరు బొత్తిగా చిన్నదనీ, బళ్ళూ, రాళ్ళూ అసలు పట్టవని అంటాడు. ఈ మాటలు హాస్యంతో కూడినవి.

అలాగే ‘గుఱ్ఱంలో’ ఱ తీసివేసి అశ్వంలో ‘శ్వ’ ను కలిపి, శిష్యులు, ‘గుశ్వం’ అనే మాట సృష్టిస్తారు. అది కూడా హాస్యంతో కూడినదే. ఇంకో శిష్యుడు తిన్నడు గుర్రం గుడ్డుతెస్తానని పదివరహాలిచ్చి, బూడిద గుమ్మడికాయను కొని తెస్తాడు. ఆ శిష్యులకు గుర్రం గుడ్డు పెట్టదనీ, పిల్ల మాత్రమే పుడుతుందనీ తెలియకపోవడం నవ్వు పుట్టిస్తుంది. కుందేలు పిల్ల పారిపోతే, గుర్రం పిల్ల పారిపోయిందని శిష్యులు వెతకడం నవ్వు పుట్టిస్తుంది. గుర్రాన్ని కొనడం కంటె, గుర్రం గుడ్డుకొని దాని పిల్లను పెంచితే అది తమ చెప్పినమాట బాగా వింటుందనే, శిష్యుల అతితెలివిమాట కూడా నవ్వు పుట్టిస్తుంది.

గుర్రం గుడ్డును తామే పొదుగుతామని శిష్యులు అంటారు. ఆ మాట మరీ నవ్వు పుట్టిస్తుంది. గురువుగారి దగ్గర ఆ శిష్యులు చూపించే వినయమూ, వారి అతి తెలివితక్కువ మాటలూ మనకు నవ్వును తెప్పిస్తాయి. కాబట్టి “గుశ్వం” – హాస్యనాటిక.

ప్రశ్న 4.
“గుశ్వం” నాటికలోని శిష్యులు ఎలాంటివారు ? వీరి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
గుశ్వం నాటికలో చెన్నడు, గున్నడు, తిన్నడు అనే ముగ్గురు శిష్యులున్నారు. వీరు అతి తెలివి తక్కువవారు. కాని వారంతా అతి తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరంతా మూర్ఖులయిన శిష్యులు.

అందులో చెన్నడికి ‘గుఱ్ఱం’ అనే మాటలో బండి ‘ఓ’ పలకదు. ఆ మాటను ‘గుల్లము’ అంటాడు. తనకు గుల్లము బండి ఒక్కసారే నోట పట్టడం లేదంటాడు. గున్నడు అనే మరో శిష్యుడు, చెన్నడికి నోరు బొత్తిగా చిన్నదనీ బళ్ళు, రాళ్లు దాంట్లో పట్టవు అని అంటాడు.

గుఱ్ఱము అనే మాట తెలుగు అనీ, అశ్వము అనే మాట సంస్కృతము అనీ గురువుగారు చెప్పారు. అయితే ఆ రెండు మాటలు వస్తే సంస్కృతము, తెలుగుభాషలు పూర్తిగా తమకు వచ్చేస్తాయని గున్నడు అంటాడు.

మరో శిష్యుడు తిన్నడు, గుర్రం గుడ్డు అనుకొని, బూడిద గుమ్మడికాయను పది వరహాలిచ్చి కొన్నాడు. గుర్రం గుడ్డు పెట్టదని కూడా ఆ శిష్యులకు తెలియదు. వారు పరమ మూర్ఖులు. వారికి గురుభక్తి ఎక్కువ. గురువుగారు చచ్చిపోతే తాము బతికే అంత తెలివి తక్కువ వాళ్ళము కాము అని వారు తమ గురుభక్తిని ప్రకటిస్తారు.

పరమానందయ్య గారి శిష్యులు అతి తెలివిని చూపిస్తారు. గుర్రము కొంటే అది తన్ను తుందనీ, గుడ్డును కొని, దాని పిల్లను పెంచితే ఆ గుర్రం పిల్ల తాము చెప్పినమాట వింటుందని వారు గురువు గారికి ధర్మసూక్ష్మాన్ని వివరిస్తారు.

గురువుగారు తమకు చెప్పిన మాటలు గురువుగారికే తిరిగి వారు అప్పచెపుతారు. గుర్రం గుడ్డు తొందరగా కొనాలనీ, ‘ఆలస్యం అమృతం విషం’ అని గురువుగారికి వారు గుర్తు చేస్తారు.

మొత్తంపై పరమానందయ్యగారి శిష్యుల మాటలూ, చేష్టలూ అడుగడుగునా నవ్వు పుట్టిస్తాయి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 గుశ్వం

ప్రశ్న 5.
పరమానందయ్య గురువుగారు, తిన్నడు, చెన్నడు, గున్నడు శిష్యులు కదా! గురుశిష్యుల మధ్య ఉండే సంబంధం గురించి తెలపండి.
జవాబు:
గురువులు పూర్వకాలంలో శిష్యులకు తామే భోజనం పెట్టి, వారికి చదువు చెప్పేవారు. శిష్యులు గురువులు చెప్పిన పనులుచేస్తూ, భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా గురువులు చెప్పే విద్యలు నేర్చుకొనేవారు.

గురుశిష్యులు ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవారు. శిష్యులు గురువుగారినీ, గురువుగారి భార్యను ఎంతో భక్తితో సేవించేవారు. వారు చెప్పే పనులన్నీ చేసేవారు. గురువుగారి పూజకు, అగ్నిహోత్రాది విధులకు, కావలసిన సమిధలు, పూజాద్రవ్యాలు శిష్యులు తెచ్చి ఇచ్చేవారు.

గురుపత్ని శిష్యులకు కడుపునిండా భోజనం పెట్టేది. గురువుగారు శిష్యుల మంచి చెడ్డలను చూస్తూ వారికి కావలసిన విద్యలు నేర్పేవారు. చదువు పూర్తి అయిన తర్వాత గురువులకు, శిష్యులు గురుదక్షిణ సమర్పించేవారు. గురువులు ఏమి అడిగినా శిష్యులు వారికి ఇచ్చేవారు.

ఉదంకుడు అనే శిష్యుడు, పౌష్య మహారాజు భార్య కుండలాలను అడిగితెచ్చి గురుపత్నికి ఇచ్చి, ఆ విధంగా గురుదక్షిణ సమర్పించాడు. ఏకలవ్యుడు’ అనే శిష్యుడు తాను ఆరాధించే గురువు ద్రోణాచార్యునికి తన కుడిచేతి బొటనవ్రేలును గురుదక్షిణగా సమర్పించాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson హద్దులు-హద్దులు

8th Class Telugu ఉపవాచకం 1st Lesson హద్దులు-హద్దులు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. సంక్రాంతి పండక్కి వచ్చిన అల్లుడు ఇడ్డెన్లు, బొబ్బట్లు, గారెలు, మొక్కజొన్న పొత్తులు, తాలింపు శనగలు ఇలా తెగ చిరుతిళ్ళు లాగించి కడుపునొప్పంటుంటే డాక్టరుకు కబురు చేశారు మామగారు. డాక్టరుగారు అల్లుడికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయ్యాక, అల్లుడిగారు జబ్బేమిటంటూ మామగారు డాక్టర్ని అడిగాడు. డాక్టరుగారు ఒక పళ్ళెంలో ఉన్న గారెలు, బొబ్బట్లు, వేరుశనగ పప్పులు, ఐదూ, పది పైసల నాణేలూ చూపించాడు. ఆ డబ్బులెక్కడివో అని అత్తగారు అయోమయంగా చూసింది. మెంతుల డబ్బాలోను, పప్పుల డబ్బాలోను అత్తగారు దాచుకున్న డబ్బులు శనగపప్పుతో పాటు బొబ్బట్లలో కలిసి అల్లుడిగారు పొట్టలోకి వెళ్ళి పోయుంటాయన్నారు మామగారు.
ప్రశ్నలు :
1. అల్లుడి కడుపునొప్పికి కారణమేంటి?
జవాబు:
ఇద్దెన్లు, బొబ్బట్లు, గారెలు, మొక్కజొన్నలు, తాలింపు శనగలు బాగా తినడంతో కడుపునొప్పి వచ్చింది.

2. అల్లుడికి ఆపరేషన్ చేసి తీసిన వాటిలో ఏమేమి ఉన్నాయి?
జవాబు:
గారెలు, బొబ్బట్లు, వేరుశనగపప్పులు, ఐదు పైసల నాణేలు, పది పైసల నాణేలు.

3. సంక్రాంతి పండక్కి కాక, ఇంకా ఏయే సందర్భాలలో అల్లుళ్ళను మామగారు ఇంటికి ఆహ్వానిస్తారు?
జవాబు:
గృహప్రవేశాలకు, దీపావళి, ఉగాది వంటి పండు గలకు, ఇంట్లో వేడుకలకు మావగారు అల్లుళ్ళని ఆహ్వానిస్తారు.

4. పై గద్యంలో మీకు నవ్వు తెప్పించిన విషయమేంటి?
జవాబు:
బొబ్బట్లు, గారెలు, వేరుశనగపప్పులతో పాటు అల్లుడిగారి పొట్టలోంచి ఐదు పైసల నాణేలు, పది పైసల నాణేలను డాక్టరుగారు బయటకు తీసి అందరికీ ఆదర్శంగా నిలవాలి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

2. పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు. బావమరిది బావగారిని హద్దు మీరి వేళాకోళం చేస్తున్నాడు. అందుకు మామగారు కొడుకును మందలించాడు. మామగారు – అతిగా ఫలహారాలు పెట్టకు, అల్లుడి ఆరోగ్యం పాడవుతుంది అని భార్యతో చెప్పాడు. ఇంతలో అల్లుడు కడుపునొప్పితో మెలితిరిగిపోయాడు. బావగారితో మరిది వేరుశనగకాయలు కావాలా ? అని వేళాకోళం చేస్తాడు. అల్లుడు మరిది పై కోపపడతాడు.

అత్తగారు డాక్టరును తీసుకురమ్మని భర్తతో అంటుంది. పండుగ ఖర్చుతోపాటు, డాక్టరు ఖర్చూ వచ్చిందని మామగారు మూలుగుతాడు. చివరకు డాక్టరు పరీక్షించి అల్లుడి పొట్టకు ఆపరేషన్ చేయాలన్నాడు. వేయిరూపాయలు ఖర్చవుతుందన్నాడు. అల్లుడు తన ప్రాణం పోతుందని కంగారు పడ్డాడు. తప్పనిసరయి, మామగారు ఆపరేషను చేయించాడు.
ప్రశ్నలు:
1. పండుగకు వచ్చింది ఎవరు?
జవాబు:
పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు.

2. అల్లుడు ఎవరిపై కోపపడతాడు?
జవాబు:
అల్లుడు మరిది పై కోపపడతాడు.

3. అత్తగారు ఎవరిని తీసుకురమ్మని భర్తతో అంటుంది?
జవాబు:
అత్తగారు డాక్టరును తీసుకొని రమ్మని భర్తతో అంటుంది.

4. బావమరిది ఎవరిని హద్దుమీరి వేళాకోళం చేస్తున్నాడు?
జవాబు:
బావమరిది బావగారిని హద్దుమీరి వేళాకోళం చేస్తున్నాడు.

3. ‘హద్దులు హద్దులు’ నాటకంలో అల్లుడు పొట్టకు డాక్టరు రంపంతో కోసి ఆపరేషను చేసినట్లు చూపించిన ఘట్టం మంచి హాస్యఘట్టం.

డాక్టరు నర్సును ఆపరేషనుకు సిద్ధం చేయమంటాడు. నర్సు రంపం తీసుకువస్తుంది. “ఈ రంపమేమిటి ? దీనితో కోస్తారా?” అని అల్లుడు కంగారుపడతాడు. “దేనితో కోస్తే నీకెందుకు ? మాట్లాడకుండా బల్లమీద పడుకో” అని డాక్టరు అల్లుడిని మందలిస్తాడు.

ఆ తర్వాత ప్రేక్షకులకు పేషంటు కనబడడు. కానీ డాక్టరు రంపంతో కోసినట్లు నటించి పొట్టలో నుంచి, బొబ్బట్లు, గారెలు, చెంచాలు వగైరా ఒక్కొక్కటీ తీసి, ప్రేక్షకులకు చూపించి, పక్కన పెడుతూ ఉంటాడు. ఈ ఘట్టం మంచి నవ్వును తెప్పించింది.
ప్రశ్నలు:
1. ‘హద్దులు హద్దులు’ అనే నాటకంలో హాస్యఘట్టం ఏది?
జవాబు:
హద్దులు హద్దులు అనే నాటకంలో అల్లుడు పొట్టకు డాక్టరు రంపంతో కోసి ఆపరేషను చేసినట్లు చూపించిన ఘట్టం మంచి హాస్యఘట్టం.

2. డాక్టరు ఎవరిని మందలించాడు?
జవాబు:
డాక్టరు అల్లుడిని మందలించాడు.

3. ప్రేక్షకులకు కనబడనిది ఎవరు?
జవాబు:
ప్రేక్షకులకు కనబడనిది పేషంటు.

4. కంగారు పడినది ఎవరు?
జవాబు:
కంగారు పడినది అల్లుడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

4. హద్దులు హద్దులు నాటిక ద్వారా, తినడానికి హద్దులు, నవ్వడానికి హద్దులు, ఆలస్యానికి హద్దులు, తొందరకు – హద్దులు, చాదస్తానికి హద్దులు, అల్లరికి హద్దులు, ఖర్చుకు హద్దులు – ఉండాలని రచయిత సందేశం ఇచ్చాడు.

పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు గదా అని, అతిగా ఫలహారాలూ, పిండివంటలూ, చిరుతిళ్ళు పెడితే, అవి తిన్న వారికి రోగం వస్తుందని ఈ నాటిక సందేశం ఇస్తోంది. బావమరిది బావగారిని వేళాకోళం చేయడం సహజం. కానీ అల్లరి అతిగా ఉండరాదని ఈ నాటిక సందేశం ఇచ్చింది. అల్లం రసం పట్టే సందే ఉంటే, మరి రెండు బొబ్బట్లు బావగారు లాగించేసే వారని మరిది అతిగా వేళాకోళం చేశాడు.
ప్రశ్నలు:
1. ప్రతీదానికి హద్దులు ఉండాలని సందేశం ఇచ్చింది ఎవరు?
జవాబు:
ప్రతీదానికి హద్దులు ఉండాలని సందేశం ఇచ్చింది రచయిత.

2. పండుగకు వచ్చింది ఎవరు?
జవాబు:
పండుగకు వచ్చింది కొత్త అల్లుడు.

3. చిరుతిళ్ళు అతిగా తింటే ఏమి వస్తుంది?
జవాబు:
చిరుతిళ్ళు అతిగా తింటే రోగం వస్తుంది.

4. ఎవరు ఎవరిని వేళాకోళం చేయడం సహజం?
జవాబు:
బావమరిది బావను వేళాకోళం చేయడం సహజం.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఈ నాటిక సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కొత్త అల్లుడు తన అత్తవారింటికి పండుగకి వస్తాడు. కొత్త అల్లుడు వచ్చాడనే సంబరంతో వాళ్ళు రకరకాల పిండివంటలు చేసి అల్లుడికి విందుభోజనం తినిపిస్తారు. తమ ఇంటికి వచ్చిన బావగారిని మరిది హద్దుమీరి వేళాకోళం చేస్తుంటాడు. అది చూచిన మామగారు తన కొడుకుని అలా చేయకూడదని మందలిస్తాడు. అత్తగారు కూడా ఎంత బావయినా అలా చేయకూడదని కొడుకుని కోప్పడుతుంది. అల్లుడుగారు కూడా కొంత బెట్టుగా ఉంటే బాగుంటుంది అంటుంది.

ఇంతలో అల్లుడు కడుపునొప్పితో మెలితిరిగిపోతాడు. బావగారితో మరిది వేరుశనగకాయలు కావాలా ? అని వేళాకోళం చేస్తాడు. అల్లుడు మరిదిపై కోప్పడతాడు.

అత్తగారు డాక్టరును తీసుకురమ్మని భర్తతో అంటుంది. పండుగ ఖర్చుతో పాటు, డాక్టరు ఖర్చూ వచ్చిందని మామగారు మూలుగుతాడు. చివరకు డాక్టరు పరీక్షించి అల్లుడి పొట్టకు ఆపరేషన్ చేయాలన్నాడు. వేయిరూపాయలు ఖర్చవుతుందన్నాడు. అల్లుడు తన ప్రాణం పోతుందని కంగారుపడ్డాడు. తప్పనిసరయి, మామగారు ఆపరేషను చేయించాడు.

అల్లుడు పొట్టలో అతడు తిన్న గారెలు, బూరెలతోపాటు చెంచాలు, అణాలు, నాణేలు ఉన్నాయి. వాటిని తీసి డాక్టరు అందరికీ చూపించాడు. అత్తగారు పోపులడబ్బాలో దాచిన నాణేలు శనగపప్పుతో కలిసి అల్లుడి పొట్టలోకి వెళ్ళాయి.

అన్ని పనులకూ హద్దులు ఉండాలి అని ఈ నాటిక సందేశం ఇస్తుంది.

ప్రశ్న 2.
ఈ నాటికలో మీకు నచ్చిన హాస్య సంఘటనను రాయండి. “హద్దులు – హద్దులు” నాటికలోని మీకు నచ్చిన హాస్య సన్నివేశాన్ని రాయండి.
(లేదా)
హద్దులు – హద్దులు నాటిక ద్వారా మీరు పొందిన ‘హాస్యానుభూతి’ని మీ మాటల్లో రాయండి.
జవాబు:
ప్రతిదానికి హద్దులుండాలంటూ హాస్యస్పోరకంగా సాగిన ఈ నాటకం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. అయితే నాకు ఈ నాటకంలో అల్లుడి పొట్టను డాక్టరు రంపంతో కోసి ఆపరేషను చేసినట్లు చూపించిన ఘట్టం కడుపు ఉబ్బేలా నవ్వు తెప్పించింది.

డాక్టరు నర్పును ఆపరేషనుకు సిద్ధం చేయమంటాడు. నర్పు రంపం తీసుకువస్తుంది. “ఈ రంపమేమిటి ? దీనితో కోస్తారా ?” అని అల్లుడు కంగారుపడతాడు. “దేనితో కోస్తే నీకెందుకు ? మాట్లాడకుండా బల్లమీద పడుకో” అని డాక్టరు అల్లుడిని మందలిస్తాడు.

తర్వాత ప్రేక్షకులకు పేషంటు కనబడడు. కానీ డాక్టరు రంపంతో కోసినట్లు నటించి పొట్టలో నుంచి, బొబ్బట్లు, గారెలు, చెంచాలు వగైరా ఒక్కొక్కటీ తీసి, ప్రేక్షకులకు చూపించి, పక్కన పెడుతూ ఉంటాడు.

డాక్టరు ఆపరేషను పూర్తి చేసి, “పెద్దవాళ్ళెవరో ఒకసారి ఇలా రండి” అని పిలిస్తాడు. అత్తగారు, “ఆపరేషన్ పూర్తయ్యిందా ! మా అల్లుడు కులాసాగా ఉన్నాడా ?” అని డాక్టర్ని అడుగుతుంది. అప్పుడు డాక్టరు “ఏమల్లుడు ? నా మొఖం అల్లుడు” అంటాడు. అప్పుడు అత్తగారు గుండెలు బాదుకొని, “అయ్యో అయిపోయిందా, అయ్యో నా తల్లీ ! ఓ నా కూతురా ! చిన్నతనంలోనే నీకీ…..” అంటూ ఏడుస్తుంది.

“ఛా. ఛా ! ఊరుకోండి. మీ అల్లుడు నిక్షేపంలా ఉన్నాడు” అని డాక్టరు ఆవిడను మందలిస్తాడు.

ఈ హాస్య ఘట్టం నాకు ఎంతగానో నచ్చింది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

ప్రశ్న 3.
హద్దులు – హద్దులు నాటిక ద్వారా రచయిత ఇచ్చిన సందేశాన్ని వివరంగా చర్చించండి.
జవాబు:
దేనికైనా హద్దులుండాలని రచయిత ఈ నాటకం ద్వారా సందేశమిచ్చారు.

పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు గదా అని, అతిగా ఫలహారాలూ, పిండివంటలూ, చిరుతిళ్ళు పెడితే, అవి తిన్నవారికి రోగం వస్తుందని ఈ నాటిక సందేశం ఇస్తోంది. బావమరిది బావగారిని వేళాకోళం చేయడం సహజం. కానీ అల్లరి అతిగా ఉండరాదని ఈ నాటిక సందేశం ఇచ్చింది. “అల్లం రసం పట్టే సందే ఉంటే, మరి రెండు బొబ్బట్లు బావగారు లాగించేసే వార”ని మరిది అతిగా వేళాకోళం చేశాడు.

అల్లుడు అజీర్ణం చేసి, గిలగిలలాడుతూ ఉంటే, డాక్టరు దగ్గరకు వెళ్ళడానికి ఖర్చు అవుతుందని మామగారు వెనకాడతాడు. ఆలస్యానికి హద్దులుండరాదని ఈ ఘట్టం చెపుతోంది.

అల్లుడికి అజీర్ణం చేయడానికి నీవే కారణం అని మామగారూ, మీరే కారణం అని అత్తగారూ డాక్టరు దగ్గరే పోట్లాటకు దిగారు. పోట్లాటకు హద్దులుండాలి అని ఈ నాటిక సూచిస్తోంది.

డాక్టరు ఆపరేషనుకు ఫీజు వేయి రూపాయలు కావాలన్నాడు. ఫీజుకు హద్దులుండాలని ఈ నాటిక తెలుపుతోంది. అల్లుళ్ళు అత్తవారింట్లో అతి చనువుగా ఉండరాదనీ, మరీ ముంగిగా కూడా ఉండరాదనీ ఈ నాటిక తెలిపింది.

రచయిత ఈ నాటకం ద్వారా తినడానికి హద్దులు, నవ్వడానికి హద్దులు, ఆలస్యానికి హద్దులు, తొందరకు హద్దులు, చాదస్తానికి హద్దులు, అల్లరికి హద్దులు, పిసినారితనానికి హద్దులు, ఖర్చుకు హద్దులు ….. మొత్తానికి అన్నింటికీ హద్దులుండాలని సందేశమిచ్చారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 11 భూదానం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 11th Lesson భూదానం

8th Class Telugu 11th Lesson భూదానం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో గాంధీజీ, ఆయన అనుచరులూ, కాంగ్రెసు సేవాదళ్ కార్యకర్తలూ ఉన్నారు. వారు పాదయాత్ర చేస్తున్నారు.

ప్రశ్న 2.
వీళ్ళు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు?
జవాబు:
వీళ్ళు పార్టీ కార్యక్రమాలను ప్రజలలో ప్రచారం చేయడానికి, ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోవడానికి, పాదయాత్ర చేస్తున్నారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

ప్రశ్న 3.
ఇలా పాదయాత్రలు చేసినవారు మీకు తెలుసా? చెప్పండి.
జవాబు:
గాంధీజీ, వినోబా భావే, వంటి నాయకులు పాదయాత్రలు చేశారు. వెనుక, శంకరాచార్యులు, మహావీరుడు, బుద్ధుడు, కబీరు, చైతన్యుడు, నామ్ దేవ్ వంటి గురువులు కూడా పాదయాత్రలు చేశారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
‘భూదానం’ అని పాఠం పేరును విన్నప్పుడు మీరేమి అనుకున్నారు?
జవాబు:
సామాన్యంగా పుణ్యం కోసం దానాలు చేస్తూ ఉంటారు. ఆ దానాల్లో దశదానాలు ముఖ్యం. ఆ పది దానాల్లో భూదానం ఒకటి. పెద్దలు చనిపోయినపుడు వారు స్వర్గానికి వెళ్ళడానికి బ్రాహ్మణులకు భూమిని దానం చేస్తారు. లేదా లక్షవర్తి వ్రతం, ఋషి పంచమీ వ్రతం వంటివి చేసినపుడు, పుణ్యం కోసం భూదానం చేస్తారు. ఈ విధంగా ఎవరో పుణ్యాత్ములు, భూదానం చేశారని భూదానం మాట విన్నప్పుడు అనుకున్నాను.

ప్రశ్న 2.
ఈ పాఠం ద్వారా మీరు గ్రహించినదేమిటి?
జవాబు:
గాలి మీద, నీటి మీద, వెలుగు మీద ప్రజలందరికీ సమాన హక్కు ఉన్నట్లే, భూమి మీద కూడా అందరికీ సమాన హక్కు ఉన్నదని గ్రహించాను.

ప్రశ్న 3.
‘భూ సమస్య చాలా పెద్దది’ అని వినోబా అన్నారు కదా ! ఇలా ఎందుకు అని ఉంటారు ? ఇది ఈనాటి పరిస్థితులలో కూడా ఇలాగే ఉందా? దీని మీద మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
మనదేశంలో కొందరి దగ్గర అంగుళం భూమి కూడా లేదు. కొందరి దగ్గర వందలాది వేలాది ఎకరాల భూమి ఉంది. భూమి కలవారు తక్కువ. లేని వారు ఎక్కువ. అందువల్ల భూ సమస్య చాల పెద్దది అని వినోబా అన్నారు.

ఈనాడు మనదేశంలో భూసంస్కరణలు అమలయ్యాయి. అందువల్ల ప్రతి వ్యక్తి వద్ద కూడా 28 ఎకరాల పల్లం భూమి, లేక 50 ఎకరాల మెట్ట భూమి మించి ఉండరాదు. ఇప్పుడు కూడా భూ సమస్య ఉంది. ఇల్లు కట్టుకొనే చోటు లేక పేదలు బాధపడుతున్నారు. కొందరు నాయకులు అక్రమంగా సెజ్ ల పేరుతో వేల ఎకరాల భూమిని ఆక్రమిస్తున్నారు.

II. చదవడం – రాయడం

1. కింది వాక్యాలు చదవండి. ఆ వాక్యాలకు సమానభావం వచ్చే వాక్యాన్ని గుర్తించండి.

అ) పల్లె పట్టణాల ప్రజల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది. పల్లెల్లో ఆప్యాయతతో కూడిన ప్రత్యేక విశేషం కనబడింది.
అ) పల్లె పట్టణాల ప్రజల్లో ప్రత్యేక విశేషం ఉంది. (✗)
ఆ) పల్లె ప్రజల కంటే, పట్టణాల ప్రజల్లో ఎక్కువ విశేషం ఉంది. (✗)
ఇ) పల్లె ప్రజల్లో పట్టణ ప్రజల కంటే తక్కువ విశేషం కనబడింది. (✗)
ఈ) ఆప్యాయత అనే ప్రత్యేక విశేషం, పల్లె ప్రజల్లో ఎక్కువగా కనబడింది. (✓)

ఆ) వినోబాకు తెలుగు వచ్చు. కానీ తెలుగులో మాట్లాడలేరు. అయినా వచ్చిన తెలుగు భాష వల్ల ఎంతో ప్రయోజనం కలిగింది.

అ) వినోబాకు తెలుగు వచ్చు. కానీ సరిగా మాట్లాడలేరు. (✓)
ఆ) వినోబాకు తెలుగు రాదు. కాబట్టి అసలే మాట్లాడలేరు. (✗)
ఇ) వినోబాకు తెలుగు బాగా వచ్చు, బాగా మాట్లాడగలరు. (✗)
ఈ) వినోబాకు తెలుగు బాగా రాదు. కానీ ఎంతో కొంత మాట్లాడగలరు. (✗)

ఇ) శివరాంపల్లి వెళ్ళవలసిన అవసరం లేకపోతే తోవలో కొద్ది రోజులపాటు ఉండవలసిన గ్రామాలు అనేకం తగిలాయి.
అ) శివరాంపల్లికి తప్పకుండా వెళ్ళాలి కాబట్టి తోవలోని గ్రామంలో ఉండవలసిన అవసరం ఉన్నా ఉండకుండా వెళ్ళారు. ( ✓)
ఆ) శివరాంపల్లికి వెళ్ళవలసిన అవసరం లేదు. అందుకే తోవలోని గ్రామాల్లో ఉండకుండా వెళ్ళారు. (✗)
ఇ) శివరాంపల్లికి వెళ్ళారు. తోవలోని గ్రామాల్లో కూడా కొద్దిరోజులు ఉండి వెళ్ళారు. (✗)
ఈ) శివరాంపల్లికి వెళ్ళడం కంటే ఇతర గ్రామాల్లో ఉండడం ఎక్కువ అవసరం. (✗)

ఈ) “మాకు కొద్దిగా భూమి దొరికితే, కష్టపడి పని చేసుకుంటాం; కష్టార్జితం తింటాం”.
అ) కష్టపడి పనిచేయడానికి భూమి ఉంటే, మేము మా కష్టార్జితం తింటాం. (✓)
ఆ) భూమి లేదు కాబట్టి, మేము కష్టపడి కష్టార్జితం తింటున్నాం. (✗)
ఇ) మాకు కొద్దిగా భూమి దొరికితే కష్టపడకుండా తినవచ్చు. (✗)
ఈ) మాకు భూమి ఉన్నది కాబట్టి కష్టార్జితం తినవలసిన పనిలేదు. (✗)

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. పాఠంలోని కింది పేరాలు చదవండి. ఆ పేరాలోని ముఖ్యమైన పదం / పదాలు కింద గీత గీయండి. అవి ఎందుకు ముఖ్యమైనవో రాయండి.
1వ పేరా, 3వ పేరా, 6వ పేరా, 7వ పేరా, 13వ పేరా, చివరి పేరా

పేరా పేరా లో ముఖ్యమైన పదం/పదాలు ఎందుకు ముఖ్యమో రాయడం
1వ పేరా పాదయాత్ర పాదయాత్ర వల్ల ప్రజలను, ప్రకృతిని దగ్గరగా చూడవచ్చు.
3వ పేరా పాదయాత్రే తగిన యాత్రా సాధనం పాదయాత్రలో తిరిగేటప్పుడు ప్రతి మాట నిండు హృదయంతో, ఎంతో విశ్వాసంతో చెప్పగలిగే వారు. అవసరమైన నిబ్బరం, ఆత్మవిశ్వాసం భావే గారికి కలిగాయి.
6వ పేరా ప్రజలు ప్రేమతో భూమిని ఇవ్వగలరు. ప్రేమతో 100 ఎకరాలు వెదిరె రామచంద్రారెడ్డి భూదానం చేయడం వల్ల.
7వ పేరా ఏ సమస్యనైనా అహింసా విధానంలో పరిష్కరింపవచ్చు. వినోబా భావే సాధించిన భూదాన విజయము నెహ్రూజీ అభినందనలను అందుకొంది.
13వ పేరా ఏడాదిలో లక్ష ఎకరాల భూదానం ప్రతి సభలో ప్రజలు భూదానం చేయడం వల్ల.
చివరి పేరా దేవుడు కల్పవృక్షం వంటివాడు భగవంతుడే భూదాన రూపంలో సాక్షాత్కరించాడని భావే గారి తలంపు.

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) వినోబా శివరాంపల్లికి ఎలా వెళదామనుకున్నారు? ఎందుకు?
జవాబు:
వినోబా శివరాంపల్లికి పాదయాత్ర ద్వారా వెళ్ళాలనుకున్నారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రకృతినీ, ప్రజలనూ, మిక్కిలి దగ్గరగా చూడవచ్చు. అందుకే వినోబా పాదయాత్ర ద్వారా శివరాంపల్లి వెళ్ళాలనుకున్నారు.

ఆ) వినోబాకు తెలుగు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందారు?
జవాబు:
వినోబాకు తెలుగు రావడం వల్ల, ప్రార్థన సభల్లో స్థితప్రజ్ఞుని లక్షణాలను గురించి తెలుగులో చెప్పేవారు. వినోబాగారి తెలుగుమాటలు ప్రజల హృదయాలకు హత్తుకొనేవి. మాట్లాడుతున్నవాడు తనవాడే, తన సోదరుడే అని, ప్రజలు ప్రేమతో ఆయనకు స్వాగతం పలికారు.

ఇ) వినోబా గ్రామాలకు వెళ్ళడం వల్ల ఏమి గ్రహించారు?
జవాబు:
వినోబా గ్రామాలకు వెళ్ళడం వల్ల, అక్కడ గ్రామంలో ఉన్న లోటుపాట్లు తెలుసుకోగలిగారు. అక్కడి సమస్యల్ని గ్రహించి వాటిని పరిష్కరించగలిగారు. ప్రతి గ్రామంలోనూ వినోబా భావే గారి ఉద్యమానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉండాలనీ, గ్రామస్థులతో సంబంధం ఏర్పడి ఉండాలనీ, అప్పుడు ఎన్నో గొప్ప కార్యాలను సాధించగలమని ఆయన గ్రహించారు.

ఈ) వినోబాకు పోచంపల్లిలో ఎలాంటి అనుభవం ఎదురైంది?
జవాబు:
వినోబా భావే పోచంపల్లి గ్రామం వెళ్ళారు. ఆ గ్రామ దళితులు వినోబాగార్ని కలిసి, తమకు కొద్దిగా భూమి దొరికితే కష్టపడి పనిచేసుకుంటాం, కష్టార్జితం తింటాం అని చెప్పారు. వారంతా సమష్టి వ్యవసాయం చేసుకోవడానికి అంగీకరిస్తే, వారికి పొలం ఇప్పిస్తాననీ, వారికి పొలం కావాలి అన్న అర్జీని ప్రభుత్వానికి పంపిస్తాననీ వినోబా చెప్పారు. ఇంతలో అదే సభలో వెదిరె రామచంద్రారెడ్డిగారు ఆ దళితులకు తాను వంద ఎకరాల భూమిని దానం ఇస్తానని వాగ్దానం చేశారు.

ఉ) వినోబా భూ సమస్యను ఎలా పరిష్కరించాలని భావించారు?
జవాబు:
పోచంపల్లిలో వినోబాగారికి గొప్ప అనుభవం కల్గింది. ప్రజలు ప్రేమతో భూమిని ఇవ్వగలరనే అనుభూతి ఆయనకు కలిగింది. భూ సమస్య విషయంలో కలిగిన ప్రత్యక్ష అనుభవాన్ని అర్థం చేసుకొంటే, భూ సమస్యకు పరిష్కారం సులభం అవుతుందని వినోబా గ్రహించారు. భూదానం చేయమని ప్రతి సభలోనూ ప్రజల ముందు ఆయన చేయి చాచారు. గాలిమీద, నీటిమీద, వెలుగుమీద అందరికి హక్కు ఉన్నట్లే, భూమిపై కూడా హక్కు అందరికీ ఉందని వినోబా ప్రజలకు చెప్పారు. భూదాన యజ్ఞం ద్వారా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని వారు భావించారు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) “పల్లెల్లో పట్టణాల కంటే ఆప్యాయతతో కూడిన ప్రత్యేక విశేషం కనబడింది,” అని వినోబా అన్నారు కదా ! పల్లెల్లోని ప్రత్యేక ఆప్యాయత అంటే ఏమై ఉంటుంది?
జవాబు:
పల్లెల్లో అతిథులకు ప్రేమగా స్వాగతం పలుకుతారు. వచ్చిన అతిథులకు అన్నపానీయములు అందిస్తారు. అందులోనూ తమ సమస్యల్ని అడిగి తెలుసుకొనే వినోబా వంటి సత్పురుషులను పల్లె ప్రజలు ప్రేమతో ఆదరంగా పిలిచి, వారికి ఉండడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. వారికి భోజన సదుపాయములు చేస్తారు. తమకు ఉన్న భూమిని దానం చేస్తారు. వినోబా వంటి వారి మాటలను ఆదరంగా వింటారు. ఇది చూచిన వినోబా, పల్లె ప్రజలలో ప్రత్యేక ఆప్యాయత ఉందని రాశారు.

ఆ) ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి భాషను నేర్చుకోవడం అవసరమా? ఎందువల్ల?
జవాబు:
మనము ఏదైనా ఇతర ప్రాంతాలకు, అక్కడ కొన్నిరోజులు ఉండి, అక్కడి ప్రజలతో పనిచేయవలసిన పరిస్థితి ఉంటే మనము అక్కడి ప్రజల భాష తెలిసికోవలసిన అవసరం వస్తుంది. ఒక ప్రక్క రాష్ట్రానికి గానీ, ఒక విదేశానికి కానీ, చదువుకోసమో, ఉద్యోగం కోసమో వెళ్ళవలసివస్తే అక్కడి ప్రజల భాషను నేర్చుకోవడం తప్పనిసరి అవుతుంది.

ఇ) సమష్టి వ్యవసాయం అంటే ఏమిటి? ఈనాడు గ్రామాల్లో సమష్టి వ్యవసాయాలు జరగకపోవడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
‘సమష్టి వ్యవసాయం’ అంటే గ్రామంలో రైతులు అందరూ తమకు ఉన్న పొలాల్ని కలిసికట్టుగా శ్రమించి పండించడం. వారు వచ్చిన ఫలసాయాన్ని, వారికి ఉన్న పొలాలను బట్టి పంచుకుంటారు. వ్యవసాయానికి పెట్టుబడులు అందరూ కలిసి పెడతారు. లాభనష్టాల్ని సమంగా పంచుకుంటారు.

ఈనాడు గ్రామాల్లో ప్రజలు బీదలు, ధనికులుగా, కులాలు మతాలుగా విడిపోయారు. గ్రామాల్లో అందరికీ వ్యవసాయ భూములు లేవు. అందరూ సమానంగా పెట్టుబడులు పెట్టలేరు. ప్రజలు గ్రామాల్లో ఐకమత్యంగా లేరు. అందువల్ల గ్రామాల్లో సమష్టి వ్యవసాయం నేడు సాగడం లేదు.

ఈ) బీదలకు ఉపకారం చేశామని దాతలు భావించకూడదని వినోబా చెప్పారు కదా ! ఆయన ఎందుకని అలా అని ఉంటారు?
జవాబు:
బీదవాళ్ళకు ఉపకారం చేశామని భూదానం చేసిన దాతలు అనుకుంటే, అది అహంకారం అవుతుంది. దానివల్ల వినోబా ఆశించిన ఫలితం సిద్ధించదు. గాలిమీద, నీటి మీద, వెలుగు మీద ప్రజలందరికీ హక్కు ఉన్నట్లే, భూమి మీద కూడా అందరికీ హక్కు ఉన్నదని ప్రజలు భావించాలి. కొందరి దగ్గర అంగుళం భూమిసైతం లేకపోవడం, మరికొందరి దగ్గర వేలాది ఎకరాలు ఉండడం సబబు కాదు. కాబట్టి దాతలు ఉపకారం చేశామని కాకుండా, ప్రజలందరికీ భూమిపై హక్కు ఉందని గ్రహించి భూదానం చేయాలి.

ఉ) పేదలకు, భూమికి ఉండే సంబంధం తల్లికి, బిడ్డలకు ఉన్న సంబంధం వంటిది అని వినోబా అన్నారు కదా ! అది సరైందేనా? ఎందుకు?
జవాబు:
పేదవారికి భూమిని ఇప్పించడమే వినోబాగారి పాదయాత్రలో ప్రధానమైన ఉద్దేశ్యం. ప్రజలలో భూదానం చేయాలన్న ప్రవృత్తిని మేల్కొల్పాలని వినోబా భావించారు. భూమి తల్లి వంటిది. కాగా ప్రజలు ఆ భూమికి బిడ్డలవంటివారు. ప్రజలు తల్లి వంటి భూమిని దున్ని పంటలు పండిస్తారు – అంటే తల్లి వంటి భూమి, తనకు పిల్లల వంటి ప్రజలకు, ఫలసాయాన్ని అందిస్తుంది. కాబట్టి పేదలకూ, భూమికీ గల సంబంధం, తల్లీ బిడ్డల సంబంధం వంటిది అని వినోబా భావించారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) వినోబా గురించి 10 వాక్యాలలో వ్యాసం రాయండి.
(లేదా)
భూదానోద్యమాన్ని విజయవంతంగా వినోబాభావే నడిపిన విధము రాయండి.
జవాబు:
వినోబా భావే గాంధీగారి ముఖ్య శిష్యుడు. గొప్ప సర్వోదయ నాయకుడు. వార్దాలో ఉండేవాడు. 1951లో హైదరాబాదు దగ్గరలో ఉన్న “శివరాంపల్లి” లో సర్వోదయ సమ్మేళనం జరిగింది. ప్రజలను దగ్గరగా చూడవచ్చని, వార్ధా నుండి వినోబా పాదయాత్రలో శివరాంపల్లి వెడుతున్నారు. 1951 ఏప్రిల్ 8వ తేదీన, వినోబా ‘పోచంపల్లి’ గ్రామం వచ్చారు. ఆ గ్రామ దళితులు తమకు కొంచెం భూమి దొరికితే కష్టార్జితంతో తింటాం భూమి ఇప్పించండి అని వినోబాను అడిగారు. వారు సమష్టి వ్యవసాయం చేసుకొని జీవిస్తామంటే, భూమిని ఇప్పిస్తాననీ, అర్జీ పెట్టమనీ, వినోబా వారికి చెప్పారు.

ఇంతలో ఆ ఊరి పెద్ద రైతు వెదిరె రామచంద్రారెడ్డి ఆ దళితులకు తాను వంద ఎకరాల భూమిని దానం చేస్తానన్నాడు. ప్రజలు ప్రేమతో భూమిని దానం ఇస్తారని వినోబాకు అనుభవం అయ్యింది. వినోబా పేదలకు భూమిని ఇప్పించడం కోసం, పాదయాత్ర చేశారు. ఒక ఏడాదిలో లక్ష ఎకరాల భూమి దానంగా వచ్చింది. వినోబా భూదాన యజ్ఞం ఫలించింది. గాలి, నీరు, వెలుగు వలె భూమి కూడా ప్రజలందరి హక్కు అని వినోబా నమ్మకం.

ఆ) కొందరికి అసలే భూమి లేకపోవడం, మరికొందరికి వందల ఎకరాల భూమి ఉండడం అనే పరిస్థితి నేడు కూడా ఉంది కదా! ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మీరు సూచించే పరిష్కార మార్గాలు ఏమిటి?
జవాబు:
నేటికీ మన ప్రజలలో కొందరికి అంగుళం కూడా భూమి లేదు. కాగా కొందరికి వందలు, వేల ఎకరాల భూమి ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మన ప్రభుత్వాలు భూసంస్కరణలు తెచ్చాయి. ఏ వ్యక్తికీ పల్లం భూమి 28 ఎకరాలు, మెట్టభూమి అయితే 50 ఎకరాలు మించి ఉండకూడదని చట్టం ఉంది. ఎక్కువగా పొలం ఉన్నవారి నుండి సర్కారు తీసుకొని, పేదలకు పంచింది.

కాని ఈ పని సక్రమంగా జరగలేదు. ప్రజలలో కొందరు తమవద్ద ఎక్కువగా ఉన్న పొలాలను ఎవరో కావలసిన వారి పేరున రాసి, బినామీ ఆస్తులుగా తమవద్దనే వాటిని ఉంచుకున్నారు. అదీగాక నేడు పరిశ్రమల స్థాపన పేరుతో, విమానాశ్రయాలు, ఓడరేవులు పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూముల్ని ప్రభుత్వ పెద్దల పలుకుబడితో కొందరు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వము భూసంస్కరణలను నియమబద్ధంగా, న్యాయంగా అమలు జరిపిస్తే, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

IV. పదజాలం

1. పాఠం ఆధారంగా కింది పదాల అర్థాలు తెలుసుకోండి. వీటిని సొంతవార్యాలలో రాయండి.

అ) “కష్టార్జితం” :
కష్టార్జితం అంటే కష్టపడి సంపాదించడం. తానే కష్టపడి పనిచేసి డబ్బునూ, భూమినీ సంపాదిస్తే, దాన్ని కష్టార్జితం అంటారు. తల్లిదండ్రుల వల్ల, తాత ముత్తాతల వల్ల ఆస్తులు సంక్రమిస్తే, దాన్ని “పిత్రార్జితం” అంటారు.

ఆ) “నిండు హృదయం” :
‘నిండు హృదయం’ అంటే మనశ్శుద్ధిగా అని భావం. తన మనస్సుకు పూర్తిగా అంగీకారం అయిన విషయం .

ఇ) “అసాధారణ ఘట్టం” :
సాధారణంగా జరిగే సంగతి కానిది. ఇటువంటి సంఘటన అరుదుగా జరుగుతుంది. అరుదైన సంఘటన అని భావం.

ఈ) “హృదయశుద్ధి” :
నిర్మలమైన మనస్సుతో చేసే పని. ఏదో తప్పని పరిస్థితులలో ఎదుటివారినీ నమ్మించడానికి కాకుండా, నిండు మనస్సుతో పవిత్రమైన బుద్ధితో చేయడం.

ఉ) “జీవన పరివర్తనం” :
బ్రతుకు విధానంలో మార్పు. అప్పటివరకు సాగించే బ్రతుకు విధానంలో మార్పు రావడాన్ని ‘జీవన పరివర్తనం’ – అంటారు.

ఊ) “సమాజ పరివర్తనం” :
మన చుట్టూ ఉంటే సంఘాన్ని ‘సమాజం’ అంటారు. నాటి వరకు నడచుకొనే మార్గం నుండి కొత్త విధానంలోకి సంఘ ప్రజలు మారడాన్ని “సమాజ పరివర్తనం” అంటారు.

ఎ) “సత్కార్యాలు” :
మంచిపనులు. సంఘంలోని ప్రజల మంచికోసం చేసే పనులు సత్కార్యాలు. దానధర్మాలు చేయడం, భూదానం, నేత్రదానం, అవయవదానం వంటి మంచి పనులను సత్కార్యాలు అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. కింది పదాలకు పర్యాయపదాలు రాసి సొంతవాక్యాలు రాయండి.
అ) రాత్రి = నిశి, రేయి రాత్రిపూట చంద్రుడు ఉదయిస్తాడు.
ఆ) పల్లె = గ్రామం, జనపదం పల్లెలు ప్రగతికి పట్టుకోమ్మలు.
ఇ) హృదయం= ఎద, మనసు హృదయం నిర్మలంగా ఉండాలి.
ఈ) భూమి = వసుధ, ధరణి భూమిపై శాంతి నెలకోవాలి.
ఉ) ఆకాంక్ష = కోరిక, వాంఛ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలి.

3. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) పాపము = దుష్కృతం, పావడం
ఆ) ప్రజలు – జనులు, సంతానము
ఇ) ధనము = సంపద, ఆవులమంద
ఈ) యుగము = కృతాదియుగం, రెండు
ఉ) పొలం – కేదారము, అడవి
ఊ) వ్యవసాయం = కృషి, ప్రయత్నం, పరిశ్రమ

4. కింది వాక్యాలలో గీత గీచిన పదాలకు వికృతి పదాలు రాయండి.
అ) ప్రజలు ప్రేమతో భూమిని ఇస్తున్నారు.
ఆ) త్రిలింగ భాష మధురమైనది.
ఇ) మంచివారి హృదయంలో భగవంతుడుంటాడు.
ఈ) ఎవరి కార్యములను వారు సమర్థవంతంగా చెయ్యాలి.

ప్రకృతి వికృతి

ప్రజలు – పజలు
ప్రేమ – ప్రేముడి
భాష – బాస
త్రిలింగం – తెలుగు
హృదయం – ఎద, డెందము
కార్యం – కర్జము

V. సృజనాత్మకత

ప్రశ్న 1.
నువ్వే వినోబా స్థానంలో ఉంటే, నేటి పరిస్థితుల్లో ప్రజలకు ఏమని సందేశం ఇస్తావు ? దాన్ని రాసి ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
“ఏకపాత్రాభినయం”

నేను గాంధీగారి శిష్యుణ్ణి. నా పేరు వినోబా భావే. నా పేరు ఈ పాటికే మీ చెవిన పడి ఉంటుంది. నేను భూదాన యజ్ఞం ప్రారంభించాను. ఈ యజ్ఞంలో మొదటి దానం చేసిన పుణ్యాత్ముడు పోచంపల్లిలో రామచంద్రారెడ్డి. ఆ దానకర్ణుడు తన గ్రామంలో దళితులకు 100 ఎకరాలు భూదానం చేశాడు. మనం తల్లికి పుట్టినప్పుడు, మన వెంట ఏమీ తీసుకురాలేదు. పోయినప్పుడు పూచికపుల్ల కూడా పట్టుకెళ్ళలేము.

మన తోటి సోదరులు బీదవారు, ఇల్లు కట్టుకోవడానికి కూడా జాగా లేక ఏడుస్తున్నారు. దాతలారా ! వారి కన్నీరు తుడవండి. భూదాన యజ్ఞంలో మీ వంతుగా ఒక సమిధ వేసి, పుణ్యం సంపాదించండి. మీకు గాంధీజీ ఆశీస్సులు ఉంటాయి. కదలండి. వస్తా …

(లేదా)

ప్రశ్న 2.
ఈనాటి పరిస్థితులకునుగుణంగా భూదానం ఆవశ్యకతను వివరిస్తూ ఒక పోస్టరును తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
పోస్టరు

“మిత్రులారా ! భూదానం అన్ని దానాల్లో గొప్పదానం. భూదానం చేసేవారికి స్వర్గాది పుణ్యలోకాలు వస్తాయి. మీ తోడిజనంలో కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి చోటులేక, కూరగాయలు పండించడానికి జాగాలేక, వ్యవసాయం చేయడానికి పొలం లేక బాధపడుతున్నారు. మీకు వ్యవసాయ కూలీలు దొరకడం లేదు.

మనం గాలి, నీరు, వెలుగు సమంగా అనుభవిస్తున్నాం. అలాగే భూమి కూడా ప్రజలందరిది. మీకున్న వంద ఎకరాలలో రెండు ఎకరాలు తక్కువైతే, మీ వారికి లోటు రాదు. కానీ ఆ రెండు ఎకరాలు మీరు దానం ఇస్తే, 100 మంది దరిద్ర నారాయణులు ఇళ్ళు కట్టుకుంటారు. కలకాలం మీ పేరు చెప్పుకుంటారు. మీకు స్వర్గం వస్తుంది.

ఎకరం పైగా దానం చేసిన రైతులకు ముఖ్యమంత్రి గారు స్వయంగా సత్కారం చేస్తారు. త్వరపడండి. భూదానం చేయండి. పుణ్యం మూట కట్టుకోండి. పత్రికల్లో మీ పేరు, మీ ఫొటోతో వేస్తారు. మరువకండి.

ఇట్లు,
భూదాన యజ్ఞం సభ్యులు.

VI. ప్రశంస

1. భూదానం అనేది ఒక సత్కార్యం. ఇలాంటివే ఇంకా ఏ ఏ సత్కార్యాలు చేయవచ్చు ? ఇలాంటి సత్కార్యాలు చేసిన వారిని అభినందిస్తూ లేఖ రాసి ప్రదర్శించండి.
జవాబు:
భూదానం ఒక మంచిపని. భూదానం లాగానే విద్యాదానం, నేత్రదానం, కిడ్నీదానం, అవయవదానం, పాఠశాలలకు కావలసిన ఫర్నిచరు దానం, పేద విద్యార్థులకు పుస్తకదానం, పేద విద్యార్థులకు ఫీజులకు ధన దానం, మెరిట్ విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం, మంచి క్రీడాకారులకు షీల్డులు ఇవ్వడం వంటివి చేయవచ్చు.

సత్కార్యాలను చేసిన వారిని అభినందిస్తూ లేఖ

విజయవాడ,
x x x x x

పి. సుధీర్ కుమార్,
8వ తరగతి,
S/o రాజేంద్ర కుమార్,
శాంతి హైస్కూలు,
గవర్నరుపేట, విజయవాడ.

పూజ్యశ్రీ కె. గుణశేఖర్ గార్కి,

అయ్యా, నమస్తే. మీరు మీ ‘బంటుమిల్లి’ గ్రామంలో, దళితులకు ఇండ్లు కట్టుకోవడానికి మూడు ఎకరాల పొలం ఇచ్చారట. మీ ఊరి హైస్కూలు పిల్లలకు ఉచితంగా నోటుపుస్తకాలు, పెన్నులు ఇచ్చారట. మీ తదనంతరం మీ నేత్రాలను నేత్రదానం చేశారట. మేము పేపరులో చదివాం. మీరు చేసిన ఈ దానాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయి.

మీకూ, మీ దానగుణానికీ, మా పాఠశాల విద్యార్థుల తరఫున అభినందనలు. నమస్కారాలు. సెలవు.

ఇట్లు,
మీ అభిమాని,
పి. సుధీర్.

చిరునామా :
K. గుణశేఖర్,
S/o ల్యాండ్ లార్డ్,
బంటుమిల్లి,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్.

(లేదా)

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. వినోబా భూదాన ఉద్యమం కోసం చేసిన పాదయాత్రను అభినందిస్తూ, ఆయనకు ఏమని లేఖ రాస్తారు? రాసి గోడ పత్రికలో ప్రదర్శించండి.
జవాబు:

వినోబాభావే గారికి అభినందన లేఖ

గుంటూరు,
x x x x x

పి. సీతాలక్ష్మి,
8వ తరగతి,
వివేకానంద హైస్కూల్,
రాజేంద్రనగర్,
గుంటూరు.

పూజ్యశ్రీ వినోబా భావే మహాశయులకు,

నమస్కారములు. మీరు మా నగరానికి దగ్గరలో గల పోచంపల్లిలో రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన వంద ఎకరాల భూదానంతో ప్రేరణ పొంది, భారతదేశంలో భూదాన యజ్ఞం ప్రారంభించారనీ, బీదలకు లక్షల ఎకరాలు భూమిని ఇప్పించారనీ మా మాష్టారు చెప్పారు. నేను మీ ఉద్యమాన్ని, యజ్ఞాన్ని గూర్చి తెలుసుకొని మురిసిపోయాను.

మీకు శతకోటి నమస్కారాలు. ప్రజలలో భూదానం చేయాలనే ప్రేరణ కల్గించిన మీకు, మా పాఠశాల విద్యార్థుల తరఫున అభినందన మందారాలు. నమస్తే.

ఇట్లు,
మీ అభిమాని,
కుమారి పి. సీతాలక్ష్మి,
8వ తరగతి,
సెక్షను-‘ఎ’.

చిరునామా :
వినోబా భావే ఆశ్రమ సంచాలకులకు,
వార్థా,
మహారాష్ట్ర.

ప్రాజెక్టు పని

1. పోచంపల్లిలో రామచంద్రారెడ్డిగారు వినోబా భావే ప్రసంగానికి ప్రేరణపొంది ఒకేసారి వంద ఎకరాలను దానం చేశారు కదా! అలా మీ ఊరిలోనూ పేరు పొందిన దాతలు కొందరు ఉంటారు కదా ! వాళ్ళ పేర్లను సేకరించి ఎవరు ఏ రకమయిన దానం చేశారో తెలియజేసే వివరాలను రాసి గోడపత్రికలో పెట్టండి.
జవాబు:
కొవ్వూరు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో రెవెన్యూ డివిజన్ కేంద్రము. కొవ్వూరు గ్రామం గోదావరీ నదికి పశ్చిమతీరాన ఉంది.

మా గ్రామంలో ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠము అనే సంస్కృతాంధ్ర కళాశాల ఉంది. దానికి ప్రిన్సిపాలుగా కీ|| శే|| కేశిరాజు వేంకట నృసింహ అప్పారావుగారు ఉండేవారు. వారు గాంధీ మార్గంలో నడిచిన దేశభక్తులు. వినోబా భావే గారి పిలుపుతో ప్రేరణ పొంది, వీరికున్న నాలుగు ఎకరాల పంటభూమిని భూదానం చేశారు. వారు కేవలం ఖద్దరు ధరించేవారు. వీరికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయన మా గ్రామవాసి అని తెలిసి నేను ఆనందిస్తున్నాను.

పి. శకుంతల, యన్. శ్రీధర్
గవర్నమెంటు హైస్కూలు,
కొవ్వూరు, ప|| గో|| జిల్లా,

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను విడదీయండి. సంధి పేరు రాయండి.
అ) సర్వోదయం = సర్వ + ఉదయం – గుణసంధి
ఆ) ఊహాతీతం = ఊహ + అతీతం – సవర్ణదీర్ఘ సంధి
ఇ) ఆయాచోట్ల = ఆ + ఆచోట్ల – యడాగమ సంధి
ఈ) తేవాలని = తేవాలి + అని – ఇత్వసంధి
ఉ) మరొకటి = మరి + ఒకటి – ఇత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు, సమాస నామాలు రాయండి.
అ) పాదయాత్ర – పాదములతో యాత్ర – తృతీయా తత్పురుష
ఆ) పల్లె ప్రజలు – పల్లె యందలి ప్రజలు – సప్తమీ తత్పురుష
ఇ) వంద ఎకరాలు – వంద సంఖ్యగల ఎకరాలు – ద్విగు సమాసం
ఈ) నా గ్రంథం – నా యొక్క గ్రంథం – షష్ఠీ తత్పురుష సమాసం

3. కింది వానిలో కర్తరి వాక్యం కర్మణి వాక్యంగా, కర్మణి వాక్యం కర్తరి వాక్యంగా మార్చండి.
అ) నెహ్రూ తన జాబులో సంతోషాన్ని వ్యక్తం చేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
నెహ్రూ చేత తన జాబులో సంతోషం వ్యక్తము చేయబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
ఆయనకు సమాధానం రాసి పంపారు. (కర్తరి వాక్యం)

ఇ) భగవంతుడు నా మాటలకు శక్తిని ప్రసాదించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
భగవంతుని చేత నా మాటలకు శక్తి ప్రసాదింపబడింది. (కర్మణి వాక్యం)

ఈ) నాచే దీనికి భూదానయజ్ఞం అని పేరు పెట్టబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను దీనికి భూదానయజ్ఞం అని పేరు పెట్టాను. (కర్తరి వాక్యం)

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

ఇల్లు : గృహం, సదనం
హృదయం : ఎద, మనసు
వ్యవసాయం : కృషి, సేద్యము
అవసరం : ఆవశ్యకం, అక్కల
తోవ : దారి, పథము
నిర్ణయం : నిశ్చయం, సిద్ధాంతం

వ్యతిరేకపదాలు

రాత్రి × పగలు
సమిష్టి × వ్యష్టి
లక్ష్యం × అలక్ష్యం
శాంతి × అశాంతి
ప్రత్యక్షం × పరోక్షం
సుఖం × కష్టం
ప్రవృత్తి × అప్రవృత్తి
స్పష్టం × అస్పష్టం
న్యాయం × అన్యాయం
విశ్వాసం × అవిశ్వాసం
అంగీకారం × తిరస్కారం
సత్కార్యం × దుష్కార్యం
హింస × అహింస

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

ప్రకృతి – వికృతులు

దూరం – దవ్వు
శక్తి – సత్తి
రూపం – రూపు
హృదయం – ఎద, ఎడద
గుణము – గొనము
కార్యం – కర్జం
న్యాయం – నాయం
యాత్ర – జాతర
యజ్ఞము – జన్నము
సత్యం – సత్తు

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశమగును.
శంకరాచార్యులు = శంకర + ఆచార్యులు – సవర్ణదీర్ఘ సంధి
ఊహాతీతుడు = ఊహ + అతీతుడు – సవర్ణదీర్ఘ సంధి
కష్టార్జితం = కష్ట + ఆర్జితం – సవర్ణదీర్ఘ సంధి
ప్రత్యక్షానుభవం = ప్రత్యక్ష + అనుభవం – సవర్ణదీర్ఘ సంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
వందలాది = వందలు + ఆది – ఉత్వసంధి
సాధనమని = సాధనము + అని – ఉత్వసంధి
అవసరమైన : అవసరము + ఐన – ఉత్వసంధి

ఇత్వసంధి
సూత్రము : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
కావాలనుకొని = కావాలి + అనుకొని – ఇత్వసంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
హృదయ పరివర్తనము హృదయము నందు పరివర్తనము సప్తమీ తత్పురుష సమాసం
మూడు విధానాలు మూడు సంఖ్యగల విధానాలు ద్విగు సమాసం
భూసమస్య భూమి యొక్క సమస్య షష్ఠీ తత్పురుష సమాసం
లక్ష ఎకరాలు లక్ష సంఖ్యగల ఎకరాలు ద్విగు సమాసం
రెండుమాటలు రెండు సంఖ్యగల మాటలు ద్విగు సమాసం
యాత్రాసాధనము యాత్ర కొరకు సాధనము చతుర్థి తత్పురుష సమాసం
భూదానం భూమి యొక్క దానము షష్ఠీ తత్పురుష సమాసం
సత్కార్యము మంచిదైన కార్యము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
భూదాన యజ్ఞము భూదానమనెడి యజ్ఞము రూపక సమాసం
భూఖండము భూమి యొక్క ఖండము షష్ఠీ తత్పురుష సమాసం
శాంతియుతం శాంతితో యుతం తృతీయా తత్పురుష సమాసం
కష్టార్జితం కష్టముతో ఆర్జితం తృతీయా తత్పురుష సమాసం

కొత్త పదాలు-అర్ధాలు

అభిలషించు = కోరు
అవధులు = హద్దులు, మేరలు
అనుగ్రహించు = దయతో ఇచ్చు
అనుభూతి = ప్రత్యక్ష జ్ఞానము
అహంకారం = గర్వము
ఆత్మవిశ్వాసం = తనపై నమ్మకం
ఆటపట్టు = నిలయం, చోటు
ఆచరణ = నడవడి (చేయుట)
అర్జీ = పై అధికారులకు రాసే లేఖ.
ఈర్ష్య = ద్వేషం
ఊహాతీతం = ఊహింపశక్యం కానిది
ఔదార్యం = దాతృత్వము;
కష్టార్జితం = కష్టపడి సంపాదించినది
కుత్తుక = కంఠము
కృతనిశ్చయులు = నిశ్చయం చేసుకున్నవారు
చిత్తశుద్ధి = మనస్సు పరిశుద్ధి
జాబు = ఉత్తరము
టూకీగా = కొద్దిగా, సంగ్రహంగా
తార్కాణం = నిదర్శనము

AP Board 8th Class Telugu Solutions Chapter 11 భూదానం

తామస భావం = తమోగుణం
నిబ్బరం = స్థిరము, తదేకాగ్రత
నిక్షిప్తం = ఉంచబడినది
దళితులు = హరిజనులు
దర్శనం = చూచుట
పరిష్కరించు = చక్కబెట్టు
పరివర్తన – మార్పు
ప్రభంజనం = పెద్ద గాలి
బీజాలు = విత్తనాలు
మహత్కార్యం = గొప్ప పని
మహత్తర = గొప్ప
మాత్సర్యం = అసూయ
ముమ్మరంగా = అధికంగా
సమ్మేళనం = సమావేశం
యోచించడం = ఆలోచించడం
రాజస భావం = రజోగుణం
లోభం = దురాశ
వ్యక్తం = వెల్లడి
వాగ్దానం = మాట ఇచ్చుట
విడ్డూరం = మొండితనం
సుగమము = సులభముగా తెలియునది
సమష్టి వ్యవసాయం= అందరూ కలసి చేసే వ్యవసాయం
సమక్షం = ఎదుట
సాక్షాత్కారం = ప్రత్యక్షము
హత్తుకోవడం = చేరుకోవడం
హేతువు = కారణం
స్థిత ప్రజ్ఞులు = మనస్సులోని కోరికలను పూర్తిగా వదలి, నిర్మలమైన మనస్సుతో తృప్తి పొందేవారు ‘సిద్ధ ప్రజ్ఞులు’ అని భగవద్గీత చెబుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 10 సంస్కరణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 10th Lesson సంస్కరణ

8th Class Telugu 10th Lesson సంస్కరణ Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మొదటి చిత్రంలో ఉన్నవారు ఎవరు? ఆయన ఎలా ప్రసిద్ధులు?
జవాబు:
మొదటి చిత్రంలో ఉన్నది రాజారామ్మోహన్ రాయ్. ఆయన 1821 నాటివాడు. గొప్ప సంఘసంస్కర్త. ఆయన బ్రహ్మ సమాజమతాన్ని స్థాపించాడు. నాడు హిందూ సమాజంలో ఉన్న ‘సతి’ అనే దురాచారాన్ని నిర్మూలించడానికి, బాల్య వివాహాలను అరికట్టడానికి కృషిచేశాడు.

ప్రశ్న 2.
రెండో చిత్రంలో ఉన్నవారు ఎవరు? వారు ఎవరికోసం కృషి చేశారు?
జవాబు:
రెండో చిత్రంలో ఉన్నది కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఆయనకు “ఆంధ్రా రాజా రామమోహన రాయలు” అనే పేరు ఉంది. ఆయన గొప్ప సంఘసంస్కర్త. హితకారిణీ సమాజాన్ని స్థాపించారు. సాంఘిక దురాచార నిర్మూలనకు కృషిచేశారు. ఆయన స్త్రీ విద్యావ్యాప్తికి, వితంతు స్త్రీలకు పునర్వివాహాలు చేయించడానికి కృషి చేశారు.

ప్రశ్న 3.
సాంఘిక దురాచారాలు అంటే ఏమిటి?
జవాబు:
సంఘంలో ఉన్న చెడ్డ ఆచారాలను, సాంఘిక దురాచారాలు అంటారు. వరకట్నం, కన్యాశుల్కం, ‘సతి’ ఆచారం, వితంతు స్త్రీలను చిన్నచూపు చూడటం. స్త్రీ విద్య పనికిరాదనడం వంటివి సాంఘిక దురాచారాలు.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 4.
నేడు మన సమాజంలో ఏయే దురాచారాలు ఉన్నాయి?
జవాబు:
నేడు మన సమాజంలో వరకట్నం, బాల్యవివాహాలు, లంచగొండితనం, అంటరానితనం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం, వెట్టిచాకిరి, మతదురహంకారం వంటి దురాచారాలు ఉన్నాయి.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
మీరు గమనించిన దురాచారాలు, మూఢనమ్మకాలపై మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
దురాచారాలు :
సంఘంలో దురాచారాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అంటరానితనం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం, మూఢనమ్మకాలు, వరకట్నం, బాల్యవివాహాలు, వెట్టిచాకిరి, లంచగొండితనం, మతదురహంకారం వంటి దురాచారాలు సంఘంలో బాగా పేరుకుపోయాయి.

మూఢనమ్మకాలు :
దయ్యాలున్నాయని నమ్మడం, శకునాలు నమ్మడం, తాంత్రిక విద్యలపై నమ్మకం, అమావాస్య, చవితి వంటి తిథులు మంచివి కావనడం మొదలైన మూఢనమ్మకాలు కూడా సంఘంలో ప్రబలి ఉన్నాయి. నా

అభిప్రాయం :
ప్రజలలో చాలామంది నిరక్షరాస్యులు. వారిని సరిదిద్ది వారిలో గల దురాచారాల్ని మూఢనమ్మకాల్ని నిర్మూలించడంలో మనవంతు కృషి చేయాలి. సాంఘిక దురాచారాలను గురించి ప్రజలకు వివరించి చెప్పి వానిని ప్రజలు మానేటట్లు చేయడం మన కర్తవ్యం.

N.C.C., N.S.S., స్కౌటింగ్, రెడ్ క్రాస్ మొదలైన సంస్థల ద్వారా విద్యార్థులు ఈ సాంఘిక సేవలో పాలు పంచుకోవచ్చు. విద్యార్థులు తలచుకుంటే దేశంలోని ప్రజల దురాచారాలను, మూఢనమ్మకాలను సమూలంగా నిర్మూలించగలరని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
ప్రస్తుతం సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలు ఏవి? వాటి నిర్మూలనకు మీ వంతు కృషిగా ఏమి చేయాలను కుంటున్నారు?
జవాబు:
ప్రస్తుతం సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలలో కొన్ని :
1. వరకట్న దురాచారము
2. అవినీతి
3. బాలకార్మిక వ్యవస్థ

వరకట్న దురాచారం చాలా భిన్నమైన సమస్య. దీన్ని నిర్మూలించుటకు ప్రజలే సిద్ధంగా లేరు అని చెప్పవచ్చును. కట్నం తీసుకోకపోవటం అన్నది వరుని వైపు వారు చిన్నతనంగా భావించటం, కట్నం అవసరం లేదు అని వరునివైపువారు చెబితే వరునివైపు ఏవో లోపాలు ఉన్నట్లు వధువువైపు వారు అనుకోవటం జరుగుతున్నది. దీనినే నేను నా వంతు కృషిగా వరునివైపు వారికి, వధువువైపు వారికి అలాగే సమాజంలోని వారి అందరికి వరకట్న నిర్మూలన గురించి వివరంగా తెలియచేస్తాను. అలాగే నేను కూడా వరకట్నం తీసుకోను, వరకట్నం ఇవ్వను.

అవినీతి – ఇది ఇప్పుడు పెద్ద జటిల సమస్య. ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తున్నది. నావైపు కృషిగా ముందు నేను అవినీతిని చేయను. అలాగే నా చుట్టూ వున్న సమాజ సభ్యులు అందరినీ కాకపోయినా నా స్నేహితుల వరకైనా అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు కృషి చేస్తాను.

బాలకార్మికులు కూడా మనదేశంలో చాలామంది ఉన్నారు. నా స్నేహితుల సహాయంతో నేను వారిని ఆదుకుంటాను. అటువంటి వారిని గుర్తించి వారిని వెట్టిచాకిరి నుండి విడిపించి నావంతు కృషిగా పాఠశాలల్లో చేర్పిస్తాను.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 3.
“వరకట్న నిర్మూలన” కు రావలసిన మార్పులను “వరునివైపు – వధువువైపు” జట్లుగా విడిపోయి చర్చించండి.
జవాబు:

వరుడువైపు వాళ్ళు వధువువైపు వాళ్ళు
1) కట్నం తీసుకోవడమంటే బానిసలుగా అమ్ముడు పోవడమే అని మేం గ్రహిస్తాం. మీరు కూడా కట్నం ఇవ్వమని ఖచ్చితంగా చెప్పాలి. 1) అవును. మా తల్లిదండ్రులకు కట్నాలు ఇవ్వవద్దని చెపుతాం. సంతల్లో పశువుల్లా మగపిల్లల్ని బేరం పెట్టి అమ్మే తల్లిదండ్రులను మీరు వ్యతిరేకించండి.
2) వరునివైపు వారు కట్నం తీసుకోమని అంటే వారిలో ఏదో లోపం ఉందని ఆడపిల్లల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆ ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. 2) కొంతమంది అలానే ఆలోచిస్తున్నారు. తమ ఆడ పిల్లలకు కట్నం ఇవ్వలేక బాధపడే తల్లిదండ్రులు సైతం తమ మగపిల్లలకు కట్నాల కోసం పంతం పట్టడం దురదృష్టం.
3) వరకట్న నిషేధ చట్టం చేసి, ఏళ్ళు గడుస్తున్నా, ఏ మార్పు రాలేదు. వరకట్నం పుచ్చుకోవడం నేరమని మేము భావిస్తాం. 3) వరకట్నం ఇవ్వడం నేరమని మేము భావిస్తాం. వరకట్న బాధిత మహిళల గురించి రోజూ దినపత్రికల్లో చదువుతున్నాం, టీవీల్లో చూస్తున్నాం. వారిని హింసించేవారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి.
4) సృష్టిలో స్త్రీలు, పురుషులు ఇరువురికీ సమ ప్రాధాన్యముందని మా అభిప్రాయం. 4) అవును. తల్లిదండ్రులు ఈ విషయం గుర్తించి తమ ఆడపిల్లలకు కూడా తమ ఆస్తిలో వాటా కల్పించాలి. స్త్రీవిద్యను ప్రోత్సహించాలి.
5) మహిళా సంఘాలవాళ్ళు వరకట్న సమస్య విషయంలో అంత చైతన్యవంతంగా లేరనే చెప్పాలి. వారు వరకట్న నిర్మూలన కోసం ఉద్యమాలు చేయాలి. 5) అవును. పురుషులు కూడా వరకట్న వ్యతిరేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రచార, ప్రసార సాధనాలు తమ తోడ్పాటును అందించాలి.

II చదవడం, అవగాహన చేసుకోవడం

1. కింది పదాలు ఏ పేరాలోనివో గుర్తించి, ఆ పదాన్ని దేనికి సంబంధంగా వాడారో రాయండి.
జవాబు:

పదం పేరా సంఖ్య ఎందుకోసం వాడారు
పెనుభూతం 3 తరతరాలుగా మన సమాజాన్ని బాధిస్తున్న వరకట్న దురాచారం.
జటిలసమస్య 4 స్త్రీల అభ్యున్నతికి అవరోధంగా నిలిచిన రెండు ముఖ్య సమస్యలలో రెండవది, పరిష్కరించడానికి కష్టతరమైనది అయిన వరకట్న దురాచారం (మొదటిది విద్యావిహీనత).
రూపుమాపడం 2 బాల్యవివాహ దురాచారం.
పరిపాటి 8 వివాహ వేడుకల్లో మితిమీరి ధనవ్యయం చేయడం ఘనతగా పరిగణించడం.

2. కింది పేరాను చదవండి. ఎక్కడ?, ఏమిటి?, ఎందుకు?, ఎవరు?, ఎలా? అనే పదాలతో ప్రశ్నలు రాయండి.
వేమన జన్మించింది, తిరిగిందీ రాయలసీమే ఐనా ఆయన పద్యాలు, ఆయన సందేశం, ప్రభావం ఆంధ్రదేశము అంతా వుంది. వీరి పద్యాలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. వేమన సందేశానికి దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సమాజంలోని ఎక్కువ తక్కువలు, వివక్షలు, అంటరానితనం, అంధ విశ్వాసాలు, మూఢాచారాలు, జీవహింస, అవినీతి, అధర్మం మొదలైన విషయాలపై తన సరళమైన పద్యాల ద్వారా ప్రజల మనస్సులో హత్తుకుపోయేటట్లు విమర్శనాత్మక రచనలు చేశాడు. కులవ్యవస్థపై దాడి చేశాడు. స్వానుభవమైన, ఆచరణయోగ్యమైన తత్త్వాన్ని సరళభాషలో ప్రజలకు చెప్పి ప్రజాకవిగా తెలుగువారి మదిలో శాశ్వతస్థానం పొందారు.
ప్రశ్నలు :
1) వేమన ఎక్కడ జన్మించాడు?
2) వేమన ఎక్కడ తిరిగాడు?
3) వేమన పద్యాలూ, సందేశం ప్రభావం ఎక్కడ ఉంది?
4) ఆంధ్రదేశమంతా ఏమిటి ఉంది?
5) వేమన పద్యాలు ఎలా అనువాదమయ్యా యి?
6) వేమన సందేశానికి ఎక్కడెక్కడ గుర్తింపు వచ్చింది?
7) వేమన ఏ విషయాలపై రచనలు చేశాడు?
8) వేమన ఎలా విమర్శనాత్మక రచనలు చేశాడు?
9) వేమన దేనిపై దాడిచేశాడు?
10) కులవ్యవస్థపై దాడిచేసింది ఎవరు?
11) వేమన ఎందుకు విమర్శనాత్మక రచనలు చేశాడు?
12) వేమన పద్యాలు ఎలా ఉంటాయి?
13) వేమన ప్రజాకవి ఎలా అయ్యాడు?
14) వేమన ఎటువంటి తత్త్వాన్ని ప్రజలకు చెప్పాడు?
15) వేమన ఎవరి మదిలో శాశ్వత స్థానం పొందాడు?

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

3. కింది పట్టికను చూడండి. సదాచారం ఏదో, దురాచారం ఏదో గుర్తించండి. కారణం రాయండి.
జవాబు:

అంశం సదాచారం/దురాచారం
బాల్య వివాహాలు చేయడం దురాచారం
పెద్దలను గౌరవించడం సదాచారం
వరకట్నం తీసుకోవడం / ఇవ్వడం దురాచారం
తల్లిదండ్రులకు సేవచేయడం సదాచారం
వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం దురాచారం
స్త్రీ విద్యను ప్రోత్సహించడం సదాచారం
బడి ఈడు పిల్లలను పనుల్లో పెట్టడం దురాచారం
ఆడపిల్లలకు తొందరగా పెండ్లిండ్లు చేయడం దురాచారం
చిన్న పిల్లలను వసతి గృహాల్లో ఉంచి చదివించడం సదాచారం
తోటివారిని ఎవరినైనా సమానంగా చూడడం సదాచారం

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) శాసనాలు అమలు కావాలంటే ఏమి చేయాలని నండూరివారు అన్నారు?
జవాబు:
శాసనాలు చేసినంత మాత్రాన ఏ సాంఘిక సంస్కరణ ప్రయత్నమూ విజయవంతం కాబోదు. ఆ సాంఘిక సంస్కరణ యొక్క అవసరాన్ని ప్రజలు గుర్తించాలి. దానికి సంబంధించిన మానసిక చైతన్యం ప్రజలలో ప్రస్ఫుటించాలి. ప్రజల నుండి ఆ సంస్కరణకు, పూర్తి సహకారం రావాలని నండూరివారు అన్నారు.

ఆ) బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టడానికి ఏమేమి తోడ్పడతాయి?
జవాబు:
అతి బాల్యవివాహాలు ఈనాడు చెదురు మదురుగానే అక్కడక్కడ జరుగుతున్నాయి. నేడు అది ఒక పెద్ద సమస్యగా పరిగణించదగినంతగా జరగడం లేదు. ఈ పరిణామం సాధ్యం కావడానికి ప్రభుత్వం చేసిన ‘శారదా శాసనం’ ఒక్కటే కారణం అని అనుకోలేము. బాల్యవివాహాలు అనే దురాచారాన్ని రూపుమాపడానికి ఎందరో మహానుభావులూ సంఘసంస్కర్తలు, కృషి చేశారు. వారి కృషి ఫలితంగా, ప్రజలలో బాల్యవివాహాల పట్ల కలిగిన ఏవగింపు ఈ దురాచార నిర్మూలనకు ముఖ్య కారణం.

ఇ) వరకట్న దురాచారం గురించి రచయిత అభిప్రాయం ఏమిటి?
జవాబు:
వరకట్న దురాచారం నిర్మూలనానికి శాసనాలు ఉన్నప్పటికీ ఇది నిర్మూలన కాలేదు సరిగదా, నానాటికీ పెనుభూతంలా పెరిగిపోతోంది.

ఈ దురాచార నిర్మూలనకు ప్రజలు సిద్ధంగా లేరని, వరకట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం అన్నవి ప్రతిష్ఠకూ, సంఘంలో గౌరవానికి సంబంధించిన విషయాలుగా చెల్లుబాటు అవుతున్నాయని రచయిత అభిప్రాయం.

కట్నం అసలు తీసుకోకపోవడం, నలుగురిలో చిన్నతనంగా వరునివైపు వారు భావిస్తున్నారు. కట్నం తీసుకోని వరునిలో, ఏదో లోపం ఉండి ఉంటుందని, వధువువైపువారు సామాన్యంగా అనుకుంటున్నారు. ఎక్కువ కట్నం ఇవ్వడం, తీసుకోవడం గొప్పగా భావిస్తున్నారు.

వరకట్నం, వివాహంలో అధిక ధనవ్యయం చేయడం వంటి దురాచారాల నిర్మూలనకు, శాసనాలు అవసరమేకానీ, అంతకంటే ముఖ్యంగా వీటి పట్ల ఏహ్యభావాన్ని ప్రజల్లో కలిగించడం చాలా ముఖ్యమని, వీటి పట్ల యువతీయువకులు ఎదురు తిరిగేలా చేయాలని, కేవలం శాసనాలు దీన్ని సాధింపలేవని రచయిత అభిప్రాయపడ్డాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) నేడు పెళ్ళిళ్ళ సందర్భంగా ఎన్ని రకాలుగా ధనం వృథా అవుతుందో మీరు గమనించిన విషయాలు రాయండి.
జవాబు:
నేడు పెళ్ళిళ్ళ సందర్భంగా కొంతమంది ధనవంతులు వృథాగా ధనాన్ని ఖర్చుచేస్తున్నారు. అనవసర ఆడంబరాలకు పోయి విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. అలాగే మరికొంతమంది తమ తాహత్తుకు మించి, ఇతరులను చూచి (పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు) ధనాన్ని ఖర్చు పెడతారు. దానికి తమవద్ద ధనం లేక వడ్డీలకు తెచ్చి ఖర్చు పెడుతున్నారు. తరువాత వాటిని తీర్చలేక అప్పుల పాలవుతున్నారు.

ఆ) నేటికీ సమాజంలో ఏయే దురాచారాలు కనపడుతున్నాయి? దానికి కారణాలేమిటి?
(లేదా)
మన సంఘంలో ఉన్న దురాచారాలు తెలపండి.
జవాబు: నేటికీ వరకట్నాలు, మద్యపానం, క్లబ్బులు, పబ్బులు, అర్ధనగ్న నృత్యాలు, మత్తుమందులు, వగైరా దురాచారాలు సమాజంలో కనబడుతున్నాయి.

ముఖ్యంగా యువతీ యువకులు చదువులకూ, ఉద్యోగాలకూ గ్రామాలను వదలి, పట్టణాలకు వెడుతున్నారు. అక్కడ ప్రక్కవాళ్ళను చూసి, దురాచారాలు నేర్చుకుంటున్నారు. నాగరికత పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కట్నం తీసుకోని మగాణ్ణి అసమర్థునిగా సంఘం జమకడుతోంది. వరకట్నం తీసుకోకుండా, ఏ మగాడైనా ఆదర్శంగా పెళ్ళిచేసుకుంటే, అతణ్ణి వధువు తరపువారే ఏదో లోపం ఉన్నవాడిగా జమకడుతున్నారు. ఆడపిల్లలకు బాగా చదువు లేకపోడంతో కట్నాలు
ఇచ్చి పెళ్ళిళ్లు చేయవలసి వస్తోంది. ఆడపిల్లలకు ఆస్తిహక్కు లేకపోడంతో వరకట్నాలు అడుగుతున్నారు.

ఇ) దేశంలో వందశాతం అక్షరాస్యత ఇంకా సాధించలేకపోవడానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, బీదవారు కావడం వల్ల, వారికి చదువుపై ఆసక్తి లేకపోవడం వల్ల, పిల్లల్ని చదివించే ఆర్థికబలం లేకపోవడం వల్ల, పిల్లల్ని బడికి పంపడం లేదు.
  2. వయోజన పాఠశాలలు లేకపోవడం వల్ల చదువురాని పెద్దలు చదువుకోడం లేదు.
  3. చదువుకొనే వారికి హాస్టళ్ళలో భోజనం, ఉచిత పుస్తకాలు, దుస్తులు, పాఠశాలలకు వెళ్ళడానికి సైకిళ్ళు వగైరా ఇవ్వకపోడం వల్ల పిల్లలు చదవడం లేదు.
  4. గిరిజన ప్రాంతాల్లో, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ విద్య నేర్పే పాఠశాలలు లేవు.
  5. చదువుకొనే బాలబాలికలను కొందరు తల్లిదండ్రులు బాల్యంలోనే పనిలో పెడుతున్నారు. వారి చిన్నపాటి సంపాదనకు తల్లిదండ్రులు ఆశపడుతున్నారు.
  6. బాలకార్మికులవల్ల విద్యా శాతం పెరగడం లేదు.
  7. మన భారత ప్రభుత్వం భారతీయులనందరినీ అక్షరాస్యులను చేయాలనీ, నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలనీ తీర్మానించింది. మన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాస్యతను పెంచడానికి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అందులో శాశ్వత పథకాలు నత్తనడక నడుస్తున్నాయి. తాత్కాలిక పథకాలు తాటాకులమంటలా చురచురా వెలిగి ఆరిపోతున్నాయి. అందువల్లే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కావటల్లేదు.
  8. పథకాలు మంచివయినా, ఆచరణలో చిక్కులు వస్తున్నాయి. విద్యాశాఖకు ఏటా వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా, క్షేత్రస్థాయి సిబ్బందిలో గూడుకట్టుకున్న అలసత్వం, అశ్రద్ధ, నిర్లిప్తతతో ప్రజల్లో ఆశించిన చైతన్యం రావడం లేదు.
  9. AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి. –

అ) “ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేయడం కోసం అధికంగా ఖర్చు చేయడం”- దీన్ని వ్యతిరేకిస్తూ సరైన కారణాలు రాయండి.
జవాబు:
ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేయడం కోసం అధికంగా ఖర్చు చేయడం అనేది నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. దీనికి కారణాలు :

  1. అధికంగా ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయడం వలన అమూల్యమైన డబ్బు దుర్వినియోగం అవుతుంది. అందుకు బదులుగా అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరం.
  2. అలా ఖర్చు చేయకుండా ఆ ధనాన్ని ఏ పేదవారికో, చదువుకునేందుకు ఆర్థికసాయం లేక మధ్యలోనే చదువుకు స్వస్తి చెపుతున్న వారికో వినియోగించవచ్చు.
  3. అడుగడుగునా మనకు కనిపించే అన్నార్తులను, అభాగ్యులను ఆదుకోవచ్చు.
  4. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వంటివి నెలకొల్పవచ్చు.
  5. ధనవంతులు తాము ఖర్చు పెడుతున్న సొత్తుతో ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని అక్కడి వారికి జీవనోపాధిని కల్పించవచ్చు.
  6. గ్రామాలలో పరిశ్రమలను, కర్మాగారాలను నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు.
  7. జాషువాగారు చెప్పినట్లు రెండు నూలు దండలు, రెండు కప్పుల టీ పెళ్ళికి చాలు. ఒకరిని చూసి మరొకరు ఎక్కువగా పెళ్ళి ఖర్చులు చేసి పొలాలు అమ్ముకోడం, అప్పులు చేయడం, బంగారం వగైరా తాకట్టు పెట్టడం, అమ్మడం చేయరాదు.
  8. వధూవరులు, భగవంతుని సన్నిధిలో దండలు మార్చుకోవాలి. రిజిష్టరు ఆఫీసులో మూడు వందల ఖర్చుతో, పెళ్ళితంతు పూర్తి చేయాలి. ఒక్క ఫోటో చాలు.

ఆ) ‘స్త్రీలందరూ విద్యావంతులైతే, వరకట్న నిర్మూలన జరుగుతుంది’ – దీనిపై మీ అభిప్రాయాలను తెలుపుతూ వ్యాసం రాయండి.
జవాబు:
స్త్రీలందరూ విద్యావంతులయితే, వరకట్నాలు తగ్గవచ్చు. కాని ఆ చదువువల్ల వరకట్నాలు పూర్తిగా పోవు. చదువుకున్న స్త్రీ, తన కన్న ఎక్కువ చదివిన, ఎక్కువ సంపాదిస్తున్న మగాడినే పెళ్ళాడుతోంది. అందుచేత అటువంటి మగాళ్ళు, మరింత కట్నం అడుగుతున్నారు.

స్త్రీలు అందరూ విద్యావంతులయి, తాము కట్నం తీసికొన్న మగవాడిని పెళ్ళాడము అని పంతంపడితే, వరకట్నాలు పూర్తిగా తగ్గిపోతాయి. వరకట్నం ఆశింపని, సజ్జనుడిని స్త్రీ పెళ్ళాడడానికి ముందుకు వస్తే వరకట్నాలు పోతాయి. స్త్రీలకు పురుషులతోపాటు సమాన ఆస్తి హక్కులు ఇస్తే, వరకట్నాలు పోతాయి. పెళ్ళిళ్ళలో దుబారా వ్యయాన్ని అరికడితే, వరకట్నాలు తగ్గుతాయి.

పెళ్ళికాని స్త్రీలు, విద్యావంతులయి, ఉద్యోగాలు చేసికొంటూ, లేదా వృత్తివిద్యలు నేర్చుకొని స్వయంగా ఉపాధిని కల్పించుకొంటే, క్రమంగా వరకట్నాలు దూరం అవుతాయి. ఆడపిల్లల తండ్రులూ ఆడపిల్లలూ, కట్నం ఇవ్వనే ఇవ్వము అని భీష్మిస్తే, కట్నాలు దూరం అవుతాయి.

కేవలం స్త్రీలందరూ విద్యావంతులయినంత మాత్రాన, కట్నాలు పోవు అని నా అభిప్రాయం.

IV. పదజాలం

1. కింది పదాలకు సమానార్థాన్నిచ్చే పదాల సమూహంలో సమానార్థాన్ని ఇవ్వని పదం ఉంది. దాన్ని గుర్తించండి.
ఉదా :
ఇనుడు – సూర్యుడు, రవి, ఇంద్రుడు, భానుడు

అ) పరిణయం – పెళ్ళి, పరిమళం, మనువు, వివాహం
ఆ) శాసనం – ఆజ్ఞ, చట్టం, ఉత్తరం, ఉత్తరువు
ఇ) స్త్రీ – కొమ్మ, బంతి, పడతి, ఉవిద
ఈ) ధనం – విత్తం, దండనం, ద్రవ్యం, పైకం
ఉ) అభ్యున్నతి – తిరోగతి, ప్రగతి, పురోగతి, అభివృద్ధి

2. కింద ప్రకృతి, వికృతి పదాల ఆధారంతో వాక్యాలు రాయండి.
(విద్య – విద్దె; స్త్రీ – ఇంతి, నిజం – నిక్కం, యత్నం – జతనం)
ఉదా :
అ) విద్య రహస్యంగా దాచిన ధనం వంటింది.
జవాబు:
విద్దె లేనివాడు వింత పశువు.

ఆ) నేడు స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు.
జవాబు:
ఇంతులు ఇంటి సౌభాగ్యానికి పట్టుకొమ్మలు.

ఇ) నిజం నిర్భయంగా చెప్పాలి.
జవాబు:
దొంగ నిక్కం చెప్పినా, ఎవ్వరూ నమ్మరు.

ఈ) నిరంతర యత్నం వల్ల పనులు సాధింపవచ్చు.
జవాబు:
మనం జతనంతో ఏదైనా సాధించగలము.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

3. కింది వానిని సొంతవాక్యాలలో రాయండి.
అ) పెనుభూతం, ఆ) తరతరాలు, ఇ) నిరాడంబరం, ఈ) అప్పో సప్పో, ఉ) దిగజారిపోవు, ఊ) దురాచారాలు, ఋ) శాసనాలు, బ) హెచ్చుతగ్గులు.

అ) పెనుభూతం : అవినీతి నేటి కాలంలో పెనుభూతంలా మారింది.

ఆ) తరతరాలు : తరతరాలుగా ‘మా ఇంటిలో అందరూ వేంకటేశ్వర స్వామినే కొలుస్తున్నారు.

ఇ) నిరాడంబరం : గాంధీజీ నిరాడంబర జీవితాన్ని గడిపేవారు.

ఈ) అప్పో సప్పో : కొందరు తమ పిల్లలను అప్పో సప్పో చేసి కష్టపడి చదివించుకొంటున్నారు.

ఉ) దిగజారిపోవు : నేటి యువతరం చెడు వ్యసనాలకు లోనై దిగజారిపోతున్నది.

ఊ) దురాచారాలు : దురాచారాలను అందరం కలిసికట్టుగా రూపుమాపాలి.

ఋ) శాసనాలు : శాసనాలను చేసినంత మాత్రాన దురాచారాలు రూపుమాసిపోవు.

ఋ) హెచ్చుతగ్గులు : ధనిక, పేద అనే హెచ్చుతగ్గులు సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నాయి.

V. సృజనాత్మకత

* వరకట్నానికి రోజూ ఎంతో మంది బలైపోతున్నారు. వాటిని గురించి పత్రికల్లో, టి.విల్లో రోజూ చూస్తూనే ఉన్నాం. వరకట్నం లాంటి భయంకరమైన దురాచారాన్ని నిర్మూలించాలనే భావం ప్రజల్లో కలిగేటట్లు “పోస్టర్” తయారు చేయండి.
జవాబు:
వరకట్నం వద్దు – కోడలే ముద్దు

సోదర సోదరీమణులారా ! నిత్యం మనం పత్రికల్లో వరకట్న బాధితుల వివరాలను చదువుతున్నాం. టి.విల్లో వరకట్నం సరిపడ ఇవ్వలేదనీ, ఇంకా ఇమ్మనీ, పుట్టింటి ఆస్తులు తెగనమ్మి పట్టుకురమ్మనీ బాధించే భర్తల గురించి, అత్తమామల గురించి, ఆడపడుచుల గురించి చూస్తున్నాం. మీ ఇంటికి వచ్చిన కోడలిని లక్ష్మీదేవిగా భావించి, ఆదరించాలి. మీ కోడళ్ళను, మీ కన్నబిడ్డలుగా చూడాలి.

మీరు మీ కోడళ్ళను ప్రేమగా చూస్తే, మీ ఆడుబిడ్డలను వాళ్ళ అత్తవారు అలాగే చూస్తారు. మీరు మీ కోడళ్ళను సూటిపోటీ మాటలు అనేటప్పుడు మీ కన్నబిడ్డలకు ఆ పరిస్థితే ఎదురయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి మీరు మీ ఆడపిల్లలకు కట్నం ఇవ్వకండి. మీరు తీసుకోకండి. మీ ఆడపిల్లలను బాగా చదివించండి. వారు కూడా సంపాదించేలా తయారుచేయండి. మీ మగపిల్లలతో సమంగా ఆడపిల్లలకు మీ ఆస్తి పంచి ఇవ్వండి. “ఇలా మీరంతా దీక్షపట్టండి. ప్రతిజ్ఞ చెయ్యండి.” “వరకట్నం ఇవ్వం. వరకట్నం తీసుకోము.” ఇదే మా ప్రతిజ్ఞ.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

(లేదా)
* ఈ మధ్య కాలంలో పెండ్లిళ్ళు, ఇతర కార్యక్రమాల్లో సుమారు 20% ఆహార పదార్థాలు వృథా అవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దీన్ని అరికట్టడానికి నియమావళి రూపొందించి పోస్టర్ రూపొందించండి.
* శుభకార్యాలలో ఆహార పదార్థాల వృథాను అరికట్టడానికి ప్రజలను ఉద్దేశిస్తూ కరపత్రం రాయండి.
జవాబు:
పెళ్ళిళ్ళలో ఆహారపదార్థాల దుర్వ్యయం అరికడదాం

మిత్రులారా ! నిత్యావసర వస్తువుల ధరలు నిత్యం పెరిగిపోతున్నాయి. దేశ జనాభా పెరిగిపోతోంది. మన రైతులు చెమటోడ్చి పండించే పంటలు, దేశజనాభాకు సరిపోవడం లేదు.

మనలో చాలామంది పెళ్ళిళ్ళకు, చిన్న చిన్న కార్యక్రమాలకు వందల మందికి విందు చేస్తున్నాము. పిలిచిన వారందరూ రాకపోవడం, పూర్తిగా తినకపోవడం వల్ల కనీసం 30% పదార్థాలు మిగిలిపోతున్నాయి. అవి వృథా అవుతున్నాయి.

మనం కింది నియమాలు చేసికొందాం :

  1. పెళ్ళికి 100 మంది అతిథులు మించరాదు.
  2. చిన్న చిన్న శుభకార్యాలకు 10 మంది మించరాదు.
  3. మిగిలిన ఆహార పదార్థాలను వృద్ధాశ్రమాలకు గాని, అనాథ శరణాలయాలకు గాని తీసుకెళ్ళి వారికి పంచిపెట్టాలి. అంతేకాకుండా వండించేటప్పుడు తగిన పాళ్ళలో వండించాలి.
  4. మిగిలిన ఆహారపదార్థాలు పేదసాదలకు అన్నదానం చేయించాలి.
  5. వ్యర్థ పదార్థాలను బయట పడవేస్తే దానికి జరిమానా విధించాలి.

VI. ప్రశంస

* రంగాపురం గ్రామంలో రాధ 10వ తరగతి చదువుతున్నది. ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఆ గ్రామంలోని ‘బాలల హక్కుల వేదిక’ సభ్యులు వెళ్ళి బాల్యవివాహం జరపడం వల్ల నష్టాలను ‘రాధ’ తల్లిదండ్రులకు వివరించారు. బాల్య వివాహాన్ని ఆపారు. రాధ తన చదువును తిరిగి కొనసాగించింది. రాధ వివాహం ఆపిన ‘బాలల హక్కుల వేదిక’ను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
జవాబు:

లేఖ

అనంతపురం,
x x x x x x x x

‘బాలల హక్కుల వేదిక’ వారికి,
రామాపురం,
బంటుమిల్లి మండలం,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్.

మిత్రులారా,
మీరు సాధించిన ఘనవిజయాన్ని గూర్చి పత్రికలో చదివాము. మీ వేదిక సభ్యులు ‘రాధ’ అనే 10వ తరగతి చదివే 15 సంవత్సరాల అమ్మాయికి నిశ్చయమైన బాల్యవివాహాన్ని ఆపుచేయించారని తెలిసింది. బాల్యవివాహం వల్ల రాధ జీవితంలో ఎదుర్కోవలసిన కష్టాలను, ఆమె తల్లిదండ్రులకు వివరించి చెప్పి ఆ పెళ్ళిని జరగకుండా మీరు ఆపు చేయించారని తెలిసి మేము ఎంతో ఆనందించాము. మీరు చాలా మంచిపని చేశారు. రాధకు తిరిగి చదువుకొనే అవకాశం కల్పించి, ఆమె జీవితంలో వెలుగు రేఖలు ప్రసరించేలా చేశారు. మీకు మా ప్రత్యేక అభినందనలు. ధన్యవాదములు.

మీ వేదిక సభ్యులందరికీ మా కృతజ్ఞతలు.

ఇట్లు,
స్నేహ బాల సంఘం,
అనంతపురం,
ఆంధ్రప్రదేశ్.

చిరునామా:
బాలల హక్కుల వేదిక,
రామాపురం,
బంటుమిల్లి మండలం,
కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రాజెక్టు పని

* సంఘంలో దురాచారాలను రూపుమాపటం కోసం కృషిచేసిన సంఘసంస్కర్తల చిత్రపటాలు, వారి సేవల వివరాలు పాఠశాల గ్రంథాలయం నుండి / పత్రికల నుండి సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 2
1) ఆధునిక భారతదేశ సంఘసంస్కర్తలలో అగ్రగణ్యుడు రాజారామ్మోహన్ రాయ్. భారతీయ సాంఘిక పునరుజ్జీవనోద్యమ పితామహునిగా ఆయనను పేర్కొంటారు. సతీసహగమన నిషేధానికి, స్త్రీ విద్య, ఆధునిక విద్యా వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసెను. ఆయన చేసిన విజ్ఞప్తికి స్పందించి లార్డ్ బెంటింక్ ‘సతీసహగమన నిషేధ’ చట్టాన్ని జారీ చేసెను. రాజా రామమోహన్ రాయ్ ‘బ్రహ్మసమాజము’ను స్థాపించెను.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 3
2) కందుకూరి వీరేశలింగం (1848 – 1919) గొప్ప సంఘసంస్కర్త. ఆధునిక సాహిత్య యుగకర్త. స్త్రీ పునర్వివాహ ఉద్యమకర్త. ఆయన రచించిన ‘రాజశేఖర చరిత్ర’ తెలుగులో తొలి నవల. స్వీయచరిత్ర, ఆంధ్రకవుల చరిత్ర. ఇతర రచనలు, వివేకవర్ధిని, సతీహితబోధిని ఆయన ప్రారంభించిన తెలుగు పత్రికలు.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 4
3) రాజారామ్మోహన్ రాయ్ తరువాత అంతటి పేరొపొందిన సంఘసంస్కర్త, గొప్ప సంస్కృత పండితుడు, విద్యావేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్. కలకత్తా సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. వితంతు పునర్వివాహానికి చట్టబద్ధత కల్పిస్తూ 1856లో శాసనం వెలువడటం వెనుక ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి ఎంతగానో ఉంది. అనేక బాలికల పాఠశాలలను స్థాపించి స్త్రీ విద్యకై కృషి చేశారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 5
4) గోవింద రనడే గొప్ప మత, సాంఘిక సంస్కరణవేత్త. బాల్యవివాహాల నిషేధానికి, పరదా పద్ధతి తొలగించడానికి కృషి చేశారు. ‘ఇండియా నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్’ను ప్రారంభించారు. ప్రార్థనా సమాజ అభివృద్ధికి కృషి చేశారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ 6
5) శ్రీ నారాయణ గురు స్వాతంత్ర్యోద్యమ కాలంలోని దక్షిణాది సంఘసంస్కర్తలలో ఒకరు. ఆయన గొప్ప పండితుడు. తత్త్వవేత్త. కేరళ వజ్జవ కులంలో జన్మించిన ఆయన అంటరానితనాన్ని నిర్మూలించారు.

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను ఏం చేసి, సంధి పేరు రాయండి.
ఉదా :
చేసినంత = చేసిన + అంత – అత్వసంధి
అ) ఎక్కడైనా = ఎక్కడ + ఐనా – అత్వసంధి
ఆ) కారణమని = కారణము _ అని – ఉత్వసంధి
ఇ) బాధిస్తున్న = బాధిస్తు + ఉన్న – ఉత్వసంధి
ఈ) నిజమే = నిజము + ఏ – ఉత్వసంధి
ఉ) ఏమైన = ఏమి + ఐన – ఇత్వసంధి
ఊ) లేరనడం = లేరు + అనడం – ఉత్వసంధి
ఋ) హీనుడైన = హీనుడు + ఐన – ఉత్వసంధి

2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
ఉదా :
సంఘసంస్కర్తలు – సంఘమును సంస్కరించేవారు – ద్వితీయా తత్పురుషం
అ) వరకట్నం = వరుని కొరకు కట్నం – చతుర్డీ తత్పురుషం
ఆ) స్త్రీల అభ్యున్నతి = స్త్రీల యొక్క అభ్యున్నతి – షష్ఠీ తత్పురుషం
ఇ) విద్యావిహీనత = విద్యచేత విహీనత – తృతీయా తత్పురుషం
ఈ) విద్యావ్యాప్తి = విద్య యొక్క వ్యాప్తి – షష్ఠీ తత్పురుషం
ఉ) ధనవ్యయం = ధనము యొక్క వ్యయం – షష్ఠీ తత్పురుషం
ఊ) శక్తిహీనుడు = శక్తిచేత హీనుడు – తృతీయా తత్పురుషం

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

3. ముందు పాఠాల్లో క్వార్థకం, చేదర్థకం, శత్రర్థకం క్రియలను గురించి తెలుసుకున్నారు కదా !
కింది వాక్యాలలో గీత గీసిన క్రియలు వేటికి సంబంధించినవో గుర్తించండి.
ఉదా :
నీటిని వృథా చేస్తే భవిష్యత్తులో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడ్డారు. – చేదర్థకం
అ) టి.వి. ఎక్కువగా చూస్తే విలువయిన సమయం వృథా అవుతుంది. – చేదర్థకం
ఆ) అప్పన్న కొట్టు కుళ్ళి మంచివి ఏరి తీసుకురా! – క్వార్థకం
ఇ) దీప దిక్కులు చూస్తూ నడుస్తోంది. – శత్రర్థకం
ఈ) అఖిల పాటలు వింటూ ముగ్గులు వేస్తున్నది. – శత్రర్థకం
ఉ) మేధావంతుల వలస తగ్గితే మన దేశాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. – చేదర్థకం
ఊ) మీ అక్క భోజనం చేసి లేవలేకపోతుందేమో? – క్వార్థకం
ఋ) మహేశ్ తేనీరు తాగుతూ పత్రిక చదువుతున్నాడు. – శత్రర్థకం

తత్పురుష సమాసాలు :
విభక్తులు ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాల గురించి తెలుసుకున్నారు కదా ! కింది వాటిని కూడా పరిశీలించండి.
1) పూర్వకాయము – కాయము యొక్క పూర్వము

పై దానిలో ‘పూర్వ’ అనే పదానికి ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ‘పూర్వము’గా మారింది. ఇలా మొదటి పదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాం.

* సమాసంలో పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడమే ప్రథమా తత్పురుష, అంటే విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలు (డు, ము, వు, లు) చేరతాయి.

దీనినే ఏకదేశి సమాసం అని కూడా అంటారు. సాధారణంగా తత్పురుష సమాసాలలో ఉత్తరపదార్థానికి ప్రాధాన్యం ఉంటుంది. కాని ఏకదేశి సమాసం అంటే పూర్వపదార్థ ప్రధానంగల తత్పురుష సమాసం. కింది వాటిని పరిశీలించండి.
1) నఞ్ + సత్యం అసత్యం = సత్యం కానిది
2) నఞ్ + న్యాయము = అన్యాయము = న్యాయము కానిది
3) నఞ్ + ఉచితం = అనుచితం = ఉచితము కానిది

సంస్కృతంలో ‘నఞ్’ అనేది వ్యతిరేకార్థ బోధకం. దీనికి బదులు తెలుగులో అ, అన్ అనే ప్రత్యయాలు వాడుతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నః’ అనే అవ్యయాన్ని అనుసరించి, దీన్ని “నఞ్ తత్పురుష సమాసం” అంటారు.

5. కింది పదాలకు విగ్రహవాక్యాలు, సమాస పదాలు రాసి, సమాసం పేరు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) అర్ధరాత్రి రాత్రి యొక్క అర్ధము ప్రథమా తత్పురుష సమాసం
ఆ) అనూహ్యము ఊహ్యము కానిది నఞ్ తత్పురుష సమాసం
ఇ) అక్రమం క్రమం కానిది నఞ్ తత్పురుష సమాసం

6. తత్పురుష సమాసానికి చెందిన పదాలను ఇంతకు ముందు పాఠాల్లో వెదకండి. పట్టికలో రాయండి.

సమాసం పేరు విగ్రహవాక్యం సమాస పదం
1) ప్రథమా తత్పురుష సమాసం అర్ధము యొక్క ప్రథమము ప్రథమార్ధము
2) ద్వితీయా తత్పురుష సమాసం కృష్ణుని ఆశ్రయించిన వాడు కృష్ణాశ్రితుడు
3) తృతీయా తత్పురుష సమాసం జలముతో అభిషేకము జలాభిషేకము
4) చతుర్డీ తత్పురుష సమాసము లోకము కొఱకు హితము లోకహితములు
5) పంచమీ తత్పురుష సమాసం దొంగ వలన భయము దొంగభయము
6) షష్ఠీ తత్పురుష సమాసం జటల యొక్క పంక్తి జటాపంక్తి
7) సప్తమీ తత్పురుష సమాసం తటము నందలి భూజములు తటభూజములు
8) నఞ్ తత్పురుష సమాసం క్షరం కానిది అక్షరం

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

కృషి : సేద్యం, వ్యవసాయం
ధనం : డబ్బు, సంపద, విత్తము
మిత్రుడు : స్నేహితుడు, నేస్తము, సఖుడు
శక్తి : సామర్థ్యం, బలము
ఏవగింపు : అసహ్యం, రోత, జుగుప్స
హర్షము : ఆనందం, సంతోషం
స్త్రీ : మహిళ, వనిత, ఉవిద
మంత్రి : ప్రధాని, సచివుడు, ప్రెగడ
సహకారం : సహాయం, తోడ్పాటు

వ్యుత్పత్యర్థాలు

మిత్రుడు : అన్ని ప్రాణుల యందు సమభావన కలవాడు (స్నేహితుడు)
సత్యం : సత్పురుషుల యందు పుట్టినిది (నిజం)
శాసనం : దీని చేత శిక్షింపబడును (ఆజ్ఞ)

నానార్థాలు

సత్యం – సత్తు, పూజ్యము, సాధువు
ప్రయత్నం – కృషి, సేద్యం, పరిశ్రమ
ప్రజ – జనం, సంతతి, పుట్టుట
చైతన్యం – ప్రాణం, తెలివి, ప్రకృతి
శక్తి – బలిమి, పార్వతి, పరాశరుని తండ్రి
కళ్యాణం – వివాహం, బంగారం, అక్షయం
ఘనం – మేఘం, శరీరం, గొప్పది
కృషి – సేద్యం, యత్నం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
వ్యతిరేకాభిప్రాయం = వ్యతిరేక + అభిప్రాయం – సవర్ణదీర్ఘ సంధి

యణాదేశ సంధి :
సూత్రం : ఇ, ఉ, ఋ లకు సవర్ణముకాని అచ్చు పరమగునప్పుడు క్రమముగా య, వ, రలు ఆదేశమగును.
అభ్యున్నతి = అ + ఉన్నతి – యణాదేశ సంధి

అత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
చేసినంత = చేసిన + అంత – అత్వ సంధి
ఎక్కడైనా = ఎక్కడ + ఐనా – అత్వ సంధి
ఐనప్పుడు = ఐన + అప్పుడు – అత్వ సంధి
తగినంత = తగిన + అంత – అత్వ సంధి

లు ల న ల సంధి :
సూత్రం : లు, ల, న లు పరమైనపుడు ఒక్కొక్కపుడు ముగాగమానికి లోపమూ, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ విభాషగా వస్తాయి.
మాత్రాన = మాత్రము + న – లు ల సంధి
తరాలు = తరము + లు – లుల సంధి
వివాహాలు = వివాహము + లు – లు ల న ల సంధి
అవకాశాలు = అవకాశము + లు – లు ల న ల సంధి

ఇత్వసంధి :
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
ఒక్కటే = ఒక్కటి + ఎ – ఇత్వ సంధి

గసడదవాదేశ సంధి :
సూత్రం : ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
సరిగదా = సరి + కదా – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
యువతీయువకులు యువతియును, యువకుడును ద్వంద్వ సమాసం
హెచ్చుతగ్గులు హెచ్చును, తగ్గును ద్వంద్వ సమాసం
వధూవరులు వధువును, వరుడును ద్వంద్వ సమాసం
బంధుమిత్రులు బంధువులు, మిత్రులు ద్వంద్వ సమాసం
బాల్యవివాహాలు బాల్యము నందలి వివాహములు సప్తమీ తత్పురుష సమాసం
సంస్కరణ ప్రయత్నం సంస్కరణ యొక్క ప్రయత్నం షష్ఠీ తత్పురుష సమాసం
స్త్రీల అభ్యున్నతి స్త్రీల యొక్క అభ్యున్నతి షష్ఠీ తత్పురుష సమాసం
విద్యావ్యాప్తి విద్య యొక్క వ్యాప్తి షష్ఠీ తత్పురుష సమాసం
వరకట్నం వరుని కొరకు కట్నం చతుర్డీ తత్పురుష సమాసం
పెనుభూతము పెద్దదైన భూతము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
దురాచారం దుష్టమైన ఆచారం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ముఖ్యమంత్రి ముఖ్యమైన మంత్రి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ముఖ్య సమస్యలు ముఖ్యమైన సమస్యలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జటిల సమస్య జటిలమైన సమస్య విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రకృతి – వికృతులు

మంత్రి – మంతిరి
వివాహం – వియ్యము
రూపము – రూపు
స్త్రీ – ఇంతి
విద్య – విద్దె
దూరము – దవ్వు
శ్రీమతి – సీమాటి
ఆశ్చర్యం – అచ్చెరువు
గౌరవం – గారవము
విషయం – విసయం
సత్యం – సత్తు
నిజం – నిక్కం

రచయిత పరిచయం

రచయిత : “శ్రీ నండూరి రామమోహనరావు”

జన్మస్థలం : వీరు కృష్ణాజిల్లా “విస్సన్నపేట”లో జన్మించారు.

జీవిత కాలం : 1927 – 2011.

ప్రసిద్ధి : రామమోహనరావుగారు, తెలుగు పాత్రికేయులలో సుప్రసిద్ధులు. వీరు జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితా జ్యోతి మొదలైన పత్రికలలో సంపాదకులుగా పనిచేశారు.

రచనలు : వీరు పిల్లల కోసం కొన్ని ఇంగ్లీషు నవలలను, తెలుగులోనికి అనువదించి రాశారు. 1) “చిలక చెప్పిన రహస్యం”, 2) “మయూరకన్య” అనే పిల్లల నవలలూ, 3) “హరివిల్లు” పేరిట పిల్లల గేయాలు రాశారు. నండూరి వారి సంపాదకీయ వ్యాసాలు అయిన “అనుపల్లవి”, ! “చిరంజీవులు”, “నండూరి రామమోహనరావు వ్యాఖ్యావళి” పేరిట సంకలనాలుగా వచ్చాయి.

అవార్డులు : తెలుగు విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , వీరిని “ఉత్తమ పాత్రికేయుడు” అవార్డు నిచ్చి సత్కరించింది.

కఠిన పదాలకు అర్థాలు

శాసనాలు = చట్టాలు
సాంఘిక సంస్కరణ = సంఘాన్ని చక్కజేయడం
ఆవశ్యకత = అవసరము
ప్రస్పుటించాలి = ప్రకాశించాలి; వెల్లడించాలి
చెదురు మదురు = అక్కడక్కడ
పరిణామం = మార్పు
రూపుమాపు = నశింపజేయు
మహామహులు = గొప్పవారు
ఏవగింపు = రోత
నిర్మూలన = పెల్లగించుట, నాశనం
పెనుభూతం = పెద్ద దయ్యం

AP Board 8th Class Telugu Solutions Chapter 10 సంస్కరణ

అభ్యున్నతి = అభివృద్ధి
అవరోధాలు = ఆటంకాలు
విద్యావిహీనత = విద్య లేకపోవడం
జటిల సమస్య = పెనగొనిన సమస్య (చిక్కు సమస్య)
ప్రయత్నపూర్వకంగా = ప్రయత్నం చేయడం ద్వారా
విద్యాశూన్యులు = విద్య చేత శూన్యులు (చదువు రానివారు)
ప్రతిష్ఠ = గౌరవం; కీర్తి
ధనవ్యయం = ధనాన్ని ఖర్చు చేయడం
పరిగణించడం = లెక్కించడం
హర్షించదు = సంతోషించదు
శక్తిహీనుడు = శక్తిలేనివాడు
ఏహ్యభావాన్ని = రోతను

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 9 సందేశం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 9th Lesson సందేశం

8th Class Telugu 9th Lesson జసందేశం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

స్వంత లాభం కొంతమానుకు
పొరుగువారికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
పాడిపంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటుపడవోయ్;
తిండి కలిగితే కండగలదోయ్
కండ కలవాడేను మనిషోయ్
చెట్టపట్టాల్ పట్టుకొని దే
శస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ములవలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్
– గురజాడ అప్పారావు

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై పంక్తులు ఏ గేయంలోవి ? ఆ గేయాన్ని ఎవరు రాసారు?
జవాబు:
పై పంక్తులు దేశభక్తి గేయంలోవి. ఆ గేయాన్ని గురజాడ అప్పారావు గారు రాసారు.

ప్రశ్న 2.
ఈ గేయంలో ఉన్న విషయాలేమిటి?
జవాబు:

  • స్వంత లాభం కొంచెం వదులుకొని, తోటివాడికి సాయం చేయాలి.
  • దేశమంటే మట్టికాదు మనుషులు.
  • దేశంలో పాడి పంటలు అభివృద్ధి అయ్యేటట్లు శ్రమించాలి.
  • కండ బలం ఉన్నవాడే మనిషి.
  • దేశ ప్రజలు కలసిమెలసి జీవించాలి.
  • జాతిమత భేదాలు విడచి, ప్రజలు సోదరులవలె మెలగాలి.

ప్రశ్న 3.
గేయ సందేశం ఏమిటి ?
జవాబు:
పరోపకారం, దేశభక్తి, ఐకమత్యం అనేవి అందరూ కలిగి ఉండాలనేదే ఈ గేయ సందేశం.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

ప్రశ్న 4.
దేశభక్తిని గురించిన గేయాలు, కవితలు, పద్యాలను కవులు ఎందుకు రాస్తారు?
జవాబు:
దేశభక్తిని గురించిన గేయాలను, కవితలను, పద్యాలను కవులు ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి రాస్తారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ పాఠంలోని పద్యాల్లో మనదేశం గొప్పతనం గురించి చదివినపుడు మీకేమనిపించింది?
జవాబు:
ఈ పాఠంలోని పద్యాల్లో మన భారతదేశం తపోభూమి అని, బంగారు పంటలకు నిలయమని, శాంతి వెన్నెలలో,
కురిపించిన దేశమని, గంగ, గోదావరి వంటి పవిత్ర నదులు ప్రవహించిన దేశమని చదివినప్పుడు, నేను ఇటువంటి గొప్ప దేశంలో పుట్టాను కదా ! అని గర్వంగా తల ఎత్తుకొని తిరగాలనిపించింది. జన్మభూమి స్వర్గం కంటే గొప్పది కదా.

మరింతగా మన దేశ సౌభాగ్యం వర్ధిల్లేలా పాటుపడాలని అనిపించింది. మన దేశంలో అన్యాయాలు, దౌర్జన్యాలు, కుల మత హింసలు లేకుండా చూడాలని అనిపించింది. అవినీతి, లంచగొండితనం, కుంభకోణాలు, పేదరికం లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. ప్రపంచ దేశాల్లో నేను జన్మించిన నా భారతమాత చాలా గొప్పది అనిపించింది.

ప్రశ్న 2.
ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు?
జవాబు:
మనం చట్టసభలకు ఎన్నుకొనేవారే ప్రజా ప్రతినిధులు. అనగా ఎం.పి.లు, ఎం.ఎల్.ఎ.లు మొదలైనవాళ్ళు ప్రజల కష్టాల్ని చట్టసభల్లో ప్రతిధ్వనింపచేసేవారు కావాలి. ప్రజల సమస్యల్ని, కష్టాల్ని ప్రభుత్వానికి తెలిపి, వాటిని పరిష్కరించేవారు. కావాలి. అవినీతి, లంచగొండితనం, దుర్మార్గం అన్న వాటికి వారు దూరంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోవాలి. వాటికి త్వరగా పరిష్కార మార్గాల్ని చూపించగలగాలి. ప్రతినిధుల ఎప్పుడూ ప్రజల పక్షంలోనే నిలబడాలి. అన్యాయానికీ, అధికారానికి బానిసలు కారాదు. సచ్ఛీలత కలిగి, సత్కార్యాలు: చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆదర్శప్రాయ జీవనం సాగించాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

ప్రశ్న 3.
లంచగొండితనం మన దేశ ప్రగతి గౌరవాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదో చర్చించండి.
జవాబు:
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మూడవ, నాలుగవ సాధారణ ఎన్నికల తర్వాత రాజకీయ నాయకులలో అవినీతి బాగా ఎక్కువైంది. రాజకీయ నాయకులలో, మంత్రులలో అవినీతి ఎక్కువైనపుడు అధికారులకి అది అనుకూలంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలలో గల సిబ్బంది ప్రతి చిన్నపనికీ లంచం తీసుకొంటున్నారు. ప్రతిపనికీ “ఒక రేటు” ఉంటోంది. చివరికి జీతాలు ఇవ్వడానికీ, పింఛను చెల్లించడానికి మాత్రమే కాదు – మరణించిన వాళ్ళకి “సర్టిఫికేట్” ఇవ్వడంలోనూ లంచం తప్పని పరిస్థితులున్నాయంటే అవినీతి ఎంతగా విలయతాండవం చేస్తోందో గ్రహించవచ్చు.

ఈ రోజు మన దేశంలో లంచగొండితనం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఈ లంచగొండితనం చిన్న ఉద్యోగుల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు మంత్రుల నుండి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ల దాకా ఈ లంచగొండితనం విస్తరించింది.

లంచం ఇవ్వనిదే ప్రభుత్వంలో ఏ పనీ కావట్లేదు. ప్రపంచంలో లంచగొండితనం ఎక్కువ ఉన్న దేశాల్లో మన భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యమంత్రులూ, వారి పుత్రులూ, అల్లుళ్ళూ వేల కోట్ల రూపాయలు లంచాలుగా మేసేస్తున్నారు.

ఇందువల్ల మన దేశంలో అభివృద్ధి జరుగడం లేదు. ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెడితే పది పైసల పని కూడా కావట్లేదు. ఏ పనీ సక్రమంగా సాగటంలేదు. కట్టిన ప్రాజెక్టులు, రోడ్లు, పరిశ్రమలు కొద్ది రోజుల్లోనే పాడయిపోతున్నాయి. దేశాన్ని రక్షింపవలసిన మిలటరీ, పోలీసు వ్యవస్థలు సైతం లంచగొండితనాన్ని మరిగి బాధితులకు అన్యాయం చేస్తున్నాయి. పెద్ద పెద్ద అధికారులు లంచగొండితనానికి అలవాటుపడి జైళ్ళలో మగ్గుతున్నారు.

అవినీతి, లంచగొండితనంల కారణంగా ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోంది. కనుక ప్రజలు యువత అవినీతి నిర్మూలనకు నడుంకట్టి ఈ దుష్ట జాడ్యాన్ని మన దేశం నుండి తరిమికొట్టాలి.

II. చదవడం – రాయడం

1. కింది పద్యం చదవండి. దాని భావంలోని ఖాళీలలో సరైన పదాలు రాయండి.
“దేశభక్తి మరియు దేశసమగ్రత
ప్రజల నాడులందు ప్రబలి ప్రబలి
కర్మభూమి యగు నఖండ భారతమహా
క్షితిని నెగురు ప్రగతి కేతనమ్ము”.

భావం :
దేశభక్తి, ………… అనే భావాలు ప్రజల్లోని నరనరాల్లో …………. కర్మభూమి అయిన మన ……….. దేశం ప్రగతి ……………….. రెపరెపలాడుతోంది.
జవాబు:
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు ప్రజల నరనరాల్లో వ్యాపించి కర్మభూమి అయిన మన అఖండ భారతదేశం ప్రగతి జెండా రెపరెపలాడుతుంది.

2. కింది ఖాళీలకు సరైన సమాధానాన్ని గుర్తించండి.

అ) మధురమైన ధర్మా నికి ………………… తగలరాదు. (రాయి / దెబ్బ)
జవాబు:
మధురమైన ధర్మానికి దెబ్బ తగలరాదు.

ఆ) భరత జాతి …………… ఆశయాలకు అనుగుణంగా లేదు. (మహాత్ముడి / బుద్ధుడి)
జవాబు:
భరత జాతి మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా లేదు.

ఇ) సకల జగతికి ………. నేర్పినట్టి మన భరతమాతను పూజించాలి. (అశాంతి / శాంతి)
జవాబు:
సకల జగతికి శాంతి నేర్పినట్టి మన భరతమాతను పూజించాలి.

ఈ) అఖండ భారతావనిలో ………….. కేతనం ఎగురవేయాలి. (ప్రగతి / తిరోగతి)
జవాబు:
అఖండ భారతావనిలో ప్రగతి కేతనం ఎగురవేయాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

3. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.

అ) భారతీయులు ఏమని ప్రతిజ్ఞ చేయాలి?
జవాబు:
“ఇది నా దేశం, ఇది నన్ను కన్నతల్లి. నాదేశ సౌభాగ్య సంపదలు, అభివృద్ధి చెందడానికి నేను సహాయపడతాను. ప్రపంచమంతా దీన్ని పూజించేటట్లుగా గొప్ప ప్రగతిని నెలకొల్పుతాను” అంటూ భారతీయులు ప్రతిజ్ఞ చేయాలి.

ఆ) మనదేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు ఏవి?
జవాబు:
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, కావేరి, గోదావరి, సింధు, నర్మద అనే జీవనదులు మనదేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు.

ఇ) ఈ పాఠంలో కవి చెప్పిన “మహామౌని” ఎవరు ? ఆయన గొప్పతనం ఏమిటి?
జవాబు:
ఈ పాఠంలో కవి చెప్పిన “మహామౌని” మహాత్మాగాంధీ. భారతమాత ముద్దుబిడ్డలలో మహాత్మాగాంధీ అగ్రగణ్యుడు. సత్యం, శాంతి, అహింస అనే సూత్రాలను పాటించి, రవి అస్తమింపని బ్రిటిషు సామ్రాజ్యం పునాదులను కదలించి, భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు. మన జాతిపిత అయిన గాంధీజీ తన బోసి నోటితో పలికిన శాంతి సందేశానికి ప్రపంచమంతా జేజేలు పలికింది. అది మన భారతదేశానికి కీర్తిని తెచ్చింది.

ఈ) మనదేశ ప్రగతి కేతనం ఎప్పుడు రెపరెపలాడుతుంది?
జవాబు:
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు ప్రజల నరనరాల్లో వ్యాపించినపుడు, పుణ్యభూమియైన అఖండ భారతదేశంలో ప్రగతి కేతనం రెపరెపలాడుతుంది.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) పాఠంలో కవి చెప్పిన విషయాలే గాక, మనదేశ కీర్తిని పెంచిన ఇతర విషయాలు రాయండి.
జవాబు:

  • మన దేశంలో బుద్ధుడు జన్మించి ప్రపంచంలోని చాలా దేశాల్లో బౌద్ధమతం విస్తరించేలా తన సందేశాన్ని అందించాడు.
  • వివేకానందుడు ప్రపంచ మత మహాసభలో పాల్గొని సర్వమత సమానత్వాన్ని చాటాడు.
  • రవీంద్రనాథ్ ఠాగూర్ తన కవితల ద్వారా, సర్ సి.వి. రామన్ శాస్త్ర పరిశోధనల ద్వారా మన దేశ కీర్తిని పెంచారు.
  • మన ఇతిహాసాలైన భారత రామాయణాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి. మన మహర్షులు, వేదాలు, ధర్మ ప్రచారా మన దేశ కీర్తిని విస్తరించాయి.
  • నెహ్రూ, ఇందిర వంటి మన నాయకులు ప్రపంచ ఖ్యాతిని సంపాదించారు.
  • మన రోదసీ విజ్ఞానం ప్రపంచ ఖ్యాతిని సంపాదించింది.
  • మన పారిశ్రామికవేత్తలలో కొందరు ప్రపంచ ప్రసిద్ధి పొందారు.
  • మన క్రికెట్టు ఆటగాడు టెండూల్కర్ ప్రపంచ ఖ్యాతి పొందాడు.

ఆ) మన జీవనదులు దేశానికి ఎటువంటి పరిపుష్టిని కలిగిస్తున్నాయి?
జవాబు:
మనదేశంలో కవి చెప్పినట్లు గంగ, సింధు, బ్రహ్మపుత్ర, కృష్ణానది, గోదావరి, కావేరి వంటి జీవనదులు ఉన్నాయి. నదులపై భాక్రానంగల్, నాగార్జునసాగర్, హీరాకుడ్ వంటి ఎన్నో బహుళార్థసాధక ప్రాజెక్టులు నిర్మించారు. వాటి నుఁ కాలువల ద్వారా వ్యవసాయానికి నీరు అందుతోంది. ఆ నీటితో బంగారు పంటలు పండుతున్నాయి. ఈ ప్రాజెక్టుల వ విద్యుదుత్పత్తి కూడా జరుగుతోంది.

మన ప్రభుత్వాలు నదులలోని పవిత్రమైన జీవజలాలను పూర్తిగా వినియోగించుకుంటే దేశం పాడిపంటల సస్యశ్యామలంగా ఉంటుంది.

ఇ) భారతీయ సంస్కృతిలో నీకు బాగా నచ్చిన విషయాలు ఏమిటి? అవి ఎందుకు బాగా నచ్చాయి?
జవాబు:
ఒక జాతి నిర్వీర్యం కాకుండా ఆత్మబలాన్ని సమకూర్చుకోవడానికి సంస్కృతి తోడ్పడుతుంది. ప్రజా జీవితం ప్రశాంతం సాగాలంటే సంస్కృతి ఇచ్చే సంస్కారమే మూలాధారం అవుతుంది. ఆత్మ సంస్కారాన్ని నేర్పి, మానవుడు సంఘజీవి అ. మానవసేవే మాధవ సేవ అని బోధించేది సంస్కృతి. మన భారతీయ సంస్కృతి ఎంతో విశిష్టమైనది.

భారతీయ సంస్కృతిలో దేవాలయాలు, పురాణాలు, రామాయణ భారత ఇతిహాసాలు, భాగవతము, భగవద్గీత వం భక్తి గ్రంథాలు, జీవనదులైన గంగ, గోదావరుల వంటి నదులు, మన ఋషులు, వారు బోధించిన ధర్మ ప్రబోధాలు నా బాగా నచ్చాయి.

మన దేశంలోని ఆచార వ్యవహారాలు, తల్లిదండ్రులను, గురువులను పిల్లలు గౌరవించడం, పెద్దల పట్ల, ఆచార్యు పట్ల ప్రజలకు గౌరవాదరాలు ఉండడం వంటి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అంటే నాకు గౌరవం.

మనకు ఉన్న దేవాలయాల వంటి గొప్ప దేవాలయాలు, పుణ్యనదులు మరి ఏ దేశానికీ లేవు. మన రామాయః భారత భాగవతాల వంటి పుణ్య గ్రంథాలు ఏ దేశానికీ లేవు. మనకు ఉన్న తత్త్వశాస్త్ర గ్రంథాలు, వేదాంత గ్రంథాల భగవద్గీత, వేదాలు వంటివి మనకే సొంతం. అవి ఏ దేశానికీ లేవు. ఇంత గొప్ప సంస్కృతి గల దేశంలో జన్మించడ నాకు గర్వకారణం.

ఈ) నీవే ప్రజాప్రతినిధివి అయితే దేశం కోసం ఏం చేస్తావు?
జవాబు:
నేనే ప్రజాప్రతినిధిని అయితే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వివరిం వాటిని పరిష్కరించేటట్లు చేస్తాను. దేశానికి హాని కలిగించే పనిని ఏదైనా జరుగకుండా అడ్డుకుంటాను. అలాగే నా పాటు ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలుస్తాను. అంటే నేను ప్రజలపట్ల చూపుతున్న సమస్యా పరిష్కారాల వారు కూడా తీర్చేటట్లు ఆదర్శంగా ఉంటాను.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) మనదేశాన్ని గురించి ప్రపంచం పొగడాలంటే, దేశంలో ఏమేమి ఉండగూడదని కవి చెప్పాడు?
జవాబు:
ఘనత గన్న మన పుణ్యదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కుల, మత హింసలనే పిశాచాలను తల ఎత్తనీయకు. నానాటికీ పెరిగిపోతున్న దుష్టులు, మోసగాళ్ళ గూండాయిజం నిలువకూడదు. బలిష్టమైన దేశ సౌభాగ్యాన్ని లంచాలనే జలగలు పట్టి పీల్చకూడదు. ప్రతినిధులైన వాళ్ళు పగలు, సెగలు రగిలించే మాటలు మాట్లాడకూడదు. “మనమంతా అన్నదమ్ములము” అనే తీయని ధర్మానికి దెబ్బ తగులనీయకూడదు. అలా జరిగినప్పుడు సమైక్యత అనే ఢంకా మోగుతుంది. మన భారతదేశాన్ని ప్రపంచం పొగడుతుంది.

ఆ) “భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను” ఈ వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
“భారతదేశం జీవనదులకు, పాడి పంటలకు నిలయమైయున్న దేశం. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను.” – ఈ వాక్యాన్ని మీ మాటల్లో రాయండి.
జవాబు:
మన భారతదేశం వేదాలు పుట్టిన దేశం. వ్యాస వాల్మీకాది మహర్షులు జన్మించిన దేశం. మన దేశం శ్రీలు పొంగిన జీవగడ్డ. పాడిపంటలు పొంగిపొర్లిన భాగ్యసీమ. ఇది వేదాంగాలూ, రామాయణం పుట్టిన దేశం. భారత భాగవతాలు పుట్టిన దేశం. ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. ఇది పవిత్ర భూమి. ఇక్కడ విస్తారమైన వృక్షసంపద ఉంది. లక్ష్మీబాయి, రుద్రమ్మ వంటి వీరవనితలకు ఇది జన్మభూమి. ప్రచండ పరాక్రమం ఉన్న రాజులు ఇక్కడ పుట్టారు. కాళిదాసు, తిక్కన వంటి మహాకవులు ఇక్కడ పుట్టారు. గాంధీ, బుద్ధుడు వంటి శాంతిదూతలు ఇక్కడే పుట్టారు. గంగా, సింధు, గోదావరి, కృష్ణా వంటి పవిత్ర నదులు ఇక్కడే పుట్టి, దేశాన్ని తమ జలాలతో సిరుల సీమగా మార్చాయి. ఇక్కడ నెహ్రూజీ, ఇందిర వంటి జాతీయ నాయకులూ, అబ్దుల్ కలామ్ వంటి శాస్త్రజ్ఞులూ ఇక్కడే పుట్టారు. ఇది కర్మభూమి. ఇది పవిత్రభూమి. అందుకే భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను.

IV. పదజాలం

1. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాసి ఆ వాక్యాలను తిరిగి రాయండి.

అ) మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ కేతనాన్ని ఎగురవేస్తాం.
జవాబు:
కేతనాన్ని = జెండాను
వాక్యం : మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగురవేస్తాం.

ఆ) ప్రతి వ్యక్తికీ మనోదార్డ్యుం ఉండాలి.
జవాబు:
మనోదార్యుం = దృఢమైన మనస్సు
వాక్యం : ప్రతి వ్యక్తికి దృఢమైన మనస్సు ఉండాలి.

ఇ) ఇతరుల సంపదలు చూసి మచ్చరికించకూడదు.
జవాబు:
మచ్చరికించ = అసూయ
వాక్యం : ఇతరుల సంపదలు చూసి అసూయపడరాదు.

ఈ) రవి చేతిరాతను చూసి అందరూ అబ్బురపడతారు.
జవాబు:
అబ్బురపడు = ఆశ్చర్యపోవు
వాక్యం : రవి చేతిరాతను చూసి అందరూ ఆశ్చర్యపోతారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

2. కింద గీత గీసిన పదాలకు వికృతి పదాలతో తిరిగి వాక్యాలు రాయండి.

అ) నాదేశ సమగ్రతను కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
జవాబు:
ప్రతిజ్ఞ (ప్ర) – ప్రతిన (వి)
నాదేశ సమగ్రతను కాపాడతానని ప్రతిన చేస్తున్నాను.

ఆ) నాది తెలుగుజాతి. నాది తెలుగు భాష.
జవాబు:
భాష (ప్ర) – బాస (వి)
నాది తెలుగు జాతి. నాది తెలుగు బాస.

ఇ) మనకు దేశంపై భక్తి ఎక్కువగా ఉండాలి.
జవాబు:
భక్తి (ప్ర) – బత్తి (వి)
మనకు దేశంపై బత్తి ఎక్కువగా ఉండాలి.

ఈ) మన కీర్తి ఖండ ఖండాంతరాలకు వ్యాపించింది.
జవాబు:
కీర్తి (ప్ర) – కీరితి (వి)
మన కీరితి ఖండ ఖండాంతరాలకు వ్యాపించింది.

3. పాఠానికి సంబంధించిన మాటలను కింది గళ్ళ నుండి వెతికి పక్క గళ్ళల్లో రాయండి. వాటితో వాక్యాలు తయారుచేయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 1

వాక్యములు :

  1. భారత ప్రభుత్వం జ్ఞానానంద కవిని పద్మశ్రీతో సత్కరించింది.
  2. హిందూదేశము జీవనదులకు పుట్టినిల్లు.
  3. దేశ యువత, దేశభక్తిని పెంపొందించుకోవాలి.
  4. ఇది నా దేశము, అనే ప్రేమ భావము దేశ పౌరులలో కలగాలి.
  5. హనుమంతుడు సీతమ్మకు సందేశమును తీసుకువెళ్ళాడు.
  6. గంగానదిని భారతీయులు మహా పుణ్యనదిగా భావించి సేవిస్తారు.
  7. బాపూజీ శాంతి సందేశానికి ప్రపంచం జోహార్లు ఆర్పించింది.
  8. గాంధీజీ, హింసను విడనాడండని దేశ ప్రజలకు సందేశం అందించాడు.
  9. సింధునది హిమాలయాల్లో పుట్టిన జీవనది.
  10. నెహ్రూ శాంతిదూత.

V. సృజనాత్మకత

* పాఠంలో మనదేశం గొప్పతనాన్ని తెలుసుకున్నారు కదా ! మన దేశ గొప్పతనాన్ని వర్ణిస్తూ భారతీయ విలువలు కాపాడటానికి అందరూ బాధ్యత తీసుకోవాలని ఒక “కరపత్రం” తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
భారతీయ విలువలను కాపాడదాం

సోదర సోదరీమణులారా ! మన భారతదేశం తపోభూమి. ఇది బంగారు పంటలకు నిలయం. శాంతి సందేశాన్ని ప్రపంచానికి అందించిన బుద్ధుడు, గాంధీజీ జన్మించిన పవిత్రదేశం మనది. గంగా, గోదావరి, కృష్ణానది, సింధు, * బ్రహ్మపుత్ర వంటి పవిత్ర నదులు ప్రవహిస్తున్న పవిత్ర భాగ్యసీమ మనది.

ఇది వేద వేదాంగాలు పుట్టిన కర్మభూమి. భారత, భాగవత, రామాయణాలు, వేదవ్యాస, వాల్మీకి, కాళిదాసుల వంటి కవులు పుట్టిన దేశం ఇది. కృష్ణదేవరాయలు వంటి మహా సాహితీ సమరాంగణ చక్రవర్తులు జన్మించిన పవిత్రభూమి ఇది. ఝాన్సీలక్ష్మీబాయి, రాణిరుద్రమ్మ వంటి వీరనారులకు జన్మభూమి ఇది. గాంధీజీ, నెహ్రూ, ఇందిర వంటి రాజకీయ దురంధరులకు ఇది పుట్టినిల్లు. శంకరాచార్యులు వంటి అద్వైతమత ప్రవక్త నడయాడిన కర్మభూమి ఇది.

మన భారతీయులందరూ న్యాయానికీ, ధర్మానికీ, శాంతికీ, సత్యాహింసలకూ ప్రాధాన్యం ఇచ్చారు. మనం పైన చెప్పిన పుణ్యాత్ములకు వారసులం. మన భారతీయ విలువలను కాపాడదాం. నిజమైన భారతీయులం అనిపించుకుందాం. భారతీయులారా ! మన భారతభూమి గౌరవాన్ని రక్షించుకుందాం.

ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడదాం. మన దేశ గౌరవాన్ని నిలబెడదాం.

VI. ప్రశంస

*మనదేశం ప్రపంచ ప్రసిద్ధి చెందటానికి ఎంతో మంది కృషి చేశారు. నేటికీ విద్య, వ్యాపారం, క్రీడలు, సాంస్కృతికం, రాజకీయం మొదలైన రంగాలలో ఎంతో మంది కృషి చేస్తున్నారు. అటువంటి వ్యక్తులలో మీకు తెలిసిన వ్యక్తిని గూర్చి వారి కృషిని గూర్చి ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
అబ్దుల్ కలామ్ ఆజాద్

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆజాద్ ఆదర్శ భారతీయుడు. ప్రముఖ శాస్త్రజ్ఞుడు. భారతదేశాన్ని స్వర్ణభారతం చేయాలని శ్రమించే నిరంతర శ్రామికుడు. వివాహానికి, వివాదానికి జీవితంలో చోటివ్వని వ్యక్తి. నేటి బాలలకు ఈయన ప్రచోదక శక్తి. ఈయన ప్రజాస్వామ్యహితైషి.

అబ్దుల్ కలామ్ ఆజాద్ తమిళనాడులోని రామేశ్వరంలో జైనులబ్లీన్, ఆషియమ్మ దంపతులకు 1931, అక్టోబరు 15న జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం రామేశ్వరం, రామనాథపురం, తిరుచురాపల్లి, మద్రాసులలో కొనసాగింది. మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ‘ఏరో ఇంజనీరింగులో డి.ఎం. ఈ.టీ’ చేసి తరువాత సైన్సులో డిప్లొమా (ఆనర్సు) చేశాడు.

ఈయన 1958వ సంవత్సరంలో డీ.ఆర్.డి.ఓ. లో జూనియర్ సైంటిస్టుగా చేరాడు. తరువాత కొద్దికాలానికే ఆ సంస్థకే డైరెక్టరు జనరల్ అయ్యాడు. మధ్యలో ఇస్రోలో సైంటిస్టుగా, డీ. ఆర్.డి.ఎల్. డైరెక్టరుగా పనిచేశాడు. 1999లో భారత ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టాడు.

అబ్దుల్ కలాంకు ‘పద్మవిభూషణ్’ వంటి పురస్కారాలతోపాటు, భారతదేశ అత్యున్నత పురస్కారమయిన ‘భారతరత్న’ లభించింది. ఈయన అగ్ని, పృథ్వి, త్రిశూల్, ఆకాశ్, నాగ్ మొదలైన క్షిపణుల రూపకల్పనకు సారథ్యం వహించి భారతదేశ క్షిపణి పితామహుడిగా పేరు పొందాడు. 1998 అణుపరీక్షలలో కలాం ముఖ్య పాత్ర పోషించాడు. అంతేగాక తేలికపాటి యుద్ధ విమానం, ప్రధాన యుద్ధ ట్యాంకు ‘అర్జున్’ ప్రాజెక్టుల రూపకల్పనకు నాయకత్వం వహించి అనేక మైలురాళ్ళను అధిగమించాడు.

అబ్దుల్ కలాం వ్యక్తిత్వం విశిష్టమయినది. ఈయన సమష్టితత్వం కలవాడు. ఈయన ఎక్కడ ఏ స్థాయిలో పనిచేసినా అందరినీ కలుపుకొని పనిచేసే మనస్తత్వం కలవాడు. కల్మషం లేని వ్యక్తిత్వం ఈయన సొంతం. ఈయన దేశం కోసం అనునిత్యం తపిస్తాడు. ఈయన ఒక శాస్త్రవేత్తగా ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం మొదలుకొని, అణుపరిజ్ఞానం ఉపయోగించడం దాకా అనేక రంగాలలో పని చేశాడు.

ఈయన ఆచరణ భగవద్గీత, ఖురాన్లు. అభిరుచి కర్ణాటక సంగీతం. ఈయన స్వప్నం అభివృద్ధి చెందిన భారతదేశం. ఈయన భారత దేశాభివృద్ధికి కలలు కనమని భారతీయులకు సందేశం ఇస్తాడు.

రాజకీయానుభవం లేకపోయినా గత రాష్ట్రపతులకు ధీటుగా ప్రత్యేక శైలిలో రాష్ట్రపతిగా పనిచేయడం కలాం విలక్షణతకు మచ్చుతునక. ఏ బాధ్యతనైనా ఈయన చక్కగా నెరవేర్చగలడు. ఈ దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళే విధానాలకు రూపకల్పన చేయగల సమర్థుడు.

కలాం గొప్ప ఆదర్శ పురుషుడు. ఎన్నికలలో ఓటువేసి, అన్ని పనులూ ప్రభుత్వమే చేయాలని అనుకోడం పొరపాటని, దేశాన్ని నిందించడం కాక దేశ వ్యవస్థను పటిష్ఠం చేసే మార్గం గురించి అందరూ ఆలోచించాలని ఈయన పలికే పలుకులు భారతీయులందరికీ ఆదర్శం.

అబ్దుల్ కలామ్ అజాద్ కు మంచితనంలో తల్లిదండ్రులు, క్రమశిక్షణలో బంధువులైన శంషుద్దీన్, అహ్మద్ జలాలుద్దీన్స్ స్ఫూర్తి. అజాద్ వంటి వ్యక్తి రాష్ట్రపతి కావడం భారతీయులందరికీ గర్వకారణము.

ప్రాజెక్టు పని

* ప్రపంచస్థాయిలో మన దేశ గౌరవం పెరగాలంటే కింద ఇవ్వబడిన అంశాలకు సంబంధించి మనమేం చేయాలో తరగతి గదిలో సమగ్రంగా చర్చించి వ్యక్తిగత నివేదిక (రిపోర్టు) ను తయారుచేయండి.
1) క్రీడలు – కళలు
2) వైజ్ఞానిక ప్రగతి
3) అవినీతి, లంచగొండితనం లేని సమాజం
4) భాషా సంస్కృతీ పరిరక్షణ
జవాబు:
1) క్రీడలు – కళలు :
121 కోట్ల జనాభా గల మన దేశం ఒలింపిక్ క్రీడల వంటి ఆటల్లో ప్రపంచస్థాయిలో ఒక్క బంగారు పతకం కూడా గెల్చుకోలేకపోతున్నది. అందుకని పాఠశాల స్థాయి నుండి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆటలలో నైపుణ్యం చూపిన వారికి ప్రత్యేక శిక్షణను ఇప్పించాలి. నగరాలన్నింటిలో మంచి క్రీడా మైదానాలు ఉండాలి. సంగీతము, చిత్రలేఖనము వంటి లలిత కళలలో ప్రతిభ చూపిన బాలురకు పోటీలు నిర్వహించి బహుమతులివ్వాలి. ప్రత్యేక్ష శిక్షణ ఇప్పించాలి.

2) వైజ్ఞానిక ప్రగతి :
మన దేశంలో విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు బాగా వ్యయం చేయాలి. అందులో ప్రతిభ చూపిన వారికి స్కాలర్ షిప్పులు ఇవ్వాలి. అవసరం అయితే విదేశాలలో శిక్షణను ఇప్పించాలి. ప్రతిభకు పట్టం కట్టాలి.

3) అవినీతి, లంచగొండితనం లేని సమాజం :
ప్రపంచంలో మనదేశం లంచగొండి, అవినీతి దేశంగా చెడ్డ పేరు తెచ్చుకొంటోంది. నిత్యం పత్రికలు ఆ విషయాలు రాస్తున్నాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణ వచ్చిన నాయకుణ్ణి ప్రజలు ఎన్నుకోరాదు. అటువంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి. సజ్జనులను ప్రోత్సహించాలి. అవినీతిపరుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.

4) భాషా సంస్కృతీ పరిరక్షణ :
మాతృభాషను ఆదరించాలి. మన సంస్కృతిని కాపాడాలి. ప్రభుత్వం దీనికి ప్రత్యేక శాఖను ఏర్పరచి, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ప్రజలు ఈ సంస్కృతిని కాపాడుకోవాలి.

అనంత కాలం ఇంకా ఆర్థిక పరిస్థను ఆస్ట్రేలు జరగా అను

VII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది పదాలకు గురువులను, లఘువులను గుర్తించండి.
UTI దేశము
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 2

2) కింది వాటిలో తప్పుగా ఉన్న గణాలను గుర్తించి సరి చేయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 3
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 4

3) ఛందస్సులో గణాల విభజన తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం.

అ) కింది పద్యపాదాలను పరిశీలించండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 5

పై పాదాల్లో “భ, ర, న, భ, భ, ర, వ” అనే గణాలు ఒకే వరుసలో వచ్చాయి కదా ! ఇలా పద్యంలో నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్తిపద్యం’ అంటారు.

పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరంగానీ, దాని వర్ణమైత్రి అక్షరంగానీ ఆపాదంలో నియమిత స్థానంలో రావటాన్ని “యతిమైత్రి” లేదా “యతిస్థానం” అంటారు.

ఈ పద్య పాదాల్లో ఆ-అ; జే (ఏ) – సి (ఇ)లకు యతిమైత్రి చెల్లింది.

పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాలలో ‘య’ అను అక్షరం వచ్చింది. ఇలా పద్య పాదాలన్నింటిలోను రెండవ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని “ప్రాసనియమం” అంటారు.

పై పద్యపాదాలు ‘ఉత్పలమాల’ పద్యానివి. పై ఉదాహరణననుసరించి ‘ఉత్పలమాల’ పద్య లక్షణాలను ఈ విధంగా పేర్కొనవచ్చు.

ఇలాంటి లక్షణాలు గల పద్యాన్ని “ఉత్పలమాల” పద్యం అంటారు. పై విషయాల ఆధారంగా ఉత్పలమాల పద్య లక్షణాలను ఎలా రాయాలో గమనించండి.

ఉత్పలమాల:

  1. ఇది వృత్తపద్యం.
  2. ఇందు నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రతిపాదంలో 10వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతిపాదంలోను 20 అక్షరాలుంటాయి.
    ఈ లక్షణాలు గల పద్యపాదమే ఉత్పలమాల పద్యపాదం.

ఆ) ఉత్పలమాల పద్య లక్షణాలు తెలుసుకున్నారు కదా ! ఈ పద్య లక్షణాల ఆధారంగా కింద ఇవ్వబడిన చంపకమాల పద్యానికి గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి పద్యం కిందగల లక్షణాలు పూరించండి.

‘అమిత పరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముడవు, నీవు, నీదయిన దాస్యము వాపికొనంగ నీకు జి
త్తము గలదేని, భూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతము దెచ్చియి మ్మనిన నవ్విహగేంద్రుడు సంతసంబునన్

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 6

చంపకమాల :

  1. ఇది వృత్త పద్యం.
  2. పద్యంలో నాలుగు పాదాలు ఉన్నాయి.
  3. ప్రతి పాదంలోను ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలు ఉన్నాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
    (అ – య) (త – దా) (త్త – ద) (క – న) వీటికి యతి మైత్రి.
  5. ప్రాస నియమం ఉంది.
  6. ప్రతి పాదంలోను 21 అక్షరాలు ఉంటాయి.

ఇ) కింది పాదాలు ఏ వృత్తాలకు సంబంధించినవో గుర్తించండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 7

గమనిక :
పై పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ గణాలు ఉన్నాయి. కాబట్టి పై పద్యపాదము ‘చంపకమాల’ వృత్తమునకు సంబంధించినది.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 8
గమనిక :
పై పాదంలో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ వృత్తము.

ఈ)కింద సూచించిన పద్యపాదాలను పూరించి గణవిభజన చేసి అవి ఏ పద్యపాదములో గుర్తించండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 9

గమనిక : పై పద్యపాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి (ప – బం) ‘చంపకమాల’ పద్యము. యతి 11వ అక్షరము.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

భూమి – వసుధ, ధరణి, అవని
కేతనం – జెండా, పతాకము
వికారి – ముని, తాపసి
గంగ – భాగీరథి, త్రిపథగ
ఖ్యాతి – కీర్తి, యశము
బ్రహ్మ – విధాత, ధాత, సృష్టికర్త

వ్యుత్పత్యర్థాలు

ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
బ్రహ్మ – ప్రజలను వర్థిల్ల చేయువాడు (విధాత)

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

నానార్థాలు

ధర్మము = పుణ్యం, న్యాయం, ఆచారం
జలం = నీరు, ఎర్రతామర
భావము = పుట్టుక, ప్రపంచం, సంసారం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
మహాభ్యుదయమ్ము = మహా + అభ్యుదయమ్ము – సవర్ణదీర్ఘ సంధి
కుమారాగ్రణి = కుమార + అగ్రణి – సవర్ణదీర్ఘ సంధి
నయవంచకాళి = నయవంచక + ఆళి – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
భరతోర్వర = భరత + ఉర్వర – గుణసంధి
సహోదరా = సహ + ఉదరా – గుణసంధి
నవ్యోజ్జ్వల = నవ్య + ఉజ్జ్వ ల – గుణసంధి

యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమముగా య, వ, రలు ఆదేశమగును.
అభ్యుదయము = అభి + ఉదయము – యణాదేశ సంధి

అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
సంపాదించుకొన్నట్టి = సంపాదించుకొన్న + అట్టి – అత్వసంధి
నేర్పినట్టి = నేర్పిన + అట్టి – అత్వసంధి
మొలకెత్తు = మొలక + ఎత్తు – అత్వసంధి
నాడులందు = నాడుల + అందు – అత్వసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
ఏదైనను = ఏది + ఐనను – ఇత్వ సంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
శిరమెత్తగా = శిరము + ఎత్తరా – ఉత్వసంధి
జోతలర్పించే = జోతలు + అర్పించె – ఉత్వసంధి
పాడయ్యె = పాడు + అయ్యె – ఉత్వసంధి
తరుణమ్మిదే = తరుణమ్ము + ఇదే – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి (అ)
సూత్రం (అ) : ప్రథమమీది పురుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
పట్టుగొమ్మ = పట్టు + కొమ్మ – గసడదవాదేశ సంధి

గసడదవాదేశ సంధి సూత్రం (ఆ) : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి.
అన్నదమ్ములు = అన్న + తమ్ముడు – గసడదవాదేశ సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

యడాగమ సంధి
సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం అవుతుంది.
కన్నయది = కన్న + అది – యడాగమ సంధి
నీళాదేశము = నీ + ఈదేశము – యడాగమ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
జాతి శిరస్సు జాతి యొక్క శిరస్సు షష్ఠీ తత్పురుష సమాసం
శాంతి చంద్రికలు శాంతి అనెడి చంద్రికలు రూపక సమాసం
గంగా నది గంగ అనే పేరుగల నది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
నా దేశము నా యొక్క దేశము షష్ఠీ తత్పురుష సమాసం
ప్రపంచ చరిత్ర ప్రపంచము యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం
నిఖిల ధరణి నిఖిలమైన ధరణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నవ్యభారతము నవ్యమైన భారతము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహామౌని గొప్పవాడైన మౌని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నీ తల్లి నీ యొక్క తల్లి షష్ఠీ తత్పురుష సమాసం
దేశభక్తి దేశము నందు భక్తి సప్తమీ తత్పురుష సమాసం
ప్రజలనాడులు ప్రజల యొక్క నాడులు షష్ఠీ తత్పురుష సమాసం
అఖండ భారతం అఖండమైన భారతం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
గట్టి ప్రతిజ్ఞ గట్టిదైన ప్రతిజ్ఞ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
హింసా పిశాచి హింస అనెడి పిశాచి రూపక సమాసం
అన్నదమ్ములు అన్నయును, తమ్ముడును ద్వంద్వ సమాసం
– సకల ప్రపంచము సకలమైన ప్రపంచము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ధాన్యాగారాలు ధాన్యమునకు ఆగారాలు షష్ఠీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

ప్రతిజ్ఞ – ప్రతిన
భూమి – బూమి
భాష – బాస
గౌరవం – గారవం
కీర్తి – కీరితి
భక్తి – బత్తి
హృదయం – ఎద
అద్భుతం – అబ్బురం
భృంగారం – బంగారం
మత్సరం – మచ్చరం

కవి పరిచయం

కవి : సురగాలి తిమోతి జ్ఞానానందకవి

జన్మస్థలం : బొబ్బిలి తాలూకా, ‘పెద పెంకి’ గ్రామంలో జన్మించారు.

జీవిత కాలం : 1922 – 2011

ఉద్యోగం : కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.

ప్రతిభ : ప్రాథమిక విద్యను నేర్చుకుంటున్నప్పుడే ఆశువుగా సీసపద్యాలు చెపుతూ “దీనబంధు శతకాన్ని” రాశారు.

రచనలు : 1) ఆమ్రపాలి 2) పాంచజన్యం 3) క్రీస్తు శతకం 4) నా జీవితగాథ 5) కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు 6) పర్జన్యం 7) గోల్కొండ మొ||నవి.

రచనా శైలి : సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించిన కవి.

అవార్డు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును 1975లో పొందారు.

పురస్కారం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “ఉత్తమ ఉపాధ్యాయ” పురస్కారం ఇచ్చింది. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

1వ పద్యము (కంఠస్థ పద్యం)

*చం. పరమ తపోనివేశనము బంగరుపంటలకు న్నివాస మ
బ్బురమగు శాంతిచంద్రికల భూమి ప్రపంచచరిత్రలోన బం
ధురతర కీర్తి గొన్న భరతోర్వర నా జనయిత్రియంచు పా
డర! శిరమెత్తరా! విజయఢంకను గొట్టుమురా! సహైదరా!
ప్రతిపదార్థాలు :
సహోదరా (సహ + ఉదరా) = ఓ సోదరా !
పరమ తపోనివేశనము ; పరమ = మేలైన (అధికమైన)
తపః + నివేశనము = తపస్సునకు ఉనికి పట్టు (తపో భూమి).
బంగరుపంటలకున్ = బంగారు పంటలకు
నివాసము = నిలయము
అబ్బురము + అగు = అసాధారణమైన
శాంతిచంద్రికల = శాంతివెన్నెలలు కురిసే
భూమి = ప్రదేశము
ప్రపంచచరిత్రలోనన్ = ప్రపంచదేశముల చరిత్రలో
బంధురతరకీర్తి ; బంధురతర = మిక్కిలి రమ్యమైన
కీర్తి = కీర్తిని
భరతోర్వరభ (రత + ఉర్వర) = భారత భూమి
నా జనయిత్రి + అంచు = నా తల్లియని
పాడర = కీర్తించు
శిరము + ఎత్తరా = తల ఎత్తుకోరా !
కైకొనుమురా = తీసికొనుము

భావం :
ఓ భారతకుమార శ్రేష్ఠుడా ! “ఇది నా దేశం. ఈమె నన్ను కన్నతల్లి. నా దేశ సౌభాగ్య సంపదలు అభివృద్ధి చెందడానికి నేను సహాయమందిస్తాను. ప్రపంచమంతటా దీన్ని పూజించేటట్లుగా గొప్ప అభివృద్ధిని నెలకొల్పుతాను” అంటూ నీవు నీ మనస్సులో గట్టిగా ప్రతిజ్ఞ చెయ్యి (చేయుము).

2వ పద్యము

మ. ఇది నాదేశము నన్నుఁ గన్నయది నా యీ దేశ సౌభాగ్య సం
పదలీ విశ్వమునందు వర్ధిలగఁ దోడ్పాటున్ బొనర్తున్ మహా
భ్యుదయమ్మున్ నెలకొల్పుదున్ భువనముల్ పూజింపనంచీవు నీ
యెదలో గట్టి ప్రతిజ్ఞఁ గైకొనుమురా! హిందూకుమారాగ్రణీ!
ప్రతిపదార్థాలు :
హిందూకుమార + అగ్రణీ = శ్రేష్ఠుడైన ఓ భారత కుమారా!
ఇది నా దేశము – ఇది నా దేశము
నన్నున్ = నన్ను
కన్నయది (కన్న + అది) = కన్నది (కనిన తల్లి)
నా, ఈ = ఈ నా యొక్క
దేశ సౌభాగ్య సంపదలు; దేశ = దేశము యొక్క
సౌభాగ్య = వైభవపు
సంపదలు = ఐశ్వర్యములు
ఈ విశ్వమునందు = ఈ ప్రపంచంలో
వర్దిలగన్ = వృద్ధి పొందడానికి
తోడ్పాటున్ = సాయమును
పొనర్తున్ = చేస్తాను
భువనముల్ = లోకములు (ప్రపంచములు)
పూజింపన్ = పూజించేటట్లుగా
మహాభ్యుదయమున్ (మహా + అభ్యుదయమున్) = గొప్ప అభివృద్ధిని = పొందిన
నెలకొల్పుదున్ = నిలబెడతాను
అంచున్ = అంటూ
ఈ వు = నీవు
నీ + ఎదలోన్ = నీ మనస్సులో
గట్టి = దృఢమైన ప్రతిజ్ఞను
విజయఢంకను = విజయఢంకాను
కొట్టుమురా – మ్రోగించరా ! (చాటింపుము)

భావం :
ఓ సోదరా ! మన దేశం తపోభూమి. బంగారు పంటలకు నిలయం. శాంతి వెన్నెలలు కురిసే పుణ్యభూమి. ప్రపంచంలో మనోహరమైన కీర్తిని పొందిన ఈ భరతభూమి నా తల్లి అని గర్వంగా తల ఎత్తుకొని చాటిస్తూ, విజయఢంకాను మ్రోగిస్తూ నీ దేశం గురించి కీర్తించు.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

3వ పద్యము (కంఠస్థ పద్యం )

*ఉ. జాతి శిరస్సు నెత్తికొని క్ష్మాతలవీధిని గౌరవాన హుం
తన మొప్పగాఁ దిరిగినన్ గలుగున్ గడుకీర్తి భారత
క్ష్మాతలి కట్టి భాగ్యమును గల్గగ శాంతి సముద్ధరింప లే
రా ! తరుణమ్మిదే మరల రాదు సుమీ! గతకాల మెన్నడున్
ప్రతిపదార్థాలు :
జాతి = భారతజాతి
శిరస్సున్ + ఎత్తి = తల ఎత్తుకొని
క్ష్మాతల వీధిని . = భూమండలంలో (ప్రపంచంలో)
గౌరవాన = గౌరవంగా
హుందాతనము + ఒప్పగాన్ = హుందాగా
తిర్గినన్ = తిరిగితే
కడు = మిక్కిలి
కీర్తి = కీర్తి
కలుగున్ = కలుగుతుంది
అట్టి భాగ్యమును = అటువంటి సౌభాగ్యము
కల్గగన్ = కలిగే విధంగా
శాంతిన్ = శాంతిని
సముద్ధరింపన్ = పైకి తేవడానికి (లేవనెత్తడానికి)
లేరా = లెమ్ము
తరుణము + ఇదే = ఇదే తగిన సమయము
ఎన్నడున్ = ఎప్పుడునూ
గతకాలము = జరిగిపోయిన కాలం
మరల రాదు సుమీ = తిరిగి రాదు సుమా !

భావం :
భారత జాతి తల ఎత్తుకొని ప్రపంచ వీధిలో సగౌరవంగా, హుందాగా తిరిగినప్పుడే గొప్ప కీర్తి కలుగుతుంది. మన దేశానికి అటువంటి సౌభాగ్యం కలిగే విధంగా శాంతిని పెంపొందించడానికి ఇదే సరైన సమయము. అందుకు సిద్ధం కండి. ఎందుకంటే పోయిన కాలం తిరిగి రాదు కదా !

4వ పద్యము

మ. మతమేదైనను భాషయేదయిన సంపాదించుకొన్నట్టి సం
స్కృతి యేదైనను నిండు నీ తనువులో జీర్ణించు జాతీయతా
హితనవ్యోజ్జ్వల భావబంధురత లీ హింసా ప్రపంచాన క
ద్భుత రీతిన్ గనిపింపగా వలయు బాబూ! శాంతి దీక్షారతా!
ప్రతిపదార్థాలు :
(ప్రపంచానికి) శాంతి దీక్షారతా = శాంతి దీక్షయందు ఆసక్తి గలవాడా !
మతము = నీ మతము
ఏదయినను (ఏది + అయినను) ఏమయినప్పటికీ
భాషయేదయిన = నీ భాష ఏదయినా
సంపాదించుకున్నట్టి (సంపాదించుకున్న + అట్టి) = ఆర్జించినట్టి
సంస్కృతి – నాగరికత (సంస్కారము)
ఏదైనను (ఏది + ఐనను) = ఏదయినా
నిండు = నిండైన
నీ తనువులో = నీ శరీరములో (నీ నరనరాల్లో)
జీర్ణించు = నిండిన
జాతీయతా = భారత జాతీయత అనే
హిత = మేలయిన
నవ = కొత్తయైన
ఉజ్జ్వల = ప్రకాశించే
భావబంధురతలు = ఇంపైన భావములు
ఈ హింసా ప్రపంచానకున్ = ఈ హింసతో నిండిన ప్రపంచానికి
అద్భుత రీతిన్ = అద్భుతంగా
కనిపింపగా వలయున్ = కనిపించాల్సిన అవసరం ఉంది

భావం :
శాంతి దీక్షయందు ఆసక్తి గలవాడా ! నీ మతం, భాష, సంస్కృతి ఏవయినప్పటికీ, నీ నరనరాల్లో నిండిన భారతీయ భావన హింసతో నిండిన ఈ ప్రపంచానికి అద్భుతంగా కనిపించాలి.

5వ పద్యము

తే.గీ. నిఖిల ధరణికి శాంతిని నేర్పినట్టి
భరత భువనమ్ము నీ తల్లి ప్రథితయశము
నిలువఁబెట్టుట నీవంతు నిశ్చయముగ
నీకుఁ గలదు బాధ్యతయు హిందూకుమార!
ప్రతిపదార్థాలు :
హిందూకుమార ! = ఓ భారత కుమారా !
నిఖిల ధరణికిన్ = సమస్త భూమండలానికీ
శాంతిని = శాంతి మార్గాన్ని ముందు
నేర్పినట్టి (నేర్పిన + అట్టి) = నేర్పించినట్టి
భరత భువనమ్ము = భారత భూమి (భారతదేశం)
నీ తల్లి = నీకు తల్లి
ప్రథిత యశము = ప్రసిద్ధి పొందిన కీర్తి
నిలువబెట్టుట = నిలబెట్టడం
నిశ్చయముగ = తప్పక
నీ వంతు = నీ వాటా
నీకున్ = నీకు
బాధ్యతయు = పూచీయూ
కలదు = ఉంది

భావం :
ఓ భారత కుమారా ! సమస్త భూమండలానికి శాంతిని నేర్పినది భారతదేశం. నీ తల్లియైన ఈ భారతదేశం యొక్క సముజ్జ్వల కీర్తిని నిలబెట్టాల్సిన బాధ్యత నీమీద ఉంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

6వ పద్యము

సీ. శిరమెత్తరాదు మచ్చరికించి విషపు దౌ
ర్జన్య కులమత హింసాపిశాచి
నిలవఁగారాదు పెన్ బలిసిపోయిన దుష్ట
నయవంచకాళి గూండాయిజమ్ము
తొలచఁగారాదు విద్రోహాన దేశ భా
గ్యాల దార్యతను లంచాల జలగ
వచియింపఁగారాదు ప్రతినిధి యగువాడు
పగ ననల్ మొలకెత్త పలుకుబడుల

ఆ.వె. అంద అన్నదమ్ములన్న మధురమైన
ధర్మమునకు దెబ్బతగులరాదు
నాడురా ! సమేకతా డిండిమము మ్రోగు
వసుధ పొగడ నవ్యభారతమున
ప్రతిపదార్థాలు :
మచ్చరికించి = పట్టు పట్టి
విషపు = తీవ్రంగా వ్యాపించే
దౌర్జన్య కులమత హింసాపిశాచి;
దౌర్జన్య = దుండగములు (దౌర్జన్యములు)
కులమత = కులానికి, మతానికి చెందిన
హింసా పిశాచి = హింస అనే భూతము
శిరము + ఎత్తరాదు = తల ఎత్తరాదు (చెలరేగరాదు)
పెన్ = పెద్దగా
బలిసిపోయిన = పెరిగిపోయిన
దుష్ట = దుష్టులు
నయవంచక + ఆళి = నయవంచకుల సమూహం యొక్క (మోసగాండ్ర యొక్క)
గూండాయిజమ్ము = గూండాయిజం
నిలువగా రాదు = నిలువకూడదు
దేశభాగ్యాల = దేశ సౌభాగ్యముల
దాద్యతను = సత్తువను
లంచాల జలగ = లంచములు అనే జలగ
తొలచగా రాదు = పీల్చరాదు
ప్రతినిధి + అగువాడు = ప్రజా ప్రతినిధులయిన వారు (శాసనసభ్యులు)
పగ = శత్రుత్వము
ననల్ = చివుళ్ళు
మొలకెత్తన్ = అంకురించేలా
పలుకుబడులు = మాటలు
వచియింపగారాదు = మాట్లాడరాదు
అందరు = దేశప్రజలు అందరూ
అన్నదమ్ములు = సోదరులు
అన్న = అనిన
మధురమైన = తీయని
ధర్మమునకున్ = ‘ధర్మానికి
దెబ్బ తగులనీయరాదు = దెబ్బ తగలకూడదు
నవ్య భారతమున = నూతన భారతదేశంలో
వసుధ పొగడన్ = ప్రజలు పొగిడేలా
సమేకతా = సమైక్యము అనే
డిండిమము = ఢక్కా
నాడు = ఆనాడే
మ్రోగున్ రా = ధ్వనిస్తుందిరా !

భావం :
ఇటువంటి పుణ్యదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కులమత హింసలు అనే పిశాచాలను తలయెత్తనీయకూడదు. నానాటికీ పెరిగిపోతున్న దుష్టుల, మోసగాళ్ళ యొక్క గూండాయిజం నిలువకూడదు. బలిష్ఠమైన దేశ సౌభాగ్యాన్ని లంచాలు అనే జలగలు పట్టి పీల్చకూడదు. పగలు, సెగలు రగిలించే మాటలు ప్రజా ప్రతినిధులైన వారు మాట్లాడకూడదు. మనమంతా అన్నదమ్ములం అన్న తీయనైన ధర్మానికి దెబ్బతగులనీయకూడదు. అలా జరిగినప్పుడు సమైక్యము అనే ఢక్కా నవ్యభారతంలో ప్రజలు పొగిడేలా మోగుతుంది.

7వ పద్యము (కంఠస్థ పద్యం)

*శా. ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్
ఈ గోదావరి సింధు నర్మదలు నీ యీదేశ సౌభాగ్య ధా
న్యాగారాలకు పట్టుగొమ్మలు నఖండంబైన నీ ధారుణీ
భాగ్యమ్మీ సకల ప్రపంచమునకున్ స్వామిత్వముం బూనెడిన్
ప్రతిపదార్థాలు:
ఈ గంగానది = ఈ గంగానది
బ్రహ్మపుత్రయునున్ = బ్రహ్మపుత్రా నదియును
ఈ కృష్ణమ్మ = ఈ కృష్ణా నదియు
కావేరియున్ = కావేరీ నదియు
ఈ గోదావరి = ఈ గోదావరి నదియు
సింధు నర్మదలు = సింధు నదియు, నర్మదా నదియు
నీ + ఈ దేశ = నీ యొక్క ఈ భారతదేశపు
సౌభాగ్య ధాన్యాగారాలకు = సౌభాగ్యానికీ, ధాన్యాగారాలకు
పట్టుగొమ్మలు (పట్టు + కొమ్మలు) = ఆధారములు
అఖండంబయిన = సంపూర్ణమైన
ఈ ధారుణీ భాగమ్ము = ఈ భూభాగము
ఈ సకల ప్రపంచమునకున్ = ఈ సమస్త ప్రపంచానికి
స్వామిత్వమున్ = ఆధిపత్యమును
పూనెడిన్ = వహిస్తుంది

భావం :
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, కావేరి, గోదావరి, సింధు, నార్మద అనే జీవనదులు ఈ దేశ సౌభాగ్యమైన ధాన్యాగారాలకు ముఖ్యమైన ఆధారం. అఖండమైన సౌభాగ్య సంపదలు గలిగిన ఈ దేశం ప్రపంచానికి అధిపతి అయ్యింది.

8వ పద్యము

తే.గీ. ముసలి సన్న్యాసి బాపూజీ బోసినోరు
విప్పిపలికిన పలుకుకే విశ్వజగతి
జోతలర్పించె జాతికి ఖ్యాతి యదియ
ఆ మహామౌని నేల పాడయ్యె నేడు
ప్రతిపదార్థాలు :
ముసలి సన్న్యాసి = ముసలివాడైన సన్న్యాసి వంటివాడైన
బాపూజీ = గాంధీజీ యొక్క
బోసినోరు = పళ్ళులేని నోరు
విప్పి = విప్పి
పలికిన = మాట్లాడిన
పలుకుకే = మాటకే
విశ్వజగతి = ప్రపంచము
జోతలు + అర్పించే = జోహార్లు సమర్పించింది
అదియ = అది ప్రపంచం, గాంధీజీకి జోహార్లు సమర్పించడం అన్నది
జాతికి= భారత జాతికి
ఖ్యాతి = కీర్తినిచ్చేది ఖ్యాతి
ఆ మహామౌని = ఆ గొప్ప మునివంటి గాంధీజీ పుట్టిన
నేల = భూమి (భారతదేశం)
నేడు = ఈనాడు
పాడయ్యె = చెడిపోయింది (గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నడవడం లేదు)

భావం :
గొప్ప ముసలి సన్యాసి వంటి గాంధీజీ తన బోసి నోరు విప్పి పలికిన పలుకులకు (శాంతి సందేశానికి) ప్రపంచ మంతా జేజేలు పలికింది. అందువల్ల మన భారత జాతికి ఖ్యాతి వచ్చింది. అటువంటి మహాత్ముని కన్న భూమి, నేడు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నడవడం లేదు.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

9వ పద్యము

ఆ.వె. దేశభక్తి మఱియు దేశసమగ్రత
ప్రజల నాడులందు ప్రబలి ప్రబలి
కర్మభూమియగు నఖండ భారతమహా
క్షితిని నెగురు ప్రగతి కేతనమ్ము
ప్రతిపదార్థాలు :
దేశభక్తి = దేశమునందు భక్తి
మఱియున్ = మఱియు
దేశసమగ్రత = దేశము యొక్క సమగ్రత అనే భావాలు
ప్రజల నాడులందు = ప్రజల నరనరాలలో
ప్రబలి, ప్రబలి = బాగా వ్యాపించి
కర్మ భూమి + అగు = పుణ్యభూమియైన
అఖండ భారత మహాక్షితిని ;
అఖండ = సంపూర్ణమైన
భారత = భారతము అనే
మహాక్షితినిన్ = గొప్ప నేలపై
ప్రగతి కేతనమ్ము = అభివృద్ధి అనే జెండా
ఎగురు = ఎగురుతుంది

భావం :
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు, ప్రజల నరనరాల్లో వ్యాపించి, పుణ్యభూమియైన అఖండ భారతదేశంలో ప్రగతి జెండా రెపరెపలాడుతూ ఎగురుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 8 జీవన భాష్యం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 8th Lesson జీవన భాష్యం

8th Class Telugu 8th Lesson జీవన భాష్యం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

“శ్రద్ధగలవాడే జ్ఞానాన్ని పొందుతాడు”.
“కటిని తిడుతూ కూర్చోడం కన్నా చిన్న దీపం వెలిగించు”.
“అణుశక్తి కన్నా ఆత్మశక్తి మిన్న”.
“త్యాగగుణానికి తరువులే గురువులు”.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై వాక్యాల ద్వారా మీరేం గ్రహించారు?
జవాబు:
పై వాక్యాల ద్వారా కొన్ని సూక్తులను తెలుసుకున్నాము. కొన్ని సందేశాలను, ఉపదేశాలను గ్రహించాము.

ప్రశ్న 2.
ఇలాంటి వాక్యాలనేమంటారు?
జవాబు:
ఇలాంటి వాక్యాలను సుభాషితములని, సూక్తులని అంటారు. మంచి మాటలు, సందేశాలు అని కూడా అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

ప్రశ్న 3.
ఇలాంటి సందేశాలు, మంచిమాటలు ఇంకా ఏ ఏ రూపాలలో ఉంటాయి?
జవాబు:
ఇలాంటి సందేశాలు, మంచి మాటలు పద్యాలు, శ్లోకాలు, గేయాలు, మినీ కవితలు, గజళ్ళు మొదలైన రూపాలలో ఉంటాయి.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
‘జీవన భాష్యం’ గజలను రాగయుక్తంగా, భావయుక్తంగా పాడండి.
జవాబు:
పాడడం, మీ ఉపాధ్యాయుల సాయంతో నేర్చుకోండి.

ప్రశ్న 2.
‘జీవన భాష్యం’ అనే పేరు ఈ పాఠానికి తగిన విధంగా ఉందా? ఎందుకు? చర్చించండి.
జవాబు:
‘జీవన భాష్యం’ అంటే బ్రతుకు పై వ్యాఖ్యానం. జీవితం ఎలా నడిపించుకోవాలో వివరంగా చెప్పడమే ‘జీవన భాష్యం’. ఈ గజల్ లో నారాయణరెడ్డి గారు జీవితమును గూర్చి కొన్ని సత్యాలు చెప్పారు. మనసుకు దిగులు మబ్బు ముసిరితే కన్నీళ్ళు వస్తాయన్నారు. ఆటంకాలు వస్తాయనీ, జంకకుండా అడుగులు వేయాలనీ చెప్పారు. బీడు భూములు దున్ని విత్తితే పంటలు పండుతాయని చెప్పారు. మనుషులు అందరూ కలిసి ఉండాలని చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా జీవితంలో పరీక్షలు తప్పవన్నారు. కేవలం బిదుదులు పొందినంత మాత్రాన విలువలేదనీ, మంచి త్యాగం చేస్తేనే మనిషి పేరు నిలబడుతుందని చెప్పారు. ఈ విధంగా జీవితం గూర్చి వివరించి చెప్పినందువల్ల ‘జీవనభాష్యం’ అన్న పేరు ఈ పాఠానికి తగియుంది.

ప్రశ్న 3.
ఈ “గజల్స్” ద్వారా “సినారె” ఏం సందేశమిస్తున్నారు?
జవాబు:
లక్ష్యసాధనలో ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయనీ, అయినా జంకకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుందనీ, ఆ స్ఫూర్తె నలుగురూ అనుసరించే దారి అవుతుందని సినారె చెప్పారు.

  • ఎడారి దిబ్బలను దున్నితే ఏమి ఫలితం ఉండదని అనుకోక, వాటిని దున్నితే పంటలు పండుతాయని చెప్పారు.
  • మనుషులు తమలో తాము భేదాలు ఎంచుకోకుండా కలసిమెలిసి జీవించాలని చెప్పారు.
  • మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా పరీక్ష ఉంటుందని గుర్తు చేశారు.
  • బిరుదులు, సత్కారాలు పొందడంలో విలువ, గుర్తింపు లేవని, మానవాళికి పనికివచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని సినారె సందేశమిచ్చారు.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. అ) కరిగితే, ముసిరితే, మమత, దేవత, పెరిగి, మరిగి వంటి పదాలు గజల్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి, వాటి కింద గీత గీయండి. ఆ పాదాలు రాయండి.
జవాబు:

  1. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.
  2. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది.
  3. నిలువెల్ల మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు
  4. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు
  5. విరిగినపుడు నిలువెత్తుగా పెరిగి తెలుసుకో
  6. మౌలిక తత్వం సలసల మరిగి తెలుసుకో

ఆ) గజళ్ళలో కవి తన గురించి ప్రస్తావించిన పంక్తులు ఏవి? వాటిని రాసి భావాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
బిరుదులు పొందే వ్యాప్తికీ విలువేమి “సినారే”. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది – అనే పంక్తులు కవి తన గురించి ప్రస్తావించినవి.

భావం :
ఓ సినారే! గొప్ప బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికొచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. కింది పేరాను చదివి, ఐదేసి ప్రశ్నలు తయారుచేయండి.

చైనా తత్త్వవేత్త కన్ఫ్యూషియస్. ఆయన చాలా తెలివైనవాడు. ఒక రాజుగారు అతణ్ణి గురించి విని తన సభకు పిలిపించుకున్నాడు. మూడు పంజరాలు చూపించాడు. మొదటి పంజరంలో ఒక ఎలుక, దాని ఎదురుగా తినే పదార్థాలు ఉన్నాయి. రెండో పంజరంలో పిల్లి ఉంది. దాని ఎదురుగా పళ్ళెంలో పాలు ఉన్నాయి. మూడో పంజరంలో ఒక గద్ద ఉంది. దాని ఎదురుగా తాజా మాంసం ఉంది. కానీ ఎలుక ఏ పదార్థం తినటం లేదు; పిల్లి పాలు ముట్టుకోవడం లేదు; గద్ద కూడా మాంసం ముట్టడం లేదు. దీనికి కారణమేమిటి? అని అడిగాడు రాజు. తత్త్వవేత్త ఇలా సమాధానం ఇచ్చాడు- “పిల్లిని చూసి భయపడి ఎలుక ఆహారం తీసుకోలేదు. పిల్లి ఎలుకమీద ఆశతో పాలు ముట్టుకోలేదు. పిల్లిని, ఎలుకను ఒకేసారి తినాలనే ఆశతో గద్ద మాంసం ముట్టుకోలేదు. అలాగే భవిష్యత్తు మీద ఆశతో ప్రజలు వర్తమానాన్ని విస్మరిస్తున్నారు. సుఖానికి దూరమవుతున్నారు. ఈ సమాధానానికి సంతృప్తిపడి రాజు కన్ఫ్యూషియకు విలువైన బహుమానాన్ని ఇచ్చాడు.
జవాబు:
ప్రశ్నలు:

  1. కన్ఫ్యూషియస్ ఎవరు? ఆయన ఎలాంటివాడు?
  2. మొదటి, రెండు, మూడు పంజరాలలో ఏమేమి ఉన్నాయి?
  3. మూడో పంజరం ఎదురుగా ఏమి ఉంది?
  4. రాజు ఏమని ప్రశ్నించాడు?
  5. రాజు అడిగిన ప్రశ్నకు తత్త్వవేత్త ఏమి సమాధానమిచ్చాడు?

3) కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.

అ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యంలో మీరేమి గ్రహించారు?
జవాబు:
ఎడారిలో ఇసుకదిబ్బలు ఉంటాయి. అక్కడ నీళ్ళు దొరకవు. ఇసుక నేలల్లో పంటలు పండవు. అందువల్ల నీళ్ళు దొరకని ఎడారులలోని ఇసుక దిబ్బలను దున్నితే ఫలితము ఏముంటుంది? అవి వ్యవసాయానికి పనికిరావు కదా ! అని నిరాశపడరాదని కవి చెప్పాడు. సేద్యానికి పనికిరావు కదా అని బంజరు బీడులను దున్నకుండా విడిచి పెట్టవద్దనీ, వాటిని దున్ని విత్తులు చల్లితే చక్కని పైరుపంటలు పండుతాయనీ, నిరాశ పనికిరాదనీ, ఆశావహ దృక్పథంతో ముందుకు నడిస్తే తప్పక ఫలితాలు వస్తాయనీ కవి ఈ వాక్యాల ద్వారా సందేశం అందించాడు.

ఆ) నిలువెల్లా మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు – అంటే మీకేమి అర్థమైంది?
జవాబు:
సి. నారాయణరెడ్డిగారు తల్లిని చక్కగా అభివర్ణించారు. మాతృత్వ మధురిమలను సుమనోహరంగా ఆవిష్కరించారు. మానవునికి తొలి గురువు తల్లి. చేతులను పట్టుకొని నడిపిస్తుంది. అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. మమతానురాగాలను అందిస్తుంది. మూర్తీభవించిన శాంతమూర్తి తల్లి. మమతను అందిస్తుంది. మనలో దుఃఖాన్ని తొలగిస్తుంది. సుఖాన్ని కల్గిస్తుంది. వెలుగులా దారి చూపిస్తుంది. అందుకే సి.నా.రె. గారు తల్లిని ఉద్దేశించి, నిలువెల్ల మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు – అని ప్రశంసాత్మకంగా అన్నాడు.

ఇ) సమైక్య సంఘర్షణ అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు:
పచ్చదనమంటే అది వృక్ష సంపదకు చిరునామా. చినుకులు కురవాలంటే మేఘం రూపుదిద్దుకోవాలి. కేవలం ప్రభుత్వాలు, చట్టాల వలన సమాజం బాగుపడదు. ఎవరికి వారు స్వీయక్రమశిక్షణను, నైతిక నియమాలను అలవరచుకోవాలి. రాశికన్నా వాసి ముఖ్యం. పుక్కిటి పురాణాలు ఎన్ని రాసినా ప్రయోజనం శూన్యం. సమైక్యతతోనే సంఘం వర్థిల్లుతుంది గానీ, వ్యక్తిగతంగా పోరాడి సాధించేది ఏమీ ఉండదు. మానవతను మేలుకొలిపేదే నిజమైన సాహిత్యమవుతుంది. అలాగే తోటి మనిషికి సేవచేసే దయగల మనుషుల్లోనే దైవం దాగి ఉందనే భావాన్ని కవి వ్యక్తపరిచారు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) ఈ పాఠంలో గజల్ ప్రక్రియను గూర్చి తెలుసుకున్నారు కదా ! మీకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియల పేర తెలపండి. వాటిని గురించి రాయండి.
జవాబు:
నాకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియలు :
1. ప్రబంధం
2. కథానిక
3. ఆత్మకథ
4. ఇతిహాసం

1. ప్రబంధం :
పురాణేతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి స్వతంత్ర కావ్యంగా వ్రాస్తే దాన్ని “ప్రబంధం” అంటారు. మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్తమాల్యద మొ||నవి ప్రబంధాలు.

2. కథానిక :
ఒక వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్నీ, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించ సాహిత్య ప్రక్రియను “కథానిక” అంటారు. ఇది వచన ప్రక్రియ. మరీ చిన్నదిగాను, మరీ పెద్దది గాను లేకుండా ఉండటం కథానిక లక్షణం.

3. ఆత్మకథ :
ఆత్మకథ అంటే తనను గురించి తాను రాసుకొన్న కథ. ఎవరైనా తమ ఆత్మకథను రాసుకోవచ్చు. అవి ఆత్మకథలే అయినా సమాజ జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ప్రముఖ వ్యక్తులు తమ జీవితాల గురించి రాసుకొన్న విషయాలు సమకాలిక సమాజానికి వ్యాఖ్యానాలుగా ఉపయోగపడతాయి.

4. ఇతిహాసం :
ఇతిహాసం అంటే పూర్వ కథ అని అర్థం. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆశురూపంలో ఉండేవి. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, భారతం మొ||నవి ఇతిహాసాలు.

ఆ) మంచి పంటలు పండడానికి రైతు చేసే శ్రమ ఎలాంటిదో వివరించండి.
(లేదా)
విరామము లేకుండా శ్రమిస్తూ మనకు అన్నం పెడుతున్న కర్షకుల శ్రమను గురించి వివరించండి.
జవాబు:
మంచి పంటలు పండించాలంటే రైతులు పొలాల్ని చక్కగా దున్నాలి. తరువాత నీరు పెట్టాలి. మంచి విత్తనాలు తెచ్చి, నారుమళ్ళు వేయాలి. సేంద్రియ ఎరువుల్ని వేయాలి. పశువుల పేడను ఎరువులుగా వేస్తే మంచిది. పురుగుమందులు ఎక్కువగా వాడరాదు. సకాలంలో చేనుకు నీరు పెట్టాలి. కలుపు మొక్కలను తీసిపారవేయాలి. చేనును ఆరబెట్టి, సకాలంలో చేనుకు నీరందించాలి. ఎలుకల బెడద లేకుండా చూసుకోవాలి. రైతులు నిత్యం చేనును గమనించాలి. ఏదైనా పురుగుపడితే వేప పిండి వగైరా చల్లి వాటిని అరికట్టాలి. వర్షాధారంగా పండే పంట అయితే, నీరు కావలసినపుడు ఇంజన్ల ద్వారా తోడి నీరు పెట్టాలి. రైతు ఇంతగా శ్రమిస్తేనే మంచిపంటలు పండుతాయి.

ఇ) ఓటమి కలిగినపుడు మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది? వివరించండి.
జవాబు:
సాధారణంగా ఓటమి మానవుని కుంగదీస్తుంది. నీరసింపజేస్తుంది. శూన్యుడిగా మారుస్తుంది. అయితే మానవుడు ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలని బోధించాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఉపదేశించాడు.

పరమాణువులో దాగిన లక్షణాలను విశ్లేషించడం ద్వారా భూమి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. సముద్రంలోతు తెలియాలంటే కారే కన్నీటి బిందువుల వెనుక దాగున్న కష్టాల కడలిని అర్థం చేసుకోవాలి. సంతృప్తి గురించి తెలియాలంటే, ఎంత సంపద ఉన్నా సంపన్నులు పొందలేకపోతున్న సంతృప్తిని తమ కళారాధనతో పొందుతున్న కళాకారులను పరిశీలించాలి. గుండెలోతుల్లో నుండి ప్రేమతో పలకరించే వారూ, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారూ ఉంటారు. ఎవరి మాట వెనుక ఏ ఏ అర్థాలున్నాయో తెలుసుకోగలగాలి. కెరటం నాకు ఆదర్శం. పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నట్లుగా ఓటమిని జయించాలంటే కెరటంలా కిందపడినా పైకి లేవగలగాలి. పండిన చెట్టు వంగడానికి కారణం ఉపకార గుణం. అలా ఎంత ఎదిగినా ఒదిగి ఉపకరించడం నేర్చుకోవాలి. అనాయాసంగా ఏదీ పట్టుబడదు. విజయం సాధించాలంటే కష్టపడడం తప్ప మరొక దొడ్డిదారి ఏదీ లేదు. దాని మూలాలను బాగా శోధించి తెలుసుకోవాలనే భావనను ఈ గజల్ ద్వారా సి.నా.రె గారు తెలిపారు.

ఈ) అమ్మను జ్ఞానపీఠంగా కవి ఎందుకు వర్ణించాడు?
జవాబు:
‘జీవన భాష్యం’ అనే పాఠ్యభాగంలో నారాయణరెడ్డిగారు మాతృత్వాన్ని, అమ్మ గొప్పతనాన్ని చక్కని మాటలతో ఆవిష్కరించారు. అమ్మ గొప్పతనాన్ని చక్కగా తెలియజేశారు. అమ్మ మనకందరికి తొలి గురువు.

పెరిగే సినారె బ్రతుకులో దొరికింది అమ్మ ప్రాపు.

చిన్నప్పుడు ఆ బొమ్మ కావాలి ! ఈ మిఠాయి కావాలి ! అని మొండికేసి ఇప్పుడే కొని పెట్టమని మంకుపట్టు పట్టి అమ్మ చంకనెక్కి ఇదుగో ఈ బండి చూడు ఎంత బాగుందీ అదుగో ఆ గుర్రం చూడు అది నీకే అంటూ బుజ్జగించినా అమ్మ చంక దిగలేదు. నేనెంత అల్లరి చేసినా, చిరునవ్వుతో భరించింది. దెబ్బతగిలి ఏడుస్తున్నప్పుడు ఓర్చుకోవాలని, మిత్రులతో దెబ్బలాడినపుడు సర్దుకోవడం నేర్చుకోవాలనీ జ్ఞాన బోధచేస్తూ నా బాల్యమంతా వేలుపట్టి నడిపించింది. చీకటిలో ఏమీ కనిపించనపుడు తన వెన్నెల వెలుగులతో దారిని చూపే చంద్రునిలా, ఆకలైనపుడు ఆకలికి తీర్చే నిండుకుండలా తన ప్రేమానురాగాలతో వెలుగులా నిలిచింది అమ్మ. మెరిసే సూర్యోదయకాలపు సూర్యకిరణంలా వసంత ఋతువులో పూచే పూవులా పెరిగిన నాకు అమ్మ అండ దొరికిందని ఈ గజల్ ద్వారా కవి అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) సంతకం యొక్క ప్రాధాన్యం ఏమిటి ? సంతకం గురించి సినారె ఏమి చెప్పారు?
జవాబు:
ఆధునిక సమాజంలో సంతకానికి తరగని విలువ ఉంది. సంతకం లేని ఏ ఉత్తరువు చెల్లనేరదు. ఒక్క సంతకం జీవితాన్నే మారుస్తుంది. కవి సంతకం యొక్క గొప్పదనాన్ని తన పరిభాషలో చక్కగా వ్యక్తపరిచారు.
పచ్చదనమంటే అది వృక్ష సంపదకు చిరునామా. చినుకులు కురవాలంటే మేఘం రూపుదిద్దుకోవాలి. కేవలం ప్రభుత్వాలు, చట్టాల వలన సమాజం బాగుపడదు. ఎవరికి వారు స్వీయక్రమశిక్షణను, నైతిక
నియమాలను అలవరచుకోవాలి. రాశికన్నా వాసి ముఖ్యం. పుక్కిటి పురాణాలు ఎన్ని రాసినా ప్రయోజనం శూన్యం. సమైక్యతతోనే సంఘం వర్ధిల్లుతుంది గానీ, వ్యక్తిగతంగా పోరాడి సాధించేది ఏమీ ఉండదు. మానవతను మేలుకొలిపేదే నిజమైన సాహిత్యమవుతుంది. అలాగే తోటి
మనిషికి సేవచేసే దయగల మనుషుల్లోనే దైవం దాగి ఉందనే భావాన్ని ఈ గజల్ ద్వారా కవి వ్యక్తపరిచారు.

ఆ) తెలుసుకోడం వల్ల ప్రయోజనం ఏమిటి ? కవి ఏమేమి తెలుసుకోమన్నాడు?
(లేదా)
సి.నా.రె గారు గజల్ అనే ప్రక్రియ ద్వారా తెలుసుకోవడం వల్ల ప్రయోజనాలు చెప్పారు. అవి మీ మాటల్లో రాయండి.
జవాబు:
పరమాణువులో దాగిన లక్షణాలను విశ్లేషించడం ద్వారా భూమి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. సముద్రంలోతు తెలియాలంటే కారే కన్నీటి బిందువుల వెనక దాగున్న కష్టాల కడలిని అర్థం చేసుకోవాలి. సంతృప్తి గురించి తెలియాలంటే, ఎంత సంపద ఉన్నా సంపన్నులు పొందలేకపోతున్న సంతృప్తిని తమ కళారాధనతో పొందుతున్న కళాకారులను పరిశీలించాలి. గుండెలోతుల్లో నుండి ప్రేమతో పలకరించే వారూ, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారూ ఉంటారు. ఎవరి మాట వెనుక ఏ ఏ అర్థాలున్నాయో తెలుసుకోగలగాలి. కెరటం నాకు ఆదర్శం. పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నట్లుగా ఓటమిని జయించాలంటే కెరటంలా కిందపడినా పైకి లేవగలగాలి. పండిన చెట్టు వంగడానికి కారణం ఉపకార గుణం. అలా ఎంత ఎదిగినా ఒదిగి ఉపకరించడం నేర్చుకోవాలి. అనాయాసంగా ఏదీ పట్టుబడదు. విజయం సాధించాలంటే కష్టపడడం తప్ప మరొక దొడ్డిదారి ఏదీ లేదు. దాని మూలాలను బాగా శోధించి తెలుసుకోవాలనే భావనను ఈ గజల్ ద్వారా సి.నా.రె గారు తెలిపారు.

IV. పదజాలం

1. కింది పదాలకు అర్థాలు తెలుసుకోండి. ఆ పదాల్ని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) ముసరడం = క్రమ్ముకోవడం, చుట్టుముట్టడం, వ్యాపించడం
సొంతవాక్యం : ఆకాశంలో నీలిమేఘాలు ముసరడంతో చీకటిగా ఉంది.

ఆ) అలవోకగా = అతి సులువుగా, తేలికగా
సొంతవాక్యం : కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో అలవోకగా బరువును ఎత్తింది.

ఇ) పూర్ణకుంభం = నిండినది, సమస్తము
సొంతవాక్యం : అధికారులకు దేవాలయాలలో పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు.

ఈ)హృదయం = మనసు, ఎద
సొంతవాక్యం : సజ్జనుల హృదయం ఎప్పుడూ మంచి ఆలోచనతోనే ఉంటుంది.

V. సృజనాత్మకత

* ‘జీవన భాష్యం’ గజల్ లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
జవాబు:
……………. నీరవుతుంది.
…………….దారవుతుంది.
……………. పైరవుతుంది.
……………. ఊరవుతుంది.
……………. ఏరవుతుంది.
……………. పేరవుతుంది.
జవాబు:
సొంత వచన కవిత :
1) శాంతి, మంచు కూడితే కోపాగ్ని నీరవుతుంది.
2) పదిమందీ అట్లానే నడిస్తే అదే నీ దారవుతుంది.
3) సకాలంలో విత్తులు చల్లితే ఆ విత్తే పైరవుతుంది.
4) కులమత భేదాలే కూలితే ఉన్నదే ఊరవుతుంది.
5) శక్తికి మించని త్యాగం నీ ఈవికి ఏరవుతుంది.
6) పదిమందీ నిను పొగిడితే నీ కీర్తికి పేరవుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

(లేదా)

*ఆచార్య సి.నారాయణరెడ్డిగారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి దగ్గర ఏం తెలుసుకోవాలనుకొంటున్నా! ప్రశ్నలు రాయండి.
జవాబు:
ప్రశ్నలు : 1) సినారె గారూ ! మీరు సాహిత్య రచనలు ఎప్పటి నుంచి ప్రారంభించారు?
2) మీరు వ్రాసిన సినిమా పాటలు మీరు వింటున్నపుడు మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది?
3) మీరు ఇంత గొప్ప రచయితగా మారటానికి ప్రేరణ ఎవరు?
4) మీరు “పద్మభూషణ్” బిరుదును పొందినపుడు మీరు ఎలా స్పందించారు?
5) సినీ గేయ రచయితగా మీకు నచ్చిన సినిమా పాట ఏది?
6) వేటూరిని గొప్ప సినీ గేయ రచయిత అంటారు కదా ! వారి రచనలపై మీ అభిప్రాయం ఏమిటి?
7) తెలుగులో పాండిత్యం రావాలంటే ఏమి చేయాలి?

VI. ప్రశంస

* చదువులో వెనకబడిన ఒక విద్యార్థి తనలో కలిగిన మార్పు వల్ల కొద్దికాలంలోనే గతంలో కన్నా మెరుగైన ఫలితాల: పొందాడు. అతనిలో వచ్చిన మార్పును గురించి తెలుపుతూ వాళ్ళ అమ్మానాన్నలకి ఉత్తరం రాయండి.
జవాబు:

లేఖ

ప్రొద్దుటూరు,
x x x x x x x x

పూజ్యులు, ఆనందరావు గారికి,

మీకు నమస్కారములు. నేను మీ అబ్బాయి సురేష్ సహ విద్యార్థిని. మేము కూడా ప్రొద్దుటూరు జి పరిషత్ ఉన్నత పాఠశాలలోనే చదువుతున్నాము. ఈ మధ్య మీ సురేష్ అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడ తరగతిలో శ్రద్ధగా పాఠాలు వింటున్నాడు. సాయంత్రం మాతో ఆటలు కూడా ఆడుతున్నాడు.

రాత్రివేళ హాస్టలులో 10 గంటల వరకూ చదువుతున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకే లేచి, 6 గంటల వరక చదువుతున్నాడు. ఏ రోజు ఇంటిపని ఆ రోజే పూర్తిచేస్తున్నాడు. రోజూ ఉదయం పండ్లరసం, సాయంత్రం హార్లి! తాగుతున్నాడు. అందువల్ల సురేష్ అలసిపోకుండా చదువుపై మంచి దృష్టి పెడుతున్నాడు. ప్రత్యేకంగా లెదులు, సామాన్యశాస్త్రములలో మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. సురేశ్, ప్రతిభకు కారణం అతను చూపే శ్రద్ధ, ఆహారపు .. అలవాట్లలో మార్పు, చదువుతో పాటు ఆటలపై చూపే ఆదరము అని నా అభిప్రాయం.

నా సహవిద్యార్థి, మీ అబ్బాయి సురేష్ కు మా తరగతి విద్యార్థుల తరఫున అభినందనలు. మీకు మా నమస్కారాలు. సెలవు.

ఇట్లు,
మీ విశ్వసనీయురాలు,
x x x x x x,
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ప్రొద్దుటూరు.

చిరునామా :
బి. ఆనందరావుగారు,
8/23-6, సంతబజార్,
శివాలయం వీధి,
బద్వేలు.

ప్రాజెక్టు పని

*ఆచార్య సి.నారాయణరెడ్డిగారి రచనలు, పాటల వివరాలను సేకరించి ఒక పట్టికను తయారుచేయండి. దాన్ని తరగతిలో చదివి వినిపించండి. ప్రదర్శించండి.
జవాబు:
రచనలు:

1) ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు – ప్రయోగములు 2) ‘విశ్వంభర’ (జ్ఞానపీఠ అవార్డు గెలుచుకుంది)
3) నాగార్జున సాగరం 4) కర్పూర వసంతరాయలు
5) మధ్యతరగతి మందహాసం 6) ప్రపంచపదులు
7) విశ్వనాథనాయకుడు 8) నారాయణరెడ్డి గేయాలు
9) దివ్వెల మువ్వలు 10) అజంతా సుందరి
11) రామప్ప 12) నవ్వని పువ్వు
13) వెన్నెలవాడ 14) ఋతుచిత్రం
15) స్వప్నభంగం 16) విశ్వగీతి
17) జలపాతం 18) సినీగేయాలు
19) జాతిరత్నం 20) తరతరాల వెలుగు (గేయ రూపకాలు)
21) అక్షరాల గవాక్షాలు 22) మంటలు – మానవుడు
23) ఉదయం నా హృదయం 24) మార్పు నా తీర్పు
25) ఇంటిపేరు చైతన్యం 26) రెక్కలు
27) నడక నా తల్లి 28) కాలం అంచుమీద
29) కవిత నా చిరునామా 30) కలం సాక్షిగా
31) భూమిక, మట్టీ – మనిషి (దీర్ఘ కావ్యాలు) 32) తెలుగు గజళ్ళు
33) వ్యాసవాహిని, సమీక్షణం 34) పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు (యాత్రా సాహిత్యం)
35) పాటలో ఏముంది – నా మాటలో ఏముంది (సినిమా పాటల విశ్లేషణ)

ఈ పాఠం ‘జీవన భాష్యం’ వలెనే సినారే గారి ‘ప్రపంచ పదులు’ కావ్యం కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి, మానవ జీవితానికి ఉపకరించే అమూల్యమైన సందేశాలను అందిస్తుంది.

ప్రపంచ పదులు

1. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది?
ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది?
నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి
ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది?
ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది?

2. చీకటికి చురకపెడుతుందిలే చిన్న మిణుగురు పురుగు
మొండివానను ఆపుతుందిలే రెండు మూరల గొడుగు
మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే
దూరాన్ని చెరిపివేస్తుందిలే బారుచీమల పరుగు
పాపాన్ని కడిగివేస్తుందిలే పాలనవ్వుల నురుగు

3. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది?
చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది?
ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా
మరగనిదే నీరు ఎలా మబ్బురూపు కడుతుంది?
నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది?

4. ఒక్క చినుకు చాలు మట్టి గుక్కను పలికించాలంటే
ఒక్క చెణుకు చాలు నవ్వు చుక్కలు మొలిపించాలంటే
ఊహల్లో గీసుకున్న వ్యూహాలకు విలువేముంది?
ఒక్క మెరుపు చాలు నింగి పక్కను దొరలించాలంటే
ఒక్క చరుపు చాలు పుడమి రెక్క ఎగిరించాలంటే

మరికొన్ని సినారె విరచిత గేయాలు :
1) “నా పేరు కవి
ఇంటి పేరు చైతన్యం
ఊరు సహజీవనం
తీరు సమభావనం.”

2) “నా వచనం బహువచనం
నా వాదం సామ్యవాదం
కవిత్వం నా మాతృభాష
ఇతివృత్తం మానవత్వం”

3) “ఊపిరాడడం లేదు
ఉక్కపోస్తుంది, ఎ.సీ గదిలో
కారణం తెలిసిపోయింది.
కవిత రాయలేదు ఇవాళ”.

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. క్వార్థకం
భాషాభాగాల్లో ఒకటైన ‘క్రియ’ను గురించి కింది తరగతుల్లో తెలుసుకున్నారు. క్రియలను బట్టి వచ్చే వాక్య భేదాలను కొన్నింటిని చూద్దాం.

కింది వాక్యం చదవండి.

భాస్కర్ ఆటలు ఆడి ఆలసిపోయి ఇంటికి వచ్చాడు.
భాస్కర్ – కర్త
వచ్చాడు – కర్తృవాచక పదానికి సంబంధించిన ప్రధాన క్రియ.
ఆడి, అలసి – కర్తృవాచక పదానికి సంబంధించిన ఇతర క్రియలు.
ఆడి, అలసిపోయి అనే పదాలు క్రియలే కానీ, వాటితో పూర్తిభావం తెలియడం లేదు.
‘ఆడి’ అనే క్రియకు ‘ఆడి’ తర్వాత ఏం చేశాడు ? ఏం జరిగింది ? అనే ప్రశ్న ఉదయిస్తోంది.
పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు. ఇంకా, జరిగిపోయిన విషయాన్ని అంటే భూతకాలంలోని పనిని సూచిస్తుంది.
‘ఆలసిపోయి’ అనే క్రియ కూడా అలాంటిదే.

వీటిని భూతకాలిక అసమాపక క్రియలని, క్వార్థం అనీ అంటారు.

ఈ క్రియలన్నీ కూడా ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే భూతకాలిక అసమాపక క్రియ అయి, చివర ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం క్వార్థక క్రియ అన్నమాట.

కొన్ని ఉదాహరణలు చూడండి. కింది వాక్యాల్లోని క్త్వార్థక క్రియలను గుర్తించండి.

1. రాముడు లంకకు వెళ్ళి, రావణునితో యుద్ధం చేసి, జయించి, సీతను తీసుకొని అయోధ్యకు వచ్చాడు.
2. పుష్ప అన్నం తిని, నిద్రపోయింది.

2. శత్రర్థకం
కింది వాక్యం చదవండి.

“అఖిలేశ్ మధుకరుడితో మాట్లాడుతూ నడుస్తున్నాడు”.
ఈ వాక్యంలో –
‘నడుస్తున్నాడు’ అనే ప్రధాన క్రియకు ‘మాట్లాడుతూ’ అనే ఉపక్రియ వర్తమానకాలంలో ఉండి అసమాపక క్రియను సూచిస్తున్నది.

ఈ విధంగా,
‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘-తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల, వర్తమానకాలిక అసమాపక క్రియగా మారుతున్నది. వర్తమానకాలిక అసమాపక క్రియను శత్రర్థకం’ అంటారు.

కింది వాక్యాలు చదవండి. వీటిలో ‘శత్రర్థకం’ పదాల కింద గీత గీయండి.

అ) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంటున్నది.
ఆ) సౌజన్య పడుతూ లేస్తూ సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నది.
ఇ) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.
ఈ) ఫల్గుణ్ పేపరు చదువుతూ టీ.వి చూస్తున్నాడు.
ఉ) సలీమా పాడుతూ నాట్యం చేస్తున్నది.

పైన తెలిపిన విధంగా మరికొన్ని వాక్యాలు రాయండి.

1. లత అన్నం తింటూ చదువుతున్నది.
2. రవి పాఠం వింటూ రాస్తున్నాడు.
3. అమ్మ వంట చేస్తూ పాటలు వింటున్నది.
4. పరీక్ష రాస్తూ, ఆలోచిస్తున్నాడు.

3. చేదర్థకం
కింది వాక్యం చదవండి.

“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుంది”.
కింది ప్రశ్నకున్న జవాబు గురించి ఆలోచించండి.
ప్ర|| ఫలితం దానంతటదే ఎప్పుడు వస్తుంది?
జవాబు:
కష్టపడి పనిచేస్తే –
కష్టపడడం – కారణం
ఫలితం – కార్యం

కార్యం ఫలించడానికి కారణం అవసరం. కార్యకారణ సంబంధ వాక్యమే చేదర్థక వాక్యం.

అంటే పై వాక్యం కార్యకారణ సంబంధాన్ని సూచిస్తున్నది. ఇలా కార్యకారణ సంబంధాలను సూచించే వాక్యాల్లో తే/ ఇతే| ఐతే/ అనే ప్రత్యయాలు చేరుతాయి. (ప్రాచీన వ్యాకరణం ప్రకారం ఇన / ఇనన్ అనే ప్రత్యయాలు). దీన్ని బట్టి వీటిని ‘చేత్’ అనే అర్థం ఇచ్చే ప్రత్యయాలు అని అంటాం. (ఇదే చేతే అనే ఇచ్చేవి)

సంక్లిష్ట వాక్యాల్లో చేత్ అనే ప్రత్యయం చేరి కార్యకారణ సంబంధం తెలిపే వాక్యాలను చేదర్థక వాక్యాలని అంటాం.

కింది వాక్యాలు పరిశీలించండి. చేదర్థక పదాల కింద గీత గీయండి.

అ) మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.
ఆ) జీవ వైవిధ్యాన్ని కాపాడితే ప్రకృతి సమతులితమవుతుంది.
ఇ) మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది.

1. కింది పదాలు విడదీసి, సంధుల పేర్లను పేర్కొనండి.
అ) బాల్యమంతా – బాల్యము + అంతా – ఉత్వసంధి
ఆ) దేవతలంతా = దేవతలు + అంతా – ఉత్వసంధి
ఇ) దారవుతుంది = దారి + అవుతుంది – ఇత్వసంధి
ఈ) విరిగినప్పుడు = విరిగిన + అప్పుడు – అత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. రూపకాలంకారం :
కింది వాక్యాన్ని చదవండి.
“ఆయన మాట కఠినమైనా మనసు వెన్న”.
పై వాక్యంలో
మనసు – ఉపమేయం (పోల్చబడేది)
వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనసు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది.

అంటే, వెన్నకు, మనసుకు భేదం లేదు. రెండూ ఒకటే (మెత్తనివే) అనే భావాన్ని ఇస్తున్నది.

ఇలా,
ఉపమానానికి ఉపమేయానికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడాన్ని “రూపకాలంకారం” అంటారు.
ఉదా :
(అ) లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లినారు.

సమన్వయం :
ఉపమానమైన లతలను, ఉపమేయమైన లలనలను, అట్లే ఉపమానమైన కుసుమములను, ఉపమేయమైన అక్షతలకు అభేదం తెలుపుతుంది. అందువల్ల ఇది రూపకాలంకారం.

(ఆ) మౌనిక తేనెపలుకులు అందరికీ ఇష్టమే.
సమన్వయం :
ఇక్కడ ఉపమానమైన తేనెకు, ఉపమేయమైన పలుకులకు అభేదం తెల్పబడింది. అందువల్ల ఇది రూపకాలంకారం.

3. కింది వాక్యాలను పరిశీలించండి. అలంకారాన్ని గుర్తించండి.
అ) మా అన్నచేసే వంట నలభీమపాకం.
అన్న చేసే వంట – ఉపమేయం (పోల్చబడేది)
నలభీమపాకం – ఉపమానం (పోల్చినది)

ఇక్కడ ‘అన్న చేసే వంట’ అనే ఉపమేయానికి, ‘నలభీమపాకం’ అనే ఉపమానానికి అభేదం చెప్పినందున రూపకాలంకారము.

ఆ) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం.
తండ్రి – ఉపమేయం (పోల్చబడేది)
హిమగిరి శిఖరం – ఉపమానం (పోల్చినది)

ఇక్కడ ఉపమేయమైన తండ్రికి, ఉపమానమైన హిమగిరి శిఖరానికి అభేదం చెప్పినందున రూపకాలంకారము.

ఇ) నందనందనుడు ఆనందంగా నర్తించెను.
ఈ వాక్యంలో నంద అనే హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగింపబడింది. అందునల్ల ఇది ఛేకానుప్రాసాలంకారం.

ఈ) నల్లపిల్లి మెల్లగా ఇల్లు చొచ్చి చల్లని పాలు తాగింది.
ఈ పై ఉదాహరణలో ‘ల్ల’ కారం పలుమార్లు ఆవృత్తం అయ్యింది. అందువల్ల ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

అడుగు : పాదము, చరణము
మనసు : చిత్తము, ఉల్లము, హృదయము
నేస్తము : మిత్రుడు, స్నేహితుడు
గిరి : పర్వతం, అది
కన్ను : చక్షువు, నయనం, అక్షి
హిమగిరి : హిమాలయం, శీతాద్రి, తుహినాద్రి
మనిషి : మానవుడు, నరుడు
దారి : బాట, మార్గము, పథము

వ్యుత్పత్తరాలు

పక్షి – పక్షములు గలది (పిట్ట)
ధరణి – విశ్వాన్ని ధరించునది (భూమి)
భూజము – భూమి నుండి పుట్టినది (చెట్టు)

నానార్థాలు

ఫలము – పండు, ప్రయోజనం
గుణం – స్వభావం, వింటినారి
కన్ను – నేత్రం, బండిచక్రం

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

సంధులు

అ) సంధి పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.

నీరవుతుంది = నీరు + అవుతుంది – ఉత్వసంధి
కన్నీరవుతుంది = కన్నీరు + అవుతుంది – ఉత్వసంధి
దారవుతుంది = దారి + అవుతుంది – ఉత్వసంధి
ఫలమేమి = ఫలము + ఏమి – ఉత్వసంధి
ఎత్తులకెగిరినా = ఎత్తులకు + ఎగిరినా – ఉత్వసంధి
విలువేమి = విలువ + ఏమి – ఉత్వసంధి

ఆ) సంధికార్యాలు.
అవ్వసంది
సూత్రం : అత్తునకు సంధి బహుళము.
విలువేమి = విలువ + ఏమి – అత్వసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
దారవుతుంది = దారి + అవుతుంది – ఇత్వసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
నీరవుతుంది = నీరు + అవుతుంది – ఉత్వసంధి
ఫలమేమి = ఫలము + ఏమి – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
ఇసుక గుండెలు ఇసుక యొక్క గుండెలు షష్ఠీ తత్పురుష సమాసం
కన్నీరు కంటి యొక్క నీరు షష్ఠీ తత్పురుష సమాసం
హిమగిరి శిరసు హిమగిరి యొక్క శిరసు షష్ఠీ తత్పురుష సమాసం
ఎడారి దిబ్బలు ఎడారి యందలి దిబ్బలు షష్ఠీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

హృదయం – ఎద, ఎడద
త్యాగం – చాగం
మనిషి – మనిసి
సుఖం – సుకం
నీరము – నీరు
మృగము – మెకము

కవి పరిచయం

కవి : ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి

జననం : 1931

స్థలం : కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామం.

నిర్వహించిన పదవులు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా ఉన్నారు.

రచనలు : నాగార్జునసాగరం, కర్పూరవసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంభర, ప్రపంచపదులు మొ॥న నలభైకి పైగా కావ్యాలు, అద్భుతమైన సినిమా పాటలు రాశారు. ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు’ అనే సిద్ధాంత గ్రంథం ! ప్రసిద్ధి పొందింది.

పురస్కారాలు : జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ’ అవార్డు, భారత ప్రభుత్వ ‘పద్మభూషణ్’ అవార్డు.

గజల్ పాదాలు – భావాలు

1, 2 పాదాలు :
మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది

భావం : నీటితో నింపుకున్న మబ్బులు తడితో బరువెక్కిపోతే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది. భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు అడుగులు

3, 4 పాదాలు:
వంకలు దొంకలు కలవని జడిపించకు నేస్తం
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.

భావం :
ఓ నేస్తమా ! మనం ఒక లక్ష్యాన్ని సాధించటానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు వేస్తే నీవు అనుకున్న విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తె నలుగురు అనుసరించే దారిగా మారుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

5, 6 పాదాలు :
ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది

భావం :
నేల అంతా బీటలు పడి, ఎందుకూ పనికి రాకుండా ఉన్నదని, ఏ పంటలూ పండవనీ, ఏ ప్రయత్నం చేయకుండానే నిరాశపడకూడదు. కష్టపడి శ్రమతో ఆ నేలనే దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

7, 8 పాదాలు :
మృగమూ ఒకటనే అనుకుంటే వ్యర్థం
మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది

భావం :
మనం మనిషీ, మృగమూ ఒకటి అని భావించ కూడదు. మృగం ఏ అరణ్య ప్రాంతంలోనైనా ఒంటరిగా నివసించగలదు. కానీ మనిషి అలాకాదు. నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించటమే ఉత్తమ సాంఘిక జీవనం అవుతుంది. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథం ఉండాలి. అప్పుడే అందరూ కలసిమెలసి ఆనందంగా జీవించ గలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

9, 10 పాదాలు :
ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష
హిమగిరి శిరసే మాడితే అది యేరవుతుంది

భావం :
మనం ఎంత సమర్థులం అయినా, అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా. ఇక మనకు ఎలాంటి కష్టాలూ, బాధలూ రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచ వలసిందే. ఉన్నతమైన హిమాలయ శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషికైనా గర్వం నీరు కారిపోవలసిందే.

11,12 పాదాలు :
బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి “సినారే”
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.

భావం :
మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపు లేదు. మానవాళికి మనిషీ పనికి వచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది.