AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

These AP 10th Class Social Studies Important Questions 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II will help students prepare well for the exams.

AP Board 10th Class Social 14th Lesson Important Questions and Answers ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social 14th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. రష్యాను పాలించే రాజులను ఏమంటారు?
జవాబు:
జాలు.

2. రష్యా పార్లమెంట్ ను ఏమంటారు?
జవాబు:
డ్యూమా.

3. జపాన్ పార్లమెంట్ ను ఏమంటారు?
జవాబు:
డైట్.

4. జర్మనీ పార్లమెంట్ ను ఏమంటారు?
జవాబు:
రిచ్ స్టాగ్.

5. రష్యన్ విప్లవంలో మితవాద ధోరణిని అవలంభించిన వారి నేమంటారు?
జవాబు:
మెన్షివికు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

6. రష్యన్ విప్లవంలో అతివాద ధోరణిని అవలంభించిన వారినేమంటారు?
జవాబు:
బోల్షివికు.

7. రష్యన్ మహిళా విప్లవ నాయకురాలు ఎవరు?
జవాబు:
మార్ఫా వాసిలేవా.

8. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ విప్లవాన్ని ప్రోత్సహించటానికి ఏర్పడినది ఏది?
జవాబు:
కొమిటర్న్.

9. 1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవాన్ని ఏ విధంగా పిలుస్తారు?
జవాబు:
మార్చి విప్లవంగా.

10. ఏ సంవత్సరంలో USSR పంచవర్ష ప్రణాళికలతో ప్రణాళికాబద్ధ ఆర్థిక అభివృద్ధిని చేపట్టింది?
జవాబు:
1928.

11. రష్యా రాచరిక వాదుల సైన్యంను ఏమంటారు?
జవాబు:
తెల్ల సైన్యం

12. అంతర్జాతీయ మార్కెట్ తో అనుసంధానమై లేనందున మాంద్యం నుంచి తప్పించుకోగలిగిన దేశం ఏది?
జవాబు:
USSR (రష్యా)

13. ఏ దేశంలోని స్టాక్ మార్కెట్ కుప్పకూలటంతో ఆర్థిక మాంద్య పరిణామాలు మొదలయ్యాయి?
జవాబు:
అమెరికా.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

14. ఆర్థిక విధానం పురోగమించటంలో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉందని, అది ప్రభావ వంతంగా జోక్యం చేసుకోకపోతే మాంద్యానికి దారితీస్తుందని చెప్పిన ఆర్థికవేత్త ఎవరు?
జవాబు:
J.M. కీన్స్.

15. ఆర్థిక మాంద్యం వల్ల అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం అయిన దేశమేది?
జవాబు:
జర్మనీ.

16. జర్మనీ రహస్య పోలీసు బృందంను ఏమని పిలుస్తారు?
జవాబు:
గెస్టాపో.

17. హిట్లర్ జర్మనీ ఆర్ధిక పునఃనిర్మాణ బాధ్యతను ఏ ఆర్థికవేత్తకు అప్పగించాడు?
జవాబు:
హజాల్మర్ షాకిక్ట్.

18. హిట్లర్ ఏ సంవత్సరంలో పోలెండ్ పై దండెత్తాడు?
జవాబు:
1939.

19. రెండవ ప్రపంచ యుద్ధ నీడలో మానవ మారణ హెూమాన్ని చేపట్టిన దేశమేది?
జవాబు:
జర్మనీ.

20. ప్రపంచ జనాభా విస్తరణలో మూడవ పెద్ద దేశమేది?
జవాబు:
రష్యా.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

21. రష్యా తొలి నాళ్ళల్లో భూముల్లో అధిక భాగం ఎవరి ఆధీనంలో ఉండేవి?
జవాబు:
ఫ్యూడల్ ప్రభువుల

22. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో కెల్లా అతి పెద్ద సైన్యం ఏ దేశం కల్గి ఉండేది?
జవాబు:
రష్యా.

23. రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ఎవరు ప్రవేశపెట్టారు?
జవాబు:
స్టాలిన్.

24. ఆర్థిక మాంద్యం కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎంత శాతం దాకా తగ్గి లక్షలాది రైతులు పేదవాళ్లుగా మారారు?
జవాబు:
60% దాకా.

25. అమెరికాలో ఎంతో అవసరమైన సామాజిక భద్రతా విధానాన్ని ఎవరు ప్రవేశ పెట్టారు?
జవాబు:
రూల్ట్.

26. కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం రెండింటిని ఎవరి కుట్రగా హిట్లర్ పేర్కొన్నాడు?
జవాబు:
యూదుల

27. జర్మన్ ప్రజల కారు?
జవాబు:
వోక్స్ వాగెన్.

28. కొమిస్టర్న్ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన భారతీయుడు ఎవరు?
జవాబు:
M.N. రాయ్.

29. ఆర్థిక మాంద్యం యొక్క ముఖ్య పరిణామం ఏమిటి?
జవాబు:
వస్తువుల గిరాకీ పడిపోవడం.

30. USA (అ. సం. రా) ఏ సంవత్సరంలో (ఎప్పుడు) రెండవ ప్రపంచ యుద్ధంలో చేరాయి?
జవాబు:
డిసెంబరు 8, 1941.

31. సోవియట్ రష్యాలో 1920లో కాలుపెట్టిన భారతీయుడు ఎవరు?
జవాబు:
M.N. రాయ్.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

32. పెద్ద ఎత్తున కరెన్సీ నోట్ల ముద్రణ దేనికి దారితీస్తుంది?
జవాబు:
ద్రవ్యోల్బణం.

33. మార్షల్ ప్రణాళిక ప్రకటించిన దేశమేది?
జవాబు:
అమెరికా.

34. జర్మనీ తూర్పు భాగమైన జర్మన్ గణతంత్ర ప్రజాస్వామ్యం (GDR) ఎవరి ప్రభావం క్రిందకు వెళ్ళింది?
జవాబు:
USSR.

35. జర్మనీ పశ్చిమ భాగమైన జర్మన్ గణతంత్ర సమాఖ్య (FRG) ఏ దేశ ప్రభావం క్రిందకు వెళ్ళింది?
జవాబు:
అమెరికా.

36, ఏ సంవత్సరంలో USSR జర్మనీపై దండెత్తింది?
జవాబు:
1941.

37. ‘యానిమల్ ఫాం’ అనే వ్యంగ్య నవలలో ఏ విప్లవం గూర్చి చర్చించారు?
జవాబు:
రష్యా విప్లవం.

38. సమాచారాన్ని పూరించండి.
జర్మనీలో నాజీజం ప్రాబల్యం :
వర్సయిల్స్ సంధి షరతులు → జర్మన్ అవమాన భారం → నాజీ పార్టీ విజృంభణ → హిట్లర్ నియంతృత్వం → ?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధ ఆరంభం / నాంది.

39. సమాచారాన్ని పూరించండి.
ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితులు
నిరుద్యోగం – పెరిగింది.
డిమాండ్ – తగ్గింది.
ధరలు – ?
జవాబు:
పడిపోయాయి.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

మొదటిజతలోని రెండు అంశాల మధ్యగల సంబంధం ఆధారంగా రెండవ జతను పూరించండి.

40. UNESCO : పారిస్ : : UNICEF 😕
జవాబు:
న్యూయార్క్

41. ఫాసిస్ట్ పార్టీ : ఇటలీ : : నాజీ పార్టీ : ?
జవాబు:
జర్మనీ.

42. మెన్షవిక్ : కెరన్స్క : : బోల్షివిక్ : ?
జవాబు:
లెనిన్.

43. జపాన్ : డైట్ : : రష్యా : ?
జవాబు:
డ్యూమా.

44. ఒట్టోమాన్ : టర్కీ : : వైమర్ రిపబ్లిక్ : ?
జవాబు:
జర్మనీ సామ్రాజ్యం

45. స్టాలిన్ : USSR : : రూజ్వెల్ట్ : ?
జవాబు:
USA.

46. రష్యాలో వచ్చిన ఫిబ్రవరి విప్లవం ముఖ్య ఫలితం ఏమిటి?
జవాబు:
జార్ చక్రవర్తి పారిపోవడం (పదవీచ్చుతుడవడం)

47. రష్యాలో పౌర యుద్ధ కాలం …………..?
జవాబు:
1917 – 1920.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

48. మార్చి 8, 1917న రాజధాని సెయింట్ పీటర్బర్గ్ లో ఊరేగింపుగా వెళ్ళిన సుమారు 10,000 మంది మహిళల డిమాండ్ ఏమిటి?
జవాబు:
రొట్టె, శాంతి.

49. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి, రాయండి.
→ బ్రిటన్ – చర్చిల్
→ అమెరికా – రూజ్ వెల్ట్
→ రష్యా – స్టాలిన్
→ ఇటలీ – హిట్లర్
జవాబు:
ఇటలీ – హిట్లర్.

50. USSR లోని సోవియట్లు, రైతాంగం, కార్మికులు, సైనికులు, జమిందారులలో ఎవరికి సంబంధించని కౌన్సిల్లు?
జవాబు:
జమీందారులు.

51. హిట్లర్ ఏ చట్టము ద్వారా జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడు?
జవాబు:
ఎనేబ్లింగ్ చట్టము.

52. హిట్లర్ రచించిన పుస్తకం పేరేమిటి?
జవాబు:
మైన్ కాంఫ్ (నా పోరాటం )

59. యుద్ధాన్ని నివారించ వలసిందిగా హిట్లరుకు విన్నపాన్ని పంపిన భారతీయ నాయకుడెవరు?
జవాబు:
మహాత్మాగాంధీ.

54. న్యూడీల్ పాలసీ ముఖ్య ఉద్దేశ్యమేమిటి?
జవాబు:
ఆర్థికమాంద్యం వలన నష్టపోయిన వారికి సహాయం చేయటం.

55. వేగవంతమైన పారిశ్రామికీకరణ, ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు అనే జోడెద్దుల విధానంను అనుసరించిన దేశమేది?
జవాబు:
USSR.

56. చిట్ట చివరి జార్ చక్రవర్తి ఎవరు?
(or)
రష్యా విప్లవ కాలంనాటి రష్యా చక్రవర్తి ఎవరు?
జవాబు:
జార్ నికోలస్ – II

57. ఎనెల్లింగ్ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది?
జవాబు:
1933.

58. మార్షల్ ప్రణాళికను అమెరికా ఏ దేశాల ఆర్థిక పునరుద్దరణకు ఏర్పాటు చేసింది?
జవాబు:
జర్మనీ మరియు జపాన్.

59. లెనిన్ మరణించిన సంవత్సరం?
జవాబు:
1924.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

60. పుట్టుక, లింగం, భాష వంటి వివక్షతలేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన దేశం?
జవాబు:
రష్యా USSR.

61. ‘రక్తసిక్త ఆదివారం’ విప్లవం (రష్యాలో) ఏ సంవత్సరంలో సంభవించింది?
జవాబు:
1905లో.

62. ఆర్థిక మాంధ్యం కాలంలో అమెరికాలో నిరుద్యోగుల శాతం ఎంత?
జవాబు:
25%

63. యూదులపై సామూహిక హత్యాకాండ ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
1941 లో

64. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నది ఏ సంవత్సరంలో?
జవాబు:
1945 లో

65. 1917లో సంభవించిన మలి రష్యన్ విప్లవాన్ని ఏవిధంగా పిలుస్తారు?
జవాబు:
అక్టోబర్ విప్లవం.

66. గ్రెగోరియన్ క్యాలండర్ తేదీలు జులియన్ క్యాలండర్ తేదీల కంటే ఎన్ని రోజులు ముందుంటాయి?
జవాబు:
13 రోజులు.

67. మన క్యాలండర్ ప్రకారం రష్యాలో ఫిబ్రవరి విప్లవం మార్చి 12న, అక్టోబర్ విప్లవం ఏ తేదీన జరిగాయి?
జవాబు:
నవంబరు – 7.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

68. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర మాంద్యం కొనసాగిన కాలం ఏది?
జవాబు:
1929 – 39.

69. “ఎకోస్ ఆఫ్ నేటివ్ ల్యాండ్ టు సెంచరీస్ ఆఫ్ ఎ రష్యన్ విలేజ్” అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
జవాబు:
సెర్జ్ ష్మెమాన్.

70. “అన్నిటి కంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉంది” అని అన్నది ఎవరు?
జవాబు:
హిట్లర్.

71. “ఈ లోకంలోకి మహిళ ఇచ్చే ప్రతి సంతానము ఒక యుద్దమే” అని అన్నది ఎవరు?
జవాబు:
హిట్లర్.

72. “ఏ పని చెయ్యటానికైనా సిద్ధమే” అని రాసిన కార్డులు మెడలో వేసుకుని ఏదేశంలోని నిరుద్యోగులు తిరిగారు?
జవాబు:
జర్మనీ.

73. మాంద్యం వల్ల అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం అయిన దేశమేది?
జవాబు:
జర్మనీ.

74. ఏ సంవత్సరంలో నాజీ పార్టీ జర్మనీలో 37% ఓట్లతో అతి పెద్ద పార్టీగా పరిణమించింది?
జవాబు:
1937.

75. నాజీ పార్టీ చిహ్నం ఏది?
జవాబు:
స్వస్తిక్

76. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు తొలుత విజయాలు సాధించినా, 1943 ఆరంభంలో ప్రఖ్యాతమైన ఏ యుద్ధంలో ఓటమితో అపజయాలుగా మారసాగాయి?
జవాబు:
లెనిన్ గ్రాడ్.

77. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న క్యాలండర్ ఏది?
జవాబు:
గ్రెగోరియన్ క్యాలండర్.

78. రష్యాలో భూముల ఏకీకరణ ప్రారంభమైన సంవత్సరం?
జవాబు:
1929.

79. 1920లో సోవియట్ రష్యాలో కాలుపెట్టిన భారతీయుడు ఎవరు?
జవాబు:
M.N. రాయ్

80. ఓష్ విడ్జ్ అనునది ఏమిటి?
జవాబు:
హిట్లర్ పాలనలోని శిక్షా శిబిరం.

81. జర్మనీ రాజధాని నగరం ఏది?
జవాబు:
బెర్లిన్.

82. ‘హోలో కాస్ట్’ అంటే?
జవాబు:
యూదుల సామూహిక విచారణ.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

83. క్రింది వానిని సరిగా జతపరచండి.
1) రక్తసిక్త ఆదివారం ( ) a) 1905
ii) కొమిన్ టర్న్ ఏర్పాటు ( ) b) 1919
iii)రష్యాలో మొదటి పంచవర్ష ప్రణాళికలు ( ) c) 1928
iv) వైమర్ గణతంత్ర ప్రకటన ( ) d) 1918
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

10th Class Social 14th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“తీవ్ర ఆర్థికమాంద్యం” అనగానేమి?
జవాబు:

  1. ప్రపంచ వ్యాప్తంగా వస్తువులు గిరాకీ పడిపోవడం కలగ ధరలు క్షీణించడాన్ని తీవ్ర ఆర్థిక మాంద్యం అంటారు.
  2. ఇది ప్రపంచ వారంగా 1999 నుండి 1939 వరకు కొనసాగింది.

ప్రశ్న 2.
USSR తీవ్ర ఆర్థిక మాంద్యం నుండి ఎలా తప్పించుకోగలిగింది?
జవాబు:
అంతర్జాతీయ మార్కెట్ తో USSR అనుసంధానమై లేనందున ఈ మాంద్యం నుంచి తప్పించుకోగలిగింది.

ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం, ఏమి ఉత్పత్తి చెయ్యాలో, ఎంత ఉత్పత్తి చెయ్యాలో అన్న అంశాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం మొ||నవి.

ప్రశ్న 3.
హిట్లర్ ప్రవేశపెట్టిన ఏవేని రెండు ఆర్థిక సంస్కరణ అను రాయండి.
జవాబు:

  1. సమ్మెల నిషేధం
  2. పన్నుల భారం తగ్గించడం
  3. యుద్ధ సామగ్రి ఉత్పత్తి చేసే పరిశ్రమల స్థాపన
  4. ఉపాధి కల్పన

ప్రశ్న 4.
1917 రష్యా విప్లవానికి, భారత స్వాతంత్రోద్యమానికి గల రెండు భేదాలను రాయండి.
జవాబు:

రష్యా విప్లవం భారత స్వాతంత్ర్యోద్యమం
1) జార్ నికోలస్ కు వ్యతిరేకంగా జరిగింది. 1) బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగింది.
2) ‘రొట్టె, శాంతి’ కోసం డిమాండు జేయటం. 2) స్వాతంత్ర్యం కోసం పోరాటం.
3) రెండు దశలు 3) మూడు దశలు
4) ఉదారవాదులు, రాచరిక కుటుంబాలకు వ్యతిరేకంగా. 4) విదేశీయులకు వ్యతిరేకంగా.

ప్రశ్న 5.
జర్మనీలో యూదుల పట్ల హిట్లర్ ప్రవర్తనకు సంబంధించి మీ అభిప్రాయాన్ని తెల్పండి.
జవాబు:
యూదుల పట్ల హిట్లర్ యొక్క ప్రవర్తన చాలా క్రూరమైనది మరియు అన్యాయమైనది.

ప్రశ్న 6.
ప్రసుత భారతదేశ ప్రభుత్వము అమలుచేస్తున్న ఏవైనా రెండు సంక్షేమ పథకాలు వ్రాయుము.
జవాబు:
ప్రస్తుత భారతదేశ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు:

  1. సుకన్య సంవృద్ధి యోజన.
  2. ప్రధానమంత్రి జీవ జ్యోతి బీమా యోజన
  3. MNREGA
  4. అటల్ పెన్షన్ యోజన

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 7.
‘ఉమ్మడి క్షేత్రాల’ వ్యవసాయం గురించి వ్రాయండి.
జవాబు:
ఉమ్మడి క్షేత్రాల వ్యవసాయం :

  • యు.ఎస్.ఎస్.ఆర్ లో చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలేసి ఉమ్మడి క్షేత్రాలలో చేరేలా బలవంతం చేయడం.
  • ఈ క్షేత్రాలలో ఉమ్మడిగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించి, ఉత్పత్తిని అందరూ పంచుకోవటం.

ప్రశ్న 8.
పార్లమెంటును పట్టించుకోకుండా ఉండే అధికారాన్ని హిట్లర్ ఎలా పొందాడు?
జవాబు:
హిట్లర్ పార్లమెంటును పట్టించుకోకుండా ఉండే అధికారాన్ని ఎనేబ్లింగ్ యాక్ట్ ఆమోదించడం ద్వారా పొందారు.

ప్రశ్న 9.
‘కొత్త ఒప్పందము’ (న్యూడీల్) నందలి ముఖ్యాంశములను పేర్కొనండి.
జవాబు:
‘కొత్త ఒప్పందము’ (న్యూడీల్) నందలి ముఖ్యాంశాలు :

  1. మాంద్యానికి గురైన వారికి పునరావాసం
  2. ఆర్థిక సంస్థల సంస్కరణ
  3. ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకోవడానికి చర్యలు

ప్రశ్న 10.
‘తీవ్ర ఆర్థిక మాంద్యము’ అనగా నేమి?
జవాబు:
తీవ్ర ఆర్థిక మాంద్యము : 1929 సం||ములో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఆర్ధిక క్షీణతనే తీవ్ర ఆర్థిక మాంద్యము అంటారు.

ప్రశ్న 11.
సమాచారాన్ని పూరించండి.
ఆర్థికమాంద్యం నాటి పరిస్థితులు.
నిరుద్యోగం – పెరిగింది.
డిమాండ్ – తగ్గింది.
ధరలు -?
జవాబు:
ధరలు – పడిపోయాయి.

ప్రశ్న 12.
జార్ పాలనలో చైనా, భారతదేశం తరువాత అతిపెద్ద జనాభాగల దేశం ఏది?
జవాబు:
జార్ పాలనలో చైనా, భారతదేశం తరువాత 15.6 కోట్ల జనాభాతో మూడవ అతి పెద్ద దేశంగా రష్యా అవతరించింది.

ప్రశ్న 13.
రష్యాలో కలిసున్న కొన్ని దేశాలేవి?
జవాబు:
ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కోమానియా వంటి పలు దేశాలు రష్యాలో కలిసి ఉండేవి.

ప్రశ్న 14.
రొట్టె, శాంతి కావాలని ఏ నగరంలో మహిళలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు?
జవాబు:
రొట్టె, శాంతి కావాలని 10,000 మంది మహిళలు “సెంట్ పీటర్స్ బర్గ్” నగరంలో ప్రదర్శనలు చేశారు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 15.
మార్చి విప్లవం అని దేనినంటారు?
జవాబు:
1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవాన్ని రష్యన్ విప్లవమని లేదా మార్చి విప్లవం అని అంటారు.

ప్రశ్న 16.
రష్యా జులియన్ క్యాలెండర్‌ను ఎంతవరకు అనుసరించింది?
జవాబు:
రష్యా జులియన్ క్యాలెండర్‌ను 1918 ఫిబ్రవరి 1 వరకు అనుసరించింది.

ప్రశ్న 17.
బోల్షివిక్కుల నాయకుడెవరు?
జవాబు:
బోల్షివిక్కుల నాయకుడు బ్లడిమిర్ లెనిన్.

ప్రశ్న 19.
పౌరయుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది?
జవాబు:
పౌరయుద్ధం రష్యా రాచరికవాదుల తెల్ల సైన్యం, కమ్యూనిస్టు వ్యతిరేక సైనికుల మధ్య జరిగింది. ఇది 1918 – 20 సం||ల మధ్య జరిగింది.

ప్రశ్న 20.
రష్యా USSR గా ఎప్పుడు అవతరించింది?
జవాబు:
రష్యా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ గా 1924లో అవతరించింది.

ప్రశ్న 21.
రష్యాలో తీవ్ర కరవు ఎప్పుడు సంభవించింది?
జవాబు:
రష్యాలో తీవ్ర కరవు 1929-30లో సంభవించింది. ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు.

ప్రశ్న 22.
ఏ నగరంలో 3 సం||ల కాలంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు?
జవాబు:
“మాగ్నిటాగోర్క్స్” అన్న పట్టణంలో 3 సం||ల కాలంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు.

ప్రశ్న 23.
“ది హిస్టరీ ఆఫ్ ఎ సోవియట్ కలెక్టిల్ ఫాం” అన్న గ్రంథాన్ని రాసినదెవరు?
జవాబు:
“ది హిస్టరీ ఆఫ్ ఎ సోవియట్ కలెక్టల్ ఫాం” అన్న గ్రంథాన్ని రాసింది “ఫెడార్ బెలోవ్”.

ప్రశ్న 24.
బోల్సివిక్లు రూపొందించిన విద్యావిధానం పేరేమి?
జవాబు:
బోల్షివికు రష్యాలో విస్తరించిన విద్యావిధానాన్ని రూపొందించారు.

ప్రశ్న 25.
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవాన్ని ప్రోత్సహించటానికి ఏర్పడిన సంస్థ పేరేమి?
జవాబు:
కమ్యూనిస్టు విప్లవాన్ని ప్రోత్సహించటానికి ఏర్పడిన సంస్థ “కొమ్మి ర్న్”.

ప్రశ్న 26.
“ఐరోపాలోని ఇతర రాజధానులతో పోలిస్తే మాస్కో అంత శుభ్రంగా అనిపించదు” అన్నదెవరు?
జవాబు:
రవీంద్రనాథ్ ఠాగూర్.

ప్రశ్న 27.
అరికమాంద్యం ఎప్పుడు ప్రారంభమై, ఎంతవరకు కొనసాగింది?
జవాబు:
ఆర్థికమాంద్యం 1929 చివరలో ప్రారంభమై, 1939 వరకు కొనసాగింది.

ప్రశ్న 28.
“పిల్లవాడికి మూడేళ్ళ వయస్సు నుంచే ఊపటానికి అతడికి ఒక చిన్న జెండా ఇస్తాం” అన్నదెవరు?
జవాబు:
జర్మను కార్మిక నాయకుడు రాబర్ట్ లే.

ప్రశ్న 29.
నాజీ సిద్ధాంతంలో ప్రాథమిక శిక్షణ ఏ వయసు పిల్లలకు ఇచ్చేవారు?
జవాబు:
ఆరు నుంచి పది (6-10) సంవత్సరాల మగపిల్లలందరూ నాజీ సిద్ధాంతంలో ప్రాథమిక శిక్షణ పొందేవాళ్ళు.

ప్రశ్న 30.
కమ్యూనిస్టులు, సోషలిస్టుల నాయకత్వంలోని శ్రామికవర్గ ఉద్యమాలను వ్యతిరేకించింది ఎవరు?
జవాబు:
కమ్యూనిస్టులు, సోషలిస్టుల నాయకత్వంలోని శ్రామికవర్గ ఉద్యమాలను వ్యతిరేకించింది హిట్లర్.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 31.
“గెస్టాపో” అంటే ఏమిటి?
జవాబు:
జర్మనీ సమాజాన్ని నియంత్రించడానికి, భద్రతా పరిరక్షణకు ఏర్పాటు కాబడిన “రహస్య పోలీసు బృందం”.

ప్రశ్న 32.
జర్మన్ ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను హిట్లర్ ఎవరికి అప్పగించాడు?
జవాబు:
జర్మన్ ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను హిట్లర్ “ఆర్థికవేత్త హజాల్మర్ షాకిక్ట్”కి అప్పగించాడు.

ప్రశ్న 33.
తీవ్ర ఆర్థికమాంద్యం ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
1929-30లో సంభవించిన తీవ్ర ఆర్థికమాంద్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. నిరుద్యోగం పెరిగిపోయింది.

ప్రశ్న 34.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబు దాడికి గురి అయిన జపానులోని నగరాలేవి?
జవాబు:
హిరోషిమా, నాగసాకి.

ప్రశ్న 35.
‘న్యూ డీల్’ కు సంబంధించిన మూడు విధానాలు (3R’s) ఏమిటి?
జవాబు:
పునరావాసం (ఆర్థికమాంద్యానికి గురైన వారికి), ఆర్థిక సంస్థల సంస్కరణ, ఆర్థిక పరిస్థితి కోలుకోడానికి చర్యలు.

ప్రశ్న 36.
బోల్షివిక్ విప్లవం అనగానేమి?
జవాబు:
1917 నవంబరులో లెనిన్ నాయకత్వాన షరతులు లేని శాంతి, భూ పంపిణీ తదితర డిమాండులతో వచ్చిన విప్లవాన్ని ‘బోల్షివిక్ విప్లవం’ అంటాం.

10th Class Social 14th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది కాలపట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులివ్వండి.

కాలపట్టిక
వైమర్ గణతంత్ర రాజ్యాంగ ప్రకటన నవంబర్ 9, 1918
హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్‌గా కావడం జనవరి 30, 1933
జర్మనీ పోలెండ్ పై దండెత్తడం; రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం సెప్టెంబర్ 1, 1939
USSR పై జర్మనీ దండెత్తడం జూన్ 22, 1941
యూదులపై సామూహిక హత్యాకాండ జూన్ 23, 1941
అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో చేరడం డిసెంబర్ 8, 1941
సోవియట్ సేనలు ఆష్విల్డ్ కు విముక్తి కల్పించడం జనవరి 27, 1945
యూరప్లో కూటమిగా సాధించిన విజయం మే 8, 1945

A) రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఆష్వి కు విముక్తి కల్పించడం ద్వారా మిత్రదేశాలకు విజయానికి మార్గం సుగమం అయినది అని ఎలా చెప్పవచ్చు?
B) ప్రపంచ చరిత్రలో 1941 నాటి కీలక అంశాలు ఏవి?
జవాబు:
A) జర్మనీలో ఆష్విజ్ ప్రాంతాన్ని 1945లో రష్యా ఆక్రమించుకోవడంతో జర్మనీ బలహీన పడింది. దీంతో మిత్ర రాజ్య సైన్యాలు బెర్లిన్ ను ఆక్రమించుకున్నాయి. గత్యంతరం లేని పరిస్థితులలో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

B) 1) యు.ఎస్.ఎస్.ఆర్. పై జర్మనీ దండెత్తడం
2) యూదులపై సామూహిక హత్యాకాండ
3) అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో చేరడం.

ప్రశ్న 2.
ఈ క్రింది పటాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 1
1) డచ్ ఈస్ట్ ఇండియాను ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు?
జవాబు:
డచ్ ఈస్ట్ ఇండియాను ఇప్పుడు ఇండోనేషియా అని పిలుస్తున్నారు.

2) ఏ చైనా ప్రాంతం జపాన్ అధీనంలో ఉంది?
జవాబు:
చైనాలోని మంచూరియా ప్రాంతం జపాన్ అధీనంలో ఉంది.

3) భారతదేశంతో భూభాగ సరిహద్దును కలిగి యుండి జపాన్ నియంత్రణలో లేని దేశం ఒకదాని పేరు వ్రాయండి.
జవాబు:
నేపాల్, టిబెట్, భూటాన్

ప్రశ్న 3.
ఏవేని రెండు ఆర్థిక మాంద్య ప్రభావాలను వ్రాయండి.
జవాబు:
ఆర్థిక మాంద్య ప్రభావాలు :

  1. నిరుద్యోగిత పెరగడం
  2. ధరల పతనం
  3. కర్మాగారాల మూసివేత
  4. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం

ప్రశ్న 4.
క్రింది పేరాను చదవండి.
భూమి ఎవరికి కేటాయించబడి లేదు. ఎవరికీ బహుమతిగా కట్టబెట్టలేదు. తమ హృదయాలలో దాన్ని జయించగల సాహసం, దాన్ని కాపాడులోగల బలం, దాన్ని దున్నగల శ్రమ, చేయగల ప్రజలకు దేవుడు దానిని ఉద్దేశించాడు. బలమైన, జాతి తన జనాభాకి తగినట్టు సరిహద్దులను విస్తరించుకుంటుంది.
ప్రశ్న : బలం, శక్తి ఉన్నవాళ్ళకే ఈ ప్రపంచం చెందాలనే అభిప్రాయంపై వ్యాఖ్య రాయండి.
జవాబు:
నేను ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. “ఎందుకనగా ఈ ప్రపంచం అందరిదీ పుట్టుకతో మానవులందరూ సమానులే.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 5.
భారతదేశంలో ఈనాడు సంక్షేమ రాజ్యమునకు సంబంధించిన ఏయే అంశాలు అమలులో ఉన్నాయి?
జవాబు:
భారతదేశంలో అమలులో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు :

  1. ప్రజా పంపిణీ వ్యవస్థ.
  2. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకము.
  3. గృహనిర్మాణ పథకాలు.
    ఉదా : PAY మొ||
  4. MNREGA
  5. వృద్ధాప్య పింఛన్లు.
  6. ఆరోగ్య పథకాలు.
    ఉదా : ఆయుష్మాన్ భారత్, యన్.టి.ఆర్. వైద్యసేవ మొ||వి.

ప్రశ్న 6.
యుద్ధాలను నివారించడం గురించి రెండు నినాదాలు రూపొందించండి.
జవాబు:
యుద్ధాలను నివారించడం గురించి రెండు నినాధాలు :

  1. యుద్ధం వద్దు – శాంతి ముద్దు.
  2. పొరుగు దేశాల వారిని ప్రేమించండి – వారూ మన వంటివారే.
  3. ఆయుధాలు వద్దు – అభివృద్ధి ముద్దు.
  4. విశ్వ మానవ సౌభ్రాతృత్వం – భగవంతునికి ప్రీతి.
  5. యుద్దాలను వీటో చేద్దాం – ప్రపంచ శాంతికి పట్టం కడదాం.

ప్రశ్న 7.
జార్ నికొలాస్ II కాలంలో రష్యాలో జరిగిన పరిణామాలు వివరించుము.
జవాబు:
నికొలాస్ II రష్యా విశాల సామ్రాజ్యాన్ని, సైన్యం, సమర్థులైన పాలనాధికారుల సహాయంతో పాలించాడు. అయితే ప్రపంచయుద్ధం వల్ల రష్యా ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. మొదటి ప్రపంచయుద్ధానికి ముందు ప్రపంచంలో కెల్లా అతి పెద్ద సైన్యం రష్యాకు ఉండేది. 1917 నాటికి 20 లక్షల సైనికులు, పౌరులు చనిపోయి, మొదటి ప్రపంచయుద్ధంలో అత్యధిక ప్రాణనష్టం చవిచూసింది. యుద్ధ రంగానికి ఆహారాన్ని మళ్ళించడం వల్ల పట్టణాల్లో ఆహార కొరత ఏర్పడింది. రొట్టె, శాంతి కావాలని మహిళలు, కార్మికులు నిరసన ర్యాలీలతో పాటు ఉద్యమాలు చేపట్టారు. జార్ నికొలాస్ పరారు కావటంతో రాచరికానికి చెందని రష్యన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.

ప్రశ్న 8.
లెనిన్ నాయకత్వంలో రష్యాలో విప్లవం తరువాత బోల్షివిక సంస్కరణలు ఏమిటి?
జవాబు:
బోల్షివి లకు వ్లాడిమిర్ లెనిన్ (1870 – 1924) నాయకత్వం వహించాడు. రష్యాను అగ్రగామిగా చేయడానికి, ప్రజలలో ఆత్మసైర్యం పెంచడానికి అనేక సంస్కరణలు అమలు చేశారు.

  1. షరతులు లేని శాంతిని నెలకొల్పుట.
  2. భూమినంతటిని జాతీయం చేసి దానిని రైతులందరికీ పంచిపెట్టడం.
  3. ధరలను నియంత్రించి, మార్కెట్ ధర కల్పించడం.
  4. బ్యాంకులను, కర్మాగారాలను జాతీయం చేసి రైతాంగ, కార్మిక, సైనికుల విశ్వాసం చూరగొనడం.
  5. రష్యన్ అధీనంలో ఉన్న దేశాలన్నీ స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం కల్పించడం వంటి సంస్కరణలు చేపట్టారు.

ప్రశ్న 9.
స్టాలిన్ నాయకత్వంలో రష్యా పురోభివృద్ధిని వివరించండి.
జవాబు:
1924లో లెనిన్ చనిపోయిన తరువాత స్టాలిన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అయ్యాడు.

  1. తర్వాత దశాబ్దంలో అతడు తన పూర్తి నియంత్రణను సాధించుకొని, వ్యతిరేకత అన్నది లేకుండా చేశాడు.
  2. వివరణ, శాసించటానికి లేని అధికారంతో సోవియట్ రష్యాని బలమైన ఆర్ధిక శక్తిగా మలిచాడు.
  3. 1928లో పంచవర్ష ప్రణాళికలతో USSR ప్రణాళికాబద్ద ఆర్థిక అభివృద్ధిని చేపట్టాడు.
  4. వేగవంతమైన పారిశ్రామికీకరణతో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందించాడు.
  5. “భూముల ఏకీకరణ” పేరుతో చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలేసి ఉమ్మడి క్షేత్రాలలో వ్యవసాయం చేసే విధంగా రైతులను ప్రోత్సహించాడు.

ప్రశ్న 10.
రష్యా (USSR)కి సంబంధించిన హింసాత్మక ధోరణులు తెలుపుము.
జవాబు:
ఆర్థికమాంద్యం సమయంలో కూడా సమర్ధవంతంగా పనిచేసి అద్వితీయ ప్రగతి మార్గాలలో రష్యాను నడిపించిన నాయకులు, బోల్షివికు, కమ్యూనిస్టులు తరువాత కాలంలో అనేక హింసాత్మక చర్యలకు ఒడిగట్టారు.

  1. పౌరులకు సాధారణ ప్రజాస్వామిక స్వేచ్ఛ ఇవ్వలేదు.
  2. ప్రజలలో పెల్లుబికిన వ్యతిరేకతను బలంతో అణచివేసారు.
  3. ప్రతిపక్ష నాయకులను నిర్దాక్షిణ్యంగా అధిక సంఖ్యలో చంపేశారు.
  4. సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కొరకు అడ్డంగా ఉన్నారనే సాకుతో పెట్టుబడిదారులను తొలగించుకున్నారు.
  5. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను నిషేధించారు.
  6. జార్జ్ ఆర్వెల్ అనే రచయిత “యానిమల్ ఫాం” అనే తన నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను USSR లో ఎలా నీరుకార్చారో వివరించాడు.

ప్రశ్న 11.
హిట్లర్ కొత్త శైలిని, రాజకీయంగా జర్మనీలో తీసుకొచ్చిన సంస్కరణలను వివరించుము.
జవాబు:
ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని, ప్రపంచం ఆకర్షించే విధానాలతో, ఆలోచనలతో ముందుకు నడిచి, జర్మనీని సరికొత్త మార్గంలో నడిపించిన గొప్పవ్యక్తి హిట్లర్. ఒక అద్భుతమైన వక్త. యువతను ఆకర్షించే క్రమంలో పని, ఉద్యోగ భద్రత కల్పిస్తానంటూ యువతను ఆకర్షించాడు. జర్మనీ ప్రజల గౌరవాన్ని నిలబెడతానంటూ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పాడు. తీవ్ర మాంద్యం, పెట్టుబడిదారీ విధానాన్ని రూపుమాపడానికి ప్రయత్నించి సఫలీకృతుడయ్యాడు. రాజకీయ ప్రత్యర్థులను, కమ్యూనిస్టులను అరెస్టు చేసి శిక్షణ శిబిరాలకు పంపించాడు. ప్రత్యేక నిఘా, రక్షణ దళాలను ఏర్పరిచాడు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 12.
“బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉందంటూ” హిట్లర్ ఉపన్యాసాన్ని క్లుప్తంగా వివరించండి.
జవాబు:
అన్నింటికంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉంటుందని హిట్లర్ చెబుతూ, తన ప్రసంగ, బహిరంగ సమావేశాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ప్రజలను జాగృతం చేశాడు.

భూమి ఎవరికీ కేటాయించబడి లేదు. ఎవరికీ బహుమతిగా కట్టబెట్టలేదు. తమ హృదయాలలో దానిని జయించగల సాహసం, దానిని కాపాడుకోగల బలం, దానిని దున్నగల, శ్రమ చెయ్యగల ప్రజలకు దేవుడు దానిని ఉద్దేశించాడు. ఇది “ప్రపంచం ప్రాథమిక హక్కు శక్తి ఉన్నంతవరకు జీవించటానికి ఉన్న హక్కు. ఈ హక్కు ఆధారంగా బలమైన జాతి తన జనాభాకి తగినట్టు సరిహద్దులను విస్తరించుకుంటుంది. ఈ విధంగా తన వాగ్దాటితో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసాడు.

ప్రశ్న 13.
జార్ పాలనలో రష్యా ప్రగతిని 4 వాక్యాల్లో రాయుము.
జవాబు:
జార్ పాలనలో రష్యా రెండు ఖండాలలో విస్తరించి యూరో ఆసియా శక్తిగా విశాల సామ్రాజ్యంగా ఉండేది. చైనా, భారతదేశం తరువాత 15.6 కోట్ల జనాభాతో మూడవ అతి పెద్ద దేశంగా ఉండేది. రష్యన్లలో అధికశాతం వ్యవసాయంతో జీవనోపాధి పొందేవారు. ప్రపంచంలో అతి పెద్ద సైన్యం రష్యాకు ఉండేది. పెద సెన్యం రష్యాకు ఉండేది.

ప్రశ్న 14.
రష్యాలో సోవియట్లు ఎవరు?
జవాబు:
రెండో నికొలాస్ పదవీచ్యుతుడైన తరువాత రష్యాను పాలిస్తున్న ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వాళ్ళు పితృభూమి గౌరవాన్ని కాపాడటానికి యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఆర్థిక కొరతను తీర్చి యుద్ధాన్ని వ్యతిరేకించిన వాళ్ళను సోవియట్లుగా పిలిచారు.

ప్రశ్న 15.
బోల్షివిక్కుల లక్ష్యాలేమిటి?
జవాబు:

  1. రష్యాలో శాంతిని నెలకొల్పడం.
  2. రైతులందరికీ అండగా నిలిచి మిగులు భూమిని పంచిపెట్టడం.
  3. కర్మాగారాలను, బ్యాంకులను జాతీయం చేయడం.
  4. రష్యా కింద ఉన్న దేశాలకు స్వేచ్ఛను ప్రసాదించడం.

ప్రశ్న 16.
“భూముల ఏకీకరణ” ను క్లుప్తంగా వివరించుము.
జవాబు:
పారిశ్రామికీకరణ, వ్యవసాయంలో భూముల ఏకీకరణ అన్న రెండు విధానాలను స్టాలిన్ ఆధ్వర్యంలో USSR లో అమలు చేశారు. ఈ విధానంలో ….. చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలేసి “ఉమ్మడి క్షేత్రాలతో” చేరేలా బలవంతం చేసి చిన్న కమతాల ఉత్పత్తికి స్వస్తి పలకాలని ప్రయత్నించింది. గ్రామంలోని భూములు, పరికరాలు, యంత్రాలు, పశువులను ఉమ్మడి ఆస్తిగా భావించారు.

ప్రశ్న 17.
ప్రపంచ శాంతి పరిరక్షణ కొరకు యుద్దాలను నివారించడానికి కొన్ని పరిష్కారాలు సూచించండి.
జవాబు:

  1. ప్రపంచ శాంతి పరిరక్షణలో యుద్ధాలు జరగకుండా అనేక చర్యలు తీసుకోవచ్చు.
  2. సమస్యల సాధన కోసం ప్రపంచ దేశాలు వీలైనంతవరకు సామరస్యమైన చర్చలకు, అంతర్జాతీయ సమాజ సూచనలపై – ఆధారపడవచ్చు.
  3. ఎక్కువ యుద్ధాలు అగ్రరాజ్యాల స్వార్థాల కోసం, అవి అపార సహజవనరులపై ఆధిపత్యం కోసం, ప్రభావ ప్రాంతాల కోసం చేసిన ఏర్పాట్లవల్లే జరిగాయి. కావున అవి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
  4. శాంతియుత సహజీవనం కోసం ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా సంయమనం పాటించాలి.

ప్రశ్న 18.
ఇచ్చిన కాలపట్టిక చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 2
1) రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రారంభం ఏది?
2) హిట్లర్ ఏ దేశానికి చెందినవాడు?
3) USA రెండవ ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరింది?
జవాబు:

  1. పోలెండ్ పై జర్మనీ దండెత్తడం రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభాన్ని సూచిస్తోంది.
  2. హిట్లర్ జర్మనీ దేశానికి చెందినవాడు.
  3. USA రెండవ ప్రపంచ యుద్ధంలో డిసెంబర్ 8, 1941లో చేరింది.

ప్రశ్న 19.
ఈ క్రింది పటాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 1
1) భారతదేశానికి పొరుగున ఉన్న ఏ దేశం జపాన్‌చే ఆక్రమించబడింది?
జవాబు:
భారతదేశానికి పొరుగున ఉన్న బర్మా జపాన్‌చే ఆక్రమించబడింది.

2) జపాన్ అధీనంలో ఉన్న అధిక ప్రాంతం ఏ మహాసముద్రంలో భాగం?
జవాబు:
జపాన్ అధీనంలో ఉన్న అధిక ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలో భాగం.

3) 1942లో మంగోలియా జపాన్ అధీనంలో ఉందా?
జవాబు:
1942లో మంగోలియా జపాన్ అధీనంలో లేదు.

ప్రశ్న 20.
ఆర్థికమాంద్యంలో జరిగిన పరిణామాలు వివరించండి.
జవాబు:

  1. ఉపాధి అవకాశాలు కోల్పోయి, యువత వీధిన పడింది.
  2. కరెన్సీ విలువ పడిపోయి ఉద్యోగస్తుల, పింఛనుదారుల పొదుపులు కరిగిపోయాయి.
  3. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి, రైతులు కుప్పకూలిపోయారు.
  4. తమ పిల్లల కడుపులు నింపలేని మహిళలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 21.
జర్మనీ ప్రజలకు హిట్లర్ వాగ్దానాలేవి?
జవాబు:

  1. బలమైన దేశాన్ని నిర్మిస్తానన్నాడు.
  2. వర్సయిల్స్ ఒప్పందపు అన్యాయాన్ని రద్దు చేస్తానన్నాడు.
  3. జర్మనీ ప్రజల గౌరవాన్ని తిరిగి నిలబెడతానన్నాడు.
  4. పని కావాలనుకునే వారికి పని, యువతకు బంగారు భవిష్యత్తు అందిస్తానన్నాడు.
  5. విదేశీ కుట్రలను తిప్పికొడతానని వాగ్దానం చేశాడు.

10th Class Social 14th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సోవియట్ రష్యా (USSR) లో జోసెఫ్ స్టాలిన్ వేడట్టిన వ్యవసాయ రంగ సంస్కరణలు ఏవి?
జవాబు:
స్టాలిన్ చేపట్టిన సంస్కరణలు :
1924లో లెనిన్ చనిపోయిన తర్వాత స్టాలిన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడయ్యాడు, రష్యాని బలమైన ఆర్థిక శక్తిగా మలిచాడు.

  • 1928లో పంచవర్ష ప్రణాళికలతో USSR ప్రణాళికాబద్ద ఆర్థిక అభివృద్ధిని చేపట్టాడు.
  • వేగవంతమైన పారిశ్రామికీకరణ, వ్యవసాయంతో భూముల ఏకీకరణ అన్న జోడు విధానాలను అవలంబించాడు.
  • స్టాలిన్ నాయకత్వంలో USSR చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలేసి ‘ఉమ్మడి క్షేత్రాల’లో వేరేలా బలవంతం చేసి చిన్న రైతాంగ ఉత్పత్తికి స్వస్తి పలితాలని ప్రయత్నించింది.
  • ఈ క్షేత్రాలు గ్రామంలోని భూములు, పరికరాలు, యంత్రాలు, పశువులన్నింటిని ఉమ్మడి సొత్తుగా చేశాయి. అందరూ కలిసి వ్యవసాయం చేసి ఉత్పత్తిని పంచుకునేవారు.
  • పరిశ్రమలన్నీ ప్రభుత్వ అధీనంలో ఉండేవి, స్వేచ్ఛ కూర్కెట్ కి అనుమతినివ్వలేడు.
  • మొదట్లో వ్యవసాయ ఉత్పత్తి తగ్గినా, తరువాత అది పెరిగి అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో పారిశ్రామికీకరణను USSR సాధించింది.
  • విస్తరించిన విద్యా విధానాన్ని రూపొందించి, కార్మికులు, రైతాంగం విశ్వవిద్యాలయాలలోకి ప్రవేశించే ఏర్పాట్లు చేశారు.
  • మహిళా కార్మికుల కోసం ప్యాక్టరీలలో శిశు సంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • తక్కువ ఖర్చుతో ప్రజారోగ్యం సంరక్షణ కల్పించి కార్మికులకు ఆదర్శ గృహ వసతిని ఏర్పాటు చేశారు.
  • USSR పౌరులందరికీ పూర్తి ఉపాధి కల్పించగలిగింది, వాళ్ళ జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి.
  • ఇదే కాలంలో పాశ్చాత్య ప్రపంచం తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కొంటుంది. కాని USSR ఈ మాంద్య ప్రభావానికి గురి కాకుండా ఉండటం గొప్ప విషయం.

ప్రశ్న 2.
అమెరికాలో తీవ్ర ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం ఏమిటి?
జవాబు:
(అమెరికాలో) 1929 తీవ్ర ఆర్థిక మాంద్యం యెక్క ప్రభావాలు :

  • అమెరికాలో స్టాక్ మార్కెట్ కుప్పకూలటంతో ఈ పరిణామాలు ప్రారంభమైనాయి.
  • నిరుద్యోగం పెరిగిపోయింది, దాదాపు 25% నిరుద్యోగులు పెరిగారు.
  • అనేక వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు 60% దాకా తగ్గిపోయాయి.
  • పేదరికం పెరిగిపోయింది, పెద్ద సంఖ్యలో ఇళ్ళు లేనివాళ్ళతో నిర్జన ప్రాంతాలుగా మారాయి.
  • ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది.
  • డిమాండ్ తగ్గిపోవటంతో, కర్మాగారాలు మూతపడిపోయాయి.
  • ఉత్పత్తి తగ్గిపోవడం వలన వాణిజ్యం తగ్గిపోయింది.
  • ఉత్పత్తి, వ్యాపారం, వాణిజ్యం తగ్గిపోవడంతో ప్రజల నిజమైన ఆదాయం తగ్గిపోయింది.
  • ఈ విధంగా తీవ్ర మాంద్యం కాలంలో అమెరికా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.
  • అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రూస్వాల్ట్ న్యూడీలను ప్రకటించి, ఆర్థిక సంస్కరణలు చేపట్టి తిరిగి కోలుకోటానికి చర్యలు చేపట్టారు.

ప్రశ్న 3.
రష్యా విప్లవం రష్యన్ సమాజంలో తీసుకువచ్చిన మార్పులు ఏవి?
జవాబు:
రష్యన్ విప్లవం సమాజంలో ఎన్నో మార్పులను తెచ్చింది. 1917లో ప్రారంభమైన రష్యన్ విప్లవం ఫలితంగా 1920 నాటికి అనేక మార్పులు జరిగాయి.

  1. జార్ చక్రవర్తుల పాలన దూరమై ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వాళ్ళు పరిపాలన చేపట్టారు.
  2. రష్యాలో “బోల్షివిక్”లు లెనిన్ నాయకత్వంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
  3. షరతులు లేని శాంతిని నెలకొల్పి, భూమినంతటినీ జాతీయం చేసి దానిని రైతులందరికీ పంచిపెట్టడం జరిగింది.
  4. ధరలను నియంత్రించి కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేశారు.
  5. స్టాలిన్ ఆధ్వర్యంలో రష్యాను బలమైన శక్తిగా మార్చి, పంచవర్ష ప్రణాళికలతో ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థను చేపట్టారు.

ప్రశ్న 4.
ప్రపంచ యుద్ధాల పరిణామాలేవి?
జవాబు:
ప్రపంచ యుద్ధాల పరిణామాలు:

  1. ప్రపంచ యుద్ధాల కారణంగా అసంఖ్యాక ప్రాణనష్టం జరిగింది.
  2. ప్రజాస్వామ్య సూత్రాల పునరుద్ధరణ జరిగింది. దాని ద్వారా ప్రజాస్వామ్య రాజ్యాలు పున:ప్రతిష్టించబడ్డాయి.
  3. అధికార సమతుల్యంలో మార్పులు ఏర్పడ్డాయి.
  4. నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి వంటి కొత్త అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి.
  5. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1918లో మహిళలకు ఓటుహక్కు లభించింది.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 5.
క్రింది పేరాగ్రాను చదివి, మీ వ్యాఖ్యానాన్ని రాయండి.
జవాబు:
“నాజీ పోలీసులు వారి అధికారాలను ఉపయోగించుకుని లక్షలాది రాజకీయ ఉద్యమకారులను, కార్మిక సంఘ నాయకులను అల్పసంఖ్యాక వర్గ ప్రజలను అరెస్టు చేసి హింసించేవాళ్ళు. అంతకు ముందెన్నడూ లేనంతగా దారుణాలకు ఒడిగట్టారు, వ్యతిరేకులను భయభ్రాంతుల్ని చేశారు.”
జవాబు:

  1. ఇవ్వబడిన పేరాగ్రాఫ్ నాజీ సైనికుల క్రూర విధానాలను విశదీకరిస్తుంది.
  2. హిట్లర్ జర్మనీలోని లక్షలాది రాజకీయ నాయకులను, కార్యకర్తలను, కార్మిక సంఘాల నాయకులను నిర్బంధించి, హింసించాడు. అల్పసంఖ్యాక వర్గాలవారు కూడా పీడించబడ్డారు. ఈ పరిస్థితి జర్మనీలో హిట్లర్ నాయకత్వంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది.
  3. 1932 ఎన్నికలలో గెలిచిన హిట్లర్ ‘ఎనేబ్లింగ్ యాక్ట్’ను తెచ్చి, గెస్టాపో, రక్షణ దళాలు, నేర విచారణ పోలీసులు, భద్రత సేవలు వంటి ప్రత్యేక నిఘా, భద్రతా దళాలను ఏర్పరిచాడు. ఈ దళాలు అమానుషంగా వ్యవహరించి, ప్రజల్లో భయందోళనలను సృష్టించాయి.
  4. హిట్లర్ ఏ రాజకీయ పార్టీని లేదా కార్మికసంఘాన్ని పనిచేయనీయలేదు. ప్రజలందరినీ నాజీలను అనుసరించమని ఆదేశించాడు. శాంతి అనేది శూన్యం. యూదులను శత్రువులుగా చూసేవాడు. వారిని నిర్బంధ శిబిరాలకు పంపేవాడు. వారిలో చాలామంది గ్యాస్ చాంబర్లలో చంపబడ్డారు.
  5. తను సూచించినదే ప్రతి ఒక్కరు అనుసరించాలని హిట్లర్ భావించేవాడు. తన చట్టాన్ని అమలుపరచడంలో హిట్లర్ . ఎంత మొండివాడో దీనివల్ల తెలుస్తోంది.
  6. ఒకవేళ హిట్లర్ ప్రజాస్వామిక విధానాలను అనుసరించి వుంటే, జర్మనులను ఒకే వేదిక పైకి తేగలిగేవాడు కాదు. వర్సయిల్స్ సంధిలో జర్మనీపై అనేక షరతులున్నందున, హిట్లరే ప్రతీకారం తీర్చకోవాలని భావించాడు.
  7. యూదుల పట్ల అతని క్రూర వైఖరి కారణంగా అందరు హిట్లర్‌ను విమర్శించారు. అతని చర్యల మూలంగా జర్మనీ మొత్తం భయభ్రాంతమయింది.
  8. నాజీలకు అనుకూలంగా ఉండేందుకు సమాజాన్ని నియంత్రించడానికి అనేక పోలీసు దళాలను ఏర్పరచాడు. ఎవరైనా హిట్లర్ విధానాలను వ్యతిరేకించినా విమర్శించినా గెస్టాపో (రహస్య పోలీసు బృందం) వారిని నిర్బంధించి, నిర్బంధ శిబిరాల్లో చంపేవారు.
  9. హిట్లర్ చర్యలు అన్యాయపూరితమైనవని, అప్రజాస్వామికమైనవని నేను భావిస్తాను. అమాయకులు ఎందరో బాధించబడ్డారు.
  10. ప్రస్తుతం అన్ని దేశాలు ప్రజాస్వామిక ప్రభుత్వాలవైపు నడుస్తున్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని విజయవంతం చేయాలంటే, అక్షరాస్యతా శాతం ప్రధాన అంశంగా ఉండాలి.
  11. అన్ని దేశాలు అక్షరాస్యతా శాతంపై దృష్టి సారించి, వివిధ కార్యక్రమాలను చేపట్టి, పటిష్టంగా అమలుపరచాలి. తద్వారా ఏ దేశంలోను అటువంటి పరిస్థితికి తావుండదు.

ప్రశ్న 6.
క్రింది పేరాను చదివి, మీ వ్యాఖ్యానాన్ని రాయండి.
“యుఎస్ఎస్ఆర్ ఫ్యూడల్ భూస్వాములు, రాజులు, పెట్టుబడిదారులు వంటి దోపిడీదారులు లేని దేశాన్ని నిర్మించటానికి ఒక బృహత్ ప్రయోగం ప్రారంభించింది. ఆధునిక పారిశ్రామిక సమాజాన్ని నిర్మిస్తూనే అసమానతలు, పుట్టుక, లింగం, భాష వంటి ప్రాతిపదికన వివక్షత లేని సమాజాన్ని ఏర్పాటు చెయ్యటానికి యుఎస్ఎస్ఆర్ ప్రయత్నించింది.”
జవాబు:

  1. యుఎస్ఎస్ఆర్ సమానత్వంతో కూడిన దేశాన్ని స్థాపించిందని ఈ పేరాగ్రాఫ్ వలన తెలుస్తోంది. అక్కడ పెట్టుబడిదారులు, దోపిడీదారులు మరియు పీడితులు లేరు.
  2. అది పారిశ్రామికీకరణ మరియు ఆధునిక సాంకేతిక, కాలానుగుణ జీవనశైలి వంటి వాటిని అనుసరించినా అసమానత అనేది ఏ రూపంలోనూ లేదు. అదే సోషలిజం యొక్క అసలైన ఉద్దేశ్యం.
  3. ఆ కాలంలో సమానత్వం, ఆధునిక ప్రగతి ఒక్క యుఎస్ఎస్ఆర్లో తప్ప మరే దేశంలోను లేదు.
  4. ఏ దేశంలోనైనా వివక్ష ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో వివక్ష రంగు రూపంలో కనిపిస్తుంది.
    ఉదా : తెల్లవారు, నల్లవారు.
  5. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలలోని అనేక దేశాలు ఆఫ్రికా నుండి ప్రత్యేకించి నైజీరియా నుండి బానిసలను కొనుగోలు చేసేవి. నైజీరియన్లు కూడ మానవులే కాని అమెరికన్లు అలా భావించేవారు కాదు.
  6. కొన్ని దేశాల్లో యూదులు ద్వితీయ శ్రేణి ప్రజలుగా పరిగణింపబడ్డారు. శారీరకంగా హింసించబడ్డారు. కొన్ని సందర్భాల్లో వారు గ్యాస్ చాంబర్లలో పాశవికంగా చంపబడ్డారు.
  7. మన దేశంలో కొన్ని కులాలు ఉన్నత కులాలుగా, మరికొన్ని తక్కువ కులాలుగా ఉండేవి. ఈ కుల, మత, లింగ, వర్ణ, భాషాపరమైన వివక్ష ప్రతిచోటా ఉంది.
  8. అసంఘటిత రంగంలో పురుషులకిచ్చే వేతనం కన్న స్త్రీలకిచ్చే వేతనం తక్కువ.
  9. బాలురను పై చదువులు చదివిస్తుంటే, బాలికలను అనేక కారణాలతో పాఠశాలలకు పంపడం లేదు.
  10. చాలా దేశాలు తమ రాజ్యాంగాలలోని పీఠికలలో సమానత్వానికి ప్రాధాన్యతనిస్తామని, వివక్ష ఏ రూపంలోనూ ఉండదని పేర్కొన్నాయి.
  11. పూర్వకాలంలో మన దేశాన్ని రాజులు, ఫ్యూడల్ భూస్వాములు పరిపాలించారు. కొంతమంది రాజులు ప్రజావాణికి విలువ ఇచ్చినా, అత్యధికులు ప్రజలను పట్టించుకోలేదు. అందువలన పేద ప్రజలు అవమానించబడ్డారు. వారికి తగిన గౌరవం దక్కలేదు.
  12. ప్రతి దేశం సమానత్వాన్ని పాటించాలని నేను కోరుకుంటాను. పీడిత వర్గాల ఉద్ధరణ జరగాలి. సమానత్వాన్ని పాటించే దేశం అన్ని దేశాలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది.

ప్రశ్న 7.
తీవ్ర ఆర్థిక మాంద్యంకు గురికాకుండా ఉండటానికి రష్యా దేశం అనుసరించిన సంస్కరణలు, పద్ధతులు ఏవిధంగా ఉపయోగపడ్డాయో వ్రాయండి. .
జవాబు:

  1. అంతర్జాతీయ మార్కెట్ తో యు.ఎస్.ఎస్.ఆర్ అనుసంధానమై లేదు
  2. యు.ఎస్.ఎస్.ఆర్.లో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం ఉండేది. 3) ఏమి ఉత్పత్తి చేయాలో, ఎంత ఉత్పత్తి చేయాలో ప్రభుత్వం నిర్ణయించేది.
  3. దీని డిమాండ్ – సరఫరా మధ్య సమతౌల్యాన్ని అది సాధించగలిగింది.

ప్రశ్న 8.
జర్మనీలో నాజీయిజం ప్రాబల్యం గురించి వివరించండి.
జవాబు:

  1. ఆర్థిక మాంద్యం వల్ల అన్నింటికంటే ఎక్కువగా ప్రభావితమయిన దేశం జర్మనీ.
  2. ఈ ఆర్థిక సంక్షోభం ప్రజలలో తీవ్ర భయాందోళలను కలిగించింది.
  3. ఈ పరిస్థితిని హిట్లర్ మరియు నాజీలు చాలా తెలివిగా వినియోగించుకున్నారు
  4. తన మాటల ద్వారా, ఉద్వేగం ద్వారా హిట్లర్ ప్రజలను కదిలించి వేశాడు.
  5. అన్ని విషయాలలో బలమైన దేశాన్ని నిర్మిస్తానని ప్రజలకు వాగ్దానం చేశాడు.
  6. రాజకీయాలలో కొత్తశైలిని ప్రవేశపెట్టి ప్రజలను ఆకర్షించాడు.
  7. వీటన్నిటి ఫలితంగా 1932 నాటికి నాజీ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.
  8. 1933లో ఆమోదం పొందిన ఎనేబ్లింగ్ యాక్ట్ ద్వారా హిట్లర్ జర్మనీకి నియంతగా అవతరించాడు. నాజీ ప్రభుత్వం అత్యంత శక్తివంతంగా అవతరించింది.

ప్రశ్న 9.
ఈ క్రింది కాలపట్టిక సహాయంతో దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానమిమ్ము.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 2
1) రెండవ ప్రపంచ యుద్ధమునకు తక్షణ కారణమేమి?
2) అమెరికా ఎప్పుడు రెండవ ప్రపంచ యుద్ధములోనికి ప్రవేశించింది?
3) వైమర్ రిపబ్లిక్ ఏ దేశమునకు చెందినది?
4) 1941లో సంభవించిన ఏవేని రెండు సంఘటనలు వ్రాయండి.
జవాబు:

  1. పోలెండ్ పై జర్మనీ దండెత్తడం రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభాన్ని సూచిస్తోంది.
  2. డిసెంబరు 8, 1941
  3. జర్మనీ
  4. 1. యు.ఎస్.ఎస్.ఆర్ పై జర్మనీ దండెత్తడం
    2. యూదులపై సామూహిక హత్యాకాండ
    3. అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో చేరడం.

ప్రశ్న 10.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రూజ్ వెల్ట్ కొత్త ఒప్పందాన్ని ప్రకటించాడు. దీని ప్రకారం మాంద్యానికి గురైన వారికి పునరావాసం, ఆర్థిక సంస్థల సంస్కరణ, ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకోటానికి చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టసాగింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం మొదలుకావటంతో సైన్యం, ఆయుధాలపై ప్రభుత్వ ఖర్చు పెట్టసాగింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం మొదలుకావటంతో సైన్యం, ఆయుధాలపై ప్రభుత్వ ఖర్చు పెరిగి కర్మాగారాల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకి ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాలో ఎంతో అవసరమైన సామాజిక భద్రతా విధానాన్ని కూడా రూజ్ వెల్ట్ ప్రవేశపెట్టాడు. అందరికీ వర్తించే ఎంతో అవసరమైన సామాజిక భద్రతా విధానాన్ని కూడా రూజ్ వెల్ట్ ప్రవేశపెట్టాడు. అందరికీ వర్తించే పదవీ విరవమణ పింఛను, నిరుద్యోగ బీమా, వికలాంగులకు, తండ్రిలేని కుటుంబాలలో అవసరమున్న పిల్లలకు సంక్షేమ ప్రయోజనాలు వంటివి దీనివల్ల సమకూరాయి. అమెరికాలోని సంక్షేమ వ్యవస్థకు ఇది ఒక చట్రాన్ని ఏర్పరిచింది. మాంద్యం మొదలుకాక ముందు మొదటి ప్రపంచ యుద్ధకాలంలోనే ఈ దిశలో బ్రిటన్ కొన్ని చర్యలు చేపట్టింది. నిరుద్యోగ బీమా, వృద్ధాప్య పింఛను పథకాలను ఏర్పరించింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి బ్రిటన్ కూడా నిరుద్యోగ భృత, అనారోగ్యానికి ఖర్చులు, ఆరోగ్య పథకాలు, శిశు సంరక్షణ వంటి సామాజిక భద్రతా చర్యలను విస్తృతంగా చేపట్టింది. ఇవన్నీ సంక్షేమ రాజ్యం అన్న దానిని ఏర్పరచటానికి దోహదం చేశాయి. దీని ప్రకారం ప్రజలందరికీ కనీస జీవనస్థాయి, ఆహారం, గృహవసతి, ఆరోగ్యం , విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ వంటి మౌలిక అంశాలకు ప్రభుత్వం హామీగా ఉంటుంది. పని చెయ్యగల పౌరులందరికీ ఉపాధిని కల్పించే బాధ్యతను చాలావరకు ప్రభుత్వం తీసుకుంది. ఈ విధంగా ప్రభుత్వం మార్కెటు ఆధారిత పెట్టుబడిదారీ విధానంలోని ఒడిదుడుకులను తగ్గించటానికి ప్రయత్నించింది.
“రూజ్ వెల్ట్ ప్రకటించిన కొత్త ఒప్పందంలోని సంస్కరణలు ప్రజల ఆర్ధిక పరిస్థితి బాగుచేసి, సంక్షేమ రాజ్యానికి దోహదం చేశాయి.” అనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? చర్చించండి.
జవాబు:
అవును. ఏకీభవిస్తాను.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రూజ్వెల్ట్ కొత్త ఒప్పందాన్ని ప్రకటించి, దాని ప్రకారం ప్రజలకు అనేక సంస్కరణలను కల్పించాడు. అవి

  1. ఆర్థిక మాంద్యానికి గురైన వారికి పునరావాసం, ఆర్థిక సంస్థల సంస్కరణల ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితి కోలుకోటానికి అవసరం అయిన చర్యలు చేయబడ్డాయి.
  2. ప్రజలకు అవసరం అయినా సంస్కరణల కొరకు ప్రభుత్వం చాలా ధనాన్ని ఖర్చు పెట్టింది.
  3. ఇదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కావటంతో కర్మాగారాల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగాయి.
  4. అమెరికా, ప్రజలకు ఎంతో అవసరం అయిన ‘సామాజిక భద్రతా విధానాన్ని’ ప్రవేశపెట్టింది. ‘సామాజిక భద్రతా విధానంలోని కొన్ని అంశాలు :
    ఎ) ప్రజలందరికి వర్తించే పదవీ విరమణ పింఛను,
    బి) నిరుద్యోగులకు బీమా పథకాలు కల్పించడం,
    సి) వికలాంగులకు, తండ్రిలేని కుటుంబాలలో అవసరమున్న పిల్లలకు సంక్షేమ ప్రయోజనాలు వంటివి కూడా కల్పించబడినాయి.
    5) సంక్షేమ రాజ్యం అనే విధానం ప్రకారం, ప్రజలందరికీ కనీస జీవనస్థాయి, ఆహారం, గృహవసతి, ఆరోగ్యం , విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ వంటి విషయాలకు ప్రభుత్వం హామీగా ఉంటుంది.

పై సంస్కరణలను ప్రజలందరికీ కల్పించి, వాటి అమలుకు ప్రభుత్వమే హామీగా పంపి, అమలు జరిగేలా చూసి, సంక్షేమ రాజ్యానికి ఈ సంస్కరణ దోహదం చేశాయని చెప్పవచ్చు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 11.
ఈ క్రిందివాటిని ప్రపంచపటంలో గుర్తించుము.

  1. సెయింట్ పీటర్స్బర్గ్
  2. మాస్కో
  3. కిర్గిజ్స్తాన్
  4. యుక్రెయిన్
  5. ఉజ్బెకిస్తాన్
  6. తజికిస్తాన్
  7. కజికిస్తాన్
  8. టర్కో మేనియా

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 3

ప్రశ్న 12.
పట్టిక ఆధారంగా జర్మనీ చరిత్రలోని ముఖ్య సంఘటనలను విశ్లేషించుము.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 2
జవాబు:
పై కాలపట్టికను పరిశీలించగా ఈ విషయాలు తెలియుచున్నవి.

జర్మనీ, మొదటి ప్రపంచయుద్ధం తరువాత 1918,నవంబరు 9న ‘వైమర్’ గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. నెమ్మదిగా నాజీజం వ్యాప్తిలోకి వచ్చి, చివరికి- 1933, జనవరి 30న నాజీ-అధ్యక్షుడు హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడు. ప్రపంచంలో జర్మనీ జాతి గొప్పదనే భావనను హిట్లర్ ప్రచారం చేశాడు. సామ్రాజ్య కాంక్షతో అనేక దేశాలను ఆక్రమించుకుంటూ చివరికి 1939, సెప్టెంబర్ 1న, జర్మనీ పోలెండ్ పై దాడి చేయటం రెండవ ప్రపంచయుద్ధ ప్రారంభానికి కారణం అయింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1941, జూన్ 22న జర్మనీ యు.ఎస్.ఎస్.ఆర్ పై దండయాత్ర చేసింది. హిట్లర్కు యూదులంటే ద్వేషం. వారి మీదున్న ద్వేషంతో అనేక మంది యూదులను హింసలకు గురిచేశాడు. 1941, జూన్ 23న హిట్లరు యూదులపై సామూహికంగా హత్యకాండ జరిపినాడు అని కాలపట్టిక ద్వారా తెలియుచున్నది.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

These AP 10th Class Social Studies Important Questions 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I will help students prepare well for the exams.

AP Board 10th Class Social 13th Lesson Important Questions and Answers ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social 13th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతమంది భారతీయ సైనికులు మరణించారు?
జవాబు:
75,000.

2. అణుబాంబుల వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధులేవి?
జవాబు:
ల్యుకేమియా, క్యాన్సర్.

3. సెర్బియన్ చేతిలో హత్యకు గురైన ఫెర్డినాండ్ ఏ దేశానికి చెందిన ఆర్చ్ డ్రుకీ?
జవాబు:
ఆస్టియా.

4. పోలాండ్ ఏ రేవును జర్మనీకి అప్పగించటానికి నిరాకరించింది?
జవాబు:
డాంజింగ్.

5. ఏ సంవత్సరం నుంచి ఇటలీలో ఫాసిజం దురహంకార పూరిత జాతీయతావాదంగా ఉంది?
జవాబు:
1923.

6. 19 శతాబ్దం ముగిసే నాటికి ఏ శక్తుల మధ్య వలస ప్రాంతాలకోసం పోటీ మొదలయ్యింది?
జవాబు:
ఐరోపా.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

7. కొత్త పారిశ్రామిక (దేశాలు) శక్తులకు ఉదాహరణ నిమ్ము?
జవాబు:
జర్మనీ, జపాన్, ఇటలీ.

8. 1870లో ఫ్రాన్సి ని ఓడించిన తరువాత జర్మనీ ఛాన్సలర్ అయినది ఎవరు?
జవాబు:
బిస్మార్క్.

9. మిత్రదేశాల కూటమి ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1907.

10. 1880 నుంచి 1914 నాటికి ఆరు ప్రధాన శక్తుల (దేశాల) సైనిక ఖర్చు ఎంత శాతానికి పెరిగింది?
జవాబు:
300%

11. మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంధితో ముగిసింది?
జవాబు:
వర్సయిల్స్ సంధి.

12. 1934 నాటికి నానాజాతి సమితిలో ఎన్ని దేశాలు సభ్యత్వం కల్గి ఉన్నాయి?
జవాబు:
58.

13. USSRని విస్తరింపుము.
జవాబు:
సోవియట్ సోషలిస్టు దేశాల సమాఖ్య (Union of Soviet Socialist Republic).

14. UNESCO ని విస్తరింపుము.
జవాబు:
విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ.

15. WHOని విస్తరింపుము.
జవాబు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation)

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

16. UNICEF ని విస్తరింపుము.
జవాబు:
అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి.

17. ILOని విస్తరింపుము.
జవాబు:
అంతర్జాతీయ కార్మిక సంస్థ (International Labour Organisation)

18. ఐక్యరాజ్య సమితి ఎన్ని సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడిన ప్రపంచ ప్రభుత్వం లాంటిది?
జవాబు:
నాలుగు.

19. వైమర్ గణతంత్రంగా ఏర్పడిన దేశమేది?
జజవాబు:
జర్మనీ.

20. 1922లో ఇటలీలో ఎవరి విజయంతో ఫాసిజం మొదలయ్యింది?
జజవాబు:
బెనిటో ముస్సోలినీ.

21. 1918లో ఏ దేశ ఓటమితో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది?
జవాబు:
జర్మనీ.

22. మొదటి ప్రపంచ యుద్ధ కాలం …….. ?
జవాబు:
1914 – 1918.

23. హెల్ కాస్ట్లో ఎంతమంది యూదులు చంపబడ్డారు?
జవాబు:
60 లక్షలు.

24. వలస ప్రాంతాలను తిరిగి విభజించాలని ఎవరు కోరుకున్నారు?
జవాబు:
కొత్త పారిశ్రామిక శక్తులు.

25. ఫ్రాన్స్ నుంచి 1871లో స్వాధీనం చేసుకున్న ఏ ప్రాంతాలను జర్మనీ వదులుకుంది?
జవాబు:
అల్సెస్, లోరైస్.

26. భవిష్యత్తులో యుద్ధాలను నివారించటానికి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన ప్రపంచ సంస్థ ఏది?
జవాబు:
నానాజాతి సమితి.

27. ఎవరి కింద జర్మనీ తిరిగి వేగంగా పారిశ్రామికీకరణ చెందింది?
జవాబు:
నాజీల.

28. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమేమి?
జవాబు:
Murder of Ferdinand (1914, జూన్ 28)

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

29. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమేమి?
జవాబు:
పోలెండ్ పై జర్మనీ దండెత్తటం. (1939, సెప్టెంబర్ 1)

30. ఒట్టోవాన్ సామ్రాజ్యం ఏర్పడిన దేశమేది?
జవాబు:
టర్కీ

31. ఫ్లోరెన్స్ ఓవెన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి?
జవాబు:
పోలెండ్.

32. బ్రిటన్ లో మహిళలకు ఓటుహక్కు లభించిన సంవత్సరం ఏది?
జవాబు:
1918.

33. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో స్థాపించారు?
జవాబు:
1945.

34. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది?
జవాబు:
1945 ఆగస్టు.

35. రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడు ఎవరు?
జవాబు:
హిట్లర్.

36. జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్ లో భిన్నమైన దేశమేది?
జవాబు:
ఫ్రాన్స్,

37. అంతర్జాతీయ మహిళల ఓటుహక్కు ఉద్యమ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1914.

38. నానాజాతి సమితి రూపశిల్పి ఎవరు?
జవాబు:
ఉడ్రోవిల్సన్ (అమెరికా).

39. జపాన్లోని ఏ నగరాలపై అణుబాంబు దాడి జరిగింది?
జవాబు:
హిరోషిమా, నాగసాకి.

40. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, ఇటలీలో తైపాక్షిక కూటమిలో లేని దేశమేది?
జవాబు:
ఫ్రాన్స్

41. USSR ఏ సంవత్సరంలో ఏర్పాటయ్యింది?
జవాబు:
1924.

42. అక్షరాజ్యాల / కేంద్ర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన దేశమేది?
జవాబు:
జర్మనీ.

43. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రియా, రష్యాలలో భిన్నమైనది ఏది?
జవాబు:
ఆస్ట్రియా.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

44. రష్యా విప్లవం ఏ సంవత్సరంలో సంభవించింది?
జవాబు:
1917.

45. సామ్రాజ్య వాదానికి మూల కారణమేమి?
జవాబు:
పారిశ్రామిక విప్లవం.

46. వర్సయిల్స్ సమావేశానికి ఎన్ని దేశాలు హాజరయ్యాయి?
జవాబు:
32 దేశాలు.

47. అమెరికా పార్లమెంట్ ను ఏమని పిలుస్తారు?
జవాబు:
కాంగ్రెస్.

48. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) ఫాసిజమ్ ( ) a) ఇటలీ
ii) నాజియిజమ్ ( ) b) జర్మనీ
iii) సోషలిజం ( ) c) రష్యా
iv) పారిశ్రామిక విప్లవం ( ) d) ఇంగ్లండు
జవాబు:
i -a, ii – b, iii – c, iv – d

49. క్రింది వానిని జతపరచండి.
i) ముస్సోలిని ( ) a) ఆస్ట్రియా
ii) ఉడ్రోవిల్సన్ ( ) b) రష్యా
iii)జార్ నికొలస్ ( ) c) అమెరికా
iv) ఫెర్డినాండ్ ( ) d) ఇటలీ
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a

50. 20వ శతాబ్దాన్ని “తీవ్ర సంచలనాల యుగం” అని అభివర్ణించింది ఎవరు?
జవాబు:
ఎరిక్ హాక్బీమ్.

51. తీవ్ర ఆర్థిక మాంద్యం ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1929.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

52. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
జెనీవా.

53. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
న్యూయార్క్.

54. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
→ ఫాసిజం – ఫ్రాన్స్
→ నాజీజం – జర్మనీ
→ సామ్యవాదం – రష్యా
→ పెట్టుబడిదారీ దేశం – అమెరికా
జవాబు:
ఫాసిజం – ఫ్రాన్స్,

55. మొదటి ప్రపంచ యుద్ధంలో శక్తి కూటములకు సంబంధించి భిన్నమైన దానిని గుర్తించండి
బ్రిటన్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, రష్యా.
జవాబు:
ఆస్ట్రియా.

56. చరిత్రకారుడైన ఎరిక్ హాబ్స్ బామ్ 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొనడానికి కారణం కాని అంశం?
తీవ్ర ఆర్థికమాంద్యం సంభవించటం.
ప్రపంచ యుద్ధాలు జరగడం.
మూఢ విశ్వాసాలు పెరిగిపోవటం.
సినిమాలు వంటి కొత్తకళలు ఆవిర్భవించటం.
జవాబు:
మూఢ విశ్వాసాలు పెరిగిపోవటం.

57. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) UNESCO ( ) a) పారిస్
ii) WHO ( ) b) జెనీవా
iii) UNICEF ( ) c) న్యూయార్క్
iv) అంతర్జాతీయ న్యాయస్థానం ( ) d) ది హేగ్
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

58. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి రాయండి.
→ తీవ్ర ఆర్థిక మాంద్యం – 1929
→ రష్యా విప్లవం – 1917
→ రెండవ ప్రపంచ యుద్ధ ఆరంభం – 1939
→ ఐక్యరాజ్య సమితి ఏర్పాటు – 1947
జవాబు:
ఐక్యరాజ్య సమితి ఏర్పాటు – 1947

59. ప్రపంచ యుద్ధాలకు ప్రధాన కారణం సామ్రాజ్యవాదం అయితే ఈ సామ్రాజ్యవాదానికి మూలం ఏది?
జవాబు:
పారిశ్రామిక విప్లవం.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

60. ILO, WHO, అంతర్జాతీయ న్యాయస్థానం, UNESCO లలో నానాజాతి సమితిలో ఏర్పడిన సంస్థ కానిది ఏది?
జవాబు:
UNESCO

61. హిట్లర్ పోలెండను ఆక్రమించిన సంవత్సరం?
జవాబు:
1939.

62. యుద్ధాన్ని నివారించ వలసిందిగా హిట్లరుకు విన్నపాన్ని పంపిన భారత జాతీయ నాయకుడు ఎవరు?
జవాబు:
మహాత్మా గాంధీ.

63. నానాజాతి సమితి ఉద్దేశ్యాన్ని కొనసాగించడానికి ఏర్పడిన సంస్థ ఏది?
జవాబు:
ఐక్యరాజ్య సమితి.

64. ప్రపంచ శాంతి కోసం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటయిన సంస్థ?
జవాబు:
ఐక్యరాజ్య సమితి.

65. 1870లో బిస్మార్క్. ఏ దేశాన్ని ఒంటరిని చేయాలని చూశాడు?
జవాబు:
ఫ్రాన్స్

66. నానాజాతి సమితిలో చేరడానికి ఆహ్వానించబడని దేశాలు ఏవి?
జవాబు:
జర్మనీ, రష్యా.

67. రష్యా విప్లవం ఏ సంవత్సరంలో సంభవించింది?
జవాబు:
1917.

68. బోల్షివిక్ పార్టీ స్థాపకుడు ఎవరు?
జవాబు:
లెనిన్.

69. నాజీ పార్టీ యొక్క అసలు పేరు?
జవాబు:
నేషనల్ సోషలిస్టు పార్టీ.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

70. ఏ సంవత్సరంలో హిట్లర్ రష్యాపై దండెత్తాలని నిర్ణయించు కున్నాడు?
జవాబు:
1942.

71. 1939లో ఏ రెండు దేశాలు పరస్పరం దండెత్తకుండా ఉండటానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి?
జవాబు:
జర్మనీ, రష్యా,

72. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్, బెల్జియంలపై దాడిచేసిన దేశమేది?
జవాబు:
జర్మనీ.

73. రష్యా – జపాన్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది?
జవాబు:
1905.

74. ఏ సంవత్సరంలో నానాజాతి సమితి రద్దు చేయబడింది?
జవాబు:
1946.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

75. ఆస్ట్రో – హంగేరియన్, ఒట్టోమాన్ సామ్రాజ్యాలను విచ్ఛిన్నం చేసిన సంధి ఏది?
జవాబు:
వర్సయిల్స్.

76. స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో అధికారంలోకి వచ్చిన సంవత్సరం?
జవాబు:
1939.

77. ఏ సంవత్సరంలో హిట్లర్, అతడి నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది?
జవాబు:
1933.

78. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు మూడు మిదేశాల కూటమిగా ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి?
జవాబు:
1907.

79. 1880 నుంచి 1914 నాటికి జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సైనిక ఖర్చు 192 మి|| పౌండ్ల నుంచి ఎంతకు పెరిగింది?
జవాబు:
397 మి|| పౌండ్లకు.

80. ఏ శతాబ్దం ముగిసే నాటికి ఐరోపా శక్తుల మధ్య వలస ప్రాంతాలకోసం పోటీ మొదలయ్యింది?
జవాబు:
19వ శతాబ్దం

81. 1871లో ఏ దేశం నుండి స్వాధీనం చేసుకున్న అల్సెన్, లోరైన్ వంటి ప్రాంతాలను జర్మనీ వదులుకుంది?
జవాబు:
ఫ్రాన్స్

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

82. ప్రపంచ యుద్ధాల్లో మరణించిన వాళ్ళల్లో అధిక శాతం మంది ఎన్ని సంవత్సరాలలోపు వారున్నారు?
జవాబు:
40 ఏళ్ళలోపు.

10th Class Social 13th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
UNICEF ను విస్తరింపుము.
జవాబు:
అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్)

ప్రశ్న 2.
ఈ క్రింది కాలపట్టికను పరిశీలించి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
కాలపట్టిక

మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం ఆగస్టు 1 1914
రష్యా విప్లవము 1917
మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు 1918
వర్సెయిల్స్ ఒప్పందము 1919
నానాజాతి సమితి ఏర్పాటు 1919
జర్మనీలో హిట్లర్ ప్రాభవం 1933
రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభం 1939
రష్యాపై జపాన్ దండెత్తడం 1942
ఐక్యరాజ్యసమితి ఏర్పాటు 1945
రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు 1945

ప్రశ్న. రెండు ప్రపంచ యుద్ధాల అనంతరము ఏర్పడిన శాంతికాముక సంస్థలు ఏవి?
జవాబు:

  1. నానాజాతి సమితి
  2. ఐక్యరాజ్య సమితి (యు.ఎన్.ఓ)

ప్రశ్న 3.
ఈ క్రింది ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 1
యుద్ధ మరణాలు, మిలియన్లలో ప్రతి వెయ్యి మందికి మరణాలు

1) 20వ శతాబ్దంలో ప్రతి వెయ్యిమందిలో ఎంతమంది యుద్ధాల వల్ల చనిపోయారు?
జవాబు:
20వ శతాబ్దంలో ప్రతి వెయ్యిమందిలో 44.4 మంది యుద్ధాల వల్ల చనిపోయారు.

2) ఏ శతాబ్దంలో యుద్ధ మరణాలు తక్కువగా ఉన్నాయి?
జవాబు:
16వ శతాబ్దంలో యుద్ధ మరణాలు తక్కువగా ఉన్నాయి.

3) 1900-1999లో యుద్ధ మరణాల సంఖ్య అధికంగా ఎందుకు ఉన్నది?
జవాబు:

  • ప్రపంచ యుద్ధాలు జరగడం వలన
  • ఆధునిక ఆయుధాలు ఉపయోగించడం వలన
    ఉదా : అణ్వాయుధాలు, విషవాయువులు

ప్రశ్న 4.
ఆయుధ పోటీకి సంబంధించిన బార్ గ్రాఫ్ ను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
→ ఏ సంవత్సరాల మధ్య ఆయుధ పోటీ పెరిగినట్లు తెలుస్తుంది?
జవాబు:
1880వ సంవత్సరం నుండి 1914 సంవత్సరాల మధ్య కాలంలో ఆయుధాల పోటీ కొనసాగింది.

→ సైనిక ఖర్చులు 1900 నుండి 1914 వరకు ఎంత పెరిగింది?
జవాబు:
పై గ్రాఫ్ 1880-1914, మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల – సైనిక ఖర్చుని సూచిస్తోంది.

ప్రశ్న 5.
మొదటి ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం ఏమిటి?
జవాబు:
ఆస్ట్రియా యువరాజు ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ఒక సెర్బియన్ ఉన్మాది చేతిలో హత్య కావింపబడటం మొదటి ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం.

ప్రశ్న 6.
వర్సయిల్స్ సంధి షరతుల్లోని ఒకదానిని పేర్కొనండి.
జవాబు:
వర్సయిల్స్ సంధి షరతులు :

  • ఆర్థికపరమైన
  • భూభాగపరమైన
  • సైనిక, నౌకా పరమైన

ప్రశ్న 7.
శాంతి యొక్క ఆవశ్యకతను తెలుపుతూ రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  1. యుద్ధాన్ని ద్వేషిద్దాం – శాంతిని ప్రేమిద్దాం
  2. శాంతియే నాగరికత

ప్రశ్న 8.
బిస్మార్క్ ఏ దేశాలతో రహస్య ఒప్పందాలను చేసుకున్నాడు?
జవాబు:
బిస్మార్క్ ఆస్ట్రియా, ఇటలీ దేశాలతో రహస్య ఒప్పందాలను చేసుకున్నది.

ప్రశ్న 9.
రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం : పోలండ్ లోని డాంజిన్, రేవు కోసం జర్మనీ పోలండ్ పై దాడి చేయడం.

ప్రశ్న 10.
ఈ చిత్రంలోని వ్యక్తి నానాజాతి సమితి స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. అతను ఎవరు?
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 3
జవాబు:
ఉడ్రోవిల్సన్.

ప్రశ్న 11.
20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా ఎంత?
జవాబు:
20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా 160 కోట్లు.

ప్రశ్న 12.
ఫాసిజం అనే పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
ఫాసిజం అనే పదానికి అర్ధం కడ్డీల కట్ట.

ప్రశ్న 13.
హిట్లర్ ఏర్పరచిన పార్టీ ఏది?
జవాబు:
హిట్లర్ ఏర్పరచిన పార్టీ నాజీ పార్టీ.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 14.
రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమేమి?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానికి ట్లర్ పోలెండ్ పై దాడిచేయడం తక్షణ కారణం.

ప్రశ్న 15.
జపాన్‌లోని ఏ నగరాలప్పై ఆ సంయుక్త రాష్ట్రాలు అణుబాంబులు వేసాయి?
జవాబు:
జపాన్లోని హిరోషిమా, నాగసాలపై అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచయుద్ధాన్ని త్వరితంగా సమాప్తం చేయడానికి అణుబాంబులను వేసింది.

ప్రశ్న 16.
నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
నానాజాతి సమితి 1920లో ఏర్పడింది.

ప్రశ్న 17.
నానాజాతి సమితి రూపశిల్పి ఎవరు?
జవాబు:
నానాజాతి సమితి రూపశిల్పి అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడైన ఉడ్రోవిల్సన్.

ప్రశ్న 18.
త్రైపాక్షిక కూటమిలో ఏ ఏ దేశాలున్నాయి?
జవాబు:
తైపాక్షిక కూటమిలో ఇంగ్లాండ్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలున్నాయి.

ప్రశ్న 19.
త్రైపాక్షిక సంధిలో ఏ ఏ దేశాలున్నాయి?
జవాబు:
త్రైపాక్షిక సంధిలో ఆస్ట్రియా, ఇటలీ, హంగరీ దేశాలున్నాయి.

ప్రశ్న 20.
మొదటి ప్రపంచ యుద్ధం ఏ ఏ సం||ల మధ్య జరిగింది?
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధం 1914 – 18 సం||ల మధ్య జరిగింది.

ప్రశ్న 21.
రష్యాలో విప్లవం ఏ సం||లో సంభవించింది?
జవాబు:
రష్యాలో విప్లవం 1917లో సంభవించింది.

ప్రశ్న 22.
మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలైన 5 పెద్ద దేశాలు ఏవి?
జవాబు:
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్.

ప్రశ్న 23.
సామ్రాజ్యవాదం అనగానేమి?
జవాబు:
వలసరాజ్య విస్తరణలో ఏర్పడ్డ శత్రుత్వమే సౌమ్రాజ్యవాదం.

ప్రశ్న 24.
బోల్షివిక్ పార్టీ స్థాపకుడెవరు?
జవాబు:
బోల్షివిక్ పార్టీ స్థాపకుడు లెనిన్.

ప్రశ్న 25.
మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమేమి?
జవాబు:
ఆస్ట్రియా రాకుమారుడైన ఫెర్డినాండును, సతీసమేతంగా సరయోవో నగరంలో ఒక సెర్బియన్ హత్య గావించాడు.

ప్రశ్న 26.
బిస్మార్క్ జర్మనీ చాన్నలగా ఎప్పుడు నియమించబడ్డాడు?
జవాబు:
జర్మనీ చాన్సలర్ గా బిస్మార్క్ 1870లో నియమించబడ్డాడు.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 27.
వర్సయిల్స్ ఒప్పందం నానాజాతి సమితిని ఎందుకు ఏర్పాటు చేసింది?
జవాబు:
వర్సయిల్స్ ఒప్పందం నానాజాతి సమితిని భవిష్యత్తులో యుద్ధాలను నివారించటానికి ఏర్పాటు చేసింది.

ప్రశ్న 28.
యు.ఎస్.ఎస్.ఆర్ ను విస్తరించుము.
జవాబు:
యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్.

ప్రశ్న 29.
బ్రిటిష్ మహిళలకు ఏ సం||లో ఓటు హక్కు లభించింది?
జవాబు:
బ్రిటిష్ మహిళలకు 1918లో ఓటు హక్కు లభించింది.

ప్రశ్న 30.
రెండవ ప్రపంచ యుద్ధం ఏ ఏ సం||ల మధ్య కొనసాగింది?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 సం||ల మధ్య కొనసాగింది.

ప్రశ్న 31.
రెండవ ప్రపంచ యుద్ధానికి నాందిగా దేనిని భావిస్తారు?
జవాబు:
హిట్లర్ పోలెండ్ పై దండెత్తడాన్ని రెండవ ప్రపంచ యుద్ధానికి నాందిగా భావిస్తారు.

10th Class Social 13th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కింది పేరాగ్రాను చదివి ‘మహిళలకు ఓటు హక్కు లభించడం అనేది ఒక పెద్ద ముందడుగు’ అని ఎలా సమర్థిస్తావో రాయుము.

ఓటు హక్కు వంటి రాజకీయ హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం తర్వాత 1918లో బ్రిటిషు మహిళలకు ఓటు హక్కు లభించింది. ప్రపంచ యుద్ధాల మాదిరి దీర్ఘ కాలం పాటు జరిగే యుద్ధకాలంలో పారిశ్రామిక ఉత్పత్తి ఇతర సేవలు కొనసాగవలసిన అవసరం ఉంది. మగవాళ్ళు యుద్ధభూమిలో ఉండటంతో ఫ్యాక్టరీలు, దుకాణాలు, కార్యాలయాలు, స్వచ్చంద సేవలు, ఆసుపత్రులు, పాఠశాలల వంటి వాటిలో మహిళలు పని చేయాల్సి వచ్చింది. సంపాదనపరులు కావటంతో పెరిగిన ఆత్మ విశ్వాసంతో జీవితంలోని అన్ని అంశాలలో మహిళలు సమానత్వాన్ని కోరసాగారు. ఆ దిశలో ఓటు హక్కు లభించడం అనేది ఒక పెద్ద ముందడుగు.
జవాబు:
‘మహిళలకు ఓటుహక్కు లభించడం అనేది ఒక పెద్ద ముందడుగు’ అనడంలో సందేహం లేదు. ఎలాగంటే

  • మహిళలకు ఓటుహక్కు కల్పించకుండా ఉంటే అది దేశ విధానాలను చాలా ప్రభావితం చేస్తుంది.
  • పౌరులు అందరికీ (మహిళలకు) ఓటుహక్కు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. నేటి ప్రభుత్వాలన్ని ప్రజాస్వామ్యాలే కాబట్టి మహిళలకు ఓటుహక్కు అవసరం.
  • మహిళలకు ఓటుహక్కు లేనట్లయితే ‘వివక్షత’ చూపించినట్లవుతుంది. సామాజిక న్యాయం అనేది నేతిబీరకాయ చందంగా ఉండేది.
  • దేశంలో సగం జనాభా మహిళలే, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో, పాలనలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి.
  • మహిళలకు సమాన అవకాశాలు, (రాజకీయ) హక్కులు ఉన్నట్లయితే మరింత సామాజిక సమానత్వంవైపు తీసుకెళ్లటం సాధ్యమయ్యేది. అందుకని చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా కల్పించి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి.

ప్రశ్న 2.
ఈ క్రింది కాలపట్టికను పరిశీలించి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
కాలపట్టిక

మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం ఆగస్టు 1 1914
రష్యా విప్లవము 1917
మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు 1918
వర్సెయిల్స్ ఒప్పందము 1919
నానాజాతి సమితి ఏర్పాటు 1919
జర్మనీలో హిట్లర్ ప్రాభవం 1933
రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభం 1939
రష్యాపై జపాన్ దండెత్తడం 1942
ఐక్యరాజ్యసమితి ఏర్పాటు 1945
రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు 1945

ప్రశ్నలు :
1) రష్యా విప్లవం ఎప్పుడు సంభవించినది?
2) రెండవ ప్రపంచ యుద్ధానంతరము ప్రపంచ శాంతి స్థాపనకు ఏర్పడిన శాంతికాముక సంస్థ ఏమిటి?
(లేదా)
A) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి స్థాపనకు ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ సంస్థ పేరేమి?
B) హిట్లర్ జర్మనీకి చాన్సలర్‌గా ఏ సంవత్సరంలో అవతరించాడు?
C) యుద్ధం ముగియక ముందే రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుండి ఎందుకు విరమించుకుంది?
D) మొదటి ప్రపంచ యుద్ధం ఏ శాంతి సమావేశంతో ముగిసింది?
జవాబు:
1) రష్యా విప్లవం 1917లో సంభవించినది.
2) ఐక్యరాజ్య సమితి
(లేదా)
A) నానాజాతి సమితి.
B) 1933వ సం||రంలో
C) అంతర్గత విప్లవం కారణంగా, 1917లో రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకుంది.
D) వర్సయిల్స్ (సంధి) ఒప్పందం.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 3.
కింది పట్టికను పరిశీలించి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాల సైనిక ఖర్చును విశ్లేషించండి.

సంవత్సరం సైనిక ఖర్చు (మిలియన్ పౌండ్లలో)
1. 1880 132
2. 1890 158
3. 1900 205
4. 1910 288
5. 1914 397

జవాబు:

  1. 1880వ సంవత్సరంలో 132 మిలియన్ పౌండ్లలో డబ్బును ప్రధాన దేశాలు ఆయుధాల తయారీకి ఉపయోగించినట్లుగా తెలుస్తుంది.
  2. 1890వ సంవత్సరంలో ఆయుధ పోటీ మూలంగా 158 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టబడిందని తెలుస్తుంది.
  3. 1900లలో 205 మిలియన్ పౌండ్లు, 1910లో 288 మిలియన్ పౌండ్లు, 1914లో 397 మిలియన్ పౌండ్లు ఆయుధాల ఉత్పత్తి కొరకు అగ్రరాజ్యాలు ఉపయోగించాయి.
  4. ఆయుధాల ఉత్పత్తిని గమనించినట్లయితే ఈ అగ్రరాజ్యాలన్ని కూడా తమ ఆదాయంలో అధిక భాగాన్ని ఆయుధ సేకరణ కొరకు వినియోగించారని తెలుస్తుంది. తద్వారా యుద్ధాలను కోరుకున్నాయని కూడా చెప్పవచ్చు.
  5. పైగా ఈ విధంగా ఆయుధ సేకరణ పెరగడానికి ముఖ్య కారణం తమ దగ్గర ఎంత ఎక్కువ ఆయుధ సంపత్తి ఉంటే, అంత ఎక్కువ భద్రత” అనే భావన అయి ఉండవచ్చు.

కావున 1880 నుండి 1914 వరకు ఆయుధ ఉత్పత్తి కొరకు అత్యధిక ధనాన్ని వినియోగించారని ఈ పట్టిక ద్వారా తెలుస్తున్నది.

ప్రశ్న 4.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి, ఆయుధ పోటీ గురించి ఒక పేరాగ్రాఫ్ రాయండి.
(లేదా)
క్రింద ఇవ్వబడిన గ్రాలోని సమాచారాన్ని విశ్లేషిస్తూ కొన్ని వాక్యాలు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
1880-1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్ల సైనిక ఖర్చు (మూలం : టైమ్స్ ప్రపంచ చరిత్ర అట్లాసు, లండన్, 1978)
జవాబు:

  1. పై బార్ గ్రాఫ్ 1880-1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల సైనిక ఖర్చును సూచిస్తుంది.
  2. 1880లో 132 మిలియన్ పౌండ్లు ఉన్న ఖర్చు, 1914లో 397 మిలియన్ పౌండ్లకు పెరిగిపోయింది.
  3. ఆయా దేశాలు అధిక ఆయుధాలు సమకూర్చుకోవడంతో ప్రతి 10 సం||లకు ఖర్చు పెరుగుతూ పోయింది. తద్వారా యుద్ధాలను కోరుకొని ప్రపంచ శాంతికి భంగం కలిగించాయి.
  4. ఈ ఆయుధ పోటీతో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. దాని వలన ధన, మాన, ప్రాణ నష్టాలు సంభవించాయి. కనుక మున్ముందు రాజ్యాల మధ్య ఈ ఆయుధ పోటీ లేకుండుటయే మంచిది.

ప్రశ్న 5.
‘శాంతి’ ని ప్రోత్సహించేలా రెండు నినాదాలు రూపొందించండి.
జవాబు:
శాంతిని ప్రోత్సహించేలా రెండు నినాదాలు
i) యుద్ధం వద్దు – శాంతి ముద్దు
ii) ఆయుధాలు వద్దు – అభివృద్ధి ముద్దు
iii) యుద్ధం జన నష్టం – శాంతి ప్రాణ రక్షణం
iv) పోరు నష్టం – పొందు లాభం

ప్రశ్న 6.
20వ శతాబ్దాన్ని ‘తీవ్ర సంచలనాల యుగము’ అని పిలవడాన్ని సమర్థించే ఏవైనా రెండు సంఘటనలను పేర్కొనండి.
జవాబు:

  1. ఈ కాలంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు సంభవించాయి.
  2. ఇదే సమయంలో తీవ్ర ఆర్థిక మాంద్యం చోటు చేసుకున్నది.
  3. విజ్ఞాన శాస్త్రం కొత్త శిఖరాలను అందుకుంది.
  4. మొదటిసారిగా మహిళలకు ఓటుహక్కు లభించింది.

కనుక 20వ శతాబ్దాన్ని ‘తీవ్ర సంచలనాల యుగము’ అని పిలుస్తారు.

ప్రశ్న 7.
క్రింది పట్టికలోని సమాచారాన్ని ఒక బార్ గ్రాఫ్ పై చూపండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 4
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 5

ప్రశ్న 8.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, మరో ప్రపంచ యుద్ధం సంభవిస్తే జరిగే పరిణామాలను రాయండి.
జవాబు:
మరో ప్రపంచ యుద్ధం వస్తే సంభవించే పరిణామాలు

  1. అత్యధిక మరణాలు, జీవకోటికి తీవ్ర నష్టం
  2. ఆస్తుల వినాశనం
  3. పర్యావరణ కాలుష్యం పెరగడం
  4. జీవకోటి మనుగడకు కష్టం

ప్రశ్న 9.
ప్రపంచ శాంతి పరిరక్షణకు కొన్ని సూచనలు వ్రాయండి.
జవాబు:
ప్రపంచ శాంతి పరిరక్షణకు సూచనలు :

  1. అన్ని దేశాలు పరస్పరం స్నేహపూరిత సంబంధాలను సాగించాలి.
  2. ప్రతి దేశము ఇతర దేశాల హోదాను, సార్వభౌమత్వాన్ని గౌరవించాలి.
  3. దేశాలు, యుద్ధాలకు పోకుండా శాంతియుత చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలి.

ప్రశ్న 10.
మొదటి ప్రపంచయుద్ధ ఫలితాలు ఏవి?
జవాబు:
1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచయుద్ధం కొనసాగింది.
ఫలితాలు :

  1. యుద్దానికి ముఖ్య కారకుడైన జర్మన్ చక్రవర్తి రెండో కైజర్ విలియం మిత్రరాజ్యాల చేతులలో పరాజయం పొంది హాలెండ్ కు పారిపోయాడు.
  2. దాదాపు కోటి మంది చనిపోయారు. సుమారు 65 లక్షల మంది గాయపడ్డారు.
  3. జర్మనీ తన భూభాగాలనే కాకుండా సైనికబలాన్ని కూడా కోల్పోయింది.
  4. నానాజాతి సమితి ఏర్పడడానికి మొదటి ప్రపంచయుద్ధం మూలం.
  5. వర్సయిల్స్ సంధి 1919 లో నిర్వహించారు.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 11.
ఎరిక్ హాకీ బామ్ కు 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా ఎందుకు పేర్కొన్నాడు?
(లేదా)
ఇరవయ్యవ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగమని పిలవడానికి గల కారణాలను వివరించండి.
జవాబు:
చరిత్రకారుడైన ఎరిక్ హ్బా ్బమ్ కు 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నాడు.

  1. రాజకీయంగా చూస్తే ప్రపంచంలోని ఇతర ప్రజల పట్ల ద్వేషం, అవధులు లేని అధికారంతో ఫాసిజం భావజాలం తీవ్రరూపం దాలుస్తున్న క్రమంలోనే ప్రజలలో ప్రజాస్వామిక ఆకాంక్షలు చిగురులు వేశాయి.
  2. అంతటా అందరికీ అక్షరాస్యతాస్థాయి, సగటు జీవితకాలం అపారంగా పెరిగాయి.
  3. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలు స్వాతంత్ర్యం పొంది స్వేచ్ఛావాయువులు పీల్చసాగాయి.
  4. ఇది గొప్ప ప్రయోగాల కాలం కూడా.
  5. విజ్ఞానశాస్త్రం కొత్త శిఖరాలను అందుకుని పరమాణువు, జీవుల రహస్యాన్ని ఛేదించింది.

ప్రశ్న 12.
దురహంకారపూరిత జాతీయవాదం అంటే ఏమిటి?
జవాబు:

  1. 1923 నుంచి ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం రెండూ కూడా విధ్వంసకర రూపంలోని దురహంకార పూరిత జాతీయవాదాలు.
  2. జర్మనీ, ఇటలీలు ఏకీకరణ సాధించి స్వతంత్ర దేశాలుగా అవతరించాయి.
  3. ముఖ్యంగా జర్మనీలో జాత్యహంకారం పెల్లుబికింది. ఇంగ్లాండుతో జర్మనీ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
  4. ఇటలీపై ఆస్ట్రియా పాలన ఉంది. ఈ 5) బాల్కన్ దీవులలో దురాక్రమణపూరిత జాతీయవాదం, కల్లోలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.
  5. జర్మనీ నౌకాదళశక్తిని, పారిశ్రామికోత్పత్తులను విపరీతంగా పెంచుకున్నది.

ప్రశ్న 13.
రహస్య ఒప్పందాలు, కూటముల గూర్చి వివరించుము.
జవాబు:

  1. 1870లో ఫ్రాన్స్ ని ఓడించిన తరువాత జర్మనీ ఛాన్సలర్ అయిన బిస్మార్క్, ఫ్రాన్స్ ని ఒంటరిని చెయ్యాలని చూశాడు.
  2. దీనికి అనుగుణంగా అతడు ఆస్ట్రియాతో 1879 లోనూ, ఇటలీతో 1882 లోనూ రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.
  3. 1907లో రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు మూడు మిత్రదేశాల కూటమిగా ఏర్పడ్డాయి.
  4. జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ కేంద్ర రాజ్యాలకూటమిగా ఏర్పడ్డాయి.
  5. ఐరోపా దేశాలు తమ స్వాతంత్ర్యంతో పాటు వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకోడానికి రహస్య కూటములుగా ఏర్పడ్డాయి.

ప్రశ్న 14.
రెండవ ప్రపంచయుద్ధ ఫలితాలు తెలుపుము.
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం 1939 నుండి 1945 వరకు కొనసాగింది.
ఫలితాలు :

  1. అగ్ర రాజ్యంగా రష్యా అవతరించింది.
  2. సుమారు 2.2 – 2.5 కోట్ల మంది సైనికులు చనిపోయారు.
  3. బ్రిటన్, ఫ్రాన్లు తమ ప్రాబల్యాన్ని కోల్పోవటంతో ఆసియా, ఆఫ్రికా దేశాలలోని వలస రాజ్యాలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి.
  4. జర్మనీ రెండు భాగాలుగా విభజింపబడింది.
  5. సుమారు 4, 5 కోట్ల మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
  6. నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, బెల్జియంలలో ప్రజాస్వామ్య రాజ్యాలు పునః ప్రతిష్టించబడ్డాయి.
  7. ప్రపంచ శాంతికి దోహదం చేసే ఐక్యరాజ్యసమితి ఏర్పడినది.

ప్రశ్న 15
మొదటి ప్రపంచయుద్ధం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది? దాని ప్రధాన కారణాంశాలేవి?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం 1914 నుండి 1918 వరకు కొనసాగింది.

ప్రధాన కారణాలు :

  1. దురహంకారపూరిత జాతీయవాదం
  2. సామ్రాజ్యవాదం
  3. సైనికవాదం
  4. రహస్య ఒప్పందాలు
  5. ఆస్ట్రియా యువరాజైన ఫెర్డినాండ్ సతీసమేతంగా హత్య చేయబడటం
  6. జర్మనీ జాత్యహంకారం

ప్రశ్న 16.
రెండవ ప్రపంచయుద్ధ కారణాలు ఏవి?
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం 1939 – 1945 వరకు కొనసాగింది.
కారణాలు :

  1. వర్సయిల్స్ సంధిలోని అవమానకర షరతులు
  2. వివిధ దేశాల మధ్య సిద్ధాంతపర విభేదాలు
  3. సైనిక ఏర్పాట్లు
  4. నానాజాతి సమితి వైఫల్యం
  5. పోలెండ్ పై హిట్లర్ దాడి

ప్రశ్న 17.
నానాజాతి సమితి ఎందుకు విఫలమైంది?
(లేదా)
నానాజాతి సమితి వైఫల్యాలకు రెండు కారణాలు రాయండి.
జవాబు:
భవిష్యత్తులో యుద్దాలను నివారించటానికి వర్సయిల్స్ సంధి ఆలోచనలకు అనుగుణంగా 1920లో నానాజాతి సమితి ఏర్పడింది.

  1. ఈ కూటమిలో చేరటానికి రష్యా, జర్మనీలను ఆహ్వానించలేదు.
  2. కూటమి ఏర్పడటంలో అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ చురుకైన పాత్ర పోషించినప్పటికీ అతని ప్రతిపాదనను అమెరికా కాంగ్రెస్ ఆమోదించటానికి తిరస్కరించటంతో అది కూడా సభ్యత్వం పొందలేదు.
  3. అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించకుండా, ఇతర దేశాలపై దండెత్తకుండా జర్మనీ, ఇటలీలను ఇది నివారించలేక పోయింది.

ప్రశ్న 18.
సామ్రాజ్యవాదం అంటే ఏమిటి?
జవాబు:
బ్రిటన్, జర్మనీ వంటి ఐరోపా దేశాలలోనూ, అమెరికాలోనూ పారిశ్రామిక మూలధనం అభివృద్ధి పొందడంతో తమ ఉత్పత్తులకు మార్కెట్, ముడిసరుకుల అందుబాటు అవసరమయ్యాయి. సైనికశక్తిని ఉపయోగించుకొని, వలసలను స్థాపించి సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. ఇతర దేశాలలో వలసలను స్థాపించుకొని తమ రాజ్యాధికారాన్ని విస్తృత పరచుకొనుటయే సామ్రాజ్యవాదం.

ప్రశ్న 19.
మొదటి ప్రశంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి?
జవాబు:

  1. ప్రతి యుద్ధానికి దీర్ఘకాలంగా మసులుతున్న కారణాలతోపాటు తక్షణ కారణాలు ఉంటాయి.
  2. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం 1914 జూన్ 28న ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ను ఒక సెర్బియన్ ఉన్మాది హత్య చేయడం.
  3. దీనితో ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధం ప్రకటించింది.

ప్రశ్న 20.
ఆయుధ పోటీకి సంబంధించిన బార్ గ్రాఫ్ ను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
1) పై గ్రాఫ్ దేనిని సూచిస్తుంది?
జవాబు:
పై గ్రాఫ్ 1880-1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల సైనిక ఖర్చుని సూచిస్తోంది.

2) ఏ దేశాలు ఆయుధాలపై ఎక్కువ ఖర్చు పెట్టాయి?
జవాబు:
ఆయుధాలపై ఎక్కువ ఖర్చు పెట్టిన దేశాలు : జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ మొ||.

3) ఆయుధాలపై ఖర్చు ప్రతి 10 సంవత్సరాలకి ఎందుకు పెరుగుతూ పోయింది?
జవాబు:
ఆయా దేశాలు అధిక ఆయుధాలు సమకూర్చుకోవడంతో ప్రతి 10 సం||లకు ఖర్చు పెరుగుతూ పోతోంది.

4) 1914లో ఆయుధాలపై ఎంత ఖర్చు జరిగింది?
జవాబు:
1914లో ఆయుధాలపై పెట్టబడిన మొత్తం ఖర్చు : 397 మి|| పౌండ్లు.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 21.
కింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నకు జవాబు రాయండి.
ప్రపంచ యుద్ధాల కారణంగా ఎంతోమంది చనిపోయారు. గాయపడ్డారు. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు కోటిమంది. రెండవ ప్రపంచ యుద్ధంలో 2-2.5 కోట్ల మంది చనిపోయారు. చనిపోయిన వాళ్లల్లో అధిక శాతం 40 ఏళ్లలోపు పురుషులే. ఈ రెండు యుద్ధాల వల్ల మారణాయుధాల పోటీ ప్రత్యేకించి అణుబాంబులు, రసాయనిక ఆయుధాల పోటీ పెరిగింది. ఇటువంటి ఆయుధాలు ప్రమాదవశాత్తు పేలిపోయినా పూర్తి వినాశనం, మానవ నష్టం జరిగే ముప్పు కలుగుతుందనే భయంతో ప్రపంచం ఈనాటికీ జీవిస్తూ ఉంది.
ప్రశ్న : మరో ప్రపంచ యుద్ధం గనుక వస్తే అది ప్రపంచ మానవులందరికీ అత్యంత ప్రమాదకరం – వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. ప్రపంచ యుద్దాల కారణంగా ఎంతోమంది చనిపోయారు, గాయపడ్డారు.
  2. మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి మంది చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధంలో 2-2.5 కోట్ల మంది చనిపోయారు.
  3. వీరిలో అధిక శాతం 40 సం॥లలోపు పురుషులే.
  4. రెండు యుద్ధాలలో అణుబాంబులు, రసాయనిక ఆయుధాల పోటీ జరిగింది.
  5. ఇవి ప్రమాదవశాత్తు పేలినా పూర్తి వినాశనం, మానవనష్టం జరిగే ముప్పుతో ప్రపంచం నేటికీ జీవిస్తుంది.
  6. మరొక ప్రపంచ యుద్ధం వస్తే కనుక అది ప్రపంచ మానవులందరికీ ప్రమాదకరం.

10th Class Social 13th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీసిన కారణాలు ఏవి?
(లేదా)
ప్రపంచంలో సంభవించిన రెండు ప్రపంచ యుద్ధాలకు గల ప్రధాన కారణములను పేర్కొనండి.
జవాబు:
రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీసిన కారణాలు :
దురహంకారపూరిత జాతీయవాదం :
జాతీయవాదం అనే భావజాలం ఒక మంచి ప్రేరణ. అయితే ఈ భావజాలం తమపట్ల గర్వాన్ని, ఇతరులపట్ల ద్వేషాన్ని కలిగించడానికి కూడా వాడుకున్నారు. 1923 నుంచి ఇటలీ ఫాసిజం, జర్మనిలో నాజీజం రెండూ కూడా విధ్వంసకర రూపంలోని దురహంకారపూరిత జాతీయవాదాలు.

సామ్రాజ్యవాదం :
వలసల ఏర్పాటులో ఐరోపా దేశాల మధ్య ఏర్పడిన పోటీనే (ఘర్షణ) సామ్రాజ్యవాదం అనవచ్చు. కొత్త పారిశ్రామిక శక్తులు (జపాను, జర్మనీ, ఇటలీ) ఏర్పడటంతో ఇవి వలస ప్రాంతాలను తిరిగి విభజించాలని తీవ్ర ఒత్తిడులకు, తరడు యుద్ధాలకు కారణం అవుతుండేది.

ఆయుధ పోటీ :
పెద్దసంఖ్యలో ఆయజధాలు సమకూర్చుకోవటంలో ఈ దేశాలు ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. ఆయుధాలను ఉత్పత్తి బేసే పెద్ద పారిశ్రామిక సంస్థలు ఆవిర్భవించి దౌత్య సతుస్యల పరిష్కారానికి యుద్దాన్ని ఉపగించటాన్ని ప్రోత్సహించాయి.

సైనికవాదం :
భద్రతకు సైనికశక్తి మంచి మార్గమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మటాన్ని సైనికవాదం అంటారు. 1880 నుంచి 1914 నాటికి ఐరోపా ప్రధాన దేశాల సైనిక ఖర్చు మూడింతలు పెరిగింది.

రహస్య ఒప్పందాలు :
మిత్రదేశాల కూటమి, త్రైపాక్షిక కూటమి మొదలైన ఒప్పందాల వల్ల ఐరోపా దేశాలు ఒకదానినొకటి శంకించసాగాయి. ఈర్యపడసాగాయి. ఈ కూటముల వల్ల సాయుధ శాంతి, భయ వాతావరణం నెలకొన్నాయి.

వర్సెయిల్స్ ఒప్పందం :
మొదటి ప్రపంచ యుద్ధం 1919 లో వర్సయిల్స్ శాంతి సమావేశంతో ముగిసింది. జర్మనీ బలహీనపర్వతానికిగాను ఈ ఒప్పందం దాని మీద సైనిక కోతలు, భౌగోళిక పరిమితులను విధించింది. ఈ ఒప్పందం బలవంతంగా జర్మనీపై రుద్దినదిగా భావించటం జరిగింది.

నానాజాతి సమితి వైఫల్యం :
భవిష్యత్తులో యుద్ధాలను నివారించటానికి తర్పయిల్స్ ఒప్పందం నానాజాతి సమితిని ఏర్పాటు చేసింది. కానీ అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించకుండా, ఇతర దేశాల పై దండెత్తి కూడా జర్మనీ, – ఇటలీలను ఇది నివారించలేకపోయింది.

జర్మనీ ప్రతీకారేచ్ఛ :
వర్సయిల్స్ ఒప్పందం వల్ల తాము కోల్పోయిన ప్రాంతాలను తిరిగి సాధించుకోవాలని, మధ్య యూరపుపై జర్మనీ తిరిగి ఆధిపత్యం పొందాలని, జర్మనీ ఆయుధాలపై ఉన్న పరిమితులకు అంతం పలకాలని జర్మన్స్ కోరుకున్నారు.

సామ్యవాదం, ఈష్యా షట్ల భయాలు :
రష్యాలో 1917లో విప్లవం సంభవించి అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. 1924లో USSR గా మారింది. పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాలు యూరపులోని ఇతర దేశాలలో కూడా ఇలాంటి విప్లవాలే సంభవిస్తాయని భయపడి సోమియట్ సోషలిజానికి వ్యతిరేకశక్తిగా ఉంటుందని హిట్లర్, సౌజీలు బలపడటాన్ని మొదట్లో బలపరిచాయి. చివరికి బ్రిటన్, ఫ్రాన్స్ కూటమికి వ్యతిరేకంగా హిట్లర్ నిలిచాడు.

తక్షణ కారణం :
19.14లో ఆస్ట్రియా-హంగరీకి వారసుడైన రాకుమారుడిని సెర్బియతి చెందిన తీవ్రవాది హత్య 1. చేశాడు. దానితో 1914 జులై 28న సెర్బియాపై ఆస్ట్రియా దాడి చేసింది. ఈ విధంగా అందటి ప్రపంచ యుద్ధం
మొదలైంది. అలాగే 1939లో హిట్లర్ పోలాండ్ పై దండెత్తడంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 2.
ప్రపంచ యుద్ధాలకు జాతీయవాదం ఎలా దోహదపడింది?
జవాబు:

  1. జాతీయ రాజ్యాలలో జాతీయతా భావం ఒక ప్రముఖ ప్రేరేపణ.
  2. నూతన శక్తికి అంకురార్పణ.
  3. ఆధునిక రాజ్యా లు ఏర్పడడానికి, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఏకీకరణ సాధించడానికి ఇది మూలమైంది.
  4. జాతీయతా భావం ఆయా దేశాల అహంకారానికి, గర్వానికి పరాకాష్ఠ. అంతేకాకుండా ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగించడానికి కూడా ఈ దేశస్థులు జాతీయభావాన్ని ఉపయోగించుకున్నారు.
  5. ఈ ద్వేషం, అహంకారం యూరప్ లోని దేశాల మధ్య వైరం పెరగడానికి, అభద్రతాభావం ఏర్పడడానికి మూలమైంది.
  6. మరో ప్రక్క ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం రెండూ కూడా విధ్వంసకర రూపంలో దురహంకారపూరిత జాతీయవాదాన్ని రెచ్చగొట్టి, జర్మనీయే ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుందని, విజేతయై ప్రపంచాన్ని పాలిస్తుందని, పుకార్లు షికార్లు చేయించి, ప్రపంచంలోని దేశాల మధ్య ద్వేషాలు, అభద్రతాభావం పెంచి యుద్ధకాంక్షను పురిగొల్పడానికి కారణమైంది.

ప్రశ్న 3.
వర్సయిల్స్ ఒప్పందంలోని నిబంధనలు ఏవి ? రెండవ ప్రపంచ యుద్ధానికి వర్సయిల్స్ ఒప్పందం ఎంతవరకు కారణమయినదో వివరించండి.
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధం 1919లో వర్సయిల్స్ శాంతి సమావేశంతో ముగిసింది. ఓటమి పాలైన దేశాలను ఈ సమావేశానికి ఆహ్వానించకపోవడం వలన వాళ్ళ భావాలను పరిగణన లోనికి తీసుకోలేక పోయినారు. దాని వలన వర్సయిల్స్ సంధి తమ మీద బలవంతంగా రొద్దబడినదని భావించి వారి దానిని వ్యతిరేకించారు.

వర్సయిల్స్ నిబంధనలు :

  1. జర్మనీని బలహీన పరచటానికి వర్సయిల్స్ ఒప్పందం దాని మీద సైనిక కోతలను, భౌగోళిక పరిమితులను విధించినవి.
  2. ఆల్సెస్, లోరైన్లను ఫ్రాన్సుకు తిరిగి ఇచ్చివేసింది.
  3. సైనిక బలాన్ని తగ్గించుకోమని జలాంతర్గాములు ఉండకూడదని ఆరు యుద్ధ నౌకలకు సరిపోయిన నౌకాదళం మాత్రమే ఉండాలని నిర్దేశించింది.
  4. పోలిష్ కారిడార్‌ను ఏర్పాటు చేయడం ద్వారా జర్మనీని రెండు భాగాలుగా చీల్చినారు.
  5. జర్మనీ బొగ్గు, ఉక్కు వనరులను కోల్పోయింది.
  6. జర్మనీ తన చెల్లింపు సామర్థ్యానికి మించిన నష్టపరిహారాలను చెల్లించాల్సి వచ్చింది.
  7. ఆర్థికంగా, సైనికంగా వర్సెటల్స్ సంధి జర్మనీని బలహీనపరచింది.

కారణం :
వర్సయిల్స్ సంధిని జర్మనీ మరియు ఓడిపోయిన మిగతా దేశాలు చాలా అవమానకరమైన సంధిగా భావించి దానిని వ్యతిరేకించి వారు గెలిచిన వారి మీద ప్రతికారం తీర్చుకోవడాని రెండవ ప్రపంచ యుద్ధానికి సన్నద్ధమైనారు.

ఈ విధంగా వర్సయిల్స్ సంధి రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక కారణమయినది.

ప్రశ్న 4.
యూరప్ పటాన్ని పరిశీలించి వార్సా కూటమికి చెందిన రెండు దేశాలను మరియు నాటో కూటమికి చెందిన రెండు దేశాలను రాయుము.
జవాబు:

వార్సా పోల్ నాటో పోల్
పోలెండ్ U.S.A.
అల్బేనియా కెనడా
రుమేనియా బెల్జియం
బల్గేరియా డెన్మార్క్
హంగరీ ఫ్రాన్సు
మొదలైనవి మొదలైనవి పోర్చుగల్, బ్రిటన్ మొదలైనవి.

ప్రశ్న 5.
మీకియబడిన యూరప్ పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నకు జవాబు రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 6
అక్షరాజ్యాలను మరియు మిత్రరాజ్యాల జాబితాను తయారుచేయుము.
జవాబు:

కేంద్రరాజ్యా లు మిత్ర రాజ్యాలు
1) ఆస్ట్రేలియా USSR
2) జర్మనీ బ్రిటన్
3) టర్కీ రుమేనియా
4) బల్గేరియా ఫ్రాన్స్
5) ఇటలీ USA
6) జపాన్ పోలెండ్

ప్రశ్న 6.
ఈ క్రింది గ్రాను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
1880-1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్ల సైనిక ఖర్చు

1) 1914లో ప్రధాన శక్తుల సైనిక ఖర్చు ఎంత?
జవాబు:
397 మిలియన్ పౌండ్లు

2) త్రైపాక్షిక కూటమిలోని దేశాలు ఏవి?
జవాబు:
జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, ఇటలీ

3) మిత్ర రాజ్యాలు అని వేటినంటారు?
జవాబు:
గ్రేట్ బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్

4) 1880 నుండి 1914 మధ్య కాలంలో ప్రధాన రాజ్యా ల సైనిక ఖర్చు ఎన్ని రెట్లు పెరిగినది?
జవాబు:
3 రెట్లు

ప్రశ్న 7.
ప్రపంచ యుద్ధాల పరిణామాలను వర్ణించండి.
జవాబు:
ప్రపంచ యుద్ధాల పరిణామాలు :

  1. ప్రపంచ యుద్ధాల కారణంగా ఎంతోమంది చనిపోయారు మరియు గాయపడ్డారు. ఆయుధ పోటీ పెరిగింది.
  2. అధికారం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవలసిన ఆవశ్యకతను గుర్తించారు.
  3. అనేక సామ్రాజ్యాలు అంతం అయ్యాయి. వలసలు స్వాతంత్ర్యం పొందాయి.
  4. ప్రపంచశాంతి కోసం నానాజాతి సమితి, ఐక్యరాజ్యసమితి వంటి నూతన అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి.
  5. బ్రిటన్లో మహిళలకు మొదటిసారిగా ఓటుహక్కు లభించింది.

ప్రశ్న 8.
క్రింది బార్ గ్రాఫ్ ని పరిశీలించి, విశ్లేషణ చేయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 7
జవాబు:

  1. ఈ బార్ గ్రాలో రెండు పారిశ్రామిక దేశాలయిన బ్రిటన్ మరియు జర్మనీ దేశాలు తయారుచేస్తున్న ప్రేలుడు పదార్థాల గురించిన సమాచారం ఉంది.
  2. రెండు దేశాలు వివిధ శత్రుకూటములకు చెందిన దేశాలు.
  3. 1914వ సంవత్సరంలో ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి బ్రిటన్లో 4 టన్నులు మరియు జర్మనీలో 8 టన్నులు మాత్రమే.
  4. కాని ఆ సంవత్సరం నుండి ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి గణనీయంగా పెరిగినది.
  5. 1914తో పోల్చినట్లయితే ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి జర్మనీ కంటే బ్రిటన్లో చాలా తక్కువగా ఉంది.
  6. 1917వ సంవత్సరం నాటికి పరిస్థితి మొత్తం తారుమారు అయినది.
  7. బ్రిటన్లో పేలుడు పదార్థాల ఉత్పత్తి 184 టన్నులు అంటే గడచిన 4 సంవత్సరాలలో 45 రెట్లు పెరిగినది.
  8. జర్మనీలో 1914తో పోల్చితే 1917లో ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి 140 టన్నులు. అంటే 18 రెట్లు పెరిగినది అని అర్థం అవుతుంది.
  9. ఈ ప్రేలుడు పదార్థాల ఉత్పత్తి మొదటి ప్రపంచ యుద్ధంలో దేశాలు ఆర్థికంగా బాగా నష్టపోవడానికి కారణం అయ్యింది.

ప్రశ్న 9.
13వ శతాబ్దంలో సంభవించిన ప్రపంచ యుద్ధాలలో జాతీయ రాజ్యాలు, జాతీయతా భావం యుద్ధకాంక్షను ఎలా ప్రభావితం చేశాయి.
జవాబు:
జాతీయ రాజ్యాలు, జాతీయతా భావం :

  1. జాతీయతావాదం అనే భావజాలం ఒక మంచి ప్రేరేపణ. ఈ భావజాలం ఆధునిక జాతీయ రాజ్యాలు ఏర్పడడానికి, జర్మనీ, ఇటలీల ఏకీకరణకు కారణం అయింది.
  2. కానీ దీనిని తమపట్ల గర్వాన్ని ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగించడానికి ఎక్కువగా వాడారు.
  3. 19వ శతాబ్దంలో యూరప్ లోని దేశాల మధ్య ఈ ద్వేషం క్రమేపీ పెరుగుతూ వచ్చింది.
  4. ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీజం రెండూ కూడా విధ్వంసకర రూపంలోని దురహంకారపూరిత జాతీయతావాదాలు. ఇవి ఆ రెండు దేశాల ప్రజలను యూరప్ లోని ఇతర దేశాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాయి.

ప్రశ్న 10.
క్రింది గ్రాఫ్ లోని సమాచారం ఆధారంగా దిగువ ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
ప్రశ్నలు:
1) ఏ సంవత్సరంలో సైనిక వ్యయం అధికంగా వుంది? ఎందుకు?
2) ఒక దేశ అభివృద్ధిని ఆయుధపోటీ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
1) సైనిక వ్యయం అధికంగా గల సంవత్సరం : 1914
కారణం : మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభం కావడం.

2) దేశాభివృద్ధిపై ఆయుధపోటీ ప్రభావం :
a) దేశ అభివృద్ధి కుంటుపడుతుంది.
b) సంక్షేమ పథకాల అమలు కష్టతరమవుతుంది.

ప్రశ్న 11.
క్రింది గ్రాఫ్ ని పరిశీలించి, విశ్లేషణ చేయండి.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 8
జవాబు:
పైన ఇవ్వబడిన గ్రాఫ్ మొదటి ప్రపంచ యుద్ధంలో వివిధ దేశాలు చేసిన ఖర్చును గురించి వివరించారు.

ఇక్కడ జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియాహంగేరి, అమెరికా మరియు రష్యా దేశాలు చేసిన ఖర్చును వివరించారు.

పై గ్రాఫ్ ను పరిశీలించినట్లయితే జర్మనీ ఎక్కువగా 37,500 మిలియన్ పౌండ్లను ఖర్చు పెట్టగా, జపాన్ అతితక్కువగా 1000 మిలియన్ పౌండ్లను మాత్రమే ఖర్చు పెట్టింది.

ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఎక్కువ ఖర్చు చేసినా, తక్కువ ఖర్చు చేసినా అన్ని దేశాలు యుద్ధం వలన చాలా బాగా మరియు ఎక్కువగానే నష్టపోయాయి అని చెప్పవచ్చు.

1914-1918 మరియు 1939 – 1945 సంవత్సరాల మధ్య ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలకు 50 సం||రాల ముందు నుండే దేశాలు ఒకరితో ఒకరు భవిష్యత్తులో యుద్ధం వస్తే వాటి నుండి కాపాడుకోవడానికి, సైనిక, ఆర్థిక మరియు రాజకీయ పరమైన ఒప్పందాలను చేసుకోవడం కూడా జరిగింది. వీటి వలన దేశాల మధ్య శత్రుత్వం పెరిగి యుద్ధాలకు దారి తీసింది.

ప్రపంచంలో చాలా ప్రాంతాలలో తన వలస పాలన కొనసాగించిన గ్రేట్ బ్రిటన్ కూడా ఇక్కడ 36,000 మిలియన్ పౌండ్లను ఖర్చు చేసింది. పూర్వకాలంలో యుద్ధం జరిగితే ఉదా : రామాయణం మరియు మహాభారతాలను తీసుకొంటే ఎవరు యుద్ధంలో పాల్గొంటారో వారు మాత్రమే చనిపోవడం జరిగేది. కాని ప్రస్తుతం మనం వాడుతున్న రసాయనిక ఆయుధాల వలన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు ప్రభావితం అవడమే కాకుండా పర్యావరణ కాలుష్యం జరిగి మన మనుగడ అంతమయ్యే స్థితికి చేరుకుంటున్నాం.

యుద్ధాలకు ప్రధాన కారణం ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చెలాయించాలని కోరుకోవడం, నా సలహా ఏమిటంటే మనం సైన్యానికి ఆయుధాల కోసం చేసే ఖర్చుని, ప్రపంచశాంతి కోసం మరియు ప్రపంచ ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినట్లయితే, ప్రతిదేశం పేదరికాన్ని మరియు నిరుద్యోగాన్ని అనారోగ్య రుగ్మతలను ప్రపంచం నుండి పారద్రోల వచ్చును.

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 12.
ఈ క్రిందివాటిని ప్రపంచపటంలో గుర్తించుము.

  1. ఆస్ట్రియా
  2. సెర్బియా
  3. జపాన్
  4. చైనా
  5. అమెరికా
  6. రష్యా
  7. ఫ్రాన్స్
  8. ఇంగ్లండ్
  9. జర్మనీ
  10. ఇటలీ
  11. హంగేరీ
  12. టర్కీ
  13. బల్గేరియా
  14. రుమేనియా
  15. ఇండియా

AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 9

ప్రశ్న 13.
యుద్ద మరణాల గ్రాఫ్ ను పరిశీలించి, 1500 – 1999 మధ్య జరిగిన మరణాలను విశ్లేషించుము.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 1
యుద్ధ మరణాలు, మిలియన్లలో ప్రతి వెయ్యిమందికి మరణాలు
జవాబు:

  1. యుద్ధమరణాలు 1500-1999 గ్రాఫ్ ను పరిశీలిస్తే ఆందోళన కలిగించే విషయాలు విదితమవుతాయి.
  2. 1500-1599 మధ్య ప్రతి వెయ్యిమందికి చనిపోతున్న వారి సంఖ్య గమనిస్తే నలుగురు కంటే తక్కువ చనిపోయారు.
  3. 1900-1999 మధ్య మరణాలను పరిశీలిస్తే ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, మొదటి, రెండవ ప్రపంచయుద్దాల వలన ప్రతి వెయ్యిమందికి 44 మంది వరకు చనిపోవడం గమనించవచ్చు. అంటే సుమారు 4.5% ప్రజలు.
  4. అత్యాధునిక అణుబాంబులు వంటివి యుద్ధంలో ప్రయోగించడం మూలంగా, లక్షల్లో సైనికులు మరణించడం వలన ఈ విపరీత పరిణామాలు ఏర్పడ్డాయి.
  5. ఈ మరణాలకు యుద్ధ బీభత్సమే కాకుండా ఆ తర్వాత పలు వ్యాధులు సోకిన రోగులు గాయపడ్డవారు క్రమేపి మరణించడం జరిగింది.

ప్రశ్న 14.
ప్రక్క ను పరిశీలించి వివిధ దేశాల మధ్య పెరిగిన ఆయుధ పోటీని విశ్లేషించుము.
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 10
జవాబు:
ఇవ్వబడిన గ్రాఫు అధ్యయనం చేస్తే ఈ క్రింది అంశాలు తెలుస్తున్నాయి.

  1. 1880 వ సంవత్సరంలో 132 మిలియన్ పౌండ్లలో డబ్బును ప్రధాన దేశాలు ఆయుధాల తయారీకి ఉపయోగించినట్లుగా తెలుస్తుంది.
  2. 1890వ సంవత్సరంలో ఆయుధ పోటీ మూలంగా 158 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టబడిందని తెలుస్తుంది.
  3. 1900లలో 205 మిలియన్ పౌండ్లు, 1910లో 288 మిలియన్ పౌండ్లు, 1914లో 397 మిలియన్ పౌండ్లు ఆయుధాల ఉత్పత్తి కొరకు అగ్రరాజ్యాలు ఉపయోగించాయి.
  4. ఆయుధాల ఉత్పత్తిని గమనించినట్లయితే ఈ అగ్రరాజ్యాలన్నీ కూడా తమ ఆదాయంలో అధిక భాగాన్ని ఆయుధ సేకరణ కొరకు వినియోగించారని తెలుస్తుంది. తద్వారా యుద్ధాలను కోరుకున్నాయని కూడా చెప్పవచ్చు.
  5. పైగా ఈ విధంగా ఆయుధ సేకరణ పెరగడానికి ముఖ్య కారణం “తమ దగ్గర ఎంత ఎక్కువ ఆయుధ సంపత్తి ఉంటే, అంత ఎక్కువ భద్రత” అనే భావన అయి ఉండవచ్చు.

కావున 1880 నుండి 1914 వరకు ఆయుధ ఉత్పత్తి కొరకు అత్యధిక ధనాన్ని వినియోగించారని ఈ గ్రాఫ్ ద్వారా తెలుస్తున్నది.

ప్రశ్న 15.
రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ సామ్రాజ్యంలోని దేశాలను పట సహాయంతో గుర్తించుము.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 11

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

These AP 10th Class Social Studies Important Questions 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి will help students prepare well for the exams.

AP Board 10th Class Social 12th Lesson Important Questions and Answers సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social 12th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ఉత్తరాఖండ్ లో ప్రారంభమైన చిప్కో ఉద్యమ ప్రధాన లక్ష్య మేమిటి?
జవాబు:
అటవీ సంరక్షణ.

2. ‘సైలెంట్ సింగ్’ అన్న పుస్తకములోని ఇతివృత్త మేమిటి?
జవాబు:
DDT వాడకం వల్ల కలిగే ప్రభావములు.

3. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం నిషేధించిన రాష్ట్రమేది?
జవాబు:
సిక్కిం

4. ధారావి మురికివాడ ఏ నగరంలో ఉంది?
జవాబు:
ముంబయి.

5. ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడ ఏది?
జవాబు:
ధారావి.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

6. మొత్తంగా సేంద్రీయ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం ఏది?
జవాబు:
సిక్కిం

7. ‘NBA’ అనగా?
జవాబు:
నర్మదా బచావో ఆందోళన్.

8. జీవితాన్ని పూర్తిగా ఆనందించటానికి కాలుష్య రహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు 1991 సంవత్సరంలో ఇచ్చిన తీర్పు దేనికి (ఏ హక్కుకు) సంబంధించినది?
జవాబు:
జీవించే హక్కు

9. ‘జీవించే హక్కు’ను తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ ఏది?
జవాబు:
21వ ప్రకరణ.

10. చిప్కో అనే పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
హత్తుకోవడం.

11. ‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకాన్ని రచించినది ఎవరు?
జవాబు:
రాచెల్ కార్సన్.

12. ‘సైలెంట్ స్పింగ్’ పుస్తకాన్ని ఏ సంవత్సరంలో ప్రచురించారు?
జవాబు:
1962.

13. భారత సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాలు ప్రకారము ‘ప్రజా రవాణా’ వాహనాలన్నీ ఉపయోగించ వలసిన ఇంధనం ఏది?
జవాబు:
CNG (పీడనానికి గురిచేసిన సహజవాయువు)

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

14. క్రింది వానిలో తప్పుగా జతచేయబడినది గుర్తించి రాయండి.
→ సైలెంట్ వ్యాలి – కేరళ
→ సేంద్రియ రాష్ట్రం – సిక్కిం
→ నర్మదాబచావో – కర్ణాటక
→ చిప్కో – ఉత్తరాఖండ్
జవాబు:
నర్మదాబచావో – కర్ణాటక.

15. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) మొత్తంగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం.
ii) 100 శాతం సేంద్రియ రాష్ట్రంగా మారే ఇదే పంథాని ఉత్తరాఖండ్ కూడా అనుసరిస్తోంది.
పై వాక్యాలలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)

16. నర్మదా బచావో ఆందోళన్ ముఖ్య ఉద్దేశ్యమేమి?
జవాబు:
పర్యావరణ పరిరక్షణ.

17. రసాయనిక ఎరువులు, పురుగు మందులు అధికంగా, ఇష్టానుసారంగా వాడినందువల్ల కలిగే దుష్పరిణామం కానిది.
A) భూసారం తగ్గుతుంది
B) నీటి కాలుష్యం (భూగర్భజలం)
C) పంట దిగుబడి పెరుగుతుంది.
D) పర్యావరణం క్షీణతకు గురౌతుంది.
జవాబు:
C) పంట దిగుబడి పెరుగుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

18. “ప్రకృతి వనరుల దోపిడి చేయకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు” ………
ఎ) ఇది అన్యాయమైన అభిప్రాయము.
బి) ఇది అన్యాయమైన అభిప్రాయము అయినా ఇదే వాస్తవం.
సి) ఇది అన్యాయము మరియు అవాస్తవం కూడా.
డి) అభివృద్ధికే తొలి ప్రాధాన్యం, ప్రకృతి పరిరక్షణ తర్వా త.
జవాబు:
బి – ఇది అన్యాయమైన అభిప్రాయము అయినా ఇదే వాస్తవం.

19. NBA ఉద్యమానికి కారణమైన ప్రధాన ఆనకట్ట ఏది?
జవాబు:
సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్.

20. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చటానికి, పంటల దిగుబడిని పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే పంటల దిగుబడి పెంచటానికి అత్యంత పర్యావరణ హితమైన వ్యవసాయ విధానం ఏది?
జవాబు:
సేంద్రియ వ్యవసాయం (ప్రకృతి వ్యవసాయం).

21. చిప్కో ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన వారు ఎవరు?
జవాబు:
గ్రామీణ మహిళలు.

22. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాద రహితంగా మార్చే పర్యావరణ విధి ఏది?
జవాబు:
శుద్ధి చేసే విధి.

23. సుమారుగా 300 జిల్లాల్లో గత 20 సంవత్సరాలలో భూగర్భ జలాలు ఎన్ని మీటర్ల మేర పడిపోయాయి?
జవాబు:
4 మీటర్లు.

24. చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు?
జవాబు:
సుందర్లాల్ బహుగుణ.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

25. ప్రస్తుత తరం రాబోయే తరాలకు నాణ్యమైన జీవనం అందించటాన్ని ఏమంటారు?
జవాబు:
సుస్థిరాభివృద్ధి.

26. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థకు (మెదక్ జిల్లాలో) తోడ్పడిన స్వచ్చంద సంస్థ ఏది?
జవాబు:
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటి (DDS)

27. భారతదేశంలో నిషేధించిన పురుగుమందు ఏది?
జవాబు:
ఎండో సల్సాన్.

28. DDT ని విస్తరింపుము.
జవాబు:
డైక్లోరో డైఫినాల్ టైక్లోరో ఈథేన్.

29. జలసింధి గిరిజన భాష ఏది?
జవాబు:
భిలాలా.

30. ఈ భూమి మీద ఎన్నోరకాల మొక్కలు, జంతువులు మొ||న రకరకాల జీవులు ఉండటాన్ని ఏమంటారు?
జవాబు:
జీవ వైవిధ్యం

31. భారతదేశంలో వార్షిక ఆదాయం ఎంతకంటే తక్కువ ఉంటే నిమ్న వర్గాలుగా పేర్కొంటారు?
జవాబు:
₹1.5 లక్షల కంటే తక్కువ.

32. కాసర్ గోడ్ జిల్లా ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
కేరళ.

33. చిప్కో ఉద్యమం ఏ సంవత్సరంలో ఆరంభమైంది?
జవాబు:
1970.

34. భారతదేశంలోని ఎంత శాతం జిల్లాల్లో చేతి పంపులలోని నీళ్లు తాగడానికి పనికిరావు?
జవాబు:
59%

35. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) కెన్యా ( ) a)మస్సాయి
ii) ఖజకిస్తాన్ ( ) b) యుర్తా
iii) టిబెట్ ( ) c) కియాంగ్
iv) దక్షిణ అమెరికా (d) గౌచా
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

36. దక్కన్ పీఠభూమి మధ్య భాగం తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది. దీనికి ప్రధాన కారణమేమి?
జవాబు:
ఇది వర్షచ్చాయ ప్రాంతంలో ఉండటం.

37. “మానవులు అభివృద్ధి, సంతోషం పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు…….
→ A) అవునూ, మనం నేటి సంతోషాన్ని చూస్తున్నాం కాని రేపటి ఆపదను పట్టించుకోవటం లేదు.
→ B) నిజమే కానీ, అభివృద్ధి, సంతోషము తర్వాతే ఏమైనా.
→ C) ప్రకృతి సహజంగానే శుద్ధి చేసుకుంటుంది.
→ D) లేదు, అలా జరగడం లేదు.
జవాబు:
A) అవునూ, మనం నేటి సంతోషాన్ని చూస్తున్నాం కాని రేపటి ఆపదను పట్టించుకోవటం లేదు.

38. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) ధారావి ( ) a) ప్రత్యామ్నాయ ప్రజాపంపిణి
ii) జలసింధి ( ) b) సేంద్రియ వ్యవసాయము
iii) సిక్కిం ( ) c) నర్మదా బచావో
iv) జహీరాబాద్ ( ) d) మురికివాడ
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a.

39. చిప్కో ఉద్యమం గురించి సరియైన వాక్యం కానిది.
→ ఉత్తరాఖండ్ లోని గఢీవాల్ కొండలలో ఆరంభమైంది.
→ 1970 లో ప్రారంభమైంది.
→ చిప్కో అంటే హత్తుకోవడం.
→ హింసాయుత పద్ధతుల్లో చెట్లను నరికి వెయ్యటాన్ని వ్యతిరేకించారు.
జవాబు:
హింసాయుత పద్ధతుల్లో చెట్లను నరికి వెయ్యటాన్ని వ్యతిరేకించారు.

40. కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసర్‌గోడ్ జిల్లాలో ఏ రసాయనిక పురుగు మందు జీడిమామిడి తోటల పైన పిచికారి చేయటం వల్ల 5,000 మంది మరణించడంతో పాటు, చాలా మందికి అవయవ లోపాలతోపాటు క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు.
జవాబు:
(Endo Sulfan) ఎండో సల్సాన్.

41. శ్రామిక వర్గం ఎక్కువగా అవ్యవస్థీకృత రంగంలో ఉన్నప్పటికీ GDPలో పెరుగుదల దేనికి సూచిక?
జవాబు:
పెరుగుతున్న వస్తు సేవల ప్రయోజనం కొద్దిమందే పొందుతున్నారు.

42. మనం ఉపయోగించే పురుగు మందులో ఎంత శాతం పురుగుమీద ప్రభావం చూపుతుంది?
జవాబు:
1%

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

43. జలసింధి గ్రామము ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు:
మధ్య ప్రదేశ్.

44. జలసింధి గ్రామము ఏ జిల్లాలో ఉంది?
జవాబు:
ఝాబువా.

45. “గుజరాత్ లోని మైదానాల్లోకి వెళ్లండి, మీ పరిస్థితి మెరుగుపడుతుంది, మీరు అభివృద్ధి చెందుతారు” అంటూ మీరు సలహాలు ఇస్తారు. కాని మేం ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం”. ఈ వాక్యం అన్నది ఎవరు?
జవాబు:
బావా మహాలియా.

46. క్రింది వానిలో సరియైన వాక్యం/లు ఎంచుకొని రాయండి.
i) ప్రజల ఆదాయాలు అవకాశాలలో అంతరాలు సమ సమాజ నిర్మాణానికి అడ్డంకి.
ii) అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ విరుద్ధ భావనలు.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) సత్యము
B) (ii) సత్యము
C) (i) మరియు (ii) సత్యము
D) రెండూ కావు
జవాబు:
A – (i) సత్యము

47. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయ కుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవటం.
ii) ప్రస్తుత తరం యొక్క నాణ్యమైన జీవనాన్ని మాత్రమే సుస్థిర అభివృద్ధి కోరుకుంటుంది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)

48. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) విధానాలను నిర్ణయించేవాళ్ళు అధిక ఆర్థిక అభివృద్ధి, సంపన్నత సాధించిన తరువాత కాలుష్యాన్ని, పర్యావరణ క్షీణతను పరిష్కరించవచ్చని భావించారు.
ii) అభివృద్ధి చెందిన దేశాల మాదిరి మనం కూడా వృద్ధి సాధించి వనరులను, ఇంధనాన్ని వినియోగిస్తే పర్యావరణ హితంగా భూమి వినాశనాన్ని అరికట్టవచ్చు.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (1) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

క్రింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సమాధానము రాయండి.
పట్టిక : భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకం (వేల టన్నులలో)

ఖనిజం 1997-98 2008-09
బాక్సైట్ 6,108 15,250
బొగ్గు 2,97,000 4,93,000
ఇనుప ఖనిజం 75,723  2,23,544
క్రోమైట్ 1,515 3,976

49. అతి తక్కువగా వెలికి తీసిన ఖనిజాలు ఏవి?
జవాబు:
బాక్సైట్, క్రోమైట్.

50. ఖనిజాలు అధికంగా వెలికితీయటం వలన కలిగే సమస్య కానిది.
→ అటవీ నిర్మూలన → కాలుష్యం అధికమవుతుంది → భవిష్యత్తు ఖనిజాల సమస్య → పారిశ్రామికాభివృద్ధి,
జవాబు:
పారిశ్రామికాభివృద్ధి.

51. క్రింది చిత్రంను పరిశీలించి, ఇది ఏ ఉద్యమంనకు సంబంధించినదో పేర్కొనండి.
AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 2
జవాబు:
చిప్కో ఉద్యమం.

52. పర్యావరణ నేపధ్యంలో క్రింద ఇచ్చిన చిత్రానికి ఒక శీర్షిక రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 3
జవాబు:
పర్యావరణ పరిరక్షణ – మన తక్షణ కర్తవ్యం (లేదా) పర్యావరణ పరిరక్షణకై ఉద్యమం.

53. సహజ వనరులను అందించటంలో పర్యావరణ సామర్థ్యాన్ని ఏ విధంగా పిలుస్తారు ?
జవాబు:
మేథాపాట్కర్.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

54. నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు?
జవాబు:
పర్యావనరుల సరఫరా విధి.

10th Class Social 12th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సుస్థిర అభివృద్ధి అనగానేమి?
జవాబు:
భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకొనే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకుంటూ అభివృద్ధి సాధించడం.

ప్రశ్న 2.
రాచెల్ కార్సన్ పుస్తకం ‘సైలెంట్ స్ప్రింగ్’ ముఖ్య ఇతివృత్తం (Theme) ఏమిటి?
జవాబు:
దోమల నియంత్రణ కోసం డి.డి.టి. పిచికారి చెయ్యటం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి తెలియజేయడం.

ప్రశ్న 3.
భారతదేశంలో అన్నిచోట్ల అటవీ విస్తీర్ణం తగ్గిపోతున్నది. అటవీ నిర్మూలనను నిరోధించడానికి రెండు పరిష్కారాలను తెలియజేయండి.
జవాబు:
అటవీ నిర్మూలనను నిరోధించడానికి పరిష్కారాలు : –

  1. అడవుల నరికివేత నియంత్రించడం.
  2. వాల్టా చట్టాన్ని సమర్థవంతంగా అమలుపరచడం.

ప్రశ్న 4.
ఒకవేళ నీవే అడవుల నరికివేతను నివారించే అధికారివి అయివుంటే, దానికై నీవు తీసికొనే రెండు చర్యలను పేర్కొనుము.
జవాబు:
ఒక వేళ నేనే అడవుల నరికివేతను నివారించే అధికారిని అయివుంటే,

  • అటవీ చట్టాలను పకడ్బందీగా అమలుపరుస్తాను.
  • అటవీ సంరక్షణ గురించి ప్రజలను చైతన్యపరుస్తాను.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 5.
చిప్కో ఉద్యమము యొక్క ఉద్దేశ్యము తెల్పండి.
జవాబు:
చిప్కో ఉద్యమము యొక్క ఉద్దేశ్యము : అటవీ పరిరక్షణ.

ప్రశ్న 6.
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏవేని నినాదాలు వ్రాయుము.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ – నినాదాలు:

  1. పర్యావరణాన్ని కాపాడండి – ప్రపంచాన్ని కాపాడండి.
  2. మంచి పర్యావరణంతోనే – మంచి భవిష్యత్తు.

ప్రశ్న 7.
సుస్థిరాభివృద్ధి అనగా నేమి?
జవాబు:
సుస్థిరాభివృద్ధి :
సుస్థిరాభివృద్ధి అనగా భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బ తీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం.

ప్రశ్న 8.
‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకంలోని ప్రధాన అంశాన్ని తెల్పండి.
జవాబు:
దోమల నియంత్రణ కోసం డి.డి.టి. పిచికారి చెయ్యటం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి తెలియజేయడం.

ప్రశ్న 9.
ఉత్పత్తి ప్రక్రియలో సహాయపడే సహజ వనరులేవి?
జవాబు:
భూమి, నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటివి ఉత్పత్తి ప్రక్రియలో సహాయపడే సహజ వనరులు.

ప్రశ్న 10.
భూగర్భజలాల వినియోగం ఏ ఏ ప్రాంతాలలో ఎక్కువగా ఉంది?
జవాబు:
వ్యవసాయపరంగా సంపన్నంగా ఉన్న పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోను, మధ్య, దక్షిణ పీఠభూములలోని రాతి ప్రాంతాలలోనూ, కొన్ని కోస్తా ప్రాంతాలలోను, వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలలోనూ భూగర్భజలాల వినియోగం ఎక్కువగా ఉంది.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 11.
సైలెంట్ స్ప్రింగ్ (నిశ్శబ్ద వసంతం) అనే పుస్తకాన్ని రచించినదెవరు?
జవాబు:
సైలెంట్ స్ప్రింగ్ (నిశ్శబ్ద వసంతం) అనే పుస్తకాన్ని రచించింది : రాచెల్ కార్సన్ అనే మహిళ.

ప్రశ్న 12.
జలసింధి గ్రామంలో ఇళ్ళ నిర్మాణం ఎలా చేపడతారు?
జవాబు:
అడవిలో దొరికే టేకు, వెదురుతో ఇళ్ళు నిర్మించుకుంటారు. నింగోండి, హియాలీ రకం వెదురును చీల్చి తడికలు అల్లుతారు.

ప్రశ్న 13.
వ్యవసాయంలో మేలు చేసే జంతుమిత్రులు ఎవరు?
జవాబు:
జంతువులు : పాము, వానపాము, బల్లి, తొండ, ఊసరవెల్లి, ఉడుం మొ||నవి.

ప్రశ్న 14.
వ్యవసాయంలో మేలు చేసే పక్షుల మిత్రులు ఎవరు?
జవాబు:
పక్షులు :
పోలీస్ పిట్ట, గోరింక, బయోపిచ్చుక, గుడ్లగూబ, కొంగ, పాలపిట్ట.

ప్రశ్న 15.
వ్యవసాయంలో కీడుచేసే శత్రు పక్షులు, జంతువులు ఏవి?
జవాబు:
పక్షులు :
పిచ్చుక, చిలుక

జంతువులు :
ఎలుక, ఉడుత, ‘కుందేలు, మొ||నవి.

ప్రశ్న 16.
ప్రాథమికరంగ కార్యకలాపాలు ఏవి?
జవాబు:
వ్యవసాయం, గనుల తవ్వకం, చేపల పెంపకం ప్రాథమిక రంగ కార్యకలాపాలు.

ప్రశ్న 17.
ఆర్థికాభివృద్ధిలో పర్యావరణం అందించే సామర్థ్యాన్ని ఏమంటారు?
జవాబు:
వనరులను అందించటంలో పర్యావరణ సామర్థ్యాన్ని “పర్యావరణ వనరుల సరఫరా విధి” అంటాం.

ప్రశ్న 18.
పర్యావరణం నిర్వర్తించే ముఖ్య విధి ఏమిటి?
జవాబు:
వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధిచేసి, ప్రమాదరహితంగా చేయటం.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 19.
రాచెల్ కార్సన్ రాసిన పుస్తకమేది? అందులో ఏముంది?
జవాబు:
రాచెల్ కార్సన్ అన్న మహిళ “సైలెంట్ స్ప్రింగ్” (నిశ్శబ్ద వసంతం) అన్న పుస్తకం రాసింది. దోమల నియంత్రణ కోసం డిడిటి పిచికారీ చెయ్యటం వల్ల మనుష్యులపైన, పక్షుల పైనా పడే ప్రభావం గురించి వివరించింది.

ప్రశ్న 20.
ఎండోసల్ఫాన్ పురుగుమందు దుష్ఫలితాలేవి?
జవాబు:
గాలి, నీళ్ళు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాతో కలుషితమైనది. ప్రజల మీద దాని ప్రభావం ఎక్కువగా పడింది.

ప్రశ్న 21.
జలసింధి గ్రామంలో పశుసంపద ఏది?
జవాబు:
జలసింధి గ్రామంలో పశుసంపద కోళ్ళు, గొర్రెలు, ఆవులు, గేదెలు. దాదాపు ప్రతి ఒక్కరికి 10-20-40 మేకలు ఉన్నాయి.

ప్రశ్న 22.
చిప్కో ఉద్యమం ఎందుకు మొదలైంది?
జవాబు:
చెట్లు నరకటాన్ని అడ్డుకుని, గుత్తేదార్లు, కాంట్రాక్టర్ల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న గఢ్ వాల్ కొండవాసుల సంప్రదాయ అటవీ హక్కుల కోసం చిప్కో ఉద్యమం ప్రారంభమైంది.

ప్రశ్న 23.
సుస్థిర పద్ధతుల్లో ఆహార ఉత్పత్తి, దాని పంపిణీకి ఉదాహరణనిమ్ము.
జవాబు:
సుస్థిర పద్ధతుల్లో ఆహార ఉత్పత్తి, దాని సమాన పంపిణీకి చక్కని ఉదాహరణ ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ. దీనిని . తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతంలో ప్రజాబృందాలు చేపట్టాయి.

ప్రశ్న 24.
ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చేపట్టే కార్యక్రమాలు ఏవి?
జవాబు:
వర్షాధార భూములను సాగులోకి తేవడం, పంట బయట అమ్మకుండా గ్రామస్థాయిలో ప్రజాధాన్య బ్యాంకు ప్రారంభించడం, ప్రజాపంపిణీ వ్యవస్థ మాదిరి పనిచేయడం ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చేపట్టే కార్యక్రమాలు.

ప్రశ్న 25.
హరిత విప్లవం ద్వారా ఏ ఏ పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు?
జవాబు:
హరిత విప్లవం ద్వారా గోధుమ, వరికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పంటల ఆహారధాన్యాలే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌకధరల దుకాణాలలో లభించేవి.

ప్రశ్న 26.
మిశ్రమ పంటల వలన లాభమేమి?
జవాబు:
మిశ్రమ పంటల వల్ల ఒక పురుగు తీవ్ర నష్టం కలిగించే స్థాయికి చేరకుండా నిరోధింపబడుతుంది. సాగుచేసే పంటల నేలకి, మనుషులకు, పశువులకు సమతుల పోషకాహారాన్ని ఇచ్చేలా ఎంపిక చేస్తారు.

ప్రశ్న 27.
సేంద్రియ వ్యవసాయం వల్ల లాభమేమి?
జవాబు:
సేంద్రియ వ్యవసాయం వల్ల జీవవైవిధ్యం పెరుగుతుంది. ఒకటి, రెండు పంటలే కాకుండా అనేక పంటలను సాగుచెయ్యవచ్చు. హానికరమైన పురుగులను తినే జీవులను ప్రోత్సహించడం కూడా సాధ్యమవుతుంది.

ప్రశ్న 28.
ప్రాథమిక హక్కులలోని జీవించే హక్కు ఏమి చెబుతుంది?
జవాబు:
ప్రాథమిక హక్కులలోని జీవించే హక్కు జీవితాన్ని పూర్తిగా ఆనందించటానికి కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ప్రశ్న 29.
అభివృద్ధికి కొలబద్దలుగా వేటిని పరిగణిస్తారు?
జవాబు:
అభివృద్ధికి కొలబద్దగా తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తులకంటే మానవ అభివృద్ధి సూచిక మెరుగైనది.

ప్రశ్న 30.
HDI అనగానేమి?
జవాబు:
HDI : Human Development Index (మానవ అభివృద్ధి సూచిక).

ప్రశ్న 31.
భూగర్భజలాల పునరుద్ధరణ అనగానేమి?
జవాబు:
భూమిలోనికి ఇంకిపోయిన నీటిని తోడుకోవడానికి వీలుగా చేయడాన్ని ‘భూగర్భజలాల పునరుద్ధరణ’ అంటారు. దీనికి ఎక్కువగా వర్షం సహకరిస్తుంది.

10th Class Social 12th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల త్రవ్వకమును సూచించు పట్టికను పరిశీలించండి.
పట్టిక : ఖనిజాల త్రవ్వకం (వేల టన్నులలో)

ఖనిజం 1997-98 2008-09
బాక్సైట్ 6,108 15,250
బొగ్గు 2,97,000 4,93,000
ఇనుప ఖనిజం 75,723  2,23,544
క్రోమైట్ 1,515 3,976

పై పట్టికను పరిశీలించి, గనుల త్రవ్వకము వేగంగా అభివృద్ధి చెందటం వల్ల పర్యావరణానికి ఏ విధమైన నష్టము జరుగుతుందో విశ్లేషించండి.
జవాబు:

  1. ఖనిజాలు అధికంగా వెలికితీయటం వలన అనేక పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతాయి.
  2. ఉష్ణోగ్రతలు పెరిగి మనుషులకు సమస్యలు ఏర్పడతాయి.
  3. అటవీ ప్రాంతాలు, వివిధ జంతువులు, పక్షులు, జీవరాసులు నశిస్తాయి.
  4. కాలుష్యం అధికమవుతుంది.
  5. మృత్తికా క్రమక్షయం జరిగి జలాశయాలలో ఇసుక మేట వేయడం జరుగుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 2.
పర్యావరణ పరిరక్షణను గురించి ప్రజలను చైతన్య పరచడానికి రెండు నినాదాలు రాయండి.
జవాబు:
“పర్యావరణాన్ని కాపాడితే – ప్రపంచాన్ని కాపాడినట్లే”
“చెట్లను రక్షించండి – కాలుష్యాన్ని నివారించండి.”
“భూమిని రక్షించండి – మీ జీవితాన్ని కాపాడుకోండి.”

ప్రశ్న 3.
ఒక దేశ అభివృద్ధిలో పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేయుము.
జవాబు:
ఒక దేశ అభివృద్ధిలో పర్యావరణ ప్రాముఖ్యత :

  1. భూమి, నీరు, ఖనిజాలు వంటి సహజ వనరుల లభ్యత.
  2. చెట్లు, పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు.
  3. ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ రంగాలు సహజ వనరులు మీద ఆధారపడి ఉంటాయి.
  4. వాతావరణ కాలుష్యం దేశ అభివృద్ధికి నిరోధకంగా ఉంటుంది.

ప్రశ్న 4.
సేంద్రీయ వ్యవసాయం జీవవైవిధ్యాన్ని ఎలా పెంపొందింస్తుందో తెలపండి.
జవాబు:

  1. సేంద్రీయ వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందులను వినియోగించరు.
  2. పర్యావరణానికి అనుకూలంగా ఉండే వ్యవసాయ పద్ధతులను పాటిస్తారు.
  3. పంట మార్పిడి, కంపోస్టు వినియోగము, స్థానికవనరులను వినియోగించడం వంటి పద్ధతులను పాటిస్తారు.
  4. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి.

ప్రశ్న 5.
నేటి కాలంలో సుస్థిరాభివృద్ధిపై దృష్టి నిలపవలసిన అవసరమెందుకు ఏర్పడింది?
జవాబు:

  • ప్రస్తుత, భవిష్యత్ తరాల అవసరాలు తీర్చడం
  • ప్రస్తుత, రాబోయే తరాలకు నాణ్యమైన జీవనాన్ని అందించడం
  • భూసార సంరక్షణ
  • నీటి కాలుష్యం కాకుండా చూడడం
  • పరిశ్రమలు వెదజల్లే విషవాయువుల నియంత్రణ

ప్రశ్న 6.
‘సుస్థిర అభివృద్ధి’ ప్రాముఖ్యతపై కరపత్రం తయారు చేయండి.
జవాబు:
సుస్థిర అభివృద్ధి’ ప్రాముఖ్యతపై కరపత్రం

భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చటమే సుస్థిర అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు కేవలం మన కొరకే కాదు భవిష్యత్తు తరాల వారికీ అవసరం. ప్రస్తుత అభివృద్ధి భావన ఆ విధంగా ఉండటం లేదు.

ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ పేరుతో ప్రకృతి వనరులను ధ్వంసం చేసే తీరు చూస్తోంటే రాబోయే తరాలు తమ అవసరాలకై ఎన్ని ఇబ్బందులకు గురవుతారో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. సహజ వనరులైన నీరు, గాలి, నేల మొదలైన వాటిని ఉపయోగించుకొనే హక్కు అన్ని తరాలకూ వుంటుంది. మనం దీనిని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించకుండా వనరులను, ఇంధనాన్ని విచక్షణా రహితంగా వినియోగిస్తున్నాము.

సహజ వనరులు మనకు ఏ మేరకు అవసరమో ఆ మేరకే వినియోగించాలి. ఈ భావన ప్రజలందరిలో విస్తృతంగా వ్యాపించాలి. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి వల్ల అనేక రంగాలలో ఇప్పటికే మనం వ్యతిరేక పరిణామాలను చవిచూస్తున్నాం. పర్యావరణంపై ఆధారపడి అనేక వేల సమూహాలు నివసిస్తున్నాయి. పర్యావరణాన్ని విధ్వంసం చెయ్యటమంటే ఈ సమూహాలను మట్టు పెట్టడమే.

కావున ప్రభుత్వం ఈ విషయమై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. పర్యావరణానికి హాని తలపెట్టేవారిపై, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రగతితోపాటు పర్యావరణ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. పేదరికం నుండి బయటపడటానికి పర్యావరణరీత్యా సుస్థిర మార్గాన్ని కనుగొనాలి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి, సమానతతో కూడిన సుస్థిర అభివృద్ధి భావన సఫలమయ్యే విధంగా తగిన చర్యలు చేపట్టడం ఆవశ్యకం.

ప్రశ్న 7.
పర్యావరణ ‘వనరుల సరఫరా విధి’ మరియు ‘శుద్ధి చేసే విధి’ ల మధ్య తేడా తెల్పండి.
జవాబు:
పర్యావరణ ‘వనరుల సరఫరా విధి’ మరియు ‘శుద్ధి చేసే విధి’ ల మధ్య గల తేడా :

పర్యావరణ ‘వనరుల సరఫరా విధి’:
సహజవనరులను అందించడంలో పర్యావరణమునకు గల సామర్థ్యాన్ని “పర్యావరణ వనరుల సరఫరా విధి” అంటారు. పర్యావరణ శుద్ధి చేసే విధి : కాలుష్యాన్ని గ్రహించి ప్రమాదరహితంగా మార్చడంలో పర్యావరణమునకు గల సామర్థ్యాన్ని పర్యావరణ శుద్ధిచేసే విధి అంటారు.

ప్రశ్న 8.
సహజ వనరులను వేగంగా సంగ్రహించడం భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? వివరించండి.
జవాబు:
సహజ వనరులను వేగంగా సంగ్రహించడం వల్ల భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలపై కలిగే ప్రభావం :

  1. సహజ వనరులను పరిమితికి మించి వినియోగించడం మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం వంటిది.
  2. అది భవిష్యత్ అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుంది.
  3. పునరుద్ధరించడానికి సాధ్యంకాని సహజవనరులను ఒక్కసారి పూర్తిగా వాడేస్తే భవిష్యత్తు తరాలకు జీవించడమే అసాధ్యమవుతుంది.
  4. సహజవనరులను కొల్లగొట్టడం ద్వారా చేసే అభివృద్ధి మారువేషంలో ఉన్న విధ్వంసమే అని చెప్పవచ్చు.

ప్రశ్న 9.
సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ కరపత్రము తయారు చేయండి.
జవాబు:
సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయంగా వర్ణించవచ్చు.

సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, జీవుల వివిధ దశలను మరియు నేలలో గల సూక్ష్మజీవుల పనితనాన్ని వృద్ధి పరుస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని విస్మరిస్తూ సేద్య, జీవ సంబంధ మరియు యాంత్రిక పద్ధతులతో F.A.O., W.H.D., పరిధి ప్రాప్తికి వ్యవసాయం చేయుటకు అవకాశం కల్పిస్తుంది.

సేంద్రియ వ్యవసాయం వలన మనకు చాలా లాభాలు ఉన్నాయి.

  1. నేల సంరక్షించబడుతుంది.
  2. అతి తక్కువ లోతులో దుక్కి చేయగలము. దీని వలన సూక్ష్మజీవులు, ప్లవకాల సంఖ్య (ఫోరా, ఫానా) ఎక్కువగా ఉంటుంది.
  3. మిశ్రమ పంటలు : దీని వలన పురుగుల తాకిడిని తగ్గించగలము.
  4. పంటమార్పిడి : దీని వలన నేలను ఆరోగ్యంగా ఉంచగలము. సూక్ష్మజీవులు సహజసిద్ధంగా పనిచేయుటకు దోహదపడుతుంది.
  5. సేంద్రియ పదార్థములను పునరుత్పత్తి చేయగలము. కావున ప్రభుత్వము ప్రజలను సేంద్రియ వ్యవసాయ పద్ధతులు

వైపు ప్రోత్సహించవలెను. సేంద్రియ వ్యవసాయం వలన ప్రజలలో ప్రబలుతున్న రోగాలను నిరోధించవచ్చును. ప్రజలకు పౌష్టిక ఆహారాన్ని అందించగలము.

ముగింపు :
ప్రస్తుతం వ్యవసాయదారులు లాభాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ దిగుబడి కోసం కొన్ని రకాలైన రసాయనిక విధానాలను అనుసరించడం వలన నేల సారాన్ని కోల్పోవడమే కాకుండా వారు పర్యావరణాన్ని కాలుష్యానికి గురిచేస్తూ వారు అనారోగ్యం పాలవుతున్నారు.

నా విజ్ఞప్తి ఏమిటంటే వ్యవసాయదారులు అందరూ సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తే మన సమాజానికి, దేశానికి చాలా మేలు చేసినవారు అవుతారు.
కాపీల సంఖ్య : 2500
” ప్రచురణ కర్త :
సంక్షేమ సంస్థ

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 10.
ముఖ్యమైన పర్యావరణ సమస్యలేవి?
జవాబు:
కాలానుగుణంగా మానవ వినియోగంలో మార్పు వల్ల పర్యావరణపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం.

  1. పురుగుమందుల వినియోగం
  2. శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం
  3. వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వినియోగం
  4. భూగర్భజలాలు తరిగిపోవడం
  5. కాలుష్యం పెరుగుతుండడం
  6. శీతోష్ణస్థితిలో మార్పు

ప్రశ్న 11.
పర్యావరణం నిర్వర్తించే అతి ముఖ్యమైన విధి ఏది?
జవాబు:
పర్యావరణం నిర్వర్తించే ముఖ్యమైన విధి ఏమనగా, వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే. వ్యర్థాలను శుద్ధిచేసి, ప్రమాదరహితంగా చేయటం. ఉత్పత్తి, వినియోగాలలో నిరుపయోగమైన ఉప ఉత్పత్తులు, ఉదాహరణకు ఇంజన్ల నుండి వెలువడే పొగ, శుభ్రం చెయ్యటానికి ఉపయోగించిన నీళ్ళు, పారేసిన అట్టపెట్టెలు, వస్తువులు వంటి వాటిని పర్యావరణం శుభ్రం చేస్తుంది.

ప్రశ్న 12.
దోమల నియంత్రణ కోసం డిడిటి పురుగుమందు కలిగించే అనర్థాలు ఏవి?
జవాబు:
డిడిటి పురుగుమందులోని భారలోహాలు పర్యావరణంలో కరిగిపోకుండా జీవులలో పేరుకునిపోతాయి. డిడిటి ఉన్న నీళ్ళు చెరువులలోకి చేరి కలుషితం చేసినప్పుడు డిడిటి లోని విషపదార్థం ఆ చెరువుల్లోని చేపల్లో పేరుకోవటం మొదలవుతుంది. ఆ ఈ విష మోతాదు తక్కువగా ఉండి చేపలు చనిపోవు. కానీ ఒక పక్షి అనేక చేపలను తిన్నప్పుడు వాటన్నిటిలో ఉండే అధిక విషమోతాదు ఆ పక్షిని చంపటానికి కారణమవుతుంది.

ప్రశ్న 13.
జలసింధి గ్రామంలో ప్రజలు పండించే పంటలేవి?
జవాబు:
జలసింధి గ్రామంలో ప్రజలు వారి యొక్క శ్రమతోనే వ్యవసాయం చేస్తారు. పశువుల నుంచి వచ్చే ఎరువునే వాడి నాణ్యమైన విత్తనాలను వాడుతారు. వీరికి ప్రధాన ఆహారం మొక్కజొన్న, వారి యొక్క అటవీ భూమిలో సజ్జలు, జొన్నలు, శనగలు, మిటికెలు, మినుములు, నువ్వులు, పల్లీలు పండిస్తారు.

ప్రశ్న 14.
జలసింధి గిరిజన గ్రామం యొక్క ఆరాధ్య దేవతలు ఎవరు? వారు జరుపుకొనే పండుగలు ఏవి?
జవాబు:
జలసింధి గిరిజన గ్రామంలో వారి యొక్క పూర్వీకులు చనిపోయిన తర్వాత ఒక పెద్దరాతిని పెట్టి వారి జ్ఞాపకార్థం పూర్వీకులను పూజిస్తారు.

కాలో రానో, రాజా పాంతో, ఇంది రాజాలను పూజిస్తారు. ఆయి ఖాడా, భేడు బాయిని కూడా పూజిస్తారు. రాణి కాజోల్ వారి పెద్ద దేవత. ఇందల్, దివస, ధివాలి వంటి పండుగలు జరుపుకోటానికి అందరూ ఉత్సాహం చూపుతారు.

ప్రశ్న 15.
బావా మహాలియా ఆవేదనను క్లుప్తంగా రాయండి.
జవాబు:
బావా మహాలియా జలసింధి గ్రామ గిరిజన నాయకుడు. సర్దార్ సరోవర్ ఆనకట్ట వలన తమ గ్రామం ముంపునకు గురవుతుందని భావించి, ఆవేదనతో ముఖ్యమంత్రికి ఉత్తరం ద్వారా వివరిస్తూ, అడవే తమకు ఆధారమని, అడవిలోని ప్రతి చెట్టు, పొద, మొక్క పేరు తెలుసని, వాటి ఉపయోగాలు కూడా తెలుసంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కష్టాన్నే నమ్ముకొని, శ్రమ ద్వారా వ్యవసాయం చేసి, సంప్రదాయ ఆచారాలకు విలువనిస్తూ జంతువులతో మచ్చిక చేసుకొని, అడవితో కలిసిపోయామని ఆవేదన చెందాడు.

ప్రశ్న 16.
సేంద్రియ వ్యవసాయం గూర్చి రాయండి.
జవాబు:
వ్యవసాయ రంగంలో సేంద్రియ పద్దతులు సారవంతమైనవి. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులను వినియోగించరు. ఇందుకు బదులుగా పంటమార్పిడి, పెంటపోగు ఎరువు పురుగుల జైవిక నియంత్రణ వంటి సహజ పద్దతులను అవలంబిస్తారు. ఈ విధానంలో ముఖ్యమైన లక్షణం స్థానిక వనరులను వినియోగించటం, మిత్ర, కీటకాలను రక్షించడం.

ప్రశ్న 17.
రసాయనిక పురుగుల మందు పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వివరించండి.
జవాబు:

  1. రసాయనిక పురుగుల మందు వినియోగం పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
  2. ఒక స్థాయిని మించిన విషపదార్థాలను పర్యావరణం జీర్ణించుకోలేదు.
  3. పురుగుల మందులలోని భారలోహాలు పర్యావరణంలో కరిగిపోకుండా జీవులలో పేరుకొనిపోతాయి.
  4. గాలి, నీళ్ళు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాతో ప్రభావితమైన ఘటన కేరళలోని కాసర్ గోలో జరిగింది.

ప్రశ్న 18.
భారతదేశంలో శతకోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద (బిలియన్ రూ॥లలో) గ్రాఫ్ రూపంలో వివరించుము.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 4
భారతదేశంలో శతకోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద (బిలియన్ రూ||లలో)

ప్రశ్న 19.
భారతదేశంలో శతకోటీశ్వరుల (బిలియనీర్ల) సంఖ్య పెరుగుదలను సూచించే గ్రాఫ్ గీయండి.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 5
భారతదేశంలో శతకోటీశ్వరులు (బిలియనీర్ల) సంఖ్య పెరుగుదల

ప్రశ్న 20.
అభివృద్ధికి కొలబద్దగా మానవ అభివృద్ధి సూచికను (HDI) తీసుకోవడం ఎంతవరకు సమంజసం?
జవాబు:

  1. అభివృద్ధికి కొలబద్దగా తలసరి ఆదాయం , స్థూల జాతీయోత్పత్తి కంటే మానవాభివృద్ధి సూచిక మెరుగైనది.
  2. ఉత్పత్తి, ఆదాయాలు వేగంగా పెరుగుతున్నప్పటికీ అధిక శాతం ప్రజలు పోషకాహార లోపంతోనూ, విద్యా, వైద్య సదుపాయాలు అందని పరిస్థితులు ఉంటున్నాయి.
  3. అయితే అభివృద్ధిలో సామాజిక సూచికలైన విద్య, వైద్యం వంటివి చోటుచేసుకొనేలా మానవ అభివృద్ధి సూచిక చూస్తుంది.

ప్రశ్న 21.
‘పర్యావరణ వనరుల సరఫరా విధి’ గురించి వివరించండి.
జవాబు:

  1. ఉత్పత్తి ప్రక్రియలో భూమి, నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటి సహజవనరులు ఎంతో ముఖ్య మైనవి.
  2. వ్యవసాయం, గనుల తవ్వకం వంటి ప్రాథమికరంగ కార్యకలాపాల్లోనే కాకుండా తయారీ, ఇంధన రంగాలలో కూడా సహజ వనరుల మీద ఉత్పత్తి ప్రధానంగా ఆధారపడి ఉంది.
  3. ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలు కూడా వివిధ స్థాయిలలో సహజ వనరుల మీద ఆధారపడి ఉన్నాయి.
  4. ఈ వనరులను అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని ‘పర్యావరణ వనరుల సరఫరా విధి’ అంటారు.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 22.
తక్కువ ఆదాయం వచ్చేవారి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు స్థూల జాతీయోత్పత్తి పెరుగుతూ ఉండడం అంటే పెరుగుతున్న వస్తువులు, సేవలవల్ల కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని అర్థం. దీనిని చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, సేవల విలువను GDP సూచిస్తుంది.
  2. అయితే అభివృద్ధిని కేవలం వస్తువులు, సేవల ఉత్పత్తికే పరిమితం చెయ్యలేం.
  3. ఉత్పత్తి, ఆదాయాలు పెరిగినపుడు కూడా తక్కువ ఆదాయం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే దానివల్ల వారు ప్రయోజనం పొందలేదని అర్థం.
  4. అయితే పెరిగిన స్థూల జాతీయోత్పత్తి వల్ల కొద్దిమందే ప్రయోజనం పొందితే అది హర్షణీయం కాదు.

ప్రశ్న 23.
శుద్ధిచేయు విధి అనగానేమి?
జవాబు:
పర్యావరణం నిర్వర్తించే వాటిలో ఒక విధిని శుద్ధిచేయు విధి అంటారు.

వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధిచేసి, ప్రమాదరహితంగా చేయటం. ఉత్పత్తి వినియోగాలలో నిరుపయోగమైన ఉప ఉత్పత్తులు – ఉదాహరణకు ఇంజన్ల నుండి వెలువడే పొగ, శుభ్రం చెయ్యటానికి ఉపయోగించిన నీళ్ళు, పారేసిన పనికిరాని అట్టపెట్టెలు, వస్తువులు వంటి వాటిని పర్యావరణం శుభ్రం చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విధి. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని, ‘శుద్ధిచేయు విధి’ అని అంటారు.

10th Class Social 12th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది గ్రాఫ్ చిత్రపటమును పరిశీలించండి.
AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 1
భారతదేశంలోని సమాజ అంతరాలను గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. భారతదేశంలో 30 లక్షల కుటుంబాలకు ఆదాయం 17 లక్షలకు పైగా ఉంది.
  2. 3 కోట్ల 10 లక్షల కుటుంబాలకు ఆదాయం 3.4 లక్షల రూపాయల నుండి 17 లక్షల రూపాయల వరకు ఉంది.
  3. 7 కోట్ల 10 లక్షల కుటుంబాలకు ఆదాయం 1.5 లక్షల నుండి 3.4 లక్షల రూపాయల మధ్య ఉంది.
  4. 13 కోట్ల 50 లక్షల కుటుంబాలకు ఆదాయం 1.5 లక్షల కంటే తక్కువగా ఉంది.
  5. మనదేశంలో 90% పైగా ప్రజలు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు.
  6. పై చిత్రాన్ని పరిశీలిస్తే ధనికులు మరింత ధనవంతులుగానూ, పేదవారు మరింత పేదవారుగానూ మారుతున్నారు.
  7. ఆదాయంలోనూ, సంపదలోనూ మరియు అవకాశాలలోనూ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
  8. ఈ ఆదాయ అసమానతలు సమసమాజానికి అవరోధంగా ఉన్నాయి.

ప్రశ్న 2.
ఈ క్రింది పేరా చదివి నీ అభిప్రాయం రాయుము.
స్థానిక పర్యావరణం నుండి నిర్వాసితులు కావటం వల్ల నష్టపోయేది ప్రజలు ఒక్కరే కాదన్నది ముఖ్యంగా గుర్తించాలి. ప్రజలతోపాటు సాంప్రదాయ జ్ఞానం మాయమైపోతుంది. సుసంపన్నమైన పర్యావరణ జీవ వైవిధ్యత అంతరించిపోతుంది.
జవాబు:
నిర్మించిన ఆనకట్టలలోకెల్లా సర్దార్ సరోవర్ అతి పెద్దది. దీనివల్ల 37,000 హెక్టార్ల అడవి, వ్యవసాయ భూమి ముంపునకు గురి అవుతుంది. అయిదు లక్షలకు పైగా ప్రజలు దీనివల్ల నిర్వాసితులు అవుతున్నారు. భారతదేశంలోని అత్యంత సారవంతమైన నేలలు దీనివల్ల నాశనం అవుతాయి. వేలాది ఎకరాలలో అటవీ ప్రాంతం, వ్యవసాయ భూమి ముంపునకు గురికావటం వలన జీవ వైవిధ్యత మానవ జీవితాలు ధ్వంసం అయ్యాయి. నిర్వాసితులలో ఎక్కువ శాతం ఆదివాసీలు, దళితులు.

పర్యావరణం అందుబాటులో ఉన్నప్పుడు దానినుంచి వాళ్ళ అనేక అవసరాలు తీరతాయి. అదే లేకపోతే వీటికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.

నిర్వాసితులైనందువల్ల పర్యావరణం అందుబాటులో లేకుండా పోయినా, లేదా అది కలుషితమైనా, విధ్వంసమైనా ‘ ఎక్కువగా నష్టపోయేది పేదవాళ్ళే. పర్యావరణం, సుస్థిరత అన్న అంశాలు సమానత అన్న అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయి.

ప్రశ్న 3.
ప్రజల జీవనశైలి పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ? పర్యావరణ పరిరక్షణకై నీవు ఏ సూచనలు ఇస్తావు?
జవాబు:

  1. అత్యంత ఆనందంగా జీవితాన్ని గడపడానికి ప్రస్తుతకాలంలో మానవుడు ప్రయత్నిస్తున్నాడు.
  2. కనీసం బజారు నుండి కూరగాయలు తీసుకురావడానికి కూడా తన చేతిలో గుడ్డ సంచిని తీసుకుని వెళ్ళకుండా దుకాణదారులు ఇచ్చే ప్లాస్టిక్ సంచిని వాడుతున్నాడు.
  3. ప్లాస్టికను అతిగా ఉపయోగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది.
  4. వాహనాలు, ఎ.సి.లు, ఫ్రిట్లు మొదలగు వాటి వినియోగం పెరగడం వలన వాటి నుండి వెలువడే విషవాయువులు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి.
  5. అడవుల నరికివేత, రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం ఎక్కువై భూమి, నీరు, గాలి కలుషితమవుతున్నాయి.

పర్యావరణ పరిరక్షణకు సూచనలు :

  1. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి.
  2. తక్కువ దూరాలకు సైకిళ్ళను ఉపయోగించడం.
  3. రసాయన ఎరువుల, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులను వాడడం.
  4. చెట్లను పెంచడాన్ని ప్రోత్సహించాలి.

ప్రశ్న 4.
ఈ పట్టికను పరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయుము.

భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకంలో పెరుగుదల (వేల టన్నులలో)
ఖనిజం 1997-98 2008-09
బాక్సెట్ 6,108 15,250
బొగ్గు 2,97,000 4,93,000
ఇనుప ఖనిజం 75,723 2,23,544
క్రోమైట్ 1,515 3,976

a) పై పట్టికలోని వివరాలు దేనిని తెలియజేస్తాయి?
b) ఇతర ఖనిజాలతో పోల్చినప్పుడు ఏ ఖనిజము యొక్క వెలికితీత 2008-09 నాటికి రెండింతల కన్నా ఎక్కువ కాలేదు?
C) గనుల తవ్వకం పెరగడానికి కారణాలేమై ఉంటాయి?
d) గనుల తవ్వకం వేగంగా వృద్ధి చెందటం వల్ల పర్యావరణానికి, మనుషులకు ఏ విధమైన నష్టాలు జరుగుతాయి?
జవాబు:
a) పై పట్టికలోని వివరాలు భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకంలోని పెరుగుదలను తెలియజేస్తాయి.
b) ఇతర ఖనిజాలతో పోల్చితే ‘బొగ్గు’ యొక్క వెలికితీత 2008-09 నాటికి రెండింతల కన్నా ఎక్కువ కాలేదు.

c) గనుల తవ్వకం పెరగడానికి కారణాలు :

  • పరిశ్రమల సంఖ్య విరివిగా పెరగటం.
  • గనుల తవ్వకంలో యంత్రాల వాడకం.
  • వినియోగం పెరగడం, జనాభా పెరగడం వల్ల వస్తువుల వినియోగం పెరగడం.
  • మానవులు సంపాదనకై (దురాశ) అర్రులు చాస్తు ఖనిజాలను విపరీతంగా తవ్వి పారేస్తున్నారు.

d) గనులు వేగంగా తవ్వటం వల్ల నష్టాలు :

  • అడవులు అంతరించిపోయి పర్యావరణం దెబ్బతింటుంది.
  • నదుల ప్రవాహ దిశ మారటం, ఫలితంగా తరచుగా వరదలు రావటం సంభవిస్తాయి.
  • ఖనిజ వనరులు భవిష్య తరాలకు మిగలవు. తత్ఫలితంగా ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాలి. విదేశీ మారక ద్రవ్యం ఖర్చయిపోతుంది.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 5.
మీ ప్రాంతంలోని పర్యావరణ సమస్యలపై మీ జిల్లా కలెక్టర్‌కు ఉత్తరం రాయుము.
జవాబు:

సింగ్ నగర్,
విజయవాడ.
తేదీ : 9 సెప్టెంబర్, 20xx.

గౌరవనీయులైన కలెక్టరు గారికి,
నా పేరు ……………….. నేను సింగ్ నగర్ లో నివసిస్తున్నాను. మా ప్రాంతంలో ఉన్న పర్యావరణ సమస్యల గురించి మీకు తెలియపరుస్తున్నాను.

మా ప్రాంతంలో వలస కూలీల సంఖ్య పెరిగింది. వారు వారి అవసరాలు తీర్చుకోవడానికి నగరానికి వచ్చి ఇక్కడ క్రొత్త సమస్యలను సృష్టిస్తున్నారు. నీటి సరఫరా కొరత, మురికివాడల పెరుగుదల, వ్యర్థ పదార్థాలను రోడ్ల మీద పడవేయడం వల్ల రవాణా మరియు కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటుంది. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ రోడ్లమీద వదలివేయడం, వాటిని తిన్న చాలా జంతువులు మరణించాయి. చెత్తాచెదారం పెరిగింది. దానిని సరిగా శుభ్రం చేయడం లేదు. భయంకరమైన దుర్గంధం వెలువడుతుంది. ఇవి వివిధ రకాల రోగాలకు కారణమవుతున్నాయి.

నేను చేసుకునే విన్నపం ఏమిటంటే వీటిని బాగుచేయించటంతోపాటు కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలు ఊరికి దూరంగా ఏర్పాటుచేయడం వలన మరియు కాలుష్యానికి కారణం అవుతున్న వాహనాలను కూడా నిలిపివేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

మీయందు విధేయత గల,
……………………………………….

చిరునామా:
జిల్లా కలెక్టర్,
విజయవాడ.

ప్రశ్న 6.
వ్యవసాయంలో జీవవైవిధ్యత భారతీయ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెల్పుము.
జవాబు:
వ్యవసాయంలో జీవవైవిధ్యత భారతీయ రైతులకు ఈ క్రింది విధంగా ఉపయోగపడుతుంది.

వ్యవసాయ రంగంలో సేంద్రీయ రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులను వినియోగించరు. ఇందుకు బదులుగా పంటమార్పిడి, పెంట పోగు ఎరువు, పురుగుల జైవిక నియంత్రణ వంటి సహజ పద్దతులను వీళ్ళు అవలంబిస్తారు. సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యమైన ఒక లక్షణం లైనిక వనరులను వినియోగించటం. ఉదాహరణకు హానికరమైన పురుగులను తినే జీవులను అనగా పక్షులు, సాలీళ్ళు, మేలుచేసే పురుగులను ప్రోత్సహించటం, పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే నేలలోని సూక్ష్మజీవులను అనగా రైజోబియం, అజటోబాక్టర్ వంటి వాటిని పెంపొందించటం. కృత్రిమ రసాయనక పదార్థాల వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గిస్తారు. అలాగే ఒకటి రెండు పంటలు మాత్రమే కాకుండా అనేక పంటలను సాగుచెయ్యటం వల్ల, జీవవైవిధ్యత పెరుగుతుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులలో సాధించిన ఉత్పత్తిని ఈ పద్ధతులలోనూ పొందవచ్చు.

ప్రశ్న 7.
“అభివృద్ధిని సాధించడంలో పర్యావరణ అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి” – వివరించండి.
జవాబు:

  1. అభివృద్ధిని సాధించడంలో పర్యావరణ అంశాలను తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి.
  2. అభివృద్ధిని సాధించే క్రమంలో వనరులను అతివేగంగా వినియోగించడం వలన పర్యావరణ వనరుల సరఫరా విధి దెబ్బతింటుంది.
  3. ఎక్కువ మోతాదులో వ్యర్థ పదార్థాలు ఉత్పన్నమవుతూ ఉండడం వలన పర్యావరణానికి దీర్ఘకాల నష్టం కలుగుతుంది.
  4. భారీ ప్రాజెక్టుల వలన జీవవైవిధ్యతకి హాని కలుగుతుంది.
  5. ఆధునిక వ్యవసాయంలో భాగంగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగుమందులు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి.
  6. పారిశ్రామికాభివృద్ధిలో ఉపయోగిస్తున్న ఇంధనం, వాయుకాలుష్యానికి దారితీస్తుంది.
  7. భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి.
  8. అడవులు నరికివేయబడుతున్నాయి.
  9. నిమ్న ఆదాయ దేశాల, భవిష్యత్ తరాల హక్కులని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

ప్రశ్న 8.
క్రింది పేరాగ్రాఫ్ ను చదివి, అర్ధం చేసుకొని, దానిపై మీ అభిప్రాయం రాయండి.
పారిశ్రామికీకరణ వల్ల కొంతమందికి అనేక వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీని ఫలితంగా ప్రపంచ సహజ వనరులు అంతరించి పోతున్నాయి. వాతావరణం కూడా అతలాకుతలమయిపోతుంది. ఈ రకమైన వృద్ధి ఎంతో కాలం కొనసాగలేదు.
జవాబు:
పారిశ్రామికీకరణ ఫలితంగా మానవుడు సుఖజీవనం సాగించడానికి ఎన్నో వస్తువులు, సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. మానవుడు గనుల తవ్వకం ద్వారా వచ్చిన లోహాలతో గుండుసూది మొదలు విమానం వరకు ఆవిష్కరించాడు. అయితే మానవునికి దూరదృష్టి లేని కారణంగా ఖనిజాలు వేగంగా అంతరించిపోతున్నాయి. మానవుని అత్యాశ ఫలితంగా సహజ వనరులు, ఖనిజాలు, శిలాజ ఇంధనాలు తరిగిపోతున్నాయి. ఈ వనరులను అధికంగా వినియోగించడం వల్ల వాతావరణం పెను మార్పులకు గురవుతూ అతలాకుతలమవుతోంది.

ఆర్థిక అభివృద్ధిని సాధించే క్రమంలో పారిశ్రామికీకరణ పేరిట పర్యావరణ వనరులను ఇంతకుముందు కనీవినీ ఎరుగని రీతులలో ఉపయోగిస్తూ నాశనం చేస్తున్నారు. అడవులను నరికివేస్తున్నారు. నేల కోతకు గురవుతోంది. భూగర్భజలాలు తరిగిపోతున్నాయి. కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. ఇంకా ఇతర పర్యావరణ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ రకమైన వృద్ధి ఎంతోకాలం కొనసాగలేదు. ఇది సుస్థిర అభివృద్ధికి విరుద్ధమైనది. పారిశ్రామికంగా ముందంజ వేస్తూనే పర్యావరణ పరిరక్షణ చేయడం మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 9.
మన జీవితాలు అనేక విధాలుగా పర్యావరణంపై ఆధారపడి ఉన్నాయి. వివరించండి.
జవాబు:
మన జీవితాలు అనేక విధాలుగా పర్యావరణంపై ఆధారపడి ఉన్నాయి.

  • మానవుడు అత్యంత ఆవశ్యకమైన ఆహారం, ప్రాణవాయువు (0) ఆవాసం కొరకు ఎల్లప్పుడు పర్యావరణం పైనే ఆధారపడి ఉండాల్సి ఉంటుంది.
  • పేదరికాన్ని తగ్గించటానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటానికి, అధిక GDP ని సాధించటానికి ప్రకృతి వనరులనే ఎక్కువగా వినియోగించాల్సి ఉంది.
  • పారిశ్రామికాభివృద్ధికై మనం గనుల త్రవ్వకం, అడవుల నిర్మూలన, వాతావరణ కాలుష్యం తప్పనిసరియైంది.
  • వ్యవసాయాభివృద్ధికి, అధిక దిగుబడులకుగాను (హరిత విప్లవం) రసాయన ఎరువులు, పురుగు మందులు విరివిగా వాడుతూ భూ, జల కాలుష్యం చేస్తున్నాం.
  • ఈ విధంగా దేశ, మానవ అభివృద్ధి నెపంతో పర్యావరణంపై విపరీతంగా ఆధారపడిపోతూ, పర్యావరణానికి అత్యంత నష్టం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నాం.

కాబట్టి

  • విరివిగా చెట్లను పెంచడాన్ని ప్రోత్సహించాలి, చెట్లను నరకడాన్ని నేరంగా ప్రకటించాలి. ఆ ప్లాస్టిక్ వినియోగాన్ని మానివెయ్యాలి, గుడ్డ, జూట్ సంచులు వాడాలి.
  • రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంను తగ్గించి సేంద్రియ ఎరువులు (ప్రకృతి వ్యవసాయం) వాడాలి.
  • వాహనాలు, ఎ.సిలు, ఫ్రిజ్ ల వాడకం అత్యంత కనిష్ఠంగా వాడాలి.

ప్రశ్న 10.
చిప్కో ఉద్యమం గూర్చి రాయుము.
జవాబు:
చిప్కో ఉద్యమం ఉత్తరాఖండ్ లోని గడవాల్ కొండలలో ఛమోలి జిల్లాలోని గోపేశ్వర్ పట్టణంలో ఒకానొక శుభోదయాన ప్రారంభమైంది. ఇది ఒక పర్యావరణ ఉద్యమం. అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఆయా అడవులు ప్రత్యక్షంగా ఆహారం, కట్టెపుల్లలు, పశువుల మేత ఇవ్వటమే కాకుండా పరోక్షంగా నేల, నీటి వనరులను సుస్థిరపరచటంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. వ్యాపారం, పరిశ్రమల కోసం అడవులను నరకటం తీవ్రరూపం దాల్చటంతో తమ జీవనోపాధులను కాపాడుకోడానికి అహింసా పద్ధతులలో వ్యతిరేకించాలని ప్రజలు చిప్కో ఉద్యమం చేపట్టారు. ‘చిప్కో’ అంటే హత్తుకోవడం (కౌగిలించుకోవడం). చెట్లను పల్లెవాసులు హత్తుకొని కాంట్రాక్టర్లు, గుత్తేదార్ల గొడ్డళ్ళకు అడ్డుగా నిలిచారు. ఈ ఉద్యమంలో ‘గౌరీదేవి’ అను మహిళ నాయకత్వంలో మహిళలు ప్రధానపాత్ర పోషించారు.

ప్రశ్న 11.
ఆర్థిక అభివృద్ధిని సాధించే క్రమంలో పర్యావరణ పరంగా, సామాజికంగా ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించవచ్చని పాలకులు భావించారు?
జవాబు:
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో పేదరికం ఉంది కాబట్టి ఆర్థికాభివృద్ధి అవసరమని పాలకులు భావించారు. పర్యావరణ పరంగా ఎన్ని విపరీత పరిణామాలున్నా అభివృద్ధి మాత్రం తప్పనిసరి తలచారు. పేదరికాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటానికి, ఆధునిక పరిశ్రమలలోనూ, స్థూల జాతీయోత్పత్తిలోను అభివృద్ధి సాధించడం అవసరమనే నిశ్చయానికి వచ్చారు. అధిక ఆర్థికాభివృద్ధి, సంపన్నత సాధించిన తరువాత కాలుష్యాన్ని, పర్యావరణ క్షీణతను పరిష్కరించవచ్చని ఆశించారు. డబ్బు ఖర్చు చేసి నదులను, గాలిని శుభ్రపరచవచ్చని, సీసాలలోని నీళ్ళు త్రాగవచ్చని, ఇంధనాన్ని పొదుపుగా వినియోగించే వాహనాలను రూపొందించవచ్చని పాలకులు భావించారు.

ప్రశ్న 12.
అధిక ఆర్థికాభివృద్ధి, సంపన్నత పేరుతో జరిగే పర్యావరణ నష్టాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ఆర్థిక అభివృద్ధి, సంపన్నత, పారిశ్రామికీకరణ పేరుతో పర్యావరణం తీవ్ర క్షీణతకు గురైంది. వనరులను, ఇంధనాన్ని వినియోగించి, పర్యావరణాన్ని కలుషితం చేయడం వలన భూమి వినాశనానికి లోనైంది. పర్యావరణానికి జరిగిన హానిని తిరిగి సరిదిద్దగల స్థితిలో మనం లేం. జరిగిన నష్టాన్ని పర్యావరణం తనంతట తాను సరిచేసుకుంటుందన్న భావన సరైంది కాదు. భవిష్యత్తు తరాలు జరిగిన నష్టాన్ని సరిదిద్దగలిగినా ఇప్పుడు చేసిన కాలుష్యాన్ని తొలగించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. భూగర్భజలాలు, రసాయనిక పురుగుమందుల సమస్యలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు.

ప్రశ్న 13.
భారతదేశంలో భూగర్భజల వినియోగంలో జరిగే విపరీత పరిణామాలను వివరించుము.
జవాబు:
మన దేశంలో భూగర్భజల వనరులను అధికంగా వినియోగించడం వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్నాం. మన దేశంలో మూడవ వంతు ప్రాంతంలో భూగర్భజలాల పునరుద్దరణకంటే ఆ నీటి వినియోగం ఎక్కువగా ఉంది. సుమారుగా 300 జిల్లాల్లో గత 20 సంవత్సరాలలో భూగర్భజలాలు 4 మీటర్ల మేర పడిపోయాయి. ప్రస్తుతం భూగర్భజలాలు కొన్ని – వందల అడుగుల లోతుకు వెళ్ళిపోయాయి. దీనినిబట్టి భూగర్భ నీటిని చాలా ఎక్కువగా వాడుకుంటున్నామని తెలుస్తుంది. పీఠభూములలోని రాతి ప్రాంతాలలోనూ, కొన్ని కోస్తా ప్రాంతాలలోనూ, వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలలోనూ భూగర్భజలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. భూగర్భజలాలు తగ్గిపోవడమే కాదు. వాటి నాణ్యత కూడా తగ్గిపోతున్నది. మన దేశంలో 59% జిల్లాల్లో చేతి పంపులలోని నీళ్ళు తాగటానికి పనికిరావు.

ప్రశ్న 14.
భారతదేశంలో నర్మదాలోయ అభివృద్ధి పథకం వలన జరిగే పర్యావరణ సమస్యలేవి?
జవాబు:
ప్రపంచంలోని అతి పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులలో ఇది ఒకటి. మన దేశంలో నర్మదా లోయ అభివృద్ధి పథకం అతి పెద్ద ఆనకట్ట. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి వసతి, వరదల నియంత్రణ వంటి ప్రయోజనాలున్నా పర్యావరణ పరంగా.. ఎదురయ్యే సమస్యలే ఎక్కువ. అవి:

  1. ఈ ప్రాజెక్టులోని 3000 పెదా, చిన్నా ఆనకట్టల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం ఎంతో ఎక్కువ.
  2. నిర్మించిన ఆనకట్టలలో కెల్లా సర్దార్ సరోవర్ అతిపెద్దది.
  3. దీనివల్ల 37,000 హెక్టార్ల అడవి, వ్యవసాయ భూమి ముంపునకు గురి అవుతుంది.
  4. 5 లక్షలకు పైగా ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు.
  5. జీవవైవిధ్యం, మానవ జీవితాలు ధ్వంసం అయ్యాయి.
  6. నిర్వాసితులైన వాళ్ళలో అధిక శాతం ఆదివాసీలు, దళితులు.

AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 15.
ఈ క్రింది వాటిని భారతదేశ పటంలో గుర్తించుము.
1) ముంబయి.
2) హైదరాబాద్
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్
5) తమిళనాడు
6) కేరళ
7) పంజాబ్
8) ఉత్తరప్రదేశ్
9) నర్మదానది
10) సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్
11) ఆంధ్రప్రదేశ్
12) ఢిల్లీ
AP 10th Class Social Important Questions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 7

ప్రాజెక్టు

సేంద్రియ వ్యవసాయం నేపథ్యంలో మీరు పెంటపోగు ఎరువు గురించి చదివారు. మీ బడిలో, ఇంటి దగ్గర ప్రయత్నించటానికి తేలికైన పద్ధతి ఇదిగో :
* ఒక పెద్ద పాత్ర తీసుకుని అధికంగా ఉన్న నీళ్లు పోవటానికి కింద భాగంలో రంధ్రాలు చెయ్యండి.
* కొబ్బరి పీచు ఒక పొర వేయండి. అధికంగా ఉన్న నీళ్లు పోటానికి ఇది దోహదం చేస్తుంది.
* ఒక పలచటి మట్టి పొరతో దీనిని కప్పండి.
* కూరగాయల పొట్టు ఇతర వ్యర్థ పదార్థాలను ఒక పొర లాగా వెయ్యండి.
* మరొక పొర మట్టి వెయ్యండి.
* కూరగాయల వ్యర్థాలను మళ్లీ పొరలాగా వెయ్యండి.
* మట్టితో కప్పుండి.
* వారం రోజుల తరువాత దీంట్లోకి వానపాములను ప్రవేశ పెట్టండి.
* ఇది కుళ్లిన తరువాత మీ తోటలో కావలసిన మొక్కలు పెంచటానికి ఈ మట్టిని ఉపయోగించండి.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

These AP 10th Class Social Studies Important Questions 11th Lesson ఆహార భద్రత will help students prepare well for the exams.

AP Board 10th Class Social 11th Lesson Important Questions and Answers ఆహార భద్రత

10th Class Social 11th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ప్రభుత్వము ఆహార ధాన్యాల నిల్వకోసం, ప్రధానంగా గోధుమలు, బియ్యం దేని ద్వారా సేకరిస్తుంది?
జవాబు:
FCI

2. కనీస మద్దతు ధరను ఎవరు నిర్ణయిస్తారు?
జవాబు:
ప్రభుత్వం

3. పోషకాహార సమస్యను అధిగమించుటకై పాఠశాలల్లో అమలవుతున్న పథకం ఏది?
జవాబు:
మధ్యాహ్న భోజన పథకం.

4. రోజుకు పట్టణ ప్రాంత ప్రజలు తీసుకోవలసిన ఆహారంలో కేలరీలు ఎన్ని?
జవాబు:
2100 కేలరీలు.

5. రోజుకు గ్రామీణ ప్రాంత ప్రజలు తీసుకోవలసిన ఆహారంలో కేలరీలు ఎన్ని?
జవాబు:
2400 కేలరీఅం.

6. అంత్యోదయ కార్డు కుటుంబాలకు, నెలకు కుటుంబానికి ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తారు?
జవాబు:
35 కిలోలు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

7. జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరంలో చేసారు?
జవాబు:
2013.

8. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఆహార ఉత్పత్తులను సరఫరా చేయునది.
జవాబు:
ప్రజాపంపిణీ వ్యవస్థ.

9. 2018 – జాతీయ ఆహార భద్రత చట్టం ప్రజల యొక్క ఏ హక్కుకు చట్టబద్ధత కల్పిస్తోంది?
జవాబు:
ఆహారం పొందే హక్కు

10. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు పరచిన మొదటి రాష్ట్రం ఏది?
జవాబు:
తమిళనాడు.

11. జాతీయ పోషకాహార సంస నెలకొని ఉన్న ప్రదేశం ఏది?
జవాబు:
హైద్రాబాద్.

12. 1943 – 45 సంవత్సరాలలో ఏ రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఏర్పడింది?
జవాబు:
బెంగాల్.

13. (సంవత్సరంలో లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు + జనాభా) / 365 =?
జవాబు:
తలసరి ఆహార ధాన్యాల లభ్యత.

14. తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎక్కువగా కలిగి ఉన్న దేశం ఏది?
జవాబు:
అమెరికా.

15. జొన్న, సజ్జ, రాగి, గోధుమలలో చిరు లేదా తృణ ధాన్యం కానిది ఏది?
జవాబు:
గోధుమ.

16. ఏ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని అధ్యయనాలు తెల్పుతున్నాయి?
జవాబు:
తమిళనాడు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

17. ఆహార ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించు ధర నేమంటారు?
జవాబు:
కనీస మద్దతు ధర.

18. అంగన్ వాడీకి వచ్చే పిల్లల వయసు ఏ సంవత్సరాల మధ్య ఉంటుంది?
జవాబు:
1- 6 సంవత్సరాలు

19. ప్రపంచంలో కెల్లా అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం ఏ దేశంలో అమలవుతుంది?
జవాబు:
భారత్ లో

20. భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో ఎంత శాతం ప్రజలు కేలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకుంటున్నారు?
జవాబు:
80%

21. ఆహార ధాన్యాల దిగుబడి పెంచటం కోసం చేపట్టిన కార్యక్రమంను ఏమన్నారు?
జవాబు:
హరిత విప్లవం.

22. భారతదేశంలో ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం బియ్యం, ఎంత శాతం గోధుమలు చౌకధరల దుకాణాల నుంచి కొనుగోలు చేస్తున్నారు, వరుసగా………
జవాబు:
39%, 28%

23. BMI ని విస్తరింపుము
జవాబు:
శరీర బరువు సూచిక (బాడీ మాస్ ఇండెక్స్)

24. FCI ని విస్తరింపుము.
జవాబు:
భారత ఆహార సంస్థ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)

25. MSP ని విస్తరింపుము
జవాబు:
కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రెస్)

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

26. PDSని విస్తరింపుము.
జవాబు:
ప్రజా పంపిణీ వ్యవస్థ. (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్)

27. ఆరోగ్యవంతుని BMI (సాధారణ BMI )ఎంత?
జవాబు:
18.5.

28. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి మొత్తం మీద ఎంత శాతం పిల్లల్లో ఉంది?
జవాబు:
16%.

29. BMI 25 కంటే ఎక్కువ ఉంటే ఎలా పరిగణిస్తారు?
జవాబు:
ఊబకాయం

30. రోజుకు ప్రతి వ్యక్తి 300 మి.లీ. పాలు తీసుకోవలసి ఉండగా ఎన్ని మి. లీ. మాత్రమే లభ్యత ఉంది?
జవాబు:
210 మి.లీ.

31. సంవత్సరంలో ప్రతి వ్యక్తి 180 గ్రుడ్లు తీసుకోవలసి ఉండగా ఎన్ని లభ్యత ఉన్నాయి?
జవాబు:
30

32. పురుషులలో తీవ్ర శక్తిలోపం ఎంత శాతం, ఊబకాయం ఎంత శాతంగా ఉంది?
జవాబు:
35%, 10%.

33. మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఎంత శాతం, ఊబకాయం ఎంత శాతంగా ఉంది?
జవాబు:
35%, 14%

34. సగటున ప్రతి వ్యక్తికి, ప్రతిరోజూ లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు =?
జవాబు:
(సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహారధాన్యాలు ÷ జనాభా) / 365.

35. ఒక టన్నుకి ఎన్ని కిలోలు?
జవాబు:
1000 కిలోలు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

36. అందరిలో శారీరక శ్రమ, కష్టమైన పనులు చేసేది ఏ ప్రాంతవాసులు?
జవాబు:
గ్రామీణ ప్రాంత వాసులు.

37. భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా కొని నిల్వచేసే ఆహార ధాన్యాలను ఏవిధంగా పిలుస్తారు?
జవాబు:
బఫర్ నిల్వలు.

38. శారీరక ఎదుగుదలకు, కణజాల పునరుద్దరణ కోసం దోహదం చేసేవి ఏవి?
జవాబు:
చిక్కుళ్ళు, పప్పులు, మాంసం, గ్రుడ్లు.

39. 3 – 5 సంవత్సరాల పిల్లల్లో తక్కువ బరువు ఉన్న పిల్లలు గుజరాత్ రాష్ట్రంలో ఎంత శాతం మంది ఉన్నారు?
జవాబు:
58%

40. 3 – 5 సంవత్సరాల పిల్లల్లో తక్కువ బరువు ఉన్న పిల్లలు కేరళ రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఎంత శాతం మంది కేరళలో ఉన్నారు?
జవాబు:
24%

41. వయోజనులైన స్త్రీ, పురుషులలో పోషకాహార స్థాయిని దేనితో కొలుస్తారు?
జవాబు:
శరీర బరువు సూచికతో.

42. మహిళలలో భారతదేశంలోని ఒడిశా, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, కేరళ ఏ రాష్ట్రంలో అధికశక్తి లోపం ఉన్న మహిళలు తక్కువగా ఉన్నారు?
జవాబు:
కేరళ.

43. తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో యూరప్ లో లభ్యతలో ఉన్నది ఎంత?
జవాబు:
200 గ్రా||లు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

44. కింది వాక్యాలను పరిగణించండి.
i) రోజుకు పట్టణ ప్రాంతాల్లో 2100 కాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.
ii) కాలరీల వినియోగం 1983 తో పోలిస్తే 2004
నాటికి పెరిగింది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
A – (i) మాత్రమే

45. 2010-11 సంవత్సరంలో హెక్టారుకు ‘వరి’ దిగుబడి ఎన్ని కిలోలు?
జవాబు:
2250 కిలోలు.

46. 2010 – 11 సంవత్సరంలో హెక్టారుకు ‘గోధుమ’ దిగుబడి ఎన్ని కిలోలు?
జవాబు:
3000 కిలోలు.

47.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 1
జవాబు:
శరీర బరువు సూచిక (BMI)

48. హరిత విప్లవం వలన బాగా దిగుబడి పెరిగిన పంట ఏది.
జవాబు:
గోధుమ.

49. ప్రజా పంపిణీ వ్యవస్థలో అత్యంత పేదలకు ఇవ్వబడిన కార్డు ఏది?
జవాబు:
అంత్యోదయ కార్డు.

50. ICDS ను విస్తరింపుము.
జవాబు:
సమగ్ర శిశు సంక్షేమాభివృద్ధి సంస్థ.

51. పోషకాహార స్థాయిని సూచించే ప్రమాణం ఏది?
జవాబు:
BMI

52. భారత దేశంలో సగటున ప్రతి వ్యక్తికి రోజుకు అందుబాటులో ఉన్న కూరగాయలు?
జవాబు:
58 గ్రా.

53. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమూల్ డైరీ కలదు?
జవాబు:
గుజరాత్

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

54. క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి.
→ ఆహార ధాన్యాల ఉత్పత్తి – హరిత విప్లవం.
→ ఆహార ధాన్యాల తలసరి లభ్యత – ఆహార ధాన్యాల లభ్యత + జనాభా.
→ ఆహార ధాన్యాల అందుబాటు – ప్రజా పంపిణీ వ్యవస్థ.
→ బఫర్ నిల్వలు – జాతీయ పోషకాహార సంస్థ.
జవాబు:
బఫర్ నిల్వలు – జాతీయ పోషకాహార సంస్థ.

55. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి రాయండి.
→ MSP – కనీస మద్దతు ధర.
→ FCI – ప్రపంచ ఆహార సంస్థ.
→ BMI – శరీర బరువు సూచిక.
→ PDS – ప్రజా పంపిణీ వ్యవస్థ.
జవాబు:
FCI – ప్రపంచ ఆహార సంస్థ.

56. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) మాంసకృత్తులు ( ) a) పప్పుదినుసులు
ii) పిండి పదార్థాలు ( ) b) గోధుమలు, బియ్యం
iii) విటమిన్లు ( ) c) పళ్లు, మొలకలు
iv) ఖనిజ లవణాలు ( ) d) ఆకుకూరలు
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

57. క్రింది వానిని సరిగా జతపరచండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 2
జవాబు:
i – c, ii – d, iii – b, iv – a

క్రింది ను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానము రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 3

58. గ్రామీణ భారతంలో అట్టడుగు వర్గం వారు (కింది విభాగం) అతి తక్కువ కాలరీలు తీసుకోవటానికి కారణమేమి?
జవాబు:
వారి ఆదాయం తక్కువగా ఉండటం (కొనుగోలు శక్తి – తక్కువగా ఉండటం)

59. క్రింది గ్రాను చదివి, ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానము రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 4
ప్ర. ప్రజలు తమ ఆహార ధాన్యాల అవసరంలో అధిక భాగం ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు?
జవాబు:
రిటైల్ మార్కెట్లో

60. ప్రజా పంపిణీ వ్యవస్థ అద్వాన్నంగా ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
బీహార్.

ఇచ్చిన గ్రాఫ్ ను పరిశీలించి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానమును రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 5

61. ఆహార ధాన్యాల ఉత్పత్తి ధోరణి ఎలా ఉంది?
జవాబు:
పెరుగుతుంది.

62. ఏ ఆహార ధాన్యం ఉత్పత్తి తక్కువగా ఉంది?
జవాబు:
జొన్న

63. 1970 – 2011 కాలంలో ఏ పంట ఉత్పత్తి పెరగక పోగా తగ్గింది?
జవాబు:
నూనెగింజలు.

64. ఈ 40 ఏళ్ళ కాలంలో ఉత్పత్తి వేగంగా పెరిగిన ఆహార పంట ఏది?
జవాబు:
వరి.

క్రింద ఇవ్వబడిన పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు సరియైన జవాబులు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 6

65. ఇవ్వబడిన పట్టికలో ‘A’ అనే అక్షర స్థానంలో ఉండాల్సిన విలువను లెక్కించండి.
జవాబు:
481 గ్రాములు.

66. ఇవ్వబడిన పట్టికలో ‘B’ అనే అక్షర స్థానంలో ఉండాల్సిన విలువను లెక్కించండి.
జవాబు:
219.5

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

67. ఇవ్వబడిన (ను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సమాధానము రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 7
ప్ర. గోధుమ ఉత్పత్తి అనూహ్యంగా పెరగటానికి కారణ మేమిటి?
జవాబు:
హరిత విప్లవం.

10th Class Social 11th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కనీస మద్దతు ధర అనగానేమి?
జవాబు:
ఆహార ధాన్యాలను ప్రభుత్వం కొనుగోలు చేయు (ముందుగా ప్రకటించిన) ధర. ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరానికి MSP ప్రకటిస్తుంది.

ప్రశ్న 2.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టడానికి గల కారణమేమిటి?
జవాబు:

  1. అక్షరాస్యతను పెంచడం.
  2. ఎక్కువమంది బాలబాలికలు పాఠశాలల్లో వారి పేరు నమోదు చేసుకునేలాగా చూడటం.
  3. పేదవారికి, పిల్లలకు కనీసం ఒక్కపూట అయినా పౌష్టిక ఆహారం అందేలా చూడటానికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు.

ప్రశ్న 3.
పిల్లల్లో పౌష్టికాహార లోపాల పరిష్కారానికి నీవు సూచించే రెండు మార్గాలేవి?
జవాబు:

  1. ప్రతిరోజూ పిల్లలకు పాలు, పండ్లు, గుడ్లు తమ ఆహారంలో ఇవ్వడం.
  2. పిల్లలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచటం.

ప్రశ్న 4.
FCI విస్తరించుము.
జవాబు:
Food Corporation of India (భారత ఆహార సంస్థ).

ప్రశ్న 5.
ఆహార భద్రత అమలయ్యేలా చూడటంలో భారత న్యాయ వ్యవస్థ కూడా చురుకైన పాత్ర పోషించడంతో దీనివల్ల పిల్లలకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతున్నాయి?
జవాబు:

  1. పిల్లలకు పౌష్టికాహారం లభించుచున్నది.
  2. మధ్యాహ్నభోజనం పాఠశాలల్లో అమలు చేయడం వలన వారు పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చి విద్య నేర్చుకోగలుగుతున్నారు.

ప్రశ్న 6.
విటమిన్లు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలకు రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
పళ్ళు, ఆకుకూరలు, మొలకలు, ముడి బియ్యం వంటి ఆహార పదార్థాలలో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 7.
పోషక ఆహార ధాన్యాలకు రెండు ఉదాహరణలు వ్రాయుము.
జవాబు:
జొన్న, రాగి, సజ్జ మొదలైనవి.

ప్రశ్న 8.
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఏర్పడిన (1943-45) కరవు ఏ ప్రాంతంలో ఏర్పడింది?
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1943-45 సం||రాలలో ‘బెంగాల్’లో అతి పెద్ద కరవు పరిస్థితి ఏర్పడింది.

ప్రశ్న 9.
భారతదేశంలో వరి, గోధుమలను పండిస్తున్న విధానం సురక్షిత పద్ధతేనా? ఎందుకని?
జవాబు:
అధిక దిగుబడుల కోసం అనుసరిస్తున్న విధానం సురక్షిత, సుస్థిర పద్ధతి కాదని శాస్త్రజ్ఞులు, వ్యవసాయరంగ వ్యక్తులు భావిస్తున్నారు. ఈ పద్ధతులవల్ల నేల క్షీణతకు గురయ్యింది, భూగర్భజల వనరులు అంతరించిపోతున్నాయి.

ప్రశ్న 10.
2010-11 సం||రంలో హెక్టారుకు వరి దిగుబడి ఎన్ని కిలోలు?
జవాబు:
2250 కిలోలు.

ప్రశ్న 11.
2010-11 సం||రంలో హెక్టారుకు గోధుమల దిగుబడి ఎన్ని కిలోలు?
జవాబు:
3000 కిలోలు.

ప్రశ్న 12.
సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలను ఎలా అంచనా వేస్తారు?
జవాబు:
సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు = సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి (ఉత్పత్తి – విత్తనం, దాణా, వృథా) + నికర దిగుమతులు (దిగుమతులు – ఎగుమతులు) – ప్రభుత్వ నిల్వలలో తేడా (సంవత్సరం ముగిసే నాటికి ఉన్న నిల్వలు – సంవత్సరం ఆరంభం నాటికి ఉన్న నిల్వలు).

ప్రశ్న 13.
తలసరి ఆహార ధాన్యాల లభ్యత అనగానేమి?
జవాబు:
సగటున ప్రతి వ్యక్తికి, ప్రతిరోజూ లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలను తలసరి ఆహార ధాన్యాల లభ్యత అంటారు.

ప్రశ్న 14.
తలసరి ఆహార ధాన్యాల లభ్యతను ఎలా అంచనా వేస్తారు?
జవాబు:
తలసరి ఆహార ధాన్యాల లభ్యత (ప్రతిరోజు) = (సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు + జనాభా )/365.

ప్రశ్న 15.
2011 సంవత్సరంలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎంతగా ఉంది?
జవాబు:
2011 సంవత్సరంలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఒక రోజుకు 500 గ్రాములు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 16.
ప్రధాన ఆహార ధాన్యాలకు రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
వరి, గోధుమ.

ప్రశ్న 17.
చిరు లేదా తృణ ధాన్యాలకు ఉదాహరణలిమ్ము.
జవాబు:
చిరు లేదా తృణ ధాన్యాలకు ఉదాహరణలు : జొన్న, రాగి, సజ్జ మొదలగునవి.

ప్రశ్న 18.
ప్రస్తుతం పోషక ధాన్యాలుగా వేటిని వ్యవహరిస్తున్నారు?
జవాబు:
చిరు లేదా తృణ ధాన్యాలను పోషకధాన్యాలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రశ్న 19.
ఆహార పదార్థాల ఉత్పత్తి చేపట్టటానికి రైతులకు ఏ రూపంలో మద్దతు అవసరం?
జవాబు:
ఆహార పదార్థాల ఉత్పత్తి చేపట్టటానికి రైతులకు ఉత్పాదకాలు, మార్కెట్ అవకాశాల రూపంలో మద్దతు అవసరం.

ప్రశ్న 20.
భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు ఎన్ని గ్రాముల కూరగాయలు, పళ్లు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచించారు?
జవాబు:
భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు వరుసగా 300 గ్రా||ల కూరగాయలు, 100 గ్రా||ల పళ్లు తీసుకోవాలని సూచించారు.

ప్రశ్న 21.
వ్యవసాయ వైవిధీకరణ అనగానేమి?
జవాబు:
ఆధునిక పద్ధతులు, విధానాలు అవలంబించి ఆహార మరియు వాణిజ్య పంటలు మరియు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయుట.

ప్రశ్న 22.
తలసరి ఆహార ధాన్యాల అభ్యత ఎక్కువగా ఉన్న దేశమేది?
జవాబు:
తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎక్కువగా ఉన్న దేశం అమెరికా.

ప్రశ్న 23.
పట్టణ ప్రాంతంలో నివసించే వ్యక్తులు తీసుకోవలసిన కనీస కాలరీలు ఎన్ని?
జవాబు:
పట్టణ ప్రాంతంలో నివసించే వ్యక్తులు తీసుకోవలసిన కనీస కాలరీలు 2100.

ప్రశ్న 24.
గ్రామీణ ప్రాంతంలో వ్యక్తులు శక్తి కోసం తీసుకోవలసిన కనీస కాలరీలు ఎన్ని?
జవాబు:
గ్రామీణ ప్రాంతంలో వ్యక్తులు శక్తి కోసం తీసుకోవలసిన కనీస కాలరీలు 2400.

ప్రశ్న 25.
భారతదేశ గ్రామీణ ప్రాంతంలో ఎంత శాతం ప్రజలు కాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు?
జవాబు:
భారతదేశ గ్రామీణ ప్రాంతంలో 80 శాతం మంది ప్రజలు కాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు.

ప్రశ్న 26.
భారతదేశంలో ఏ ప్రాంతంలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి?
జవాబు:
భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.

ప్రశ్న 27.
ఏ రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది?
జవాబు:
తమిళనాడు రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.

ప్రశ్న 28.
భారతదేశంలో ప్రజల మొత్తం బియ్యం వినియోగంలో ఎంత శాతం చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తున్నారు?
జవాబు:
భారతదేశంలో ప్రజల మొత్తం బియ్యం వినియోగంలో 39 శాతం చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తున్నారు.

ప్రశ్న 29.
బఫర్ నిల్వలు అనగానేమి?
జవాబు:
భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ (FCI) ద్వారా కొని నిల్వచేసే ఆహార ధాన్యాలను బఫర్ నిల్వలు అంటారు.

ప్రశ్న 30.
ప్రజాపంపిణీ వ్యవస్థ అనగానేమి?
జవాబు:
ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వాతా ఆహార ధాన్యాలు మరియు ఇతర నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరపై సరఫరా చేయడాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) అంటారు.

ప్రశ్న 31.
భారత ప్రభుత్వం ఆహార భద్రత చట్టం ఏ సంవత్సరంలో చేసింది?
జవాబు:
భారత ప్రభుత్వం ఆహార భద్రత చట్టం 2013 సంవత్సరంలో చేసింది.

ప్రశ్న 32.
పేదలలో అత్యంత పేదలకు ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు ఈ చట్టం ప్రకారం అందుతాయి?
జవాబు:
పేదలలో అత్యంత పేదలకు 35 కిలోల ఆహార ధాన్యాలు ఈ చట్టం ప్రకారం అందుతాయి.

ప్రశ్న 33.
అంగన్‌వాడీకి వచ్చే పిల్లల వయస్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?
జవాబు:
అంగన్వాడీకి వచ్చే పిల్లల వయస్సు 1 – 5 సంవత్సరాలు ఉంటుంది.

ప్రశ్న 34.
ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం ఏది?
జవాబు:
ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం భారతదేశంలోని మధ్యాహ్న భోజన పథకం.

ప్రశ్న 35.
పోషకాహారం అనగానేమి?
జవాబు:
శరీరం అన్ని విధులను నిర్వహించడానికి శక్తికి, ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి, రోగాలతో పోరాడటానికి అవసరమయిన ఆహారాన్నే పోషకాహారం అంటారు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 36.
జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది?
జవాబు:
జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఉంది.

ప్రశ్న 37.
పిల్లల్లో తక్కువ బరువు ఉండటం సమస్య అన్నిటికంటే తక్కువగా ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
పిల్లల్లో తక్కువ బరువు ఉండటం సమస్య అన్నిటికంటే తక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ.

ప్రశ్న 38.
శరీర బరువు సూచికను (BMI)ని ఏ విధంగా లెక్కిస్తారు?
జవాబు:
BMI = బరువు కిలోలలో / మీటర్లలో ఎత్తు వర్గం.

ప్రశ్న 39.
మహిళల్లో తీవ్రశక్తి లోపం, ఊబకాయం (అధిక బరువు) కలిగి ఉన్న వారి శాతమెంత?
జవాబు:
35% తీవ్ర శక్తి లోపం, 14% ఊబకాయం మహిళల్లో కన్పిస్తుంది.

ప్రశ్న 40.
సాధారణ BMI (ఆరోగ్యవంతుని BMI) ఎంత?
జవాబు:
18.5 [BMI = 18.5]

ప్రశ్న 41.
ఆహార భద్రతకు, తీవ్ర శక్తి లోపానికి గల సంబంధం ఏమిటి?
జవాబు:
సరిపడా ఆహారం ఉంటే (తింటే) ఎవరూ ఉండవలసిన దానికంటే తక్కువ బరువు కాని, తక్కువ ఎత్తు కాని ఉండరు.

10th Class Social 11th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
మీ కుటుంబము యొక్క ఒక వారం ఆహారపుటలవాట్లను విశ్లేషించండి. దీని ప్రభావము వ్యవసాయం, పర్యావరణంపై ఏ విధంగా పడుతుందో రాయండి.
జవాబు:
మా కుటుంబ ఆహారపు అలవాట్లు :

  1. ప్రధానంగా అన్నం (వరి), పప్పు (కందులు), కూరలు (కూరగాయలు), పెరుగు, పాలు, గ్రుడ్లు మొదలైనవి.
  2. అల్పాహారంగా ఇడ్లీ, దోశ, పూరి, చపాతి మొదలైనవి.
  3. అప్పుడప్పుడు మాలో కొంతమంది మాంసాహారం తీసుకుంటారు.

వ్యవసాయంపై ఆహారపు అలవాట్ల ప్రభావం :

  1. వివిధ పంటల (వరి, పప్పు ధాన్యాలు, కూరగాయలు మొదలైనవి) దిగుబడి పెంచుటకై అత్యధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం జరుగుతుంది.
  2. గ్రుడ్లు, పాలు, మాంసానికై పాడి పశువులను కృత్రిమ పద్ధతుల్లో, అవాంఛనీయ పద్ధతుల్లో పెంచడం జరుగుతుంది.

పర్యావరణంపై ప్రభావం :

  1. మోతాదు మించి వాడే రసాయన ఎరువులు, పురుగు మందుల కారణంగా వాయు, జల కాలుష్యం ఏర్పడుతుంది.
  2. అడవులను నరికి మొత్తం వ్యవసాయ భూమిగా మార్చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం.
  3. జీవ వైవిధ్యం దెబ్బతినేలా జంతువులను వినియోగించడం జరుగుతుంది.

ప్రశ్న 2.
ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించలేకపోవడానికి గల కారణములను తెల్పండి.
జవాబు:
జనాభా పెరిగిన స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుట లేదు. దీనికి కారణాలు :

  1. సరైన నీటి నిర్వహణా పద్ధతులను ఉపయోగించలేకపోవడం.
  2. రైతులు పురాతన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించడం.
  3. చిన్న భూ కమతాలలో వ్యవసాయం చేయడం.
  4. ఎరువులను తగిన మోతాదులలో వాడకపోవుట.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 3.
ప్రజా పంపిణీ వ్యవస్థలో నీవు గుర్తించిన ఏవేని రెండు లోపాలను గురించి వ్రాయుము.
జవాబు:

  1. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు వస్తువులను విక్రయించడం
  2. తూకంలో మోసం చేయడం
  3. బ్లాక్ మార్కెట్‌కు వస్తువులు తరలించడం
  4. అనర్హత కలిగిన వ్యక్తులు తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉండుట
  5. నెలలో కొద్ది రోజులు మాత్రమే సరుకులు అమ్మడం.

ప్రశ్న 4.
ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థ పని తీరును మెరుగుపరచడానికి నీవు సూచించే చర్యలు తెలుపుము.
జవాబు:

  1. రేషన్ కార్డులను పేదలకు మరియు అతి నిరు పేదలకు మాత్రమే కేటాయించాలి.
  2. ప్రతినెల వీరు ప్రజాపంపిణీ ద్వారా అన్ని సదుపాయాలను వస్తువులను పొందుతున్నారో లేదా తెలుసుకోవాలి.
  3. ప్రభుత్వం పంపిణీ చేసే వస్తువుల నాణ్యత పెంచాలి.
  4. ఏవైతే దొంగ రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాటిని తొలగించాలి.

ప్రశ్న 5.
ప్రజలకు ఆహారాన్ని పొందే హక్కు కోసం 2013 లో భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం రూపొందించింది. ఈ చట్టం అమలు కావడానికి నీవు సూచించే ముఖ్యమైన చర్యలేవి?
జవాబు:
జాతీయ ఆహార భద్రతా చట్టం – 2013 అమలు కావడానికి సూచనలు :

  1. ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేటట్లు చూడాలి.
  2. అధిక దిగుబడినిచ్చే ఆహార పంటలను ప్రోత్సహించాలి.
  3. ఆహార ఉత్పత్తులకు ప్రభుత్వం సబ్సిడీ అందించాలి.
  4. కరువు పరిస్థితులను ఎదుర్కొనుటకు గిడ్డంగులను ఏర్పాటు చేయాలి.

ప్రశ్న 6.
క్రింది రేఖాచిత్ర పటంను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 3
i) గ్రామీణ భారతదేశంలో ఎంత భాగం ప్రజలు అవసరమైన దానికన్నా ఎక్కువ కాలరీలు వినియోగిస్తున్నారు?
ii) గ్రామీణ భారతదేశంలో అవసరమైన దానికన్నా తక్కువ కాలరీలు వినియోగించడానికి కారణమేమిటి?
జవాబు:
i) 20%
ii) 1) ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉండటం.
2) ఆహారం కొనడానికి సరిపడా ఆదాయం ప్రజలకు ఉండటం లేదు.
3) పేదరికం, నిరుద్యోగం కూడా ప్రధాన కారణాలు.

ప్రశ్న 7.
ఆహార ధాన్యాల అధికోత్పత్తికి హరిత విప్లవం ఏ విధంగా దోహదం చేసింది?
జవాబు:

  1. అధిక దిగుబడినిచ్చే వంగడాలను వాడటం.
  2. నీటి పారుదల వసతులను మెరుగుపరచడం.
  3. నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం.
  4. క్రిమి సంహారక మందులు మరియు రసాయనిక ఎరువులు వాడటం.
    మొదలగు హరిత విప్లవంలోని అంశాలు ఆహార ధాన్యాల అధికోత్పత్తికి దోహదం చేసినవి.

ప్రశ్న 8.
భారత సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి అన్ని పాఠశాలల్లోను మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం సక్రమ నిర్వహణ మీద ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
మధ్యాహ్న భోజన పథకంపై కరపత్రము :

  1. స్థానికంగా పండించే ఆహార ధాన్యాలను వినియోగించాలి.
  2. నిర్దేశించిన మెనూను తప్పక అనుసరిస్తూ విద్యార్థులకు తగిన పోషక పదార్థాలు అందించాలి.
  3. పరిశుభ్రమైన పరిసరాలలో ఆహార పదార్థాలను తయారుచేయాలి.
  4. మధ్యాహ్న భోజన తయారీ, పంపిణీలో విద్యార్థుల, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఉండాలి.

ప్రశ్న 9.
మీ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఆహార వృథాను అరికట్టడానికి సూచనలు వ్రాయండి.
జవాబు:

  1. ఆహారాన్ని రుచిగా, శుభ్రంగా వండాలి.
  2. ఆహార వృథా పరిణామాలను గురించి విద్యార్థులకు వివరించాలి.
  3. భోజన సమయంలో ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలి.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 10.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం వలన ఏయే ప్రయోజనాలు చేకూరుతున్నాయో ప్రశంసించండి.
జవాబు:
మధ్యాహ్న భోజన పథకం వలన ప్రయోజనాలు : .

  1. ఆహార భద్రతను సమకూరుస్తుంది.
  2. పోషకాహారాన్ని అందిస్తుంది.
  3. నికర హాజరు శాతం పెరగడానికి సహాయపడుతుంది.

ప్రశ్న 11.
మీ ప్రాంతంలో ‘ప్రజా పంపిణీ వ్యవస్థ’ సక్రమ అమలుకు, సంబంధిత అధికారికి ఒక లేఖ రాయండి.
జవాబు:

సిరిసిల్ల
31 మార్చి 20xx.

To
తహశీల్దారు గారికి,
మండల రెవెన్యూ కార్యాలయము,
సిరిసిల్ల,

అయ్యా
విషయం : మా ప్రాంతంలో సక్రమంగా లేని చౌక ధరల దుకాణం నిర్వహణ దుకాణం సక్రమ నిర్వహణకు అభ్యర్ధన.

నేను సిరిసిల్లలోని సుభాష్ నగర్ ప్రాంత వాసిని. మా ప్రాంతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద పనిచేయుచున్న చౌక . ధరల దుకాణం నిర్వహణ సక్రమంగా లేదు ఎప్పుడు చూసినా మూయబడి వుంటుంది. రేషను వినియోగదారులు తమ సరకులు తీసుకెళ్ళేందుకు వచ్చి, దుకాణం మూయబడి ఉండటంతో ప్రభుత్వాన్ని, దుకాణం డీలరును నిందిస్తూ వెనుదిరిగి వెళుతున్నారు. వారు విధి లేని పరిస్థితులలో బహిరంగ మార్కెట్ ను ఆశ్రయించవలసి వస్తోంది. రోజువారీ పనులు చేసుకొనే వారు అటువంటి సందర్భాల్లో ఆ రోజు ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోంది. దుకాణాన్ని ఎప్పుడో ఒకసారి తెరచినా అరకొరగా సరకులు అందిస్తున్నారు. కొన్ని సమయాలలో ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు.

కావున మా ప్రాంతంలో చౌక ధరల దుకాణం సక్రమంగా పనిచేయు విధంగా ఆవశ్యక చర్యలు చేపట్టవలసిందిగా, తద్వారా మా ప్రాంత పేద ప్రజలకు మేలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దీని ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ అసలు ఉద్దేశ్యం నెరవేరుతుంది. తమరు తక్షణ మరియు సానుకూల చర్యలు చేపట్టవలసినదిగా విజ్ఞప్తి చేయుచున్నాను.

ధన్యవాదములతో,

భవదీయుడు,
XXXXXXX.

To
తహశీల్దారు గారికి,
సిరిసిల్ల మండలం,
సిరిసిల్ల

ప్రశ్న 12.
భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఉపయోగాలను వర్ణించండి.
జవాబు:
భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఉపయోగాలు :

  1. భారతదేశంలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉండటానికి చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  2. ప్రజా పంపిణీ వ్యవస్థ పేదవారికి సబ్సిడీ ధరలలో ఆహార ధాన్యాలను అందిస్తుంది.
  3. తక్కువ ఆదాయం గలవారికి, నిరుపేదలకు ఆహార ధాన్యాలు అందుతాయి.
  4. పేద ప్రజలందరూ పోషకాహార స్థాయిని సాధించటానికి PDS దోహదం చేస్తుంది.

ప్రశ్న 13.
ఆహార వృథాను అరికట్టడానికి ఏవేని రెండు నినాదాలను రాయండి.
జవాబు:
ఆహార వృధాను అరికట్టడానికి నినాదాలు :

  1. అన్నం పరబ్రహ్మ స్వరూపం – కనుక వృధా చేయకండి.
  2. మీరు వృధా చేసే ప్రతి మెతుకు – నింపు మరొకరి కడుపు
  3. ఆహారం వృధా చేసే ముందు, ఆలోచించు రైతు కష్టం.

ప్రశ్న 1.
గ్రామీణ, పట్టణ ప్రాంతవాసులకు కనీసం అవసరమైన కాలరీలు, తీసుకుంటున్న వినియోగిస్తున్న కాలరీల గురించి వివరించుము.
జవాబు:
రోజుకు పట్టణ ప్రాంతాల్లో 2100 కాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 కాలరీలు శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవాలి. తీసుకోవలసిన కాలరీల కంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల జాతీయ సగటు తక్కువగా ఉంది. అంతేకాకుండా కాలరీల వినియోగం 1983తో పోలిస్తే 2004 నాటికి తగ్గింది. మన దేశ ఆర్థిక పరిస్థితి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇలా జరగటం ఆందోళనకరంగా ఉంది.

ప్రశ్న 2.
ఎత్తు, బరువు సూచికల ఆధారంగా వేనిని అంచనా వేయవచ్చు?
జవాబు:
ప్రజా పంపిణీ వ్యవస్థ సామర్థ్యం, ఆహార పంటలను పండించటానికి ప్రాధాన్యత, ప్రజల కొనుగోలు శక్తి వంటి వాటినన్నింటినీ ప్రజల ఎత్తు, బరువు వంటి సూచికల ఆధారంగా అంచనా వేయవచ్చు. అంతే కాకుండా ఒక వ్యక్తి ఎత్తు ద్వారా అతనికి/ ఆమెకు బాల్యంలో సరిపడా ఆహారం అందిందో లేదో చెప్పవచ్చు. తక్కువ బరువు, తక్కువ ఎత్తు ఉన్న వాళ్లు పోషకాహార లోపానికి గురయ్యారని పేర్కొంటారు.

ప్రశ్న 3.
క్రింది గ్రాఫ్ ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానములిమ్ము.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 3
i) దేశంలో సంపన్నులైన 25% ప్రజలు సగటున రోజుకు ఎన్ని కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
దేశంలో సంపన్నులైన 25% ప్రజలు సగటున రోజుకు 2521 కాలరీలు తీసుకుంటున్నారు.

ii) ధనికులకు కింది పావుభాగం (25%) ప్రజలకు తీసుకుంటున్న కాలరీల్లో తేడా ఎంత?
జవాబు:
2521-1624 = 897 కాలరీలు.

iii) ఎవరు అతి తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
అట్టడుగు వర్గం వారు. (కింది పావుభాగం) అతి తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు.

iv) కారణమేమి?
జవాబు:
కారణం : వారి ఆదాయం తక్కువగా ఉండటం, ఆహార పదార్థాల కొనుగోలు శక్తి తక్కువగా ఉండటం వలన.

v) ఈ గ్రాఫ్ ను బట్టి నీవు ఏ అభిప్రాయానికి వచ్చావు?
జవాబు:
ఆర్థికస్థాయి, ఆహారస్థాయిని నిర్దేశిస్తుంది.

10th Class Social 11th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడింట ఒక వంతు ఆహారధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి. వివిధ పథకాల ద్వారా ఈ ఆహార ధాన్యాలను ప్రజలకు పంపిణీ చేస్తాయి.”
ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు సక్రమంగా ఆహార భద్రతను కల్పిస్తున్నాయని నీవు భావిస్తున్నావా? నీ అభిప్రాయం సవివరంగా తెలియజేయుము.
జవాబు:

  1. ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు సక్రమంగా ఆహార భద్రత కల్పిస్తున్నాయని నేను భావిస్తున్నాను.
  2. భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.
  3. ప్రజా పంపిణీ వ్యవస్థలు అందరికి తక్కువ ధరలకు ఆహార ధాన్యాలను అందిస్తాయి.
  4. అంత్యోదయ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థ అందిస్తుంది.
  5. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలోని ప్రతివ్యక్తికి సబ్సిడీ ధరలకు 5 కిలోల ఆహారధాన్యాలు అందిస్తున్నాయి.
    కనుక పై చర్యల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సక్రమంగా ఆహార భద్రతను కల్పిస్తున్నాయి.

ప్రశ్న 2.
క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.
‘భారత పార్లమెంటు జాతీయ ఆహారభద్రత చట్టం వంటి చట్టాలను, సమగ్ర శిశు అభివృద్ధి పథకం వంటి పథకాలను అమలు చేస్తుండగా ఇటీవల కాలంలో ఆహారభద్రత అమలు అయ్యేలా చూడటంలో భారత న్యాయ వ్యవస్థ కూడా చురుకైన పాత్ర పోషిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు చేసిన దావాలలో తీర్పును ఇస్తూ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
జవాబు:

  1. ఈ పేరా ఆహార భద్రతా చట్టం పిల్లలకు బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తుంది.
  2. కోర్టులు చెప్పిన తీర్పుల ప్రకారం ప్రతి ఒక్కరికి ఆహారం అందించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకున్నాయి.
  3. దాని ప్రకారమే పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.
  4. ఈ పథకం ప్రకారం పాఠశాలల్లో చదువుతున్న 14 కోట్ల మంది పిల్లలు ఈ రోజు మధ్యాహ్న భోజనం తింటున్నారు.
  5. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చెయ్యటానికి నిరాకరించినప్పుడు న్యాయ స్థానం పర్యవేక్షణ విధానాన్ని కూడా నెలకొల్పింది.
  6. అలాగే స్థానికంగా పండించిన ఆహార ధాన్యాలను ఉపయోగించాలని, వేడిగా వండి పెట్టాలని (అప్పటి దాకా అనేక ప్రభుత్వాలు ఆహార ధాన్యాలు లేదా తినుబండారాలు ఇచ్చేవి), అది శుభ్రంగా, పోషకాహారంగా (సిఫారసు చేసిన కాలరీలు ఉండేలా) ఉండాలని, వారంలో ప్రతిరోజు వేర్వేరు పదార్థాలు పెట్టాలంటూ, మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా అమలుపరచటానికి అనేక సిఫారసులు న్యాయస్థానం చేసింది.
  7. ఆహారం వండటంలో దళితులకు, విధవలకు, ఏ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
  8. ప్రపంచంలోకెల్లా ఇదే అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం. ఈ పథకానికి డబ్బులు సమకూర్చుకోటానికి పన్నులు విధించమని కూడా భారత ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు అంగన్వాడీలలోని పిల్లలకు కూడా వేడిగా ‘వండిన ఆహారం పెడుతున్నారు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 3.
ప్రస్తుతం దేశానికి “ఆహార భద్రత’ అవసరం ఎంతవరకు ఉంది?
జవాబు:
ప్రస్తుతం దేశానికి “ఆహార భద్రత” అవసరం :

  1. ఆహార ధాన్యాల లభ్యత
  2. సరిపడా కాలరీలు అందించే ఆహారం లభ్యం కాకపోవడం.
  3. కొనుగోలు శక్తి తక్కువగా ఉండటం.
  4. పేదరికం.
  5. నిరుద్యోగం
  6. ప్రజా సదుపాయాలు సరిపోయినంతగా లేకపోవడం.
  7. ఆహార ధాన్యాలు పేదలకు, పేదలు కాని వారికి వేర్వేరు ధరలకు అమ్మడం.
  8. పిల్లలలో పోషకాహార లోపం.

ప్రశ్న 4.
క్రింది పట్టాను పరిశీలించండి.
పంటల దిగుబడి (హెక్టారుకు కిలోలు)

పంట 1950-51 2000-2001
వరి 668 1901
గోధుమ 655 2708
పప్పుధాన్యాలు 441 544
నూనెగింజలు 481 810
పత్తి 88 190
జనపనార 1043 2026

వివిధ రకాల పంటల దిగుబడి ధోరణులను విశ్లేషిస్తూ ఒక పేరా రాయండి.
జవాబు:
1950-1951 మరియు 2000-2001వ సంవత్సరంలో పంటల దిగుబడి ఎలా ఉందో పై పట్టిక తెలియచేస్తుంది. వరి మరియు గోధుమల ఉత్పత్తిలో చాలా పెరుగుదల కనిపించింది. కాని పప్పు ధాన్యాల ఉత్పత్తి 100 కిలోలు మాత్రమే పెరిగింది. నూనె గింజలు, ప్రత్తి, జనపనార ఉత్పత్తుల పెరుగుదల రెట్టింపు అయ్యింది.

దానికి అంతటికీ ప్రధాన కారణం హరిత విప్లవం. అన్ని ఆహార పదార్థాలను పరిశీలిస్తే హరిత విప్లవం వలన వరి మరియు గోధుమ పంటలు బాగా లాభపడ్డాయని చెప్పవచ్చు. అలాగే మిగతా ఆహారధాన్యాల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది.

ప్రశ్న 5.
ప్రజాపంపిణీ వ్యవస్థ పేదవారికి ఆహార అందుబాటును ఎలా కలిగిస్తుందో విశ్లేషించుము.
జవాబు:
ప్రజాపంపిణీ వ్యవస్థ – పేదవారికి ఆహార అందుబాటు విశ్లేషణ :

  1. జాతీయ ఆహారభద్రత చట్టం ప్రజలకు ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతనిచ్చింది.
  2. భారతదేశంలోని మూడింట రెండు వంతుల జనాభాకు వర్తిస్తుంది.
  3. ప్రజాపంపిణీ వ్యవస్థ పేదవారికి సబ్సిడీ ధరలలో ఆహార ధాన్యాలను అందిస్తుంది.
  4. అంత్యోదయ కార్డు ఉన్నవాళ్ళకు ప్రతి కుటుంబానికి, నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు (బియ్యం లేదా గోధుమలు) అందుతాయి.
  5. తక్కువ ఆదాయం గలవారికి ఆహార ధాన్యాలు అందుతాయి.
  6. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 75 శాతం వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందిస్తున్నారు.
  7. పట్టణ జనాభాలో 50% మందికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందిస్తున్నారు.
  8. పోషకాహార స్థాయిని సాధించటానికి ప్రజాపంపిణీ వ్యవస్థ దోహదం చేస్తుంది.
  9. భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.

ప్రశ్న 6.
పట్టికలో ఇవ్వబడిన సమాచారమును పరిశీలించి విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 8
జవాబు:
పట్టికలోని 1961-2011 వరకు భారతదేశంలో తలసరి ఆహారధాన్యాల అభ్యత వివరాలు పొందుపరచబడినవి.

  1. 1951 దేశ జనాభా 361 మిలియన్లు. ఆహారధాన్యాల ఉత్పత్తి 50.8 మిలియన్ టన్నులు కాగా ఒక రోజుకు తలసరి ఆహారధాన్యాల లభ్యత 395 గ్రాములు.
  2. 1961 సంవత్సరానికి 78 మిలియన్ల జనాభా మరియు దాంతోపాటే సుమారు 32 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. తలసరి ఆహారధాన్యాల లభ్యత ఒక రోజుకు 469 గ్రాములుగా ఉంది.
  3. 1971, 1991 మరియు 2011లలో జనాభా మరియు అదే స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. కాని 1961, 1971లలో తలసరి ఆహారధాన్యాల లభ్యత పెరగలేదు, ఒకే విధంగా ఉంది.
  4. 1991 నుండి 2011 వరకు ఆహారధాన్యాల లభ్యత వరదలు, కరవులు మరియు ప్రకృతి వైపరీత్యాల వల్ల కుంటుపడింది. అధిక జనాభా కూడా ఇందుకు మరో కారణం.

1991 వరకు జనాభా, ఆహారధాన్యాల ఉత్పత్తి మరియు తలసరి ఆహారధాన్యాల లభ్యత పెరిగింది. కాని 2011లో జనాభా మరియు ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిన స్థాయిలో తలసరి ఆహారధాన్యాల లభ్యత పెరగకపోగా క్షీణించింది.

దేశం మొత్తానికి సరిపడా ఆహారధాన్యాలను పండించడం ప్రాథమిక అవసరం. దేశంలో తలసరి సగటు ఆహారధాన్యాల లభ్యత సరిపడా ఉండాలి. కాలక్రమంలో పెరుగుతూ ఉండాలి. పై సమాచారం బట్టి 2011 నుండి తలసరి ఆహార ధాన్యాల లభ్యత క్షీణిస్తోందని వెల్లడవుతోంది.

కావున ప్రభుత్వం ఈ విషయమై ఆవశ్యకమైన చర్యలు చేపట్టాలి. ఆహారధాన్యాలు ఎక్కువగా పండించేలా రైతులను ప్రోత్సహించాలి. ఎగుమతులపై నియంత్రణ విధించాలి. కొన్ని సమయాల్లో ప్రజలు ఆహారధాన్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం తమకు అవసరమైనవి దిగుమతి చేసుకోవడానికిగాను ఆహారధాన్యాలను ఇతరదేశాలను ఎగుమతి చేస్తుంది. దేశ ప్రజలందరికీ ముఖ్యంగా పేదవారికి ఆహారధాన్యాలు అందుబాటులో ఉండేలా చేయటం అన్నది సంక్షేమ ప్రభుత్వ కనీస కర్తవ్యం.

ప్రశ్న 7.
“ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహార భద్రత ఉండేలా చూడగలదు.” వివరింపుము.
జవాబు:
ప్రజాపంపిణీ వ్యవస్థ – ఆహార భద్రత :

  1. భారతదేశంలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉండటానికి ప్రజలకు చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  2. పేద ప్రజలందరికీ అతితక్కువ ధరలకు చౌకధరల దుకాణాల ద్వారా ఆహారధాన్యాలు అందుతాయి.
  3. పేదలలో కూడా అత్యంత పేదలకు ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి.
    ఉదా : అంత్యోదయ కార్డువారికి ఒక్కో కుటుంబానికి నెలకు 35 కేజీల చొప్పున ఆహారధాన్యాలు అందుతాయి.
  4. గ్రామీణ ప్రాంతాలలో 75%, పట్టణ ప్రాంతాలలో 50% ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ఆహారధాన్యాలను కొనుగోలు చేసే హక్కు ఉంది.
    ఈ విధంగా ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహారభద్రత ఉండేలా చూడగలదు.

ప్రశ్న 8.
ప్రస్తుతము జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ విధంగా అమలౌతోంది?
జవాబు:
ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు అవుతున్న తీరు.

  1. ప్రజలకు ఆహారము పొందే హక్కుకు చట్టబద్ధతనిచ్చిన చట్టం.
  2. ఆహార భద్రత చట్టం పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు :

ఎ. ప్రజా పంపిణీ వ్యవస్థ :

  1. ప్రజాపంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాలు ప్రధానమయినవి. నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించేవి చౌకధరల దుకాణాలు.
  2. భారతదేశంలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉండటానికి, ప్రజలకు చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  3. చౌకధరల దుకాణాల నుంచి కొనుగోలు చేసే ఆహారధాన్యాలు, వాళ్ళ మొత్తం ఆహార ధాన్యాల వినియోగంలో ఎక్కువ శాతమే ఉంది.
  4. ఈ ప్రజాపంపిణీ వ్యవస్థలో ప్రజలకు తెల్లకార్డులు, పింక్ కార్డులు, అంత్యోదయ కార్డుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయబడతాయి.

బి. అంగన్‌వాడీ కేంద్రాలు :

  1. అంగన్ వాడీల ద్వారా 1-6 వయసు గల పిల్లలకు, పాలిచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం సరఫరా చేయబడుతుంది.
  2. పిల్లల యొక్క ఎత్తు, బరువులను ఎప్పటికప్పుడు పరీక్షించి, తగుచర్యలు తీసుకుంటారు.
  3. పిల్లలకు అవసరమైన వైద్య, ఆరోగ్య సూచనలు ఆందింళబడతాయి, వ్యాక్సినేషన్ ఉంటుంది.
  4. ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణం ఉండటం వలన పిల్లల ఎదుగుదల చక్కగా ఉంటుంది.
  5. అంగన్ వాడీ కేంద్రంలో సరఫరా చేయు గ్రుడ్లు, ప్రోటీన్స్ (సోయాబీన్స్ పొడి), సమతౌల్య ఆహారం పొడి మొ||నవి – పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి.

సి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం (6-14 వయసు పిల్లలకు) అమలవుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 9.
భారతదేశంలో ప్రజలకు ఇతర ఆహార పదార్థాల కనీస అవసరం, లభ్యత ఎలా ఉంది?
జవాబు:
కాలక్రమంలో ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి పెరిగినప్పటికి రోజువారీ కనీస ఆహార అవసరాలు తీర్చటానికి సరిపడేటంతగా ఇది లేదు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పళ్లు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటి లభ్యత వరుసగా 180 గ్రాములు, 58 గ్రాములు మాత్రమే ఉంది. అదే విధంగా సగటున ప్రతి వ్యక్తి సంవత్సరంలో 180 గుడ్లు తీసుకోవలసి ఉండగా వీటి అభ్యత 30 మాత్రమే. ఆహారంలో మాంసం సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి 11 కిలోలు తీసుకోవలసి ఉండగా లభ్యత 3.2 కిలోలు మాత్రమే. రోజుకు ప్రతి వ్యక్తి 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవలసి ఉండగా లభ్యత 210 మిల్లీలీతార్లు మాత్రమే ఉంది.

ప్రశ్న 10.
ఆహార భద్రత అమలు అయ్యేలా చూడటంలో న్యాయ వ్యవస్థ పాత్రను వివరించుము.
జవాబు:
ఇటీవలి కాలంలో ఆహార భద్రత అమలు అయ్యేలా చూడటంలో భారత న్యాయ వ్యవస్థ కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు వేసిన దావాలలో తీర్పును ఇస్తూ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం తమిళనాడు వంటి రాష్ట్రాలలో చిన్న స్థాయిలో అమలు అవుతూ ఉండేది. ఇప్పుడు ఈ పథకం అన్ని రాష్ట్రాలలో అమలు అవుతోంది. పాఠశాలల్లో చదువుతున్న 14 కోట్ల మంది పిల్లలు ఈ రోజు మధ్యాహ్న భోజనం తింటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చెయ్యటానికి నిరాకరించినప్పుడు న్యాయం స్థానం పర్యవేక్షణ విధానాన్ని కూడా నెలకొల్పింది. అలాగే స్థానికంగా పండించిన ఆహార ధాన్యాలను ఉపయోగించాలని, వేడిగా వండి పెట్టాలని (అప్పటి దాకా అనేక ప్రభుత్వాలు ఆహార ధాన్యాలు లేదా తినుబండారాలు ఇచ్చేవి), అది శుభ్రంగా, పోషకాహారంగా (సిఫారసు చేసిన కాలరీలు ఉండేలా) ఉండాలని, వారంలో ప్రతిరోజు జేర్వేరు పదార్థాలు పెట్టాలంటూ, మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా అమలు పరచటానికి అనేక సిఫారసులు న్యాయస్థానం చేసింది. ఆహారం వండటంలో దళితులకు, విధవలకు, ఈ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలోకెల్లా ఇదే అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం. ఈ పథకానికి డబ్బులు సతుకూర్చుకోటానికి పన్నులు విధించతుని కూడా భారత ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు అంగన్‌వాడీలలోని పిల్లలకు కూడా వేడిగా వండిన ఆహారం పెడుతున్నారు.

ప్రశ్న 11.
భారతదేశం ప్రజలకు ఆహారం అందేలా చూడడానికి ఏ ఏ విధి విధానాలను రూపొందించింది?
జవాబు:

  1. భారతదేశంలో ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడానికి ప్రజలకు చౌక ధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  2. 2013లో భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం అనే కొత్త చట్టం చేసింది.
  3. భారతదేశంలో మూడింట రెండు వంతుల జనాభాకు ఇది వర్తిస్తుంది.
  4. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలోని ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు 5 కిలోల బియ్యం అందుతాయి.
  5. పేదవాళ్ళలో అత్యంత పేదలకు 35 కిలోలు ఇవ్వాలి.
  6. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అంగన్‌వాడీకి వచ్చే 1-6 సం|| పిల్లలకు, బడికి వచ్చే 6-14 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలి.
  7. ఇలా ప్రభుత్వం అందరికీ ఆహారం అందుబాటులో ఉంచింది.

ప్రాజెక్టు

” అమ్మ అనే క్రింది కవిత చదవండి. ఆహార భద్రతకు సంబంధించి ఏదో ఒక అంశంపైన మీరు కూడా ఒక కవిత రాయండి.

అమ్మ

పేగుల అరుపులను పట్టించుకోకుండా
ఎండిన గొంతు, పెదాలతో బాధపడుతూ
ప్రవహించే కన్నీటిని ఆపుతూ
తటాకాలైన కళ్లతో నిన్ను చూశాను …..

నువ్వు మాత్రం సగమే తింటూ,
అందరికీ తినటానికి ఉండాలని
ఒక రొట్టె, ఇంకొంచెం
ఏదో చెయ్యటానికి

పొయ్యిముందు కూర్చుని
నీ ఎముకలనే కాల్చిన
నిన్ను చూశాను …

అందరి ఇళ్లల్లో బట్టలు ఉతుకుతూ,
అంట్లు తోముతూ
వాళ్లు పారేసింది నీకు ఇస్తే
పరమాన్నంగా తీసుకున్న
నిన్ను చూశాను …

విద్యార్థులు స్వయంగా రాయగలరు :
ఆధారం :
పేదవాడి ఆకలిని ఏ హక్కు ఇచ్చి తీర్చలేం, ఆకలితో ఉన్నవాడికి ఆహారం కాకుండా ఏ విధమైన (రాజకీయ) అవకాశం, సమానత్వం ఇచ్చిన వ్యర్థమే … ఆహార భద్రత తప్ప అనే భావనతో ఈ కవిత …… -మ.శ్రీ

ఏమని వివరించను ! ఎవరికి విన్నవించను
కాలే కడుపుల కష్టాల గురించి,

ఆకలితో తడిమిన చేతికి కడుపు, వీపు
ఏకమయ్యి తగిలితే,

నీరసంతో నేలను తాకిన ఎముకల గూడుకు
అల్లుకున్న వస్త్ర చర్మం చలికి వణుకుతుంటే, …..

ఈ కణకణలాడే ఉదరకొలిమి గురించి ….
కాలకూట విషం మింగిన ఆ శివునికే ఎరుక.

ఓటు తీరుస్తుందా? సీటు ఆర్పుతుందా? …. నా ఆకలి – మంటలను
పార్లమెంటు ఆపుతుందా? ప్రజాస్వామ్యం అంతం చేస్తుందా? ….. నా పేగుల అరుపులను.
అందుకే …… అమ్మలాంటి ఆహార భద్రత చట్టం
చెయ్యకండి భరతమాత బిడ్డలకు దూరం.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

These AP 10th Class Social Studies Important Questions 10th Lesson ప్రపంచీకరణ will help students prepare well for the exams.

AP Board 10th Class Social 10th Lesson Important Questions and Answers ప్రపంచీకరణ

10th Class Social 10th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ఎక్కువ దేశాలలో ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను ఏమంటారు?
జవాబు:
బహుళజాతి సంస్థ.

2. ప్రపంచీకరణ ప్రధాన ఫలితం ఏమిటి?
జవాబు:
దేశాల మధ్య పోటీ పెరగడం.

3. హోండా, నోకియా, పెప్సి, టాటా మోటార్స్ లలో భారతీయ బహుళజాతి కంపెనీ ఏది?
జవాబు:
టాటా మోటార్స్.

4. WTO ను విస్తరింపుము.
జవాబు:
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ప్రపంచ వాణిజ్య సంస్థ)

5. SEZ ను విస్తరింపుము.
జవాబు:
స్పెషల్ ఎకనామిక్ జోన్ (ప్రత్యేక ఆర్థిక మండలి)

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

6. IBRD ను విస్తరింపుము.
జవాబు:
ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ & డెవలెప్ మెంట్ (అంతర్జాతీయ అభివృద్ధి మరియు పునర్నిర్మాణ బ్యాంక్).

7. IMF ను విస్తరింపుము.
జవాబు:
ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి).

8. వినియోగదారుల సేవలు అందించేవి ఏవి?
జవాబు:
కాల్ సెంటర్స్,

9. ప్రపంచీకరణ వలన విదేశీ వాణిజ్యాలలో అధిక భాగాన్ని ఏవి నియంత్రిస్తాయి?
జవాబు:
బహుళ జాతి సంస్థలు.

10. WTO యొక్క ప్రధాన ఉద్దేశము.
జవాబు:
అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకృతం చేయుట.

11. భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానం ఏ సంవత్సరం లో ప్రారంభమైనది?
జవాబు:
1991.

12. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలలో ఎన్ని రకాల ప్రవాహాలను మనం గుర్తించవచ్చు?
జవాబు:
మూడు.

13. ప్రపంచీకరణ ఏ శతాబ్దం చివర సంభవించిన పరిమాణం?
జవాబు:
20 వ.

14. భారతదేశంలో ఇంగ్లీషు మాట్లాడగలిగిన విద్యావంతులైన యువత ఎటువంటి సేవలు అందిస్తున్నారు?
జవాబు:
వినియోగదారుల సేవలు (కస్టమర్ కేర్)

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

15. బహుళజాతి కంపెనీలు, ఆయా దేశాల క్లినిక కంపెనీలు కలిసి ఉత్పత్తిని చేపడితే వాటిని ఏమంటారు?
జవాబు:
జాయింట్ వెంచర్లు.

16. బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే పెట్టుబడిని ఏమంటారు?
జవాబు:
విదేశీ పెట్టుబడి.

17. IDA ని విస్తరింపుము.
జవాబు:
ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ అసోసియేషన్ (అంతర్జాతీయ అభివృద్ధి సంఘం)

18. IBRD, IDA సంస్థలు దేనిలో భాగం?
జవాబు:
ప్రపంచ బ్యాంక్ లో.

19. వివిధ దేశాలలోని మార్కెట్లను అనుసంధానం చేయునది ఏది?
జవాబు:
విదేశీ వాణిజ్యం.

20. పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలు ప్రభావితమై నియంతలను తొలగించడానికి చేసిన విప్లవాలను ప్రసార మాధ్యమాలు ఏవిధంగా పేర్కొన్నాయి?
జవాబు:
అరబ్ వసంతంగా.

21. WTO లో సభ్యదేశాల సంఖ్య.
జవాబు:
150.

22. ప్రపంచీకరణ వల్ల ఏ రాజ్యాలు అంతరించి పోతాయో అన్నది చర్చనీయాంశమైనది?
జవాబు:
జాతీయ రాజ్యాలు.

23. జపాన్, జర్మనీ, యు.కె, ఫ్రాన్స్ వంటి దేశాలకు IBRD, IDA లలో ఉన్న ఓటు విలువ ఎంత?
జవాబు:
3 – 6%

24. ఏ సంస్థల కారణంగా దూరప్రాంతాలలోని ఉత్పత్తి మధ్య అనుసంధానం ఏర్పడింది?
జవాబు:
బహుళ జాతి సంస్థలు.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

25. ప్రపంచ బ్యాంకులో అమెరికా ఓటుకు ఎంత విలువ ఉంది?
జవాబు:
16%.

26. ప్రపంచ బ్యాంకులో ఏ దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంటుంది?
జవాబు:
పేద దేశాలకు.

27. IBRD, IDA సంస్థలలో సభ్య దేశాలుగా ఉన్న దేశాలు ఎన్ని?
జవాబు:
170.

28. ప్రపంచీకరణ వల్ల భారతదేశంలో ఏ వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరింది?
జవాబు:
సంపన్న వర్గం.

29. క్రింది వానిలో బహుళ జాతి సంస్థలుగా ఎదిగిన భారతీయ కంపెనీలను రాయండి.
i) టాటా మోటర్స్ ii) ఇన్ఫోసిస్ iii) కార్గిల్ ఫుడ్స్ iv) ఏషియన్ పెయింట్స్.
జవాబు:
(i), (ii) & (iv)

30. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ కంపెనీలను ఆకర్షించుకోడానికి చేపట్టినవి ఏవి?
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండళ్ళు

31. ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించటాన్ని ఏమి అంటారు?
జవాబు:
ఆర్థిక సరళీకరణ.

32. ఫోర్డ్ మోటార్స్ అనేది ఏ దేశ కంపెనీ?
జవాబు:
అమెరికా

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

33. ఏ సంవత్సరం నుండి దీర్ఘకాలం ప్రభావం చూపించేలా భారతదేశ విధానాలలో మార్పులు చేశారు?
జవాబు:
1991.

34. వస్తువులు, పెట్టుబడులు కదిలినంత స్వేచ్చగా కార్మికుల వలసలు లేనప్పటికీ దాదాపుగా 5 కోట్ల మంది యూరపు నుంచి ఏ దేశాలకు వెళ్ళి ఉంటారని అంచనా?
జవాబు:
అమెరికా, ఆస్ట్రేలియా.

35. ఒక పెద్ద బహుళజాతి సంస్థ ప్రపంచమంతటా అమ్మే సరుకులకు సేవలను అందించేవి ఏవి?
జవాబు:
వినియోగదారుల సేవ (కస్టమర్ కేర్)

36. ఉత్పత్తి ప్రక్రియను చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పలుచోట్ల చేపట్టే సంస్థలు ఏవి?
జవాబు:
బహుళ జాతి సంస్థలు.

37. ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కంపెనీ భారతదేశానికి చెందిన ఏ కంపెనీతో కలసి చెన్నె దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది?
జవాబు:
మహీంద్ర & మహింద్రా.

38. ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణమేమి?
జవాబు:
సాంకేతిక పరిజ్ఞానం వేగవంతంగా అభివృద్ధి చెందడం.

39. ‘E-mail’ ను పంపించటానికి అవసరమైనది.
జవాబు:
ఇంటర్నెట్.

40. లండన్లోని బ్యాంకు నుంచి విజయవాడలోని బ్యాంకుకు దీనిద్వారా డబ్బులను ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
జవాబు:
ఇంటర్నెట్ బ్యాంకింగ్.

41. విదేశీ వాణిజ్యాన్ని పెంచటానికి లేదా తగ్గించటానికి ప్రభుత్వం వేటిని విధిస్తుంది?
జవాబు:
పరిమితులను.

42. ప్రపంచీకరణలో భారతదేశంలోని ఉత్పత్తిదారులు మనుగడ సాగించాలి అంటే?
జవాబు:
నాణ్యతను మెరుగు పరచుకోవాలి.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

43. ప్రపంచంలోని అధికశాతం జనాభాను ప్రభావితం చేసే కీలక అంశాలపై నిర్ణయాలను తీసుకుంటున్న సంస్థలు ఏవి?
జవాబు:
ప్రపంచ పరిపాలనా సంస్థలు.

44. విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి భారత ప్రభుత్వం ఏ చట్టాలను సడలించింది?
జవాబు:
కార్మిక చట్టాలను.

45. జాతీయ భావన పలచబడటానికి కారణమేమి?
జవాబు:
ప్రపంచీకరణ.

46. అమెరికా GDP లో వ్యవసాయ రంగం వాటా ఎంత?
జవాబు:
19

47. దేశాల మధ్య వేగంగా పెరుగుతున్న అనుసంధానం, అంత: సంబంధాలను ఏమంటారు?
జవాబు:
ప్రపంచీకరణ.

48. ఫోర్డ్ మోటార్స్ ఏ సంవత్సరంలో భారతదేశంలోని చెన్నై దగ్గర కంపెనీ ప్రారంభించింది?
జవాబు:
1995.

49. ఫోర్ట్ మోటార్స్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాలలో ఉత్పత్తిని నిర్వహిస్తోంది?
జవాబు:
26.

50. అమెరికా మొత్తం ఉపాధిలో ఎంతశాతం వ్యవసాయ వాటా కల్గి ఉంది?
జవాబు:
0.5%

51. నైక్, పెప్సి, హెూండా, ఇన్ఫోసిస్ లో భారతీయ MNC ఏది?
జవాబు:
ఇన్ఫోసిస్.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

52. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో ఏర్పడే ప్రవాహం కానిది ఏది?
→ వస్తువులు, సేవల ప్రవాహం.
→ శ్రమ ప్రవాహం
→ పెట్టుబడి ప్రవాహం
→ మార్కెట్ ప్రవాహం.
జవాబు:
మార్కెట్ ప్రవాహం.

53. వాణిజ్య అవరోధానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పన్ను.

54. ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఎవరి మధ్య పోటీని పెంచుతుంది?
జవాబు:
ఉత్పత్తిదారుల మధ్య.

55. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (SEZ) లో ఉండే ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏవి?
i) రవాణ il) విద్యుత్తు iii) గిడ్డంగులు iv) ఋణ సదుపాయం v) విద్య
జవాబు:
(i), (ii), (iii) & (iv)

56. WTO, IMF, WHO, IBRD లలో ప్రపంచ ద్రవ్య సంస్థ కానిది ఏది ?
జవాబు:
WHO

57. ఒకప్పుడు సర్వసత్తాక ప్రభుత్వాలు కరెన్సీ విలువను నిర్ణయించడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవి. ఇప్పుడు ప్రభుత్వం వెలుపల, ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేని “మార్కెట్ శక్తులు” ఆ నిర్ణయాలు చేస్తున్నాయి. ఈ ఉదాహరణలు ఊటంకించిన ఆ మార్కెట్ శక్తులు ఏవి?
జవాబు:
బహుళజాతి కంపెనీలు.

58. ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవటం లో ప్రపంచ బ్యాంకు సలహా ఇచ్చి మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చేయగలుగుతుంది. అయితే, ప్రపంచ బ్యాంక్ లో ఇమిడియున్న సంస్థలు ఏవి?
జవాబు:
IBRD, IDA.

59. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) ఫోర్డ్ మోటార్స్ ( ) a) IT
ii) రాన్బాక్సీ ( ) b) నటులు, బోల్టులు
iii) సుందరం ఫాస్టెనర్స్ ( ) c) మందులు
iv) ఇన్ఫోసిస్ ( ) d) కార్లు
జవాబు:
i-d, ii – c, iii – b, iv-a.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

60. ఈ-మెయిల్, వాయిస్-మెయిల్, టెలిగ్రామ్, ఈ-బ్యాంకింగ్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కానిది ఏది?
జవాబు:
టెలిగ్రామ్.

61. క్రింది వానిలో సరికాని జత.
→ SEZ – ప్రత్యేక ఆర్థిక మండలి.
→ IBRD – ప్రపంచ బ్యాంక్.
→ IMF – అంతర్జాతీయ మార్కెట్ సంస్థ.
→ WTO – ప్రపంచ వాణిజ్య సంస్థ.
జవాబు:
IMF – అంతర్జాతీయ మార్కెట్ సంస్థ.

62. IT ని విస్తరింపుము.
జవాబు:
సమాచార సాంకేతిక పరిజ్ఞానం.

63. క్రింది ఇవ్వబడిన చిత్రంను పరిశీలించి చిత్రానికి సరిపోయే ఒక నినాదం రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ 1
జవాబు:
స్వదేశీ నారికేళముండగా – విదేశీ కోలా ఎందుకు దండగా.

10th Class Social 10th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
I.B.R.D. ని విస్తరించుము.
జవాబు:
International Bank for Reconstruction and Development (అంతర్జాతీయ పునఃనిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు / ప్రపంచ బ్యాంకు)

ప్రశ్న 2.
SEZS ను విస్తరించుము.
జవాబు:
Special Economic Zones (ప్రత్యేక ఆర్థిక మండలి).

ప్రశ్న 3.
WTO ను విస్తరింపుము.
జవాబు:
ప్రపంచ వాణిజ్య సంస్థ (లేదా) World Trade Organisation.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 4.
అరబ్ వసంతం అనగా నేమి?
జవాబు:
అరబ్ వసంతం :
ఉత్తర ఆఫ్రికా మరియు పశ్చిమ ఆసియాలలోని ట్యునీషియా, ఈజిప్ట్ వంటి దేశాలలో నియంతలను తొలగించడం కోసం చోటుచేసుకున్న విప్లవాలను అరబ్ వసంతం అని పిలుస్తారు.

ప్రశ్న 5.
ఈనాడు ఏ వర్గానికి చెందిన ప్రజల వలసలకు గిరాకీ ఉంది?
జవాబు:
ఈనాడు వృత్తి నైపుణ్యం ఉన్న ప్రజల వలసలకు గిరాకీ ఉంది.

ప్రశ్న 6.
జాయింట్ వెంచర్లు అంటే ఏమిటి?
జవాబు:
కొన్ని సందర్భాలలో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలసి ఉత్పత్తిని చేపడతాయి. వీటిని జాయింట్ వెంచర్లు అంటారు.

ప్రశ్న 7.
ఫోర్డ్ మోటర్స్ కంపెనీ తమ కర్మాగారాన్ని ఎచట నెలకొల్పింది?
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ కంపెనీ తమ కర్మాగారాన్ని చెన్నైలో 1995లో నెలకొల్పింది.

ప్రశ్న 8.
ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో ఏ కంపెనీతో కలసి కర్మాగారాన్ని స్థాపించింది?
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో మహీంద్ర & మహీంద్రతో కలసి కర్మాగారాన్ని స్థాపించింది.

ప్రశ్న 9.
చైనా బొమ్మలు భారతదేశంలో ఎందుకు ఆదరణ పొందాయి?
జవాబు:
చైనా బొమ్మలు కొత్త డిజైన్లు, తక్కువ ధర కారణంగా భారతదేశంలో ఆదరణ పొందాయి.

ప్రశ్న 10.
ప్రపంచీకరణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నదెవరు?
జవాబు:
ప్రపంచీకరణలో బహుళజాతి సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 11.
ఇంటర్నెట్ ద్వారా తక్షణమే పంపే సమాచారాన్ని ఏమంటారు?
జవాబు:
ఇంటర్నెట్ ద్వారా తక్షణమే పంపే సమాచారాన్ని ఎలక్ట్రానిక్ మెయిల్ (e-mail) అంటాం.

ప్రశ్న 12.
IT ని విస్తరించండి.
జవాబు:
Information Technology (సమాచార సాంకేతిక పరిజ్ఞానం).

ప్రశ్న 13.
ఆర్థిక సరళీకరణ అనగా నేమి?
జవాబు:
ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించటాన్ని ఆర్థిక సరళీకరణ అంటారు.

ప్రశ్న 14.
WB ను విస్తరించండి.
జవాబు:
World Bank (ప్రపంచ బ్యాంకు).

ప్రశ్న 15.
IMF ను విస్తరించండి.
జవాబు:
International Monetary Fund (అంతర్జాతీయ ద్రవ్య నిధి).

ప్రశ్న 16.
విదేశీ వాణిజ్యం మౌలిక విధి ఏమిటి?
జవాబు:
విదేశీ వాణిజ్యం వివిధ దేశాలలోని మార్కెట్లను అనుసంధానం చేస్తుంది.

ప్రశ్న 17.
WTOని విస్తరించండి. అది చేసే పని ఏమిటి?
జవాబు:
WTO అనగా World Trade Organisation “ప్రపంచ వాణిజ్య సంస్థ”. ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చేసే ఉద్దేశంతో పనిచేస్తుంది.

10th Class Social 10th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది. సమర్థించుము.
జవాబు:
ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుందనుటలో సందేహం లేదు.

  • సాధారణంగా బహుళజాతి సంస్థలే వివిధ దేశాలలో ఉత్పత్తి, వాణిజ్యం చేస్తున్నాయి.
  • వివిధ దేశాల మార్కెట్ ను కైవసం చేసుకోవటానికి MNC లు కచ్చితంగా పోటీపడతాయి.
  • MNC లు భారీ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తాయి. ఈ స్థాయిలో స్వదేశీ సంస్థలు తట్టుకోవాలంటే కొంచెం కష్టం.
  • ఈ పోటీ వలన, భారీతరహా ఉత్పత్తి వలన, ఉత్పత్తి వ్యయం తగ్గించి వస్తువు ధర కూడా తగ్గుతుంది.
  • ఉత్పత్తికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమును వినియోగించుకుని ఉత్పత్తిని పెంచుతారు.
  • స్వేచ్చా మార్కెట్ కారణంగా వివిధ కంపెనీలు ఉండుట వలన వినియోగదారునికి ఎంపిక అవకాశం ఉంటుంది. దీని వలన కంపెనీల మధ్య పోటీ ఏర్పడుతుంది.
  • కొత్త వాణిజ్య అవకాశాలు పెరగటం (ఉదా : e-కామర్స్) వలన కూడా పోటీ వాతావరణం నెలకొంది.
  • మారుతున్న ఫ్యాషన్లకనుగుణంగా అనేక రకాల కొత్త మోడల్స్ (కార్లు, ఫోన్లు మొదలైనవి) రావటం వలన అవి స్వదేశీ మార్కెట్ కు తీసుకురావటంలో కూడా పోటీ ఏర్పడుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 2.
భారతదేశంలోని స్థానిక పరిశ్రమలపై ప్రపంచీకరణ ప్రభావాన్ని అంచనా వేయుము.
జవాబు:
ప్రపంచీకరణ వలన కలిగే మంచి (అనుకూల) ప్రభావం :

  1. పెరుగుతున్న పోటీ వలన చాలా భారతదేశ కంపెనీలు ప్రయోజనాన్ని పొందాయి.
  2. వారు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తిని పెంచి ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా పెంచుకున్నాయి.
  3. కొన్ని కంపెనీలు విదేశీ కంపెనీలతో కలిసిపోయి వాటి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పంపించగలుగుతున్నాయి.

ప్రపంచీకరణ వలన చెడు ప్రభావం :

  1. ఈ పోటీని తట్టుకోలేక చాలా చిన్న తరహా కంపెనీలు మూత పడినాయి. కొన్ని మూతపడే స్థాయికి వచ్చాయి.
  2. దీనివలన చాలామంది కార్మికులు. నిరుద్యోగులుగా మారుతున్నారు.

ప్రశ్న 3.
ప్రపంచ బ్యాంకు యొక్క ప్రపంచ అభివృద్ధి నివేదిక (2012)’ వివిధ దేశాలను ఎలా వర్గీకరించిందో తెలుపుము.
జవాబు:
‘ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక 2012’ ప్రకారం వార్షిక తలసరి ఆదాయం ఆధారంగా దేశాలు ఈ క్రింది విధంగా వర్గీకరించబడ్డాయి.

  1. అధిక ఆదాయ దేశాలు – 12,600 అమెరికా డాలర్లు, అంతకంటే ఎక్కువ.
  2. మధ్య ఆదాయ దేశాలు – 1036 నుండి 12,599 అమెరికా డాలర్ల వరకు.
  3. అల్ప ఆదాయ దేశాలు – 1035 అమెరికా డాలర్లు మరియు అంతకంటే తక్కువ.

ప్రశ్న 4.
ప్రపంచీకరణకు దోహదం చేసిన కారణాలను ఏవైనా నాల్గింటిని రాయండి..
జవాబు:
ప్రపంచీకరణకు దోహదం చేసిన కారణాలు :

  1. సాంకేతిక పరిజ్ఞానం
  2. రవాణా
  3. విదేశీ వాణిజ్య సరళీకరణ
  4. విదేశీ పెట్టుబడుల సరళీకరణ
  5. రాజకీయ వాతావరణం.

ప్రశ్న 5.
భారతదేశంలో ప్రపంచీకరణ ప్రభావాలను వివరించండి.
జవాబు:

  1. భారతదేశంలో ప్రపంచీకరణ ప్రభావం ఒకే రకంగా లేదు.
  2. ఇది సంపన్న వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చింది.
  3. నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు లాభదాయకంగా ఉంది.
  4. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి.
  5. కొన్ని నూతన ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
  6. కొన్ని భారతీయ కంపెనీలు బహుళజాతి సంస్థలుగా ఎదగగలిగాయి.
  7. అనేకమంది చిన్న ఉత్పత్తిదారులు, కార్మికులు నష్టపోయారు.
  8. వారి ఉపాధికి, హక్కులకు భంగం వాటిల్లింది.

ప్రశ్న 6.
ప్రస్తుతం భారతీయ కంపెనీలు ప్రపంచీకరణ వల్ల ఎలా లాభపడుతున్నాయి?
జవాబు:
ప్రస్తుతం భారతీయ కంపెనీలు ప్రపంచీకరణ వల్ల లాభపడడానికి దోహదపడే అంశాలు.

  1. కొత్త సాంకేతిక విజ్ఞానము
  2. ఉత్పత్తి ప్రమాణాలను పెంచడం
  3. విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయడం

ప్రశ్న 7.
ప్రపంచీకరణకు చోదక శక్తి ఏది? ఆర్థిక రంగమా? రాజకీయ నిర్ణయాలా?
జవాబు:
ప్రపంచీకరణకు ఆర్థిక రంగమే మూలం అని భావించేవాళ్లు దానికి ఆర్థిక శక్తులు కారణమని, దాని ఎల్లలను అవే నిర్ణయిస్తాయని వాదిస్తారు. రాజకీయాలు కారణం అని భావించేవాళ్లు ప్రభుత్వ నిర్ణయాల వల్ల ముందుగా ఇది మొదలయ్యిందని అంటారు. ప్రభుత్వాలు పరిమితులు విధిస్తాయి, లేదా వాటిని తొలగిస్తాయి. ఒక ప్రదేశం అనువుగా ఉందో, లేదో అంచనా వేసుకోటానికి మార్కెటు పరిస్థితులే కాకుండా రాజకీయ వాతావరణం కూడా ముఖ్యమైన అంశం అవుతుంది. వాస్తవం ఏమిటంటే పై రెండింటికీ సంబంధం ఉంది. ఒక ప్రత్యేక నేపధ్యంలో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని గుర్తిస్తే, ఇవి ఆపాటికే వచ్చిన ఆర్థిక, సాంకేతిక మార్పులను పరిగణనలోకి తీసుకుంటాయని అర్థం అవుతుంది.

ప్రశ్న 8.
అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో ఎన్ని ప్రవాహాలున్నాయి? వాటిని గూర్చి క్లుప్తంగా రాయండి.
జవాబు:
అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో మనం మూడు రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. మొదటిది వస్తువులు, సేవల ప్రవాహం. రెండవది శ్రమ ప్రవాహం – ఉపాధికోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లటం. మూడవది పెట్టుబడి ప్రవాహం – స్వల్పకాల, లేదా దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూర ప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించటం.

ప్రశ్న 9.
బహుళజాతి సంస్థలు తమ వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా అమ్మడమే కాకుండా వస్తువుల, సేవల ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా – విస్తరింపజేస్తుంది – ఉదహరించండి.
జవాబు:
పారిశ్రామిక పరికరాలను తయారుచేసే ఒక పెద్ద బహుళజాతి సంస్థ వాటిని అమెరికాలోని పరిశోధనా కేంద్రాలలో డిజైన్ చేయిస్తుంది. ఈ రకంగా అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల చైనాలో విడిభాగాలు తయారు చేస్తుంది. వాటి మార్కెట్ లక్ష్యాలయిన అమెరికా, యూరప్ లకు సమీపంలోని మెక్సికో, తూర్పు యూరప్లో అసెంబ్లింగ్ చేస్తారు. భారతదేశంలో ఇంగ్లీష్ తెలిసిన యువకుల ద్వారా కాల్ సెంటర్లను నిర్వహిస్తారు.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 10.
చైనా బొమ్మల ఉత్పత్తిదారులు భారతీయ మార్కెట్ లను ఎలా ఆక్రమించారు?
జవాబు:
చైనా ఉత్పత్తిదారులు భారతదేశానికి ప్లాస్టిక్ బొమ్మలు ఎగుమతి చేయసాగారు. భారతదేశంలో కొనుగోలుదార్లకు ఇప్పుడు భారతీయ, చైనా బొమ్మలలో ఎంచుకునే అవకాశం ఉంది. కొత్త డిజైన్లు, తక్కువ ధర కారణంగా చైనా బొమ్మలు ఎంతో – ఆదరణ పొందాయి. ఒక సంవత్సర కాలంలో బొమ్మల దుకాణాలలో 70 – 80 శాతం భారతీయ బొమ్మలకు బదులుగా . చైనా బొమ్మలను అమ్మసాగాయి. గతంలో కంటే ఇప్పుడు భారతదేశంలో బొమ్మలు చవకగా ఉన్నాయి.

చైనాలో బొమ్మల ఉత్పత్తిదారులకు ఇది తమ వ్యాపారాన్ని విస్తరింపచేసుకోటానికి అవకాశం ఇచ్చింది.

ప్రశ్న 11.
ప్రపంచీకరణ వలన దేశాలు అనేక అంశాలలో నియంత్రణను కోల్పోయాయి. వ్యాఖ్యానించుము.
జవాబు:
పెట్టుబడి, ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాల ప్రవాహం వల్ల సరిహద్దులు లేని ప్రపంచం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాలు తమ దేశ సరిహద్దుల లోపల కూడా జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై నియంత్రణ కోల్పోతారు. ఉదాహరణకు ఒకప్పుడు, సర్వసత్తాక ప్రభుత్వాలు కరెన్సీ విలువను నిర్ణయించడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసికొనేవి. ఇప్పుడు ప్రభుత్వం వెలుపల, ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేని మార్కెటు శక్తులు ఆ నిర్ణయాలు చేస్తున్నాయి.

ప్రశ్న 12.
అమెరికాలో కేవలం అరశాతం (0.5%) మాత్రమే వ్యవసాయరంగంలో ఉన్నా ఆ దేశ రైతులు తమ ఉత్పత్తులను ఇతర దేశాలలో చౌకగా ఎలా అమ్ముతున్నారు?
జవాబు:
అమెరికా GDP లో వ్యవసాయం వాటా 1 శాతం కాగా మొత్తం ఉపాధిలో 0.5% మాత్రమే వ్యవసాయంలో ఉన్నారు. అయినాకానీ అమెరికా వ్యవసాయంలో ఉన్న ఈ కొద్దిమందికే ఉత్పత్తికి, ఇతర దేశాల ఎగుమతికి అమెరికా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయి. పెద్ద ఎత్తున లభించే ఈ సబ్సిడీల వల్ల అమెరికా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను చాలా తక్కువ ధరకు అమ్మగలుగుతున్నారు. అదనంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను వీళ్లు ఇతర దేశాల మార్కెట్లలో చాలా తక్కువ ధరలకు అమ్మగలుగుతున్నారు.

ప్రశ్న 13.
అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలకు భిన్నంగా రైతులకు పెద్ద మొత్తంలో రాయితీ వచ్చినపుడు అభివృద్ధి చెందిన దేశాలు అమెరికాను ఏమని ప్రశ్నిస్తాయి?
జవాబు:
అన్యాయపూరిత వాణిజ్య అవరోధాల కొనసాగింపులో భాగంగా అమెరికా తమ రైతులకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చినపుడు అభివృద్ధి చెందిన రైతులు క్రింది విధంగా ప్రశ్నిస్తారు. “ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాల ప్రకారం మేం వాణిజ్య అవరోధాలను తొలగించాం. కానీ మీరు ఆ నియమాలను పట్టించుకోకుండా మీ రైతులకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు. మా రైతులకు మద్దతు ఇవ్వొద్దని మా ప్రభుత్వాలకు చెప్పి మీరు మీ రైతులకు మద్దతును కొనసాగిస్తున్నారు. స్వేచ్ఛా, న్యాయమైన వాణిజ్యం అంటే ఇదేనా?”

ప్రశ్న 14.
బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోడానికి ఉపయోగించే సాధారణ సూచికలు ఏవి?
జవాబు:
బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోడానికి ఉపయోగించే సాధారణ సూచికలు : మార్కెట్లకు దగ్గరగా ఉండటం, తక్కువ ఖర్చుతో నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని కార్మికుల లభ్యత ఇతర ఉత్పత్తి కారకాల అందుబాటు, తమ ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వ విధానాలు ఉండటం మొదలైనవి.

ప్రశ్న 15.
విదేశీ వాణిజ్యం వివిధ దేశాలలోని మార్కెట్లను ఎలా అనుసంధానం చేస్తుంది?
జవాబు:
ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలను విదేశీ వాణిజ్యం అందిస్తుంది. అదేవిధంగా కొనుగోలుదారులకు స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులే కాకుండా మరిన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయి. అంటే విదేశీ వాణిజ్యం వివిధ దేశాలలోని మార్కెట్లను అనుసంధానం చేస్తుంది.

ప్రశ్న 16.
1950-1960 ప్రాంతంలో భారతదేశం దిగుమతులపై ఎందుకు అవరోధాలు విధించింది?
జవాబు:
1950-1960లలో పరిశ్రమలు అప్పుడే నెలకొల్పబడుతున్నాయి. ఈ దశలో దిగుమతుల నుంచి పోటీని అనుమతించి ఉంటే ఈ పరిశ్రమలు నిలదొక్కుకుని ఉండేవి కావు. కాబట్టి అత్యవసర వస్తువులైన యంత్రాలు, రసాయనిక ఎరువులు, ముడి చమురు వంటి వాటి దిగుమతిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది.

ప్రశ్న 17.
“ప్రపంచీకరణ వలన జీవన ప్రమాణాలు పెరిగాయి.” వివరించండి.
జవాబు:
ప్రపంచీకరణ ఫలితంగా ప్రజల జీవితాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు, ప్రత్యేకించి పట్టణాలలోని సంపన్నులకు మేలు జరిగింది. వీళ్లు ఎంచుకోటానికి ఇప్పుడు ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి. అనేక ఉత్పత్తులలో నాణ్యత పెరిగి, ధరలు తగ్గాయి. ఫలితంగా ఈ ప్రజలకు అంతకు ముందు సాధ్యం కానంతగా మెరుగైన “జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 18.
బహుళజాతి సంస్థలు అంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయో వివరించండి.
జవాబు:

  1. ఒకదేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టి లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థలు అంటారు.
  2. కార్మికులు, ఇతర వనరులు చౌకగా లభించే ప్రాంతాలలో బహుళజాతి సంస్థలు తమ కార్యాలయాలను, కర్మాగారాలను నెలకొల్పుతాయి.
  3. ఉత్పత్తి ఖర్చులను తగ్గించి ఇలా లాభాలు పెంచుకుంటాయి.
  4. ఉత్పత్తి ప్రక్రియను చిన్నచిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పలుచోట్ల చేపడతాయి. అంతేకాక వినియోగదారుల సేవ అందిస్తాయి.

10th Class Social 10th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వ్యాపారము మరియు పెట్టుబడుల విధానాల సరళీకరణ ప్రపంచీకరణకు ఏవిధంగా తోడ్పడుతుంది?
జవాబు:

  1. వ్యాపారము మరియు పెట్టుబడుల విధానాల సరళీకరణ వలన ప్రపంచీకరణ సులభతరమైంది.
  2. సరళీకరణ విధానాల వలన పరిశ్రమల స్థాపనలో ఉన్న అవరోధాలు తొలగించబడ్డాయి.
  3. వస్తువులు, సేవలు ప్రపంచవ్యాప్తంగా అందరికి అందుబాటులోకి వచ్చాయి.
  4. బహుళ జాతి కంపెనీల ఏర్పాటు వలన ప్రపంచీకరణ వేగవంతమైంది.
  5. వస్తువుల నాణ్యత పెరిగింది.
  6. వ్యాపార మరియు పెట్టుబడుల సరళీకరణ వల్ల రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందాయి.
  7. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, అంతర్జాలం సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చి ప్రపంచీకరణకు దోహదం కలిగింది.
  8. అంతర్జాలం ద్వారా ప్రపంచం నలుమూలల నుండి ఏ సమాచారాన్నైనా క్షణాలలో తక్కువ ఖర్చుతో పొందగలుగుతున్నారు.

ప్రశ్న 2.
బహుళ జాతి సంస్థలు ప్రపంచీకరణకు ఏవిధంగా సహాయపడతాయో వివరించండి.
జవాబు:

  1. ప్రపంచీకరణ సాధించడంలో బహుళజాతి సంస్థల పాత్ర గణనీయంగా ఉంది.
  2. పెట్టుబడి, శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం మొదలగు వాటి ప్రవాహాల ద్వారా బహుళజాతి సంస్థలు సరిహద్దు లేని ప్రపంచాన్ని సృష్టించాయి.
  3. బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తులనే కాక క్రొత్త వ్యాపార విధానాలను మరియు వివిధ దేశాల సంస్కృతులను పరిచయం చేస్తున్నాయి.
  4. వివిధ స్థానిక కంపెనీల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడానికి బహుళజాతి కంపెనీలు దోహదం చేస్తున్నాయి.
  5. బహుళజాతి సంస్థలు వివిధ రకాల వాహనాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తున్నాయి.
  6. ప్రపంచ ప్రజల మధ్య విశాల దృక్పథాన్ని పెంపొందించడానికి బహుళజాతి సంస్థలు తోడ్పడుతున్నాయి.

ప్రశ్న 3.
భారత ప్రభుత్వం విదేశీ పెట్టుబడి, వాణిజ్యాలపై అవరోధాలు కల్పించడానికి గల కారణాలు ఏమిటి? ఈ అవరోధాలను తొలగించాలని ఎందుకు అనుకున్నది?
జవాబు:
విదేశీ పెట్టుబడులపై, వాణిజ్యాలపై భారత ప్రభుత్వం అవరోధాలు కల్పించటానికి గల కారణాలు.

  1. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం.
  2. మన దేశంలో పరిశ్రమలు తగినంత స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం.
  3. విదేశీ పెట్టుబడులు మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయని భావించడం.
  4. విదేశీ ఉత్పత్తులతో పోలిస్తే మన వస్తువుల నాణ్యత తక్కువగా ఉండటం.
  5. దేశంలోని ఉత్పత్తిదారులకు విదేశీ పోటీ నుండి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భావించిన భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడుల పై అవరోధాలు కల్పించింది. అయితే 1991 నుండి భారత ఉత్పత్తిదారులు ప్రపంచవ్యాప్త ఉత్పత్తిదారులతో పోటీపడాల్సిన అవసరం ఉందని నిర్ణయించి ఈ అవరోధాలను తొలగించారు. దానికి గల కారణాలు :
    1) ప్రపంచ దేశాలన్నీ ప్రపంచీకరణ వైపు మొగ్గుచూపడం.
    2) విదేశీ పెట్టుబడుల వల్ల స్థానిక కంపెనీలు అభివృద్ధి చెందడం.
    3) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 4.
బహుళజాతి కంపెనీల వలన కలుగు లాభ, నష్టాలు ఏవి?
జవాబు:
బహుళజాతి కంపెనీల వలన కలుగు లాభాలు :

  1. ఉపాధి అవకాశాలు పెరుగుచున్నాయి.
  2. నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తున్నాయి.
  3. ప్రజలు నైపుణ్యాలను మెరుగు పరచుకున్నారు.
  4. ప్రజల జీవన ప్రమాణ స్థాయి మెరుగుపడింది.
  5. ఉత్పత్తిదారుల మధ్య పోటీ పెరిగింది.
  6. భారతదేశం కూడా ప్రపంచంలోని అగ్రదేశాలతో ఉత్పత్తులు విషయంలో పోటీపడగలుగుతుంది.
  7. వీటివలన దేశంలో అవస్థాపన సౌకర్యాలు మెరుగుపడతాయి.
  8. దేశాల మధ్య అనుసంధానం పెరుగుతుంది.

బహుళజాతి కంపెనీల వలన కలుగు నష్టాలు :

  1. సాంకేతిక పరిజ్ఞానం కలవారికి మాత్రమే ఉపాధి లభిస్తుంది, మిగతావారు నిరుద్యోగులవుతున్నారు.
  2. చిన్న ఉత్పత్తిదారులు పోటీని తట్టుకోలేక పరిశ్రమలను మూసివేస్తున్నారు.
  3. వ్యవసాయరంగం పూర్తిగా విస్మరించబడింది.
  4. గ్రామాలు కనుమరుగై పట్టణాల సంఖ్య పెరుగుతుంది.
  5. దేశీయ మార్కెట్ పై బహుళజాతి కంపెనీల పెత్తనం పెరిగింది.

ప్రశ్న 5.
బహుళజాతి కంపెనీ (MNC) లు రావడం వలన కుటీర చిన్నతరహా పరిశ్రమలు ఎలా అంతరించుకుపోతున్నాయో ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
బహుళజాతి కంపెనీలు రావడం వలన కుటీర / చిన్నతరహా పరిశ్రమలు అంతరించిపోవడానికి కారణాలు :

  1. బహుళజాతి కంపెనీల ప్రధాన లక్ష్యం ఎక్కువ లాభాలను గడించడం.
  2. దీని కొరకు అవి అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలలో పెట్టుబడులు పెడతాయి.
  3. ఈ బహుళజాతి కంపెనీలు అది పెట్టుబడి పెట్టిన దేశంలోని వనరులను సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి.
  4. ఉత్పత్తి ఖర్చులను తగ్గించి, వస్తువులను తక్కువ ధరలలో అమ్ముతాయి.
  5. అందువలన చిన్న ఉత్పత్తిదారులు ఈ పోటీని తట్టుకోలేక పరిశ్రమలను మూసివేసే స్థాయికి వస్తున్నారు.

ఉదా :
1) బుట్టలు తయారుచెయ్యడం :
ప్లాస్టిక్, స్టీలు తదితర వస్తువులతో తయారయ్యేవి తక్కువ ధరకు దొరకడం వలన ఈ కుటీర పరిశ్రమ మూతబడే స్థాయికి వచ్చింది.

2) చేనేత పరిశ్రమ :
మరమగ్గాలు ఉపయోగించడం వలనను, కృత్రిమ వస్త్రాలు లభ్యత వలనను ఈ పరిశ్రమ కూడా కష్టకాలంలో ఉంది.

ప్రశ్న 6.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావాలేమిటి ? విస్తరిస్తున్న ప్రపంచీకరణ వల్ల భారతదేశానికి ప్రయోజనాలేమిటి ? నీ అభిప్రాయాన్ని వివరించుము.
జవాబు:
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావం :

  1. ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు ప్రత్యేకించి పట్టణాలలోని సంపన్నులకు మేలు జరిగింది.
  2. వినియోగదారులకు ఎంచుకోవడానికి ఇప్పుడు ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి.
  3. అనేక ఉత్పత్తులలో నాణ్యత పెరిగింది.
  4. ప్రజలు అంతకు ముందు సాధ్యం కానంతగా మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు.

ప్రపంచీకరణ వల్ల దేశానికి ప్రయోజనాలు:

  1. బహుళజాతి సంస్థలు భారతదేశంలో తమ పెట్టుబడులను పెంచాయి.
  2. పారిశ్రామిక, సేవారంగాలలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.
  3. భారతీయ కంపెనీలు విదేశీ కంపెనీలతో కలసి పనిచేయడం వల్ల లాభపడ్డారు.
  4. ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా బహుళజాతి కంపెనీలుగా ఎదిగాయి.
    ఉదా: టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రానాలాక్సీ
  5. ప్రపంచీకరణ వల్ల ఐ.టి.తో కూడిన సేవలు అందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి.

ప్రశ్న 7.
కార్మిక చట్టాల సడలింపు వలన కంపెనీలు ప్రస్తుతం ఏ విధంగా లాభపడుతున్నాయి?
జవాబు:
కార్మిక చట్టాల సడలింపు వలన ప్రస్తుత కంపెనీలకు కలిగే లాభం :

  1. తక్కువ కాలవ్యవధికి కార్మికులను నియమించుకోవడం (తాత్కాలికం).
  2. తక్కువ వేతనాలు ఇవ్వడం.
  3. ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవడం.
  4. బహుళ జాతి కంపెనీలను ఆకర్షించడం.
  5. ఎక్కువ పనిగంటలు.
  6. ఉత్పత్తి పెరగడం
  7. కార్మికులకు సౌకర్యాలు కల్పించలేకపోవడం.
  8. కార్మికులను ఎప్పుడైనా తొలగించడం.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 8.
“ఉత్పత్తిదారులు, కార్మికులపై ప్రపంచీకరణ ప్రభావం ఒకేరకంగా లేదు.” దీనిపై నీ అభిప్రాయాలను తెలుపండి.
జవాబు:

  1. ప్రపంచీకరణ ప్రయోజనాలు సమంగా పంపిణీ కాలేదు.
  2. అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు, సంపన్న వినియోగదారులకు అది ప్రయోజనకరంగా ఉంది.
  3. మరొక వైపున చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు, వారి ఉపాధికి, హక్కులకు భంగం కలుగుతున్నది.
  4. ప్రపంచీకరణ న్యాయంగా జరగాలి. అది అందరికీ అవకాశాలు కల్పించాలి.
  5. దీనిని సాధ్యం చేయడంలో ప్రభుత్వాలు ప్రధాన పాత్రను పోషించాలి.
  6. కార్మిక చట్టాలను సక్రమంగా అమలయ్యేలా, కార్మికులకు తమ హక్కులు లభించేలా చూడాలి.

ప్రశ్న 9.
ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు నీవు మద్దతిస్తావా? వ్యతిరేకిస్తావా? ఎందువలన?
జవాబు:
నేను ప్రత్యేక ఆర్థిక మండళ్ళను వ్యతిరేకిస్తాను.
కారణమేమనగా :

  1. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ కొరకు జరిగే భూసేకరణ వలన వ్యవసాయాధార జీవనంపై ప్రభావితం చూపుతుంది.
  2. ముందుగా ప్రకటించిన విధంగా ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఉపాధిని కల్పించలేకపోతున్నాయి.
  3. కొన్ని సందర్భాలలో ప్రత్యేక ఆర్థిక మండళ్ళు పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

లేదా

నేను ప్రత్యేక ఆర్థిక మండళ్ళను సమర్థిస్తాను. కారణాలు:

  1. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు పెద్ద యెత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.
  2. అవి ప్రపంచస్థాయి అవస్థాపనా సౌకర్యాలను ఒకే ప్రదేశంలో అందిస్తాయి.
  3. విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల స్థాపనకు దోహదపడతాయి.

ప్రశ్న 10.
క్రింది పేరాగ్రాఫ్ ను చదివి, వ్యాఖ్యానించుము.
సమాచార, భావ ప్రసార సాంకేతిక రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా, వేగంగా ఉన్నది. టెలికమ్యూనికేషన్ సేవలను ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మారుమూల ప్రాంతాల నుండి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారు.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరాగ్రాలో సాంకేతిక రంగంలో అభివృద్ధిని గురించి వివరిస్తూ దానితోపాటు సమాచార భావప్రసార సాంకేతిక రంగాల అభివృద్ధిని వివరించారు.

త్వరిత గతిన అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ప్రతి శాఖకు కూడా నూతన సమాచారంను చేర్చి ఆధునికీకరించ బడినవి. సాంకేతిక, సమాచార రంగంలో ఇలా మార్పులు రావడానికి కారణం ఇ-మెయిల్, గూగుల్, ఇంటర్నెట్ మొదలైనవి. ఇవి మన సమస్యలను, మన పనులను త్వరగా పరిష్కరించుకోవడానికి సహాయపడటమే కాకుండా మన జీవన విధానాన్ని కూడా మార్చివేశాయి. అంతేకాకుండా మొబైల్ ఫోన్ ద్వారా కూడా మనం చాలా సమాచారాన్ని సేకరించడమే కాకుండా వివిధ రకాల బిల్లులను కూడా కట్టవచ్చు. ప్రభుత్వంవారు GO లను, Memo లను mail ద్వారా సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతోంది.

అయితే దీనివలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దీనివలన యువత కొన్ని అసభ్యకర అంశాలను చూడటమే కాకుండా చెడుదారిన పడుతున్నారు. కావున ప్రభుత్వం సమాచార, సాంకేతిక శాఖలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా చూడాలి మరియు అసభ్యకర అంశాలు ఉండకుండా కట్టుదిట్టం చేయాలి.

ప్రశ్న 11.
ప్రపంచీకరణకు దోహదం చేసిన అంశాలను వివరించండి.
జవాబు:

  1. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందింది.
  2. దీనివలన ఉత్పత్తి, వాణిజ్యము, మరీ ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి.
  3. నేడు కంప్యూటర్, ఇంటర్నెట్ కారణంగా ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది.
  4. 1991 తరువాత విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులపై గల పరిమితులను చాలావరకు భారతదేశంలో తొలగించారు.
  5. ఇది భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది.
  6. WTO వంటి అంతర్జాతీయ సంస్థలు అనుసరించిన విధానాలు ప్రపంచవ్యాప్తంగా బహుళ జాతి సంస్థల ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నాయి.

ప్రశ్న 12.
క్రింది పేరాగ్రాను చదివి వ్యాఖ్యానించండి.
ప్రపంచీకరణ ప్రయోజనాలు అందరికీ సమానంగా పంపిణీ కాదు. సంపన్న వినియోగదారులకు, నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు అది ప్రయోజనకరంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి. ఇంకొకవైపున వేలాదిమంది చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు వాళ్ళ ఉపాధికి, హక్కులకు భంగం కలుగుతోంది. రెండు పార్శ్వాలున్న ఈ ప్రపంచీకరణను అర్థం చేసుకోవడం ముఖ్యం.
జవాబు:
ప్రపంచీకరణ ప్రభావం – వ్యాఖ్య :

  1. భారతదేశం పై ప్రపంచీకరణ ప్రభావం సమానంగా లేదు.
  2. కొన్ని భారతీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలుగా ఎదిగాయి.
  3. ఇంకొకవైపున అనేకమంది చిన్న ఉత్పత్తిదారులు ప్రపంచీకరణ పట్ల సంతోషంగా లేరు.
  4. భారీస్థాయిలో విదేశాల నుండి దిగుమతి అవుతున్న చవక వస్తువులతో పోటీ పడలేక వారి యొక్క అనేక సంస్థలు మూతపడ్డాయి.
  5. ప్రపంచీకరణ న్యాయంగా లేకుంటే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతాయి.
  6. ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చెయ్యాలి’ అనేది ప్రస్తుతం మన ముందున్న ముఖ్యమైన ప్రశ్న.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 13.
క్రింది పేరాగ్రాఫ్ ను చదివి, వ్యాఖ్యానించండి.
ఈ ప్రపంచీకరణకు ఆర్థిక రంగమే మూలం అని భావించేవాళ్ళు దానికి ఆర్థిక శక్తులు కారణమని, దాని ఎల్లలను అవే | నిర్ణయిస్తాయని వాదిస్తారు. రాజకీయాలు కారణం అని భావించే వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాల వల్ల ముందుగా ఇది మొదలయ్యిందని అంటారు.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరాగ్రాఫ్ ప్రకారం, ప్రపంచీకరణకు ప్రధాన కారణం ఆర్థికపరమైన అంశాలు.
ఉదా : మనదేశంలో 1992లో రూపాయి విలువ పతనమౌతున్న సందర్భంలో అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావుగారు కొన్ని షరతులతో కూడిన ప్రపంచీకరణ అంశాన్ని రూపొందించడం జరిగింది.

ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే మరియు ఇతర దేశాలతో పాటు సమానంగా అన్ని అంశాలలో పోటీని ఇవ్వాలి అంటే ప్రపంచీకరణ తప్పనిసరి. దానికి ఆర్థిక అంశాలే కాకుండా, రాజకీయ అంశాలు కూడా ముఖ్యమైనవే.

అయితే మనం మనదేశ ఆర్థిక అభివృద్ధి కోసం బహుళజాతి సంస్థలను ఆహ్వానిస్తున్నాం. అవి మన రాజకీయ నాయకులను ఇక్కడ ఉన్న వ్యాపారులను ప్రలోభపెట్టి వారు లాభాలను గడిస్తున్నారు.

కావున ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలకు లోబడకుండా మనదేశంలో ఏ ఏ రంగాలలో మాత్రమే అవి అవసరం అని గమనించి అక్కడ మాత్రమే వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వలన మన చిన్న, చిన్న వ్యాపారస్తులు వ్యవసాయదారులు, పరిశ్రమల వారు నష్టపోకుండా ఉంటారు.

బహుళ జాతి సంస్థల వలన మరియు ప్రపంచీకరణ వలన మనం మనకు నచ్చిన వస్తువులను మనకు అందుబాటులో ఉన్న ధరలకు కొనుగోలు చేయగలుగుతున్నాం.

కాని ఇక్కడ ప్రభుత్వాలు గమనించవలసిన విషయం ఏమిటంటే సాధ్యమైనంతవరకు మన దేశంలోని చిన్న, చిన్న వ్యాపారులకు ప్రభుత్వమే తక్కువ వడ్డీకి పెట్టుబడిని అందించి ఆ వస్తువులు అన్ని మనదేశంలో కూడా తయారుచేసే లాగా చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది.

దీని వలన మన ప్రజలకు ఉపాధితో పాటు, మనదేశం కూడా ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. దీని వలన మన ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్ళకుండా మన మానవ వనరులను మనం ఉపయోగించుకోవచ్చు.

ప్రశ్న 14.
ప్రపంచీకరణకు సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యకారణం – సమర్థింపుము.
జవాబు:
ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడం. ఉదాహరణకు, గత యాభై సంవత్సరాలలో రవాణా, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందాయి. ఫలితంగా ఎంతో దూరాలకు త్వరగా, తక్కువ ధరలకు వస్తువులను చేరవేస్తున్నారు.

సమాచార, భావ ప్రసార సాంకేతిక రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా, వేగంగా ఉన్నాయి. టెలికమ్యూనికేషన్ సేవలను (టెలిగ్రాఫ్, టెలిఫోను, మొబైల్ ఫోన్లతో సహా ఫ్యాక్స్) ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోటానికి, మారుమూల ప్రాంతాలనుంచి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఉపగ్రహ ప్రసార సాధనాల వల్ల ఇదంతా సాధ్యమయ్యింది. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్లు ప్రవేశించాయి. ఇంటర్నెట్ అనే అద్భుత ప్రపంచంతో మీకు పరిచయం ఉండి ఉంటుంది. దీని ద్వారా మీరు ఏ విషయం గురించైనా సమాచారాన్ని పొందవచ్చు, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని పంచుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా నామమాత్రపు ఖర్చుతో మీరు తక్షణమే ఎలక్ట్రానిక్ మెయిల్ (e-mail) పంపించవచ్చు. ఎవరితోనైనా (voice-mail) మాట్లాడవచ్చు.

ప్రశ్న 15.
ప్రపంచ వాణిజ్య సంస్థ గూర్చి నీకేం తెలుసు?
(లేదా)
సరళీకృత విధానాలు ఏర్పడేలా ప్రపంచ వాణిజ్య సంస్థ కృషి చేస్తుంది? సమర్ధింపుము.
జవాబు:
అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చూసే ఉద్దేశంతో పని చేస్తున్న సంస్థలలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒకటి. అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఏర్పడిన ఈ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి, అవి పాటించబడేలా చూస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 150 దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ అందరూ స్వేచ్ఛా వాణిజ్యం చేపట్టేలా చూడాలి. అయితే ఆచరణలో అభివృద్ధి చెందిన దేశాలు అన్యాయపూరిత వాణిజ్య అవరోధాలను ఇంకా కొనసాగిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను వాణిజ్యం అవరోధాలు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో వాణిజ్యంపై ఉత్పత్తుల్లో వాణిజ్యంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ దీనికి ఉదాహరణ.

ప్రశ్న 16.
ప్రత్యేక ఆర్థిక మండళ్ళు (SEZS) ఏర్పాటు ద్వారా భారతదేశంలోకి పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తున్నారు?
జవాబు:
ఇటీవలి కాలంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ కంపెనీలను ఆకర్షించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండలి (SEZS) అనే పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పుతున్నాయి. ఈ సెజ్ లో ప్రపంచస్థాయి సౌకర్యాలు ఉంటాయి. విద్యుత్తు, నీళ్లు, రోడ్లు, రవాణా, గిడ్డంగులు, విద్య, వినోద సదుపాయాలు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (SEZ) లో కర్మాగారాలను స్థాపించే కంపెనీలు మొదటి అయిదేళ్లపాటు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు.

విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రభుత్వం కార్మిక చట్టాలను సడలించింది. కార్మికులను దీర్ఘకాలిక ప్రాతిపదికన కాకుండా పని ఒత్తిడిని బట్టి తక్కువ కాల వ్యవధికి నియమించుకునే అవకాశం ఉంది. దీనివల్ల కంపెనీకి కార్మికుల పైన అయ్యే ఖర్చు తగ్గుతుంది. అయితే విదేశీ కంపెనీలు కార్మిక చట్టాలను ఇంకా సడలించాలని కోరుతున్నాయి.

ప్రశ్న 17.
ప్రపంచీకరణ ఫలితాలు అందరికీ అందాలంటే ప్రభుత్వం ఏం చేయాలి?
జవాబు:
ప్రపంచీకరణ వల్ల అందరూ ప్రయోజనం పొందలేదు. విద్య, నైపుణ్యం, సంపద ఉన్న వాళ్లు కొత్త అవకాశాల వల్ల బాగా లాభపడ్డారు. ఇంకొకవైపున ఎటువంటి ప్రయోజనం పొందని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రపంచీకరణ ఇప్పుడు ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చెయ్యాలి అనేది మన ముందున్న ప్రశ్న. న్యాయమైన ప్రపంచీకరణ అందరికీ అవకాశాలు సృష్టిస్తుంది. దాని ప్రయోజనాలు మరింత బాగా పంచుకోబడతాయి.

దీనిని సాధ్యం చెయ్యటం ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానాలు ధనికులు, అధికారం ఉన్న వాళ్లవే కాక దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను కాపాడేలా ఉండాలి. ప్రభుత్వం చేపట్టగలిగిన కొన్ని చర్యల గురించి మీరు తెలుసుకున్నారు. ఉదాహరణకు కార్మిక చట్టాలు సరిగా అమలు అయ్యేలా చూసి కార్మికులకు తమ హక్కులు లభించేలా చూడాలి. చిన్న ఉత్పత్తిదారులు తమ సామర్థ్యాన్ని పెంచుకుని పోటీపడగల శక్తి వచ్చేంతవరకు వాళ్లకు సహాయపడాలి. అవసరమైతే ప్రభుత్వం వాణిజ్య, పెట్టుబడి అవరోధాలను ఉపయోగించుకోవచ్చు. మరింత న్యాయపూరిత నియమాల కోసం ప్రపంచ వాణిజ్య సంస్థతో సంప్రదింపులు జరపవచ్చు. ఇవే ఆసక్తులు ఉన్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలసి, ప్రపంచ వాణిజ్య సంస్థలో అభివృద్ధి చెందిన దేశాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు.

AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 18.
ప్రపంచీకరణను వ్యతిరేకించే వారి భయాలు ఏమిటి?
జవాబు:
అసమానత్వంలోని మరొక కోణం ఇతర దేశాల విధానాలలో ధనిక దేశాల పెత్తందారీ ఆధిపత్యం. వాణిజ్యం, పెట్టుబడులు, వలస వంటి అంతర్జాతీయ ఆర్థిక విధానాలలో అయితేనేమి, దేశ వ్యవహారాలలో అయితేనేమి ధనిక పాశ్చాత్య దేశాలు మిగిలిన ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO), ప్రపంచ బ్యాంకు (WB). అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఒకవైపున ప్రపంచీకరణకు మద్దతు పలికేవాళ్లు విశ్వ అనుసంధానం ద్వారా ప్రపంచీకరణ అభివృద్ధికి, సంపదకు అవకాశాలను అందిస్తుందని భావించగా, దానిని విమర్శించే వాళ్లు ప్రపంచంపై ఆధిపత్యం పొందటానికి కొన్ని పాశ్చాత్య దేశాలు చేసే ప్రయత్నమని భావిస్తున్నారు. అనేక పేద దేశాలలో దీనివల్ల ప్రజాస్వామ్యం, కార్మికుల హక్కులు, పర్యావరణానికి భంగం కలుగుతోందని వీళ్లు వాదిస్తున్నారు.

ప్రశ్న 19.
కెపాసిటర్లు ఉత్పత్తి చేసిన రవి పై ప్రపంచీకరణ ప్రభావం ఏమిటి?
జవాబు:
2001లో ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం కారణంగా ప్రభుత్వం కెపాసిటర్ల దిగుమతిలో పరిమితులను తొలగించటంతో అతడి కష్టాలు మొదలయ్యాయి. అతడి ప్రధాన కొనుగోలుదారులైన టెలివిజన్ కంపెనీలు టెలివిజన్ సెట్ల ఉత్పత్తికి కెపాసిటర్లతో సహా వివిధ విడి భాగాలను పెద్ద సంఖ్యలో కొనేవి. అయితే బహుళజాతి సంస్థ (MNC)ల టీవీ బ్రాండుల నుంచి పోటీ ఫలితంగా భారతీయ టెలివిజన్ కంపెనీలు బహుళజాతి సంస్తలకు అసెంబ్లింగ్ కేంద్రాలుగా మారిపోయాయి. అవి ఒకవేళ కెపాసిటర్లు కొనాల్సి ఉన్నా వారు దిగుమతి చేసుకున్నవి రవి లాంటి ఉత్పత్తిదారులు ఇస్తున్న ధరలో సగానికి వస్తున్నాయి. కాబట్టి వాటికే మొగ్గు చూపుతారు.

ఇప్పుడు రవి 2000 సంవత్సరంలో ఉత్పత్తి చేసిన సంఖ్యలో సగమే ఉత్పత్తి చేస్తున్నాడు. అతని దగ్గర ఇప్పుడు ఏడుగురు కార్మికులు మాత్రమే పని చేస్తున్నారు.

ప్రశ్న 20.
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల గూర్చి నీకేం తెలుసు?
జవాబు:
పునర్నిర్మాణం, అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంకును (IBRD), అంతర్జాతీయ అభివృద్ధి సంఘాలను (IDA) కలిపి ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు. ఈ రెండు సంస్థలలో 170కి పైగా సభ్యదేశాలు ఉన్నాయి. అమెరికా వంటి దేశాలు ఈ సంస్థల పనిని నిర్దేశిస్తాయి. ఈ నాటికి కూడా అమెరికా ఓటుకు 16% విలువ ఉంది. జపాన్, జర్మనీ, యుకె, ఫ్రాన్స్, వంటి దేశాలు ఒక్కొక్కదానికి 3-6% ఓటు అధికారం ఉంది. పేద దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంది. ప్రస్తుతం ఇతర పేద దేశాలతో పోలిస్తే ఇండియా, చైనాలకు ఎక్కువ ఓటింగు అధికారం ఉంది. ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవటంలో ప్రపంచ బ్యాంకు సలహా ఇచ్చి, మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చెయ్యగలుగుతోంది.

ప్రశ్న 21.
సంస్కృతి, భాషలపై ప్రపంచీకరణ ప్రభావం……… ఈ అంశంలో వినిపిస్తున్న భిన్న వాదనలేమి?
జవాబు:
అందరి దృష్టిని ఆకర్షించిన మరొక అంశం, ప్రపంచీకరణ సాంస్కృతిక వైవిధ్యతకు దారితీస్తుందా లేక సాంస్కృతిక మూసపోతకు దారితీస్తుందా అనేది. ఆధునిక ప్రసార సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని సంస్కృతులు, భావాలు ప్రాచుర్యం పొంది ఇతర స్థానిక, అల్ప సంఖ్యాక వర్గాల సంస్కృతులు పక్కకు నెట్టివేయబడ్డాయని కొందరు వాదిస్తారు. అయితే మరికొందరు ప్రత్యేక, తరచుగా పక్కకు నెట్టివేయబడిన సాంస్కృతిక అలవాట్లకు ప్రపంచీకరణ తగినంత చోటు ఇచ్చి అవి విస్తరించడానికి దోహదపడిందని భావిస్తున్నారు. కొన్ని భాషలు విస్తృతంగా ఉపయోగింపబడి అంతర్జాతీయ ప్రసార సాధనాలకు వారధిగా ఉండి ఇతర భాషలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కొన్ని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని కొంతమంది పేర్కొంటున్నారు.

ప్రశ్న 22.
ఈ క్రింది దేశాలను ప్రపంచపటంలో గుర్తించండి.
1) అమెరికా
2) చైనా
3) మెక్సికో
4) భారతదేశం
5) తూర్పు యూరోపియన్ దేశాలు :
i) పోలాండ్
ii) ఉక్రెయిన్
iii) రొమేనియా
iv) బల్గేరియా
v) చెక్ రిపబ్లిక్
vi) స్లోవేకియా
AP 10th Class Social Important Questions Chapter 10 ప్రపంచీకరణ 2

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

These AP 10th Class Social Studies Important Questions 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Social 9th Lesson Important Questions and Answers రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social 9th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ఒక హెక్టారు ఎన్ని ఎకరాలకు సమానం?
జవాబు:
2 ½ ఎకరాలు

2. ఒక హెక్టారుకు ఎన్ని చదరపు మీటర్లుకు సమానం?
జవాబు:
10,000 చ.కి.మీ.

3. భూమిని కొలవడానికి ప్రామాణిక కొలమానము ఏది?
జవాబు:
హెక్టారు.

4. ఖరీఫ్ కాలంలో పండించే పంటకు ఒక ఉదాహరణ ఇవ్వండి ?
జవాబు:
వరి, జొన్న, సజ్జ.

5. రబీ కాలంలో పండించే ప్రధాన పంటకు ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:
గోధుమ.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

6. ఉత్పత్తికి అవసరం లేని సహజ వనరు ఏది?
జవాబు:
గాలి.

7. ఉత్పత్తి ప్రక్రియలో వస్తువులు, యంత్రాలు మరియు నిర్మాణాలను ఏమని పిలుస్తారు?
జవాబు:
స్థిర / భౌతిక మూలధనం

8. MGNREGA ని విస్తరింపుము.
జవాబు:
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

9. వర్షాకాలపు పంట ఋతువు నేమంటారు?
జవాబు:
ఖరీఫ్.

10. శీతాకాలపు పంట ఋతువు నేమంటారు?
జవాబు:
రబీ.

11. వేసవి కాలపు పంట ఋతువు నేమంటారు?
జవాబు:
జయాద్.

12. భారతదేశ గ్రామాలలో ప్రధాన ఉత్పత్తి / ఉపాధి కార్యకలాపం ఏది?
జవాబు:
వ్యవసాయం.

13. రాంపురం గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు:
ఉత్తరప్రదేశ్.

14. రాంపురంలో సాగుభూమి ఏ సంవత్సరం నుంచి సాగుభూమి విస్తీర్ణం పెరగలేదు?
జవాబు:
1921.

15. ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చెయ్యటాన్ని ఏమంటారు?
జవాబు:
బహుళ పంటల సాగు.

16. ఈనాటికి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో ఎంత శాతాని కంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది?
జవాబు:
40%

17. రాంపురం జనాభా ఎంత? ఎన్ని కుటుంబాలున్నాయి?
జవాబు:
2660, 450

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

18. రాంపురంలో ఎన్నో వంతు మందికి భూమి లేదు?
జవాబు:
1/3 వంతు.

19. రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగుచేసే రైతుల నేమంటారు?
జవాబు:
చిన్న రైతులు.

20. రెండు హెక్టార్ల కంటే ఎక్కువ భూమిని సాగుచేసే రైతుల నేమంటారు?
జవాబు:
పెద్ద, మధ్య తరగతి రైతులు.

21. గ్రామాలలో పని దొరకని రోజులలో వ్యవసాయ కూలీలు ఏ పథకంలో పనికోసం పంచాయితీలో దరఖాస్తు చేసుకొంటారు?
జవాబు:
MGNREGA.

22. రాంపురంలోని పనిచేసే వాళ్ళల్లో ఎంత శాతం మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు?
జవాబు:
25%

23. 2009 – 2010లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులలో ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు?
జవాబు:
32 మంది.

24. చెరుకు యొక్క పంటకాలం ఎంత?
జవాబు:
సంవత్సరం.

25. శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా దీనికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ అది సూచిస్తుంది?
జవాబు:
ఉత్పత్తికి.

26. వ్యవసాయ ఉత్పత్తికి ఏ ఉత్పత్తికారకం చాలా కీలకమైన అంశం?
జవాబు:
భూమి.

27. అక్టోబరు – డిసెంబరు నెలల మధ్య ఏ పంట సాగుచేస్తారు?
జవాబు:
బంగాళాదుంప.

28. భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడులను కలుపుకుని వ్యక్తులు లేదా వ్యాపార వేత్తలు ఉత్పత్తి చేస్తారు. వీటిని ఏమంటారు?
జవాబు:
ఉత్పత్తి కారకాలు.

29. రాంపురంలోని నేలలు ఏ రకపు నేలలు?
జవాబు:
ఒండ్రు.

30. రాంపురం గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేనప్పుడు రైతులు బావుల నుంచి నీళ్లు పైకి తోడటానికి ఏ పరికరాన్ని వాడారు?
జవాబు:
పర్షియన్ వీల్.

31. భూసారం తగ్గడానికి గల కారణాలలో ఏదైన ఒకదానిని రాయండి?
జవాబు:
రసాయనిక ఎరువుల వాడకం, పురుగుమందుల వాడకం.

32. భారతదేశంలో 2 హెక్టార్లకంటే తక్కువ విస్తీర్ణాన్ని సాగుచేస్తున్న చిన్న రైతుల శాతం ఎంత?
జవాబు:
87%

33. భారతదేశంలో మధ్య తరగతి, పెద్ద రైతులు సాగుచేస్తున్న సాగు భూమి శాతం ఎంత?
జవాబు:
52%

34. వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయటానికి ఉత్పత్తిదారులకు కావలసిన సహజ వనరులు ఏవి?
జవాబు:
భూమి, నీరు, ఖనిజలవణాలు, అడవులు, సూర్యరశ్ని.

35. సంవత్సరాల తరబడి ఉపయోగపడటానికి, వాటికి కొంత మరమ్మత్తు, నిర్వహణ కోసం పెట్టే పెట్టుబడి నేమంటారు?
జవాబు:
భౌతిక పెట్టుబడి.

36. ముడి సరుకు కొనుగోలు పై పెట్టే పెట్టుబడి నేమంటారు?
జవాబు:
నిర్వాహక పెట్టుబడి.

37. 2011 డిసెంబరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విత్తనాలు నాటినందుకు పురుషునికి ఇచ్చే రోజువారీ కూలీరేటు ఎంత ఉంది?
జవాబు:
197 రూపాయలు.

38. పాలను నిల్వ చేయటానికి ఉపయోగించు ప్రక్రియ ఏది?
జవాబు:
శీతలీకరణ.

39. రాంపురం నందు రెండు హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని?
జవాబు:
60.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

40. రాంపురంలో మూడవ పంటగా ఏమి పంట పండిస్తున్నారు ?
జవాబు:
బంగాళాదుంప.

41. ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలం చెల్లించగా మిగిలిన ఉత్పత్తిని ఏమంటారు?
జవాబు:
మిగులు ఉత్పత్తి (లేదా) రైతు మిగులు.

42. రాంపురంలో వస్తువుల తయారీ పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంత మంది కంటే తక్కువ ఉన్నారు?
జవాబు:
50 మంది.

43. గ్రామీణ ప్రాంతంలో రెండవ సాధారణ కార్యకలాపం ఏది?
జవాబు:
పశుపోషణ.

44. కమతాల వరిమాణం తగ్గిపోవడానికి ప్రధాన కారణమేమి?
జవాబు:
వారసత్వ చట్టాలు (కుటుంబాలు విచ్చిన్నం కావడం)

45. శ్వేత విప్లవం దేనికి సంబంధించినది?
జవాబు:
పాల ఉత్పత్తికి.

46. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో ప్రధాన పరిమితి ఏమిటి?
జవాబు:
సాగుభూమి విస్తీర్ణత కొరత.

47. భారతదేశంలో మధ్యతరగతి, పెద్ద రైతులు ఎంత శాతం ఉన్నారు?
జవాబు:
13%

48. భారతదేశంలో చిన్న రైతులు సాగుచేస్తున్న సాగుభూమి శాతం ఎంత?
జవాబు:
48%

49. పెద్ద రైతులు వేటిపై ఆధారపడటం పెరగడంతో గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు లభించే పని దినాలు తగ్గి పోతున్నాయి?
జవాబు:
యంత్రాలు.

50. చాలామంది చిన్న రైతులు నిర్వాహణ పెట్టుబడి కోసం ఎవరిపై ఆధారపడతారు?
జవాబు:
వడ్డీ వ్యాపారులు.

51. క్రింది వానిలో భౌతిక / స్థిర పెట్టుబడి కానిది?
→ ట్రాక్టర్ → నాగలి → జనరేటర్ → ముడిసరుకు
జవాబు:
ముడిసరుకు

52. క్రింది వానిలో సరియైన వాక్యాలను ఎంచుకుని రాయండి?
i) ముడిసరుకు, డబ్బు అవసరాలు – నిర్వాహక పెట్టుబడి.
ii) యంత్రాలు, పరికరాలు, భవనాలు- స్థిర పెట్టుబడి
iii) పైవన్నీ ఉత్పత్తి ప్రక్రియలు పూర్తిగా వినయగారిచేవిడి వివరికి మిగలవు.
జవాబు:
(i) మరియు (ii)

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

53. క్రింది వానిలో సరికాని జత.
→ వర్షాకాలం – ఖరీఫ్.
→ చలికాలం – రబీ.
→ ఋతుపవనకాలం- దాళ్వా,
→ ఎండాకాలం – జయాద్..
జవాబు:
ఋతుపవన కాలం – దాళ్వా.

54. భూమి, స్థిర పెట్టుబడి, వడ్డీ, వ్యవస్థాపనంలలో ఉత్పత్తి కారకం కానిది ఏది?
జవాబు:
వడ్డీ.

55. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగుచెయ్యటాన్ని బహుళ పంటల సాగు అంటారు.
ii) భూమి నుంచి ఉత్పత్తి పెంచటానికి ఇది అత్యంత సాధారణ పద్దతి.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)

56. 2010 సంవత్సరం నాటికి భారతదేశంలోని సాగు విస్తీర్ణం; (మి|| హెక్టార్లు) ఎంత?
జవాబు:
140 మిలియన్ హెక్టార్లు

57. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) గ్రామాలలో అనేక రకాల వ్యవసాయేతర పనులలో చాలా కొద్దిమందికే ఉపాధి దొరుకుతుంది.
ii) 2009 -10లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులలో 32 మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (1) మాత్రమే
B) (II) మాత్రమే
C) (1) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)

క్రింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానము రాయుము.
పట్టిక : డిసెంబరు 2011లో వివిధ వ్యవసాయ పనులకు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కూలి రేట్లు (రూపాయలలో)
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 1

58. పురుషులు మాత్రమే చేస్తున్న పని ఏది?
జవాబు:
దున్నటం.

59. స్త్రీలు మాత్రమే చేస్తున్న పనులు ఏవి?
జవాబు:
నాట్లు వేయటం, పత్తి ఏరడం

60. స్త్రీ, పురుష కూలి రేట్లలో వ్యత్యాసం ఎందుకుంది?
జవాబు:
ఆడవారికంటే మగవారు ఎక్కువ పనిచేయగలరనే భావన.

క్రింది రేఖాచిత్రము పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానము వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

61. పై రేఖా చిత్రం ఏమి తెలియజేస్తుంది?
జవాబు:
సాగుభూమి పంపిణీలో అసమానతలను.

62. తక్కువ మంది కలిగి ఉండి, ఎక్కువ సాగుభూమి కలిగి ఉన్న రైతులు ఎవరు?
జవాబు:
మధ్య తరగతి, పెద్ద రైతులు.

63. ఎక్కువ మంది ఉండి, తక్కువ సాగుభూమి కలిగి ఉన్న రైతులు ఎవరు?
జవాబు:
చిన్న రైతులు.

10th Class Social 9th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
బహుళ పంటల విధానమనగానేమి?
జవాబు:
ఒక నిర్ణీత భూభాగంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండించటాన్ని బహుళ పంటల విధానం అంటారు.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో గల ప్రధానమైన వ్యవసాయేతర కార్యకలాపాలేవి?
జవాబు:
కోళ్ల పెంపకం, రవాణా, బుట్టల తయారీ, పాడిపరిశ్రమ, వడ్రంగం పని, ఇటుకల తయారీ, దుకాణాల ఏర్పాటు, చేపల పెంపకం.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 3.
రాంపురం గ్రామ ఆర్థిక రంగంలో నీకు నచ్చిన రెండు అంశాలు రాయుము.
జవాబు:
రాంపురంలో నాకు నచ్చిన అంశాలు :

  1. రాంపురంలో ఖాళీగా ఉన్న భూమి కొంచెం కూడా లేకపోవడం అంటే మొత్తం వ్యవసాయానికి వినియోగించడం.
  2. వ్యవసాయేతర పనులు కూడా అభివృద్ధి చెందడం.
  3. రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందటంతో మిగతా రంగాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 4.
వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కారకాలలో ప్రధానమైనది ఏది?
జవాబు:
వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కారకాలలో ప్రధానమైనది భూమి.

ప్రశ్న 5.
రాంపురం గ్రామములో మధ్య తరగతి, పెద్ద రైతులు వ్యవసాయ కూలీలు తమ దగ్గర పని చేయటానికి ఏమి చేస్తారు?
జవాబు:
రాంపురం గ్రామములో మధ్య తరగతి, పెద్ద రైతులు వ్యవసాయ కూలీలు తమ దగ్గర పనిచేయడానికి అన్నం పెడతారు, పనికి కూలీ చెల్లిస్తారు. కూలీ పంట రూపేణాకాని, డబ్బు రూపేణాకానీ ఉంటుంది.

ప్రశ్న 6.
ఉత్పత్తి కారకాలను పేర్కొనండి.
జవాబు:
ఉత్పత్తి కారకాలు :

  1. భూమి,
  2. శ్రమ (లేదా) శ్రామికులు,
  3. మూలధనం (లేదా) పెట్టుబడి,
  4. వ్యవస్థాపన (లేదా) జ్ఞానం, వ్యాపార దక్షత

ప్రశ్న 7.
ఒకే పనికి స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ వేతనాన్ని సాధారణంగా ఎందుకు చెల్లిస్తారు?
జవాబు:

  1. పురుషాధిక్య సమాజం కావడం వలన
  2. లింగ వివక్షత ఉండడం వలన

ప్రశ్న 8.
ఉత్పత్తి కారకాలని వేటినంటారు?
జవాబు:
భూమి, శ్రమ, పూలధనము, జ్ఞానం, వ్యాపార దక్షత / వ్యవస్థాపనము, భౌతిక పెట్టుబడులను ఉత్పత్తి కారకాలంటాం.

ప్రశ్న 9.
‘వ్యవసాయం ప్రాముఖ్యత’ గురించి ఒక నినాదం రాయండి.
జవాబు:

  1. సేంద్రీయ వ్యవసాయం – ఆరోగ్య ఫలసాయం
  2. రైతులేనిదే – ఆహారం లేదు
  3. జలమే జీవం – వ్యవసాయమే జీవనం.

ప్రశ్న 10.
చిన్న రైతులు వ్యవసాయానికి ఆతసరమైన పెట్టుబడిని ఎలా సమకూర్చుకుంటారు?
జవాబు:
చిన్న రైతులు వ్యవసాయానికి ఆశ్వసర్వక పెట్టుబడులని సమకూర్చుకునే విధానాలు

  1. పెద్ద రైతుల నుండి అప్పుడు
  2. వడ్డీ వ్యాపారస్తుల నుండి అప్పు
  3. ఉత్పాదకాలను సరఫరా చేసే వ్యాపారస్తుల నుండి అప్పు

ప్రశ్న 11.
భౌతిక పెట్టుబడికి, నిర్వహణ పెట్టుబడికి మధ్య గల తేడా ఏమిటి?
జవాబు:
భౌతిక పెట్టుబడికి నిర్వహణ పెట్టుబడికి గల తేడా :

భౌతిక పెట్టుబడి నిర్వహణ పెట్టుబడి
అనేక సంవత్సరాల పాటు వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడే యంత్రాల కోసం పెట్టే పెట్టుబడి. ముడిసరుకు మరియు ఉత్పత్తి పూర్తి చేయటానికి కావలసిన చెల్లింపుల కోసం వెచ్చించే ‘డబ్బు.

ప్రశ్న 12.
రాంపురం ఎక్కడ ఉంది?
జవాబు:
పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రునేలల్లో రాంపురం ఉంది.

ప్రశ్న 13.
వర్షాకాలం, శీతాకాలంలో వీటిని పంటల సీజన్లుగా ఏమని పిలుస్తాం.
జవాబు:
వర్షాకాలాన్ని, ఖరీగా, శీతాకాలాన్ని రబీ అని పిలుస్తాం.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 14.
రాంపురంకు సమీపంలో మార్కెట్ యార్డ్ ఎక్కడ ఉంది?
జవాబు:
రాంపురంకు సమీపంలో రాయిగంజ్ లో మార్కెట్ యార్డ్ ఉంది.

ప్రశ్న 15.
రాంపురంకు సమీపంలోని పట్టణమేది?
జవాబు:
రాంపురంకు 12 కి.మీ. దూరంలో జహంగీరాబాదు అనే పట్టణం కలదు.

ప్రశ్న 16.
బహుళ పంటల సాగు అంటే ఏమిటి?
జవాబు:
ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగుచేయడాన్ని ‘బహుళ పంటల సాగు’ అంటాం.

ప్రశ్న 17.
విద్యుత్ రాకముందు రాంపురం గ్రామస్తులు బావుల నుండి నీళ్లు పైకి తోడడానికి ఉపయోగించిన పరికరం ఏది?
జవాబు:
పర్షియన్ వీల్

ప్రశ్న 18.
రాంపురం జనాభా ఎంత ? అక్కడ ఎన్ని కుటుంబాలున్నాయి?
జవాబు:
రాంపురం జనాభా 2660. అక్కడ 450 కుటుంబాలున్నాయి.

ప్రశ్న 19.
ఉత్పత్తి ప్రక్రియలో లాభ, నష్టాలను భరించే వారినేమంటారు?
జవాబు:
యజమానులు.

ప్రశ్న 20.
భారతదేశంలోని ప్రధాన ఉత్పత్తి కార్యకలాపాలేంటి?
జవాబు:
భారతదేశ గ్రామాలలో వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం. ఇతర ఉత్పత్తి కార్యకలాపాలను వ్యవసాయేతర కార్యకలాపాలు అంటారు. వీటిలో చిన్న చిన్న వస్తువుల ఉత్పత్తి, రవాణా, దుకాణాల నిర్వహణ వంటివి ఉంటాయి.

ప్రశ్న 21.
ఉత్పత్తిలో పెట్టుబడి ఎన్ని రకాలుగా ఉంటుందో వర్గీకరించండి.
జవాబు:
ఉత్పత్తిలో పెట్టుబడి రెండు రకాలుగా ఉంటుంది.

  1. భౌతిక లేదా స్థిర పెట్టుబడి.
  2. నిర్వహణ పెట్టుబడి.

10th Class Social 9th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కరువు వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుపుతూ మీ తహసీల్దార్ (MRO) కు లేఖ రాయండి.
జవాబు:

ప్రదేశము : ………..
తేది : ……………

తహసీల్దార్ (MRO) గారి దివ్యసముఖమునకు
…………………
…………………

గౌరవనీయులైన అయ్యా,

నేను …………… ప్రాంతం వాడిని. మా ప్రాంతంలో ఈ సంవత్సరము తగినంత వర్షపాతము లేదు. పంటలు దెబ్బ తినడం వలన వ్యవసాయదారుల జీవనము అస్తవ్యస్తముగా మారినది. వ్యవసాయదారులు పెట్టుబడుల వలన, పంట నష్టాల వలన, పని దొరకకపోవడం వలన అనేక ఇబ్బందులు పాలైనారు. చాలా కుటుంబాలు అనాసక్తతతో ఉన్నాయి.

ప్రభుత్వమువారు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, అవసరమైన సహాయక చర్యలను తీసుకోవలెను. బ్యాంకు నుండి లోన్లు ఇప్పించడం ద్వారా, ఉపాధి పనుల ద్వారా రైతు కుటుంబాలను ఆదుకోవలెను.

ధన్యవాదములు.

మీ విశ్వాసపాత్రుడు,
……………………..

చిరునామా:
………………………… ,
………………………… ,
………………………… .

ప్రశ్న 2.
క్రింది పట్టికలో ఇవ్వబడిన సమాచారానికి ఒక ‘పై’ (Pie) చిత్రాన్ని (చిత్తుపటం) గీయండి. మీ పరిశీలనను రాయండి.

రైతుల రకాలు సాగుభూమి శాతం
చిన్న రైతులు 48%
మధ్య తరగతి, పెద్ద రైతులు 52%

జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 2
పరిశీలన :
ఎక్కువ వాటా భూమి (52%) మధ్యతరగతి మరియు పెద్ద రైతుల చేతిలో ఉండగా, తక్కువ వాటా భూమి (48%) చిన్న రైతుల చేతిలో ఉన్నది.

ప్రశ్న 3.
క్రింది పట్టికను పరిశీలించి, దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 3
a) చిన్న రైతులు అంటే ఎవరు?
జవాబు:
రెండు హెక్టార్ల కంటే తక్కువగా సాగుభూమి కలిగినవారిని చిన్న రైతులు అంటారు.

b) భారతదేశంలో సాగుభూమి పంపిణీలో అసమానతలు ఉన్నాయని నీవు అంగీకరిస్తావా? వివరించుము.
జవాబు:
అవును. అసమానతలు ఉన్నాయని అంగీకరిస్తాను. కారణమేమనగా 87% రైతులు కేవలం 18% భూమిని సాగుచేస్తుండగా కేవలం 13% రైతులు 52% భూమిని సాగు చేస్తున్నారు.

ప్రశ్న 4.
ప్రస్తుతం గ్రామాలలో వ్యవసాయేతర కార్యకలాపాలు పెరగాల్సిన ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
ప్రస్తుతం గ్రామాలలో వ్యవసాయేతర కార్యకలాపాలు పెరగాల్సిన ఆవశ్యకత :

  • అనిశ్చిత ఋతుపవనాలు
  • అక్షరాస్యుల సంఖ్య పెరగడం
  • సాంకేతిక విజ్ఞాన ప్రభావం
  • బ్యాంకు సేవలు – రుణాలు

ప్రశ్న 5.
క్రింది సమాచారాన్ని చదివి, మీ పరిశీలనను రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ
జవాబు:

  1. మొత్తం రైతులలో 87% మంది చిన్నరైతులు.
  2. 13% మంది మధ్యతరగతి మరియు పెద్దరైతులు.
  3. 13% ఉన్న పెద్ద, మధ్యతరగతి రైతుల చేతుల్లో 52% సాగుభూమి ఉంది.
  4. భారతదేశంలో భూమి పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నాయి.

ప్రశ్న 6.
ఉత్పత్తి కారకాలలో ఒకదాని గురించి వివరించండి.
జవాబు:
భూమి, శ్రమ, పెట్టుబడి, జ్ఞానం, వ్యాపార దక్షతలను ఉత్పత్తి కారకాలంటారు.
శ్రమ :
శ్రమ అనగా కేవలం కార్మికులు చేసే శ్రమయే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ ఇది సూచిస్తుంది.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 7.
చిన్న రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
చిన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు :

  1. సాగునీటి సదుపాయం లేక వర్షాలపై ఆధారపడటంతో అతివృష్టి లేదా అనావృష్టి.
  2. ఎరువుల కొరత
  3. వ్యవసాయ కూలీల కొరత.
  4. పెట్టుబడి అందించే సంస్థాగత (నియత రుణాలు) ఏర్పాట్లు లేకపోవడం.
  5. పంటకు సరియైన గిట్టుబాటు ధరలు అందకపోవడం.
  6. సరియైన మార్కెటింగ్ సమాచారం రైతులకు తెలియకపోవడం.
  7. దళారుల వ్యవస్థ (వారి పెత్తనం) మొదలైనవి.

ప్రశ్న 8.
భారతదేశంలో సాగునీటి సదుపాయాలు గూర్చి క్లుప్తంగా రాయండి.
జవాబు:
భారతదేశంలోని అన్ని గ్రామాలకు ఇంతటి సాగునీటి సదుపాయం లేదు. దేశంలోని నదీ మైదానాలు, కోస్తా ప్రాంతాలలో మాత్రమే సాగునీటి సదుపాయాలు బాగున్నాయి. ఇందుకు విరుద్దంగా దక్కన్ పీఠభూమి వంటి పీఠభూమి ప్రాంతాలలో సాగునీటి సదుపాయాలు. తక్కువ. ఈనాటికి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో 40 శాతానికంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది. మిగిలిన ప్రాంతాలలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉంది.

ప్రశ్న 9.
రాంపురంలో గ్రామంలో పెద్ద రైతులు సమకూర్చుకున్న భౌతిక పెట్టుబడులు ఏవి?
జవాబు:
ఈ గ్రామంలోని పెద్ద రైతులందరికీ ట్రాక్టర్లు ఉన్నాయి. తమ పొలాలను దున్నటానికి, విత్తటానికి ఉపయోగించటమే కాకుండా వీటిని ఇతర చిన్న రైతులకు అద్దెకు ఇస్తారు. వీళ్లల్లో చాలామందికి నూర్పిడి యంత్రాలు ఉన్నాయి, కొంత మందికి పంటకోత యంత్రాలు కూడా ఉన్నాయి. ఈ పెద్ద రైతులందరికీ తమ పొలాలకు సాగునీళ్లు అందించటానికి అనేక బోరుబావులు ఉన్నాయి. ఈ పరికరాలు, యంత్రాలు అన్నీ వ్యవసాయానికి అవసరమైన భౌతిక పెట్టుబడితో భాగం.

ప్రశ్న 10.
కొత్త వ్యవసాయ పద్ధతులు శ్రామికులను వ్యవసాయరంగానికి దూరం చేస్తున్నాయా?
జవాబు:
అవును. కొత్త వ్యవసాయ పద్ధతులు శ్రామికులను వ్యవసాయరంగానికి దూరం చేస్తున్నాయి. ఉత్పత్తి కారకాలలో శ్రమ ప్రధాన కారణమైనందున కొత్త వ్యవసాయ పద్ధతులు ఎక్కువ శ్రమను ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. దురదృష్టవశాత్తు ఇటువంటిది జరగలేదు. వ్యవసాయంలో శ్రమను మితంగా ఉపయోగించుకుంటున్నారు. దాంతో శ్రామికులు అవకాశాల కోసం వెదుక్కుంటూ పక్క గ్రామాలకు, పట్టణాలు, నగరాలకు వలస వెళుతున్నారు. కొంతమంది కార్మికులు గ్రామంలో వ్యవసాయేతర పనులు చేపడుతున్నారు.

ప్రశ్న 11.
రాంపురంలో భూపంపిణీ ఎలా జరిగింది?
జవాబు:
రాంపురంలో మూడింట ఒక వంతు అంటే 150 కుటుంబాలకు భూమి లేదు. భూమిలేని వాళ్లలో అధికశాతం దళితులు. రెండు హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద, మధ్యతరగతి కుటుంబాలు 60 దాకా ఉన్నాయి. పెద్ద రైతులలో కొంత మందికి 10 హెక్టార్లకు మించి సాగు భూమి ఉంది. రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగుచేసే కుటుంబాలు 240 ఉన్నాయి.

ప్రశ్న 12.
నిర్వహణ పెట్టుబడి కోసం చిన్న రైతులు ఏం చేస్తారు?
జవాబు:
నిర్వహణ పెట్టుబడి కోసం చాలా మంది చిన్న రైతులు అప్పు చేయాల్సి ఉంటుంది. వాళ్లు పెద్ద రైతుల నుంచి కానీ, వడ్డీ వ్యాపారస్తుల నుంచి కానీ, సాగుకు అవసరమయ్యే వివిధ ఉత్పాదకాలను సరఫరాచేసే వ్యాపారస్తుల నుంచి కానీ అప్పు – తీసుకుంటారు. ఇటువంటి అప్పుల మీద వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్పులు తిరిగి చెల్లించటం వాళ్లకు చాలా భారంగా ఉంటుంది.

ప్రశ్న 13.
పాడి పరిశ్రమలో ఉత్పత్తి కారకాలను వివరించండి.
జవాబు:
పాడి పరిశ్రమలో ఉత్పత్తి కారకాలు :
భూమి : గ్రామంలో సొంత కొట్టం (షెడ్డు).
శ్రమ : కుటుంబ శ్రమ ; ప్రధానంగా మహిళలు గేదెల పోషణ పని చూస్తారు.
భౌతిక పెట్టుబడి : పశువుల సంతలో కొన్న గేదెలు.
నిర్వహణ పెట్టుబడి : తమ భూమిలోంచి వచ్చిన పశువుల మేతతో పాటు కొన్న మందులు.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 14.
మిశ్రిలాల్ ఏం పనిచేస్తాడు?
జవాబు:
మిశ్రిలాల్ విద్యుచ్ఛక్తితో పనిచేస్తూ చెరకు రసం తీసే యంత్రం కొని బెల్లం తయారుచేస్తాడు. అంతకు ముందు చెరకురసం. తియ్యడానికి ఎడ్లను ఉపయోగించేవాళ్లు, కాని ఇప్పుడు అందరూ యంత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తను పండించిన చెరకును ఉపయోగించటమే కాకుండా మిశ్రిలాల్ ఇతర రైతుల నుంచి కూడా చెరకు కొని బెల్లం తయారుచేస్తాడు.

ప్రశ్న 15.
ఆధునిక వ్యవసాయ పద్ధతులను గురించి తెలపండి.
జవాబు:

  1. ఆధునిక వ్యవసాయంలో అధిక దిగుబడి విత్తనాలను ఉపయోగిస్తున్నారు.
  2. అలాగే రసాయనిక ఎరువులను, పురుగుల మందులను వినియోగిస్తున్నారు.
  3. మునుపటి కంటే లోతైన బోరుబావులు తవ్వి డీజిల్ / విద్యుత్ వినియోగంతో సాగునీటిని పొందుతున్నారు.
  4. ఆధునిక వ్యవసాయం సుస్థిరతతో కూడినది కాదు.

ప్రశ్న 16.
“శ్రామికులు ఉత్పత్తికి అవసరమైన వనరు.” ఈ వాక్యాన్ని చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. కొన్ని ఉత్పత్తి ప్రక్రియలకు అవసరమైన పనులు చేయటానికి బాగా చదువుకున్న, నైపుణ్యాలు ఉన్న కార్మికులు కావాలి.
  2. మిగిలిన పనులు చేయడానికి శారీరక శ్రమ చేసే కార్మికులు కావాలి.
  3. ప్రతి శ్రామికుడు ఉత్పత్తికి అవసరమైన శ్రమను అందిస్తున్నాడు.
  4. కావున శ్రామికులు ఉత్పత్తికి అవసరమైన వనరు.

ప్రశ్న 17.
“పనిముట్లు, యంత్రాలు, భవనాలపై పెట్టే ఖర్చును భౌతిక పెట్టుబడి” అని అంటారు. ఎందుకో వివరించండి.
జవాబు:

  1. రైతులు ఉపయోగించే నాగలి పనిముట్లు నుంచి మొదలుకొని జనరేటర్లు, టర్బైన్లు, కంప్యూటర్‌తో నడిచే యంత్రాల వంటి అత్యంత సంక్లిష్టమైన యంత్రాలు ఉండవచ్చు. అవి ఉత్పత్తి ప్రక్రియతో అయిపోవు.
  2. అనేక సంవత్సరాల పాటు ఇవి వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడతాయి.
  3. ఇలా సంవత్సరాల తరబడి ఉపయోగపడటానికి వాటికి కొంత మరమ్మతు నిర్వహణ అవసరం అవుతాయి.
  4. వీటిని స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి అంటారు.

ప్రశ్న 18.
దేశవ్యాప్తంగా భూగర్భజలమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇందుకోసం కొన్ని ప్రత్యామ్నాయాలను చూపండి.
జవాబు:

  1. దేశవ్యాప్తంగా భూగర్భజలమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి.
  2. నీటిని నిల్వచేసుకొనే ఇంకుడు గుంటలు, చెక్ డ్యాంలు, వనీకరణ, బండ్స్ నిర్మాణం, వాటర్‌షెడ్ పథకాలు చేపట్టాలి.
  3. సాగునీటి అవసరాలకు కాకుండా కేవలం త్రాగునీటికోసమే బోరుబావులను అనుమతించాలి.
  4. తక్కువ నీటితోనే పండే ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు చూడాలి.

ప్రశ్న 19.
మీ ప్రాంతంలో పాడి పరిశ్రమ – పాల సేకరణ ఎలా జరుగుతుందో వివరించండి.
జవాబు:

  1. మా ప్రాంతంలో అనేక కుటుంబాలు పాల ఉత్పత్తి చేస్తాయి.
  2. గేదెలకు వివిధ రకాల గడ్డి, జొన్న, సజ్జ మేతను మేపుతారు.
  3. ఇద్దరు వ్యాపారస్తులు పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  4. కుటుంబ శ్రమ, ప్రధానంగా మహిళలు గేదెల పోషణ చూస్తారు.

ప్రశ్న 20.
మీ ప్రాంతంలోని ఏదైనా వ్యాపారి యొక్క వ్యాపార దక్షతను గురించి వివరించంది.
జవాబు:

  1. మా ప్రాంతంలో వెంకటేశ్వరరావు అనే వస్త్రాల వ్యాపారి ఉన్నాడు.
  2. తొలుత అతను ఇంటింటికి తిరిగి దుస్తులు అమ్ముతూ వారం వారం డబ్బులు తీసుకుంటుండేవాడు.
  3. వ్యాపారం నమ్మకంగా చేస్తూ, నాణ్యమైన వస్త్రాలు అందజేస్తూ ప్రాంత ప్రజల విశ్వాసం చూరగొన్నాడు.
  4. తదుపరి పెట్టుబడితో స్వయంగా ఒక వస్త్ర దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ ఆ దుకాణం విజయవంతంగా నడుస్తోంది.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 21.
1960లో గోవిందు అనే రైతుకు 2.25 హెక్టార్ల భూమి ఉండేది. అప్పుడు దానికి సాగునీటి వసతి అంతగా లేదు. ముగ్గురు కొడుకుల సహాయంతో గోవిందు వ్యవసాయం చేసేవాడు. భోగభాగ్యాలు లేకపోయినా కుటుంబానికి ఉన్న ఒక బర్రెతో వచ్చే అదనపు ఆదాయంతో సరిపోయే ఆహారాన్ని పొందగలిగేవాళ్లు. కొన్ని సంవత్సరాలకు గోవిందు చనిపోవటంతో ముగ్గురు కొడుకులు భూమిని పంచుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 0.75 హెక్టార్ల భూమి మాత్రమే ఉంది. మెరుగైన సాగునీటి వసతి, ఆధునిక వ్యసాయ పద్ధతులతో కూడా గోవిందు కొడుకులకు భూమినుంచి కుటుంబ అవసరాలు పూర్తిగా తీరడం లేదు. సంవత్సరంలో కొన్ని నెలలపాటు వాళ్ళు ఇతర పనులు వెతుక్కోవలసి వస్తోంది. పై పేరాను చదివి, క్రింది ప్రశ్నకు జవాబు రాయండి.
ప్రశ్న : కుటుంబ పరిమాణం పెరిగినపుడు గోవిందు లాంటి చిన్నరైతులు ఎలా స్పందించారు? బోరు బావిలో సాగునీరు ఎంతవరకు ఉపయోగపడింది?
జవాబు:

  1. కుటుంబ పరిమాణం పెరిగినపుడు భూమిని పంచుకోవలసి రావడం వలన చిన్న చిన్న కమతాలు ఏర్పడినాయి.
  2. చిన్న కమతాలతో మెరుగైన నీటివసతి, ఆధునిక వ్యవసాయ పద్ధతుల వలన కూడా కుటుంబ అవసరాలు తీరడం లేదు.
  3. వారు సంవత్సరంలో కొన్ని నెలలు వేరే పని చూసుకోవల్సి వచ్చింది.
  4. బోరుబావి నీరు వ్యవసాయ నీటిపారుదల అవసరాన్ని తీర్చలేదు.

ప్రశ్న 22.
భారతదేశంలో రైతులు, వాళ్లు సాగుచేసే భూముల వివరాలు కింద ఇచ్చిన పట్టికలో ఉన్నాయి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 3
పై పట్టికను చదివి, క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
1. రైతులు ఎన్ని రకాలు ఉన్నారు?
2. ఏ రైతులు ఎక్కువ శాతం ఉన్నారు?
3. సాగుభూమి శాతంలో తేడా ఎంత?
4. మధ్యతరగతి, పెద్ద రైతుల విషయంలో రైతుల శాతం తక్కువగా ఉన్నా, సాగుభూమి శాతం అధికంగా ఉండడానికి కారణాలను ఊహించండి.
జవాబు:

  1. రైతులు 2 రకాలు.
    i) చిన్న లేదా సన్నకారు రైతులు.
    ii) మధ్యతరగతి లేదా పెద్ద రైతులు.
  2. చిన్న రైతులు (87%) ఎక్కువ శాతం ఉన్నారు.
  3. సాగుభూమి శాతంలో 4% తేడా ఉంది. పెద్ద రైతులు ఎక్కువ సాగుభూమి కల్గి ఉన్నారు.
  4. మధ్యతరగతి, పెద్ద రైతుల భూకమతాలు పెద్దవిగా ఉంటాయి.

10th Class Social 9th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది పట్టికను పరిశీలించండి.
పట్టిక : డిసెంబరు 2011లో వివిధ వ్యవసాయ పనులకు ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కూలి రేట్లు (రూపాయలలో)
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 1

ఎ) పురుషులు మాత్రమే చేస్తున్న పనులు ఏవి?
జవాబు:
దున్నటం ఒక్కటే పురుషులు మాత్రమే చేస్తున్న పనులు.

బి) స్త్రీలు మాత్రమే చేస్తున్న పనులు ఏవి?
(లేదా)
స్త్రీలు మాత్రమే పాల్గొంటున్న వ్యవసాయ పనులేవి?
జవాబు:
నాట్లు వేయడం, ప్రతి ఏరడం మాత్రమే స్త్రీలు చేస్తున్న పనులు.

సి) ఏయే పనులలో స్త్రీ, పురుషుల కూలి రేట్లలో వ్యత్యాసం ఉన్నది?
జవాబు:
అన్ని పనులలో పురుషుల స్త్రీల కూలీ రేట్లలో వ్యత్యాసం ఉంది.

డి) పురుషుల కంటే స్త్రీలకు తక్కువ కూలి ఇవ్వడానికి కారణం ఏమిటి?
(లేదా)
ఒకే పనికి ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎందుకు ఎక్కువ కూలీ లభిస్తుంది.
జవాబు:
స్త్రీలకంటే పురుషులు ఎక్కువ పనిచేయగలరనే భావన వలన ఒక పనికి స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ కూలి ఇస్తున్నారు.

ప్రశ్న 2.
కింది వివరాల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 4
a) రాంపురం గ్రామంలో ఏ రకపు ఇళ్ళు అధికంగా ఉన్నాయి?
b) రాంపురం గ్రామంలో 60% ప్రజలు ఏ తరగతికి చెందినవారు?
c) రాంపురం గ్రామంలో మధ్యతరగతికి చెందిన ప్రజల జనాభా సుమారుగా ఎంత ఉండవచ్చును?
d) సిమెంటు, ఇటుకలతో కట్టిన డాబా ఇండ్లలో ఎవరు నివసిస్తున్నారని భావిస్తావు?
జవాబు:
a) గుడిసెలు, తాటాకు ఇళ్ళు
b) పేదప్రజలు
C) 25%
d) ధనికులు

ప్రశ్న 3.
క్రింది పట్టికను పరిశీలించి, విశ్లేషించండి.
రైతులు సాగుచేసే భూమి వివరాలు తెలిపే దత్తాంశం
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 3
జవాబు:
పైన ఇవ్వబడిన పట్టికలో రైతులు, వారు సాగుచేస్తున్న భూమి వివరాలు ఇవ్వడం జరిగింది ఈ పట్టికలో రెండు రకాల రైతులను పేర్కొనడం జరిగినది.

  1. చిన్న లేదా సన్నకారు రైతులు
  2. మధ్య తరగతి, పెద్ద రైతులు

సన్నకారు రైతులు 87% మంది 2 హెక్టార్ల కంటే తక్కువ సాగు భూమిని కలిగివున్నారు. వారి వద్ద 48% వ్యవసాయ భూమి మాత్రమే కలదు. మధ్యతరగతి, పెద్ద రైతులు 13% మాత్రమే కాని వారు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి మొత్తం సాగు భూమిలో 52% కలిగి ఉన్నారు. అనగా దేశంలోని అత్యధిక సాగుభూమి కొద్ది మంది రైతుల చేతులలోనే ఉందని తెలుస్తోంది.

దీని ప్రకారం మనకు తెలిసినది ఏమిటంటే చిన్న రైతులు గ్రామాల్లో ఎక్కువ మంది ఉన్నారు. సాగుచేసే సమయంలో వారి వద్ద డబ్బులు లేక సరియైన విత్తనాలు, ఎరువులు కొనలేక లాభాలను గడించలేకపోతున్నారు. కాని పెద్ద రైతులకు బ్యాంకులలో మిగులు డబ్బు మరియు వారి భూమి మీద లోన్ తీసుకుని ట్రాక్టర్లను, యంత్రాలను వాడి ఆధునిక వ్యవసాయం చేసి మరింత లాభాలను గడిస్తున్నారు. ‘సన్నకారు రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించక ఇబ్బందులు పడుతున్నారు.

కావున ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు రుణ సదుపాయం విషయంలో, విత్తనాలు, ఎరువుల కొనుగోలులో చేయూత ఇచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 4.
ఉత్పత్తి కారకాలను పేర్కొని, ఏవేని రెండింటిని గురించి వివరించండి.
జవాబు:
ఉత్పత్తి కారకాలు :
1. భూమి
2. శ్రమ / శ్రామికులు
3. మూలధనం / పెట్టుబడి
4. సాంకేతిక పరిజ్ఞానం / వ్యాపార దక్షత

1. భూమి :
ఉత్పత్తికి భూమి, నీరు, అడవులు, ఖనిజ లవణాలు వంటి సహజవనరులు కావాలి.

2. శ్రామికులు :
సాధారణ వాడుకలో కంటే భిన్నంగా శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ ఇది సూచిస్తుంది. వృత్తి నైపుణ్యం గల కార్మికులు, శారీరక శ్రమచేసే శ్రామికులు ఈ విభాగంలోకి వస్తారు.

ప్రశ్న 5.
దిగువ ఇచ్చిన ను పరిశీలించి విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 5
జవాబు:
ఇవ్వబడిన గ్రాఫ్ నాలుగు రకాల రైతులు – చిన్న రైతులు, మధ్య తరగతి రైతులు, భూమిలేని రైతులు మరియు పెద్ద రైతుల శాతం గురించి వెల్లడిస్తోంది. దత్తాంశం 2011 జనాభా గణనకు సంబంధించినది. అందరికంటే ఎక్కువగా చిన్న రైతులు 60% మంది ఉన్నారు. పెద్ద రైతులు చాలా తక్కువగా అనగా 7% మంది మాత్రమే ఉన్నారు. మధ్యతరగతి రైతులు 19% మంది ఉండగా భూమిలేని రైతులు 14% మంది ఉన్నారు.

దశాబ్దాలుగా చాలా మంది ప్రజలకు భూములు లేవు. కాలక్రమంలో కొంతమంది భూములు సంపాదించుకున్నారు. వారు తమ కష్టార్జితంతో భూములను కొనుగోలు చేశారు. అత్యధిక గ్రామీణ కుటుంబాలలో కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువ. తండ్రి భూమి కొడుకుల దాకా వచ్చేసరికి వారికి సమాన భాగాలలో పంచబడుతుంది. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన కొడుకులు తక్కువ భూమిని పొందుతున్నారు. భారతదేశంలో గరిష్టశాతం భూమి పెద్ద రైతుల నియంత్రణలో ఉంది. చాలా మంది రైతులకు తక్కువ భూమి ఉన్నందున వారి కుటుంబ సభ్యులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెద్ద రైతులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ప్రభుత్వం ఇటువంటి చిన్న రైతులను, భూమి లేని రైతులను గురించి వారికి సరిపడినంత భూమిని పంపిణీ చేయాలి. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రభుత్వాలు కులం ఆధారంగా భూమి పంపిణీ చేస్తున్నాయి. అలా కాకుండా వారి ఆర్థిక స్థితి గతులు మరియు వారు భూమిని కలిగివున్నారా లేదా అనేది పరిగణనలోకి తీసుకొని భూమి పంపిణీ చేస్తే అత్యధిక శాతం రైతులు ప్రయోజనం పొందుతారు.

ప్రశ్న 6.
భూగర్భ జలాలు, రసాయన మందులు వాడకం ఎక్కువైతే ఏం జరుగుతుంది?
జవాబు:
రసాయనిక ఎరువులు, పురుగుమందులను అధికంగా, ఇష్టానుసారంగా వాడినందువల్ల భూసారం తగ్గుతోందని మన అనుభవం ద్వారా తెలుస్తోంది. నీటి పరిస్థితి కూడా అంతే ఆందోళన కలిగిస్తోంది. రాంపురం గ్రామం మాదిరిగానే భారతదేశం అంతటా సాగునీటికి ప్రధానంగా భూగర్భ జలాలమీదే ఆధారపడి ఉన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. వర్షాలు బాగా ఉండి, వాననీళ్ళు నేలలోకి ఇంకటానికి అనువుగా ఉండే ప్రాంతాలలో కూడా భూగర్భ జలాలు చాలా ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. భూగర్భజలమట్టం పడిపోతుంటే రైతులు, మునుపటికంటే లోతైన బోరుబావులు తవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల సాగునీటికి డీజిలు/విద్యుత్తు వినియోగం కూడా పెరుగుతుంది.

ప్రశ్న 7.
రాంపురం వ్యవసాయరంగంలో ముందంజలో ఉండుటకు కారణాలేంటి?
జవాబు:
రాంపురంలో బాగా అభివృద్ధి చెందిన నీటిపారుదల వ్యవస్థ ఉన్నందువల్ల రైతులు సంవత్సరంలో మూడు పంటలదాకా సాగు చేస్తున్నారు. రాంపురానికి ఎంతో ముందుగానే విద్యుత్తు వచ్చింది. దీంతో సాగునీటి వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. అప్పటివరకు రైతులు బావుల నుంచి నీళ్లు పైకి తోడటానికి ‘పర్షియన్ వీల్’ అనే పరికరాన్ని ఉపయోగించి సాగునీటి కింద చాలా తక్కువ విస్తీర్ణాన్ని సాగు చేసేవాళ్లు. విద్యుత్ తో నడిచే బోరుబావుల ద్వారా తేలికగా ఎక్కువ విస్తీర్ణానికి సాగునీటిని అందివ్వవచ్చని రైతులు గుర్తించారు. దాదాపు 50 సంవత్సరాల క్రితమే మొదటి బోరుబావులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత రైతులు సొంత ఖర్చుతో బోరుబావులు ఏర్పాటు చేసుకోసాగారు. ఫలితంగా 1970 దశాబ్ది మధ్యకాలం నాటికి 264 హెక్టార్ల వ్యవసాయ భూమి సాగునీటి కిందికి వచ్చింది.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 8.
వ్యవసాయ కూలీలు ఎవరు ? కూలీల వినియోగంలో ప్రాంతాల మధ్యగల తేడాలేవి?
జవాబు:
వ్యవసాయ పనులు చేసే కూలీలను వ్యవసాయ కూలీలంటాం.

భూమిలేని కుటుంబాల నుంచి లేదా చిన్న రైతు కుటుంబాల నుంచి వ్యవసాయ కార్మికులు వస్తారు. తమ సొంత పొలాల్లో పనిచేసే రైతుల మాదిరి కాకుండా వ్యవసాయ కూలీలకు భూమిలో పండించే పంటలపై ఎటువంటి హక్కు ఉండదు. దానికి బదులుగా వాళ్లు చేసిన పనికి రైతు కూలీ చెల్లిస్తాడు. ఆ పని చెయ్యటానికి వీళ్లను నియమించుకుంటారు.

డబ్బు రూపేణా కానీ, వస్తు (పంట) రూపేణా కానీ కూలీ ఉండవచ్చు. కొన్ని సమయాల్లో కూలీలకు అన్నం కూడా పెడతారు. ప్రాంతాన్ని బట్టి, పంటను బట్టి, పనిని బట్టి (ఉదాహరణకు విత్తడం, పంటకోత) కూలిరేట్లలో చాలా తేడా ఉంది. పని దొరికే రోజులలో కూడా చాలా తేడా ఉంది. వ్యవసాయ కూలీని రోజువారీ కూలీగా పెట్టుకోవచ్చు, లేదా ఒక ప్రత్యేక పనికి గుత్త పద్ధతిలో పెట్టుకోవచ్చు, లేదా సంవత్సరమంతా జీతానికి పెట్టుకోవచ్చు.

ప్రశ్న 9.
వ్యవసాయేతర ఉత్పత్తి కార్యక్రమాలు దోహదపడే అంశాలు రాయండి.
జవాబు:
భవిష్యత్తులో గ్రామాలలో వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు ఇంకా పెరగాలి. వ్యవసాయంలా కాకుండా వ్యవసాయేతర పనులకు చాలా తక్కువ భూమి కావాలి. కోంత పెట్టుబడి ఉన్న వాళ్లు వ్యవసాయేతర పనులు చేపట్టవచ్చు. ఎవరికైనా పెట్టుబడి ఎలా లభిస్తుంది ? ఇందుకు సొంతంగా ఉన్న పొదుపు మొత్తాలను ఉపయోగించవచ్చు, అయితే తరచుగా దాని కోసం అప్పు తీసుకోవాల్సి వస్తుంది. తక్కువ వడ్డీతో అప్పులు అందుబాటులో ఉండటం ముఖ్యం, అప్పుడు పొదుపు మొత్తాలు లేనివాళ్లు కూడా అప్పు తీసుకుని ఏదో ఒక వ్యవసాయేతర పని మొదలుపెట్టగలుగుతారు. వ్యవసాయేతర పనులు విస్తరించటానికి మరొక ముఖ్యమైన అవసరం ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు అమ్మటానికి మార్కెటు ఉండటం. రాంపురంలో ఉత్పత్తి అవుతున్న పాలు, బెల్లం, గోధుమల వంటి వాటికి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు, నగరాలలో మార్కెటు ఉండటాన్ని చూశాం. మంచిరోడ్లు, రవాణా, టెలిఫోను సౌకర్యం వంటివి మెరుగుపడటం ద్వారా గ్రామాలకు పట్టణాలు, నగరాలతో మంచి అనుసంధానం ఏర్పడి రానున్న సంవత్సరాలలో గ్రామాలలో వ్యవసాయేతర , ఉత్పత్తి కార్యకలాపాలు పెరుగుతాయి.

ప్రశ్న 10.
వస్తువులు లేదా సేవలు ఉత్పత్తి చేయుటకు ఉత్పత్తిదారులకు కావలసిన వస్తువులేవి? లేదా ఉత్పత్తి కారకాలేవి? వివరించుము.
జవాబు:
వస్తువులు లేదా సేవలు ఉత్పత్తి చేయుటకు ఉత్పత్తిదారులకు కావలసిన వస్తువులనే ఉత్పత్తి కారకాలంటారు. అవి
1. భూమి,
2. శ్రమ,
3. పెట్టుబడి,
4. జ్ఞానము, వ్యాపార దక్షత.

1. భూమి :
ఉత్పత్తికి భూమి, నీరు, అడవులు, ఖనిజ లవణాలు వంటి సహజవనరులు కావాలి.

2. శ్రామికులు :
సాధారణ వాడుకలో కంటే భిన్నంగా శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ ఇది సూచిస్తుంది. వృత్తి నైపుణ్యం గల కార్మికులు, శారీరక శ్రమచేసే శ్రామికులు ఈ విభాగంలోకి వస్తారు.

3. పెట్టుబడి :
పనిముట్లు, యంత్రాలు, భూమి, భవనాలు వంటి శాశ్వత అంశాలపై పెట్టుబడి – ధీనినే స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి అంటారు.

దీంతోపాటు నిర్వహణ పెట్టుబడి అనగా ముడిసరుకు, ఇతర ఖర్చులకు డబ్బు కూడా పెట్టుబడిలో భాగమే.

4. జ్ఞానం, వ్యాపార దక్షత :
భూమి, శ్రమ, పెట్టుబడిని ఉపయోగించి సరుకులు లేదా సేవలు ఉత్పత్తి చేయుటకు ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన జ్ఞానము, ఆత్మ విశ్వాసం, వ్యాపార దక్షత అవసరం.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

These AP 10th Class Social Studies Important Questions 8th Lesson ప్రజలు – వలసలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 8th Lesson Important Questions and Answers ప్రజలు – వలసలు

10th Class Social 8th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. మహిళలు వలస వెళ్ళడానికి ప్రధాన కారణమేమి?
జవాబు:
వివాహం

2. జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి …… వ్యక్తి వలస వచ్చిన వాళ్ళు.
జవాబు:
నాల్గవ.

3. భారతదేశంలో పట్టణ జనాభా ఎంత శాతం?
జవాబు:
33%

4. ప్రతి సంవత్సరము భారతదేశము నుండి పశ్చిమాసియా దేశాలకు వలస వెళ్ళుచున్న వారి సంఖ్య ఎంత?
జవాబు:
3 లక్షలు.

5. క్రింది వానిలో అంతర్జాతీయ వలసను గుర్తించి, రాయండి.
→ శ్రీకాకుళం నుండి ఢిల్లీకి.
→ తిరుపతి నుండి అమరావతికి.
→ విశాఖపట్టణం నుండి సౌదీ అరేబియాకి.
→ బెంగుళూరు నుండి ముంబైకి.
జవాబు:
విశాఖపట్టణం నుండి సౌదీ అరేబియాకి.

6. విదేశాలలో పని చేయు భారతీయుల ప్రయోజనాలను కాపాడే చట్టం ఏది?
జవాబు:
1983 వలసల చట్టం.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

7. ఒక వ్యక్తిని వలస వెళ్ళిన వాళ్ళుగా గుర్తించడానికి జనాభా గణన వాళ్ళు ఉపయోగించే ప్రామాణికాలలో ప్రధానమైనది, మొదటిది ఏది?
జవాబు:
జన్మస్థలం.

8. విజయవాడ నుండి లండన్ వలస వెళ్ళినట్లయితే అది ఏవలస?
జవాబు:
అంతర్జాతీయ వలస.

9. ఉద్యోగ భద్రత ఉండే రంగం ఏది?
జవాబు:
వ్యవస్థీకృత రంగం.

10. గ్రామీణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాలకు వలస సహజంగా ఎంత కాలం ఉంటుంది?
జవాబు:
6 నెలలు.

11. ‘కొయినా’ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉన్నది?
జవాబు:
మహారాష్ట్ర

12. వలస వెళ్ళిన చెరుకుతోటలలో పనిచేసే కూలీలు వేసుకునే చిన్న గుడిసెల్లాంటి ఆవాసాలను ఏమంటారు?
జవాబు:
‘కోపి’లు.

13. ‘టైర్’ కేంద్ర నివాస ప్రాంతాలలో ఎన్ని కోపిలుంటాయి?
జవాబు:
200 – 500.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

14. 50 – 100 కోపీలు ఉండే కేంద్ర నివాస ప్రాంతాన్ని ఏమంటారు?
జవాబు:
‘గాడి’.

15. క్రింది వానిలో గిరిజన తెగ కాని వారిని గుర్తించి, రాయండి.
సంతాల్, సవర, ముండా, బలిజ.
జవాబు:
బలిజ.

16. వలస కార్మికులు సాధారణంగా ఏ రంగంలో పని చేస్తున్నారు?
జవాబు:
అవ్యవస్థీకృత.

17. వలస కార్మికుల పిల్లలు బడి మానటానికి ప్రధాన కారణం ఏమిటి?
జవాబు:
కుటుంబీకులు వలస వెళ్ళటం.

18. వలస వెళ్ళిన ప్రాంతంపై ఏ రకమైన వలస ప్రభావం చాలా ముఖ్యమైనది?
జవాబు:
అంతర్జాతీయ.

19. ఎక్కడికి వలస వెళుతున్న అంతర్జాతీయ వలస కార్మికులలో అయిదింట ముగ్గురు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారున్నారు?
జవాబు:
పశ్చిమ ఆసియా.

20. భారతదేశంలోని వలస వెళ్ళిన వారిలో ఎంత శాతం మంది రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళినవారు?
జవాబు:
84.2%

21. భారతదేశంలో ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వలస వెళ్ళినవారు ఎంతశాతం ఉన్నారు?
జవాబు:
13%

22. మహారాష్ట్రలోని చేపల ప్రోసెసింగ్ కర్మాగారాలలో పనిచేయుటకు ఏటా 50 వేల మంది మహిళలు ఏ రాష్ట్రం నుంచి వలస వెళుతున్నారు?
జవాబు:
కేరళ.

23. జన్మస్థానం అంటే?
జవాబు:
ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశం.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

24. పట్టణాలలో జనాభా పెరుగుదల ఎక్కువ శాతం దేనివల్ల సంభవిస్తుంది?
జవాబు:
సహజ పెరుగుదల వల్ల.

25. జాతీయ సర్వేలో ‘వలస వెళ్ళిన వ్యక్తి’ అన్న పదానికి ఉన్న నిర్వచన పరిమితి వల్ల ఏ వలస వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువగా చూపించబడుతుంది?
జవాబు:
తాత్కా లిక.

26. ముంద, సంతాల్ జాతి పురుషులు ఏ రాష్ట్రంలోని గనులలో పనిచేయటానికి వలస వెళతారు?
జవాబు:
ఒడిశా.

27. కాలానుగుణంగా వలస వెళ్ళే వాళ్ళు సాధారణంగా ఏ ఆదాయ వర్గానికి చెందిన వారయి ఉంటారు?
జవాబు:
పేద వర్గం (BPL)

28. భారతదేశంలో పంచదార ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రమేది?
జవాబు:
మహారాష్ట్ర

29. అస్సోంలోని తోటలలో పనికి వలస వెళుచున్న గిరిజన తెగ ఏది?
జవాబు:
సవర.

30. జాతీయ కమీషన్ 1990 లలో ఇచ్చిన నివేదికలో గ్రామీణ కార్మికుల కాలానుగుణ వలసలకు ప్రధాన కారణం ఏమిటి?
జవాబు:
ప్రాంతాల మధ్య అసమానతలు, (అసమాన అభివృద్ధి).

31. భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఎన్నవ వంతు కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయి?
జవాబు:
1/3 వంతు.

32. వలస కార్మికులు తమ సంపాదనలో ఎక్కువ మొత్తము దేనిపై ఖర్చు చేస్తున్నారు?
జవాబు:
ఆహారము పై.

33. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు వలస వెళ్ళువారు సాధారణంగా ఎటువంటి కార్మికులు?
జవాబు:
నైపుణ్యం కల్గిన కార్మికులు.

34. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వలస వెళ్ళిన వారి సంఖ్య ఎంత?
జవాబు:
30.7 కోట్లు

35. క్రింది వానిలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస పోవడానికి గల కారణం కానిది’ ఏది ?
→ విద్యకోసం → ఉపాధికోసం → మెరుగైన అవకాశాల కోసం → వివాహం
జవాబు:
వివాహం

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

36. ఒక వ్యక్తిని వలస వెళ్ళిన వాళ్ళుగా గుర్తించడానికి జనాభా గణన వారు పాటించే ప్రమాణికాలు ఏవి?
జవాబు:
జన్మస్థానం, ఇంతకు ముందు నివాసం ఉన్న స్థలం.

37. పట్టణాలలో ఉద్యోగాలు దొరకటానికి చాలా కీలకమైన అంశం ఏది?
జవాబు:
పరిచయాలు.

38. 2001 – 2011 మధ్యకాలంలో పెరిగిన పట్టణ జనాభా ఎంత?
జవాబు:
9.1 కోట్లు.

39. 2001 – 2011 మధ్యకాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో సహజ పెరుగుదల శాతం ఎంత?
జవాబు:
44%.

40. 2001 – 2011 మధ్యకాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల పెరిగిన శాతం ఎంత?
జవాబు:
32%

41. 2001 – 2011 మధ్యకాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో వలసల వల్ల పెరిగిన జనాభా శాతం ఎంత?
జవాబు:
24%

42. మహారాష్ట్రలో మొత్తం సహకార చక్కెర కర్మాగారాల సంఖ్య ఎంత?
జవాబు:
186.

43. మహారాష్ట్రలో ఏ ఆనకట్ట కట్టిన తర్వాత 1970 దశాబ్ద ఆరంభం నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున చెరకు సాగు చెయ్యటం మొదలు పెట్టారు?
జవాబు:
కొయనా.

44. మహారాష్ట్రలో చెరుకు నరకటానికి ప్రతి సంవత్సరం మధ్య మహారాష్ట్ర నుంచి ఏ మహారాష్ట్ర ప్రాంతంకు 6,50,000 కూలీలు వలస వెళతారు?
జవాబు:
పశ్చిమ మహారాష్ట్రకు.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

45. 1950లలో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి 10,000 మంది వలస వెళ్ళగా, 1990లలో ఈ సంఖ్య ఎంతకి పెరిగింది?
జవాబు:
60,000

46. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రకారం 20 కోట్ల అంతర్జాతీయ వలస వ్యక్తులలో ఎన్ని కోట్ల కంటే తక్కువ మంది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి మరొక అభివృద్ధి చెందుతున్న దేశానికి వలస వెళుతున్నారు?
జవాబు:
7 కోట్లు.

47. కేరళ మొత్తం ఆదాయంలో ఎన్నవ వంతు పశ్చిమ ఆసియాలో పనిచేస్తున్న వాళ్ళు పంపించే డబ్బు ద్వారా సమకూరుతోందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది?
జవాబు:
1/5 వంతు.

48. బలహీన పడిన రూపాయి కారణంగా దేశమంతా సతమతమవుతుండగా, ఎవరు మాత్రం సంతోషంగా ఉన్నారు?
జవాబు:
ప్రవాస కేరళీయులు.

49. కేరళలో ప్రధానమైన పండగ ఏది?
జవాబు:
ఓనం.

50. 25 లక్షల దాకా ఉన్న ప్రవాస కేరళీయులు ఆ రాష్ట్ర GDP లో ఎంత శాతానికి దోహదం చేస్తున్నారు?
జవాబు:
35%

51. కేరళ రాష్ట్రానికి ప్రవాసుల ద్వారా వచ్చే డబ్బు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉందని నివేదిక చెబుతుంది?
జవాబు:
1.6 రెట్లు.

52. మగవారిలో వలసలకు ప్రధాన కారణం ఏమిటి?
జవాబు:
ఉపాధి (ఉద్యోగం).

53. “పంచదార పట్టీగా” పిలువబడుతున్న ఏడు జిల్లాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జవాబు:
మహారాష్ట్ర

54. గ్రామీణ ప్రాంత కార్మికులలో కనిపించే వలస రకం ఏది?
జవాబు:
తాత్కాలిక (లేదా) కాలానుగుణ వలస.

55. భారతదేశంలో కాలానుగుణ వలస దారులు ఎక్కువ శాతం ఏ సామాజిక వర్గంనకు చెందినవారు ఉన్నారు?
జవాబు:
షెడ్యూల్డ్ కులాల వాళ్ళు,

56. వలస పోయిన వారు సాధారణంగా ఏ ప్రాంతాలకు చెందిన వారుగా ఉంటారు?
జవాబు:
కరువు పీడిత.

57. UAE ని విస్తరింపుము.
జవాబు:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.

58. జాతీయ సర్వేలలో వలస వెళ్ళిన వ్యక్తి అన్న పదానికి ఉన్న నిర్వచన పరిధి ఎన్ని నెలలు?
జవాబు:
‘6’ నెలలు.

59. ఒక దేశం నుండి మరొక దేశానికి వలస వెళ్ళడాన్ని ఏమంటారు?
జవాబు:
అంతర్జాతీయ వలస.

60. ఒక దేశంలోనే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడాన్ని ఏమంటారు?
జవాబు:
అంతర్గత వలస.

61. ఆరు నెలలలోపు వలస ఉన్నట్లయితే అటువంటి వలస నేమంటారు?
జవాబు:
తాత్కాలిక / కాలానుగుణ వలస.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

62. క్రింది వానిలో అంతర్గత వలస కానిది ఏది?
A) రామాపురం నుండి కాకినాడ పట్టణానికి బ్రతుకు దెరువుకై వెళ్ళడం.
B) ఒడిశా నుండి అమరావతి నగర నిర్మాణానికి కూలీలు వలస రావడం.
C) ఆంధ్రప్రదేశ్ లోని పిల్లలకు ఇంగ్లీషు నేర్పడానికి కేరళ టీచర్లు రావడం.
D) భారతీయ పిల్లలకు చైనీస్ నేర్పడానికి చైనా టీచర్లు రావడం.
జవాబు:
D) భారతీయ పిల్లలకు చైనీస్ నేర్పడానికి చైనా టీచర్లు రావడం.

63. ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్ళటానికి ప్రధాన కారణమేమి?
జవాబు:
ఉపాధి అవకాశాల కోసం.

64. వలసలు ప్రధానంగా ఎక్కడ నుంచి ఎక్కడకు జరుగుతాయి?
జవాబు:
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు.

క్రింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానము రాయండి
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 4

65. 1961 – 71 నుండి 2001 – 2011 వరకు పట్టణ జనాభా సుమారు ఎన్ని రెట్లు పెరిగింది?
జవాబు:
3 రెట్లు.

66. 2001 – 2011 దశకంలో పట్టణ జనాభా ఎంతకు చేరింది?
జవాబు:
91 మిలియన్లు.

67. 1961 – 71 దశాబ్దంలో భారతదేశ పట్టణ జనాభా ఎంత?
జవాబు:
31 మిలియన్లు.

68. పట్టణ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి ?
జవాబు:
సహజ పెరుగుదల.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

69. NCRL విస్తరింపుము.
జవాబు:
National Commission for Rural Labour.

10th Class Social 8th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
‘కోపి’ అనగానేమి?
(లేదా)
మహారాష్ట్ర చెరుకు వలస కార్మికులు వేసుకునే గుడిసెలను ఏమంటారు?
జవాబు:
మహారాష్ట్రలో చెరకు నరుకుటకు వచ్చు కూలీలు బొంగులు, వెదురు తడికలతో వేసుకునే చిన్న గుడిసెలను “కోపి”లు అంటారు.

ప్రశ్న 2.
వలసలు వెళ్ళడానికి రెండు కారణాలు రాయండి.
(లేదా)
వలసలకు దారితీస్తున్న ఏవేని రెండు కారణాలను రాయండి.
జవాబు:

  1. వేరు, వేరు ప్రాంతాలలో వివాహాలు జరగడం
  2. ఉద్యోగాల కోసం వెళ్ళడం
  3. విద్య నిమిత్తం వెళ్ళడం
  4. ఒక ప్రాంతంలో కరువు కాటకాలు రావడం వలన వేరొక ప్రాంతానికి వెళ్ళడం.

ప్రశ్న 3.
అంతర్జాతీయ వలసలకు ఒక కారణాన్ని వ్రాయండి.
జవాబు:
అంతర్జాతీయ వలసలకు కారణాలు : విద్య, ఉపాధి మొదలైనవి.

ప్రశ్న 4.
ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశాన్ని ఏమంటాం?
జవాబు:
ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశాన్ని జన్మస్థలం అంటాం.

ప్రశ్న 5.
‘ఇంతకుముందు నివాసం ఉన్న స్థలం’ అనగానేమి?
జవాబు:
ఒక వ్యక్తి ఆరునెలలు లేదా అంతకుమించి ఎక్కువ కాలంపాటు ఉన్న ప్రదేశం.

ప్రశ్న 6.
మహారాష్ట్రలో సహకార రంగంలో చక్కెర పరిశ్రమలెన్ని ఉన్నాయి?
జవాబు:
సహకార రంగంలో 186 చక్కెర కర్మాగారాలు మహారాష్ట్రలో ఉన్నాయి.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 7.
కొట్టిన చెరుకును కుప్పలుగా వేసే కార్మికులు ఎవరు?
జవాబు:
బాల కార్మికులు కొట్టిన చెరుకును కుప్పలుగా వేస్తారు.

ప్రశ్న 8.
అంతర్జాతీయంగా వలసలు పోతున్నవారి సంఖ్య ఎంత?
జవాబు:
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం అంతర్జాతీయంగా వలసలు పోతున్న వారి సంఖ్య 20 కోట్లు.

ప్రశ్న 9.
U.A.E. ని విస్తరింపుము.
జవాబు:
United Arab Emirates.

ప్రశ్న 10.
పశ్చిమాసియా దేశాలకు ఎక్కువగా ఏయే రాష్ట్రాల నుండి వలసలు పోతున్నారు?
జవాబు:
పశ్చిమాసియా దేశాలకు ఐదింటికి మూడవ వంతు మంది కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు వలస వెళుతున్నారు.

ప్రశ్న 11
భారతీయుల అంతర్జాతీయ వలసలను పర్యవేక్షించే చట్టం ఏది?
జవాబు:
భారతీయుల అంతర్జాతీయ వలసలను 1983 చట్టం పర్యవేక్షిస్తుంది.

ప్రశ్న 12.
వలసను నిర్వచించుము.
జవాబు:
ఏవైనా కారణాల వలన ఒక వ్యక్తి జన్మస్థానం నుంచి వేరొక ప్రదేశం వెళ్ళి (6 నెలల కంటే / అధిక కాలం) ఉండటాన్ని వలస అంటాం.

10th Class Social 8th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వలస వెళ్ళిన వారు ఇబ్బందులు పెడతారా? నీ అభిప్రాయాన్ని సమర్థింపుము.
జవాబు:

  1. అవును. నా అభిప్రాయములో వలస వెళ్ళినవారు ఇబ్బందులు పెడతారు.
  2. వలసదారులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించలేదు.
  3. కొద్దికాలం తరువాత వలసదారుల సౌకర్యాలకై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు.
  4. వలసదారులు వలస వెళ్ళిన ప్రాంతంలో వారి గుర్తింపుకై ఉద్యమాలు చేపట్టడం ద్వారా ఇబ్బందులు పెడతారు.
    ఉదా: శ్రీలంకలోని తమిళులు.

(లేక)

  1. లేదు. నా అభిప్రాయములో వలస వెళ్ళినవారు ఇబ్బందులు పెట్టరు.
  2. సాధారణంగా వలసదారులు జీవనోపాధి కొరకు ఎక్కువగా వలస వెళుతుంటారు.
  3. కనుక వారు ఆ ప్రాంతంలో ఆధిపత్యం కొరకు పోరాడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
  4. గుర్తింపు కోసం, ఆధిపత్యం కోసం పోరాడరు. కనుక వలస వెళ్ళినవారు ఎవరినీ ఇబ్బంది పెట్టరు.
  5. వ్యవసాయ కార్మికులు ఉదాహరణకు మహారాష్ట్రలో చెరకు నరకడానికి వెళ్ళిన కార్మికులు కేవలం ఉపాధి కొరకే వెళతారు కనుక వారు ఎటువంటి ఇబ్బందులు సృష్టించరు.

ప్రశ్న 2.
ఈ కింది పేరా చదివి ప్రశ్నకు సమాధానం రాయండి.

కుటుంబంలో కేవలం మగవాళ్ళు వలసకి వెళ్ళినపుడు కుటుంబ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ భారం అంతా ఆడవాళ్ళ మీద పడుతుంది. ఇటువంటి కుటుంబాలలోని ఆడపిల్లల మీద తమ్ముళ్లు, చెల్లెళ్ళను చూసుకోవాల్సిన భారం ఉండి చివరికి చాలామంది బడి మానేస్తారు.

కుటుంబ పెద్ద వలసకి వెళితే ఆడపిల్లల మీద ఆ ప్రభావం ఏ విధంగా పడుతుంది?
జవాబు:

  1. వలస వెళ్ళిన కుటుంబంలోని ఆడపిల్లల మీద తమ్ముళ్ళను, చెల్లెళ్ళను చూసుకోవలసిన భారం పడుతుంది.
  2. ఆడపిల్లలు ఇంటిపనులు, వంటపనులు చేయవలసి వస్తుంది.
  3. వ్యవసాయ పనులకు కూడా బాలికలు వినియోగించబడతారు.
  4. కుటుంబ పెద్ద వలస వెళ్ళుట వలన ఆడపిల్లల మీద పని ఒత్తిడి పెరుగుతుంది. దీని ఫలితంగా వారు బడి మానివేస్తారు.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 3.
విదేశాలకు వలస వెళ్లే భారత దేశీయుల కష్టాలకు నీవు సూచించే పరిష్కార మార్గాలేవి?
జవాబు:

  1. విదేశాలలో ఉన్న స్థానిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.
  2. వలస వెళ్ళే దేశాలలోని భౌగోళిక పరిస్థితులు మరియు శీతోష్ణస్థితుల పట్ల అవగాహన అవసరం.
  3. వీసా, పాస్పోర్ట్ చట్టబద్ధమైన పద్దతిలో కలిగి ఉండాలి.
  4. వలస వెళ్ళే దేశాలలో ఉగ్రవాదం, అలజడుల పట్ల అవగాహన కలిగి ఉండాలి.

ప్రశ్న 4.
‘వలసల నివారణ’ పై ఒక కరపత్రం రూపొందించంది.
జవాబు:

కరపత్రం
వలసల నివారణ

వలస అనగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతమునకు వెళ్ళుట. ఎక్కువగా ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతూ ఉంటారు. ఇది తరచుగా ఉపాధి కోసం జరుగుతుంది. ప్రజలు ఎక్కువగా పట్టణాలకు వలస వెళ్ళడం వలన అక్కడ వారు చాలా ఇబ్బందులకు గురికావలసి వస్తుంది.

  1. కాలనీలు ఎక్కువగా విస్తరించడంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది.
  2. బోరుబావులు, నందనూతులు పెరగడంతో భూగర్భజలాలు త్వరితంగా అంతరించిపోతున్నాయి.
  3. ఎక్కువ మంది పారిశుద్ధ్యం లేని వాతావరణంలో నివశించడం వలన అనేక అనారోగ్యాలకు గురి అవుతారు.
  4. చాలామంది పిల్లలు మధ్యలోనే చదువును ఆపివేయడం జరుగుతుంది.
  5. వీరికి ఆరోగ్య, విద్య, విద్యుత్, మంచినీటి సదుపాయాలు కూడా సరిగా అందడం లేదు.
  6. అంతేకాకుండా వ్యవసాయ రంగం మీద ఆధారపడేవారి శాతం తగ్గి వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం వలన ఆహార పదార్థాలు మరియు తిండి గింజల ధరలు బాగా పెరిగి పోయూలయి.

విజ్ఞప్తి : పై సమస్యలను రూపుమాపటం మనందరి యొక్క బాధ్యత. కావున ప్రజలకు ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాలలోనే కల్పించి వలసలను నివారించవలెను.

ప్రశ్న 5.
క్రింది పేరాగ్రాను చదివి, ప్రశ్నకు సమాధానం వ్రాయండి.
గ్రామీణ ప్రాంతాలలో తగినన్ని ఉపాధి అవకాశాలు లేనందున, గ్రామీణ ఉపాధిలో తగినంత ఆదాయము లేనందున, ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు.
ప్ర. గ్రామీణ ప్రాంతం నుండి వలస వచ్చిన వాళ్ళు పట్టణ ప్రాంతములో ఉపాధి పొందే ఆర్థిక రంగాలు ఏవి? ఉదాహరణలిమ్ము.
జవాబు:
గ్రామీణ ప్రాంతం నుండి వలస వచ్చిన వారికి పట్టణాలలో సంఘటిత రంగాలలో అవకాశాలు ఉండవు. ఎందుకనగా సంఘటిత రంగంలో అవకాశాలు ఎక్కువగా విద్య నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఎక్కువ మందికి అసంఘటిత రంగంలోనే అవకాశాలు ఉంటాయి.
ఉదా :
1) పరిశ్రమలలో కార్మికులు
2) రిక్షాలు తోలుట
3) బజారులలో తిరుగుతూ సరుకులు అమ్ముకొనుట.
4) భవన నిర్మాణ రంగాలలో కూలీలు

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 6.
గ్రామీణ ప్రాంతం నుంచి వలస వచ్చిన కార్మికులు ఏ రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.
జవాబు:
ఆదాయం పెంచుకోవటానికి, కుటుంబ అవకాశాలు మెరుగు పరచుకోవటానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలలో పరిశ్రమలు, సేవా రంగాలలో పని చేయటానికి వలస వచ్చిన కొంతమంది సహజ స్పందనగా పరిగణిస్తారు. ఈ ప్రక్రియలో వాళ్లకు చదువుకొనటానికి, కొత్త ఉద్యోగాలు చెయ్యటానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకొనటానికి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా లింగ, కుల ఆధారిత వివక్షత పట్టణ ప్రాంతాలలో తక్కువగా ఉండి వాళ్లకు అధిక స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఉంటాయి. అయితే చాలామంది గ్రామీణ ప్రాంతాలలో చాలినంత ఉపాధి దొరకక తప్పనిసరి అయి పట్టణాలకు వలస వస్తారు. ఇటువంటి ప్రజలకు పట్టణాలు, నగరాలలోని మురికివాడలలో తగినంత చోటు లేక, తాగునీరు, పారిశు ద్యం వంటి మౌలిక సదుపాయాలు లేక పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇటువంటి వాళ్లకు ‘వ్యవస్థీకృత రంగం’లో పని దొరకటం కష్టం. కాబట్టి వీళ్లు ఆశించిన ఉద్యోగ భద్రత ఉండదు, మెరుగైన ఆదాయం ఉండదు. వాళ్లు రోజుకూలీలుగా బతుకులు ఈడుస్తుంటారు.
(లేదా)

  1. సరియైన నివాసం మరియు వసతుల కొరకు ఇబ్బంది పడవలసి ఉంటుంది.
  2. ఉద్యోగాల కోసం పరిచయాలు అవసరం అవుతాయి.
  3. అసంఘటిత రంగంలో పని చేయవలసి రావడం వల్ల ఉద్యోగ భద్రత, ఇతర సదుపాయాలు ఉండవు.
  4. ఆహారం కొరకు ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది.

ప్రశ్న 7.
ప్రస్తుత సమాజంలో ఆడవాళ్ళు ఇంటి బయట పనిచెయ్యటానికి, లింగ వివక్షతకు మధ్య గల సంబంధం ఎలా ఉందో వివరించండి.
జవాబు:
ప్రస్తుత సమాజంలో ఆడవాళ్ళు ఇంటి బయట పనిచెయ్యటానికి, లింగ వివక్షతకు మధ్య గల సంబంధం :

  1. ఆర్థిక స్వాతంత్ర్యం
  2. ఆత్మ విశ్వాసం
  3. ఆడవాళ్ల మాటకు ప్రాధాన్యత
  4. సామాజిక, రాజకీయ రంగాలలో మహిళల ప్రాధాన్యత పెరగడం
  5. పనిచేసే చోట ఇబ్బందులు ఎదుర్కోవడం
  6. మగవారితో పోలిస్తే వేతనం తక్కువ
  7. గృహ హింస

ప్రశ్న 8.
ప్రక్క పటములో ఇచ్చిన సమాచారాన్ని చదివి మీ పరిశీలనను వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 1
జవాబు:
పరిశీలన :

  1. ఈ గ్రాఫు 2007-08లో భారతదేశంలో స్వల్పకాల వలసదారుల సామాజిక నేపథ్యం గురించి తెలియచేస్తున్నది.
  2. స్వల్పకాల వలసదారులలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు 19% కలరు.
  3. స్వల్పకాల వలసదారులలో షెడ్యూల్డ్ తెగలకు చేందినవారు 23% కలరు.
  4. స్వల్పకాల వలసదారులలో ఇతర వెనుకబడిన ఖలాలకు చెందినవారు 40% కలరు.
  5. స్వల్పకాల వలసదారులలో ఇతర వెనుకబడిన కులాలవారు అత్యధికంగా కలరు.

ప్రశ్న 9.
కాలానుగుణ వలసల గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
కాలానుగుణ వలసలు :

  1. గ్రామీణ ప్రాంత కార్మికులలో అధిక శాతం తక్కువ కాలానికి ప్రత్యేకించి సంక్షోభ పరిస్థితుల వల్ల వలస వెళ్ళుతారు.
  2. ఇవి సాధారణంగా 6 నెలలలోపు ఉంటాయి.
  3. వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, ఆదివాసీలు, దళితులు ఎక్కువగా వలస వెళతారు.
  4. ఉదా : చెరుకు నరుకు వారు, ఇటుక బట్టీలలో పనిచేసేవారు.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 10.
ప్రజల వలసలకు ప్రధాన కారణాలేమిటి?
జవాబు:
భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 30.7 కోట్లమంది వలస వెళ్లారు. అనేక కారణాల వల్ల వలసలు జరగవచ్చు. ఆడవాళ్లలో వలస వెళ్లటానికి వివాహం ప్రధాన కారణం కాగా మగవాళ్లలో ఉపాధి లేదా ఉపాధికోసం అన్వేషణ ప్రధాన కారణం. ఉన్న ఊరిలోని ఉపాధి అవకాశాలపై అసంతృప్తి, విద్యకు మెరుగైన అవకాశాలు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ తగాదాలు వంటివి జనగణన సర్వేలో ప్రజలు వలసకు కారణాలుగా పేర్కొన్నారు.

ప్రశ్న 11.
గ్రామీణ ప్రాంతం నుండి పట్టణానికి వలస వచ్చేవారు ఇరు ప్రాంతాలతో ఎటువంటి సంబంధాలు నిలుపుతారు?
జవాబు:
పట్టణాలలో ఉద్యోగాలు దొరకటానికి పరిచయాలు, సంబంధాలు చాలా కీలకమైనవి. ఒక్కొక్కసారి తమ పరిచయాలు, సంబంధాల ద్వారా ముందుగా ఉద్యోగం దొరకబుచ్చుకున్న తరువాతే గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వస్తారు. అనేక కారణాల వల్ల వాళ్లు తమ గ్రామీణ ప్రాంతాలలో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటారు. వలస వెళ్లిన వాళ్లు పట్టణ అవకాశాలను గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేస్తుంటారు.

ప్రశ్న 12.
భారతదేశంలోని ముఖ్యమైన వలస ప్రాంతాలను – ప్రాముఖ్యతను రాయండి.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 5
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 6

ప్రశ్న 13.
గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ వలసలకు కారణం ఏమని చెప్పింది?
జవాబు:
గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ 1990లలో ఇచ్చిన నివేదికలో అసమాన అభివృద్ధి, ప్రాంతాల మధ్య అసమానతలు కాలానుగుణ వలసలకు కారణమని పేర్కొంది. కొన్ని గిరిజన ప్రాంతాలలో బయటివాళ్లు రావటం వల్ల, ఆనకట్టలు కట్టటానికి, గనుల తవ్వకానికి తప్పనిసరిగా వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రశ్న 14.
చెరుకు నరికే కూలీల నివాసాల గూర్చి నీకేం తెలుసు?
జవాబు:
చెరుకు నరికివేతకు రోజులకు వలస వచ్చినవాళ్లు ఫ్యాక్టరీలు కేటాయించిన ఖాళీ ప్రదేశాలలో నివసిస్తారు. ఇవి చేలకు దగ్గరగా ఉంటాయి. ప్రతి కుటుంబానికి కొన్ని బొంగులు, వెదురు తడిక ఇస్తారు. వీటితో వాళ్లు చిన్న గుడిసె వేసుకుంటారు. (దీనిని అక్కడ ‘కోపి’ అంటారు). టైర్ కేంద్ర నివాస ప్రాంతాలలో 200-500 కోపీలు ఉంటాయి, గాడి కేంద్ర నివాస ప్రాంతాలలో 50-100 కోపీలు ఉంటాయి. ఈ కోపీలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. వాటి ముందు పశువులు కట్టేసి ఉంటాయి. పశువులు, మనుషులు ఇరుకిరుకు పరిస్తితులలో నివసిస్తుంటారు.

ప్రశ్న 15.
అంతర్జాతీయ వలసలకు వెళుతున్న విద్యావంతులైన భారతీయులు గూర్చి నీకేం తెలుసు?
జవాబు:
సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు అమెరికా, కెనడా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళుతున్నారు. ఐటి నిపుణులు, డాక్టర్లు, మేనేజ్ మెంట్ నిపుణులు ఈ రకానికి ఉదాహరణ. 1950లు, 1960లలో కెనడా, ఇంగ్లాండునకు వలస వెళ్లిన భారతీయులలో ఎక్కువమంది ఏ నైపుణ్యమూ లేనివాళ్లు కాగా గత పది సంవత్సరాలలో ఎక్కువగా వృత్తి నిపుణులు ఈ దేశాలకు వెళుతున్నారు. ఇటీవల కాలంలో భారతదేశ వృత్తినిపుణులు జర్మనీ, నార్వే, జపాన్, మలేషియా వంటి దేశాలకు కూడా వలస వెళుతున్నారు. 1950లలో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి 10,000 మంది వలస వెళ్లగా, 1990లలో ఈ సంఖ్య 60,000కి పెరిగింది.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 16.
అంతర్జాతీయ వలసలకు వెళ్తున్న నైపుణ్యం లేని కార్మికుల గూర్చి నీకేం తెలుసు?
జవాబు:
చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమ ఆసియా దేశాలకు తాత్కాలిక ఒప్పందాలపై వలస వెళుతున్న నైపుణ్యంలేని, కొంత నైపుణ్యం ఉన్న పనివాళ్లు, వలస వెళ్లిన దేశాలలోని పరిస్థితిని బట్టి కొంతకాలం తరువాత ఇలా వలస వెళ్లిన వాళ్లంతా తిరిగి వస్తారు. భారతదేశం నుంచి పశ్చిమ ఆసియాకి వెళుతున్న 30 లక్షల వలస వ్యక్తులలో ఎక్కువమంది సౌదీ అరేబియాకి, యు.ఏ.ఇ. (United Arab Emirates) కి వెళుతున్నారు. ప్రతి సంవత్సరం పశ్చిమ ఆసియాకి 3 లక్షల కార్మికులు వలస వెళుతున్నారు. పశ్చిమ ఆసియాకి వలస వెళుతున్న కార్మికులలో అయిదింట ముగ్గురు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు. ఈ వలస కార్మికులలో అధిక శాతం భవన నిర్మాణం, మరమ్మతుల నిర్వహణ, సేవలు, రవాణా, టెలికమ్యూనికేషన్ రంగాలలో పనిచేస్తుంటారు.

ప్రశ్న 17.
అంతర్జాతీయ వలసల ప్రభావం వలస వెళ్లిన వారి ప్రాంతంపై ఎలా ఉంటుంది?
జవాబు:
వలస వెళ్లిన ప్రాంతంపై అంతర్జాతీయ వలస ప్రభావం చాలా ముఖ్యమైనది. వలస వెళ్లిన వాళ్ల కుటుంబాలు అప్పులు తీర్చగలగటం, ఆస్తులు కొనటం, జీవనశైలిలో మార్పు వంటి వాటిలో ఈ ప్రభావం బాగా కనపడుతుంది. కేరళ మొత్తం ఆదాయంలో అయిదింట ఒక వంతు పశ్చిమ ఆసియాలో పనిచేస్తున్న వాళ్లు పంపించే డబ్బు ద్వారా సమకూరుతోందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. 1970లలో కేరళలో తలసరి సగటు వినియోగం దేశ సగటు కంటే తక్కువగా ఉండేది. కానీ 30 ఏళ్ల తరువాత ఇది దేశ సగటు కంటే 40 శాతం ఎక్కువగా ఉంది.

ప్రశ్న 18.
గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లడానికి కారణాలేంటి?
జవాబు:
గ్రామీణ ప్రాంతాలలో తగినన్ని ఉపాధి అవకాశాలు లేనందున, గ్రామీణ ఉపాధిలో తగినంత ఆదాయం లేనందున ప్రజలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. కుటుంబ సభ్యులకు మరిన్ని అవకాశాలు, అధిక ఆదాయాలు, మెరుగైన సేవలు ఉంటాయన్న ఆశతో ప్రజలు వలస వెళతారు.

ప్రశ్న 19.
తాత్కాలిక వలసల సంఖ్య తక్కువగా చూపబడుతుంది. ఎందుకు?
జవాబు:
గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస కూడా పెరిగింది. ఇలా వెళ్లే వలసలు సాధారణంగా ఆరు నెలలోపు ఉంటాయి. కాబట్టి దీనిని జనాభా గణన గణాంకాలు ప్రతిబింబించకపోవచ్చు. జాతీయ సర్వేలలో ‘వలస వెళ్లిన వ్యక్తి’ అన్న పదానికి ఉన్న నిర్వచన పరిమితి వల్ల తాత్కాలిక వలస వెళ్లే వాళ్ల సంఖ్య తక్కువగా చూపించబడుతోంది.

ప్రశ్న 20.
పట్టణ ప్రాంతాలలో ఉద్యోగాలు దొరకడానికి పరిచయాలు, సంబంధాలు ఎందుకు అవసరం?
జవాబు:
గ్రామీణ ప్రాంతాలలో గల ప్రజలకు పట్టణాలలో ఎక్కడ, ఎటువంటి పని / ఉపాధి లభిస్తుందో తెలియదు. ఉపాధి లభించినా ఎచ్చట నివసించాలి వంటి అంశాలు అవగాహన ఉండదు. అందుచే గ్రామీణ ప్రాంతాల్లో గల వారికి పట్టణ ప్రాంతాలలోని వారితో పరిచయాలు, సంబంధాలు అవసరం.

ప్రశ్న 21.
వృత్తాకార చిత్రం : 2007 – 08లో భారతదేశంలో కాలానుగుణ వలసదారుల నేపథ్యంలో చిత్రాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
అ) 2007-08 సం||లో మొత్తం వలసలలో షెడ్యూల్డ్ తెగల వారి శాతం ఎంత?
ఆ) 2007-08 లోని వలస జనాభాలో ఏ వర్గ ప్రజలు ఎక్కువ?
ఇ) తక్కువ శాతం వలసలు ఏ వర్గాలలో ఉన్నాయి?
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 1
జవాబు:
అ) 2007-08 సం||లో మొత్తం వలసలలో షెడ్యూల్డ్ తెగల వారి శాతం : 23.
ఆ) 2007-08 లోని వలస జనాభాలో ఇతర వెనుకబడిన తరగతుల వారు ఎక్కువ.
ఇ) తక్కువ శాతం వలసలు ఇతరులు, షెడ్యూల్డ్ కులాల వారిలో ఉన్నాయి.

ప్రశ్న 22.
1961 – 2011ల మధ్య భారతదేశంలో పట్టణ జనాభా పెరుగుదల.
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 4
పై గ్రాఫ్ ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
అ) 1961-71 దశాబ్దంలో భారతదేశ పట్టణ జనాభా ఎంత?
ఆ) 2001-11 దశాబ్దంలో పట్టణ జనాభా ఎంతకు చేరింది?
ఇ) 1961-71 నుండి 2001-11 వరకు పట్టణ జనాభా సుమారు ఎన్నిరెట్లు పెరిగింది?
జవాబు:
అ) 1961-71 దశాబ్దంలో భారతదేశ పట్టణ జనాభా 31 మిలియన్లు.
ఆ) 2001-11 దశాబ్దానికి పట్టణ జనాభా 91 మిలియన్లకు చేరింది.
ఇ) 1961-71 నుంచి 2001-11 వరకు పట్టణ జనాభా సుమారుగా 3 రెట్లు పెరిగింది.

ప్రశ్న 23.
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 5-1
బీహార్ నుండి కోల్ కత, లక్నో, ఢిల్లీలకు వలస వెళ్ళిన వారి సంఖ్యను అంచనా వేయంది.
జవాబు:
బీహార్ నుండి కోల్ కతకి వలస వెళ్ళిన వారి సంఖ్య : 3 లక్షలు.
బీహార్ నుంచి లక్నోకు వలస వెళ్ళిన వారి సంఖ్య : 2 లక్షలు.
బీహార్ నుండి, ఢిల్లీకి వలస వెళ్లిన వారి సంఖ్య : 9 లక్షలు.

ప్రశ్న 24.
కింది పటం పరిశీలించి ఏ రాష్ట్రాల నుండి వలసలు ఎక్కువగా ఉన్నాయో తెలపండి. కారణాలు వివరించండి.
పటం : ప్రధాన అంతర రాష్ట్ర వలస మార్గాల అంచనా, 2001-2011
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 4
జవాబు:

  1. అధిక వలసలు బీహార్, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి ఉన్నాయి.
  2. అధిక జనసాంద్రత గల మైదాన ప్రాంతాలైనప్పటికీ ఉపాధి అవకాశాల కోసం అంతర్గత వలసలు, పట్టణ వలసలు అధికంగా ఉంటున్నాయి.
  3. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకే వలసలు అధికంగా ఉన్నాయి.

10th Class Social 8th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పశ్చిమాసియా వెళ్ళిన భారత వలస కార్మికుల దుర్భర పరిస్థితులపై మీ స్పందన ఏమిటి?
జవాబు:

  1. కొన్ని సందర్భాలలో వలస కార్మికులకు జీతాలు చెల్లించరు.
  2. కొన్నిసార్లు వలస వెళ్ళాలనుకుంటున్న కార్మికులను ఏజెంట్లు మోసం చేస్తారు లేదా విదేశాలలో పని చూపించటానికి సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తారు.
  3. ఒక్కొక్కసారి యజమానుల ఒప్పంద కాలం ముగియకుండా ఒప్పందాన్ని రద్దు చేస్తారు. లేదా వలస కార్మికులు నష్టపోయేలా ఒప్పంద పత్రాన్ని మారుస్తారు.
  4. ఇస్తామన్న దానికంటే తక్కువ జీతం ఇస్తారు.
  5. యజమానులు తరచూ కార్మికులతో బలవంతంగా అదనపు పనిగంటలు పని చేయించుకుని, అందుకు అదనపు వేతనం చెల్లించరు.
  6. కార్మికులను వాళ్ళ పాస్పోర్టు వాళ్ళదగ్గర ఉంచుకోనివ్వరు.
  7. ఉద్యోగం పోతుందన్న భయంతో భారత వలస కార్మికులు అరుదుగా తప్పించి తమ విదేశీ యజమానులపై ఫిర్యాదులు నమోదు చెయ్యరు.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 2.
వలస వెళ్ళినపుడు ప్రజలకు కలిగే లాభనష్టాలను వ్రాయుము.
జవాబు:
లాభాలు:

  1. ఊరిలో ఉన్న తమ కుటుంబాలకు డబ్బులు పంపించడం.
  2. అప్పులు తీర్చడం.
  3. ఇల్లు, భూమి వంటి స్థిరాస్తులు కొనడం.
  4. వ్యవసాయ పరికరాలు, వినియోగ వస్తువులు కొనడం.
  5. మంచి ఉపాధి అవకాశాలు
  6. అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవడం.
  7. జీవనశైలిలో మార్పు

నష్టాలు :

  1. ఆహార ధాన్యాలపై ఎక్కువ ఖర్చు చేయడం.
  2. తీవ్రమైన పరిస్థితులలో నివసించడం.
  3. పారిశుద్ధ్యం లేని వాతావరణం.
  4. అనారోగ్య సమస్యలకు గురికావడం.
  5. శిశుసంరక్షణ కేంద్రాలు లేకపోవడం.
  6. పిల్లలకు చదువు కొనసాగించే వీలు లేకపోవడం.
  7. కుటుంబ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ భారం ఆడవాళ్ల మీద పడడం.
  8. ఒత్తిడి

ప్రశ్న 3.
క్రింది పేరాను చదివి, వ్యాఖ్యానించండి.
ఉత్పత్తి కారకాలలో శ్రమ ప్రధాన కారణమైనందున కొత్త వ్యవసాయ పద్ధతులు ఎక్కువ శ్రమను ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. దురదృష్టవశాత్తు ఇటువంటిది జరగలేదు. వ్యవసాయంలో శ్రమను మితంగా ఉపయోగించుకుంటున్నారు. దాంతో శ్రామికులు అవకాశాల కోసం వెదుక్కుంటూ పక్క గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు వలస వెళుతున్నారు. కొంతమంది కార్మికులు గ్రామంలో వ్యవసాయేతర పనులు చేపడుతున్నారు.
జవాబు:
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. దేశంలో అధిక జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. అయితే వ్యవసాయాధారిత దేశాలు వెనుకబడి ఉంటాయి. భారతదేశంలాంటి దేశంలో ఇంతకన్నా ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడలేరు. ఇప్పటికే ఆ రంగంలో కాలానుగుణ నిరుద్యోగిత ఉన్నది.

అయితే ప్రభుత్వం రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులను నేర్పి, పెద్ద కమతాలు చేసి, యంత్రాల ద్వారా వ్యవసాయం చేసే అవకాశాలు కల్పించి నాణ్యమైన ఉత్పత్తి సాధించి విదేశాలకు ఎగుమతులను పెంచినట్లయితే ఈ పరిస్థితిని కొంతవరకు మార్చవచ్చు. అప్పటి వరకు వలసలు, వ్యవసాయేతర వృత్తులు, పనులు తప్పవు.

ప్రశ్న 4.
అంతర్జాతీయ వలస అనగానేమి? అంతర్జాతీయ వలసకు దారితీసిన పరిస్థితులు, ప్రభావాలు తెలపండి.
జవాబు:
అంతర్జాతీయ వలస :
ప్రజలు వివిధ కారణాల వల్ల ఇతర దేశాలకు వలస వెళ్ళడాన్ని అంతర్జాతీయ వలస అంటారు.

క్రింది కారణాలతో అంతర్జాతీయ వలసలు జరుగుతున్నవి :

  • ఉన్నత విద్య కొరకు.
  • మెరుగైన ఉపాధి అవకాశాల కొరకు
  • వ్యాపార అవసరాల కొరకు

అంతర్జాతీయ వలసలు క్రింది విధంగా ప్రభావం చూపుతున్నాయి.

  • వలస వెళ్ళిన కుటుంబాల ఆర్థిక స్థితి చాలా వరకు మెరుగవుతున్నది.
  • అప్పులు తీర్చడం, ఆస్తులు కొనడం వంటివి ఆ కుటుంబాలు చేయగలుగుతున్నాయి.
  • వారి జీవన శైలిలో మార్పు వస్తున్నది.
  • మేధో వలసలు దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఆటంకంగా పరిణమిస్తున్నాయి.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 5.
ప్రజల కొనుగోలు శక్తిని వలసలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి?
జవాబు:

  1. సాధారణంగా వలస వెళ్ళిన కుటుంబాలు మెరుగైన ఆదాయాలను పొందుతాయి.
  2. అందువలన వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది.
  3. సాధారణంగా ఆ కుటుంబాలు ఇల్లు, భూములు వంటి ఆస్తులను కొనుగోలు చేస్తాయి.
  4. వ్యవసాయ పరికరాలను సమకూర్చుకుంటాయి.
  5. వినియోగ వస్తువుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడాన్ని ప్రారంభిస్తాయి.

ప్రశ్న 6.
కింది ‘పై’ గ్రాఫ్ ను పరిశీలించి, విశ్లేషిస్తూ ఒక పేరా రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 2
జవాబు:
గ్రామీణ ప్రాంత కార్మికులలో అధిక శాతం తక్కువ కాలానికి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలోని సంక్షోభ పరిస్థితుల వల్ల వలస వెళతారు. వీళ్ళు ప్రధానంగా వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, తక్కువ ఆదాయం గలవాళ్ళు, దళితులు, ఆదివాసీలు.

కొన్ని గిరిజన ప్రాంతాలలో బయటివాళ్ళు రావడం, ఆనకట్టలు కట్టడం, గనుల త్రవ్వకం వలన ప్రజలు నిర్వాసితులు కావటం వల్ల తాత్కాలికంగా తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి.

కానీ వెళ్ళే వాళ్ళలో ఎక్కువ మంది ఇతర వెనుకబడిన తరగతులవారు ఉన్నారు. ఎక్కువ మంది వలస వెళ్ళినవారు అవ్యవస్థీకృత రంగంలో కార్మికులుగా ఉంటున్నారు.

ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో షెడ్యూల్డు కులాలు, తెగలు మరియు వెనుకబడిన వారి కోసం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలను చేపట్టడం మరియు వారి అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించడంలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుండి వలస వెళ్ళడం మాని అక్కడే పని చేసుకుంటున్నారు.

ప్రశ్న 7.
‘కుటుంబాలు వలస వెళ్ళినపుడు తల్లిదండ్రులతో పాటు వెళ్ళే చిన్నపిల్లలకు శిశు సంరక్షణ కేంద్రాలు ఉండవు. పెద్ద పిల్లలు కొత్త ప్రదేశంలో చదువు కొనసాగించే వీలు ఉండదు. వాళ్ళు స్వగ్రామాలకు తిరిగి వెళ్ళినప్పుడు అక్కడి పాఠశాలలు కూడా వాళ్ళని మళ్ళీ చేర్చుకోవు. చివరికి వాళ్ళు బడికి వెళ్ళటం మానేస్తారు. కుటుంబంలో కేవలం మగవాళ్ళే వలసకి వెళ్ళినప్పుడు కుటుంబ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ భారం అంతా ఆడవాళ్ళ మీద పడుతుంది. ఇటువంటి కుటుంబాలలోని ఆడపిల్లల మీద తమ్ముళ్ళు, చెల్లెళ్ళను చూసుకోవాల్సిన భారం ఉండి చివరకు చాలామంది బడి మానేస్తారు.
ప్రశ్న : “వలస కుటుంబాలలోని అధిక శాతం పిల్లలు బడి మధ్యలోనే మానేస్తున్నారు.” – వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. అవును, నిజమే, కుటుంబాలు వలస వెళ్ళినపుడు అధికశాతం పిల్లలు మధ్యలోనే బడి మానేయవలసి వస్తున్నది.
  2. వారు వలస వెళ్ళిన దగ్గర పిల్లల కోసం శిశుసంరక్షణ కేంద్రాలు ఉండడం లేదు.
  3. ఒకవేళ ఉన్నా పేద కుటుంబాలు ఆ ఖర్చును భరించలేవు.
  4. కొన్నిసార్లు వలసవెళ్ళిన ప్రదేశాలలో పాఠశాలలు అందుబాటులో ఉండకపోవచ్చు.
  5. తిరిగి స్వగ్రామాలకు వచ్చినపుడు పాఠశాలలో చేరడం వీలుకాకపోవచ్చు.
  6. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ఇలాంటి వారిని చేర్చుకుంటున్నాయి.
  7. అయినా వారు చదువులో వెనుకబడిపోతున్నారు.
  8. ఇది చదువు పట్ల వారి ఆసక్తిని దెబ్బతీస్తున్నది.
  9. వలసవెళ్ళిన కుటుంబాలలోని ఆడపిల్లల మీద తమ్ముళ్ళు, చెల్లెళ్ళను చూసుకోవలసిన బాధ్యత పడుతున్నది.

ప్రశ్న 8.
పట్టికలో ఇవ్వబడిన సమాచారమును పరిశీలించి విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 3
జవాబు:

  1. 1991 జనాభాను జమ్ము & కాశ్మీర్ కాకుండా మరియు 2001 జనాభాను జమ్ము & కాశ్మీర్ కలుపుకొని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
  2. 1991 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం జనాభా (జమ్ము & కాశ్మీర్ కాకుండా) 838.5 మిలియన్లు. 2001 జనాభా లెక్కల ప్రకారం (జమ్ము & కాశ్మీర్ కలుపుకొని) 1028.6 మిలియన్లు. పెరుగుదల వ్యత్యాసం – 21.5% గా ఉంది.
  3. 1991లో మొత్తం వలసలు 229.8 మిలియన్లు కాగా, 2001లో 307.1 మిలియన్లు ఉండి, పెరుగుదల వ్యత్యాసం 32.9%గా ఉంది.
  4. జిల్లాల్లోనే వలస వచ్చినవారు 1991లో 136.2 మిలియన్లు మరియు 2001లో 181.7 మిలియన్లు. వీరి పెరుగుదల వ్యత్యాసం 32.6 శాతం.
  5. రాష్ట్రంలోనే ఇతర జిల్లాల నుండి వలస వచ్చిన వారి సంఖ్య 1991లో 59.1 మిలియన్లు మరియు 2001లో 76.8 మిలియన్లు. వీరి పెరుగుదల వ్యత్యాసం 29.5 శాతంగా ఉంది.
  6. భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల నుండి వలసవచ్చినవారి సంఖ్య 1991లో 27.2 మిలియన్లు కాగా, 2001లో 42.3 మిలియన్లు. పెరుగుదల వ్యత్యాసం 54.5%.
  7. ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారి సంఖ్య 1991లో 6.9 మిలియన్లు అయితే 2001లో వారి సంఖ్య 6.1గా నమోదయింది. తగ్గుదల వ్యత్యాస్యం – 11.6%.

పై సమాచారం ప్రకారం 1991 నుండి 2001 వరకు అన్ని రకాల వలసల సంఖ్య పెరిగింది. అయితే ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారి సంఖ్య తగ్గింది. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే, విదేశీయులు భారతదేశానికి వలస రావడానికి ఆసక్తి చూపడం లేదు. వనరుల కొరత, అరకొర ఉద్యోగావకాశాలు, తక్కువ జీతాలు వంటివి ఇందుకు కారణాలు. జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి నాల్గవ వ్యక్తి వలస వచ్చిన వారే. తాము నివసించే ప్రాంతాలలో ఉపాధి, విద్యావకాశాలు లేకపోవడం వల్ల ప్రజలు వలస వెళతారు. కుటుంబ సభ్యులకు మరిన్ని అవకాశాలు, అధిక ఆదాయం , మెరుగైన సేవలు వంటివి కూడా వలసలకు కారణాలుగా పేర్కొనవచ్చు.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 9.
వలసల ఏర్పాటులో గుత్తేదారుల పాత్ర ఏమిటి?
జవాబు:
వ్యవసాయరంగంలో వలస వెళ్ళేవాళ్ల గ్రామాలకు రైతులు వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అదే కులానికి, వర్గానికి లేదా ప్రాంతానికి చెందిన గుత్తేదారులను (వీళ్లనే ఏజెంట్లని కూడా అంటారు), వ్యాపారస్తులను, ఢిల్లీలోని గనుల యజమానులు, కర్నాటకలోని కాఫీ తోటల యజమానులు వలస కార్మికులతో ఒప్పందాలు కుదుర్చుకోటానికి ఉపయోగించుకుంటారు. పంజాబ్లో వలస వచ్చిన కూలీల ద్వారా ఇతరులను కూడా పనులకు పిలిపించుకుంటారు. దీనికి యజమానుల నుంచి గుత్తేదారులకు కొంత ప్రతిఫలం అందటమే కాకుండా వలస కూలీలకు వచ్చే ఆదాయం నుంచి కూడా కొంత తీసుకుంటారు. కొన్ని సందర్భాలలో గుత్తేదారులు పర్యవేక్షకులుగా కూడా పనిచేస్తారు.

ప్రశ్న 10.
వలస ప్రజల సమస్యలేంటి?
జవాబు:
వలస వెళ్లిన ప్రదేశంలో ఆ కార్మికులకు చౌకధరల దుకాణాల నుంచి సరుకులు దొరకవు కాబట్టి వాళ్లు ఆహారధాన్యాలపై ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. చాలా తీవ్రమైన పరిస్థితులలోనూ, పారిశుద్ధ్యం లేని వాతావరణంలోనూ నివసించాల్సి రావటం వల్ల వాళ్లు అనేక అనారోగ్యాలకు, రోగాలకు గురౌతారు. గనులు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులలో పని వల్ల వాళ్లు ఒళ్లు నొప్పులు, వడదెబ్బ, చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులకు లోనవుతారు. యజమానులు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవటం వల్ల పారిశ్రామిక ప్రదేశాలు, భవన నిర్మాణ ప్రదేశాలలో ప్రమాదాలు తరచు సంభవిస్తూ ఉంటాయి. వలస కార్మికులు సంఘటిత రంగంలో లేనందు వల్ల వాళ్లకి వివిధ ఆరోగ్య, కుటుంబ సంరక్షణ కార్యక్రమాలు అందటం లేదు. వలస వచ్చిన మహిళా కూలీలకు ప్రసూతి సెలవలు ఉండవు. అంటే ప్రసవించిన కొద్ది రోజులకే వాళ్లు తిరిగి పనికి వెళ్లవలసి ఉంటుంది.

ప్రశ్న 11.
వలసల వలన కలిగే ప్రయోజనాలేవి?
జవాబు:
వలస వెళ్లే వాళ్లలో చాలామంది, ప్రత్యేకించి దీర్ఘకాలం వలస వెళ్లేవాళ్లు ఊరిలో ఉన్న తమ కుటుంబాలకు డబ్బులు పంపిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మూడింట ఒక వంతు కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయి. కాలానుగుణంగా వలస వెళ్ళే వాళ్లల్లో చాలామంది ఇంటికి డబ్బు పంపిస్తారు, లేదా మిగుల్చుకున్న డబ్బు తమతో తీసుకెళతారు. వలస వెళ్లటం వల్ల ఆస్తులు అమ్ముకోకుండా అప్పులు తీర్చటానికి, ఇతర కార్యక్రమాలకు డబ్బు సమకూరుతుంది. వలస వెళ్లిన కుటుంబాలు ఇల్లు, భూమి వ్యవసాయం పరికరాలు, వినియోగ వస్తువులు కొనటం సాధారణంగా చూస్తూ ఉంటాం. వలస వెళ్లిన వాళ్లల్లో కొంతమంది వలస వెళ్లిన ప్రదేశంలో ఉద్యోగం పొందవచ్చు. అవసరమైన నైపుణ్యాలు అక్కడ పెంపొందించుకోవచ్చు. మంచి ఉద్యోగాల గురించి తెలుసుకుని క్రమం తప్పకుండా లేదా శాశ్వతంగా వలస వెళ్లవచ్చు.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 12.
అంతర్జాతీయ వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? భారత వలసల చట్టం 1893 ఈ సమస్యల నుండి వారిని ఎలా కాపాడుతుంది?
జవాబు:
భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్లి పనిచేయటాన్ని వలసల చట్టం, 1983 అన్న భారతదేశ చట్టం పర్యవేక్షిస్తుంది. పని నిమిత్తం వెళ్లే వాళ్ల ప్రయోజనాలను కాపాడటానికి ఇది కొన్ని షరతులు విధిస్తుంది. వివిధ దేశాలలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దౌత్య కార్యాలయాలు వలసల చట్టంలో పొందుపరిచిన విధంగా చట్టపర విధానాలను పాటించి అంతర్జాతీయ వలస కార్మికుల సంక్షేమాన్ని కాపాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో వలస కార్మికులకు జీతాలు చెల్లించరు. కొన్నిసార్లు వలస వెళ్లాలనుకుంటున్న కార్మికులను ఏజెంట్లు మోసం చేస్తారు. లేదా విదేశాలలో పని చూపించటానికి సిఫారసు చేసినదానికంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తారు. ఒక్కొక్కసారి యజమానుల ఒప్పంద కాలం ముగియకుండా ఒప్పందాన్ని రద్దు చేస్తారు, లేదా వలస కార్మికులు నష్టపోయేలా ఒప్పంద పత్రాన్ని మారుస్తారు. ఇస్తామన్న దానికంటే తక్కువ జీతం ఇస్తారు. ఇతర ప్రయోజనాలు, ప్రోత్సాహకాలను నిలిపివేస్తారు. వాళ్లు తరచు కార్మికులతో బలవంతంగా అదనపు పని చేయించుకుని, అందుకు అదనపు వేతనం చెల్లించరు. కార్మికులను వాళ్ల దగ్గర ఉంచుకోనివ్వరు. ఉద్యోగం పోతుందన్న భయంతో భారత వలస కార్మికులు అరుదుగా తప్పించి తమ విదేశీ యజమానులపై ఫిర్యాదులు నమోదు చెయ్యరు.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

These AP 10th Class Social Studies Important Questions 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 7th Lesson Important Questions and Answers ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social 7th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. సిమ్లా పట్టణపు ప్రస్తుత జనాభా ఎంత?
జవాబు:
2 లక్షలు

2. తిరుపతిలోని విమానాశ్రయం ఎక్కడ ఉంది?
జవాబు:
రేణిగుంట.

3. విమానాశ్రయ నగరానికి ఒక ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఢిల్లీ) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్)

4. మహానగరానికి ఒక ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:
ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా.

5. హైద్రాబాదు మెట్రోపాలిటన్ నగరం అనడానికి కారణ మేమిటి?
జవాబు:
జనాభా 10 లక్షల కంటే ఎక్కువ, కోటికి తక్కువగా

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

6. ఒక లక్ష నుండి పదిలక్షల మధ్య జనాభా గల నివాస ప్రాంతాలను ఏవిధంగా పిలుస్తారు?
జవాబు:
క్లాస్ – 1 నగరాలు.

7. క్రింది వానిలో పట్టణ జనాభా పెరుగుదలకు కారణం కాని అంశమేది?
→ సహజ పెరుగుదల.
→ గ్రామీణ ప్రాంతాలను పట్టణాలలో ప్రాంతాలుగా ప్రకటించింది.
→ వలసలు.
→ పట్టణాలలో కాలుష్యం ఎక్కువగా ఉండటం.
జవాబు:
పట్టణాలలో కాలుష్యం ఎక్కువగా ఉండటం.

8. ఆది మానవులు నివసించిన భింబేడ్క రాతి గుహలు ఏ రాష్ట్రంలో కలవు?
జవాబు:
మధ్య ప్రదేశ్.

9. మహా నగరాలలో జనాభా ఎంత?
జవాబు:
ఒక కోటికి మించి.

10. హీథే అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
లండన్ (UK)

11. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
బ్యాంకాక్ (థాయ్ లాండ్)

12. కైరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది?
జవాబు:
ఈజిప్టు

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

13. ఏ ప్రాంతాలలో కొండ చరియలు విరిగి పడటం జరుగుతుంది?
జవాబు:
హిమాలయాలు.

14. మానవులు సుమారు ఎన్ని లక్షల సంవత్సరాల పాటు సేకరణ, వేటగాళ్ళుగా గుంపులలో జీవించారు?
జవాబు:
1.8 లక్షల సంవత్సరాలు.

15. కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి, వ్యవసాయానికి పూనుకోవడం సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది?
జవాబు:
10,000 సంవత్సరాలు.

16. భారతదేశాన్ని పరిపాలించిన అనేక రాజ్యాలకు ఏ నగరం ఉండటం కేంద్రంగా ఉంది?
జవాబు:
ఢిల్లీ

17. ప్రస్తుతం భారతదేశంలో ఢిల్లీ ఎన్నో పెద్ద నగరం జనాభా ప్రకారం?
జవాబు:
రెండవ.

18. ప్రస్తుత ఢిల్లీ నగర జనాభా ఎంత?
జవాబు:
1,60,00,000.

19. 1951లో ఢిల్లీ నగర జనాభా ఎంత?
జవాబు:
20,00,000.

20. గత 60 సంవత్సరాలలో ఢిల్లీ జనాభా ఎన్ని రెట్లు పెరిగింది?
జవాబు:
8 రెట్లు.

21. ఢిల్లీకి మాస్టర్ ప్రణాళికను ఎన్నిసార్లు తయారు చేశారు?
జవాబు:
3 సార్లు.

22. 19వ శతాబ్దంలో ఏ పట్టణంపై ఆధిపత్యం కోసం బ్రిటిషు, ఫ్రెంచి దేశాలు నావికా యుద్ధానికి దిగాయి?
జవాబు:
విశాఖపట్టణం

23. భారతదేశంలో ప్రస్తుతం ఎంతమంది ప్రజలు నగరాలు, పట్టణాలలో నివసిస్తున్నారు?
జవాబు:
35 కోట్ల మంది (దాదాపు 1/3 వంతు)

24. ఒక ప్రాంతానికి ఇతర ప్రదేశాలతో సంబంధాన్ని తెలియజేయునది ఏది?
జవాబు:
పరిస్థితి.

25. ప్రతాప్ గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉన్నది?
జవాబు:
మహారాష్ట్ర.

26. ఏవి నిర్మించే అవకాశం ఉండటం వల్ల వలస పాలకులు తీరప్రాంత ప్రదేశాలకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు?
జవాబు:
రేవులు.

27. విశాఖపట్నం ఏ తీరంలో ఉంది?
జవాబు:
బంగాళాఖాతం.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

28. మానవులు ఏది ప్రారంభించిన తరువాత స్థిర నివాసం ఏర్పరచుకున్నారు?
జవాబు:
వ్యవసాయం.

29. ఢిల్లీలో ప్రణాళికబద్ధ కాలనీల శాతం ఎంత?
జవాబు:
23.7%

30. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో ఎక్కడ కోట నిర్మించారు?
జవాబు:
ప్రతాప్ గఢ్.

31. భారతదేశంలో 10 లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ఉన్నాయి?
జవాబు:
50 పైగా

32. ఏది అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలోని రీతులను ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు?
జవాబు:
వ్యవసాయం.

33. వృత్తి పనివాళ్ళు ఎక్కడ స్థిరపడటానికి పాలకులు ప్రోత్సహించారు?
జవాబు:
పట్టణ ప్రాంతాల్లో.

34. ఒక ప్రాంత లక్షణాలను తెలియ జేయునది ఏది?
జవాబు:
ప్రదేశం.

35. విమానాశ్రయాల చుట్టూ ఏర్పడే నివాస ప్రాంతాలను ఏమంటారు?
జవాబు:
విమానాశ్రయ నగరం.

36. ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరుచుకున్న పద్ధతినేమంటారు?
జవాబు:
నివాస ప్రాంతం.

37. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద నగరం ఏది?
జవాబు:
ముంబయి.

38. ఏ నగరాలను వలస పాలకులు భారతదేశ సహజ వనరులను కొల్లగొట్టడానికి మరింత అభివృద్ధి చేశారు?
జవాబు:
ముంబయి, చెన్నై.

39. ఏ దశాబ్ద కాలంలో విశాఖ పట్టణం జనాభా గణనీయంగా పెరిగింది?
జవాబు:
1961.

40. భారతదేశంలో ప్రస్తుత గ్రామాల సంఖ్య?
జవాబు:
6.4 లక్షలు.

41. జనాభా వృద్ధిలో ఎన్నో వంతు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవించింది?
జవాబు:
1/5 వంతు

42. 2009 – 10లో షెడ్యూల్డ్ కులాలు / జాతులకు చెందని పట్టణ ప్రాంత ప్రజలలో పేదరికం ఎంత?
జవాబు:
1/6 వంతు

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

43. కోటి జనాభాకి మించి ఉన్న నగరాలను ఏమంటారు?
జవాబు:
మహానగరాలు.

44. పదిలక్షలు – కోటి మధ్య జనాభా ఉన్న నగరాలను ఏమంటారు?
జవాబు:
మెట్రో పాలిటన్ నగరాలు.

45. ఒకలక్ష – పదిలక్షల మధ్య జనాభా ఉన్న నగరాలను ఏమంటారు?
జవాబు:
క్లాస్ -1 నగరాలు.

46. పట్టణీకరణ వల్ల ఏర్పడే ప్రధాన సమస్యను ఒకదానిని తెల్పండి.
జవాబు:
మురుగునీటి పారుదల సమస్య, పారిశుద్ధ్య (చెత్త) నిర్వహణ సమస్య. వాయుకాలుష్యం, మంచినీటి సమస్య, వసతి సమస్య మొ||నవి.

47. DDA ని విస్తరింపుము.
జవాబు:
ఢిల్లీ అభివృద్ధి సంస్థ (Delhi Development Authority)

48. 2011 జనాభా లెక్కల ప్రకారం విశాఖపట్టణం జనాభా ఎంత?
జవాబు:
20,35,690

49. ఢిల్లీ నగరంలోని చట్టబద్ధమైన నివాసాలుగా గుర్తించని గుడిసెలను ఏమని పిలుస్తారు?
జవాబు:
జుగ్గి జోష్ఠిలు

50. ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ ఓడరేవు ఏది?
జవాబు:
విశాఖపట్టణం

51. హైద్రాబాద్ నగర జనాభా 78 లక్షలు అయినచో ఈ నగరం ఏ విధమైన ప్రాంత రకంనకు చెందుతుంది?
జవాబు:
మెట్రోపాలిటన్ నగరం.

52. బరంపురం నగరపాలక సంస్థ (BMC) ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు:
ఒడిశా.

53. BMC ఏర్పాటు చేయనున్న ఘన వ్యర్థ పదార్థ శుద్ధి కర్మాగారానికి సాంకేతిక, విధానపర మద్దతు అందిస్తోన్న అంతర్జాతీయ సంస్థ ఏది?
జవాబు:
అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (IFC).

54. ప్రస్తుతం కోటి జనాభా దాటిన నగరాలు (భారత దేశంలో) ఎన్ని ఉన్నాయి?
జవాబు:
మూడు.

55. 1950 లలో 10 లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ఉండేవి?
జవాబు:
అయిదు.

56. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ……. ప్రాంతాలలో పేదరిక స్థాయి తక్కువ.
జవాబు:
పట్టణ.

57. జనాభా ఆధారంగా ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా నగరాలను అవరోహణ క్రమంలో అమర్చి రాయండి.
జవాబు:
ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా.

58. భారతదేశంలోని మెట్రో పాలిటన్ నగరానికి ఒక ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:
హైద్రాబాద్, అహ్మదాబాద్, చెన్నై.

59. గుంటూరు నగర జనాభా 6.70 లక్షలు. అయితే ఈ ఏవి?
జవాబు:
క్లాస్ – 1 నగరం.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

60. కింది వానిలో సరికాని జతను గుర్తించి, రాయండి.
→ మహానగరాలు – కోటి మించి జనాభా.
→ పట్టణాలు – 5 వేల నుంచి 1 లక్ష మధ్య జనాభా
→ క్లాస్ – 1 నగరాలు – ఒక లక్ష నుంచి పది లక్షల మధ్య జనాభా.
→ మెట్రోపాలిటన్ నగరాలు – 10 లక్షలు నుంచి 50 లక్షల మధ్య జనాభా.
జవాబు:
మెట్రో పాలిటన్ నగరాలు – 10 లక్షలు నుంచి 50 లక్షల మధ్య జనాభా.

61. కోల్‌కతా ఏ నివాస ప్రాంత రకానికి చెందినది?
జవాబు:
మహానగరం.

62. ఢిల్లీ నగరంలో ఎటువంటి భూములు ఉన్న ప్రాంతాలు బస్తీలుగా, మురికి వాడలుగా ఆక్రమణకు గురయ్యాయి?
జవాబు:
సాంప్రదాయ ఉమ్మడి భూములు.

63. ప్రభుత్వ గుర్తింపు పొందని నివాస ప్రాంతాలను ఏమంటారు?
జవాబు:
అనధీకృత కాలనీలు.

64. క్రింది వానిలో విమానాశ్రయ నగరాలలోని సదుపాయం కానిది ఏది?
హెటళ్ళు, దుకాణాలు, బంధువుల ఇళ్ళు, వినోదం.
జవాబు:
బంధువుల ఇళ్ళు.

65. 2001 -2011 మధ్యకాలంలో పట్టణ జనాభాకు సంబంధించిన గణాంకాలలో సరికానిది ఏది?
→ 9.1 కోట్లు పెరిగింది.
→ 44% సహజ పెరుగుదల వల్ల పెరిగింది.
→ 32% పట్టణాల విస్తరణ వల్ల పెరిగింది.
→ 34% వలసల వల్ల పెరిగింది.
జవాబు:
34% వలసల వల్ల పెరిగింది.

66. D. D. A. అను సంస్థను ఏ నగర అభివృద్ధికై ఏర్పాటు చేసారు?
జవాబు:
ఢిల్లీ

67. ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలను రూపొందించటానికి, కేటాయించడానికి (సాధారణంగా) తప్పనిసరిగా ఉండాల్సినది ఏది?
జవాబు:
మాస్టర్ ప్రణాళిక.

68. నివాస ప్రాంతాల పిరమిడ్ లో ఎగువ స్థాయిలో ఉండేవి నగరం ఏ విధమైన నివాస ప్రాంతం క్రిందకు వస్తుంది?
జవాబు:
మహానగరాలు.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

69. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) కైరో విమానాశ్రయము ( ) a) ఈజిప్టు
ii) హీధ్రా విమానాశ్రయము ( ) (b) లండన్
iii)సువర్ణభూమి విమానాశ్రయము ( ) c) బ్యాంకాక్
iv) దుబాయి విమానాశ్రయము ( ) d) UAE మధ్య జనాభా.
జవాబు:
1-a, ii-b, iii – c, iv-d.

70. ‘X’ అనే నగర జనాభా ప్రస్తుతం 8 లక్షలు, కనీసం ఇంకెంత పెరిగితే దానిని మెట్రోపాలిటన్ నగరం అని పిలవవచ్చు.
జవాబు:
2 లక్షలు.

71. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) 2009-10లో SC/ST లకు చెందని పట్టణ ప్రాంత ప్రజలలో పేదరికం 1/6వ వంతు ఉంది.
ii) 2009-10లో SC/ST లకు చెందని పట్టణ ప్రాంత ప్రజలలో పేదరికం 1/3 వ వంతు ఉంది.
A) (1) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) & (ii)
D) రెండూ కావు
జవాబు:
(C) i & ii

10th Class Social 7th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
గత చరిత్ర మరియు వర్తమాన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే విశాఖపట్నం జనాభా పెరుగుదల తీవ్రంగా ఉండటానికి గల ముఖ్య కారణాలు ఏవై ఉంటాయని నీవు భావిస్తావు?
జవాబు:
విశాఖపట్టణం జనాభా పెరుగుదల తీవ్రంగా ఉండుటకు కారణాలు :

  1. రేవు పట్టణంగా విశాఖపట్టణానికి ఉన్న ప్రాముఖ్యత.
  2. రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెంది ఉండుట.
  3. వలస ప్రజలు విశాఖపట్టణానికి ఎక్కువగా రావడం.
  4. విద్య, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండుట.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 2.
కొన్ని ప్రదేశాలు చక్కని నివాస ప్రాంతాలుగా ఎక్కువ మందిని ఆకర్షించడానికి గల కారణం ఏమిటి?
జవాబు:

  1. నీటివనరులు
  2. నేల రకాలు
  3. భద్రత
  4. ప్రకృతి శక్తుల నుంచి రక్షణ
  5. సహజ ఓడరేవు
  6. విమానాశ్రయం
  7. రైల్వే స్టేషన్
  8. బస్టాండ్
  9. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్నత విద్య, ఉపాధి, వైద్య సదుపాయాలు గల ప్రదేశాలు ఎక్కువ మందిని ఆకర్షిస్తాయి.

ప్రశ్న 3.
ఢిల్లీ నగర జనాభా

సంవత్సరం జనాభా (లక్షల్లో)
1951 20
1961 35
1971 48
1981 68
1991 100
2001 120

ఢిల్లీ నగర జనాభా అనూహ్యంగా ఏ దశాబ్దంలో పెరిగింది? దానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చని నీవు అనుకుంటున్నావు?
జవాబు:
1. 1981 – 1991 దశాబ్దంలో ఢిల్లీ నగర జనాభా అత్యధికంగా పెరిగింది.
2. ఉపాధి అవకాశాలు, వలసలు, విద్య, వైద్య సదుపాయాలు మొదలగు కారణాల వలన ఢిల్లీ జనాభా పెరిగింది.

ప్రశ్న 4.
మహానగరాలు అని వేటిని పిలుస్తాము? ఉదాహరణనిమ్ము.
జవాబు:
కోటి జనాభాకి మించి ఉన్న నగరాలను మహానగరాలు అంటారు.
ఉదా : ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా

ప్రశ్న 5.
మెట్రోపాలిటన్ నగరం అని దేనినంటారు? ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
పది లక్షలు – కోటి మధ్య జనాభా ఉన్న నగరాలను మెట్రోపాలిటన్ నగరాలు అంటారు.
ఉదా : చెన్నై, హైదరాబాదు, అహ్మదాబాదు.

ప్రశ్న 6.
పట్టణీకరణ సమస్యలకు ఏవేని రెండు పరిష్కార మార్గాలను సూచించంది.
జవాబు:
పట్టణీకరణ సమస్యలకు పరిష్కార మార్గాలు :

  1. గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు తగ్గించాలి. దానికిగాను గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పన గావించాలి.
  2. వివిధ పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలలోనే ఏర్పాటు చేయాలి. అలాంటి వారిని ప్రోత్సహించాలి.
  3. చెత్తను రీసైకిల్ చేయటం, చెత్త శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయాలి.
  4. ప్లాస్టిక్ వినియోగం వీలైనంత తగ్గించాలి, అవసరమైతే నిషేధించాలి.

ప్రశ్న 7.
నివాసప్రాంతంలో ఏయే కార్యక్రమాలు జరుగుతాయి?
జవాబు:
నివాస ప్రాంతంలో విద్య, మతపర, వాణిజ్యం వంటి విభిన్న కార్యక్రమాలుంటాయి.

ప్రశ్న 8.
మానవుడు వ్యవసాయం ప్రారంభించి సుమారు ఎంతకాలమైంది?
జవాబు:
మానవుడు వ్యవసాయం ప్రారంభించి 10,000 సంవత్సరాలైంది.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 9.
భీంబేడ్కా ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు:
భీంబేడ్కా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.

ప్రశ్న 10.
భీంబేడ్కా రాతి గుహలలో ఏమి బయటపడ్డాయి?
జవాబు:
భీంబేడ్కా రాతి గుహలలో ఆదిమానవులు గీచిన చిత్రాలు బయటపడ్డాయి.

ప్రశ్న 11.
జుగ్గి జోష్ఠి ప్రాంతాలు అంటే ఏమిటి?
జవాబు:
ఢిల్లీలో చట్టబద్ధమైన నివాసాలుగా గుర్తించిన గుడిసెలను జుగ్గి జోష్ఠి అంటారు.

ప్రశ్న 12.
ఢిల్లీకి ఎన్నిసార్లు మాస్టర్ ప్రణాళికను తయారుచేశారు?
జవాబు:
ఢిల్లీకి 3 సార్లు మాస్టర్ ప్రణాళికను తయారుచేశారు.

ప్రశ్న 13.
D.D.A ను విస్తరించండి.
జవాబు:
Delhi Development Authority ఢిల్లీ అభివృద్ధి సంస్థ.

ప్రశ్న 14.
పట్టణీకరణ అంటే ఏమిటి?
జవాబు:
ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులు చేస్తూ నగరాలు, పట్టణాలలో నివాసం ఏర్పరచుకొనుటను పట్టణీకరణ అంటాం.

ప్రశ్న 15.
భారతదేశంలో అత్యధిక జనాభా గల 3 నగరాలేవి?
జవాబు:
భారతదేశంలో అత్యధిక జనాభా గల 3 నగరాలు : ముంబై, ఢిల్లీ, కోల్‌కతా.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 16.
విమానాశ్రయ నగరాలు అంటే ఏమిటి?
జవాబు:
పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్న నగరాలనే విమానాశ్రయ నగరాలు అంటారు.

ప్రశ్న 17.
రెవెన్యూ గ్రామాలంటే ఏమిటి?
జవాబు:
నిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామాలను రెవెన్యూ గ్రామాలు అంటాం.

ప్రశ్న 18.
కోటి జనాభా దాటిన నగరాలనేమంటారు?
జవాబు:
కోటి జనాభా దాటిన నగరాలను మహా నగరాలు అంటారు.

ప్రశ్న 19.
ఆవాస ప్రాంతం అంటే ఏమిటి?
జవాబు:
ఆవాస ప్రాంతం అనగా రెవెన్యూ గ్రామం లోపల కొన్ని ఇళ్ల సముదాయం

10th Class Social 7th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భారతదేశంలో ఢిల్లీ రెండవ అత్యంత పెద్ద నగరముగా పేర్కొనబడుటకు గల కారణములేవి?
జవాబు:
భారతదేశంలో ఢిల్లీ రెండవ అత్యంత పెద్ద నగరముగా పేర్కొనటానికి కారణాలు :

  1. భారతదేశానికి స్వాతంత్ర్యంకు పూర్వం, వచ్చిన తరువాత ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగడం.
  2. దశాబ్దాలు గడుస్తున్న క్రమంలో ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ దేశంలోని అన్ని ప్రాంతాల నుండి పెద్దసంఖ్యలో ప్రజలు ఈ నగరానికి వలస రావడం.
  3. దేశ రాజధాని కావటం, పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వలన అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వచ్చి నివసిస్తున్నారు.
  4. ఢిల్లీ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడం.
  5. ఢిల్లీ, చుట్టుప్రక్కల ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనతో పారిశ్రామికాభివృద్ధి జరగడం.

ప్రశ్న 2.
“పట్టణీకరణ పెరుగుతున్నప్పటికీ ఇందుకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించబడటంలేదు.” నగరాలలో పేద ప్రజల పరిస్థితులపై నీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:

  1. పట్టణ పేద ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు, ఆరోగ్యకరమైన పరిసరాలు ఉండవు.
  2. పౌష్టికాహారం పొందలేని స్థాయిలో ఇక్కడ పేద ప్రజలు ఉంటారు.
  3. సరైన గృహవసతి ఉండదు.
  4. విద్యా, వైద్య సదుపాయాలు వీరికి అందుబాటులో ఉండవు. అందువలన పట్టణ ప్రాంతాలలోని పేద ప్రజలు దయనీయ పరిస్థితులలో జీవిస్తున్నారు.

ప్రశ్న 3.
ఈ క్రింది పట్టిక ఆధారంగా దిగువ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
విశాఖపట్టణం జనాభా

సంవత్సరము జనాభా మార్పు శాతంలో
1951 1,08,042 +53.8%
1961 2,11,190 +95.5%
1971 3,63,467 +72.1%
1981 6,03,630 +66.1%
1991 7,52,031 +24.6%
2001 13,45,938 +78, 97%
2011 20,35,690 +51.2%

i) ఏ దశకంలో జనాభా మార్పు (శాతంలో) తక్కువగా ఉంది?
జవాబు:
1991 వ దశకంలో జనాభా మార్పు (శాతంలో) తక్కువగా ఉంది. +24.6% మాత్రమే.

ii) విశాఖపట్టణం జనాభా గణనీయంగా పెరగటానికి గల కారణమేమి?
జవాబు:

  1. రేవు పట్టణంగా విశాఖ పట్టణానికి ఉన్న ప్రాధాన్యత.
  2. రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెంది ఉండుట.
  3. విద్య, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండుట.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 4.
పట్టణీకరణ సమస్యల గురించి రాయండి.
జవాబు:
పట్టణీకరణ సమస్యలు :

  1. గృహవసతి
  2. నీటి సరఫరా
  3. మురుగు నీరు
  4. ఇతర వ్యర్థ పదార్థాలు
  5. రవాణా మరియు రద్దీ
  6. వాయు కాలుష్యం
  7. అంటు వ్యాధులు
  8. వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు

ప్రశ్న 5.
పట్టణీకరణ వలన పర్యావరణంపై పడే ఒత్తిడి ఏ విధమైన అనర్థాలకు దారితీస్తుందో తెలుపుము.
జవాబు:
పట్టణీకరణ వలన కలిగే అనర్థాలు :

  1. వాయు కాలుష్యం పెరుగుతుంది.
  2. శీతోష్ణస్థితి మార్పులు సంభవిస్తాయి.
  3. మురుగునీటి పారుదల సమస్యలు పెరగుతాయి.
  4. భూమిలో కలవని వ్యర్థాలు పెరిగిపోతాయి.

ప్రశ్న 6.
ఢిల్లీ నగరానికి వలసలు పెరగడానికి కారణాలేంటి?
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఢిల్లీ దేశరాజధానిగా కొనసాగింది. దశాబ్దాలు గడుస్తున్న క్రమంలో ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ దేశంలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ నగరానికి వలసలు రాసాగారు. దేశ రాజధాని కావటం, పార్లమెంటు, కేంద్రప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వలన అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వచ్చి నివసిస్తున్నారు. కోటీ అరవై మూడు లక్షల మందితో ఢిల్లీ దేశంలో రెండో పెద్ద నగరంగా పెరిగింది.

ప్రశ్న 7.
మాస్టర్ ప్రణాళిక అనగానేమి? వాటిలో ఏమేముంటాయి?
జవాబు:
ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలు రూపొందించటానికి, కేటాయించటానికి సాధారణంగా ఒక మాస్టర్ ప్రణాళిక ఉంటుంది. ఏ నగరంలోనైనా నివాసప్రాంతాలు, మార్కెట్లు, పాఠశాలలు, పారిశ్రామిక ప్రాంతాలు, కార్యాలయ ప్రాంతాలు, ఆ ఉద్యానవనాలు, వినోద స్థలాలు వంటివి ఉండాలి. దీని ఆధారంగా ఎలాంటి రోడ్లు ఉండాలి, ఎంత విద్యుత్తు లేదా నీళ్లు అవసరం అవుతాయి. వ్యర్థ పదార్థాలను ఎలా తొలగించాలి, పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా కల్పించాలి వంటి అంశాలను ప్రణాళికలు తయారుచేసేవాళ్లు నిర్ణయిస్తారు. ఢిల్లీకి ఇటువంటి మాస్టర్ ప్రణాళికలు మూడుసార్లు తయారుచేశారు.

ప్రశ్న 8.
తీర ప్రాంతాలపైన పట్టుకు యూరప్ దేశస్తులు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు?
జవాబు:
రేవులు నిర్మించే అవకాశం ఉండడం వలనే వలస పాలకులు తీర ప్రాంత ప్రదేశాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ రేవుల ద్వారా కొల్లగొట్టిన ముడిసరుకును వలస పాలకులు తమ దేశాలకు తరలించవచ్చు.

19వ శతాబ్దంలో విశాఖపట్టణం పై ఆధిపత్యం కోసం బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు నావికా యుద్ధానికి దిగారు. ముంబై, చెన్నె వంటి నగరాలను కూడా వలస పాలకులు భారతదేశ సహజ వనరులు కొల్లగొట్టడానికే అభివృద్ధి చేశారు.

ప్రశ్న 9.
వార్షిక సంతల గురించి నీకేం తెలుసు?
జవాబు:
కొన్ని గ్రామాలలో వార్షిక సంత జరుగుతుంది. ఇక్కడ పెద్ద మార్కెట్లో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. నాటకాలు, సంగీతం, నాట్యం వంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. వారపు, లేదా వార్షిక సంతలు ఆ ప్రాంత వృక్ష, పశు జన్యు సంపదకు చాలా కీలకమైనవి. ఇక్కడ స్థానిక విత్తనాలు, పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. ఈ సంతల వల్ల వేరు వేరు గ్రామాల మధ్య వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి.

ఇతర ప్రాంతాలతో మంచి అనుసంధానం ఉన్న (సాధారణంగా రోడ్డు రవాణా, నదుల ద్వారా, ఇతర సాధనాలు కూడా కొన్ని ప్రాంతాలలో ముఖ్యమైనవి) ప్రాంతాలలో మార్కెట్లు, సంతలు బాగా జరుగుతుంటాయి.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 10.
నివాస ప్రాంతాలు పెద్దవి కావడంతో మానవ జీవనంలో వచ్చే మార్పులు ఏమిటి?
జవాబు:
నివాస ప్రాంతాలు పెద్దవిగా అవ్వటంతో వృత్తి పనివాళ్లు పట్టణ ప్రాంతాలలో స్థిరపడటం మరింత సంక్లిష్టంగా మారసాగింది.

– ఆహార ఉత్పత్తి ఒక్కటే కాకుండా ఇతర ఎన్నో పనులు పుట్టుకొచ్చాయి. ప్రతి నివాస ప్రాంతంలో ప్రజలు కొన్ని నైపుణ్యాలలో ప్రత్యేకతను ప్రదర్శించేవాళ్లు. అమ్మటం కోసం అనేక సరుకుల ఉత్పత్తి మొదలయ్యింది. వీటిని వర్తకులు దూర ప్రాంతాలకు తీసుకుని వెళ్లేవాళ్లు.

ప్రశ్న 11.
ఢిల్లీ నగరంలో గల నివాసప్రాంత రకాలను పేర్కొనుము.
జవాబు:
ఢిల్లీ నగరంలో గల నివాస ప్రాంతాలు :

  1. జుగ్గి జోష్ఠి ప్రాంతాలు
  2. మురికివాడలుగా గుర్తించిన ప్రాంతాలు
  3. అనధీకృత కాలనీలు
  4. జుగ్గి జోష్ఠి పునర్నివాస కాలనీలు
  5. గ్రామాలు
  6. క్రమబద్ధీకరించిన అనధీకృత కాలనీలు
  7. పట్టణ గ్రామాలు
  8. ప్రణాళికాబద్ధ కాలనీలు.

ప్రశ్న 12.
సంతలు గ్రామాల మధ్య ఏ రకంగా సంబంధాలు పెంచుతాయి?
జవాబు:
గ్రామంలో వారం, వారం జరిగే సంత ఇతర ప్రదేశాలతో సంబంధానికి ముఖ్యమైన వేదికగా ఉంటుంది. ఈ వారపు సంత ఎంత పెద్దగా ఉంటే, ఆ ఊరు అంత పెద్దదన్నమాట. ఈ సంతలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తారు.

ప్రశ్న 13.
పట్టణీకరణకు దోహదం చేసే అంశాలు ఏవి?
జవాబు:
పట్టణాలు, నగరాలలోని జనాభా పెరుగుదలలో అధిక భాగం సహజ వృద్ధి వల్ల జరిగింది. ఈ పట్టణాల జనాభా కాలక్రమంలో పెరిగింది. చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలను కలుపుకోవటం వల్ల కొన్ని పట్టణాలు, నగరాలు విస్తరించాయి. జనాభా వృద్ధిలో అయిదింట ఒక వంతు మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవించింది.

ప్రశ్న 14.
ఇతర దేశాలలో ఏర్పడుతున్న విమానాశ్రయ నగరాలు కొన్నింటిని పేర్కొనుము.
జవాబు:
ఇతర దేశాలలో ఏర్పడుతున్న విమానాశ్రయ నగరాలకు ఉదాహరణలు : సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం (బ్యాంకాక్, థాయ్ లాండ్), దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం (దుబాయి, యు.ఎ.ఇ.). కైరో అంతర్జాతీయ విమానాశ్రయం (కైరో, ఈజిప్టు), లండన్ హీథే విమానాశ్రయం (లండన్, యుకె).

ప్రశ్న 15.
పట్టిక : నివాసప్రాంత రకం – జనాభా

నివాసప్రాంత రకం 2000 సంవత్సరంలో జనాభా అంచనా (లక్షల్లో) నగర మొత్తం జనాభాలో శాతం
జుగ్గి జోష్ఠి ప్రాంతాలు 20.72 14.8
మురికివాడలుగా గుర్తించిన ప్రాంతాలు 26.64 19.1
అనధీకృత కాలనీలు 7.40 5.3
జుగ్గి జోష్ఠి పునఃనివాస కాలనీలు 17.76 12.7
గ్రామాలు 7.40 5.3
క్రమబద్ధీకరించిన అనధీకృత కాలనీలు 17.76 12.7
పట్టణ గ్రామాలు 8.88 6.4
ప్రణాళికాబద్ధ కాలనీలు 33.08 23.7
మొత్తం 139.64 100

సవరణ :
జనాభా అంచనా వేలల్లో అని ఇచ్చారు, లక్షల్లో అని ముద్రించాలి. పాఠ్యపుస్తకంలో)
పై పట్టికను చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
అ) మురికివాడలలో ఎంత శాతం జనాభా నివసిస్తున్నారు?
ఆ) ఢిల్లీ నగరం మొత్తం జనాభా ఎంత?
ఇ) ఎక్కువ మంది జనాభా ఏ నివాస ప్రాంతంలో నివసిస్తున్నారు? ఎంత శాతం?
జవాబు:
అ) మురికివాడలలో 19.1 శాతం జనాభా నివసిస్తున్నారు.
ఆ) ఢిల్లీ నగర మొత్తం జనాభా : 139.64 లక్షలు.
ఇ) ఎక్కువమంది జనాభా ప్రణాళికాబద్ద కాలనీలలో నివసిస్తున్నారు. అది 23.7 శాతం.

10th Class Social 7th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పట్టణీకరణ వల్ల ఎదురవుతున్న సవాళ్ళను పేర్కొని, నివారణా మార్గాలు చూపండి.
జవాబు:
వివిధ కారణాల వలన ‘పట్టణ జనాభా’ పెరగడాన్నే పట్టణీకరణ అంటారు. ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులు చేపడుతూ నగరాలు, పట్టణాలలో నివాసం ఏర్పరచుకోవడమే పట్టణీకరణ.

పట్టణీకరణకు కారణాలు 3. అవి సహజ వృద్ధి (పెరుగుదల), వలసలు, గ్రామీణ ప్రాంతాలను కలుపుకోవడం.

పట్టణీకరణ వల్ల ఎదురవుతున్న సవాళ్ళు, సమస్యలు :

  1. పట్టణ జనాభా పెరిగిపోతూ ఉండడం వల్ల స్థలం కొరత ఏర్పడుతుంది.
  2. మురికివాడలు పెరిగిపోతున్నాయి. వలస కార్మికుల వల్ల ఇవి ఎక్కువవుతున్నాయి.
  3. ధ్వని (వాహనాలను విరివిగా వినియోగించడం వల్ల) వాయు, నీటి కాలుష్యం ఏర్పడుతుంది.
  4. పెరుగుతున్న వాహనాల వల్ల నిరంతర ట్రాఫిక్ సమస్య.
  5. పెరుగుతున్న పట్టణ జనాభాకు గృహవసతి ఏర్పాటు పెద్ద సమస్య. అదెలు పెరిగిపోతున్నాయి.
  6. మురుగు నీటి పారుదల సమస్య వర్షం సంభవించినపుడు డ్రెయిన్లు పొంగడం లాంటి సమస్యలు. ఇవి ఎన్నో అంటు వ్యాధులకు దారితీయవచ్చు.
  7. వ్యక్తిగత వాహనాల వాడకం విపరీతంగా పెరగడం వలన కాలుష్యం ఏర్పడి ఆరోగ్య సమస్యలకు, స్థానికంగా వాతావరణ మార్పులకు దారితీస్తుంది.
  8. భూమిలో కలిసిపోని (ప్లాస్టిక్, ఇతరాలు), కుళ్ళిపోవటానికి ఎక్కువ సమయం పట్టే పదార్థాల వినియోగం పెరగడం. దీని వలన చెత్త పెరగడం.

నివారణా మార్గాలు :

  1. గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు తగ్గించాలి. దానికిగాను గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పన గావించాలి.
  2. చెత్తను రీసైకిల్ చేయటం, చెత్త శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయాలి.
  3. ప్లాస్టిక్ వినియోగం వీలైనంత తగ్గించాలి, అవసరమైతే నిషేధించాలి.
  4. ప్రజా రవాణాను మెరుగుపరచి, వాటి వాడకంపై ప్రోత్సహించాలి.
  5. వివిధ పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలలోనే ఏర్పాటు చేయాలి. అలాంటి వారిని ప్రోత్సహించాలి.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 2.
మీ ప్రాంతంలోని పర్యావరణ సమస్యలపై మీ జిల్లా కలెక్టర్ కు ఉత్తరం రాయుము.
జవాబు:

సింగనగర్,
విజయవాడ.
తేదీ : 9 సెప్టెంబర్, 20xx.

గౌరవనీయులైన కలెక్టరు గారికి,
నా పేరు శ్రీనివాసరావు. నేను సింగ్ నగర్ లో నివసిస్తున్నాను. మా ప్రాంతంలో ఉన్న పర్యావరణ సమస్యల గురించి మీకు తెలియపరుస్తున్నాను.

మా ప్రాంతంలో వలస కూలీల సంఖ్య పెరిగింది. వారు వారి అవసరాలు తీర్చుకోవడానికి నగరానికి వచ్చి ఇక్కడ క్రొత్త సమస్యలను సృష్టిస్తున్నారు. నీటి సరఫరా కొరత, మురికివాడల పెరుగుదల, వ్యర్థ పదార్థాలను రోడ్ల మీద పడవేయడం వల్ల రవాణా మరియు కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటుంది. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ రోడ్లమీద వదలివేయడం, వాటిని తిన్న చాలా జంతువులు మరణించాయి. చెత్తాచెదారం పెరిగింది. దానిని సరిగా శుభ్రం చేయడం లేదు. భయంకరమైన దుర్గంధం వెలువడుతుంది. ఇవి వివిధ రకాల రోగాలకు కారణమవుతున్నాయి.

నేను చేసుకునే విన్నపం ఏమిటంటే వీటిని బాగుచేయించటంతోపాటు కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలు ఊరికి దూరంగా ఏర్పాటుచేయడం వలన మరియు కాలుష్యానికి కారణం అవుతున్న వాహనాలను కూడా నిలిపివేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

మీయందు విధేయత గల
శ్రీనివాసరావు.

చిరునామా:
జిల్లా కలెక్టర్,
విజయవాడ.

ప్రశ్న 3.
పట్టణీకరణ వల్ల ఏర్పడే సమస్యలకు పరిష్కారాలు చూపండి.
జవాబు:
పట్టణీకరణ వల్ల ఏర్పడే సమస్యలకు పరిష్కారాలు :

  1. సక్రమ మురుగునీటి పారుదల నిర్వహణ చేయాలి.
  2. సక్రమ త్రాగునీటి సరఫరా ఉండాలి.
  3. గ్రామీణ ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాలు కల్పించి, ఉపాధి అవకాశాలు పెంచాలి.
  4. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన పట్టణ వలసలు తగ్గుతాయి.
  5. గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటుచేసి, ఉద్యోగావకాశాలు కల్పించాలి.
  6. పట్టణ రోడ్ల విస్తరణ చేపట్టాలి.
  7. కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి.
  8. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి.

ప్రశ్న 4.
హైదరాబాదు ప్రాంతం అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులను వివరించండి.
జవాబు:
హైదరాబాదు ప్రాంతం అతి పెద్ద నగరంగా అభివృద్ధి చెందడానికి కావలసిన అనుకూల పరిస్థితులు :

  1. హైదరాబాదు నగరం విస్తరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
  2. 80 లక్షలకు మించి జనాభాను కలిగి ఉంది.
  3. రవాణా సౌకర్యాలైన రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి.
  4. అవస్థాపన సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
  5. ఎన్నో పరిశ్రమల స్థాపన వలన పారిశ్రామిక అభివృద్ధి బాగా జరిగినది.
  6. అనేక విశ్వవిద్యాలయాలు ఉండుట వలన విద్యావకాశాలు మెండుగా ఉన్నాయి.
  7. వివిధ రకములైన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులో ఉండుట వలన వైద్య, ఆరోగ్య సేవలు ఎక్కువగా ఉన్నాయి.
  8. సమాచార, సాంకేతిక విస్తరణ (ఐ.టి) బాగా ఉన్నది.
  9. హైదరాబాదులో సేవల రంగం బాగా విస్తరించి ఉన్నది.

ప్రశ్న 5.
పట్టణీకరణ పెరగడమంటే ప్రజల అవకాశాలు పెరగటం, ఆర్థిక కార్యకలాపాలు పెరగటం వంటివి ఒకటే కాదు. దాని వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. – పట్టణీకరణ పరిణామాలపై మీ వైఖరిని తెలియజేయండి.
జవాబు:
పట్టణీకరణ పెరగటం వల్ల అవకాశాలతో పాటు సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అవి :

  • నివాస స్థలాలకు మరియు గృహ వసతికి కొరత
  • మురికివాడలు పెరగడం
  • గాలి, నీరు, నేల కలుషితం అవడం
  • ట్రాఫిక్ సమస్యలు పెరగడం
  • ఆహార పదార్థాల కొరత
  • చెత్త నిర్వహణ కష్టమవడం
  • మురుగునీటి నిర్వహణ సమస్య
  • ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం.
  • పర్యావరణంపై ఒత్తిడి పెరగడం
    అభివృద్ధిలో పట్టణీకరణ అనేది ఒక భాగం. అయినప్పటికీ ప్రభుత్వం పట్టణాలలో తగిన వసతులు కల్పించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే పట్టణీకరణయే అభివృద్ధికి ఆటంకం అవుతుంది.

ప్రశ్న 6.
పట్టణీకరణ వలన కలుగు సమస్యలను విశ్లేషించండి.
(లేదా)
పట్టణీకరణలో ఎదుర్కొనే సమస్యలేవి?
జవాబు:
పట్టణీకరణ పెరగటమంటే ప్రజల అవకాశాలు పెరగటం, ఆర్థిక కార్యకలాపాలు పెరగటం వంటివి ఒక్కటే కాదు. దాని వల్ల ఎన్నో సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. పెరుగుతున్న పట్టణ జనాభాకు గృహవసతి కావాలి. వాళ్లకి నీటి సరఫరా ఉండాలి. మురుగునీరు, ఇతర వ్యర్థ పదార్థాలు తొలగించే విధానం ఉండాలి. వీటన్నిటి వల్ల పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతుంది. వాహనాల వినియోగం పెరగటం వల్ల పట్టణాలలో వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇది ఆరోగ్య సమస్యలకు, స్థానికంగా వాతావరణ మార్పులకు దారి తీస్తుంది. మురుగునీటి తొలగింపు సరిగా లేకపోతే అది ఎన్నో అంటువ్యాధులకు దారితీయవచ్చు.

పట్టణీకరణ పెరగటంలోని ఒక సమస్య భూమిలో కలిసిపోని, లేదా కుళ్లిపోవటానికి ఎక్కువ సమయం పట్టే పదార్థాల వినియోగం పెరగటం. దీనివల్ల ఎంతో చెత్తను తొలగించాల్సి ఉంటుంది.

ప్రశ్న 7.
మీ నివాస ప్రాంతంలో గత 20 సం||ల నుండి జరిగిన మార్పులను తెలిపి, వాటికి గల కారణాలను వివరించండి.
జవాబు:

  1. మా ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాల కాలంలో జనాభా పెరిగింది.
  2. రవాణా సౌకర్యాలు విస్తరించాయి.
  3. వ్యవసాయ భూమి విస్తీర్ణం తగ్గింది.
  4. ఆవాస స్థలాలు, వాణిజ్య సముదాయాల విస్తీర్ణం పెరిగింది.
  5. మురికివాడలేర్పడ్డాయి.
  6. పర్యావరణ కాలుష్యం పెరిగింది.
    వీటిన్నంటికీ ప్రధాన కారణంగా వలసల పెరుగుదల, పట్టణీకరణను చెప్పుకొనవచ్చును.

ప్రశ్న 8.
ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారుతున్నాయో వివరించండి.
జవాబు:
కొన్ని ప్రదేశాలు ప్రజలను బాగా ఆకర్షిస్తాయి. దానికి గల కారణాలు :
1. మంచి రవాణా సౌకర్యాల సదుపాయం :
ఎక్కడైతే మంచి రవాణా సౌకర్యం ఉంటుందో, అక్కడ ప్రయాణించే సమయం తగ్గుతుంది. కావున ఆ ప్రదేశం ప్రజలను ఆకర్షిస్తుంది.

2. మంచి జీవన పరిస్థితులు :
మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ప్రభుత్వ రావాణా సదుపాయం, వాతావరణ కాలుష్యం – లేని ప్రాంతాలు ప్రజలను బాగా ఆకర్షిస్తాయి.

3. విద్య, ఉద్యోగ అవకాశాలు :
మంచి చదువు, మంచి ఉద్యోగం పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఎక్కడైతే విద్య, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతం ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

మిగతా కారణాలు :
మంచి ఆరోగ్య సౌకర్యం, విద్యుచ్ఛక్తి, ప్రశాంతమైన జీవన విధానం గల ప్రాంతాలు ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తాయి.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 9.
కింది పేరాను చదివి వ్యాఖ్యానించండి.

జనాభా పెరగడంతో నేత, కుండల తయారీ, లోహాల తయారీ, ఇతర వృత్తుల వంటివి పెరిగాయి. ఉత్పత్తి చేసే వస్తువుల రకాలు, సంఖ్య పెరగడం వలన వర్తకం కూడా పెరిగింది. వృత్తి పనివాళ్లు పట్టణ ప్రాంతాలలో స్థిరపడటాన్ని పాలకులు ప్రోత్సహించారు. పట్టణ నివాస ప్రాంతాలు అంటే వ్యవసాయం చెయ్యని ప్రజలు ఉండే ప్రాంతాలు విస్తరించసాగాయి.
జవాబు:
మొదట పాలకులే వృత్తి పనివారిని పట్టణాలకు వెళ్ళి పని చేయడానికి ప్రోత్సహించారు. చిన్నగా పట్టణాలలో అన్నీ సౌకర్యాలు విస్తరించడంతో, గ్రామాలలో భూమి లేని వ్యవసాయ కూలీలు మరియు మిగతావారు పట్టణాలకు వలస వెళ్ళడంతో వారి జీవన స్థితిగతులు మెరుగుపడినాయి. కొన్ని సంవత్సరాల తరువాత పరిశ్రమలను స్థాపించడంతో ప్రజలు వారి వృత్తులను కూడా వదిలి పట్టణాలకు వచ్చి వారి జీవన పరిస్థితులను మెరుగుపరచుకోసాగారు.

దానితో పట్టణాల సంఖ్య క్రమక్రమంగా పెరిగి పట్టణ జనాభా కూడా పెరిగిపోయింది. దాని వలన వ్యవసాయం మీద ఆధారపడినవారి శాతం కూడా తగ్గిపోసాగింది. వ్యవసాయం నుండి వచ్చే GDP శాతం తగ్గిపోయింది. కాని పట్టణాలలో జనాభా పెరగడం వలన చాలా సమస్యలను ప్రజలు ఎదుర్కోసాగారు.

ప్రశ్న 10.
చిత్రం 7.1లోని చిత్రాలను చూసి వివిధ నివాస ప్రాంతాలు, ఇళ్ల నిర్మాణంలో ఎదుర్కొనే ముప్పులు, భూ వినియోగం, నివాస ప్రాంతరకం వంటి వాటిల్లో తేడాలను పోల్చండి.
AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 1 AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 2
జవాబు:
అ) 25,000 జనాభాకి ఉద్దేశించిన సిమ్లా పట్టణంలో నేడు రెండు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. అంటే జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఈ ప్రాంతంలోని వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ప్రకృతి నాశనమవుతోంది. కొండపై గల పచ్చని వాతావరణాన్ని నాశనం చేసి నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

ఆ) హిమాలయాల్లో తరచు కొండచరియలు విరిగి పడుతుండటంతో నివాసానికి ఈ ప్రాంతం అంత అనుకూలంగా లేదు. రోడ్లు నిర్మించినా తరచు వీటిపై కొండచరియలు పడి మార్గంలో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రమాదాల దృష్ట్యా గృహనిర్మాణాలు చేపట్టడం లేదు. అయితే సహజంగా పెరిగే వృక్షజాలాన్ని ఆధారం చేసుకొని పశుపోషణ పర్యాటక రంగం వంటి రంగాలలో ప్రజలు ఉపాధి పొందుతున్నారు.

ఇ) లడక్ లోని సుబ్రా లోయలో వర్షాలు అసలు కురవకపోవడంతో కొండలపై చెట్లు పెరగక బోడిగా ఉంటాయి. పంటలు కూడా వర్షాకాలంలో కాకుండా మంచు కరగగా వచ్చే నీటితో వేసవిలో పండిస్తారు. అందుచే ఈ ప్రాంతంలో నివాసాలు, జనాభా బాగా తక్కువ.

ప్రశ్న 11.
ఆదిమానవులు (సంచార జీవులు, సేకరించేవారు, వేటగాళు) గురించి నీకేం తెలుసు?
జవాబు:
తొలి మానవులు వేట, సేకరణ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునే వాళ్లు. అందుకనే వాళ్లని సేకరించేవాళ్లు, వేటగాళ్లు అనేవాళ్లు. వాళ్లు సంచార జీవులు. అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణం చేస్తూ ఉండేవాళ్లు. ఆహారాన్ని అన్వేషిస్తూ – అంటే చెట్ల నుంచి పండ్లు సేకరిస్తూ, మాంసం, చర్మాలు, ఇతర అవసరాల కోసం జంతువులను వేటాడుతూ వాళ్లు సంచారజీవనం సాగించేవాళ్లు. మొదట రాళ్లుతో తయారుచేసిన పరికరాలను ఉపయోగించటం మొదలు పెట్టారు. ఈ పరికరాలతో వాళ్లు సమర్ధతతో, నైపుణ్యంతో వేటాడగలిగేవాళ్ళ.

మానవులు సుమారు 1.8 లక్షల సంవత్సరాల పాటు సేకరణ – వేటగాళ్లుగా గుంపులలో జీవించారు. అప్పుడు వాళ్లు వ్యవసాయం చేసేవాళ్లు కాదు.

ప్రశ్న 12.
వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవ జీవన విధానంలో వచ్చిన మార్పులు ఏవి?
జవాబు:
వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలోని రీతులను ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు. ఉదాహరణకు రుతు చక్రాలు, వాతావరణ పరిస్థితులను ముందుగా ఊహించటం, సాగు పనులు (విత్తటం, కోయటం వంటివి) ఏవి ఎప్పుడు చేయాలో బాగా తెలిశాయి. ఆకాశంలో గ్రహాల కదలికలు వంటివి గమనించటానికి వాళ్లకి తీరిక సమయం చిక్కింది. జనాభా కూడా పెరిగింది.

జనాభా పెరగటంతో నేత, కుండల తయారీ, లోహాల తయారీ, ఇతర వృత్తుల వంటివి పెరిగాయి. ఉత్పత్తి చేసే , వస్తువుల రకాలు, సంఖ్య పెరగడం వల్ల వర్తకం కూడా పెరిగింది. వృత్తి పనివాళ్లు పట్టణ ప్రాంతాలలో స్థిరపడటాన్ని పాలకులు. ప్రోత్సహించారు. పట్టణ నివాస ప్రాంతాలు, అంటే వ్యవసాయం చెయ్యని ప్రజలు ఉండే ప్రాంతాలు విస్తరించసాగాయి.

ప్రశ్న 13.
ఢిల్లీ నగర ప్రణాళిక అమలులో గల పరిమితులేవి?
(లేదా)
ఢిల్లీ నగర ప్రణాళిక సక్రమంగా అమలు కాకపోవడానికి కారణాలేంటి?
జవాబు:
ప్రణాళికలు తయారుచేయటంలో, ఏ ప్రాంతాలను ఎందుకు ఉపయోగించాలో ప్రకటించటంలో ఆలస్యం జరుగుతోంది. పని కోసం వెదుక్కుంటూ నగరానికి వచ్చిన వాళ్లు భూమిని ఆక్రమించుకుని, ఎటువంటి అనుమతులూ లేకుండా, ఎవరి సహాయం, ఏ సదుపాయాలూ లేకుండా తమ శక్తిమేరకు ఇళ్లు కట్టుకుంటారు. ఇవి చాలాకాలంపాటు అనధీకృత కాలనీలుగా ఉండిపోతాయి. అంతిమంగా ప్రణాళికను ప్రకటించిన నాటికి ఈ ప్రాంతాన్ని వేరే ఉపయోగం కోసం కేటాయించి ఉండవచ్చు.

ఇది క్లిష్టమైన వైరుధ్య పరిస్థితికి దారి తీస్తుంది. ఈ ప్రాంతాలలో సరైన బజారులు, మురుగునీటి వ్యవస్థ ఉండకపోవచ్చు. ఇక్కడ జనసాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో కొన్నింటిని చట్టపరంగా మురికివాడలుగా ప్రకటించారు. కొన్నింటిని ప్రకటించలేదు. అనేక సందర్భాలలో భూమి హక్కుకు సంబంధించి వివాదాలు తలెత్తేవి. ప్రజలు ఎంతో ఖాళీ చేయించేవి. ఫలితంగా ప్రజలు ఒక ప్రాంతాన్ని ఖాళీ చేసినప్పుడు గుర్తింపులేని మరొక ప్రాంతంలో భూమిని ఆక్రమించుకుంటారు. ప్రతిసారి ఇదే పరిస్థితి పునరావృతమవుతూ ఉంటుంది. ఇవి ఢిల్లీ నగర ప్రణాళికల అమలులో అవరోధాలు లేదా పరిమితులు.

AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు

These AP 10th Class Social Studies Important Questions 6th Lesson ప్రజలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 6th Lesson Important Questions and Answers ప్రజలు

10th Class Social 6th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. సిమ్లా పట్టణపు ప్రస్తుత జనాభా ఎంత?
జవాబు:
2 లక్షలు.

2. జనాభా గణన ప్రకారం పనిచేసే వయస్సు అంటే ఎంత?
జవాబు:
15 – 59 సంవత్సరాలు.

3. నిర్ధిష్ట వైశాల్యంలో గల జనాభాను ఏమంటారు?
జవాబు:
జనసాంద్రత.

4. స్త్రీలను అసమానంగా చూడటంను ఏమంటారు?
జవాబు:
లింగ వివక్షత.

5. భారతదేశంలో చివరిసారిగా ఏ సంవత్సరంలో జనగణన జరిగింది?
జవాబు:
2011.

AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు

6. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో ప్రజల సంఖ్యలో మార్పుని ఏమంటారు?
జవాబు:
జనాభా మార్పు.

7. భారత దేశంలో లింగ వివక్షత తక్కువగా (అత్యల్పంగా) ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
కేరళ.

8. జనసాంద్రతను ప్రభావితం చేసే అంశాలేవి?
జవాబు:
వైశాల్యం, జనసంఖ్య.

9. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
74.04 %.

10. ఒక దేశం యొక్క అక్షరాస్యతను లెక్కించడానికి ఏ వయస్సు పైబడిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు?
7 సంవత్సరాలు.

11. భారతదేశంలో జనాభా గణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగును?
జవాబు:
10 సంవత్సరాలు.

12. లింగ వివక్షతను తగ్గించడానికి దోహదపడే ప్రధాన అంశం ఏది?
జవాబు:
విద్య.

13. ఉత్తర మైదానాలలో అధిక జనసాంద్రతకు గల ఏదైనా ఒక కారణం తెల్పండి.
జవాబు:
సారవంతమైన నేలలు, అభివృద్ధి చెందిన నగరాలు, రవాణా సౌకర్యాలు మొ||వి.

14. భారతదేశంలో మొట్ట మొదటిసారిగా జన గణన చేపట్టిన సంవత్సరం ఏది?
జవాబు:
1872.

15. భారతదేశంలో మొదటి సంపూర్ణ జన గణన చేపట్టిన సంవత్సరం ఏది?
జవాబు:
1881.

16. మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి దేనిని నిందిస్తుంటాము?
జవాబు:
జనాభా పెరుగుదలను.

17. దేశ జనాభాను ప్రధానంగా ఎన్ని వయో వర్గాలుగా విభజించారు?
జవాబు:
మూడు.

18. జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది ఏది?
జవాబు:
లింగ నిష్పత్తి.

19. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినపుడు జనాభా ఎంత శాతం మంది అక్షరాస్యులున్నారు?
జవాబు:
12%.

AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు

20. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
64.84%.

21. 2011 జనాభా గణన ప్రకారం స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
65.46%.

22. 2011 జనాభా గణన ప్రకారం పురుషుల అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
82.14%.

23. ఒక సంవత్సరంలో వెయ్యిమంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో తెలియజేయునది ఏది?
జవాబు:
జననాల రేటు.

24. భారతదేశ ప్రస్తుత ఫెర్టిలిటీ శాతం ఎంత?
జవాబు:
2.7%.

25. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఫెర్టిలిటీ శాతం ఎంత?
జవాబు:
1.9%.

26. 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలో మీటరుకి ఎంతమంది ఉన్నారు.?
జవాబు:
382.

27. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కల రాష్ట్రమేది?
జవాబు:
ఉత్తరప్రదేశ్.

28. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కల రాష్ట్రమేది?
జవాబు:
సిక్కిం

29. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రమేది?
జవాబు:
బీహార్.

AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు

30. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రమేది?
జవాబు:
అరుణాచల్ ప్రదేశ్.

31. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రమేది?
జవాబు:
కేరళ.

32. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రమేది?
జవాబు:
హర్యా నా.

33. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత || గల రాష్ట్రమేది?
జవాబు:
కేరళ.

34. భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు జనాభా సమాచార సేకరణ, నమోదులను నిర్వహించు సంస్థ ఏది?
జవాబు:
సెన్సెస్ ఆఫ్ ఇండియా.

35. భారతదేశ జనాభా ఏ సంవత్సరం తరువాత నిరంత రాయంగా పెరుగుతుంది?
జవాబు:
1921.

36. గొప్ప విభాజక లేదా గొప్ప విస్పోటక సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని పిలుస్తారు?
జవాబు:
1921.

37. ప్రతి దశాబ్దానికి చేరిన అదనపు మనుషుల సంఖ్యను సూచించునది ఏది?
జవాబు:
జనాభా పెరుగుదల.

AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు

38. జనాభా వృద్ధి శాతాన్ని ……… శాతం అని కూడా అంటారు?
జవాబు:
వార్షిక వృద్ధి.

39. జనాభా అంశాలు ఏ ప్రక్రియల ప్రభావం వల్ల మారుతూ ఉంటాయి?
జవాబు:
జననాలు, మరణాలు, వలసలు.

40. తరువాతి కాలంనాటి జనాభా – ముందు కాలం నాటి జనాభా =?
జవాబు:
జనాభా మార్పు,

41. సాంఘిక శాస్త్రంలో దేని గురించిన అధ్యయనం చాలా కీలకమైన అంశం?
జవాబు:
జనాభా.

42. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు ఎంత మంది స్త్రీలు కలరు?
జవాబు:
940.

43. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లలో ఎంత?
జవాబు:
1210 (121 కోట్లు),

44. పిల్లలు అని సహజంగా ఏ వయస్సు వారిని పేర్కొంటారు?
జవాబు:
0 – 15 సంవత్సరములు.

45. కేరళ రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు, ఎంత మంది స్త్రీలు కలరు?
జవాబు:
1040.

46. అమెరికాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు, ఎంత మంది స్త్రీలు కలరు?
జవాబు:
1050.

47. 2011 లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత ఎంత?
జవాబు:
17.

48. 2011 లెక్కల ప్రకారం బీహార్ జనసాంద్రత ఎంత?
జవాబు:
1106.

49. (జననాల సంఖ్య + వలస వచ్చిన వారి సంఖ్య) – (మరణాల సంఖ్య + వలస వెళ్ళినవారి సంఖ్య) = ?
జవాబు:
ఒక ప్రాంతంలో జనాభాలో మార్పు,

50. “ఒక మహిళ పునరుత్పత్తి వయస్సు చివరి వరకు జీవించి ఉండి, ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను” ఏమంటారు?
జవాబు:
ఫెర్టిలిటీ శాతం

51. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుష జనాభా ఎంత?
జవాబు:
62,37,24,248

52. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ జనాభా ఎంత?
జవాబు:
58,64,69,174.

53. జనాభా ఎక్కువై ……. తక్కువ అవ్వటం వల్ల ఇతరులు ప్రయోజనం పొందలేకపోతున్నారు.
జవాబు:
వనరులు.

54. భారతదేశంలో ప్రతి వంద మంది మగపిల్లలకు ఎంత మంది ఆడపిల్లలు పుడుతున్నారు?
జవాబు:
103.

55. ఏ సంవత్సరం నుంచి జననాల శాతం క్రమేపీ తగ్గుతుంది?
జవాబు:
1981.

56. జనాభా ఆధారంగా ముంబయి, ఢిల్లీ, కోలకతా నగరాలను అవరోహణ క్రమంలో రాయండి?
జవాబు:
ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా.

57. జనసాంద్రత ఆధారంగా శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలను అవరోహణ క్రమంలో రాయండి.
జవాబు:
కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం.

AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు

58. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లా జనాభా జనసాంద్రత ఎంత?
జ. 192. 59. కింది వానిని సరిగా జతపరచండి.
i) 2001లో అక్షరాస్యత శాతం ( ) a) 64.84
ii) 2011లో అక్షరాస్యత శాతం ( ) b) 74.0410 63.
iii) 2011లో పురుష అక్షరాస్యత శాతం ( ) c) 82.14%
iv) 2011లో స్త్రీ అక్షరాస్యత శాతం ( ) d) 65.46%
జవాబు:
i-a, ii – b, ill – c, iv.de

60. జనాభా సంఖ్య, విస్తరణ అంశాలు వంటివి నిరంతరం మారుతూ ఉంటాయి. అయితే ఈ క్రింది వానిలో ఏ ప్రక్రియ ప్రభావం వల్ల జనాభా అంశాలు మారవు?
జననాలు, మరణాలు, జన సాంద్రత, వలసలు.
జవాబు:
జనసాంద్రత.

61. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రము హర్యానా.
ii) అత్యధిక జన సాంద్రత గల రాష్ట్రము బీహార్.
పై వానిలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు.
జవాబు:
C (i) & (ii)

62. క్రింది వానిని సరిగా జతపరచండి.
1) అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ( ) a) సిక్కిం
ii) అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ( ) b) ఉత్తరప్రదేశ్
iii) అత్యధిక గల రాష్ట్రం ( ) c) అరుణాచల్ ప్రదేశ్
iv) అత్యల్ప జనాభా గల రాష్ట్రం ( ) d) బీహార్,
జవాబు:
i-d, ii-c, iii-b, iv-a

63. ఇవ్వబడిన రేఖాచిత్రంను పరిశీలించి ప్రశ్నకు సమాధానము రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 1
ప్ర. భారతదేశ ఫెర్టిలిటీ రేటు ధోరణి ఎలా ఉంది?
జవాబు:
తగ్గుతూ ఉంది.

10th Class Social 6th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
లింగ నిష్పత్తిని ఎలా లెక్కిస్తారు?
జవాబు:
ప్రతి 1000 మంది పురుష జనాభాకు ఉండే స్త్రీల జనాభా ఆధారంగా లింగ నిష్పత్తిని లెక్కిస్తారు.

ప్రశ్న 2.
మన దేశంలో గత దశాబ్ద కాలంలో మరణాల శాతం తగ్గడానికి గల ప్రధాన కారణమేమిటి?
జవాబు:

  1. మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందించడం వలన
  2. వైద్య విధానములో ఆధునిక సౌకర్యాల వినియోగం వలన
  3. విద్య మరియు సెన్సు మరియు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రజలు తమచుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకుని వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరచుకుంటున్నారు.

AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు

ప్రశ్న 3.
శ్రామిక జనాభా అని ఎవరిని పిలుస్తారు?
జవాబు:
15 నుండి 39 సంవత్సరాల వయస్సు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు.

ప్రశ్న 4.
ఫెర్టిలిటీ శాతం 2 కి దగ్గరగా ఉంటే దాని అర్థం ఏమిటి ?
జవాబు:
ప్రతి మహిళ సగటున ఇద్దరు పిల్లలకు జన్మనిస్తోందని అర్థం.

→ క్రింది బార్ గ్రాఫ్ ను పరిశీలించి 5, 6, 7, 8 ప్రశ్నలకు సమాధానములు రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 2

ప్రశ్న 5.
పై గ్రాఫ్ దీని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
పై గ్రాఫ్ భారతదేశ జనాభా : స్త్రీ, పురుష నిష్పత్తి (1951-2011) గురించి తెలియచేస్తుంది.

ప్రశ్న 6.
1991 సంవత్సరంతో 2011 సంవత్సరంను పోల్చినపుడు లింగ నిష్పత్తిలో మార్పు దేనిని సూచిస్తుంది?
జవాబు:
స్త్రీ, పురుష నిష్పత్తిలో పెరుగుదల (929 నుంచి 940)ను సూచిస్తుంది.

ప్రశ్న 7.
లింగ నిష్పత్తి అంటే ఏమిటి?
జవాబు:
ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియచేసేది లింగ నిష్పత్తి.

ప్రశ్న 8.
భారతదేశంలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉండడానికి గల కారణం ఏమిటి?
జవాబు:
ఎ) లింగ వివక్షత
బి) నిరక్షరాస్యత
సి) వైద్య సౌకర్యాల లేమి
డి) పోషకాహారం ఇవ్వకపోవడం
ఇ) తల్లిదండ్రుల వైఖరి

AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు

ప్రశ్న 9.
2011 జనాభా గణన ప్రకారం దేశ జనాభా సుమారు 121 కోట్లకు చేరింది. దానికి గల రెండు కారణాలను తెల్పండి.
జవాబు:

  1. బాల్య వివాహాలు
  2. నిరక్షరాస్యత
  3. మూఢ నమ్మకాలు
  4. వైద్యశాస్త్రంలో అభివృద్ధి

ప్రశ్న 10.
జనాభా పెరుగుదల నియంత్రణకు రెండు నినాదాలు తయారుచేయండి.
జవాబు:
జనాభా పెరుగుదల నియంత్రణకు నినాదాలు :

  • ఒక్కరు ముద్దు – ఇద్దరు వద్దు
  • అధిక జనాభా – అనర్థాలకు హేతువు
  • జనాభాను నియంత్రించండి – ప్రకృతిని ఆస్వాదించండి.

క్రింది పట్టికను పరిశీలించి 11, 12 ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
జనగణన-2011, కేరళ-బీహార్ అక్షరాస్యతా రేటుకు సంబంధించిన దత్తాంశం
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 3

ప్రశ్న 11.
పై పట్టిక దేని గురించి తెలుపుతోంది?
జవాబు:
పై పట్టిక జనగణన 2011 ప్రకారం కేరళ – బీహార్ అక్షరాస్యతా రేటుకు సంబంధించిన దత్తాంశం గురించి తెలుపుతుంది.

ప్రశ్న 12.
స్త్రీలలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉండడానికి గల ఒక కారణము పేర్కొనుము.
జవాబు:

  • సాంప్రదాయాలు పాటించడం
  • బాలికల విద్యకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం

ప్రశ్న 13.
జనాభా మార్పుకు దోహదపడే ప్రక్రియలు ఏవి?
జవాబు:
జనాభా మార్పుకు దోహదపడే ప్రక్రియలు :

  • జననాలు
  • మరణాలు
  • వలసలు

ప్రశ్న 14.
దిగువ గ్రాఫ్ ను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానం వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 4
a) ఏ రాష్ట్రంలో ఎక్కువ జనసాంద్రత ఉంది?
b) అరుణాచల్ ప్రదేశ్ లో జనసాంద్రత ఎందుకు తక్కువగా ఉంది?
జవాబు:
అరుణాచల్ ప్రదేశ్ లో జనసాంద్రత తక్కువగా ఉండటానికి గల కారణం : అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగం కొండలు, రాళ్ళతో ఉండడం.

ప్రశ్న 15.
సూచన : ఇవ్వబడిన గ్రాఫును పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 5
a) 2011లో నమోదయిన ఫెర్టిలిటీ రేటు ఎంత?
జవాబు:
2011లో నమోదయిన ఫెర్టిలిటీ రేటు – 2.7.

b) 1961-2011 మధ్య కాలంలో ఫెర్టిలిటీ రేటుకు సంబంధించి మీరు గమనించిన ధోరణి (Trend) ను తెల్పండి.
జవాబు:
1961-2011 మధ్య కాలంలో ఫెర్టిలిటీ రేటు తగ్గుతుంది.

ప్రశ్న 16.
“మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికి జనాభా పెరుగుదలనే నిందిస్తూ ఉంటాము.” – వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. అధిక జనాభా పెరుగుదల అనేక అనర్థాలకు దారి తీస్తుంది.
  2. ఆహార, స్థల, భూమి, వృత్తి (ఉద్యోగ, ఉపాధి) అవసరాలను తీర్చడం కష్టతరమవుతుంది.
  3. విద్య, ఆరోగ్య మొదలైన అవసరమైన సదుపాయాల కల్పన కష్టతరం అవుతాయి. వీటన్నింటికి కారణం అధిక జనాభానే.

ప్రశ్న 17.
అభివృద్ధి అంచులలో నెట్టివేయబడ్డవారు అంటే ఎవరు?
జవాబు:
అభివృద్ధికి నోచుకోని వారిని అంచులకు నెట్టివేయబడ్డవారు అంటారు.

ప్రశ్న 18.
మనం ఎదుర్కొంటున్న సమస్యలకు సాధారణంగా ఎవరిని నిందిస్తాం?
జవాబు:
మనం ఎదుర్కొంటున్న సమస్యలకు సాధారణంగా జనాభా పెరుగుదలను నిందిస్తాం.

ప్రశ్న 19.
భారతదేశంలో జనగణనను ఎవరు నిర్వహిస్తారు?
జవాబు:
సెన్సెస్ ఆఫ్ ఇండియా అనే కేంద్రప్రభుత్వ సంస్థ జన గణన, సేకరణ, నమోదు, విశ్లేషణ మొదలగు కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు

ప్రశ్న 20.
అమెరికాలో పురుష : స్త్రీ నిష్పత్తి ఎంత?
జవాబు:
అమెరికాలో పురుష : స్త్రీ నిష్పత్తి 1000 : 1050.

ప్రశ్న 21.
భారతదేశ అక్షరాస్యత ఎంత?
జవాబు:
భారతదేశ అక్షరాస్యత 74.04%.
పురుషుల అక్షరాస్యత 82.14%, స్త్రీ అక్షరాస్యత 66.46%.

ప్రశ్న 22.
జనాభా మార్పును ప్రభావితం చేసే అంశాలు ఏవి?
జవాబు:
జనాభా మార్పును ప్రభావితం చేసే అంశాలు :

  1. జననాలు
  2. మరణాలు
  3. వలసలు

ప్రశ్న 23.
2011లో భారతదేశ జనాభా వృద్ధిశాతం ఎంత?
జవాబు:
2011లో భారతదేశ జనాభా వృద్ధిశాతం 17.58%.

ప్రశ్న 24.
2001-11లో భారతదేశ ఫెర్టిలిటీ రేటు?
జవాబు:
2001-11లో భారతదేశ ఫెర్టిలిటీ రేటు 2.7%.

ప్రశ్న 25.
2001-11లో ఆంధ్రప్రదేశ్ లో ఫెర్టిలిటీ రేటు.?
జవాబు:
2001-11లో ఆంధ్రప్రదేశ్ లో ఫెర్టిలిటీ రేటు 1.9%.

ప్రశ్న 26.
భారతదేశ జనసాంద్రత ఎంత?
జవాబు:
భారతదేశ జనసాంద్రత 382.

ప్రశ్న 27.
భారతదేశంలో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది?
జవాబు:
భారతదేశంలో అత్యధిక జనసాంద్రత పశ్చిమ బెంగాల్ (904).

ప్రశ్న 28.
భారతదేశంలో అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ఏది?
జవాబు:
అరుణాచల్ ప్రదేశ్ (13)

ప్రశ్న 29.
ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక జనసాంద్రత గల జిల్లా ఏది?
జవాబు:
కృష్ణా (519)

AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు

ప్రశ్న 30.
ఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ఏది?
జవాబు:
వై.ఎస్.ఆర్. కడప (188)

ప్రశ్న 31.
అవ్యవస్థీకృత రంగంలో గల ప్రజల గూర్చి నీకేం తెలుసు?
జవాబు:
భారతదేశంలో శ్రామికులలో 92 శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. వారికి సరిగా పని దొరకదు. వాళ్ల కుటుంబాలు మినహా వారికి ఎటువంటి సామాజిక భద్రత లేదు.

ప్రశ్న 32.
జనాభా వృద్ధి శాతం అంటే ఏమిటి?
జవాబు:
జనాభా వృది శాతం చాలా ముఖ్యమైన అంశం. దీనిని సంవత్సరానికి శాతంలో లెక్కగడతారు. ఉదాహరణకు సంవత్సరానికి 2 శాతం వృద్ధి అంటే అంతకు ముందు సంవత్సరంలో ఉన్న ప్రతి వంద మందికి ఇద్దరు చొప్పున జనాభా పెరిగిందన్నమాట. ఇది చక్రవడ్డీ లాగా ఉంటుంది. దీనిని వార్షిక వృద్ధి శాతం అంటారు.

10th Class Social 6th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కింది పేరాగ్రాఫ్ ను చదివి సమాధానం రాయండి.
జవాబు:
“ఆడపిల్ల కంటే మగ పిల్లవాడు పుట్టాలని కోరుకునే లింగవివక్షత భారతదేశంలో ఇప్పట్లో పోయే సూచనలు | కనపడుట లేదు. మగపిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో మరణాల శాతం ఎక్కువగా వుంది. అనేక కుటుంబాలు ఆడపిల్లలను భారంగా భావిస్తాయి. మహిళల పట్ల ఈ వివక్షతను తగ్గించటానికి బలమైన శక్తిగా మహిళల చదువు ఉపయోగపడుతుంది.”
ప్రశ్న : లింగ నిష్పత్తిలోని తేడాల కారణంగా సమాజంపై పడే ప్రభావాలను పేర్కొనండి.
జవాబు:

  1. ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది.
  2. మగ పిల్లలందరికి వివాహాలు జరిగే అవకాశాలు భవిష్యత్తులో తగ్గుతాయి.
  3. కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది.
  4. లింగ వివక్షత సమాజంలో పెరిగిపోతుంది.
  5. సమాజంలో నేర స్వభావం పెరిగిపోతుంది.

ప్రశ్న 2.
గ్రాఫ్ ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 6
1) పైన ఇచ్చిన గ్రాఫ్ ఏమి తెలియజేస్తుంది?
జవాబు:
పైన ఇచ్చిన గ్రాఫ్ 1951 నుండి 2011 వరకూ గల స్త్రీ, పురుష లింగ నిష్పత్తిని తెలియజేస్తుంది.

2) అతి తక్కువ స్త్రీ, పురుష నిష్పత్తి ఏ సంవత్సరంలో నమోదు అయినది?
జవాబు:
స్త్రీ, పురుష నిష్పత్తి మరీ తక్కువగా ఉన్న సం||ము 1991.

3) ప్రస్తుతం భారతదేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి ఎలా ఉంది?
జవాబు:
ప్రస్తుత భారతదేశ స్త్రీ, పురుష నిష్పత్తి 1000 : 940.

4) స్త్రీల సంఖ్య 935 కంటే ఎక్కువగా ఎన్ని సార్లు నమోదు అయింది?
జవాబు:
స్త్రీల సంఖ్య 935 కంటే ఎక్కువగా 3 సార్లు నమోదు అయింది.

ప్రశ్న 3.
ఈ క్రింది పేరా చదివి ప్రశ్నకు సమాధానము వ్రాయండి.
ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల దేశాలలో భారతదేశం ఒకటి. 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 382 వ్యక్తులు. ఈ సాంద్రతలో తేడాలు పశ్చిమ బెంగాల్ లో 904 నుండి అరుణాచల్ ప్రదేశ్ లో 13 వరకు ఉన్నాయి.
Q. పశ్చిమ బెంగాల్ లో జనసాంద్రత ఎక్కువగా ఉండటానికి, అరుణాచల్ ప్రదేశ్ లో జనసాంద్రత తక్కువగా ఉండటానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:

  1. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సారవంతమైన గంగానదీ పరీవాహక ప్రాంతంలో ఉంది.
  2. ఈ ప్రాంతం వ్యవసాయానికి, పరిశ్రమలకు అనుకూలంగా ఉండటం వల్ల నివాసయోగ్యంగా ఉన్నది.
  3. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ భాగం పర్వత ప్రాంతం మరియు మంచుతో కప్పబడి ఉన్నది.
  4. కావున అరుణాచల్ ప్రదేశ్ అధిక జనాభాకు అనుకూలంగా లేదు.

ప్రశ్న 4.
క్రింది బార్ గ్రాఫ్ ని పరిశీలించి, వాటిని విశ్లేషిస్తూ నాలుగు వాక్యాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 7
జవాబు:

  1. బార్ గ్రాఫ్ 1991 నుండి 2011 వరకు భారతదేశ జనాభాలో లింగ నిష్పత్తిని తెలుపుతుంది.
  2. 1991 లో లింగ నిష్పత్తి 929 గాను, 2001 లో 933 గాను, 2011 లో 940గాను ఉన్నది.
  3. 1991 లో లింగ నిష్పత్తి మరీ తక్కువగా ఉంది. 2011 లో కొంత పెరుగుదల ఉన్నది. అంటే భారతదేశంలో లింగ నిష్పత్తి ఆందోళన కలిగిస్తుంది.
  4. ఈ సమస్యను పరిష్కరించాలంటే
    i) స్త్రీల పట్ల వివక్షత ఉండకూడదు.
    ii) ఆడశిశువుల భ్రూణహత్యలను ఆపాలి.
    iii) సంరక్షణ, శ్రద్ధలలో, ఆరోగ్య రక్షణలలో బాలురతో సమానమైన ప్రాధాన్యతను బాలికలకు ఇవ్వాలి.

ప్రశ్న 5.
దిగువనీయబడిన (ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 8
a) ఏ సంవత్సరంలో స్త్రీ, పురుష నిష్పత్తి అత్యధికంగా ఉంది?
జవాబు:
1951

b) భారతదేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా ఉండటానికి గల కారణాలు పేర్కొనండి.
జవాబు:
1. లింగ వివక్ష
2. మూఢనమ్మకాలు

ప్రశ్న 6.
క్రింది సమాచారం ఆధారంగా ఒక పట్టికను తయారుచేయండి.
“ప్రతీ 1000 మంది పురుషులకుగాను ఉన్న స్త్రీల సంఖ్యను లింగ నిష్పత్తి అంటారు. ప్రతీ 1000 మంది పురుషులకు గల స్త్రీల సంఖ్య 1951లో 946 గాను, 1991లో 929 గాను, 2001లో 933 మరియు 2011లో 940గాను ఉన్నది.”
జవాబు:

సంవత్సరం లింగ నిష్పత్తి
1. 1951 946
2. 1991 929
3. 2001 933
4. 2011 940

ప్రశ్న 7.
1990 తరువాత మరణశాతం తగ్గటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
1990 తరువాత మరణశాతం తగటానికి కారణాలు :

  1. కరువు సాయాన్ని అందించడం.
  2. ఆహార ధాన్యాల తరలింపు చేయడం.
  3. చౌకధరల దుకాణాలు తెరవడం.
  4. అంటు రోగాలను నియంత్రించడం.
  5. మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించడం.
  6. శుభ్రమైన నీరు సరఫరా చేయడం.
  7. పోషకాహారం లభించడం.
  8. టీకాలు, యాంటీబయోటిక్స్ అందుబాటులోకి రావడం.

AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు

ప్రశ్న 8.
భారతదేశంలో పనిచేసే వయసు గల జనాభా ఎక్కువగా ఉంది? దాని వలన కలిగే లాభాలేవి?
జవాబు:
పనిచేసే వయసు గల జనాభా ఎక్కువగా ఉండటం వలన కలిగే లాభాలు :

  1. 15-59 సంవత్సరాల వయస్సు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు.
  2. వీరు వ్యవసాయరంగం, పరిశ్రమలు, సేవల రంగాలలో ఉత్పత్తికి దోహదపడతారు. దేశాభివృద్ధికి వెన్నుముకగా నిలుస్తారు.
  3. దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) పెరగడంలో కీలక పాత్ర పోషించేది ఈ సమూహం వారే.
  4. దేశ శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారు.
  5. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి పాటుపడతారు.

ప్రశ్న 9.
భారతదేశంలో 103 శాతం మంది ఆడపిల్లలు పుడుతున్నారు? భారతదేశంలో పురుష, స్త్రీ నిష్పత్తి 1000 : 970 ఈ – పరస్పర విరుద్ధ భావనలను ఎలా సమర్ధిస్తావు?
జవాబు:
పైన యిచ్చిన రెండు వాక్యాలు సరియైనవే. ఎందుకనగా భారతదేశంలో ప్రతి వేయిమందికి బాలురకు 103 మంది బాలికలు జన్మిస్తున్నారు. అయితే పుట్టిన ఆడపిల్లల పోషణ, సంరక్షణలలో గల వివక్షతల వలన 0-5 వయస్సులో బ్రతుకుతున్న మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంది. అందుచే పుట్టిన ఆడపిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు. కాబట్టి 100 మంది బాలురకు 103 మంది బాలికలు జన్మించినా 97 మందే జీవిస్తున్నారు. అందుకే పురుష, స్త్రీ నిష్పత్తి 1000 : 970 గా ఉంది.

ప్రశ్న 10.
దేశ జనాభాను వయస్సుల వారీగా వర్గీకరించి వివరించండి.
జవాబు:
భారతదేశ జనాభాను ప్రధానంగా మూడు వయస్సు వర్గాలుగా విభజించారు. అవి :

  1. పిల్లలు (సాధారణంగా 15 సం||ల లోపువారు వీరి సంరక్షణను కుటుంబం చూసుకుంటుంది.
  2. పనిచేసే వయస్సు (15-59 సం||) సాధారణంగా సమాజంలో పనిచేసే జనాభా ఇది. వీరు పునరుత్పత్తి వయస్సులో కూడా ఉంటారు.
  3. వృద్ధులు (59 సం|| పైబడినవారు) వృద్ధాప్యంలో మద్దతు కోసం ఈ వయస్సువారు తమ కుటుంబాలపై ఆధారపడి ఉంటారు.

ప్రశ్న 11.
జన గణన ద్వారా ఏం తెలుసుకుంటాం?
జవాబు:
దశాబ్దానికోసారి నిర్వహించే జనాభా గణన ద్వారా మనకు అనేక విషయాలు తెలుస్తాయి. వీటిలో ముఖ్యమైనవి. దేశం మొత్తం జనాభా, జనాభా విస్తరణ, జన సాంద్రత, జనాభా పెరుగుదల ఫెర్టిలిటీ రేటు వంటి అంశాలు తెలుస్తాయి. పురుషులు, స్త్రీల సంఖ్య, లింగ నిష్పత్తి తెలుసుకుంటాం. వయస్సుల వర్గీకరణ ప్రకారం ఏ వయస్సు గ్రూపులో ఎందరెందరున్నారో తెలుస్తుంది. శారీరక లోపాలు గల వారి వివరాలు, మతాలు, కులాలు, వృత్తులు వంటి అనేకాంశాలు జన గణనలో చోటు చేసుకుంటాయి.

ప్రశ్న 12.
సమాజంలో స్త్రీ వివక్ష పోవాలంటే ఏం చేయాలి?
జవాబు:
సమాజంలో ప్రతి ఒక్కరిలో మార్పు వస్తే గానీ ఈ సమస్య పరిష్కారం కాదు. మహిళలపట్ల వివక్షతను తగ్గించటానికి బలమైన శక్తిగా మహిళల చదువు ఉపయోగపడుతుంది. మహిళల అక్షరాస్యత, విద్య వల్ల బాలికలలో మరణాల శాతం తక్కువగా ఉంటుందనేందుకు, ఆడపిల్లల ఆరోగ్యం పట్ల చూపే వివక్షత తగ్గుతుంది.

ప్రశ్న 13.
భారతదేశ జనసాంద్రత హెచ్చు తగ్గులకు కారణాలేంటి?
జవాబు:
2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటరుకి 382 వ్యక్తులు. ఈ సాంద్రతలో తేడాలు పశ్చిమబెంగాల్ లో 904 నుంచి అరుణాచల్ ప్రదేశ్ లో 13 వరకు ఉన్నాయి. అసోం, ద్వీపకల్ప ప్రాంత అనేక
రాష్ట్రాలలో జన సాంద్రత ఒక మాదిరిగా ఉంది. భూభాగం కొండలు, రాళ్లతో ఉండడం, ఒక మోస్తరు నుంచి తక్కువ వర్షపాతం, లోతు తక్కువ, అంతగా సారవంతంకాని నేలలు ఈ ప్రాంతంలోని జన సాంద్రతను ప్రభావితం చేశాయి. ఉత్తర మైదానాలు, కేరళలో చదునైన మైదానాలు, సారవంతమైన నేలలు, అధిక వర్షపాతం ఫలితంగా అధిక నుంచి చాలా అధిక జనసాంద్రత ఉంది.

ప్రశ్న 14.
భారతదేశ జనాభా (1901 – 2011)
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 9
అ) ఏ సంవత్సరం నుండి భారతదేశ జనాభా నిరంతరాయంగా పెరుగుతుంది? ఎందువలన?
ఆ) 1901లో భారతదేశ జనాభా ఎంత? 2001లో జనాభా ఎంత? ఈ శతాబ్ద కాలంలో ఎన్నిరెట్లు పెరిగింది?
జవాబు:
అ) 1921 సంవత్సరం నుంచి జనాభా నిరంతరంగా పెరుగుతోంది.
ఆ) 1901లో భారత జనాభా : 238.40 మిలియన్లు.
2001లో భారత జనాభా : 1028.74 మిలియన్లు.
శతాబ్దకాలంలో 4.3 రెట్లు పెరిగింది.

ప్రశ్న 15.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 12
ప్రశ్న : జనాభా ఆధారంగా మనం ప్రపంచ పటాన్ని తయారుచేస్తే అది ఇలా ఉంటుంది. దీనికి, మిగిలిన పటాలకు తేడా ఏమిటి? చర్చించండి.
జవాబు:

  1. జనాభా ఎక్కువగా ఉన్న దేశాలను ఎక్కువ విస్తీర్ణంలో గుర్తించడం జరుగుతుంది.
  2. జనాభా తక్కువగా ఉన్న దేశాలు పెద్దవైనా తక్కువ విస్తీర్ణంలో గుర్తిస్తాము.
  3. కావున సాధారణ ప్రపంచ పటంతో పోలిస్తే జనాభా ఆధారంగా తయారుచేసిన ప్రపంచపటం వేరుగా కన్పిస్తుంది.

ప్రశ్న 16.
భారతదేశంలోని కేరళ వంటి కొన్ని ప్రాంతాలలో లింగనిష్పత్తి మెరుగుగా ఉంది. దీనిని నీవెలా ప్రశంసిస్తావు?
జవాబు:

  1. భారతదేశంలోని కేరళ వంటి కొన్ని ప్రాంతాలలో లింగ నిష్పత్తి మెరుగ్గా ఉంది.
  2. లింగ నిష్పత్తి మెరుగుగా ఉండటానికి ప్రజలు, ప్రభుత్వాలు చేసే కృషి ప్రశంసనీయం.
  3. దీని వల్ల సామాజిక మార్పు సంభవిస్తుంది.
  4. ఇది సంపద పంపిణీని, అధికార హోదాలను, జననరేటు తదితర అంశాలను ప్రభావితం చేస్తుంది.

ప్రశ్న 17.
అధిక జనాభా సమస్యపై కొన్ని నినాదాలు వ్రాయండి.
జవాబు:

  1. భూమిపై పుట్టే ప్రతి బిడ్డా ఆర్థిక నరకం సృష్టిస్తాడు – T.R. మాల్టస్.
  2. కుటుంబంలో ప్రతి జననం ఒక శుభఘడియ. కానీ ఈ జననాలు అధికమైతే దేశం, కుటుంబం భరిస్తుందా ? అన్నదే ప్రశ్న – మాలిని బాలసింగం.

ప్రశ్న 18.
“అధిక జనాభా పెరుగుదల అనేక అనర్థాలకు దారితీస్తుంది” దీనిని సమర్థిస్తూ నీ సొంత మాటలలో వ్రాయుము.
జవాబు:

  1. జనాభా అధికంగా పెరగడాన్ని ‘జనాభా విస్ఫోటనం’ అంటాం. ఇది అనేక అనర్థాలకు దారితీస్తుంది.
  2. పెరిగే జనాభాకు సంబంధించి ఆహార, స్థల, భూమి, వృత్తి అవసరాలను తీర్చాల్సిరావడం వల్ల భూమిపై ఒత్తిడి, నిరుద్యోగం పెరుగుతాయి.
  3. అందరికీ విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి కల్పనలు కష్టతరం అవుతాయి.
  4. ఈ పెరుగుదల జల, వాయు, భూమి, గాలి తదితర కాలుష్యాలకు చోదకశక్తి అవుతుంది.

ప్రశ్న 19.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 13
1) కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాలలో అధిక జనసాంద్రతకు గల కారణాలు ఏమిటి?
2) 100 నుండి 200 జనసాంద్రత అనగా అల్పజనసాంద్రత గల జిల్లాలేవి? కారణాలు తెలపండి.
జవాబు:
1) కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాలలో అధిక జనసాంద్రతకు గల కారణాలు:
ఎ) కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఉండటం వలన వ్యవసాయానికి అనుకూలత.
బి) వ్యవసాయాధారిత పరిశ్రమలు వృద్ధి.
సి) వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు.

2) 100 నుంచి 200లోపు జనసాంద్రత గల జిల్లాలు : ప్రకాశం మరియు వై.ఎస్.ఆర్. కడప.
కారణాలు : భౌగోళికంగా కొండలు, గుట్టలు, నీటిపారుదల సౌకర్యాల లేమి మొ||.

10th Class Social 6th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 6
a) ఏ సంవత్సరంలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది?
b) స్త్రీ, పురుష నిష్పత్తి అనగానేమి?
c) లింగ నిష్పత్తిలో 1951 నుండి నీవు ఎలాంటి మార్పులు గమనించావు?
d) స్త్రీల సంఖ్య తగ్గడాన్ని నివారించడానికి ఏమి చేయాలి?
జవాబు:
a) 1991వ సంవత్సరంలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది.
b) జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారో తెలియజేసే నిష్పత్తే స్త్రీ, పురుష నిష్పత్తి.

c)

  • 1951 నుండి 1971 వరకు స్త్రీ, పురుష నిష్పత్తి తగ్గుతూ వచ్చి, 1991 నుండి క్రమేపీ పెరుగుతూ వచ్చింది.
    1951 లో అక్షరాస్యతా శాతం తక్కువగా ఉన్నప్పటికిని స్త్రీ, పురుష నిష్పత్తి ఎక్కువగా ఉండటం గమనార్హం.

d)

  • ప్రకృతిలో స్త్రీ, పురుషులు సమానమే అనే భావన ప్రచారం చేయాలి.
  • లింగ నిర్ధారణ పరీక్షల చట్టాలను కఠినతరం చేయాలి. సక్రమ అమలుకు చర్యలు తీసుకోవాలి.

ప్రశ్న 2.
ఒక ప్రాంత జనసాంద్రత, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులకు మధ్య గల సంబంధాన్ని విశ్లేషించుము.
జవాబు:

  1. భూమి సహజ స్వరూపాన్ని భౌగోళిక స్వరూపం అంటాం. చదరపు కిలోమీటరుకు సగటున నివసించే ప్రజలను జనసాంద్రత అంటాం.
  2. బాగా పంటలు పండే ప్రాంతాలు, పారిశ్రామికవాడలైన ‘గంగా-సింధు మైదానం’ లో జనసాంద్రత ఎక్కువ.
  3. థార్ ఎడారి ప్రాంతం ప్రజల జీవనానికి ఏమాత్రం అనుకూలంగా లేనందున అచ్చట జనసాంద్రత అత్యల్పం.
  4. తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో వర్షపాతం ఎక్కువ. పంటలు బాగుగా పండును. అందుచే ఈ ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువ.
  5. హిమాలయ పర్వత ప్రాంతం సుందరమైనదైనప్పటికీ ఈ ప్రాంతం ఎప్పుడూ మంచుచే కప్పబడియుండుటచే జన జీవనానికి అనుకూలంగా ఉండదు. అందుచే ఇచ్చట జనసాంద్రత తక్కువ.
  6. ఈశాన్య భారతదేశం కొండలతో నిండియున్నందున జనసాంద్రత తక్కువ.

ప్రశ్న 3.
ఈ క్రింది పేరా చదివి నీ అభిప్రాయం రాయుము.
భారతదేశంలో ప్రతీ వంద మందికి 103 మంది ఆడపిల్లలు పుడుతున్నారు. కానీ మగపిల్లల కంటే ఎక్కువ మంది ఆడపిల్లలు చనిపోతున్నారు. 0-5 వయస్సులో బతికి బట్ట కట్టిన మగపిల్లల సంఖ్య కంటే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉందని సెన్సెస్ చెపుతోంది. ఆడపిల్లలు బతకటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ ఇలా జరుగుతోందంటే వారి పోషణ సంరక్షణలలో ఏదో వివక్ష ఉండి ఉండాలి.
జవాబు:
0-5 సంవత్సరాల వయస్సులో ఆడపిల్లలు ఎక్కువ సంఖ్యలో పుడుతున్నప్పటికి, ఎక్కువమంది ఆడపిల్లలు చనిపోతున్నారు. దీనికి గల కారణాలు:

  1. ఆడవాళ్ళలో ఎక్కువమంది నిరక్షరాస్యులు, వారికి ఆడపిల్లల ప్రాముఖ్యత తెలియదు.
  2. భారతదేశంలో పితృస్వామిక కుటుంబాలు ఎక్కువ. కావున స్త్రీలను ఆడపిల్లలకు జన్మను ఇవ్వకుండా అబార్షను చేయించడం జరుగుతుంది.
  3. వారి జాతిని, తెగను పెంచుకోవడానికి మగపిల్లలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది.
  4. తల్లిదండ్రులకు ఆదాయం పెరిగినా, వారు మాత్రం ఆడపిల్లల విషయంలో చిన్నచూపు చూస్తున్నారు.

ప్రశ్న 4.
స్త్రీ, పురుష నిష్పత్తిలో స్త్రీ నిష్పత్తి తగ్గుతూ పోతే సమాజంపై ఎలాంటి ప్రభావితం ఉంటుంది.
జవాబు:
లింగ నిష్పత్తి చాలా ఎక్కువగాని, తక్కువగాని ఉంటే సామాజికంగా చాలా తేడా వస్తుంది.
ఉదా : కాలేజీల విద్యార్థుల సంఖ్య

స్త్రీ నిష్పత్తి తగ్గతూపోతే సమాజంపై పడే ప్రభావం :

  1. స్త్రీ లింగ నిష్పత్తి తక్కువగా ఉండటం వల్ల స్త్రీల పట్ల సమాజానికి గల వివక్షను తెలియచేస్తుంది.
  2. లింగ నిష్పత్తి సమాజంలోని స్త్రీ, పురుషుల మధ్య గల అసమానత్వాన్ని తెలియజేస్తుంది.
  3. సమాజంలో లింగనిష్పత్తి తక్కువగా ఉన్నప్పుడు స్త్రీల పై అది పురుషుల ఆధిపత్యాన్ని తెలియజేస్తుంది.
  4. లింగనిష్పత్తి తక్కువగా ఉండడం వల్ల బాలికలకు చాలా చిన్న వయస్సులోనే పెళ్ళిళ్ళు చేయడం జరుగుతుంది.
  5. బాలికలు చాలామంది పాఠశాలకు దూరమై ఇళ్ళలోనే పనిచేసుకుంటూ ఉంటారు. దీనివల్ల బాలికా అక్షరాస్యతా శాతం తగ్గుతుంది.
  6. ఈ నిష్పత్తి నేర రేటును కూడా ప్రభావితం చేస్తుంది.
  7. స్త్రీల సంఖ్య మరీ తక్కువగా ఉంటే సాధారణ పురుషులకు వివాహం జరగటం కష్టం అవుతుంది. అన్ని రకాలుగా ముందున్న వారినే స్త్రీలు భర్తలుగా ఎంచుకొనే అవకాశం ఉంటుంది.
  8. లింగ నిష్పత్తిలో అసమానతలు జననరేటును ప్రభావితం చేస్తాయి.

ప్రశ్న 5.
ఈ క్రింది గ్రాఫ్ ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 9
a) ఏ సంవత్సరం నుండి జనాభా నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది?
b) ప్రస్తుత భారతదేశ జనాభా ఎంత?
c) ఏ దశాబ్ద కాలంలో జనాభాలో తగ్గుదల కనబడింది?
d) భారతదేశంలో జనాభా లెక్కలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు?
జవాబు:
a) 1931 సంవత్సరం
b) 121 కోట్లు
c) 1921 సంవత్సరం
d) 10 సంవత్సరాలు

ప్రశ్న 6.
ఈ క్రింది పట్టికను చదివి (a), (b), (C) మరియు (d) ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
భారతదేశ స్త్రీ, పురుష అక్షరాస్యత శాతము
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 10
a) 2011 సం||లో స్త్రీల అక్షరాస్యత కంటే పురుషుల అక్షరాస్యత ఎంత ఎక్కువ?
b) పై పట్టిక ఏ సమాచారాన్ని తెలుపుతుంది?
c) ఏ కాలంలో అక్షరాస్యత రేటు పెరుగుదల ఎక్కువగా ఉన్నది?
d) స్త్రీల అక్షరాస్యతను నీవు ఎలా అర్ధం చేసుకున్నావు?
జవాబు:
a) 2011 సం||లో స్త్రీల అక్షరాస్యత కంటే పురుషుల అక్షరాస్యత 16, 68% ఎక్కువ.
b) భారతదేశ స్త్రీ, పురుష అక్షరాస్యత శాతం 1961-2011గా ఉందని పై పట్టిక తెలుపుతుంది.
c) అక్షరాస్యత రేటు పెరుగుదల ఎక్కువగా ఉన్న కాలం 1991-2001.
d) 1) పురుషుల అక్షరాస్యతతో పోలిస్తే స్త్రీల అక్షరాస్యత తక్కువ.
2) 1961లో స్త్రీల అక్షరాస్యత చాలా తక్కువగా ఉన్నది. ఇది ప్రతి దశాబ్దంలో పెరుగుతూ ఉన్నది. 1991-2001 దశాబ్దంలో స్త్రీల అక్షరాస్యతా రేటు పెరుగుదల ఎక్కువగా ఉన్నది.

ప్రశ్న 7.
క్రింద ఇవ్వబడిన గ్రాఫ్ ఆధారంగా దిగువనివ్వబడిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 8
a) స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎన్ని పర్యాయములు జనగణన జరిగినది?
జవాబు:
7 సార్లు

b) ‘స్త్రీ, పురుష నిష్పత్తి’ అనగా నీవు ఏమి అర్థం చేసుకున్నావు?
జవాబు:
జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది తింగ నిష్పత్తి.

C) లింగ నిష్పత్తి తక్కువగా ఉండటానికి ఏవైనా రెండు కారణాలు తెలపండి.
జవాబు:
1) సాంప్రదాయకంగా మనది పురుషాధిక్య సమాజం కావడం.
2) స్త్రీలకు విద్య, అభివృద్ధిలో సమాన అవకాశాలు లభించకపోవడం.

d) మెరుగైన లింగ నిష్పత్తి ఏ సంవత్సరంలో నమోదు అయింది?
జవాబు:
1951

ప్రశ్న 8.
ఇచ్చిన గ్రాఫెను చదివి క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 9
1) ఏ సంవత్సరంలో జనాభా పెరుగుదల తగ్గింది?
జవాబు:
1921

2) ఎన్ని సంవత్సరాల కొకసారి జనగణన క్రమం తప్పకుండా చేపడతారు?
జవాబు:
10 సం||

3) స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో జనాభా పెరుగుతూనే ఉందుటకు గల కారణాలేవి?
జవాబు:
అభివృద్ధి చెందిన వైద్య సదుపాయాలు, కరవుల ప్రభావం తగ్గిపోవడం మొదలైనవి.

4) జనాభా విస్ఫోటనం వల్ల కలిగే సమస్యలేవి?
జవాబు:
పర్యావరణంపై ఒత్తిడి, నిరుద్యోగం మొదలైనవి.

ప్రశ్న 9.
క్రింది ఇవ్వబడిన సమాచారం ఆధారంగా కమ్మీ చిత్రం గీసి మీ పరిశీలనను వ్రాయండి.
పట్టిక : భారతదేశ జనాభా – స్త్రీ పురుష నిష్పత్తి

సంవత్సరం లింగ నిష్పత్తి
1. 1951 946
2. 1961 941
3. 1971 930
4. 1981 934
5. 1991 929
6. 2001 933
7. 2011 943

జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 11
పరిశీలన:

  1. అతి తక్కువ లింగనిష్పత్తి 1991వ సంవత్సరంలో నమోదయింది.
  2. అతి ఎక్కువ లింగనిష్పత్తి 1951వ సంవత్సరంలో నమోదయింది.
  3. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ లింగ నిష్పత్తి 943.

ప్రశ్న 10.
భారతదేశ జన గణన గూర్చి వివరింపుము.
జవాబు:
దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారాన్ని భారతదేశ జనగణన అందిస్తుంది. జనాభా అంతటికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి, నమోదు చేయటాన్నే జనగణన అంటారు. పదేళ్లకు ఒకసారి భారతదేశంలోని ప్రజల సమాచారాన్ని సేకరిస్తారు. ఈ పనిచేసేవాళ్లు ప్రతి ఊరు, పట్టణం, నగరంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ల వివరాలు సేకరిస్తారు. ప్రజల వయసు, వృత్తి, ఇంటి రకం, చదువు, మతం వంటి అనేక వివరాలను జన గణన అందిస్తుంది. సెన్సెస్ ఆఫ్ ఇండియా అన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సమాచార సేకరణ, నమోదులను నిర్వహిస్తుంది.

భారతదేశంలో జన గణన :
భారతదేశంలో మొదటి జన గణన 1872లో జరిగింది. అయితే మొదటి సంపూర్ణ జనగణన 1881లో జరిగింది. అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జన గణన చేపడుతున్నారు. 2011లో భారతదేశ జనాభా 121,01,93,422 ఈ 121 కోట్ల జనాభాలో 62,37,24,248 మంది పురుషులు 58,64,69,174 మంది స్త్రీలు.

ప్రశ్న 11.
AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు 14
పై పటాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
1) అత్యల్ప జనసాంద్రత గల ప్రాంతాలేవి? కారణాలు తెలపండి.
జవాబు:
అత్యల్ప జనసాంద్రత గల ప్రాంతాలు : జమ్ము, కాశ్మీర్ మరియు అరుణాచల్ ప్రదేశ్. కారణం : పర్వతాలు, అడవులతో కూడిన స్వరూపాలు.

2) అత్యధిక జనసాంద్రత గల ప్రాంతాలు ఏవి? కారణాలు తెలపండి.
జవాబు:
అత్యధిక జనసాంద్రత గల ప్రాంతాలు : కోల్ కత, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్ మొ||. కారణం : మైదాన ప్రాంతాలు, వ్యవసాయకంగా మరియు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం.

3) అధిక జనసాంద్రత (250 – 999) గల ప్రాంతాలు ఏవి? కారణాలు తెలపండి.
జవాబు:
అధిక జనసాంద్రత గల ప్రాంతాలు : ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ మరియు తమిళనాడు మొ||.
కారణాలు : మైదాన ప్రాంతాలు, వ్యవసాయం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందటం.

4) ద్వీపకల్ప పీఠభూమిలో సాధారణ జనసాంద్రత ఉండటానికి గల కారణాలు తెలపండి.
జవాబు:
ద్వీపకల్ప పీఠభూమిలో సాధారణ జనసాంద్రతకు కారణం : వ్యవసాయానికి సంపూర్ణ నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండకపోవడం.

ప్రశ్న 12.
లింగ నిష్పత్తి అనగా నేమి? జనాభాలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణాలేంటి?
జవాబు:
జనాభాలో ప్రతి వేయిమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే లింగ నిష్పత్తి. ఒక సమాజంలో, ఒక నిర్దిష్ట కాలంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలుసుకోడానికి ఉపయోగపడే ముఖ్యమైన సామాజిక సూచి యిది. భారతదేశంలో పురుషుల కంటే ఎప్పుడూ స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రతి వెయ్యిమంది పురుషులకు స్త్రీలు 1951లో 946, 1961లో 941, 1971లో 930, 1981లో 934, 1991లో 929, 2001లో 933, 2011లో 940 మంది నమోదయ్యారు. ఈ గణాంకాలు సమాజంలో స్త్రీ పట్ల గల వివక్షతను వెల్లడిచేస్తున్నాయి. విద్య, పోషకాహారం, శిశు సంరక్షణ, వైద్య రంగాలలో సేవలు మగపిల్లలకందినంతగా ఆడపిల్లలకు అందడం లేదు.

ఆడపిల్ల కంటే మగపిల్లవాడు పుట్టాలనే కోరుకొనే లింగ వివక్షత భారతదేశంలో ఇప్పట్లో పోయేటట్లులేదు. మగ పిల్లల్లో కంటే ఆడపిల్లల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంది. మగపిల్లవాడు కావాలని కోరుకొనేవారు గర్భంలో ఉంది ఆడపిల్ల అని తెలిస్తే భ్రూణహత్యకు పాల్పడుతున్నారు. వైద్య విషయంలో గల ఈ వివక్షత పెద్దయిన తరువాత కూడా కొనసాగుతుంది, అందుకే పురుషుల కంటే స్త్రీలలో మరణాల శాతం ఎక్కువని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

AP 10th Class Social Important Questions Chapter 6 ప్రజలు

ప్రశ్న 13.
భారతదేశ జనగణన శ్రామిక జనాభాను ఎన్ని వర్గాలుగా విభజించింది. అవి ఏవి?
జవాబు:
15 నుండి 59 సంవత్సరాల వయస్సు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు. వారు పూర్తి సంవత్సరం లేదా సంవత్సరంలో కొంతభాగం పనిచేస్తారు. ఇది పని అందుబాటుపై ఆధారపడుతుంది. గృహిణులు చేసే ఇంటిపని దీంట్లో భాగం అవదు. భారత జనాభా గణ వీరిని నాలుగు భాగాలుగా వర్గీకరిస్తుంది : (1) సొంతభూమిని లేదా కౌలుకు తీసుకున్న భూమిని సాగుచేస్తున్న రైతులు, (2) ఇతరుల వ్యవసాయ భూములలో కూలికి పనిచేసే వ్యవసాయ కూలీలు, (3) గృహ సంబంధ పరిశ్రమలలోను, రైస్ మిల్లులలోను, బీడీలు చుట్టేవారిగాను, కుండలు తయారుచేయడం, బుట్టలు, బట్టలు అల్లడం, పాదరక్షలు తయారుచేయడం, అగ్గిపుల్లలు, బొమ్మల తయారీ మొదలైన చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసేవారు, (4) ఫ్యాక్టరీలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, రోజుకూలీలు, ఇతర వృత్తుల వారు.

ప్రాజెక్టు

→జన సాంద్రతకు చెందిన కింది రెండు పటాలను, జనాభా పెరుగుదలకు సంబంధించిన రేఖా పటాన్ని చూడండి. ఈ అధ్యాయంలో మీరు జనాభాకి సంబంధించి తెలుసుకున్న వివిధ అంశాల ఆధారంగా వాటిని వివరించండి.
జవాబు:
బంగ్లాదేశ్ :
ఈ దేశంలో ఎడారులు లేదా శుష్క జనసాంద్రత గల ప్రాంతాలు లేవు. ఆగ్నేయ, నైఋతి ప్రాంతాల్లో కొద్ది ప్రాంతం మాత్రం నివాసయోగ్యం కాదు. ఈ ప్రాంతాల్లో జనసాంద్రత 1-4 మాత్రమే కలదు. గంగ, బ్రహ్మపుత్ర (పద్మానది) పరీవాహ ప్రాంతంలో జనాభా అధికంగా ఉంది. రాజధాని ఢాకా కూడా అధిక జనసాంద్రత గల ప్రాంతంలోనే ఉంది.

అల్జీరియా :
ఈ దేశం ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి ప్రాంతంలో ఉంది. అత్యధిక ప్రాంతం అత్యల్ప జనసాంద్రత (1-4) కలిగి ఉంది. రాజధాని అల్జీర్స్ పరిసర ప్రాంతాల్లో అత్యధిక జనసాంద్రత (1000+) కలదు.

మద్యధరా సముద్రతీర ప్రాంతాలు సాధారణ జనసాంద్రత (25-49) కలిగి ఉన్నాయి. సాధారణ జనసాంద్రత గల ప్రాంతాలకు ఆనుకొని కొద్ది ప్రాంతం (5-24) అల్ప జనసాంద్రత కలిగి ఉంది. మొత్తం మీద సహారా ఎడారి ప్రభావం అల్జీరియా జనాభాపై ఎక్కువగా ఉంది.

వివిధ ఖండాలలో 1990 నుండి అటవీ నష్టంపై జనాభా పెరుగుదల ప్రభావం :
జనాభా పెరుగుదల, అటవీ విస్తరణ సాధారణంగా విలోమనిష్పత్తిలో ఉంటాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో 1990 నుండి అటవీ నష్టంపై జనాభా పెరుగుదల ప్రభావాన్ని పై గ్రాఫ్ తెలియజేస్తుంది. ఆఫ్రికా ఖండంలో జనాభా పెరుగుదల కంటే అటవీ నష్టం తక్కువగా ఉండటం విశేషం. ఈ ఖండంలో జనాభా పెరుగుదల 9.2 శాతం ఉంది. అటవీ నష్టం 8.8 శాతం మాత్రమే.

యూరప్లో విశేషంగా అటవీ నష్టం నామమాత్రం కాగా, జనాభా తగ్గుతుండటం దీని ప్రత్యేకత. ఉత్తర అమెరికా ఖండం వంటి అభివృద్ధి చెందిన ప్రాంతంలో కూడా జనాభా పెరుగుదల నామమాత్రంగా ఉంటే అటవీ నష్టం మాత్రం 23.5 శాతం ఉంది. ఓషియానియాలో జనాభా 13 శాతం పెరిగితే అటవీ నష్టం మాత్రం 21 శాతం ఉండటం ఆందోళన కలిగించే విషయం.

లాటిన్ అమెరికా ప్రాంతంలో మాత్రం జనాభా పెరుగుదల 35 శాతం ఉండగా అటవీ నష్టం మాత్రం 27 శాతం. కాబట్టి ఉత్తర అమెరికా, ఓషియానియా, ఆసియాలలో పెరిగిన జనాభా శాతం కంటే అటవీనష్టం ఎక్కువ.

లాటిన్ అమెరికా, ఆఫ్రికాలలో జనాభా పెరుగుదల శాతం కంటే అటవీనష్టం శాతం తక్కువ.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

These AP 10th Class Social Studies Important Questions 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 5th Lesson Important Questions and Answers భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social 5th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. క్రింది వానిలో సింధు నదికి ఉపనది కానిది.
చీనాబ్, రావి, టీస్టా, సట్లెజ్.
జవాబు:
టీస్టా

2. క్రింది వానిలో గంగానది ఉపనది.
జీలం, చీనాబ్, కోసి, బియాస్
జవాబు:
కోసి

3. క్రింది వానిలో తుంగభద్రానది ఏ నదికి ఉపనది.
మహానది, గోదావరి, కృష్ణా, పెన్న
జవాబు:
కృష్ణా

4. క్రింది వానిలో ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టే గంగానదీ వ్యవస్థకు చెందిన ఉపనది కానిది ఏది?
చంబల్, బేత్వా, కేన్, గండక్
జవాబు:
గండక్

5. క్రింది వానిలో బ్రహ్మపుత్ర నది ఉపనది ఏది?
చంబల్, లోహిత్, చీనాబ్, సట్లేజ్.
జవాబు:
లోహిత్.

6. రెండు నదుల కలయిక వల్ల ఏర్పడిన నది ఏది?
జవాబు:
గంగానది.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

7. 50 సం||రాల క్రితం తుంగభద్రానదీ జలాల నిల్వ సామర్థ్యము ఎన్ని మి॥క్యుబిక్ మీటర్లు.
జవాబు:
3,766 (లేదా) 376.6 కోట్ల ఘనపు మీటర్లు.

8. ద్వీపకల్ప నదులలో పెద్ద నది ఏది?
జవాబు:
గోదావరి

9. భారతదేశంలోని నదులలో పెద్ద నది ఏది?
జవాబు:
గంగానది.

10. క్రింది వానిలో హిమాలయ నది కానిది.
గంగా, సింధు, బ్రహ్మపుత్ర, మహానది. గండక్,
జవాబు:
మహానది.

11. అంతస్థలీయ ప్రవాహంనకు సంబంధించిన దానికి ఉదాహరణ.
జవాబు:
లూనీ నది.

12. నీటిని అధికంగా తీసుకునే పంటకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
చెరకు.

13. ‘V’ ఆకారపు లోయలు ఏర్పడుటకు కారణం ఏమిటి?
జవాబు:
నదీ ప్రవాహాలు.

14. దక్షిణ భారతదేశ నదులు తూర్పువైపుకు ప్రవహించుటకు గల కారణమేమి?
జవాబు:
దక్కన్ పీఠభూమి తూర్పుకు వాలి ఉండటం.

15. హిమాలయ నదులను జీవనదులు అని పిలవడానికి కారణమేమిటి?
జవాబు:
సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి కాబట్టి.

16. ‘ఆదర్శ గ్రామ పథకం’ కింద హివారే బజారును ఎంపిక చేసిన రాష్ట్రం ఏది?
జవాబు:
మహారాష్ట్ర.

17. బంగ్లాదేశ్ లో పద్మానదిగా పిలువబడుతున్న నది ఏది?
జవాబు:
గంగానది.

18. క్రింది వానిలో ద్వీపకల్ప నదికి ఉదాహరణ కానిది.
గోదావరి, మహానది, కృష్ణా, సింధు.
జవాబు:
సింధు.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

19. అలకనంద, భాగీరథి ఎక్కడ కలుస్తాయి?
జవాబు:
దేవ ప్రయాగ వద్ద.

20. బ్రహ్మపుత్రా నది మనదేశంలో ఎక్కడ ప్రవేశిస్తుంది?
జవాబు:
అరుణాచల్ ప్రదేశ్ లో

21. నీరు ఆవిరిగా మారటాన్ని ఏమంటారు?
జవాబు:
భాష్పీభవనం.

22. కేరళలోని ఏ గ్రామమందు గ్రామ పంచాయతీకి, కోకాకోలా కంపెనీకి మధ్య వివాదం తలెత్తింది?
జవాబు:
పెరు మట్టి.

23. భూగర్భ జలంపై నియంత్రణ ఏ హక్కుకు సంబంధించినది?
జవాబు:
భూమి హక్కు

24. తుంగభద్రానది ఏ రాష్ట్రానికి సంబంధించిన వనరు కాదు?
కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్
జవాబు:
మహారాష్ట్ర,

25. అరుణాచల్ ప్రదేశ్ లో దిహంగ్, సియాంగ్ అని పిలువబడే నది ఏది?
జవాబు:
బ్రహ్మపుత్రా నది.

26. సింధు నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
మానస సరోవరం.

27. భగీరథి నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
గంగోత్రి.

28. అలకనంద నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
సతపనాథ్

29. బ్రహ్మపుత్రా నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
మానస సరోవరం.

30. గోదావరి నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
త్రయంబకం.

31. మహానది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
సిహావా

32. కృష్ణానది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
మహాబలేశ్వరం.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

33. నర్మదానది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
అమర్ కంఠక్.

34. తపతి నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
ములాయి.

35. కావేరి నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
కూర్గ్ కొండలు.

36. దిబంగ్, లోహిత్ అనే రెండు ఉపనదులు ఏ రాష్ట్రంలో బ్రహ్మపుత్రలో కలుస్తాయి?
జవాబు:
అస్సోం

37. అవపాతం + ఉపరితల ప్రవాహం + భూగర్భ ప్రవాహం =?
జవాబు:
అంతర్గత ప్రవాహాలు.

38. ఉపరితల ప్రవాహాలకు ఒక ఉదాహరణ నివ్వండి.
జవాబు:
వాగులు, కాలువలు, నదులు, చెరువులు .

39. తుంగభద్ర నది ఎగువ, మధ్య పరివాహక ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
కర్ణాటక.

40. తుంగభద్రా నది యొక్క పరివాహక ప్రాంతం మొత్తం ఎన్ని చ.కి.మీ. ఉంది?
జవాబు:
71, 417 km

41. భూగర్భ జలాల వినియోగం పై ఏ సంస్థలకు నియంత్రణ ఉండాలి?
జవాబు:
ప్రభుత్వ

42. శాండూరు వద్ద గనులు ఏవి?
జవాబు:
మాంగనీసు.

48. కుద్రేముఖ్ వద్ద గనులు ఏవి?
జవాబు:
ఇనుము.

44. పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థలు ఎన్ని?
జవాబు:
రెండు.

45. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు?
జవాబు:
సాంగ్ పో.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

46. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్ లో ఏమని పిలుస్తారు?
జవాబు:
సియాంగ్, దిహంగ్

47. బ్రహ్మపుత్ర నది ఏ హిమానీనదం నుండి పుట్టింది?
జవాబు:
చెమయుంగ్ డంగ్.

48. పశ్చిమంగా ప్రవహించి, అరేబియా సముద్రంలో కలిసే నదులు ఏవి ?
జవాబు:
నర్మద, తపతి.

49. వక్రతలు ఉండనీ నదులకు ఉదాహరణ నిమ్ము.
జవాబు:
గోదావరి, కృష్ణా, కావేరి, మహానది మొ||వి.

50. హిమాలయ నదులు మూడు ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తాయి.
I. సింధూ నదీ వ్యవస్థ II. గంగానదీ వ్యవస్థ III. ?
ప్ర. మూడవ వ్యవస్థ పేరు రాయండి.
జవాబు:
బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

51. భారతదేశ నదీ జల వ్యవస్థ మూడు భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది.
I. హిమాలయాలు II. ద్వీపకల్ప పీఠభూమి III. ?
ప్ర. మూడవ అంశం పేరు రాయండి
జవాబు:
సింధూ – గంగా మైదానం.

52. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థకు సంబంధించి సరియైన వాక్యం కానిది.
→ టిబెట్లో దీనిని ‘సాంపో’ అంటారు.
→ బంగ్లాదేశ్ లో “జమున’ అంటారు.
→ అరుణాచల్ ప్రదేశ్ లో “దిహంగ్’ అంటారు.
→ అస్సాంలో “సియాంగ్’ అంటారు.
జవాబు:
అస్సాంలో “సియాంగ్’ అంటారు.

53. హిమాలయాల్లో జన్మించి, మన దేశం గుండా ప్రయాణించి, మన పొరుగు దేశాలలో సముద్రంలో కలిసే ఒక నది పేరు రాయండి.
జవాబు:
సింధూనది, బ్రహ్మపుత్రానది, గంగానది.

54. గంగానదీ వ్యవస్థకు సంబంధించిన సరియైన వాక్యం / లు ఏది / ఏవి?
i) ఇది రెండు నదుల కలయిక.
ii) గంగానది ఉపనదులు హిమాలయాల్లో, ద్వీపకల్ప పీఠభూమిలోను పుడతాయి.
iii) బదరీనాథ్ వద్ద పర్వతాలను వదలి మైదానాల్లోకి ప్రవహిస్తుంది.
iv) దేవ ప్రయాగ వద్ద రెండు నదుల కలయికతో గంగానదిగా మారుతుంది.
జవాబు:
(i), (ii) మరియు (iv)

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

55. క్రింది వానిలో’ సింధూనది ప్రవహించే రాష్ట్రం కానిది ఏది?
జమ్ము కాశ్మీర్, పంజాబు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర
జవాబు:
ఉత్తర ప్రదేశ్.

56. అస్సోం లోయలో వరదలకు కారణమైన నది ఏది?
జవాబు:
బ్రహ్మపుత్ర.

57. ద్వీపకల్ప నదులలో రెండవ పెద్ద నది ఏది?
జవాబు:
కృష్ణానది.

58. క్రింది వానిలో హివారే బజారులోని నిషేధాలు ఏవి?
i) చెట్లు నరకడం నిషేధం.
ii) పశువులను స్వేచ్ఛగా మేపడం నిషేధం.
iii) మత్తు పానీయాలు నిషేధం.
iv) అధిక సంతానం నిషేధం.
జవాబు:
(i), (ii), (iii) or (iv)

59. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) మహానది ( ) a) సిహెూవా
ii) గోదావరి ( ) b) నాసికా త్రయంబక్
iii) కృష్ణ ( ) c) మహాబలేశ్వర్
iv) తపతి ( ) d) ముట్టాయి
జవాబు:
i-a, ii – b, iii-c, iv-d.

60. భూగర్భ జలాల చట్టాలలోని ప్రధాన లోపం ఏమిటి?
జవాబు:
భూమిపై హక్కుకీ, భూగర్భ జలాలపై హక్కుకీ సంబంధం కల్పించడం.

61. నీటి హేతుబద్ద వినియోగానికి ఉదహరించిన గ్రామం ఏది?
జవాబు:
హివారే బజార్.

62. నీటి సంరక్షణకై AP WALTA చట్టం ఏ సంవత్సరంలో చేశారు?
జవాబు:
2002.

63. క్రింది వానిలో జల సంరక్షణకు తోడ్పడే చర్య /లు ఏది /ఏవి?
i) అనుమతి లేనిదే సాగునీటి కోసం బోరుబావులు త్రవ్వరాదు.
ii) నీరు అధికంగా అవసరమయ్యే చెరుకు వంటి పంటలు పండించరాదు.
iii) త్రాగు, సాగు నీటిని పొదుపుగా వాడాలి.
iv) ఇంకుడు గుంతలు ఖచ్చితంగా తియ్యాలి.
జవాబు:
(i), (ii), (iii) & (iv).

64. సింధూనది భారత దేశంలో ఎక్కడ ప్రవేశిస్తుంది?
జవాబు:
జమ్ము కాశ్మీర్లో.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

65. పరిశ్రమలు ఎటువంటి జలాలను మాత్రమే నదిలోకి ప్రదేశ్, వదలాలని చట్టం చేశారు?
జవాబు:
శుద్ధి చేసిన జలం.

10th Class Social 5th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను ఎలా విభజించవచ్చు?
జవాబు:
పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను రెండుగా విభజించవచ్చును. అవి :

  1. 1హిమాలయ నదులు
  2. ద్వీపకల్ప నదులు.

ప్రశ్న 2.
సింధూనది ఉపనదులు ఏవి?
(లేదా)
సింధు నది యొక్క రెండు ఉపనదులను పేర్కొనండి.
జవాబు:

i) జీలం,
ii) చినాబ్,
iii) రావి,
iv) బియాస్,
v) సట్లెజ్.

ప్రశ్న 3.
‘గంగా’ నది ఏ రెండు నదుల కలయిక వలన ఏర్పడినది?
జవాబు:
భగీరథీ మరియు అలకనంద నదుల కలయిక వలన గంగానది ఏర్పడినది.

ప్రశ్న 4.
మహారాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామ ఎంపికకు పెట్టిన షరతులు ఏవి?
జవాబు:

  1. కృహత్ బంది అనగా చెట్లను నరకడం నిషేధం.
  2. చెరాయి బంది అనగా పశువులను స్వేచ్చగా మేయడానికి వదలడం నిషేధం.
  3. నన్బంది అనగా అధిక సంతానం నిషేధం.
  4. నషా బంది అనగా మత్తుపానీయాల నిషేధం.
  5. శ్రమదానం చేయడం.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 5.
హిమాలయ నదులు ఎందువల్ల జీవనదులుగా పిలువబడుతున్నాయి?
జవాబు:
నిరంతరం నీరు ప్రవహిస్తుండఖం వల్ల హిమాలయ నదులు జీవనదులుగా పిలువబడుతున్నాయి.

ప్రశ్న 6.
భారతదేశానికి వర్షాలను తెచ్చే నైఋతి ఋతుపవనాల రెండు శాఖలు ఏవి?
జవాబు:
భారతదేశానికి వర్షాలను తెచ్చే నైఋతి ఋతుపవనాల రెండు శాఖలు

  1. అరేబియా సముద్రశాఖ
  2. బంగాళాఖాతం శాఖ

ప్రశ్న 7.
ఇవ్వబడిన పటమును పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 1
a) అరేబియా సముద్రంలోనికి ప్రవహించే రెండు నదుల పేర్లు రాయండి.
జవాబు:
అరేబియా సముద్రంలోనికి ప్రవహించే రెండు నదుల పేర్లు

  1. సబర్మతి
  2. మహినది
  3. నర్మద
  4. తపతి

b) తుంగభద్ర నది ఏయే రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ?
జవాబు:
తుంగభద్రా నది ప్రవహించే రాష్ట్రాలు – కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ప్రశ్న 7.
భారత నదీవ్యవస్థ ఏ అంశాలకు అనుగుణంగా రూపొందింది?
జవాబు:
భారతదేశ నదీ జలవ్యవస్థ భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది. ఇవి :

  1. హిమాలయాలు,
  2. ద్వీపకల్పం – పీఠభూమి,
  3. సింధూ-గంగా మైదానం.

ప్రశ్న 8.
పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను ఎలా విభజించవచ్చు?
జవాబు:
పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను రెండుగా విభజించవచ్చును :

  1. హిమాలయ నదులు
  2. ద్వీపకల్ప నదులు.

ప్రశ్న 9.
హిమాలయ నదులను జీవనదులని ఎందుకు పిలుస్తున్నారు?
జవాబు:
హిమాలయ నదులు జీవనదులు. అంటే సంవత్సరమంతా వీటిలో నీరు ఉంటుంది. వర్షపాతం, కరుగుతున్న మంచుతో నీరు అందటం వల్ల జీవనదులుగా పిలుస్తున్నారు.

ప్రశ్న 10.
అంతర్గత ప్రవాహం, ఉపరితల ప్రవాహం అంటే ఏమిటి?
జవాబు:
ఏ ప్రాంతానికైనా అంతర్గత ప్రవాహాలు = అవపాతం + ఉపరితల ప్రవాహం + భూగర్బ ప్రవాహం. ఉపరితల ప్రవాహం అంటే భూమి మీద వాగులు, కాలువలు, నదులు వంటి వాటిల్లోని నీటి ప్రవాహం.

ప్రశ్న 11.
నీటిని ఎలా కొలుస్తారు?
జవాబు:
నీటిని నిమిషానికి లీటర్లలో కొలుస్తారు.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 12.
తుంగభద్రానదీ జలాలను ఏయే రాష్ట్రాలు పంచుకుంటాయి?
జవాబు:
తుంగభద్రానదీ జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు పంచుకుంటాయి.

ప్రశ్న 13.
తుంగభద్రానది పరీవాహక ప్రాంతాన్ని ఎలా విభజిస్తారు?
జవాబు:
తుంగభద్రానది పరీవాహక ప్రాంతాన్ని మూడుగా విభజిస్తారు.

  1. కర్ణాటకలోని ఎగువ, మధ్య పరీవాహక ప్రాంతాలు,
  2. ఆంధ్రదేశ్ లోని దిగువ పరీవాహక ప్రాంతం,
  3. తెలంగాణ పరీవాహక ప్రాంతం.

ప్రశ్న 14.
తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ప్రధాన పంటలు ఏవి?
జవాబు:
వరి, జొన్న, చెరకు, పత్తి, రాగులు ఇక్కడి ప్రధాన పంటలు.

ప్రశ్న 15.
హివారే బజారులో సన్న, చిన్నకారు రైతులు ఎలా ప్రయోజనం పొందారు?
జవాబు:
పశుపోషణ రంగం వృద్ధి చెందడం వల్ల సన్న, చిన్నకారు రైతులు గణనీయంగా ప్రయోజనం పొందారు.

ప్రశ్న 16.
భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలు ఎందుకు ప్రస్తుత పరిస్థితులకు అనువైనవి కావు?
జవాబు:
ఈ చట్టాలు భూగర్భజలాల వినియోగం నామమాత్రంగా ఉన్న రోజులలో రూపొందించబడ్డాయి. కాబట్టి నేటి కాలానికి ఇవి అనువైనవి కావు.

ప్రశ్న 17.
భూగర్భ జల వినియోగ చట్టాలలో ఉన్న లోపం ఏది?
జవాబు:
భూమి హక్కుకీ, భూగర్భ జలాలపై హక్కుకీ సంబంధం కలపటం అన్నది ఈ నియమాలలో ఉన్న లోపం.

ప్రశ్న 18.
ప్రస్తుతం మనముందున్న తీవ్ర సమస్య ఏది?
జవాబు:
ఇతరుల కంటే ముందు తాను నీళ్లు వాడుకోవటానికి ప్రతి ఒక్కరూ పోటీపడటంతో ఈ ఉమ్మడి వనరు త్వరితంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మనముందున్న తీవ్ర సమస్య ఇదే.

10th Class Social 5th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పుట్టుక ఆధారంగా మన దేశ నదీ జలవ్యవస్థను వర్గీకరించండి.
జవాబు:
పుట్టుక ఆధారంగా మనదేశ నదీ జలవ్యవస్థను రెండుగా విభజించవచ్చు. అవి :

  1. హిమాలయ నదులు
  2. ద్వీపకల్ప నదులు

హిమాలయ నదులు :
ఇవి జీవనదులు అంటే సంవత్సరమంతా వీటిల్లో నీళ్ళు ఉంటాయి. వర్షపాతం కరుగుతున్న మంచుతో నీళ్ళు అందంట వల్ల జీవనదులుగా పిలుస్తున్నారు.
ఉదా :
గంగ, సింధు, బ్రహ్మపుత్ర మొ||నవి.

ద్వీపకల్ప నదులు :
ద్వీపకల్ప నదులలో సంవత్సరమంతా నీరు ఉండదు. ఇవి వర్షం మీద ఆధారపడి ఉంటాయి.
ఉదా :
గోదావరి, కృష్ణా, కావేరి, మహానది మొ||నవి.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 2.
హిమాలయ నదులు జీవనదులు, అంటే సంవత్సరమంతా వీటిల్లో నీళ్ళు ఉంటాయి. ఏ రెండు కారణాల వల్ల ఇవి జీవనదులుగా పిలువబడుతున్నాయి?
జవాబు:

  1. హిమాలయ నదులు జీవ నదులు, అంటే సంవత్సరం అంతా వీటిలో నీళ్లు ఉంటాయి.
  2. వర్షపాతం, మంచు కరగటం ద్వారా నిరంతరం నీరు ప్రవహిస్తుండడం వలన వీటిని జీవనదులుగా పిలుస్తున్నారు.

ప్రశ్న 3.
నీటి వినియోగంలో పొదుపు ఆవశ్యకత గురించి ప్రజలను చైతన్యపరచడానికి రెండు నినాదాలు రాయండి.
జవాబు:
నీటి పొదుపుకు సంబంధించిన నినాదాలు :

  1. ఇంటింటా ఇంకుడు గుంత – భవిష్యత్తుకు నిశ్చింత.
  2. చుక్క నీటి పొదుపు – భవిష్యత్తుకు మదుపు.
  3. నీటిని మిగుల్చు – జీవనాన్ని రక్షించు.

ప్రశ్న 4.
క్రింది పటాన్ని పరిశీలించి, దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 2
a) గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారు?
జవాబు:
పద్మా నది

b) కోల్‌కతా ఏ నది ఒడ్డున కలదు?
జవాబు:
హుగ్లీనది

c) టిబెట్లో సాంగ్ పోగా పిలువబడుతున్న నది ఏది?
జవాబు:
బ్రహ్మపుత్రా నది

d) గౌహతి ఏ నది ఒడ్డున కలదు?
జవాబు:
బ్రహ్మపుత్రా నది

ప్రశ్న 5.
“కొన్ని సంవత్సరాలు వరుసగా తక్కువ వర్షపాతం ఉన్నా హివారే బజారులో తాగునీటి కొరత ఏర్పడలేదు.” కారణాలు తెల్పండి.
జవాబు:
హివారే బజారులో తాగునీటి కొరత ఏర్పడకపోవడానికి గల కారణాలు :

  1. చెట్లను నరకడంపై నిషేధం విధించడం.
  2. పశువులను స్వేచ్చగా మేతకు వదలడంపై నిషేధం విధించడం.
  3. సాగునీటికి బోరుబావులు తవ్వటంపై నిషేధం విధించడం.
  4. అధిక నీటిని వాడుకునే పంటలపై నిషేధం విధించడం.

ప్రశ్న 6.
ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో భూగర్భజల మట్టం మెరుగు పరచడానికి కొన్ని సలహాలను ఇవ్వండి.
జవాబు:

  • చెక్ డ్యా ముల నిర్మాణం
  • ఇంకుడు గుంతల నిర్వహణ
  • లోతైన అవిచ్ఛిన్న సమతల కందకాల (CCTS) నిర్వహణ
  • చెరువులలో పూడిక వెలికితీత
  • అడవుల పెంపకం
  • లోతైన బోరుబావుల తవ్వకంపై నియంత్రణ

ప్రశ్న 7.
నీటి సంరక్షణకు తీసుకోవలసిన చర్యలను సూచించండి.
జవాబు:
నీటి సంరక్షణకు తీసుకోవలసిన చర్యలు

  1. చెక్ డ్యాములు
  2. ఊట కుంటలు
  3. రాతి కట్టడాలు
  4. చెట్లు నాటడం

ప్రశ్న 8.
హిమాలయ నదుల గురించి తెలుపండి.
జవాబు:
హిమాలయ నదులు మూడు ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తాయి. అవి గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదులు. ఈ నదులు దాదాపు ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంతో పుట్టి పర్వతశ్రేణుల వల్ల వేరుచేయబడతాయి. అవి మొదట పర్వతాల ప్రధాన అర్గానికి సమాంతరంగా ప్రవహిస్తాయి. తరువాత ఒక్కసారిగా అవి దక్షిణానికి మలుపు తిరిగి ఎత్తైన పర్వత శృంఖలాలను కోసుకుంటూ ఉత్తర భారత మైదానాలను చేరుకుంటాయి. ఈ క్రమంలో ఇవి లోతైన ‘V’ ఆకారపు లోయలను ఏర్పరిచాయి. ఇది సింధూ, బ్రహ్మపుత్ర నదులలో బాగా కనపడుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 9.
అవపాతం అంటే ఏమిటి?
జవాబు:
అవపాతం అంటే వాన ఒక్కటే కాకుండా వడగళ్లు, హిమము, పొగమంచు కూడా ఉంటాయి. అవపాతం అన్ని సంవత్సరాలు ఒకేలాగ కాకుండా ప్రతీ సంవత్సరం మారుతూ ఉంటుంది. అందువలన అవపాతాన్ని లెక్కించడానికి కొన్ని సంవత్సరాల అవపాతం యొక్క సగటును పరిగణలోనికి తీసుకుంటారు.

ప్రశ్న 10.
బాష్పోత్సేకం గురించి రాయండి.
జవాబు:
బాష్పోత్సేకం :
అన్ని నీటి మడుగుల నుంచి నీరు ఆవిరిగా మారుతుంటుంది. చెరువులు, నదులు, సముద్రాలు వంటి అన్ని ఉపరితల నీటి వనరుల నుంచి నీరు ఆవిరి అవుతుంది. అన్ని జీవులు శ్వాస ప్రక్రియ ద్వారా గాలిలోకి నీటిని విడుదల చేస్తాయి.

ప్రశ్న 11.
వరదలు కరవుల వల్ల మొక్కలకు ఏమి జరుగుతుంది?
జవాబు:
పంటల వేళ్లు ఉండే ప్రాంతంలోకి నీరు వర్షపాతం ద్వారాగానీ, సాగునీటి ద్వారాగానీ చేరుతుంది. నేలకి తేమని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వరద వంటి పరిస్థితుల్లో ఎక్కువ నీళ్లు ఉండి, అది నేల లోపలి పొరల్లోకి ఇంకకపోతే మొక్కల వేళ్లు దెబ్బతింటాయి. ఇంకొకవైపు కరవు పరిస్థితులలో వేళ్ల ప్రాంతంలో తగినంత తేమ లేకపోతే పంటలు వడిలిపోతాయి.

ప్రశ్న 12.
హివారే బజార్ ఎక్కడ ఉంది? ఇది ఎందుకు కరవు పీడిత ప్రాంతం?
జవాబు:
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో హివారే బజార్ ఉంది. మహారాష్ట్ర నుంచి కోస్తా కొంకణ తీర ప్రాంతాన్ని వేరుచేస్తూ ఉత్తర-దక్షిణంగా ఉన్న సహ్యాద్రి పర్వతశ్రేణికి (వర్షచ్చాయ ప్రాంతంలో) తూర్పువైపున గల వరచ్చాయా ప్రాంతంలో ఈ జిల్లా ఉంది. అందుకే అహ్మదాబాద్ జిల్లా 400 మి.మీ. వర్షపాతంతో కరవు పీడిత ప్రాంతంగా ఉంది.

ప్రశ్న 13.
హివారే బజారులో ఏయే చర్యలు చేపట్టారు?
జవాబు:
హివారే బజారులోని ఉమ్మడి భూములు, వ్యక్తిగత పచ్చిక భూములలో నేల, నీటి సంరక్షణ పనులను అమలు చేశారు. కొండవాలుల్లో వరస సమతల కందకాలు తవ్వి నేలకోతకు గురి కాకుండా చేశారు. ఇవి వాన నీటిని నిల్వచేస్తాయి. ఫలితంగా పచ్చగడ్డి బాగా పెరుగుతుంది. నీటిని నిల్వచేసే అనేక నిర్మాణాలను ఊరిలో అమలుచేశారు – చెక్ డ్యాములు, ఊట కుంటలు, రాతి కట్టడాలు, కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన, అటవీ భూములలో చెట్లు నాటారు.

ప్రశ్న 14.
హివారే బజారులో నాలుగు ముఖ్యమైన నిషేధాలు ఏవి?
జవాబు:
మహారాష్ట్రలో ఆదర్శ గ్రామ పథకాన్ని మొదలుపెట్టినప్పుడు గ్రామాల ఎంపికకు కొన్ని షరతులు పెట్టారు. దీంట్లో ముఖ్యమైన నాలుగు నిషేధాలు ఉన్నాయి. రాలేగావ్ సిద్ధి సాధించిన విజయంతో అవి చాలా ప్రఖ్యాతిగాంచాయి. అవి : చెట్లను నరకడం నిషేధం, పశువులను స్వేచ్చగా మేయడానికి వదలడం నిషేధం, మత్తు పానీయాల నిషేధం, అధిక సంతానం నిషేషం. అంతేకాకుండా ప్రజలు కొంత శ్రమదానం కూడా చెయ్యాలి, భూమిలేని పేదలకు దీని నుంచి మినహాయింపు ఉంది.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 15.
హివారే బజార్ గ్రామంలోని మరికొన్ని నిషేధాలు ఏవి?
జవాబు:
సాగునీటికి బోరు బావులు తవ్వటం, చెరకు, అరటి సాగుచేయటం, బయటివాళ్లకు భూమి అమ్మటం. నీటి వినియోగంలో దీర్ఘకాలిక సుస్థిరత సాధించే అంశాలు ఈ విధానంలో ముఖ్యం. ఈ నిషేధాలు కేవలం ప్రకటనలు కాదు, ప్రజలు ఉమ్మడి ప్రయోజనాలను సాధించటానికి దోహదపడే ప్రజా నిర్మాణం. అయితే ఏదీ అంత తేలికగా జరగలేదు.

ప్రశ్న 16.
పటాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 3
1. నదుల పుట్టుకకు అనువుగా ఉండే రెండు పర్వతశ్రేణులు ఏవి?
2. పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పుగా ప్రవహించే నదులేవి?
3. పశ్చిమంగా ప్రవహించే నదులేవి?
4. సింధూనదికి గల ఉపనదులేవి?
జవాబు:
1) నదుల పుట్టుకకు అనువుగా ఉండే పర్వతశ్రేణులు :
హిమాలయాలు మరియు పశ్చిమ కనుమలు.

2) పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పుగా ప్రవహించే నదులు :
1) కృష్ణా, 2) గోదావరి, 3) కావేరి మొ||.

3) పశ్చిమంగా ప్రవహించే నదులు :
నర్మద మరియు తపతి.

4) సింధూనది ఉపనదులు :
రావి, సట్లెజ్, బియాస్, జీలం, చీనాబ్.

ప్రశ్న 17.
పటాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 2
1. ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి గంగానదిలో కలిసే ఉపనదులు ఏవి?
2. హిమాలయాలలో పుట్టి గంగానదిలో కలిసే ఉపనదులేవి?
3. గంగానది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది?
4. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు:

  1. ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి గంగానదిలో కలిసే ఉపనదులు : చంబల్, బేత్వా, థమ్స, సోన్ మొ॥
  2. హిమాలయాలలో పుట్టి గంగానదిలో కలిసే ఉపనదులు : గోమతి, గండక్, కోసి, ఘగ్గర్ మొ||.
  3. గంగానది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలగుండా ప్రవహిస్తుంది.
  4. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్ నది అంటారు.

10th Class Social 5th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఏ ఏ కారణాల వల్ల ఇలా జరిగిందని నీవు భావిస్తున్నావు?
జవాబు:

  1. భూగర్భ జలం ప్రధాన జలవనరుగా ఉంది.
  2. భూగర్భ జలాలు అక్కడికి చేరుకునే వాటి కంటే ఎక్కువ మొత్తంలో వాటిని తోడి తీస్తున్నారు.
  3. పర్యవసానంగా ఎక్కువ లోతుకు బోరుబావులను త్రవ్వుతున్నారు.
  4. భూగర్భ జలాలను వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
  5. పారిశ్రామిక, గృహ అవసరాలకు కూడా భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
  6. అడవులను నరకడం వల్ల కూడా భూమిలోకి ఇంకే నీటి పరిమాణం తగ్గుతుంది.
  7. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కువగా భూమి మీద వదలడం వల్ల భూమిలోనికి నీరు ఇంకే స్థాయి తగ్గిపోయి భూగర్భ జల మట్టాలు తగ్గుతున్నాయి.
  8. ఇంకుడు గుంతలను సక్రమంగా వినియోగించకపోవడం మొదలగు కారణాల వలన భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.

ప్రశ్న 2.
కింది పేరాను చదివి, దానిపై మీ అభిప్రాయం రాయండి.
నీళ్ళు అన్నవి ప్రవహించే ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు, నియమాలు అవసరం. తాగునీళ్ళకు మొదటి స్థానం ఇవ్వడంతో పాటు పొందడం అనేది మానవ హక్కు కూడ భూగర్భ జలాల వినియోగంపై పంచాయతీరాజ్ సంస్థలకు నియంత్రణ ఉండాలి.
జవాబు:

  1. ఇవ్వబడిన పేరా ప్రకారం చట్టాలు, నియమాలు నీటిని ప్రవహించే ఉమ్మడి వనరుగా గుర్తించాలి.
  2. నీటి వనరులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలన్నీ అసంబద్దమైనవి, చెల్లనివి అని చెప్పుకోవచ్చు.
  3. ఈ నియమాలు, చట్టాలు నీటిని తాగు అవసరాల కోసం మొదటిస్థానంలో ఉంచాలి.
  4. భూగర్భ జలాల వినియోగంపై పంచాయతీరాజ్ సంస్థల నియంత్రణ ఉండాలి.
  5. భూమిపై యాజమాన్యానికి ఆ నేలలో లభ్యమయ్యే నీటి వనరులకు మధ్య సరియైన సంబంధం లేదు. భూమి యజమాని నీరు తోడటంపై ఎటువంటి నియంత్రణ లేదు.
  6. నీరు అందరికీ చెందిన వనరుగా గుర్తించబడాలి.
  7. ఇలా గుర్తించి నియంత్రించడానికి సరియైన చట్టాలు, నియమాలు రూపొందించాలి.
  8. నీటి వనరుల వినియోగ నియంత్రణకు స్థానిక స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ చట్టాలను చేయాలి.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 3.
హివారే బజారులాగానే భూగర్భ జలాల నియంత్రణ ప్రధానంగా ప్రజలే చేయాలా? మీ అభిప్రాయాన్ని తెలపండి.
జవాబు:

  1. హివారే బజారులో భూగర్భజలాల నియంత్రణ చాలా విజయవంతం అయింది. దీనికి కారణం ప్రజల సహకారమే. కావున ప్రజలు పూనుకుని భూగర్భజలాల నియంత్రణ చేయటమే సరియైన పని.
  2. భూగర్భ జలాలపై వ్యక్తిగత హక్కు వలన ఎవరికి వారు అధిక లోతు నుండి నీటిని తోడుకుంటున్నారు.
  3. నీరు వాడుకొనుటకు ప్రతి ఒక్కరూ పోటీపడుట వలన ఈ ఉమ్మడి వనరు త్వరితంగా అంతరించే ప్రమాదం ఉంది.
  4. భూగర్భ జలాల వెలికితీత, వినియోగంపై సామాజిక నియంత్రణ అనేది అవసరం. ఎందుకంటే ఒక ప్రాంతం లోపలికి, బయటకు వెళ్ళే ప్రవాహలను లెక్కించి నీటిని వినియోగించుకోవాలి.
  5. చిన్న ప్రాంతాలలో కూడా సామాజిక చొరవ, నియంత్రణ ప్రణాళికల ద్వారా అందరికీ నీటిని అందించటం సాధ్యమేనని హివారే బజారు అనుభవం తెలుపుతుంది.

ప్రశ్న 4.
క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.
“భూగర్భజలాలే ప్రజలకు ప్రధానమైన నీటి వనరు. ఈ నీటిని అధికంగా తోడేస్తే దానితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయి. భవిష్యత్తు తరాలకు అందాల్సిన నీటి నిల్వలను ప్రభావితం చేస్తుంది కాబట్టి భూయజమానులు తమకు యిష్టమొచ్చినట్లు నీటిని తోడుకునే హక్కు లేదు. దీనిపై కొన్ని పరిమితులు ఉండాలి. భూమి ” యాజమాన్యానికీ, భూమి మీద బోరుబావుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి మధ్య సంబంధం లేకుండా చేస్తే ఈ పరిమితులు ఆమోదయోగ్యంగా ఉంటాయి.”
జవాబు:

  1. నీటి వనరులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలన్నీ అసంబద్ధమైనవి, చెల్లనివి అని చెప్పుకోవచ్చు.
  2. భూమిపై యాజమాన్యానికి ఆ నేలలో లభ్యమయ్యే నీటి వనరులకు మధ్య సరియైన సంబంధం లేదు. భూమి యజమాని నీరు తోడటంపై ఎటువంటి నియంత్రణ లేదు.
  3. నీరు అందరికి చెందిన వనరుగా గుర్తించబడాలి.
  4. ఇలా గుర్తించి నియంత్రించడానికి సరియైన చట్టాలు, నియమాలు రూపొందించాలి.
  5. నీటి వనరుల వినియోగ నియంత్రణకు స్థానిక స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ చట్టాలను చేయాలి.

ప్రశ్న 5.
“అనేక రాష్ట్రాలలో భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలు కాలం చెల్లినవి, ప్రస్తుత పరిస్థితులకు అనువైనవి కావు. భూగర్భ జలాల వినియోగం నామమాత్రంగా ఉన్న రోజులలో ఈ చట్టాలు రూపొందించబడ్డాయి. ఈనాడు బోరుబావులు వివిధ లోతుల నుంచి పెద్ద మొత్తంలో నీటిని తోడేసే పరిస్థితిలో ఉన్నాయి.”
ప్రశ్న : భూగర్భ జలాల సక్రమ వినియోగం సమపంపిణీ గురించి వ్యాఖ్యానిస్తూ ఈ అంశంపై నీవు సూచించు మార్గాలు కొన్నింటిని పేర్కొనండి.
జవాబు:

  1. ప్రస్తుతం భూగర్భ జలాలే ప్రజలకు ప్రధానమైన నీటివనరుగా ఉన్నాయి.
  2. వీనిని అధికంగా తోడివేస్తే భవిష్యత్తు తరాలకు అందాల్సిన నీటి నిల్వలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.
  3. కాబట్టి భూ యజమానులకు తమ ఇష్టం వచ్చినంత నీటిని తోడుకునే హక్కును ఇవ్వరాదు. దీనిపై కొన్ని పరిమితులు ఉండాలి.
  4. భూయాజమాన్యానికి, ఆ భూమిలోని బోరుబావుల నుండి భూగర్భ జలాలను తోడుకోవడానికి మధ్య సంబంధం లేకుండా చేస్తే ఈ పరిమితులు అమలవుతాయి.

ప్రశ్న 6.
తుంగభద్ర నదీ ప్రాంతంలో నీటి వినియోగం గురించి వివరింపుము.
జవాబు:
తుంగభద్ర నదీ ప్రాంతంలో నీటి వినియోగం :

  1. తుంగభద్ర నదీ జలాలను కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పంచుకుంటాయి.
  2. వ్యవసాయానికి ఉపయోగించబడుతున్నాయి.
  3. కొన్ని ప్రాంతాలలో చెరువుల ద్వారా నీటి నిల్వ జరుగుతోంది.
  4. మిగిలిన ప్రాంతాలు కాలువల ద్వారా వచ్చే ఉపరితల నీటిపై ఆధారపడినాయి.
  5. అటవీ విస్తీర్ణం తగ్గి, సాగుభూమి పెరిగింది.
  6. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించబడుతున్నాయి.
  7. త్రాగునీటి అవసరాల కోసం ఉపయోగించబడుతున్నాయి.
  8. కొంతమంది జీవన ప్రమాణాలు పెరిగాయి.
  9. రాష్ట్రాల మధ్య జల వివాదాలు నెలకొంటున్నాయి.

ప్రశ్న 7.
ప్రస్తుతం భూగర్భ జలాలే ప్రజలకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్నాయి. ఈ నీటిని అధికంగా తోడేసే దానితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయి. భవిష్యత్తు తరాలకు అందాల్సిన నీటి నిల్వలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కాబట్టి భూమి యజమానులకు తమకు ఇష్టమొచ్చినంత నీటిని తోడుకునే హక్కును ఇవ్వలేం. దీనిపై కొన్ని పరిమితులుండాలి.
ప్రశ్న : దీనిని నీవు అంగీకరిస్తావా? నీ అభిప్రాయాన్ని తెలుపుము.
జవాబు:
అవును. ఈ వాక్యంతో నేను అంగీకరిస్తాను.

  1. నీటిని ఉమ్మడి వనరుగా పరిగణించాలి.
  2. భూగర్భంలో ప్రవహించే నీటికి ఎటువంటి సరిహద్దులూ ఉండవు.
  3. భూ యాజమాన్యం అనేది భూగర్భ జలాలకు వర్తించరాదు.
  4. తాగునీటికి మొదటి స్థానం ఇవ్వాలి. అది మానవ హక్కు.
  5. పంచాయతీరాజ్ సంస్థలకు భూగర్భ జలాలపై నియంత్రణ ఉండాలి.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 8.
హిమాలయ నదీ వ్యవస్థల గురించి వివరించుము.
జవాబు:
హిమాలయ నదీ వ్యవస్థలు :
హిమాలయ నదీ వ్యవస్థ మూడు ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తుంది. అవి గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలు.

1) సింధునదీ వ్యవస్థ :
టిబెట్లోని మానససరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని ఉత్తర వాలుల వద్ద సింధూనది మొదలవుతుంది. ఇది టిబెట్ గుండా వాయవ్య దిశగా పయనిస్తుంది. భారతదేశంలోకి జమ్ము-కాశ్మీర్‌లో ప్రవేశిస్తుంది. సింధూనదికి భారతదేశంలో జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెట్లు ప్రధానమైన ఉపనదులు. భారతదేశంలో జమ్మూ& కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఇది ప్రవహిస్తుంది.

2) గంగానదీ వ్యవస్థ :
గంగానది రెండు నదుల కలయిక. ఒకటి గంగోత్రి హిమానీనదం దగ్గర పుట్టే భగీరథి. రెండవది బదరీనాథ్ కి వాయవ్య దిశలో సతహెనాథ్ దగ్గర పుట్టే అలకనంద. ఈ రెండూ దేవప్రయాగ వద్ద కలిసి గంగానదిగా మారుతుంది. ఇది హరిద్వార్ వద్ద పర్వతాలను వదలి మైదానాలలోనికి ప్రవహిస్తుంది. గంగానదిలో అనేక ఉపనదులు వచ్చి చేరతాయి. వీటిల్లో అనేకం హిమాలయపర్వతాల్లో పుడతాయి, కొన్ని ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టేవి కూడా ఉన్నాయి.

3) బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ :
బ్రహ్మపుత్ర (టిబెట్ లో దీనిని సాంగ్ పో అంటారు) మానససరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని చెమయుంగ్ డంగ్ హిమానీనదం నుండి పుడుతుంది. దక్షిణ టిబెట్ గుండా ఇది తూర్పునకు ప్రవహిస్తుంది. లోట్సే త్సాంగ్ దగ్గర జల ప్రయాణానికి అనువుగా ఉండే వెడల్పైన నదిగా మారి 640 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆ తరవాత అనేక జలపాతాల ద్వారా అది పాయలుగా మారుతుంది. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లో నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. ఇక్కడ దీనిని సియంగ్ అనీ, దిహంగ్ అనీ అంటారు. అస్సోం లోయలోకి వచ్చినప్పుడు దిబంగ్, లోహిత్ అనే రెండు ఉపనదులు దీంట్లో కలుస్తాయి. ఇక్కడి నుంచి దీనిని బ్రహ్మపుత్రగా పిలుస్తారు.

ప్రశ్న 9.
‘భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకోకుండా నీటిని అధికంగా తోడేస్తే భవిష్యత్ తరాలకు భూగర్భజలాలు లభించని పరిస్థితి ఏర్పడుతుంది’. వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. ప్రస్తుతం భూగర్భ జలాలే ప్రజలకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్నాయి.
  2. ఈ నీటిని అధికంగా తోడేస్తే దానితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయి.
  3. భవిష్యత్తు తరాలకు అందాల్సిన నీటి నిల్వలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.
  4. కాబట్టి భూమి యజమానులకు తమకు ఇష్టమొచ్చినంత నీటిని తోడుకునే హక్కును ఇవ్వలేం.
  5. దీనిపై కొన్ని పరిమితులు ఉండాలి.
  6. భూమి యజమాన్యానికీ, భూగర్భ జలాలను తోడడానికి మధ్య సంబంధం ఉండరాదు.
  7. అప్పుడు మాత్రమే ఈ పరిమితులు సక్రమంగా అమలౌతాయి.
  8. భూగర్భ జలాలను ఉమ్మడి వనరుగా భావించాలి.

ప్రశ్న 10.
క్రింది పేరాగ్రాఫ్ ను చదివి, వ్యాఖ్యానించండి.
నీటి వినియోగ యాజమాన్యంలో సామాజిక – ఆర్థిక అంశాలు ఎంతో ముఖ్యమైనవి. ఒక ప్రాంతంలోని వివిధ వర్గాల మధ్య వ్యవసాయం, పరిశ్రమలు, తాగు నీరు వంటి రంగాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరాలో నీటి వినియోగం మరియు దాని ప్రాముఖ్యత గురించి వివరించబడింది: నీటి వినియోగంలో చాలా సందర్భాలలో రాష్ట్రాల మధ్య గొడవలు కూడా సంభవించాయి.
ఉదా :

  1. కావేరి జలాల సమస్య – కర్ణాటక, తమిళనాడు
  2. తెలుగు గంగ సమస్య – ఆంధ్ర, తమిళనాడు
  3. బాబ్లీ ప్రాజెక్టు సమస్య – ఆంధ్ర, మహారాష్ట్ర
  4. తుంగభద్ర ప్రాజెక్టు నీటి సమస్య – ఆంధ్ర, కర్ణాటక
  5. నాగార్జునసాగర్ జలాల సమస్య – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదలగునవి

ఇలా వివరిస్తూ పోతే మన దేశంలో రాష్ట్రాల మధ్య నీటి కోసం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకనగా నీరు ప్రధాన వనరు. నీరు లేకపోతే మన మనుగడలేదు. కొన్ని ప్రాంతాలవారు ఎక్కువగా వాడుకుంటున్నారని, మరికొన్ని ప్రాంతాలవారికి త్రాగునీరు కూడా లేదని మనం గమనిస్తున్నాం. దీని వలన కొన్ని ప్రాంతాలు వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. అంతేకాకుండా భూగర్భ నీటి వనరులు ఉపయోగించే విషయంలో చాలాసార్లు మనం కోర్టులో కేసులు పెట్టడం జరిగింది.

ఉదా :
కేరళలోని పెరుమట్టి గ్రామ పంచాయితి మరియు కోకోకోలా కంపెనీలు : ఈ పైవన్నీ గమనించినట్లయితే రాబోయే కాలంలో నీటి వనరుల కోసం యుద్ధాలు కూడా జరుగవచ్చు.

దీనిపై నా సలహా మరియు సూచనలు ఏమిటంటే ముందుగా ప్రతి ఒక్కరు నీటి ఆవశ్యకతను గురించి, దానిని ప్రతి ఒక్కరూ సమానంగా పొందాలి అనే అంశాన్ని గమనిస్తూ, ప్రస్తుతం మాత్రమే కాకుండా మన రాబోయే తరాల వారికి కూడా ఇబ్బంది లేకుండా మనం నీటిని వారికి అందించవలసిన ఆవశ్యకత చాలా ఉంది.

కావున ప్రభుత్వం నీటి వినియోగం యాజమాన్యం మీద అనుగుణమైన చట్టాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చట్టాలు కాలం చెల్లిపోయినవి. జనాభా అధికంగా పెరిగిపోయినారు.

వ్యవసాయదారులలో కూడా నీటి వినియోగం గురించి అవగాహన కల్పించాలి. వారి ప్రాంతంలో ఉన్న నేలను గురించి దానికి ఎంత నీరు అవసరం, ఎలాంటి పంటలు పండించాలి. ఎలా చేస్తే మనం నీటిని పొదుపుగా వాడవచ్చు అనే దానిని వివరించాలి.

అలాగే చివరిగా ప్రతి ఒక్కరు భూగర్భ నీటి మట్టాన్ని పెంచే విధానాన్ని అవలంబించాలి.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 11.
“భూగర్భ జలాల వెలికితీత, వినియోగంపై సామాజిక నియంత్రణ అన్నది ముఖ్యమైన విషయం.” – ఈ వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జవాబు:

  • ఆ భూగర్భ జలాల వెలికితీత, వినియోగంపై సామాజిక నియంత్రణ అన్నది ముఖ్యమైన విషయం, ఈ వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను. కారణం
  • ప్రస్తుతం భూగర్భ జలాలే ప్రజలకు ప్రధానమైన నీటివనరు, వీటిని అధికంగా వినియోగం చేస్తే భవిష్యత్తు తరాల వారిపై దీని ప్రభావం ఉంటుంది.
  • భూ యజమానులకు తమ ఇష్టం వచ్చినంత నీటిని తోడుకునే హక్కును ఇవ్వరాదు, దీనిపై కొన్ని పరిమితులు ఉండాలి.
    నీటిని ఉమ్మడి వనరుగా పరిగణించాలి, సామాజిక నియంత్రణ ఉండాలి.
  • భూగర్భంలో ప్రవహించే నీటికి ఎటువంటి సరిహద్దులూ ఉండవు కాబట్టి భూమి యజమానికీ, భూగర్భ జలాలను తోడడానికి మధ్య సంబంధం ఉండరాదు.
  • ప్రభుత్వం కూడా నీటి వినియోగం యాజమాన్యం మీద అనుగుణమైన చట్టాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రశ్న 12.
ద్వీపకల్ప నదుల గురించి రాయండి.
జవాబు:
బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు, అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా పశ్చిమకనుమలు కలవు. నర్మదా, తపతి నదులు కాకుండ, ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పువైపుకు ప్రవహిస్తాయి. ద్వీపకల్ప పీఠభూమిలోని ఉత్తరభాగంలో పుట్టే చంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్ నదులు గంగా నదీ వ్యవస్థకు చెందుతాయి. ద్వీపకల్పంలోని ఇతర ముఖ్యమైన నదులు మహానది, గోదావరి, కృష్ణా, కావేరి, ద్వీపకల్ప నదుల ప్రవాహమార్గం మారదు, వక్రతలు (meanders) ఉండవు. వీటిల్లో సంవత్సరమంతా నీళ్లు ఉండవు.

ద్వీపకల్ప నదులలో గోదావరి నది పెద్దది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకం పీఠభూమిలో ఇది పుడుతుంది. బంగాళాఖాతంలో కలుస్తుంది.

ప్రశ్న 13.
తుంగభద్ర ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం ఎందుకు తగ్గుతోంది?
జవాబు:
గత కొద్ది దశాబ్దాల నుండి తుంగభద్ర ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. 50 సంవత్సరాల క్రితం ఆనకట్ట సామర్థ్యం 376.6 కోట్ల ఘనపు మీటర్లు కాగా గనుల తవ్వకం, దుమ్ము, నేలకోత, వ్యర్థపదార్థాల వంటి వాటివల్ల రిజర్వాయరు మేటవేసి నీటి నిల్వ సామర్థ్యం 84.9 కోట్ల ఘనపు మీటర్ల మేర తగ్గిపోయింది. “ఇనుప ఖనిజ తవ్వకంలో సరైన ప్రామాణికాలు పాటించడం లేదు. కుద్రేములో ఇనుప ఖనిజం, శాండూర్ వద్ద మాంగనీసు తవ్వకాల వల్ల పరీవాహక ప్రాంతంలో నేల కోత ఎక్కువయ్యి సాంప్రదాయ చెరువులు, చిన్న జలాశయాలు, తుంగభద్ర జలాశయం పూడికకు గురవుతున్నాయి.” అని ఒక అధ్యయనం పేర్కొంది.

ప్రశ్న 14.
‘జలచక్రాన్ని’ చిత్రించండి.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 4

ప్రశ్న 15.
తుంగభద్ర కాలుష్యానికి కారణాలను వివరించండి.
జవాబు:
గత రెండు దశాబ్దాలలో చిన్న పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు బాగా పెరిగాయి. దీంతో నీటికి పరస్పర విరుద్ధ అవసరాలు మరింత సంక్లిష్ట రూపం దాల్చాయి. పారిశ్రామికీకరణ, పట్టణ ప్రాంతాల పెరుగుదల వల్ల కొంతమంది జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ వీటివల్ల, ప్రత్యేకించి పారిశ్రామిక సంస్థల వల్ల కాలుష్యం పెరిగింది. నదీ పరీవాహక ప్రాంతంలో పనిచేస్తున్న 27 భారీ, 2543 చిన్న పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. ఇవి రోజుకు పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తాయి. నదిలోకి కలుషిత జలాలను వదలటానికి పరిశ్రమలను అనుమతించారు. అయితే 1984లో నదిలోకి వదిలిన బెల్లపు మడ్డి వల్ల పెద్ద ఎత్తున చేపలు చనిపోవటంతో ప్రజలు ఆందోళన చేశారు. అప్పటి నుంచి పరిశ్రమలు శుద్ధి చేసిన జలాలను మాత్రమే నదిలోకి వదలాలి. అయితే ఈ చట్టాలను సమర్థంగా అమలు చేయటం లేదు. దాంతో ! నదీవ్యవస్థ తీవ్ర కాలుష్యానికి గురి అవుతూనే ఉంది.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 16.
హివారే బజారులో జరిగిన మార్పులను వివరించండి.
జవాబు:
వేసవిలో నీళ్లు అందే భూమి 7 హెక్టార్ల నుంచి 72 హెక్టార్లకు పెరిగింది. సగటు వర్షపాతం కురిసిన సంవత్సరంలో ఖరీఫ్ లో సజ్జ పంట, రబీలో జొన్న పంటకే కాకుండా జయా లో కొంత కూరగాయల సాగుకి కూడా నీళ్లు లభిస్తాయి. సాగునీటి సదుపాయంలేని భూములలో కూడా నేలలో తేమ శాతం పెరిగినందువల్ల ఉత్పాదకత పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు పంటల వైవిధ్యత పెరిగింది. ఇప్పుడు బంగాళాదుంప, ఉల్లి, పళ్లు (ద్రాక్ష, దానిమ్మ), పూలు వంటి వాణిజ్య పంటలు, గోధుమ కూడా సాగుచేస్తున్నారు. అన్నిటికంటే చెప్పుకోదగ్గ పరిణామం ఏమిటంటే నీటి అందుబాటు పెరిగి, రెండవ పంట కూడా సాధ్యం కావటం వల్ల ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం తగ్గింది. చిన్న, సన్నకారు రైతులు తమ భూముల ద్వారా పూర్తి జీవనోపాధి పొందలేక పోతున్నప్పటికీ వాళ్ల భూముల ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. కూలిరేట్లు ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ అవి కొంతైనా పెరిగినందువల్ల కూలీ చేసుకునే వాళ్ల పరిస్థితి కూడా మెరుగుపడింది.

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

These AP 10th Class Social Studies Important Questions 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి will help students prepare well for the exams.

AP Board 10th Class Social 4th Lesson Important Questions and Answers భారతదేశ శీతోష్ణస్థితి

10th Class Social 4th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ఊటి ఏ పర్వతాలలో ఉంది?
జవాబు:
నీలగిరి పర్వతాలు

2. ‘ట్రేడ్’ అను జర్మన్ పదము యొక్క అర్థమేమిటి?
జవాబు:
ట్రాక్

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలకరి జల్లులను ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు:
మామిడి జల్లులు

4. వాయువు, మధ్య భారతంలో వేసవి కాలంలో నమోదవుతున్న సరాసరి పగటి ఉష్ణోగ్రతలు ఎంత?
జవాబు:
410 – 42°C

5. ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ఏర్పడిన ప్రధాన ఉద్దేశ్యం ఏమి?
జవాబు:
భూగోళం వేడెక్కడం తగ్గించడం

6. ‘మానసూన్స్’ కు ఆ పేరు పెట్టిన వారు ఎవరు?
జవాబు:
అరబ్బులు

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

7. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపునకు వెళుచున్నట్లయితే ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు చూడవచ్చు?
జవాబు:
ఉష్ణోగ్రతలు తగ్గుతాయి

8. తిరోగమన ఋతుపవన కాలంలో మన దేశంలోని ఏ తీరం (రాష్ట్రం)లో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది?
జవాబు:
కోరమండల్ (తమిళనాడు)

9. భారతదేశానికి అత్యధిక వర్షపాతాన్ని కలుగజేసే (ఋతు) పవనాలు ఏవి?
జవాబు:
నైఋతి ఋతుపవనాలు

10. ఋతుపవనారంభం ఎక్కడ (ఏ రాష్ట్రంలో) (ఏ తీరంలో) జరుగుతుంది?
జవాబు:
కేరళ

11. ఉత్తర మైదానాలలో పొడిగా, వేడిగా ఉండే స్థానిక పవనాలనేమంటారు?
జవాబు:
‘లూ’

12. భారతదేశంలో తిరోగమన (ఈశాన్య) ఋతుపవన కాలం ఎప్పుడు?
జవాబు:
అక్టోబరు – డిసెంబరు.

13. భారతదేశంలో నైరుతి (పురోగమన) ఋతుపవన కాలం ఎప్పుడు?
జవాబు:
జూన్ – సెప్టెంబరు.

14. “క్లోమోగ్రాఫ్’ వేటిని గూర్చి తెలుపును?
జవాబు:
ఉష్ణోగ్రత, వర్షపాతం

15. నైరుతి ఋతుపవనాల వల్ల తక్కువ వర్షపాతం పొందే తీరం (రాష్ట్రం) ఏది?
జవాబు:
కోరమండల్ (తమిళనాడు)

16. ఒక ప్రాంత శీతోష్ణస్థితిని లెక్కించటానికి ఆధారపడే సమయం కనీసం ఎన్ని సం||రాలు?
జవాబు:
30

17. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతం ఏది?
జవాబు:
ఉష్ణమండల ప్రాంతం

18. భారతదేశంలోని ఏ ప్రాంతం పొడవైన తీర రేఖను కలిగి ఉంది?
జవాబు:
దక్షిణ

19. ఉపరితల వాయు ప్రవాహాలను ఏమంటారు?
జవాబు:
జెట్ ప్రవాహాలు

20. సాంప్రదాయ భారతీయ కాలాలు ఎన్ని?
జవాబు:
‘6’

21. ఏ సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయు గుండాలను పశ్చిమ విక్షోబాలు అంటారు?
జవాబు:
మధ్యధరా సముద్రం

22. వార్సా ఏ దేశ రాజధాని?
జవాబు:
పోలెండ్

23. నైరుతి ఋతుపవన కాలంలో (భారతదేశంలో) వర్షచ్చాయ ప్రాంతం ఏది?
జవాబు:
దక్కన్ పీఠభూమి తూర్పు అంచు

24. నైరుతి ఋతుపవనాలు భారతదేశం దాటి వెళ్ళకుండా అడ్డుకునేవి ఏవి?
జవాబు:
హిమాలయాలు

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

25. తుఫాన్ నెల అని ఏ నెలను పిలుస్తారు?
జవాబు:
నవంబర్

26. భారతదేశం సుమారుగా ఏ రేఖాంశాల మధ్య ఉంది?
జవాబు:
68° తూ – 97° తూ

27. భారతదేశాన్ని రెండు సమభాగాలుగా చేస్తున్న రేఖ (అక్షాంశం) ఏది?
జవాబు:
కర్కట రేఖ

28. కర్కటరేఖకు ఉత్తర, దక్షిణ ప్రాంతాలు వరసగా ఏ మండలాల్లో ఉన్నాయి?
జవాబు:
సమశీతోష్ణ, ఉష్ణ మండలాలు

29. సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు వస్తుంది?
జవాబు:
ఉష్ణోగ్రత తగ్గుతుంది

30. కొడైకెనాల్, ఉదగ మండలంలు …….. లో ఉన్నాయి.
జవాబు:
పశ్చిమ కనుమల్లో

31. తిరోగమన ఋతుపవనాల సమయంలో అధిక ఉష్ణోగ్రత, చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనినే సాధారణంగా ఏమంటారు?
జవాబు:
అక్టోబరు వేడిమి.

32. నైరుతి ఋతువవనాలను రెండు శాఖలుగా విభజించునది ఏది?
జవాబు:భారత ద్వీపకల్పం

33. జెట్ ప్రవాహాలు నేల నుంచి ఎన్ని మీటర్ల ఎత్తులో వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి?
జవాబు:
12,000 mts.

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

34. ఏ అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది?
జవాబు:
250 ఉ. అ

35. భారతదేశ భూభాగంపై ఏ నెల నుండి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి?
జవాబు:
నవంబరు

36. భారతదేశం ఉత్తరార్ధ గోళంలోని ఏ పవనాల మేఖలలో ఉంది?
జవాబు:
వ్యాపార పవనాలు

37. పీఠభూమిలో ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది?
జవాబు:
9

38. భారతదేశంలో ఋతుపవనాల ఆరంభం ఏ నెలలో మొదలవుతుంది?
జవాబు:
జూన్

39. వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య ఏ నెలలను సంధికాలంగా పేర్కొంటారు?
జవాబు:
అక్టోబరు, నవంబరు

40. తిరోగమన రుతుపవన కాలంలో ఏ ప్రాంతంలో తుఫానులు, వాయుగుండాలు ఏర్పడతాయి?
జవాబు:
అండమాన్

41. ఏ తీర ప్రాంతంలో అధిక శాతం వర్షం, తుఫానులు వాయు గుండాల వల్ల సంభవిస్తుంది?
జవాబు:
కోరమండల్ తీరం

42. సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే వాతావరణంలోని పొర ఏది?
జవాబు:
ఓజోన్

43. టండ్రాలో మంచు క్రింద పెద్ద మొత్తంలో ఏ వాయువు ఉందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు?
జవాబు:
మీథేన్

44. AGW లు అనగా?
జవాబు:
మానవ కారణంగా భూగోళం వేడెక్కడం

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

45. హరిత గృహ వాయువుల ఉద్గాలను తగ్గించటానికి అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రభుత్వ సంఘం ఏది ?
జవాబు:
IPCC

46. అభివృద్ధి చెందిన దేశాలు ఏ ఇంధనాల వాడకం ద్వారా అభివృద్ధి చెందియున్నవని, ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన?
జవాబు:
శిలాజ ఇంధనాలు

47. ‘ఐలా తుఫాను కారణంగా 2009లో ఏ ప్రాంతం అతలాకుతలమయ్యింది?
జవాబు:
సుందర్ బన్ ప్రాంతం

48. సగటు ఉష్ణోగ్రతలు 2°C పెరగటం వలన (వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి) సముద్ర మట్టం ఎంత మేర పెరుగుతుంది?
జవాబు:
1 మీటరు

49. క్రింది వానిలో శిలాజ ఇంధనానికి ఉదాహరణ
సౌరవిద్యుత్, నేలబొగ్గు, పవన శక్తి, జలశక్తి
జవాబు:
నేలబొగ్గు

50. 2013లో IPCC సమావేశం ఏ నగరంలో జరిగింది.
జవాబు:
వార్సా

51. ఒక ప్రాంతంలో, ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను ఏమి అంటారు?
జవాబు:
వాతావరణం (వెదర్)

52. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులను ఏమంటారు?
జవాబు:
శీతోష్ణస్థితి (క్లైమేట్)

53. క్రింది వానిలో శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశం కానిది ఏది?
అక్షాంశం, భౌగోళిక స్వరూపం, మైదానం, ఉపరితల గాలి ప్రసరణ, భూమికి-నీటికి గల సంబంధం
జవాబు:
మైదానం

54. ఉత్తరార్ధగోళంలో ఉపఅయనరేఖ అధిక పీడనం వల్ల ఏర్పడే పవనాలు ఏవి?
జవాబు:
శాశ్వత పవనాలు (వ్యాపార పవనాలు)

55. ఏ రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలను ఉష్ణ ప్రాంతాలు అంటారు?
జవాబు:
భూమధ్య రేఖకు

56. జనవరి సాధారణంగా అత్యంత చలిగా ఉంటుంది. దేశంలో పలు ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రత ఎంతకంటే తక్కువ ఉంటుంది?
జవాబు:
10°c

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

57. వేసవికాలంలో దేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపుకి వెళుతుంటే సగటు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉంటుంది?
జవాబు:
ఉష్ణోగ్రతలు తగ్గుతాయి

58. భారతదేశంలో కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని మొదటగా గుర్తించువారు ఎవరు?
జవాబు:
అరబ్ వర్తకులు

59. బంగాళాఖాతం శాఖ బెంగాల్ తీరంతోపాటు ఏ తీర ప్రాంతాన్ని తాకుతుంది?
జవాబు:
షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ముఖంను.

60. అరేబియా సముద్రంలో పుట్టే ఉష్ణ తుఫానులు చాలా విధ్వంసకరంగా ఉండి, ఏ నది డెల్టా ప్రాంతాలపై వీటి ప్రభావాన్ని చూపుతాయి?
జవాబు:
గోదావరి, కృష్ణా, కావేరి.

61. జనవరి – ఫిబ్రవరి నెలలందు ఉండే ఋతువు ఏది?
జవాబు:
శిశిరం.

62. మొక్కలు వినియోగించుకుని మాంసకృత్తులు తయారు చేయటానికి పనికివచ్చే వాయువు ఏది?
జవాబు:
నత్రజని

63. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి.
i) భూగోళం వేడెక్కడానికి మానవ చర్యలు ఒక కారణం
ii)వాతావరణ మార్పు ప్రపంచ స్థాయిలో జరుగుతుంది.
పై వ్యాఖ్యలలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు.
జవాబు:
C) (i) మరియు (ii)

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

64. భారతదేశ శీతోష్ణస్థితి విషయంలో క్రింది వానిలో సరైనది గుర్తించి రాయండి.
(i) కర్కటరేఖ భారతదేశం మధ్యగుండా పోతుంది.
(ii) దక్షిణ భారతదేశం ఉష్ణ మండలంలో కలదు.
(iii) ఉత్తర భారతదేశం ధృవ మండలంలో కలదు.
A) (i) మాత్రమే
B) (i) మరియు (ii)
C) (iii) మాత్రమే
D) (1), (ii) మరియు (iii)
జవాబు:
B) (1) మరియు (ii)

65. క్రింది వానిలో భూగోళం వేడెక్కటాన్ని నియంత్రించే చర్య కానిది.
→ చెట్లు పెంచడం.
→ సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరించటం.
→ ప్రజా రవాణాను ఉపయోగించడం.
→ శిలాజ ఇంధనాల వాడకం పెంచటం.
జవాబు:
శిలాజ ఇంధనాల వాడకం పెంచడం.

66. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) వసంత ఋతువు ( ) a) మార్చి – ఏప్రిల్
ii) గ్రీష్మ ఋతువు ( ) ( b) మే – జూన్
iii) వర్ష ఋతువు ( ) c) జులై – ఆగష్టు
iv) శరద్ ఋతువు ( ) d) సెప్టెంబర్ – అక్టోబరు
జవాబు:
i- a, ii-b, iii – c, iv-d

67. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) క్లైమోట్రోగ్రాఫ్ ( ) a) అధిక వర్షపాతం
ii) జె స్ట్రీం ( ) b) స్థానిక పవనం
iii) లూ ( ) c) ఉపరితల వాయుప్రసరణ
iv) నైరుతి ( ) (d) వర్షపాత చిత్రం
జవాబు:
i-d, ii-c, iii – b, iv-a

68. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) మామిడి జల్లులు ( ) a) పెట్రోల్
ii) మీథేన్ ( ) b) అతి నీలలోహిత కిరణాలు
iii) ఓజోన్ ( ) c) టంద్రాలు
iv) శిలాజ ఇంధనం ( ) d) తొలకరి వాన
జవాబు:
i-d, ii-c, iii-b, iv-a

69. సిమ్లా, ఊటి మొ||న వేసవి విడిదులలో చాలా చల్లగా ఉండటానికి గల కారణమేమి?
జవాబు:
సముద్ర మట్టానికి ఎత్తులో ఉండటం.

70. ‘జెట్ ప్రవాహాల వేగం దాదాపుగా ఎంత ఉంటుంది?
జవాబు:
వేసవిలో 110 కి.మీ. / గంటకు, శీతాకాలంలో 184 కి.మీ. / గంటకు.

71. పశ్చిమ విక్షోభాల వల్ల ఏ పంటకు ప్రయోజనం కల్గుతుంది?
జవాబు:
గోధుమ.

72. ఋతుపవనాలు ఏ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి?
జవాబు:
20° ఉ.అ – 20°ద.అ

73. వేసవిలో ఢిల్లీతో పోలిస్తే సిమ్లాలో వాతావరణం చల్లగా ఉండటానికి కారణమేమి?
జవాబు:
సిమ్లా, ఢిల్లీ కన్నా ఎత్తులో ఉండటం.

74. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి, రాయండి..
→ అతి ఎత్తైన ప్రాంతం – లెహ్
→ సముద్ర సామీప్య శీతోష్ణస్థితి – ముంబయి
→ ఖండాంతర్గత శీతోష్ణస్థితి – చెన్నై
→ అత్యధిక ఉష్ణోగ్రత ప్రాంతం – జైపూర్
జవాబు:
ఖండాంతర్గత శీతోష్ణస్థితి – చెన్నై

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

75. పగలు రాత్రి ఉష్ణోగ్రతలలో, అదే విధంగా వేసవి శీతాకాలాల ఉష్ణోగ్రతలలో తేడాని ఉండని శీతోష్ణస్థితిని ఏమంటారు ?
జవాబు:
సమశీతోష్ణస్థితి (సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి)

76. IPCCని విస్తరింపుము.
జవాబు:
శీతోష్ణస్థితి మార్పుపై ప్రపంచదేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం. (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లెమేట్ ఛేంజ్)

77. AGWని విస్తరింపుము :
జవాబు:
మానవ కారణంగా భూగోళం వేడెక్కటం. (ఆంత్రోపో జెనిక్ గ్లోబల్ వార్మింగ్)

78. భూమధ్య రేఖకు దూరంగా ఉండి శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే నగరానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
గ్యాంగ్ టక్, ఈటానగర్.

79. భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది కాని, సముద్రానికి దగ్గరగా లేదు, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతానికి ఉదాహరణ.
జవాబు:
అనంతపురం (రాయలసీమ ప్రాంతం)

10th Class Social 4th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
అడవుల నరికివేత భూగోళం వేడెక్కడాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు:

  1. చెట్లు తగ్గిపోవటం.
  2. కిరణజన్య సంయోగక్రియకు ఆస్కారం లేకపోవడం లేక ఆక్సిజన్ మోతాదు తగ్గటం
  3. వాతావరణంలో కర్బన వాయువులు పెరగటం

ప్రశ్న 2.
భూగోళం వేడెక్కటానికి దోహదం చేసే ఏవేని రెండు మానవ కార్యకలాపాలను వ్రాయండి.
జవాబు:

  1. అడవుల నరికివేత
  2. పారిశ్రామికీకరణ

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 3.
కోరమండల్ తీరంలో ఏ ఋతుపవన కాలంలో వర్షపాతం తక్కువ?
జవాబు:
నైరుతి ఋతుపవన కాలంలో.

ప్రశ్న 4.
పటాన్ని పరిశీలించి క్రిందనివ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 1
a) ఋతుపవనాలు మహారాష్ట్రలో ఎప్పుడు ప్రవేశిస్తాయి?
జవాబు:
జూన్ 10న మహారాష్ట్రలో ఋతుపవనాలు ప్రవేశిస్తాయి.

b) ఋతుపవనాలు కేరళలో ఎప్పుడు ప్రవేశిస్తాయి?
జవాబు:
జూన్ 1న కేరళలో ఋతుపవనాలు ప్రవేశిస్తాయి.

c) భారతదేశంలో మొదటిగా ఏ రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి?
జవాబు:
కేరళ

d) ఋతుపవనాలు గుజరాత్ లో ఎప్పుడు ప్రవేశిస్తాయి?
జవాబు:
జూన్ 15న

ప్రశ్న 5.
‘అక్టోబరు వేడిమి’కి కారణాలేవి?
జవాబు:
అక్టోబర్ వేడిమికి గల కారణాలు : అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ.

ప్రశ్న 6.
కింది పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 2
ఎ) పవనాలు ఎల్లప్పుడు అల్ప పీడనం వైపే ఎందుకు వీస్తాయి?
జవాబు:

  1. అల్పపీడన ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువ మరియు నీరు ఆవిరిగావడం ఎక్కువ.
  2. వెచ్చని గాలి పైకి పోవడం వల్ల చల్లని గాలి ఆ స్థలాన్ని ఆక్రమిస్తుంది.

బి) భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వీస్తాయి?
జవాబు:
భారతదేశంలో జూన్ మాస ప్రారంభంలో, జూలైలో నైరుతి ఋతుపవనాలు వీస్తాయి.

ప్రశ్న 7.
ఢిల్లీ, చెన్నై నగరాల శీతోష్ణ పరిస్థితులను పోల్చండి.
జవాబు:

  1. చెన్నై సముద్రతీరంలో ఉండుట వలన ఉష్ణోగ్రత వ్యత్యాసం తక్కువ.
  2. ఢిల్లీ దేశ అంతర్భాగంలో ఉండడం మరియు సముద్ర ప్రభావం లేకపోవడం వల్ల సాంవత్సరిక ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువ.

ప్రశ్న 8.
పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 3
ప్రశ్న : జనవరి నెలలో సగటు 10°C ఉష్ణోగ్రత గల ఏవైనా రెండు రాష్ట్రాల పేర్లు పేర్కొనండి.
జవాబు:

  1. జమ్ము కాశ్మీర్
  2. హిమాచల్ ప్రదేశ్
  3. ఉత్తరాఖండ్
  4. ఉత్తరప్రదేశ్
  5. సిక్కిం
  6. అరుణాచల్ ప్రదేశ్

ప్రశ్న 9.
పశ్చిమ విక్షోభాలు అంటే ఏమిటి?
జవాబు:
మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలను పశ్చిమ విక్షోభాలు అంటారు.

ప్రశ్న 10.
శీతోష్ణస్థితి, వాతావరణాలను ప్రభావితం చేసే ఏవైనా రెండు కారకాలను పేర్కొనండి.
జవాబు:
శీతోష్ణస్థితి, వాతావరణాలను ప్రభావితం చేసే కారకాలు :

  1. అక్షాంశము,
  2. భూమికి, నీటికి గల సంబంధం
  3. భౌగోళిక స్వరూపం,
  4. ఉపరితల గాలి ప్రసరణ

ప్రశ్న 11.
వాతావరణమని దేనిని అంటారు?
జవాబు:
ఒక ప్రాంతంలో, ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను “వాతావరణం” అని అంటారు. ఈ వాతావరణ పరిస్థితులు తక్కువ సమయంలో కూడా చాలా తీవ్రంగా మారుతుంటాయి.

ప్రశ్న 12.
శీతోష్ణస్థితి అని దేనిని అంటారు?
జవాబు:
ఒక విశాలప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనపరిచే వాతావరణ పరిస్థితులను “శీతోష్ణస్థితి” అంటారు.

ప్రశ్న 13.
‘ఆ ప్రాంత శీతోష్ణస్థితి’ అని దేనిని అంటారు?
జవాబు:
ప్రతి సంవత్సరం ఒక ముప్పై సంవత్సరాల పాటు కనపడిన పరిస్థితులను “ఆ ప్రాంత శీతోష్ణస్థితి” అంటారు.

ప్రశ్న 14.
వాతావరణంలోని అంశాలు ఏవి?
జవాబు:

  1. ఉష్ణోగ్రత
  2. వాతావరణ పీడనం
  3. గాలి వేగం
  4. గాలిలో తేమ
  5. వర్షపాతం

ప్రశ్న 15.
శీతోష్ణస్థితి కారకాలు అంటే ఏమిటి? అవి ఏవి?
జవాబు:
శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలను “శీతోష్ణస్థితి కారకాలు” అంటారు.

  1. అక్షాంశం
  2. భూమికి – నీటికి గల సంబంధం
  3. భౌగోళిక స్వరూపం
  4. ఉపరితల గాలి ప్రసరణ.

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 16.
అక్షాంశాల రీత్యా భూమిపై ఉన్న మూడు ప్రాంతాలేవి?
జవాబు:

  1. ఉషప్రాంతాలు, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నవి.
  2. ధృవ ప్రాంతాలు, ధృవాలకు దగ్గరగా ఉన్నవి.
  3. సమశీతోష్ణ ప్రాంతాలు, ఈ రెండింటికి మధ్యలో ఉన్నవి.

ప్రశ్న 17.
సగటు వార్షిక ఉష్ణోగ్రతలు ఎక్కడ తగ్గుతున్నాయి?
జవాబు:
భూమధ్య రేఖ వైపు నుండి ధృవాలవైపుకి వెళుతున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి.

ప్రశ్న 18.
భారతదేశంలో ఉత్తర, దక్షిణ భాగాలలో శీతోష్ణస్థితికి ఎందుకు భిన్నంగా ఉంటుంది?
జవాబు:
భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్యరేఖకి దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి. కన్యాకుమారిలోని శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోషస్థితికంటే భిన్నంగా ఉండటానికి ఇది ఒక కారణం.

ప్రశ్న 19.
అక్షాంశ, రేఖాంశాల మధ్య భారతదేశ విస్తృతిని తెలియచేయండి.
జవాబు:
భారతదేశం సుమారుగా 8 ఉ – 37° ఉ రేఖాంశాల మధ్య ఉంది. భారతదేశాన్ని కర్కటరేఖ ఇంచుమించు రెండు సమభాగాలుగా చేస్తుంది. కర్కటరేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది. కర్కటరేఖకు ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది.

ప్రశ్న 20.
సమశీతోష్ణస్థితి అంటే ఏమిటి?
జవాబు:
దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు, రాత్రుల ఉష్ణోగ్రతలలో, అదేవిధంగా వేసవి, శీతాకాలాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు. దీనిని “సమ శీతోష్ణస్థితి” అంటారు.

ప్రశ్న 21.
కొన్ని వేసవి విడుదుల పేర్లు తెలపండి.
జవాబు:

  1. సిమ్లా
  2. గుల్బార్గ్
  3. నైనిటాల్
  4. డార్జిలింగ్
  5. కొడైకెనాల్
  6. ఊటీ మొదలగునవి.

ప్రశ్న 22.
పశ్చిమ విక్షోభాలు అంటే ఏమిటి?
జవాబు:
శీతాకాలంలో నిర్మలమైన ఆకాశం, గాలిలో తక్కువ తేమ శాతం, చల్లటిగాలులలో మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుపాను వాయుగుండాలనే “పశ్చిమ విక్షోభాలు” అంటారు.

ప్రశ్న 23.
‘లూ’ పవనాల గురించి రాయండి.
జవాబు:
ఉత్తరాది మైదానాలలో పొడిపొడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి. వీటినే “లూ పవనాలు” అంటారు.

ప్రశ్న 24.
ఋతుపవనాల ఆరంభంగా దేనిని పేర్కొంటారు?
జవాబు:
నైఋతి ఋతుపవనాలు. భారతదేశానికి జూన్ మొదటివారంలో చేరుకుంటాయి. దీనినే “ఋతుపవనారంభం” అంటారు.

ప్రశ్న 25.
IPCC ని విస్తరించండి.
జవాబు:
Inter – governmental Panel on Climate Change (ప్రపంచదేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం).

ప్రశ్న 26.
శిలాజ ఇంధనానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
బొగ్గు, పెట్రోలియం

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 27.
AGWని విస్తరించుము.
జవాబు:
AGW : Anthropogenic Global Warming (మానవకారణంగా భూగోళం వేడెక్కటం)

10th Class Social 4th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సాంప్రదాయ భారతీయ కాలాలను వర్గీకరించి, మాసవారిగా రాయండి.
జవాబు:
సాంప్రదాయ భారతీయ కాలాలు :

ఋతువులు తెలుగు నెలలు
వసంతం చైత్రం – వైశాఖం
గ్రీష్మం జ్యేష్ఠం – ఆషాఢం
వర్ష శ్రావణం – భాద్రపదం
శరత్ ఆశ్వీయుజం – కార్తీకం
హేమంత మార్గశిరం – పుష్యం
శిశిరం మాఘం – ఫాల్గుణం

ప్రశ్న 2.
సగటు ఉష్ణోగ్రతలు 2°C పెరగడం వలన వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి సముద్రమట్టం ఒక మీటరు పెరుగుతుంది. భూతాపాన్ని తగ్గించే చర్యలను సూచించే రెండు నినాదాలను రాయండి.
(లేదా)
భూగోళం వేడెక్కటాన్ని నివారించుటపై రెండు నినాదాలు తయారు చేయండి.
జవాబు:

  1. చెట్లను పెంచండి దండిగ – ఎసి (AC) లు ఎందుకు దండగ.
  2. భూమాతను నువ్వు రక్షిస్తే – భూమాత నిన్ను రక్షిస్తుంది.
  3. చెట్లను పెంచండి – భూమిని కాపాడండి.
  4. ప్లాస్టిక్ సంచులు మానండి – గుడ్డ సంచులు వాడండి.

ప్రశ్న 3.
నైరుతి ఋతుపవనాల గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:

  1. వేసవిలో భారత ఉపఖండం మీద తీవ్ర అల్పపీడన వ్యవస్థ ఏర్పడుతుంది.
  2. అదే సమయంలో హిందూ మహాసముద్రంలో అధిక పీడనం ఉంటుంది.
  3. ఈ అధిక పీడన ప్రాంతం నుండి పైన పేర్కొన్న అల్పపీడన ప్రాంతం వైపు వీచే గాలులే నైఋతి ఋతుపవనాలు.
  4. నైఋతి భుతుపవనాలు అరేబియా సముద్ర శాఖ, బంగాళాఖాతం శాఖ అనే రెండు శాఖలుగా విడిపోతాయి.
  5. ఈ ఋతుపవనాలు భారతదేశానికి జూన్ మొదట్లో చేరుకుంటాయి. 6) ఇవి నాలుగు నుండి ఐదు వారాలలో క్రమేపీ దేశమంతా వ్యాపిస్తాయి.
  6. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైఋతి ఋతుపవన కాలంలో సంభవిస్తుంది.

ప్రశ్న 4.
దిగువ పటమును పరిశీలించి (a), (b) ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 1
a) రాజస్థాన్లో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి?
b) ఋతుపవనాల ఆరంభం అనగానేమి?
జవాబు:
a) రాజస్థాన్లో నైఋతి’ ఋతుపవనాలు ప్రవేశించే సమయం : 15 జూలై
b) ఋతుపవనాల ఆరంభం అనగా

  • వేసవిలో భారత ఉపఖండంలో అల్పపీడనం ఏర్పడుతుంది.
  • అదే సమయంలో హిందూ మహాసముద్రంలో అధిక పీడనం ఉంటుంది.
  • జూన్ ప్రారంభంలో ఈ అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి ఋతుపవనాలు ప్రవేశించడాన్ని ఋతుపవనాల ఆరంభం అంటారు.

ప్రశ్న 5.
మ్యాపును పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబిమ్ము.
AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 3
i) జనవరి నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న రెండు రాష్ట్రాల పేర్లు రాయండి.
జవాబు:
జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్.

ii) మధ్యప్రదేశ్ గుండా పోవుచున్న సమోష్ణోగ్రత రేఖ చూపు ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
20°C

ప్రశ్న 6.
ట్రేడ్ విండ్స్ గురించి రాయండి.
జవాబు:
ఉత్తరార్ధ గోళంలో ఉప అయనరేఖా అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి. ఇవి భూమధ్యరేఖ వద్ద ఉండే అల్ప పీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి. వీటిని వ్యాపార పవనాలు (ఇంగ్లీషులో “ట్రేడ్ విండ్స్”) అంటారు. ట్రేడ్ అన్న జర్మన్ పదానికి ట్రాక్’ అని అర్థం. అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం.

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 7.
మామిడి జల్లుల గురించి రాయండి.
జవాబు:
సాధారణంగా వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో ‘తొలకరి జల్లులు’ పడతాయి. భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి, ఇతర పండ్లు త్వరగా పండటానికి ఈ వానలో దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని ఆంధ్రప్రదేశ్ లో స్థానికంగా “మామిడి జల్లులు” అని అంటారు.

ప్రశ్న 8.
ఋతుపవనాలు అని వేటిని పిలుస్తారు?
జవాబు:
భారతదేశంలోని శీతోష్ణస్థితి ఋతుపవనాల వల్ల గణనీయంగా ప్రభావితమౌతుంది. గతంలో భారతదేశానికి వచ్చిన నావికులు గాలులు వీచే దిశ క్రమం తప్పకుండా మారుతుండటాన్ని గమనించారు. ఈ గాలుల సహాయంతో వాళ్లు భారతదేశ తీరం వైపుకి ప్రయాణించేవాళ్లు. ఇలా కాలానుగుణంగా గాలుల దిశ మరడాన్ని అరబ్ వర్తకులు “మాన్సూన్” అని పేరు పెట్టారు. వీటిని మనం ఋతుపవనాలు అని పిలుస్తాం.

ప్రశ్న 9.
అక్టోబరు వేడిమి అంటే ఏమిటి?
జవాబు:
వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య అక్టోబరు, నవంబరు నెలలు సంధికాలంగా ఉంటాయి. తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండడమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. నేల ఇంకా తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని సాధారణంగా “అక్టోబర్ వేడిమి” అంటారు.

ప్రశ్న 10.
సాంప్రదాయ భారతీయ కాలాలను గూర్చి ఒక పట్టిక తయారు చేయంది.
జవాబు:
సాంప్రదాయ భారతీయ కాలాలు

ఋతువులు తెలుగు నెలలు
(చాంద్రమాన సంవత్సరం)
ఇంగ్లీషు నెలలు
(సూర్యమాన సంవత్సరం)
వసంతం చైత్రం – వైశాఖం మార్చి – ఏప్రిల్
గ్రీష్మం జ్యేష్ఠ – ఆషాఢం మే – జూన్
వర్ష శ్రావణం – భాద్రపదం జులై – ఆగస్టు
శరత్ ఆశ్వీయుజం – కార్తీకం సెప్టెంబరు – అక్టోబరు
హేమంత మార్గశిర — పుష్యం నవంబరు – డిసెంబరు
శిశిరం మాఘం – ఫాల్గుణం జనవరి – ఫిబ్రవరి

ప్రశ్న 11.
హరిత గృహ ప్రభావం అంటే ఏమిటి?
జవాబు:
వాతావరణం చేసే ముఖ్యమైన పనులలో మనల్ని వెచ్చగా ఉంచటం ఒకటి. ఇది భూమిని కప్పి ఉంచే తేలికపాటి, బాగా పనిచేసే దుప్పటిలాంటిది. భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుుంది. దీనిని “హరిత గృహప్రభావం” అంటాం. భూమి మీద ప్రాణం మనుగడకు ఇది ఎంతో ముఖ్యం. భూమిపైన వాతావరణమే లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది.

ప్రశ్న 12.
భూగోళం వేడెక్కడం అంటే ఏమిటి?
జవాబు:
ఇంతకుముందు భూమి వేడెక్కటానికి లేదా చల్లబడటానికి చాలా సమయం పట్టింది. దీనివల్ల భూమి మీద ప్రాణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారటానికి సమయం దొరికింది. ఇప్పుడు భూమి చాలా తొందరగా వేడెక్కుతోంది, ఇది వినాశకర మార్పులకు దారి తీయవచ్చు. పారిశ్రామిక విప్లవం తరువాత భూమి వేడెక్కటానికి కారణం మానవ చర్యలే. కాబట్టి ప్రస్తుతం భూమి వేడెక్కటాన్ని మానవ కారణంగా “భూగోళం వేడెక్కటం” అంటారు.

ప్రశ్న 13.
టంద్రాల వద్ద నున్న మంచు కరిగితే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు ఉత్తర అక్షాంశాల వద్ద గల గడ్డ కట్టిన టండ్రాల కింద (ప్రధానంగా ఉత్తర రష్యా విశాల భూభాగం కింద) పెద్ద మొత్తంలో మిథేన్ వాయువు ఉందని కనుక్కున్నారు. భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నకొద్దీ టండ్రాలలో గడ్డకట్టిన మంచు మరింతగా కరుగుతుంది. ఫలితంగా మంచు కింద ఉన్న మీథేన్ వాతావరణంలోకి విడుదల అవుతుంది. ఇది. ఒక విషవలయంగా మారుతుంది. హరితగృహ వాయువుగా (Green house gas) కార్బన్ డై ఆక్సైడ్ మిథేన్ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది.

ప్రశ్న 14.
సగటు ఉష్ణోగ్రతలు 2°C పెరగడం ప్రమాదమా?
జవాబు:
సగటు ఉష్ణోగ్రతలు 2 సెంటీగ్రేడులు పెరగటం చాలా తక్కువ అనిపించవచ్చు. కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్రమట్టం ఒక మీటరు పెరుగుతుంది. మన తీరప్రాంతాలలో చాలావరకు దీనివల్ల ప్రభావితం అవుతాయి, కోట్లాది మందిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. వీళ్లు తమ జీవనోపాధిని కోల్పోతారు.

ప్రశ్న 15.
వేసవి తీవ్రంగా ఉండే నెలల్లో కూడా హిమాలయ ప్రాంతాలలోని సిమ్లా, గుల్మార్, నైనితాల్, డార్జిలింగ్ వంటి వేసవి విడిదిలలో చాలా చల్లగా ఉంటుందని మీరు విని ఉంటారు. అదే విధంగా పశ్చిమ కనుమలలోని కొడైకెనాల్, ఉదగమండలం (ఊటీ) వంటి ప్రాంతాలలో తీర ప్రాంతాలలో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
పై పేరాను చదివి, క్రింది ప్రశ్నకు జవాబు వ్రాయుము.
ప్రశ్న : వేసవిలో కోల్ కతా కన్నా డార్జిలింగ్ లో ఆహ్లాదకర వాతావరణం ఎందుకు ఉంటుంది?
జవాబు:

  1. సముద్రమట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది.
  2. కావున మైదాన ప్రాంతాల కంటే కొండ, పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
  3. ప్రదేశ శీతోష్ణస్థితి ఎత్తుతో కూడా ప్రభావితం అవుతుంది. ఎత్తైన ప్రాంతంలో ఉండటం వలన డార్జిలింగ్ వాతావరణం వేసవికాలంలో కోల్ కతాతో పోలిస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది.

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 16.
క్రింది పట్టికను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఋతువులు తెలుగు నెలలు
(చాంద్రమాన సంవత్సరం)
ఇంగ్లీషు నెలలు
(సూర్యమాన సంవత్సరం)
వసంతం చైత్రం – వైశాఖం మార్చి – ఏప్రిల్
గ్రీష్మం జ్యేష్ఠ – ఆషాఢం మే – జూన్
వర్ష శ్రావణం – భాద్రపదం జులై – ఆగస్టు
శరత్ ఆశ్వీయుజం – కార్తీకం సెప్టెంబరు – అక్టోబరు
హేమంత మార్గశిర — పుష్యం నవంబరు – డిసెంబరు
శిశిరం మాఘం – ఫాల్గుణం జనవరి – ఫిబ్రవరి

1) వసంత ఋతువు ఏ ఏ మాసాలలో వస్తుంది?
జవాబు:
చైత్రం, వైశాఖం

2) గ్రీష్మ ఋతువులో వాతావరణం ఎలా ఉంటుంది?
జవాబు:
చాలా ఎండగా, వేడిగా ఉంటుంది.

3) తెలుగు నెలలలో నెల ఎప్పుడు మొదలవుతుంది?
జవాబు:
అమావాస్య తరువాత పాడ్యమి నుండి మొదలవుతుంది.

4) చలిగా ఉండే ఋతువు ఏది?
జవాబు:
చలిగా ఉండే ఋతువు హేమంత ఋతువు.

5) ఆకురాలు కాలం ఏది?
జవాబు:
ఆకురాలు కాలం శిశిర ఋతువు.

ప్రశ్న 17.
వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య అక్టోబరు, నవంబరు నెలలు సంధి కాలంగా ఉంటాయి. తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండడమే.కాక ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. నేల ఇంకా తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని సాధారణంగా ‘అక్టోబర్ వేడిమి’ అంటారు.
ప్రశ్న : తిరోగమన ఋతుపవనాల ముఖ్య లక్షణాలను తెలపండి.
జవాబు:

  1. తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
  2. నేల తేమగా ఉండి, అధిక ఉష్ణోగ్రత, అధిక తేమల కారణంగా వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది. అదే అక్టోబర్ వేడిమి.
  3. ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలో తుపానులు, వాయుగుండాలు ఏర్పడతాయి.
  4. కోరమండల్ ప్రాంతంలో అధికశాతం వర్షం, తుపానులు, వాయుగుండాల వల్ల సంభవిస్తుంది.

ప్రశ్న 18.
సాంప్రదాయ భారతీయ కాలాలు

ఋతువులు తెలుగు నెలలు
(చాంద్రమాన సంవత్సరం)
ఇంగ్లీషు నెలలు
(సూర్యమాన సంవత్సరం)
వసంతం చైత్రం – వైశాఖం మార్చి – ఏప్రిల్
గ్రీష్మం జ్యేష్ఠ – ఆషాఢం మే – జూన్
వర్ష శ్రావణం – భాద్రపదం జులై – ఆగస్టు
శరత్ ఆశ్వీయుజం – కార్తీకం సెప్టెంబరు – అక్టోబరు
హేమంత మార్గశిర — పుష్యం నవంబరు – డిసెంబరు
శిశిరం మాఘం – ఫాల్గుణం జనవరి – ఫిబ్రవరి

అ) మన దేశానికి వర్షాకాలం ఏ ఏ ఋతువులలో ఉంటుంది?
అ) వసంత, గ్రీష్మ ఋతువులలో మనదేశంలో ఏ కాలం ఉంటుంది?
ఇ) నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఏ కాలం ఉంటుంది?
ఈ) జనవరి, ఫిబ్రవరిలలో ఏ ఋతువు ఉంటుంది?
జవాబు:
అ) మన దేశానికి వర్షాకాలం వర్ష మరియు శరత్ ఋతువులలో ఉంటుంది.
ఆ) వసంత, గ్రీష్మ ఋతువులలో మనదేశంలో వేసవికాలం ఉంటుంది.
ఇ) నవంబరు నుండి ఫిబ్రవరి వరకు చలికాలం ఉంటుంది.
ఈ) జనవరి, ఫిబ్రవరి నెలలలో శిశిర ఋతువు ఉంటుంది.

ప్రశ్న 19.
మే నెలలో భారతదేశ సగటు ఉష్ణోగ్రతలు చూపే క్రింది పటాన్ని పరిశీలించి, క్రింది పట్టిక పూరించండి.
AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 6
జవాబు:

ప్రాంతము సగటు ఉష్ణోగ్రత (దాదాపు)
సిమ్లా 25°C
జైపూర్ 30°C
బెంగళూరు 20°C
చెన్నై 30°C

10th Class Social 4th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది పేరాగ్రాను చదివి వ్యాఖ్యానించండి.
ప్రపంచ వ్యాప్తంగా అనేక శాస్త్రజ్ఞులు ఒక విషయంపై ఏకీభవిస్తున్నారు. మానవ కారణంగా భూగోళం వేడెక్కుతోంది అన్నది వాస్తవం. ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. రాబోయే సంవత్సరాలలో వాతావరణంలో తీవ్ర పరిణామాలు సంభవించవచ్చని, జీవ మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.
జవాబు:

  • భూమి మీద (వాతావరణం, జలావరణం) సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోవటాన్నే భూగోళం వేడెక్కడం అంటున్నారు.
  • అనేక మానవజనిత (మానవ కార్యకలాపాల) కారణాల వలన భూమి వేడెక్కడం, భౌమ్య వ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణమవుతుంది.

భూగోళం వేడెక్కటాన్ని ప్రభావితం చేసే మానవ కార్యకలాపాలు :

  1. భూగోళం వేడెక్కటానికి దోహదం చేసే మానవ కారణాలలో ‘అడవులను నరికివేయడం’ ప్రధానమైనది.
  2. ‘పారిశ్రామిక కాలుష్యం’ – ఇది పారిశ్రామిక విప్లవం తర్వాత ఎక్కువైంది.
  3. విపరీతంగా పెరిగిన ‘శిలాజ ఇంధనాల’ వినియోగం.
  4. ఎయిర్ కూలర్స్, ఎ.సి.లు, రిఫ్రిజిరేటర్ల (CFC, IFC ల) వాడకం ఎక్కువ కావడం.
  5. జనాభా విపరీతంగా పెరిగిపోవడం వలన, ఆధునిక వ్యవసాయ, పారిశ్రామిక పద్దతులు గ్రీన్ హౌస్ వాయువుల (CO<sub>2</sub>, మీథేన్ మొదలైన) విడుదలకు కారణమవుతున్నాయి.
  6. గనుల తవ్వకం, అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు.

భూగోళం వేడెక్కడం వలన కలిగే దుష్ప్రభావాలు :

  1. భౌమ్య వ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఆవరణ సమతౌల్యం దెబ్బతింటుంది.
  2. ధృవ ప్రాంతాలలోని మంచు కరిగి, సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగిపోయి నీటి ప్రళయం సంభవించవచ్చు.
  3. కాలాలు నిర్ణీత ఋతువులలో రావు.
  4. వరాలు (ఋతుపవనాలు) తక్కువగా పడటం లేదా అసలు పడకపోవటం లేదా క్రమం తప్పి పడటం లాంటివి సంభవిస్తాయి.

భూగోళం వేడెక్కడాన్ని తగ్గించటానికి కొన్ని చర్యలు / సూచనలు :

  1. చెట్లను చక్కగా సంరక్షించాలి. అటవీ నిర్మూలనను నిరోధించాలి.
  2. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించి, సౌరశక్తి, పవనశక్తి లాంటి పునర్వినియోగ సామర్థ్యం గల ఇంధనాల్ని వాడాలి.
  3. వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజారవాణా వ్వవస (R.T.C., Metro Road) ను ఉపయోగించాలి.
  4. ఏ.సి.లు, రిఫ్రిజిరేటర్ల వాడకం తగ్గించాలి.
  5. రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులను వాడాలి.
  6. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యాన్ని నివారించుటకు ప్రజలు, ప్రభుత్వం నిధులు కేటాయించి, చిత్తశుద్ధితో పనిచేయాలి.

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 2.
భారత వ్యవసాయరంగానికి ఋతుపవనాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఋతుపవనాల క్రమాన్ని వివరించండి.
జవాబు:

  1. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థకు ప్రాణమైన వ్యవసాయం ఋతుపవన వర్చాలపై అత్యధికంగా ఆధారపడి ఉంది.
  2. భారత ఉపఖండం, హిందూ మహాసముద్రాల మధ్య ఋతువులను అనుసరించి మార్చి మధ్య నుండి సెప్టెంబర్ మధ్య వరకు గల ఆరుమాసాల పాటు నైరుతి దిశ నుండి, మరో ఆరు నెలల పాటు సెప్టెంబర్ మధ్య నుండి మార్చి వరకు ఈశాన్య దిశ నుండి వీస్తాయి.
  3. ఉష్ణోగ్రతలలోని వైవిధ్యం అంతర అయన రేఖా అభిసరణ స్థానం, ట్రోపో ఆవరణం పై భాగంలో వాయు ప్రసరణం వంటి అనేక కారణాల వల్ల ఈ ఋతుపవనాలు ఏర్పడుతున్నాయి.
  4. వేసవిలో భారత భూభాగం పై తీవ్ర అల్పపీడన వ్యవస్థ ఏర్పడుతుంది. అదే సమయంలో భూ భాగాన్ని ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో అధిక పీడనం ఉంటుంది.
  5. ఈ అధిక పీడన ప్రాంతం నుండి పైన పేర్కొన్న అల్పపీడన ప్రాంతం వైపు గాలులు వీయడాన్నే నైరుతి ఋతుపవనాలు అంటారు.
  6. శీతాకాలంలో పైన పేర్కొన్న పీడన వ్యవస్థలు వ్యతిరేకంగా అవడంతో పవనాలు కూడా వ్యతిక్రమము అవుతాయి. , అనగా పవనాలు భూభాగం నుండి సముద్రభాగం వైపు ఈశాన్యదిశ నుండి వీస్తాయి. కాబట్టి వాటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు.

ప్రశ్న 3.
క్రింది స్లైమోగ్రాఫీలను పరిశీలించి, తగిన సమాధానములను వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 4
a) చెన్నై వర్షాకాలానికి, జైపూర్ వర్షాకాలానికి మధ్య తేడా ఎందుకు ఉంది?
b) జైపూర్ లో అత్యధిక ఉష్ణోగ్రత ఏ నెలలో నమోదు అయినది?
c) ఈ రెండింటిలో ఏ ప్రాంతము అత్యధిక వర్షపాతమును పొందును?
d) పై రెండు ప్రాంతాలు వర్షచ్ఛాయా ప్రాంతాలేనా? ఏ విధంగా దీనిని సమర్థిస్తావు?
జవాబు:
a) నైఋతి ఋతుపవనాల వలన జైపూర్ లోనూ, ఈశాన్య ఋతుపవనాల వలన చెన్నైలోనూ వర్షపాతం పడుతుంది. కనుక చెన్నై వర్షాకాలానికి, జైపూర్ వర్షాకాలానికి మధ్య తేడా ఉంది.
b) మే
c) చెన్నై
d) అవును. నైఋతీ ఋతుపవన కాలంలో జైపూర్ మరియు చెన్నై వర్షచ్చాయా ప్రాంతాలే.
(లేదా)
ఈశాన్య ఋతుపవన కాలంలో చెన్నై వర్షచ్ఛాయా ప్రాంతం కాదు.

ప్రశ్న 4.
ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది శాస్త్రజ్ఞులు ఒక విషయంపై ఏకీభవిస్తున్నారు. మానవ కారణంగా భూగోళం వేడెక్కుతోంది అన్నది వాస్తవం. ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. రాబోయే సంవత్సరాలలో వాతావరణంలో తీవ్ర పరిణామాలు సంభవించవచ్చని, జీవ మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. భూగోళం వేడెక్కటానికి దోహదం చేసే మానవ కారణ అంశాలలో అడవిని నరికివెయ్యటం ఒకటి.
ప్రశ్న : పై అంశాన్ని చదివి, ‘శీతోష్ణస్థితి మార్పు’ గురించి వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. శీతోష్ణస్థితిలో అతివేగంగా జరిగే మార్పులు భూమిపై జీవుల మనుగడని ప్రభావితం చేస్తాయి.
  2. సగటు ఉష్ణోగ్రతలు పెరగడం వలన సముద్ర మట్టాలు పెరుగుతాయి.
  3. తీరప్రాంతాలలో జనావాసాలు ముంపునకు గురవుతాయి.
  4. ప్రజలు తమ జీవనోపాధులు కోల్పోతారు.
  5. వర్షపాతంలో ఊహించని మార్పులు వస్తాయి.
  6. వరదలు, కరవులూ రావచ్చు.
  7. వ్యవసాయం ప్రభావితమవుతుంది.
  8. వాతావరణ మార్పు అన్నది ప్రపంచస్థాయిలో జరుగుతుంది. కాబట్టి దానివల్ల మనమందరం ప్రభావితమవుతాం.

ప్రశ్న 5.
దిగువ ను పరిశీలించి, విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 5
జవాబు:
ఈ పైన ఇవ్వబడిన గ్రాఫ్ క్లైమోగ్రాఫ్. ఈ గ్రాఫ్ మనకు చెన్నై నగరం యొక్క ఉష్ణోగ్రత మరియు వర్షపాతాలను తెలియచేస్తుంది. ఈ గ్రాఫ్ మనకు గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతాలను తెలియచేస్తుంది. ఈ గ్రాఫ్ లోని గణాంకాలను గమనించినట్లయితే నవంబర్ నెలలో వర్షపాతం అత్యధికంగా అంటే 350 మి.మీ.గా ఉన్నది. మే, జూన్ నెలలలో ఉష్ణోగ్రత అత్యధికంగా అంటే 37°C, 38°C. అతి తక్కువ ఉష్ణోగ్రతలు డిసెంబరు మరియు జనవరి నెలలలో 21°C, 22°C గా నమోదయ్యాయి. చెన్నై నగరం తూర్పు తీరప్రాంతంలో ఉన్నది. భారతదేశంలో నైఋతి ఋతుపవనాల వలన ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది. కానీ ఈ సమయంలో చెన్నెలో వర్షపాతం సంభవించదు. తిరోగమన ఋతుపవన కాలంలో చెన్నైలో నవంబరు, డిసెంబరు మాసాలలో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుంది.

నవంబరు మరియు డిసెంబరు నెలలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలతోపాటు ఎక్కువ వర్షపాతం నమోదు అవడంతో ఎక్కువ చలిగా ఉంటుంది.

ప్రశ్న 6.
శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే కారకాలను పేర్కొని, ఏవైనా రెండింటిని వివరించండి.
జవాబు:
శీతోష్ణస్థితిని ప్రభావితం చేయు అంశాలు :

  1. అక్షాంశము
  2. భూమికి నీటికి గల సంబంధం
  3. భౌగోళిక స్వరూపం
  4. ఉపరితల గాలి ప్రసరణ

1) అక్షాంశం లేదా భూమధ్యరేఖ నుంచి దూరం :
భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్యరేఖకి దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి. కన్యాకుమారిలోని శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణస్థితి కంటే భిన్నంగా ఉండటానికి శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణస్థితి కంటే భిన్నంగా ఉండటానికి ఇది ఒక కారణం. భారతదేశం సుమారుగా 8° ఉత్తర –37″ ఉత్తర రేఖాంశాల మధ్య ఉంది. భారతదేశాన్ని కర్కట రేఖ ఇంచుమించు రెండు సమభాగాలుగా చేస్తుంది. కర్కటరేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది.. కర్కటరేఖ ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది.

2) భూమికి – నీటికి గల సంబంధం : దక్షిణ ప్రాంతంలోని అధికభాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు, రాత్రుల ఉష్ణోగ్రతలలో, అదే విధంగా వేసవి, శీతాకాలాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు. దీనిని “సమ శీతోష్ణస్థితి” అంటారు. ఒకే అక్షాంశం మీద సముద్రం నుంచి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే సముద్ర ప్రభావం ఏమిటో బాగా తెలుస్తుంది.

ప్రశ్న 7.
“శిలాజ ఇంధనాలు – ప్రధానంగా బొగ్గు – వినియోగించకపోతే తమ ఆర్థిక ప్రగతి తీవ్రంగా కుంటుపడుతున్నదని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి.” ఒక దేశ అభివృద్ధికి శిలాజ ఇంధనాల వినియోగం తప్పనిసరియేనా? వ్యాఖ్యానించుము.
జవాబు:

  • ఒక దేశ అభివృద్ధికి శిలాజ ఇంధనాల వినియోగం కొంతమేర తప్పనిసరి, కొంతమేర అభివృద్ధి సాధించిన తర్వాత వాటి వినియోగం తగ్గించాలి అని అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన సమర్ధనీయమే.
  • నేడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఒకప్పుడు శిలా ఇంధనాల వినియోగం ద్వారానే అభివృద్ధి చెందాయని గుర్తు చేసుకోవాలి.
  • శిలాజ ఇంధనాలు వినియోగించకపోతే ఆర్థిక ప్రగతి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆందోళన పడుతున్నాయి.
  • ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రగతిని సాధించటానికి ప్రత్యామ్నాయాలను (సంప్రదాయ ఇంధన వనరులను) చూపడంతో అభివృద్ధి చెందిన దేశాలు తోడ్పాటు అందివ్వాల్సి ఉంది.

ప్రశ్న 8.
జెట్ ప్రవాహం – భారతదేశం గురించి రాయండి.
జవాబు:
భారతదేశ శీతోష్ణస్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది, ఈ ప్రవాహాలను ‘జెట్ ప్రవాహం’ అంటారు. నేలనుంచి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేఖలలో వేగంగా ప్రవహించేగాలులు ఇవి. ఈ గాలుల వేగం గంటకి వేసవిలో 110 కిలోమీటర్లు, శీతాకాలంలో 184 కిలోమీటర్లు మధ్య ఉంటుంది. 25° ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇటువంటి జెట్ ప్రవాహం వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది. తూర్పు జెట్ స్లీం యొక్క చల్లబరిచే ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి.

ప్రశ్న 9.
“ఓజోను మనకు రక్షక కవచం” – వివరించండి.
జవాబు:
మండుతున్న బంతినుంచి భూగోళం ఏర్పడిన క్రమంలో ఎన్నో వాయువులు వెలువడ్డాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ వాయువులు రోదసిలోకి తప్పించుకోలేదు. భూమ్యాకర్షణ శక్తి ఈ వాయువులను ఇంకా పట్టి ఉంచుతోంది. ఫలితంగా భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది. దీనివల్ల ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం పీల్చుకునే ప్రాణవాయువు (ఆక్సీజన్), సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోను పొర, మనకు అవసరమైన మాంసకృత్తులు తయారుచేయడానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని మొదలైనవి. అంతేకాకుండా ఈ వాతావరణం మనలను వెచ్చగా ఉంచుతుంది, నీటి చక్రం కూడా దీనిగుండా ఏర్పడుతుంది. (తొమ్మిదవ తరగతిలోని 4వ అధ్యాయంలోని చిత్రం చూడండి.)

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 10.
భారతదేశంలో ఋతుపవన విధానాన్ని వివరించండి.
జవాబు:

  1. ఉష్ణప్రాంతంలో సుమారుగా 20°ఉ – 20°ద అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి.
  2. నైఋతి ఋతుపవనాలు అరేబియా సముద్రశాఖ, బంగాళాఖాతం శాఖలుగా జూన్ మొదట్లో ‘ఋతుపవనారంభం’ కలుగజేస్తాయి.
  3. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైఋతి ఋతుపవన కాలంలో సంభవిస్తుంది.
  4. ఈ కాలంలో తమిళనాడులోని కోరమండల్ తీరంలో అంతగా వర్షం కురవదు.
  5. తిరోగమన ఋతుపవన సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటమే కాకుండా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
  6. ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలో తుపానులు, వాయుగుండాలు ఏర్పడతాయి.
  7. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఉండదు.
  8. ఈ కాలంలో కోరమండల్ తీరప్రాంతంలో అధికశాతం వర్షం, తుపానులు, వాయుగుండాల వల్ల సంభవిస్తుంది.

ప్రశ్న 11.
సాంప్రదాయ భారతీయ కాలాలు

ఋతువులు తెలుగు నెలలు
(చాంద్రమాన సంవత్సరం)
ఇంగ్లీషు నెలలు
(సూర్యమాన సంవత్సరం)
వసంతం చైత్రం – వైశాఖం మార్చి – ఏప్రిల్
గ్రీష్మం జ్యేష్ఠ – ఆషాఢం మే – జూన్
వర్ష శ్రావణం – భాద్రపదం జులై – ఆగస్టు
శరత్ ఆశ్వీయుజం – కార్తీకం సెప్టెంబరు – అక్టోబరు
హేమంత మార్గశిర — పుష్యం నవంబరు – డిసెంబరు
శిశిరం మాఘం – ఫాల్గుణం జనవరి – ఫిబ్రవరి

పై పట్టిక చదివి, క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
1) మన దేశానికి వర్షాకాలం ఏ ఏ ఋతువులలో ఉంటుంది?
జవాబు:
మన దేశానికి వర్షాకాలం వర్ష మరియు శరత్ ఋతువులలో ఉంటుంది.

2) వసంత, గ్రీష్మ ఋతువులలో మనదేశంలో ఏ కాలం ఉంటుంది?
జవాబు:
వసంత, గ్రీష్మ ఋతువులలో మనదేశంలో వేసవికాలం ఉంటుంది.

3) నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఏ కాలం ఉంటుంది?
జవాబు:
నవంబరు నుండి ఫిబ్రవరి వరకు చలికాలం ఉంటుంది.

4) జనవరి, ఫిబ్రవరిలలో ఏ ఋతువు ఉంటుంది?
జవాబు:
జనవరి, ఫిబ్రవరి నెలలలో శిశిర ఋతువు ఉంటుంది.

ప్రశ్న 12.
AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 3
పై పటం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
1) 157 సెం.గ్రే. ఉష్ణోగ్రత నమోదయ్యే కొన్ని ప్రాంతాలను పేర్కొనుము.
జవాబు:
15° సెం, గ్రే, ఉష్ణోగ్రత నమోదయ్యే కొన్ని ప్రాంతాలు : మధ్య రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, డార్జిలింగ్ మరియు ఉత్తర అసోం మొదలైనవి.

2) తమిళనాడు, కేరళ, కర్ణాటకలలోని మైదానాలలో ఎంత ఉష్ణోగ్రత నమోదు అవుతుంది?
జవాబు:
తమిళనాడు, కేరళ, కర్ణాటక మైదానాలలో 20° సెం.గ్రే. ఉష్ణోగ్రత నమోదు అవుతుంది.

3) మధ్య భారతంలో సగటు ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
జవాబు:
మధ్య భారతంలో సగటు ఉష్ణోగ్రత 200 సెం.గ్రే. ఉంటుంది.

4) సగటు ఉష్ణోగ్రతలు 250 సెం.గ్రే. ఉండే ప్రాంతాలకు దగ్గరగా 200 సెం.గ్రే. ఉష్ణోగ్రత ఉండే చిన్న వృత్తాకార ప్రాంతం ఉంది. ఇది ఎలా సాధ్యం?
జవాబు:
సముద్రతీర ప్రాంతాలలో సముద్రం నుంచి వీచే వేడి గాలుల వలన 25°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే తీరం నుంచి దూరం వెళ్ళేకొద్దీ ఈ వేడిగాలుల ప్రభావం ఉండకపోవడం వలన ఉష్ణోగ్రత 20°C మాత్రమే ఉంటుంది.

AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 13.
“భారతదేశ నైరుతి ఋతుపవనాల ప్రవేశం” పటాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
భారతదేశం – నైరుతి ఋతుపవనాల ప్రవేశం
పై పటాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
1) నైరుతి ఋతుపవనాలు ముందుగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి?
జవాబు:
నైరుతి ఋతుపవనాలు ముందుగా కేరళ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి.

2) దేశరాజధాని (ఢిల్లీ) ప్రాంతానికి ఋతుపవనాలు ఎప్పుడు చేరుతాయి?
జవాబు:
జూలై 1 నాటికి ఋతుపవనాలు ఢిల్లీ ప్రాంతానికి చేరుతాయి.

3) గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లకు ఏ తేదికి చేరుకుంటాయి?
జవాబు:
జూన్ 15 నాటికి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లకు చేరుకుంటాయి.

4) జూన్ 5వ తేదీకి ఋతుపవనాలు ఏ ఏ రాష్ట్రాలకు విస్తరిస్తాయి?
జవాబు:
జూన్ 5వ తేదీ నాటికి ఋతుపవనాలు కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లకు విస్తరిస్తాయి.

ప్రశ్న 14.
భారతదేశ భౌగోళిక పటంలో కింది వానిని గుర్తించండి.
i) 40 సెం.గ్రే. కన్నా ఎక్కువ సంవత్సర సగటు ఉష్ణోగ్రతను నమోదు చేసిన ప్రాంతాలు.
ii) 100 సెం.గ్రే. కన్నా తక్కువ సంవత్సర సగటు ఉష్ణోగ్రతను నమోదు చేసిన ప్రాంతాలు.
iii) భారతదేశంపై వీచే నైరుతి ఋతుపవనాల దిశామార్గం.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 7

AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

These AP 10th Class Social Studies Important Questions 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి will help students prepare well for the exams.

AP Board 10th Class Social 3rd Lesson Important Questions and Answers ఉత్పత్తి, ఉపాధి

10th Class Social 3rd Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల, సేవల మార్కెటు విలువను ఏది నమోదు చేస్తుంది?
జవాబు:
స్థూల దేశీయోత్పత్తి (GDP),

2. మాధ్యమిక వస్తువు కానిది క్రింది వానిలో ఏది?
ఇడ్లీ, వడ్లు, ఊక, బియ్యం
జవాబు:
ఇడ్లీ.

3. భారతదేశంలో ఆర్థిక సం||రం అంటే?
జవాబు:
ఏప్రిల్ 1 నుండి మార్చి 31

4. భారతదేశంలో అత్యధిక జనాభాకు ఉపాధిని అందించే రంగం ఏది?
జవాబు:
వ్యవసాయం.

5. భారతదేశంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారి శాతము ఎంత?
జవాబు:
92%

6. 1972 నుండి స్థూల దేశీయోత్పత్తిలో ఏ రంగం యొక్క వాటా క్రమేణా తగ్గుతున్నది?
జవాబు:
వ్యవసాయం

AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

7. ‘గనుల తవ్వకం’ ఏ రంగానికి చెందినది?
జవాబు:
ప్రాథమిక (వ్యవసాయ రంగం

8. మత్స్య పరిశ్రమ ఏ రంగానికి చెందినది?
జవాబు:
ప్రాథమిక (వ్యవసాయ) రంగం

9. అడవులు ఏ రంగానికి చెందినది?
జవాబు:
ప్రాథమిక (వ్యవసాయ) రంగం

10. ప్రకృతి ప్రధాన పాత్ర వహించే రంగం ఏది?
జవాబు:
ప్రాథమిక (వ్యవసాయ) రంగం

11.వస్తువులను నేరుగా తయారు చేయని రంగం ఏది?
జవాబు:
సేవా రంగం

12. క్రింది వానిలో అంతిమ వస్తువు కానిది ఏది?
కారు, నోటుబుక్, టి.వి., టైర్లు
జవాబు:
టైర్లు

13. క్రింది వానిలో మాధ్యమిక వస్తువు కానిది ఏది?
పెట్రోల్, మెటల్స్, కాగితపు గుజ్జు, కంప్యూటర్
జవాబు:
కంప్యూటరు

14. పూర్తి సామర్థ్యానికి తగినంతగా, తగినట్లుగా పని దొరకని స్థితిని ఏమంటారు?
జవాబు:
అల్ప ఉపాధి

15. గత 50 సం||రాలలో అభివృద్ధి చెందిన దేశాలలో ఏ రంగం నుండి ఏ రంగానికి ప్రాధాన్యత మారుతుంది?
జవాబు:
పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి

16. మొత్తం ఉత్పత్తిలో ఏ రంగం ప్రముఖ స్థానంలో ఉంది?
జవాబు:
సేవల రంగం

17. బ్యాంకులు, జీవిత భీమా, హోటళ్ళు, వ్యాపారం, రవాణా, ప్రసారాలు, ఆర్థిక, స్థిరాస్తి, ప్రజాసామాజిక, వ్యక్తిగత సేవలు ఏ రంగానికి చెందుతాయి?
జవాబు:
సేవల రంగం

18. కనబడని అల్ప ఉపాధిని ఏమంటారు?
జవాబు:
ప్రచ్ఛన్న నిరుద్యోగం.

19. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలలో పనిచేస్తున్న వారి శాతం వరుసగా ఎంత?
జవాబు:
8%, 92%.

20. ఆర్ధిక వ్యవస్థను ప్రధానంగా ఎన్ని రంగాలుగా విభజించారు?
జవాబు:
3 రంగాలు.

21. GDP ని విస్తరింపుము.
జవాబు:
స్థూల దేశీయోత్పత్తి (గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్)

22. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించ
జవాబు:
వ్యవసాయం

AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

23. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనే మూడు రంగాల ఉత్పత్తి కలిపితే ఏమి వస్తుంది?
జవాబు:
స్థూల దేశీయోత్పత్తి

24. భారతదేశంలో ఇప్పటికి ఇదే ప్రధాన ఉపాధి రంగంగా ఉంది.
జవాబు:
వ్యవసాయం

25. దేశంలోని కార్మికులలో సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో ఉండి ………. వంతు ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారు.
జవాబు:
1/6 వంతు

26. GDP లో …….. శాతం వాటా ఉన్న పారిశ్రామిక, సేవారంగాలు మొత్తం కార్మికులలో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి.
జవాబు:
75%

27. ప్రచ్ఛన్న నిరుద్యోగుల్లోని వారు కొంత మంది వేరే పనికి వెళితే ఉత్పత్తిలో ఎలాంటి మార్పు వస్తుంది?
జవాబు:
మార్పు ఉండదు.

28. ఏ రంగంలోని ఉద్యోగాలు అందరూ కోరుకుంటారు?
జవాబు:
వ్యవస్థీకృత రంగం

29. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలోని ఎంత శాతం కుటుంబాలు సన్న, చిన్న కారు రైతుల కిందికి వస్తాయి?
జవాబు:
80%

30. కేవలం 8% వ్యవస్థీకృత రంగంలో ఉన్న కార్మికులు మొత్తం వస్తువులు, సేవలలో ఎంత శాతం ఉత్పత్తికి దోహదం చేశారు?
జవాబు:
50%

31. ఉపాధి షరతులు ఉండి, నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలకు ఏ రంగంగా వ్యవహరిస్తారు?
జవాబు:
వ్యవస్థీకృత

32. అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులలో సగం శాతం మంది ఎటువంటి ఉపాధి పొందుతున్నారు?
జవాబు:
స్వయం ఉపాధి

33. ఇతర వస్తువుల తయారీలో ఉపయోగించే వస్తువులను ఏమంటారు?
జవాబు:
మాధ్యమిక వస్తువులు

34. భారతదేశంలో ఇంతకు ముందు వ్యవసాయ క్షేత్రములో పనిచేసిన వాళ్లు ప్రస్తుతం వేటిలో ఎక్కువగా పని చేస్తున్నారు?
జవాబు:
కర్మాగారాలలో

35. 39 సం||రాల కాలంలో గణనీయంగా క్షీణించిన రంగం బడుతున్నా దేశం అభివృద్ధి తొలిదశల్లో ఏ రంగం ఏది? మరియు దాని అనుబంధ రంగాలు వాటి GDP పెరుగుదలకు అధికంగా దోహదం చేస్తాయి?
జవాబు:
వ్యవసాయ రంగం

36. 2011 జనాభా లెక్కల ప్రకారం 120 కోట్ల జనాభాలో పనిచేస్తున్న వారి సంఖ్య ఎంత?
జవాబు:
46 కోట్లు

37. నిర్ణీత సమయ ప్రకారం పనిచేయటం, సెలవు దినాలు ఉపయోగించుకోవటం ఏ రంగం లక్షణం?
జవాబు:
వ్యవస్థీకృత రంగం

38. క్రింది వారిలో అవ్యవస్థీకృత రంగ కార్మికులకు ఉదాహరణ కానిది రోజు వారీ కూలీలు, బజారులో అమ్మకాలు చేసే వాళ్లు, బరువులు మోసేవాళ్లు, ప్రభుత్వ కంపెనీలో ఉద్యోగి.
జవాబు:
ప్రభుత్వ కంపెనీ ఉద్యోగి.

39. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) ప్రాథమిక రంగం ( ) a) అభద్రత
ii) ద్వితీయ రంగం ( ) b) సేవలు
iii) తృతీయ రంగం ( ) c) భద్రత
iv) వ్యవస్థీకృత రంగం ( ) d) పరిశ్రమలు
v) అవ్యవస్థీకృత రంగం ( ) e) వ్యవసాయం
జవాబు:
i-e, ii-d, iii-b, iv- c, v-a

40. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) కొరియర్ బాయ్ ( ) a) సేవారంగం
ii) భవన నిర్మాణ ( ) b) అవ్యవస్థీకృత కార్మికుడురంగం
iii) ప్రభుత్వ ఉద్యోగి ( ) c) వ్యవస్థీకృతరంగం
iv) కారు ( ) d) మాధ్యమిక వస్తువు
v) టైర్లు ( ) e) అంత్య వస్తువు
జవాబు:
i – a, ii – b, iii – c, iv – e, v – d

41. సరియైన జతను ఎంచుకొని, రాయండి.
i) వ్యవస్థీకృత రంగంలో ఉపాధి ( ) a) 92%
ii) అవ్యవస్థీకృత రంగంలో ఉపాధి ( ) b) 8%
iii) వ్యవసాయ రంగంలో ఉపాధి ( ) c) 53%
iv) పరిశ్రమల రంగంలో ఉపాధి ( ) d) 22%
v) సేవల రంగంలో ఉపాధి ( ) e) 25%
జవాబు:
i – b, ii – a, iii – c, iv – d, v – e

42. 2009-10 సం||రంలో ఎంత శాతం గ్రామీణ కార్మికులు వ్యవసాయ రంగంలో ఉన్నారు?
జవాబు:
68%

AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

43. 2009-10 సం||రంలో ఎంత శాతం గ్రామీణ కార్మికులు పారిశ్రామిక రంగంలో ఉన్నారు?
జవాబు:
17%

44. 2009-10 సం||రంలో ఎంత శాతం గ్రామీణ కార్మికులు సేవల రంగంలో ఉన్నారు?
జవాబు:
15%

45. 2009-10 సం||రంలో ఎంత శాతం మహిళా కార్మికులు వ్యవసాయ రంగంలో ఉన్నారు?
జవాబు:
69%

46. 2009-10 సం||రంలో ఎంత శాతం మహిళా కార్మికులు పారిశ్రామిక రంగంలో ఉన్నారు?
జవాబు:
16%

47. 2009-10 సం॥రంలో ఎంత శాతం మహిళా కార్మికులు సేవల రంగంలో ఉన్నారు?
జవాబు:
15%

48. 2009-10 సం||రంలో వ్యవసాయ రంగంలో ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారు?
జవాబు:
53%

49. 2009-10 సం||రంలో పారిశ్రామిక రంగంలో ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారు?
జవాబు:
22%

50. 2009-10 సం||రంలో సేవల రంగంలో ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారు?
జవాబు:
25%

51. 2009-10 సం||రంలో GDPలో అత్యధిక వాటా ఏ పై వాక్యా లలో సరైనది ఏది? రంగం కలిగి ఉంది?
జవాబు:
సేవల రంగం

52. 2009-10 సం||రంలో GDPలో వ్యవసాయ రంగం వాటా ఎంత?
జవాబు:
17%

AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

53. 2009-10 సం||రంలో GDPలో పారిశ్రామిక రంగం వాటా ఎంత?
జవాబు:
26%

54. 2011-12 ఆర్థిక సం||రంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న గ్రామీణ కార్మికుల శాతం ఎంత?
జవాబు:
67%

55. 2011-12 ఆర్థిక సం||రంలో పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న పట్టణ కార్మికుల శాతం ఎంత?
జవాబు:
31%

56. 2011-12 ఆర్థిక సం||రంలో సేవల రంగంలో పనిచేస్తున్న పట్టణ కార్మికుల శాతం ఎంత?
జవాబు:
60%

56. a) ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కువగా ఏ రంగంలో కన్పిస్తుంది?
జవాబు:
వ్యవసాయ రంగం

57. భారతదేశంలో సేవారంగమునకు సంబంధించిన వ్యాఖ్యల సత్యము.
జవాబు:
→ సేవారంగం అభివృద్ధి చెందుతుండగా ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు కూడా సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి.
→ సేవారంగం అభివృద్ధి చెందుతున్నప్పటికి ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా అభివృద్ధి చెందడం లేదు.
→ సేవారంగం ఉన్నత విద్యావంతులకు మాత్రమే ఉపాధిని కల్పిస్తుంది.
→ GDPలో సేవారంగం యొక్క వాటా చాలా తక్కువగా ఉంది.
జవాబు:
సేవారంగం అభివృద్ధి చెందుతున్నప్పటికి ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా అభివృద్ధి చెందడం లేదు.

58. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) గత 50సం||రాలలో అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి ప్రాధాన్యత మారుతోంది.
ii) అయితే మొత్తం ఉత్పత్తిలో సేవారంగం ప్రముఖ స్థానంలో ఉంది.
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C) (I) మరియు (ii)

59. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) ఆదాయ స్థాయి ముఖ్యమైనప్పటికి అభివృద్ధిని సూచించటానికి ఇదొక్కటే సరిపోదు.
ii) మానవాభివృద్ధి నివేదిక విద్యాస్థాయి, అరోగ్యస్థితి కన్నా తలసరి ఆదాయానికి ఎక్కువ ప్రాధాన్యత
ఇచ్చింది.
– పై వాక్యా లలో సరైనది ఏది ?
A) (1) మాత్రమే B) (ii) మాత్రమే
C) (1) మరియు (ii) D) రెండూ కావు
జవాబు:
A (i) మాత్రమే.

60. శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి అయితే అతనికి వర్తించని అంశం ఏది?
→ భవిష్య నిధి
→ జీతంతో కూడిన సెలవు
→ సక్రమ జీతం
→ పరిమితిలేని పనివేళలు
జవాబు:
పరిమితిలేని పనివేళలు

61. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) వినియోగానికి సిద్ధంగా ఉన్న వస్తువును అంత్య వస్తువు అంటారు.
ii) GDP లో అంత్య వస్తువు, మాధ్యమిక వస్తువులను కలిపి లెక్కిస్తారు.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (1) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
A (i) మాత్రమే.

62. క్రింది కార్యకలాపాల్లో (వ్యవసాయం) ప్రాథమిక రంగానికి చెందనిది ఏది?
A) రఘుపతి గనిలో పనిచేసే కార్మికుడు
B) ఈశ్వరమ్మ చేపలు అమ్మే వ్యక్తి
C) శైలజ అటవి ఉత్పత్తులు అమ్ముతుంది.
D) లక్ష్మీ ఇంటి దగ్గరలోని ప్లాస్టిక్ కార్మాగారంలో పని చేస్తుంది.
జవాబు:
D) లక్ష్మీ ఇంటి దగ్గరలోని ప్లాస్టిక్ కార్మాగారంలో పని చేస్తుంది.

AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

క్రింది వాక్యాలు పరిగణించండి.
63. i) పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా పని ఉండటాన్ని అల్ప ఉపాధి అంటారు.
ii) కనపడని అల్ప ఉపాధిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C (i) మరియు (iii)

64. క్రింది వానిలో భిన్నంగా ఉన్న దానిని గుర్తించి, రాయండి.
పోస్టమ్యాన్, చెప్పులు కుట్టేవ్యక్తి, సైనికుడు, పోలీసు
జవాబు:
చెప్పులు కుట్టేవ్యక్తి

ఇవ్వబడిన పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానము వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 1

65. ఏ రంగంలో ఉత్పత్తి రెండింతలు పెరిగింది?
జవాబు:
పారిశ్రామిక రంగం

66. ఏ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది?
జవాబు:
వ్యవసాయ రంగం

ఇవ్వబడిన పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానము వ్రాయుము.

రంగం వాటా (మొత్తం శాతం)
ఉపాధిస్తూల దేశీయోత్పత్తి
వ్యవస్థీకృత 8 58
అవ్యవస్థీకృత 92 50
మొత్తం 100 100

67. ఏ రంగంలో ఉపాధి ఎక్కువగా ఉండి, ఉత్పత్తి తక్కువగా ఉంది?
జవాబు:
అవ్యవస్థీకృత రంగం

68. ఏ రంగంలో ఉపాధి తక్కువగా ఉంది, ఉత్పత్తి ఎక్కువగా ఉంది?
జవాబు:
వ్యవస్థీకృత రంగం.

ఇవ్వబడిన పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానము వ్రాయుము.

రంగం నివాస స్థానం
గ్రామీణ పట్టణ
వ్యవసాయ రంగం 68 8
పారిశ్రామిక రంగం 17 34
సేవల రంగం 15 58
మొత్తం 100 100

69. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఏది?
జవాబు:
వ్యవసాయ రంగం

70. పట్టణ ప్రాంతంలో ఎక్కువ మంది ఏ రంగంలో పని చేస్తున్నాయి?
జవాబు:
సేవల రంగం

71. ప్రచ్ఛన్న నిరుద్యోగంలో ఉపాంత ఉత్పత్తి ఎంత?
జవాబు:
శూన్యం.

10th Class Social 3rd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికుల పరిస్థితులను మెరుగుపరచడానికి కొన్ని సంస్కరణలను సూచించుము.
జవాబు:

  • వేతనం పెంచటం
  • ఉద్యోగ భద్రత కల్పించటం
  • ఎక్కువ పనికి ఎక్కువ వేతనం ఇవ్వటం
  • పనిచేసే ప్రదేశంలో సౌకర్యాలను మెరుగుపరచటం
  • వైద్య సదుపాయాలు కల్పించటం
  • అనారోగ్య సెలవులకు అవకాశాన్ని కల్పించటం

ప్రశ్న 2.
మాధ్యమిక వస్తువులకు ఉదాహరణలు రాయండి.
జవాబు:
1) వరిధాన్యం (వడ్లు),
ii) బియ్యం,
iii) దారం,
iv) రబ్బరు అందు చేతులు

AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 3.
అల్ప ఉపాధి అనగానేమి?
జవాబు:
కార్మికులకు తమ పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా, తగినంతగా పని దొరకని స్థితిని “అల్ప ఉపాధి” అంటారు.

ప్రశ్న 4.
అల్ప ఉపాధికి ఒక ఉదాహరణ రాయండి.
జవాబు:
అల్ప ఉపాధికి ఉదాహరణలు :

  1. తమ సామర్థ్యం మేరకు పని దొరకకపోయినా పని చెయ్యడం అనేది వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉండటం.
  2. సేవా రంగం – రంగులు వెయ్యటం, నీటి పైపుల పని, మరమ్మతులు చెయ్యటం.

ప్రశ్న 5.
అవ్యవస్థీకృత రంగంలో ఏయే అంశాలు ఉంటాయి?
జవాబు:
అవ్యవస్థీకృత రంగంలో అంశాలు : తక్కువ వేతనం, ఉద్యోగ భద్రత లేకపోవడం, వైద్య, ఆరోగ్య సౌకర్యాల లేమి, ఆర్జిత సెలవులు లేకపోవడం, భవిష్య నిధి, బీమా వంటివిల ఏకపోవడం మొదలగునవి.

ప్రశ్న 6.
కింది ‘పై’ చార్టును పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మూడు రంగాలలో ఉపాధి వాటా 2011-12
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 3
ఎ) అత్యల్ప ఉపాధి అవకాశాలను కల్పించే రంగం ఏది?
జవాబు:
అత్యల్ప ఉపాధి అవకాశాలను కల్పించే రంగం : పరిశ్రమలు.

బి) వ్యవసాయ రంగంలో అధిక ఉపాధికి రెండు కారణాలను పేర్కొనండి.
జవాబు:
వ్యవసాయ రంగంలో అధిక ఉపాధికి రెండు కారణాలు: –

  • పారిశ్రామిక, సేవారంగంలో తగినంత ఉపాధి కల్పించబడకపోవడం.
  • అక్షరాస్యతతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడటం.
  • ఎక్కువ పనులకు అవకాశం సులభంగా లభించడం.

ప్రశ్న 7.
అంతిమ వస్తువులకు రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
అంతిమ వస్తువులకు ఉదాహరణలు : ఇడ్లీ, దోశ, కారు, కంప్యూటర్, నోటు పుస్తకము మొదలైనవి.

ప్రశ్న 8.
క్రింద పట్టికలో ఇవ్వబడిన సమాచారమును పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
పట్టిక : మూడు రంగాలలో ఉపాధి మరియు స్థూల దేశీయోత్పత్తి వాటా

రంగము ఉపాధి (%)
2011-12
స్థూల దేశీయోత్పత్తి (%)
2011-12
వ్యవసాయం 49 16
పరిశ్రమలు 24 26
సేవలు 27 58

a) స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా ఎంత?
జవాబు:
స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా – 16%

b) స్థూల దేశీయోత్పత్తిలో ఎక్కువ వాటా కల్గి ఉన్నప్పటికీ, సేవా రంగంలో ఉపాధి తక్కువగా ఉండుటకు కారణం ఏమిటి?
జవాబు:
స్థూల దేశీయోత్పత్తిలో ఎక్కువ వాటా కల్గి ఉన్నప్పటికి సేవా రంగంలో ఉపాధి తక్కువగా ఉండుటకు కారణం

  • నైపుణ్యం లేకపోవడం.
  • ఉపాధి అవకాశాలు అందుబాటులో లేకపోవడం.

ప్రశ్న 9.
ఇవ్వబడిన పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానము వ్రాయుము.

రంగం ఉపాధి (%)
1972-73 2009-10
వ్యవసాయం 74% 53%
పరిశ్రమలు 11% 22%
సేవలు 15% 25%

ప్రశ్న : ఉపాధి కల్పన ఏ రంగంలో తగ్గుతున్నది?
జవాబు:
వ్యవసాయ రంగం

AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 10.
ప్రాథమిక రంగం అని దేనినంటారు?
జవాబు:
ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులకు సంబంధించిన పనులు మొదలైనవి “ప్రాథమిక రంగం” అంటారు.

ప్రశ్న 11.
ద్వితీయ రంగం అనగానేమి?
జవాబు:
యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలను “ద్వితీయ రంగం” అంటారు.

ప్రశ్న 12.
తృతీయ రంగంలోని అంశాలేవి?
జవాబు:
తృతీయ రంగంను “సేవా రంగం” అని కూడా అంటారు. వస్తువులను నేరుగా తయారుచేయకుండా వస్తువుల ఉత్పత్తికి, ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు.

ప్రశ్న 13.
స్థూల దేశీయోత్పత్తి అనగానేమి?
జవాబు:
ఒక సంవత్సర కాలంలో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తు, సేవల విలువే ‘స్థూల దేశీయోత్పత్తి” (GDP) అంటారు.

ప్రశ్న 14.
ఆర్థిక సంవత్సరమని ఏ నెల నుండి ఏ నెల దాకా అంటారు?
జవాబు:
ఏప్రిల్ నుండి (తర్వాతి) మార్చి వరకు.

ప్రశ్న 15.
ప్రచ్ఛన్న నిరుద్యోగం అనగానేమి?
జవాబు:
అందరూ పనిచేస్తున్నట్టు ఉంటుంది కానీ ఎవ్వరికీ తమ పూర్తి సామర్థ్యానికి తగినట్టుగా పని ఉండటం లేదు. ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరికీ కనబడదు, అందుకే దానిని “ప్రచ్ఛన్న నిరుద్యోగం” అంటారు.

ప్రశ్న 16.
వ్యవస్థీకృతరంగం అనగానేమి?
జవాబు:
కొన్ని క్రమబద్ధ విధానాలు, ప్రక్రియలు ఉండి నిర్వచనీయమైన పద్ధతిలో ఉత్పత్తి, ఉపాధి కల్పనలున్న రంగంను “వ్యవస్థీకృత రంగం” అంటారు.
ఉదా :
భారీ పరిశ్రమలు.

ప్రశ్న 17.
అవ్యవస్థీకృత రంగం అనగానేమి? ఒక ఉదాహరణ నిమ్ము.
జవాబు:
ఉద్యోగాలలో కాని, జీతాలలో కాని ఒక నియత పద్ధతిలేని కార్మికులు, కర్షకులు ఉండే చిన్న చిన్న సంస్థలున్న రంగంను “అవ్యవస్థీకృత రంగం” అంటారు.
ఉదా :
చేనేత పరిశ్రమ, బీడీ పరిశ్రమ.

ప్రశ్న 18.
అంత్యవస్తువులు అని వేనినంటారు? ఉదాహరణనిమ్ము.
జవాబు:
వినియోగానికి సిద్ధంగా ఉన్న వస్తువులు.
ఉదా :
టీవీ, కారు, నోటు పుస్తకం.

ప్రశ్న 19.
మాధ్యమిక వస్తువులు అని వేనినంటారు? ఉదాహరణనిమ్ము.
జవాబు:
వినియోగ వస్తువుల తయారీలో ఉపయోగించే వస్తువులను “మాధ్యమిక వస్తువులు” అంటారు.
ఉదా : గోధుమపిండి (బిస్కట్ల తయారీ, రొట్టెల తయారీలో ఉపయోగిస్తారు.)

AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 20.
భారతదేశంలో వ్యవస్థీకృత రంగంలో, అవ్యవస్థీకృత రంగంలో ఎంత శాతం పనిచేస్తున్నారు?
జవాబు:
92% మంది అవ్యవస్థీకృత రంగంలోను, 8% మంది వ్యవస్థీకృత రంగంలోను పనిచేస్తున్నారు.

10th Class Social 3rd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వ్యవస్థీకృత రంగము అవ్యవస్థీకృత రంగము కంటే ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:

  1. ఉపాధి షరతులు ఉండి, నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు.
  2. ఉపాధి షరతులు ఏమీ లేకుండా ఉండే చిన్న చిన్న సంస్థలను అవ్యవస్థీకృత రంగం అంటారు. ఇవి ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. నియమ నిబంధనలు ఉంటాయి. కానీ వీటిని అనుసరించరు.

కనుక వ్యవస్థీకృత రంగము అవ్యవస్థీకృత రంగము కంటే భిన్నమైనది అని చెప్పవచ్చును.

ప్రశ్న 2.
ఈ క్రింది పట్టిక పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
కింది పట్టిక భారతదేశంలో 1972-73 మరియు 2009-10 సంవత్సరాలలో వివిధ రంగాలలో ఉపాధి పొందిన వారి వివరాలను తెలుపుతుంది.
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 4
a) పై పట్టికలో నీవు గమనించిన ప్రధాన మార్పులేవి?
b) ఈ మార్పులకు గల కారణాలేవి?
జవాబు:
a)

  • వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు 74% నుండి 530కి తగ్గిపోయాయి.
  • పారిశ్రామిక రంగంలో 11% నుండి 22% శాతంకు, అంటే దాదాపు రెట్టింపు.
  • సేవల రంగంలో 15% నుండి 25% శాతంకు ఉపాధి అవకాశాలు పెరిగాయి.

b) ఈ మార్పునకు కారణాలు:

  • విత్తనాల ధరలు పెరగడం, వర్షాలు తగ్గడం, విద్యుత్ కోతలు, మద్దతు ధర లభించకపోవడం మొదలైన కారణాల వలన వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో ఈ రంగంలో క్షీణత ఏర్పడింది.
  • ప్రైవేట్ రంగం విస్తరించడంతో పరిశ్రమల స్థాపన పెరిగిపోయింది.
  • సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగతి వలన ఈ రంగాలు బాగా విస్తృతమైనాయి.
  • ఉత్పత్తి పెరగడం, మార్కెట్స్ పెరగడం, వ్యాపారం, వాణిజ్యం, రవాణా పెరగడం వలన సేవారంగంలో ఉపాధి పెరిగింది.

ప్రశ్న 3.
అవ్యవస్థీకృత రంగం కన్నా వ్యవస్థీకృత రంగం ఎందుకు మెరుగైనదో కారణాలు తెలియజేయండి.
జవాబు:

  1. ప్రభుత్వ నిబంధనలను వ్యవస్థీకృత రంగం అనుసరిస్తుంది. అవ్యవస్థీకృత రంగం అనుసరించదు.
  2. వ్యవస్థీకృత రంగంలో కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది.
  3. వ్యవస్థీకృత రంగంలో కార్మికులు నిర్ధారిత గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది.
  4. జీతంతో కూడిన సెలవు, సెలవులలో వేతనం, భవిష్యనిధి, వైద్య సదుపాయాలు వంటి అనేక ఇతర ప్రయోజనాలు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నాయి. ఇవి అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారికి ఉండవు.
  5. పై కారణాల దృష్ట్యా అవ్యవస్థీకృత రంగం కంటే వ్యవస్థీకృత రంగం మెరుగైనది.

ప్రశ్న 4.
ఈ క్రింది పట్టిక ఆధారంగా బార్ గ్రాఫ్ తయారుచేయుము.

రంగం ఉపాధి%
1972 – 73 2009 – 10
వ్యవసాయం 74 53
పరిశ్రమలు 11 22
సేవలు 15 25

జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 5
ఈ గ్రాఫ్ ప్రజలు ఏ రంగంలో ఎంత శాతం ఉపాధి పొందుతున్నారో తెలియజేస్తుంది.

ప్రశ్న 5.
క్రింది ‘పై’ చార్ట్ ను పరిశీలించి, విశ్లేషిస్తూ రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 6
జవాబు:
పైన ఇవ్వబడిన గ్రాఫ్ వలన భారతదేశంలో ప్రజలు ఏ రంగంలో ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారో తెలియజేయుచున్నది.

  1. వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం 49% మాత్రమే.
  2. పరిశ్రమల రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం గణనీయంగా పెరుగుతూ 24%కి చేరుకున్నది.
  3. సేవల రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం గణనీయంగా పరిశ్రమల రంగం కన్నా పెరుగుతూ వచ్చింది.
    దీనిని బట్టి భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుచున్నదని చెప్పవచ్చును.

ప్రశ్న 6.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, దిగువ నివ్వబడిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల పాత్ర

రంగం వాటా (మొత్తంలో శాతం)
ఉపాధి స్థూల దేశీయోత్పత్తి
వ్యవస్థీకృత 8 50
అవ్యవస్థీకృత 92 50
మొత్తం 100 100

a) అవ్యవస్థీకృత రంగంలో ఉపాధి పొందుతున్న కార్మికుల శాతం ఎంత?
b) ఏ రంగంలో వారికి మంచి ఉద్యోగ భద్రత ఉంటుంది?
జవాబు:
a) 92%
b) వ్యవస్థీకృత రంగం

AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 7.
వ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికులకు కలుగు సౌకర్యాలను తెలుపుము.
జవాబు:

  1. ఉద్యోగ భద్రత
  2. నిర్ధారిత పనిగంటలు
  3. ఎక్కువ పనికి ఎక్కువ వేతనం
  4. జీతంతో కూడిన సెలవు
  5. సెలవులలో వేతనం
  6. భవిష్యనిధి
  7. వైద్య ప్రయోజనాలు
  8. పింఛను
  9. భద్రతతో కూడిన పనివాతావరణం

ప్రశ్న 8.
క్రింది ‘పై’ ను పరిశీలించి విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 7
జవాబు:

  1. గ్రాఫ్ స్థూల దేశీయోత్పత్తిలో వివిధ రంగాల వాటాను తెలియచేస్తుంది.
  2. A – వ్యవసాయం, B – పరిశ్రమలు, C – వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు, D – ఆర్థిక, బీమా, స్థిరాస్తి, E – ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవలు గురించి తెలియచేస్తాయి.
  3. 1972-73లో అధిక ఉత్పత్తి వ్యవసాయ రంగం నుండి వచ్చింది. అత్యల్ప ఆదాయం ఆర్ధిక, భీమా, స్థిరాస్థి నుండి వచ్చింది.
  4. 2011-12కు వచ్చేప్పటికి ఇది మార్పు చెంది వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాల ఉత్పత్తి పెరిగి వ్యవసాయ రంగం వాటా తగ్గిపోయింది. పరిశ్రమలు రెండుసార్లు రెండవ స్థానంలోనే ఉంది.
  5. సేవారంగంలో ఉత్పత్తి పెరిగినట్లయితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దానిని పెంచేటట్లు చూడాలి.

ప్రశ్న 9.
సంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు గల సౌకర్యాలేవి?
జవాబు:
సంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు గల సౌకర్యాలు:

  1. ఉద్యోగ భద్రత
  2. నిర్ణీత పనిగంటలు
  3. వేతనంతో కూడిన సెలవులు
  4. పని పరిసరాలలో భద్రత మొదలగునవి.

ప్రశ్న 10.
ప్రజలు అవ్యవస్థీకృత రంగంలో పనిచేయడానికి సాధారణంగా ఇష్టపడరు. ఎందువలన?
జవాబు:

  1. అవ్యవస్థీకృత రంగం చాలావరకు ప్రభుత్వ నియంత్రణలో ఉండదు.
  2. నియమ నిబంధనలు తరచు పాటించబడవు.
  3. ఉద్యోగాలు క్రమపద్ధతిలో ఉండవు.
  4. వేతనాలు తక్కువ.
  5. సెలవు పెట్టుకోవడం కష్టం.
  6. వేతనంతో కూడిన సెలవులు ఉండవు.
  7. ఉద్యోగ భద్రత ఉండదు.
  8. పని పరిస్థితులు సాధారణంగా బాగుండవు.
  9. పని ప్రదేశాలలో భద్రతా చర్యలు పాటించబడవు.
  10. ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.

ప్రశ్న 11.
గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగటానికి మీరిచ్చే సూచనలు తెలపండి.
జవాబు:
గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెరగటానికి సూచనలు :

  1. వ్యవసాయానికి ప్రభుత్వ మద్దతు అందించాలి.
  2. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి.
  3. గ్రామీణ ఉపాధి పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలి.

ప్రశ్న 12.
దిగువ నీయబడిన ‘పై’ చార్టులు పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 8
a) గణనీయ పురోగతి సాధించిన రంగమేది?
జవాబు:
సేవలు రంగం గణనీయ పురోగతిని సాధించింది.

b) స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎందుకు తగ్గింది?
జవాబు:
వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఆశించినంతగా అభివృద్ధి చెందలేదు. అందువలన స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా తగ్గింది.

ప్రశ్న 13.
గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు పెంచాల్సిన ఆవశ్యకత గురించి సంబంధిత అధికారికి లేఖ వ్రాయండి.
జవాబు:

జగిత్యాల్
16 ఏప్రియల్ 20xx.

To,
జిల్లా కలెక్టరుగారికి,
జగిత్యాల జిల్లా, జగిత్యాల.

గౌరవనీయులైన కలెక్టరుగారికి,
నేను జగిత్యాలలోని వాణి టాకీస్ రోడ్డులో నివాసముంటున్నాను. ఈ మధ్యకాలంలో మా ప్రాంతంలో జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. కారణం, చుట్టు ప్రక్కల గ్రామీణ జనాభా జగిత్యాలకు వలస రావడం జరుగుతుంది. వారి గ్రామాలలో ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన వలసలు ఎక్కువగా ఉన్నాయి.

ఎక్కువ మంది వలస రావడం వలన ఇక్కడ త్రాగు నీటి సమస్య మురికి వాడలు పెరగడం, కాలుష్యం పెరుగుతుంది. ఇక్కడ దొరికే అన్ని రకాల వస్తువుల ధరలు కూడా బాగా పెరిగాయి.

కావున నా విన్నపం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా కొన్ని పరిశ్రమలను, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలను ఏర్పాటు చేస్తు అక్కడి ప్రజలకు ఉపాధి లభించడంతోపాటు రోడ్డు మార్గాలు అభివృద్ధి చెందుతాయి. వలసలను నివారించవచ్చు. గ్రామాలు కూడా అభివృద్ధి చెంది మన జిల్లా ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది.

ఇట్లు
మీ విశ్వాసపాత్రుడు

To,
జిల్లా కలెక్టరుగారికి,
జగిత్యాల జిల్లా, జగిత్యాల,
పిన్ : 505327.

ప్రశ్న 14.
క్రింది వాటిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి. కారణం తెల్పండి.
పోస్ట్ మ్యాన్, చేపలు పట్టే వ్యక్తి, సైనికుడు, పోలీస్ కానిస్టేబుల్
జవాబు:

  1. ఇచ్చిన వానిలో వేరుగా ఉన్నది. – చేపలు పట్టే వ్యక్తి. కారణం :
  2. మిగిలిన మూడు పోస్ట్ మ్యాన్, సైనికుడు, పోలీస్ కానిస్టేబుల్’ సేవా రంగానికి చెందినవి. అలాగే వ్యవస్థీకృత రంగానికి చెందినవి.

ప్రశ్న 15.
క్రింద ఇచ్చిన చార్టులను పరిశీలించి క్రింది ప్రశ్నలకు సరియైన సమాధానములిమ్ము.
‘పై’ చార్టు : స్థూల దేశీయోత్పత్తిలో వివిధ రంగాల వాటా
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 2
1) 1972-73 నుండి 2009-10 నాటికి GDPలో వ్యవసాయ రంగం వాటా పెరిగిందా, తగ్గిందా? ఎంత మేర?
జవాబు:
వ్యవసాయ రంగం వాటా (GDP) తగ్గింది, 43%-26% = 17% మేర తగ్గింది.

2) 2009-10 నాటికి GDPలో మొత్తం సేవల రంగం విలువ ఎంత శాతం వాటా కలిగి ఉంది?
జవాబు:
27% + 17% + 13% = 57% వాటా కలిగి ఉంది.

3) స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ రంగం వాటా 1972-73 నుండి 2009-10 నాటికి ఎంత మేర పెరిగింది?
జవాబు:
26% – 22% = 4% మేర పెరిగింది.

4) సేవా రంగంలోని ఏ సేవలు ఎక్కువ వృద్ధి చెందినాయి?
జవాబు:
వ్యాపారం, సూటళ్లు, రవాణా, ప్రసారాలు.

5) 37 సం||రాల కాలంలో వివిధ రంగాల వాటా మార్పుల గురించి ఏమి గమనించావు?
జవాబు:
37 సం||రాల కాలంలో వ్యవసాయ రంగం వాటా గణనీయంగా క్షీణించింది. పారిశ్రామిక రంగం వాటా కొంచెం పెరిగింది. సేవా కార్యకలాపాల్లోని మూడింట రెండు రంగాలలో గణనీయమైన వృద్ధి ఉంది.

ప్రశ్న 16.
పట్టిక : వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల పాత్రలు

రంగం వాటా (మొత్తంలో శాతం)
ఉపాధి స్థూల దేశీయోత్పత్తి
వ్యవస్థీకృత 8 50
అవ్యవస్థీకృత 92 50
మొత్తం 100 100

పైన ఇవ్వబడిన పట్టిక ఆధారంగా క్రింది ప్రశ్నలకు సరియైన సమాధానములిమ్ము.
1) వ్యవస్థీకృత రంగంలో ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారు?
జవాబు:
8% మంది.

2) అవ్యవస్థీకృత రంగంలో ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారు?
జవాబు:
92% మంది

3) స్థూల దేశీయోత్పత్తిలో వ్యవస్థీకృత రంగం వాటా ఎంత శాతం ఉంది?
జవాబు:
50%

4) స్థూల దేశీయోత్పత్తిలో అవ్యవస్థీకృత రంగం వాటా ఎంత శాతం ఉంది?
జవాబు:
50%

5) పై గణాంకాల ఆధారంగా ఏమి అర్థం అవుతున్నది?
జవాబు:
కేవలం 8 శాతం కార్మికులు భద్రతతో కూడిన మంచి ఉద్యోగం ఉండి, మొత్తం వస్తువులు, సేవల్లో 50% ఉత్పత్తికి దోహదం చేశారు.

10th Class Social 3rd Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
స్థూల దేశీయోత్పత్తిని ఎలా లెక్కిస్తారు ? ఉదాహరణలతో వ్రాయండి.
(లేదా)
స్థూల జాతీయోత్పత్తి అనగానేమి? స్థూల జాతీయోత్పత్తిని ఎలా అంచనా వేస్తారు?
జవాబు:

  1. దేశ ఆదాయాన్ని లెక్కకట్టడంలో దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువను తీసుకుంటే దానిని ‘స్థూల దేశీయోత్పత్తి (జాతీయోత్పత్తి) అంటాం.
  2. వ్యవసాయ, పరిశ్రమ, సేవా రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు చేపట్టే ప్రజలు పెద్దమొత్తంలో ఉత్పత్తిచేసే వస్తువుల / సేవల విలువే ఇది.
  3. ఆర్థికవేత్తలు ఉత్పత్తి అయిన వస్తువుల / సేవల సంఖ్య కాకుండా ఆయా వస్తువుల, సేవల విలువలు జోడిస్తారు.
  4. మాధ్యమిక వస్తువుల విలువలు కూడకుండా అంతిమ విలువలే లెక్కించే పద్ధతిలో స్థూల దేశీయోత్పత్తి లెక్కించవచ్చు.
    ఉదా|| Kg రూ. 25 చొప్పున 100 Kg వడ్లు కొని మిల్లర్ కిలో రూ. 40 చొప్పున 80 Kg బియ్యం , కిలో రూ. 20 చొప్పున 20 Kg ఊక అమ్మడం. అవి కొన్న హోటల్ యజమాని ఇడ్లీ, దోశలతో రూ. 5000 సంపాదించడం.
    ఈ ప్రక్రియలో మొత్తం అంతిమ విలువ రూ. 5000.
  5. ప్రతి దశలో జోడించబడిన అదనపు విలువ మాత్రమే లెక్కించే మరో పద్ధతి స్థూల దేశీయోత్పత్తికి కలదు.
    AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 9

ప్రశ్న 2.
వ్యవస్థీకృత రంగం, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న కార్మికుల మధ్య భేదాలు తెల్పుము.జవాబు:
జవాబు:

వ్యవస్థీకృత రంగం అవ్యవస్థీకృత రంగం
1) ప్రభుత్వ నియమ నిబంధనలను ఈ రంగంలోని సంస్థలు అనుసరిస్తాయి 1) ఈ రంగంలోని సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉండవు.
2) ఈ రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. 2) ఉద్యోగ భద్రత ఉండదు.
3) ఆర్జిత సెలవులు, అనారోగ్య సెలవులు ఉంటాయి. 3) అలాంటివి ఉండవు.
4) వేతనాలు జీవనానికి సరిపడేంత ఉంటాయి. 4) వేతనాలు తక్కువగా ఉంటాయి.
5) భవిష్య నిధి, ఆరోగ్య బీమా లాంటి సౌకర్యాలు, ఉంటాయి. 5) భవిష్యనిధి, బీమాలాంటివి ఉండవు.
6) ప్రభుత్వ సంస్థలు, భారీతరహా పరిశ్రమలు మొదలైన వాటిల్లోని ఉద్యోగులు వ్యవస్థీకృత రంగం. 6) చిన్న సంస్థలు, స్వయం ఉపాధి మొదలయిన వాటిల్లో ఉద్యోగులు అవ్యవస్థీకృత రంగం.
7) ఈ రంగంలో ఉద్యోగాలను అందరూ కోరుకుంటారు. 7) ఈ రంగంలో తప్పక ఉద్యోగాలు చేస్తుంటారు.

ప్రశ్న 3.
ఈ రోజుల్లో ఆర్థిక వ్యవస్థలోని ఏ రంగములో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి ? కారణాలు తెల్పండి.
జవాబు:

  • ఈ రోజుల్లో ఆర్థిక వ్యవస్థలోని ద్వితీయ, తృతీయ రంగాలలో ఉపాధి ఎక్కువ అయింది.
  • గత 50 సంవత్సరాలుగా స్థూల దేశీయోత్పత్తిలోని వివిధ రంగాల వాటాలో వచ్చినంత మార్పు ఉపాధిలో రాలేదు. అయినప్పటికిని ద్వితీయ, తృతీయ రంగాలలో ఉపాధి మెరుగయ్యింది.

కారణాలు:

  1. ప్రణాళికాబద్ధ చర్యలు, ప్రభుత్వ చొచొరవ మొదలైన వాటితో పరిశ్రమలు అధికంగా స్థాపించబడటం వలన.
  2. స్వదేశీ, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవటం (పెంచుకోవటం) వలన.
  3. విద్యావకాశాలు మెరుగవ్వటం.
  4. ప్రపంచీకరణ వలన బహుళజాతి సంస్థలు ప్రవేశించటం వలన పరిశ్రమలు, సేవారంగం అభివృద్ధి చెందటం.
  5. అన్ని రకాల రవాణా సౌకర్యాలు మెరుగుపడటం.
  6. మేధోవలసలు పెరగడం.
  7. పొదుపు చర్యల వలన, ప్రపంచీకరణ కారణంగా స్వదేశీ, విదేశీ పెట్టుబడుల లభ్యత పెరగడం.
  8. శాస్త్ర, సాంకేతిక రంగాలలో నైపుణ్యాలను పెంపొందించే జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణా సంస్థలు పెరగటం వలన.

AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 4.
మీ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి తీసుకోవలసిన చర్యలను సూచించండి.
జవాబు:
మా ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి తీసుకోవలసిన చర్యలు :

  1. వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలను ప్రోత్సహించాలి.
  2. పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం.
  3. స్థానిక చేతివృత్తులను ప్రోత్సహించడం.
  4. బ్యాంకు రుణాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం.
    ఉదా : పిండిమర, కిరాణాషాపు, హోటల్ మొ||నవి.
  5. స్వీట్ల తయారీ, పచ్చళ్ళ తయారీ మొదలగు వాటిని ప్రోత్సహించి దగ్గరలోని మార్కెట్లకు తరలించేలా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం.
  6. ప్రభుత్వ సహాయంతో కుట్టుమిషన్ల పంపిణీ.
  7. కూరగాయల ప్రొసెసింగ్ పరిశ్రమ, పట్టుపురుగుల పెంపకం మరియు తేనె సేకరించి దగ్గరలోని మార్కెట్లలో అమ్మడం.

ప్రశ్న 5.
అవ్యవస్థీకృత రంగ కార్మికుల పరిస్థితులను మెరుగుపరచడానికి నీవు చేసే సూచనలేవి?
జవాబు:
అవ్యవస్థీకృత రంగ కార్మికుల పరిస్థితులను మెరుగుపరచడానికి సూచనలు :

  1. వేతనాల పెరుగుదల,
  2. సక్రమంగా వేతనాలు ఇవ్వడం,
  3. అదనపు పనికి అదనపు వేతనం,
  4. ఆర్జిత సెలవులు,
  5. పనిచేసే చోట అనుకూల సౌకర్యాలు కల్పించడం,
  6. పదవీ విరమణ ప్రయోజనాలు,
  7. ఉద్యో గ భద్రత,
  8. వైద్య, ఆరోగ్య సౌకర్యాలు.

ప్రశ్న 6.
“సేవారంగం అభివృద్ధి చెందినా ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా పెరగటం లేదు. భారతదేశంలో సేవారంగంలో అనేక రకాల వ్యక్తులు ఉపాధి పొందుతున్నారు. ఒకవైపున బాగా చదువుకున్న, నైపుణ్యాలున్న వ్యక్తులకు ఉపాధి ఇచ్చే కొద్దిపాటి సేవలు ఉన్నాయి. ఇంకోవైపున చిన్న చిన్న దుకాణాలు నడిపేవాళ్ళు, మరమ్మతులు చేసేవాళ్ళు, రవాణా సేవలు అందించే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ జీవనం అతికష్టం మీద సాగుతుంది, అయినా మరోదారి లేక ఈ సేవలలో కొనసాగుతున్నారు.”

ప్రశ్న : “సేవారంగంలో పనిచేసే వారందరి జీవన పరిస్తితులు ఒకేలా లేవు.” వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. సేవా రంగమునకు సంబంధించి వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న నైపుణ్యం గల కార్మికులు మెరుగైన వేతనాలు పొందుతున్నారు. కానీ వీరి సంఖ్య పరిమితంగా ఉంది.
  2. మరోవైపున అవ్యవస్థీకృత రంగంలోనే పనిచేస్తున్న అసంఖ్యాకమైన కార్మికులు కనీస వేతనాలు సైతం పొందలేక దుర్భరమైన పరిస్థితులలో జీవిస్తున్నారు.
  3. స్వయం ఉపాధి పొందుతున్నవారు, దుకాణదారులు, వలస కార్మికులు మొదలగు వారికి స్థిర ఉపాధి, మెరుగైన పని పరిస్థితులు, ఇతర సదుపాయాలు ఉండవు.
  4. నైపుణ్యాల లేమి వల్ల, ఉపాధి అవకాశాల కొరత వల్ల, ప్రత్యామ్నాయ అవకాశాలు లేకపోవడం వల్ల తప్పనిసరియై ఆయా వృత్తులలోనే కొనసాగుతున్నారు.
  5. ఈ విధమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాలు సరైన విధానాలు రూపొందించి సేవారంగంలో సంతులిత అభివృద్ధికి కృషి చేయాలి.

AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 7.
“అభివృద్ధి చెందిన దేశాలలో గత 50 సం||లుగా జరుగుతున్న పరిణామాలలో అభివృద్ధి పారిశ్రామిక రంగం నుండి సేవా రంగానికి మారడం ఒకటి. మొత్తం ఉత్పత్తిలో సేవారంగం వాటా పెరగడంతో దాని ప్రాముఖ్యత పెరిగింది. పనిచేసే వాళ్ళలో ఎక్కువ మంది సేవారంగంలో ఉపాధి పొందుతున్నారు. ఉత్పాదక కార్యకలాపాలలో అధిక భాగం ఇప్పుడు వస్తువుల ఉత్పత్తి కాకుండా సేవలు అందించడంలో ఉన్నాయి. అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఇదే తీరు కనపడుతుంది.
ప్రశ్న: భారతదేశంలో కూడా ఇలాగే జరుగుతోందా? లేక భిన్నంగా ఉందా? మీ అభిప్రాయాన్ని వివరించండి.
జవాబు:

  1. ఆర్థిక రంగాల ప్రాధాన్యతా క్రమం భారతదేశంలో కూడా కొంతవరకూ అభివృద్ధి చెందిన దేశాల వలెనే ఉన్నది.
  2. కానీ కొన్ని ప్రధానమైన తేడాలు కూడా ఉన్నాయి.
  3. భారతదేశంలో కూడా ఇటీవల కాలంలో సేవారంగం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నది.
  4. కానీ, ఈనాటికీ దేశంలో అత్యధికులకు ఉపాధిని కల్పిస్తున్నది వ్యవసాయ రంగమే.

ప్రశ్న 8.
క్రింది పేరాగ్రాఫ్ ను చదివి, వ్యాఖ్యానించుము.
గత 50 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి ప్రాధాన్యత మారుతోంది. మొత్తం ఉత్పత్తిలో సేవారంగం ప్రముఖ స్థానంలో ఉంది. పని చేసేవాళ్ళల్లో కూడా ఇప్పుడు ఎక్కువ మంది సేవల రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఉత్పాదక కార్యకలాపాలలో అధిక భాగం ఇప్పుడు వస్తువుల ఉత్పత్తి కాకుండా సేవలు అందించడంలో ఉన్నాయి.
జవాబు:
పైన పేరాగ్రాను కనుక పరిశీలించినట్లయితే అభివృద్ధి చెందిన దేశాలలో పనిచేసే వారిలో ఎక్కువ మంది పారిశ్రామిక రంగం నుండి సేవల రంగానికి వలస వెళ్ళడం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో కూడా సేవా రంగం ప్రముఖపాత్రను పోషిస్తుంది అని గమనించవచ్చు. పనిచేసేవారు కూడా ఎక్కువ మంది సేవా రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఉత్పాదక కార్యకలాపాలలో అధిక భాగం ఇప్పుడు వస్తువుల ఉత్పత్తి కాకుండా సేవలు అందించడంలో ఉన్నాయి అని చెప్పవచ్చు.

ఆర్థిక వ్యవస్థలో మూడు రంగాలు ఉన్నాయి. అవి వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవల రంగాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ రంగం మీద మరియు అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువ శాతం ప్రజలు పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందడం మనం గమనిస్తున్నాం. కాని ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాలలో ప్రజలు పారిశ్రామిక రంగం నుండి సేవా రంగమునకు ఉపాధి కోసం తరలి వెళ్ళడం మనం గమనిస్తున్నాం. కారణం ఏమిటంటే వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగాలలో ఉన్న భౌతిక శ్రమ సేవా రంగంలో లేకపోవడమే. కంప్యూటర్, లాప్టాప్లు వచ్చిన తరువాత ప్రజలు ఇంటి వద్ద కూర్చుని కూడా వారి సేవలను ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సేవా రంగంలో GDP శాతం ఎక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. ప్రజలకు ఆదాయం కూడా ఎక్కువగా ఉంది.

దేశ, విదేశాలలో సేవా రంగానికి ఎక్కువ ప్రాముఖ్యం ఉండటంతో మన ప్రజలు ఇతర దేశాలపట్ల ఎక్కువ ఆకర్షితులవు తున్నారు. ఈ రంగంలో ఉపాధితోపాటు భద్రత, గౌరవం కూడా లభిస్తున్నాయి. మొత్తం మీద సేవా రంగం దేశ ఆర్థికాభివృద్ధిలో తన వంతు పాత్రను పోషిస్తోంది.

ప్రశ్న 9.
A) దిగువ నీయబడిన సమాచారం ఆధారంగా మీ పరిశీలనను వ్రాయండి.
పట్టిక : భారతదేశంలో పరిశ్రమలవారీగా కార్మికుల వివరాలు నివాస స్థానం స్త్రీ, పురుషులు
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 10
జవాబు:

  1. గ్రామీణ కార్మికులలో ఎక్కువమంది వ్యవసాయరంగంలో ఉపాధి పొందుతున్నారు.
  2. పట్టణ ప్రాంత కార్మికులలో ఎక్కువమంది సేవారంగంలో ఉపాధి పొందుతున్నారు.
  3. వ్యవసాయ కార్మికులలో అత్యధికులు స్త్రీలు.
  4. సేవారంగంలో మహిళా కార్మికుల సంఖ్య తక్కువగా ఉన్నది.
  5. మొత్తం మీద అత్యధిక శాతం మందికి ఉపాధిని కల్పిస్తున్నది వ్యవసాయ రంగము.
  6. మొత్తం మీద అతి తక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది పారిశ్రామిక రంగము.

ప్రశ్న 10.
క్రింది సమాచారాన్ని ఒక కమ్మీ రేఖాచిత్రం (బార్ గ్రాఫ్) లో చూపి, విశ్లేషించండి.
వివిధ రంగాలు – ఉపాధి (2009-10)

రంగం ఉపాధి (శాతంలో)
వ్యవసాయం 53%
పరిశ్రమలు 22%
సేవలు 25%

జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 11
విశ్లేషణ :

  1. 2009-10లో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం – వ్యవసాయం.
  2. ఉపాధికల్పనలో సేవారంగం రెండవ స్థానంలో కలదు.
  3. అతి తక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది పారిశ్రామిక రంగం.

ప్రశ్న 11.
వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగాలను అందరూ కోరుకుంటారు. కానీ ఈ రంగంలోని ఉపాధి అవకాశాలు చాలా నిదానంగా పెరుగుతున్నాయి. ఫలితంగా, అధిక శాతం కార్మికులకు చాలా తక్కువ వేతనానికి అవ్యవస్థీకృత ఉద్యోగాలు తప్పించి మరో దారి లేదు.
ప్రశ్న : అవ్యవస్థీకృత రంగం కన్నా వ్యవస్థీకృత రంగం మెరుగైనది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
వ్యవస్థీకృతరంగం మెరుగైనది – అభిప్రాయం :

  1. అవును. అవ్యవస్థీకృత రంగం కంటే వ్యవస్థీకృత రంగం మెరుగైనదని భావిస్తాను.
  2. వ్యవస్థీకృతరంగంలో క్రమబద్ధమైన ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉంటుంది.
  3. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించబడతాయి.
  4. ఈ రంగంలో కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది.
  5. వారు నిర్ధారిత పనిగంటలు మాత్రమే పనిచేస్తారు.
  6. వారికి జీతంతో కూడిన సెలవు, సెలవులలో వేతనం, భవిష్యనిధి వంటి ప్రయోజనాలు ఉంటాయి.

AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 12.
నేటి కాలంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించుము.
జవాబు:
నేటి కాలంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారు ఎదుర్కొంటున్న సమస్యలు

  1. జీతాలు తక్కువగా ఉంటాయి.
  2. ఉద్యోగ భద్రత ఉండదు.
  3. ఎక్కువ పనికి ఎక్కువ వేతనం ఉండదు.
  4. ఆర్జిత సెలవులు ఉండవు
  5. సాధారణ సెలవులు ఉండవు
  6. అనారోగ్యపు సెలవులు ఉండవు.
  7. వైద్య సౌకర్యాలు ఉండవు.
  8. భవిష్యనిధి, ఆరోగ్య బీమా లాంటి సౌకర్యాలు ఉండవు,

ప్రశ్న 13.
దిగువ ఇచ్చిన గ్రాఫ్ ను పరిశీలించి, విశ్లేషించండి. .
గ్రాఫ్ : మూడు రంగాల వాటా – ఉపాధి మరియు స్థూల దేశీయోత్పత్తి 2015-16
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 12
జవాబు:
పైన ఇవ్వబడిన గ్రాఫ్ వలన భారతదేశంలో ప్రజలు ఏ రంగంలో ఎంత శాతంమంది ఉపాధి పొందుతున్నారో తెలియజేయుచున్నది.

  1. ఉపాధి వాటాలో వ్యవసాయ రంగం 47% ఉన్నప్పటికి, స్థూల దేశీయ ఉత్పత్తిలో 19% మాత్రమే ఉంది.
  2. కాని సేవల ఉపాధి వాటా 31% మాత్రమే ఉన్నప్పటికి, స్థూల దేశీయోత్పత్తిలో 53% గా అగ్రగణ్యంలో ఉంది.
  3. పరిశ్రమల వాటాలలో ఉపాధి వాటాకు, స్థూల దేశీయోత్పత్తి వాటాకు పెద్దగా భేదం లేదు.
  4. సేవల రంగంలో స్థూల దేశీయోత్పత్తి వాటా అన్ని రంగాల కంటే ఎక్కువగా ఉన్నది.
    దీనిని బట్టి భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుచున్నదని చెప్పవచ్చును.

ప్రశ్న 14.
దిగువ గ్రాఫ్ లను పరిశీలించి మీ విశ్లేషణను రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 13
జవాబు:

  1. పైన ఇవ్వబడిన గ్రాఫ్ వలన 2009-10 లో భారతదేశంలో ప్రజలు ఏ రంగంలో ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారో, ఏ రంగం నుండి ఎంత (GDP) (వాటా) నో తెలుసుకోవచ్చు.
  2. ఉపాధి వాటాలో వ్యవసాయ రంగం 53% ఉన్నప్పటికీ, స్థూల దేశీయోత్పత్తిలో 17% మాత్రమే ఉంది.
  3. కాని సేవల ఉపాధి వాటా 25% మాత్రమే ఉన్నప్పటికీ, స్థూల దేశీయోత్పత్తిలో 57% గా అగ్రగణ్యంలో ఉంది.
  4. పరిశ్రమల వాటాలలో ఉపాధి వాటాకు (22%), స్తూల దేశీయోత్పత్తి వాటాకు (26%) పెద్దగా భేదం లేదు.
  5. సేవల రంగంలో స్థూల దేశీయోత్పత్తి వాటా అన్ని రంగాల కంటే ఎక్కువగా ఉన్నది.
  6. దీనిని బట్టి భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుచున్నదని చెప్పవచ్చును.

ప్రశ్న 15.
ఆర్థికవ్యవస్థలోని వివిధ రంగాల గురించి వివరించుము.
జవాబు:
ఆర్థికవ్యవస్థలోని రంగాలు : ఈ పనులను ప్రధానంగా మూడు రంగాలుగా విభజిస్తారు.

  1. ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులకు సంబంధించిన పనులు.
  2. యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలు.
  3. వస్తువులను నేరుగా తయారుచేయకుండా వస్తువుల ఉత్పత్తికి, ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు.

ప్రశ్న 16.
సేవలలోని వివిధ రకాల గురించి ఉదాహరణలతో వివరించుము.
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 14
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 15

ప్రశ్న 17.
1972-73, 2009-10 మధ్య ఉత్పత్తి, ఉపాధిలో వచ్చిన మార్పుల గురించి చర్చించుము.
జవాబు:

  1. ఈ కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి తొమ్మిది రెట్లు పెరిగింది, కానీ పారిశ్రామిక ఉపాధి మూడు రెట్లు మాత్రమే పెరిగింది.
  2. సేవల రంగంలోనూ ఇదే పరిస్థితి. సేవా రంగంలో ఉత్పత్తి 14 రెట్లు పెరిగింది కానీ ఉపాధి మాత్రం 5 రెట్లు పెరిగింది.
  3. దీని ఫలితంగా దేశంలోని కార్మికులలో సగం కంటే ఎక్కువమంది వ్యవసాయ రంగంలో ఉండి ఆరింట ఒక వంతు ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారు.
  4. దీనికి విరుద్ధంగా స్థూల దేశీయోత్పత్తిలో 75 శాతం వాటా ఉన్న పారిశ్రామిక, సేవా రంగాలు మొత్తం కార్మికులలో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి.
  5. 37 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగం వాటా గణనీయంగా క్షీణించింది.
  6. స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం ఉత్పత్తి వాటా కొంచెం పెరిగింది.
  7. ఇందుకు విరుద్ధంగా సేవా కార్యకలాపాలలోని మూడింట రెండు రంగాలలో గణనీయమైన వృద్ధి ఉంది.

ప్రశ్న 18.
రక్షణ అవసరమైన అవ్యవస్థీకృత కార్మికులు ఎవరు? రక్షణ ఎందుకవసరం?
జవాబు:

  1. గ్రామీణ ప్రాంతాలలో వీళ్లు భూమిలేని వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతులు, కౌలుదారులు, చేనేత, కమ్మరం, వడ్రంగం, కంసాలి వంటి చేతివృత్తుల వాళ్లు.
  2. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలోని 80 శాతం కుటుంబాలు సన్న, చిన్నకారు రైతుల కిందకు వస్తాయి.
  3. ఇటువంటి రైతులకు సకాలంలో విత్తనాలు, వ్యవసాయ ఉత్పాదకాలు, రుణసదుపాయాలు, నిల్వ సౌకర్యాలు, విక్రయ కేంద్రాలు వంటి వాటి ద్వారా మద్దతు అందించాలి.
  4. వ్యవసాయ కూలీలకు కనీస కూలీ, తగినంత పని అందాలి.
  5. పట్టణ ప్రాంతాలలో చిన్నతరహా పరిశ్రమలు, భవన నిర్మాణ, వ్యాపారం, రవాణా వంటి వాటిలో రోజువారీ కూలీలు, బజారులో అమ్మకాలు చేసే వాళ్లు, బరువులు మోసేవాళ్లు, చిత్తుకాగితాలు ఏరేవాళ్లు, బట్టలు కుట్టేవాళ్లు అవ్యవస్థీకృత రంగ కార్మికులు అవుతారు.
  6. ముడి సరుకుల కొనుగోలుకు, ఉత్పత్తులు అమ్ముకోటానికి చిన్నతరహా పరిశ్రమలకు కూడా ప్రభుత్వ మద్దతు కావాలి.
  7. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని రోజువారీ కూలీలకు రక్షణ కావాలి.
  8. షెడ్యూల్ కులాలు, తెగలు, వెనకబడిన తరగతులకు చెందిన అధికశాతం కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు.
  9. ఈ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. పని సరిగా దొరకకపోవటం, తక్కువ వేతనం ఉండటమే కాకుండా ఈ కార్మికులు సామాజిక వివక్షతకు కూడా లోనౌతారు.
  10. కాబట్టి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవ్యవస్థీకృత రంగ కార్మికులకు రక్షణ, మధతు అవసరం.

ప్రశ్న 19.
పట్టిక : భారతదేశంలో పరిశ్రమల వారీగా కార్మికుల వివరాలు, 2009-2010 (%)
AP 10th Class Social Important Questions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 10
పట్టికని జాగ్రత్తగా అధ్యయనం చేసి కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
1. ఏ రంగంలో స్త్రీలు అధికంగా పాల్గొంటున్నారు?
2. కార్మికులు తక్కువగా ఉన్న రంగం ఏది? ఎందుకు?
3. సేవా రంగంలో ఉపాధి పొందుతున్న వారిలో ఎక్కువమంది ఎక్కడ నివాసం ఉంటున్నారు?
4. పారిశ్రామిక రంగంలో స్త్రీలు తక్కువగా ఉండడానికి కారణమేంటి?
జవాబు:

  1. వ్యవసాయ రంగంలో స్త్రీలు అధికంగా పాల్గొంటున్నారు.
  2. కార్మికులు తక్కువగా ఉన్న రంగం పారిశ్రామిక రంగం. కారణం దేశం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందకపోవడం.
  3. సేవారంగంలో ఉపాధి పొందుతున్న వారు అధికంగా పట్టణాలలో నివాసం ఉంటున్నారు.
  4. పారిశ్రామిక రంగంలో స్త్రీలు తక్కువగా ఉండటానికి కారణాలు : పనిగంటలు షిఫులుగా ఉండటం మరియు శారీరక శ్రమతో కూడిన పనులు చాలా ఉండటం.