AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ Ex 12.1

AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ Ex 12.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 12th Lesson దత్తాంశ నిర్వహణ Exercise 12.1

ప్రశ్న 1.
25 మంది విద్యార్థులకు ఇష్టమైన రంగులు ఇలా ఉన్నవి:
నీలం, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, నీలం, తెలుపు, నీలం, నారింజ, నీలం, నీలం, తెలుపు, ఎరుపు, తెలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నీలం, తెలుపు. ఈ దత్తాంశానికి గణన చిహ్నాలను ఉపయోగించి పౌనఃపున్య విభాజన పట్టిక తయారు చేయండి. అతి తక్కువ మంది విద్యార్థులకు ఇష్టమయిన రంగు ఏది ?
సాధన.
పౌనఃపున్య విభాజన పట్టిక :
AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ Ex 12.1 1
అతి తక్కువమంది ఇష్టపడుతున్న రంగు నారింజ.

AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ Ex 12.1

ప్రశ్న 2.
‘మద్యపాన నిషేధం’ పై ఒక టి.వి. ఛానెల్ వారు SMS పోల్ నిర్వహిస్తూ ఈ కింది వానిలో ఒక దానికి ఓటు వేయమని కోరారు.
A – పూర్తి నిషేధం B- పాక్షిక నిషేధం C – అమ్మకాలు కొనసాగించాలి. వారు మొదటి గంటలో అందుకున్న SMSలు ఈ విధంగా ఉన్నవి.
AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ Ex 12.1 1.1
పై దత్తాంశమును గణన చిహ్నాలు ఉపయోగించి పౌనఃపున్య విభాజన పట్టికలో చూపండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ Ex 12.1 2

AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ Ex 12.1

ప్రశ్న 3.
ఒక రహదారి తనిఖీ కేంద్రం వద్ద ఉదయం 10 గం||లు మరియు 11 గం||ల మధ్య ప్రయాణించిన వాహనాలు :
కారు, లారీ, బస్సు, లారీ, ఆటో, లారీ, లారీ, బస్సు, ఆటో, బైక్, బస్సు, లారీ, లారీ, జీపు, లారీ, బస్సు, జీపు, కారు, బైక్, బస్సు, కారు, లారీ, బస్సు, లారీ, బస్సు, బైక్, కారు, జీపు, బస్సు, లారీ, లారీ, బస్సు, కారు, కారు, బైక్, ఆటో.
పై దత్తాంశాన్ని గణన చిహ్నాలు ఉపయోగించి పౌనఃపున్య విభాజన పట్టికలో చూపండి.
సాధన.
పౌనఃపున్య విభాజన పట్టిక :
AP Board 6th Class Maths Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ Ex 12.1 3.1

AP Board 6th Class Study Material Textbook Solutions Guide State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 6th Class Textbook Solutions and Study Material Pdf in English Medium and Telugu Medium are part of AP Board Solutions.

AP State Syllabus 6th Class Textbook Solutions Study Material Guide Pdf Free Download

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

SCERT AP Board 6th Class Telugu Solutions 6th Class Telugu పదాలు – అర్థాలు Notes, Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu పదాలు – అర్థాలు

అర్థాల పట్టిక

1. అంకె = వశం
2. అంగడి = కొట్టు (దుకాణం)
3. అంబుధి = సముద్రం
4. అఘము = పాపం
5. అజ్ఞానం = జ్ఞానం లేకపోవడం
6. అణగుట = నశించుట
7. అతుల = సాటిలేని
8. అధునాతనము = ఆధునికం
9. అనర్గళంగా = ధారాళంగా / అడ్డంకి లేకుండా
10. అనుకరించు = మరొకరు చేసినట్లు చేయు
11. అనుగుణము = తగిన విధంగా
12. అన్వేషణ = వెదకుట
13. అబ్ది = సముద్రం
14. అర్థించి = వేడుకొని
15. అలరించు = ఆనందింపజేయు
16. అవగతము = తెలియబడినది
17. అశ్వము = గుర్రం
18. అసువులు = ప్రాణాలు

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

1. ఆకృతి = ఆకారం
2. ఆచరణ = నిజ జీవితంలో అమలు చేయడం / నడత
3. ఆజ్ఞ = ఆనతి
4. ఆత్మవిశ్వాసం = తన శక్తి, సామర్థ్యాలపై తనకున్న నమ్మకం
5. ఆనందపరవశుడు = ఎక్కువ ఆనందం పొందిన వాడు
6. ఆపన్నులు = ఆపదలో ఉన్నవారు
7. ఆపద = ప్రమాదం
8. ఆప్యా యత = ప్రేమ, ప్రీతి
9. ఆలి = భార్య
10. ఆవశ్యకత = అవసరం
11. ఆశ్రయించు = నమ్ముకొను
12. ఆశ్రితులు ఆ = ఆశ్రయించినవారు

1. ఇంకుట = ఇగిరిపోవుట
2. ఇంతి = స్త్రీ
3. ఇమ్ముగ = కుదురుగ | స్థిరంగా

1. ఉచ్చు = పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పెట్టే ఉరి
2. ఉజ్జ్వల = బాగా ప్రకాశించు
3. ఉత్తరీయం = కండువా
4. ఉదకము = నీరు
5. ఉబలాటం = కుతూహలం / ఒక పని చేయాలనే తొందరతో కూడిన కోరిక

1. ఏకభుక్తులు = ఒకపూట మాత్రమే తినేవారు
2. ఎడబాయు = వేరగు
3. ఎలమి = సంతోషం
4. ఎరుక = జ్ఞానం

1. ఐశ్వర్యం = సంపద

1. ఒద్దిక = అనుకూలత, స్నేహం
2. ఒసగుట = ఇచ్చుట

1. ఔన్నత్యము = గొప్పతనం

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

1. కదనం = యుద్ధం
2. కనుమఱుగు = కంటికి కనిపించకుండా పోవు
3. కన్నుల పండుగ = చూడడానికి ఆనందంగా ఉండటం
4. కపటం = మోసం
5. కపి = కోతి
6. కర్తవ్యం = బాధ్యత
7. కవిపుంగవుడు = శ్రేష్ఠమైన కవి
8. కాంస్యం = కంచు
9. కాలుడు = యముడు
10. కాడు = శ్మశానం
11. కాలయముడు = ప్రాణాలు తీసేవాడు
12. కావలి = రక్షణ
13. కినియు = కోపించు
14. కూడు = అన్నం
15. కూరిమి = స్నేహం
16. కృతజ్ఞతలు = ధన్యవాదాలు
17. కేరింత = నవ్వు / సంతోషంలో చేసే ధ్వని
18. కోటీరము = కిరీటం
19. కోమలి = అందమైన స్త్రీ
20. కోలాహలం = హడావుడి

1. గండం = ప్రమాదం
2. గిరాకీ = వెల ఎక్కువ / కొనుగోలు దారులకున్న ఆసక్తి

1. ఘట్టం = సందర్భం / తీరు

1. చారెడు = కొద్దిగా చెయ్యి వంచినప్పుడు ఏర్పడే పరిమాణం, ఒక చేతిలో పట్టినన్ని
2. చిక్కం = తీగలతో అల్లి పశువుల
3. చిరస్మరణీయుడు = నిత్యం స్మరింపదగినవాడు
4. చేజారిపోవు = దొరకకుండాపోవు
5. చేటు = కీడు, అనర్థం

1. జాగృతి = మేలుకొలుపు
2. జాడ = ఆనవాలు
3. జీవనశైలి = జీవించే విధానం/బతికే పద్దతి

1. డెందము = హృదయం

1. తనయ = కూతురు
2. తనరు = ప్రకాశించు
3. తనూభవుడు = కుమారుడు
4. తర్కించు = చర్చించు
5. తరుణము = తగిన సమయం
6. తలపోయు = ఆలోచించు
7. తహతహలాడు = ఆరాటపడు
8. తిలలు = నువ్వులు
9. తీవ్రత = ఆధిక్యం
10. తుల్యం = సమానం
11. తెంపు = సాహసం
12. తేట తెల్లం చేయు = స్పష్టంగా వివరించు

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

1. దత్త = ఇవ్వబడిన
2. దనుజులు = రాక్షసులు.
3. దళం = ఆకు
4. దాణా = పశువులకు పెట్టు ఆహారం
5. దాశరథి- = శ్రీరాముడు .
6. ద్విపము = ఏనుగు
7. ద్వీపము – నాలుగువైపులా నీటితో చుట్టబడిన భూమి
8. దుర్గతి = చెడ్డ స్థితి మూతికి తగిలించే బుట్ట
9. దుర్బరం = భరింపలేనిది
10. దేదీప్యమానం = ప్రకాశవంతం
11. దొరతనం = పాలన, అధికారం
12. దోచు = అపహరించు

1. ధరణి = భూమి
2. ధాటి = దాడి

1. నారి = స్త్రీ
2. నిక్కం = నిజం
3. నిరాడంబరం = ఆడంబరం లేని విధంగా
4. నిర్దేశం = ఆజ్ఞ
5. నిశ్చితాభిప్రాయం = దృఢమైన అభిప్రాయం, గట్టి నిర్ణయం
6. నిష్ఫలం = ప్రయోజనం లేనిది
7. నేమ్మి = ప్రేమ, క్షేమం
8. నెటిగుటి = సరియైన లక్ష్యం
9. నేరము = తప్పు

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

1. పటాపంచలు = పూర్తిగా తొలగిపోవు
2. పథకం = ఆలోచన, ప్రణాళిక
3. పరస్పరం = ఒకరికొకరు
4. పరవ = ప్రవాహం
5. పస్తు = ఉపవాసం
6. పాటు = ఆపద
7. పాతకం = పాపం
8. పామరుడు = తెలివిలేనివాడు
9. పారదని = జరగదని
10. పీడ= బాధ
11. పుంగవం = ఎద్దు
12. పుడుక = పుల్ల (పుడక అని వాడుక)
13. పుష్కలం = అధికం, సమృద్ధి
14. పుస్తె = తాళిబొట్టు
15. పొంచి = చాటున దాగియుండి
16. పొలతి = స్త్రీ
17. పోరాటం = యుద్ధం
18. పోరు = యుద్ధం
19. ప్రజ్ఞాశాలి = ప్రతిభ గలవాడు
20.. .ప్రతీక = గుర్తు
21. ప్రథితం – ప్రఖ్యాతి నొందినది
22. ప్రభువు = రాజు
23. ప్రస్తుతం = ఇప్పుడు
24. ప్రాచీనం = పూర్వకాలం, పురాతనం
25. ప్రాణం = జీవం
26. ప్రారంభం = మొదలు

1. బుధుడు = పండితుడు
2. బుడతడు = బాలుడు

1. భద్రం = శుభకరం, శ్రేష్ఠం
2. భావన = తలపు/ఆలోచన
3. భావి = భవిష్యత్తు
4. భాస్కరుడు = సూర్యుడు
5. భీతి = భయం
6. భూషణములు = అలంకారాలు
7. భేదం = తేడా
8. భ్రాతృజనం = అన్నదమ్ములు

1. మకాం = నివాసం
2. మదం = గర్వం
3. మదత్రయం = విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం
4. మనువు = రక్షణ
5. మనువు = జీవించుట
6. మట్టగుడిసె = ఒకరకమైన చేప
7. మమకారం = ప్రేమ/నాది అనే భావం
8. మహనీయులు = గొప్పవారు
9. మిన్నక = ఊరక / అప్రయత్నం
10. ముట్టుకోవడం = తాకడం
11. మున్నీరు = సముద్రం
12. ముల్లె = ధనం/మూట
13. మెలకువ = మేలుకొనుట/జాగృతి
14. మేటి = శ్రేష్ఠం
15. మేను = శరీరం
16. మైత్రి = స్నేహం
17. మొరాయించు = మొండిబడు/ఎదిరించే
18. మొహమాటం = జంకు, సంకోచం
19. మోళీ = రీతి / తరగతి
20. మౌనం = మాట్లాడకుండా ఉండడం

1. యాచకులు = భిక్షకులు

1. రణము = యుద్ధం
2. రమ్యము = అందమైన
3. రాజద్రోహం = రాజాపరాధం
4. రాట్నం = నూలువడికే యంత్రం
5. రాశి = పోగు
6. రూకలు = ధనం
7. రూపు మాయు = నశించు, అంతరించు

1. లేసు = సులభం

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

1. వదనం = ముఖం
2. వర్ధనం = వృద్ధి
3. వలయాకారం = గుండ్రంగా
4. వాత్సల్యం = ప్రేమ
5. వ్రాత = సమూహం
6. విక్రయించు = అమ్ము
7. విచ్ఛిన్నం = తునాతనకలు
8. విధూతము = కంపించబడినది
9. విరసం = రసము లేనిది
10. వివేకి = తెలివైనవాడు
11. విహరిస్తున్న = తిరుగుతున్న
12. వీడ్కోలు = వెళ్ళడానికి ఇచ్చే అనుమతి
13. ఐచు = భయపడు
14. వైరం = శత్రుత్వం

1. శిశుంపా వృక్షం = ఇరుగుడు చెట్టు
2. శుంభత్ = ప్రకాశించే
3. శుద్ధము = పవిత్రం
4. శూరులు = శౌర్యం కలవారు య
5. శ్రేయస్సు = శుభం

1. సంక్రామిక వ్యాధులు = అంటు వ్యాధులు
2. సంఘాతం = సమూహం / గట్టి దెబ్బ
3. సంచితం = కూడబెట్టినది
4. సంప్రదాయం = గతం నుండి పాటిస్తూ వచ్చిన నిర్దిష్ట ఆచారం
5. సంబరం = సంతోషం
6. సంస్కృతి = ఆచార వ్యవహారాలు, నాగరికత
7. సఖ్యంగా = స్నేహంగా
8. సత్కవి = మంచి కవి
9. సత్యమైనది = నిజమైనది
10. సన్నుతి = పొగడ్త
11. సాక్షాత్కరించు = ఎదుటకువచ్చు
12. సాదిక = సారథ్యం
13. సిరి = సంపద
14. సుంత = కొంచెం
15. సునాయాసం = తేలిక
16. సువర్ణము = బంగారం
17. సొంపు = అందం
18. స్ఫూర్తి = స్ఫురణం, ప్రకాశం
19. స్మరించు = తలచుకొను
20. స్వాంతం = హృదయం
21. స్మారకం = స్పృహ

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

1. హరియించు = చంపు
2. హితము = మేలు
3. హితుడు = మేలుకోరేవాడు
4. హెచ్చు = ఎక్కువ

పర్యాయపదాలు

1. అఘము : పాపం, దురితం
2. ‘అధికం : ఎక్కువ, మెండు
3. అనలం : అగ్ని, వహ్ని
4. అభి : సముద్రం, జలధి
5. అశ్వము : గుర్రం, తురగం
6. ఇంతి : స్త్రీ, వనిత
7. ఉదకము : నీరు, జలం
8. ఉర్వి : భూమి, వసుధ
9. కన్ను : నేత్రం, నయనం
10. కపి : కోతి, మర్కటం
11. కుమారుడు : తనయుడు, పుత్రుడు
12. కూరిమి : స్నేహం, చెలిమి
13. కాశీ : వారణాసి, అవిముక్తం
14. డెందము : హృదయం, ఎద
15. తండ్రి : జనకుడు, పిత
16. తరుణము : సమయం / కాలం
17. దనుజులు : అసురులు, రాక్షసులు
18. దుఃఖము : భేదం, బాధ
19. నంది : వృషభం, ఎద్దు
20. నారి : స్త్రీ, పొలతి
21. పరులు : ఒరులు, ఇతరులు
22. పామరుడు : అజ్ఞుడు, నీచుడు
23. ప్రతీక : గుర్తు, చిహ్నం
24. ప్రారంభం : అంకురార్పణ, మొదలు
25. ప్రాచీనము : ప్రాక్తనం, సనాతనం
26. భాస్కరుడు : సూర్యుడు, భానుడు
27. ప్రాణం : ఉసురు, జీవం
28. మకాం : బస, నివాసం
29. మదం : గర్వం, పొగరు
30. మాత : తల్లి , జనని
31. మేను : శరీరం, దేహం
32. మైత్రి : స్నేహం, నెయ్యం
33. రణం : యుద్ధం, పోరు
34. రథము : తేరు, స్యందనం
35. రాజు : ప్రభువు, భూపతి
36. వృక్షం : చెట్టు, తరువు
37. సకలం : సర్వం, సమస్తం
38. స్వర్గం : దివి, నాకం

AP Board 6th Class Telugu పదాలు – అర్థాలు

ప్రకృతి – వికృతి

1. అంబ – అమ్మ
2. ఆకాశం – అకసం
3. అశ్చర్యం – అచ్చెరువు
4. ఆహారం – ఓగిరం
5. ఉత్తరీయం – ఉత్తరిగం
6. కథ – కత
7. కవి – కయి.
8. కాలం – కారు
9. కార్యం – కర్జం
10. కుమారుడు – కొమరుడు
11. గర్భం – కడుపు
12. త్యాగం – చాగం
13. దిశ – దెస
14. దీపం – దివ్వె
15. దోషం – దోసం
16. ధర్మము – దమ్మం
17. పుణ్యము – పున్నెం
18. పుస్తకము – పొత్తం
19. భక్తి – బత్తి
20. సంతోషం – సంతసం

AP Board 6th Class Telugu వ్యాసాలు

SCERT AP Board 6th Class Telugu Solutions 6th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu వ్యాసాలు

1. స్వచ్ఛభారత్

‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికిపేటలు, గంగా, గోదావరి వంటి నదుల జలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు,చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన. పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శన్ వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

2. తెలుగు భాష గొప్పదనం

ఆగస్టు 29వ తేదీ ప్రసిద్ధ భాషావేత్త గిడుగు రామమూర్తి జయంతి. ఆనాడు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటారు. తెలుగు మన మాతృభాష. మాతృభాష కంటె మించిన సంపద మరొకటి లేదు.

ఎవరి భాషలు వారికి గొప్పవి. కాని ఆంగ్లేయులే మన భాషలోని మాధుర్యాన్ని గమనించి తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని కీర్తించారు. సి.పి. బ్రౌన్ అనే ఇంగ్లీషు దొర వేమన పద్యాలను ఆంగ్లభాషలోకి అనువదించి తన దేశం తీసుకొనిపోయాడు.

మన భారతదేశంలో ఎన్నో. భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలు ఉన్నా అందరూ మన తెలుగు భాష విశిష్టతను కీర్తించినవారే. మన తెలుగుభాష ‘అజంత భాష’. ఇలా అచ్చుతో పదం ముగియటం తెలుగు భాషలో తప్ప ఏ భాషలో కనిపించదు. అది మన భాషకు అందాన్ని చేకూరుస్తుంది.

తెలుగు పద్యాలు, గేయాలు, సామెతలు, పొడుపుకథలు మొదలైనవన్నీ మన తెలుగు భాష గొప్పతనాన్ని, తియ్యదనాన్ని తెలియజేస్తాయి. అందుకే విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు మన భాషను ‘దేశభాషలందు తెలుగులెస్స’ అని పొగిడాడు. ఇంతటి కీర్తిని గన్న మన తెలుగుభాష ప్రాచీన భాషగా కూడా గుర్తింపబడింది.

AP Board 6th Class Telugu వ్యాసాలు

3. ‘భారతదేశం గొప్పదనం’

మన భారతదేశం విశాలమయినది. ఉత్తరాన హిమాలయాలు, మిగిలిన దిక్కుల్లో సముద్రాలు, మన దేశానికి సహజ రక్షణను ఇస్తున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత జనాభా సంఖ్యలో మనదే రెండవ స్థానం.

మన దేశంలో మతాలు – భాషలు వేరయినా ప్రజలంతా ఒకే తాటిపై నిలుస్తారు. మనకు గంగా, గోదావరి వంటి జీవనదులు ఉన్నాయి. కావలసిన పంటలు పండుతాయి. మనది ప్రజాస్వామ్యదేశము. మనదేశంలో భారతము రామాయణము వంటి గొప్ప ఇతి హాసాలు పుట్టాయి. వేదాలు పుట్టాయి.

మనం క్రికెట్ లో ప్రపంచ కప్పు గెలిచాము. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి గొప్ప నాయకులు మనకు ఉన్నారు. దేశాభివృద్ధికి కావలసిన సహజ వనరులు ఉన్నాయి. ”

4. నన్నయ భట్టు నాకు నచ్చిన కవి

“నన్నయభట్టు” (నాకు నచ్చిన కవి)
రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం రాజధానిగా చాళుక్య సామ్రాజ్యాన్ని పాలించాడు. నన్నయ భట్టు ఆతని ఆస్థానంలో కవి. కులగురువు. సామాన్య జనులకు వేద ధర్మాలలోని గొప్పతనాన్ని తెలపడానికి రాజరాజు నన్నయ భట్టును తెలుగులో భారతాన్ని రచింపమన్నాడు.

ఆనాడు తెలుగులో రచన చేయడానికి ఎటువంటి భాష వాడాలనే విషయంలో ఒక స్పష్టత లేదు. నన్నయభట్టు ‘ఆంధ్రశబ్ద చింతామణి’ అనే వ్యాకరణం రాసి తెలుగు పదాలను ఉపయోగించే పద్ధతిలో ఒక స్పష్టత చేశాడు. వాగను శాసనుడు. శబ్దశాసనుడు అని పేరుగాంచాడు.

వ్యాకరణం రచించిన తరువాత తన మిత్రుడు, సహాధ్యాయి అయిన నారాయణ భట్టు సహాయం తీసుకొని, తెలుగులో భారతం రచించాడు. భారతంలో ఆది సభాపర్వాలను, అరణ్యపర్వంలో మూడు ఆశ్వాసాలను నన్నయ రచించాడు. తెలుగు భాషలో మొదటగా గ్రంథ రచన చేసి ‘ఆదికవి’ అని కీర్తింపబడ్డాడు.

భారతంలో ప్రధానంగా కౌరవపాండవుల కథ రాశాడు. ఆ కథతో పాటు మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి వంటి విషయాలు చెప్పాడు. ప్రతి కథలో మంచి సందేశం ఇచ్చాడు. నన్నయ భట్టు తెలుగు వారికి పూజ్యుడైన కవిశేఖరుడు.

5. సర్.సి.వి.

రామన్ సి.వి. రామన్ 1888లో తిరుచునాపల్లిలో పార్వతీ అమ్మాళ్, చంద్రశేఖర అయ్యర్ దంపతులకు జన్మించాడు. బాల్యం నుండి పరిశోధనపై ఆసక్తి ఉండేది. బాలమేధావిగా పేరుపొందాడు. 13 ఏళ్ళకు ఇంటర్ పూర్తిచేసి బి.ఏ. మొదటి తరగతిలో ఉత్తీర్ణుడు అయ్యాడు. భౌతిక శాస్త్రంలో యమ్.ఎ. చదివాడు.

కలకత్తాలో ఆర్థికశాఖ ఉపశాఖాధికారిగా ఉద్యోగంలో చేరాడు. ‘భారత వైజ్ఞానిక వికాస సంఘం’ సంస్థలో పరిశోధన ప్రారంభించాడు. కలకత్తా విశ్వవిద్యాలయం సైన్సు కాలేజీలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా చేరాడు. ఎంతోమంది భారతీయులను పరిశోధనకు ప్రోత్సహించాడు.

రామన్ నిత్యం పరిశోధనలు చేస్తూ “భారతదేశపు మేధావంతుడైన శాస్త్రజ్ఞుడు” అని పేరు పొందాడు. సూర్యునికాంతి ప్రయాణించేటప్పుడు కొన్ని పదార్థాలు కొన్ని రంగుల్ని గ్రహించి మరి కొన్నింటిని బయటకు విడుస్తాయని రామన్ కనిపెట్టాడు. సముద్రం సూర్యకాంతిలో నీలం రంగును బయటకు విడుస్తుంది. అందువల్లే సముద్రం నీరు నీలంగా ఉంటుందని రామన్ పరిశోధించాడు.

1930లో రామను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం రామనకు సర్ బిరుదాన్ని ఇచ్చింది. రామనకు ఎన్నో బహుమతులు వచ్చాయి. 1934లో రామన్ బెంగుళూరులో “ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్”ను స్థాపించి, దానికి తన ఆస్తిని అంతా రాసి ఇచ్చాడు. రామన్ గొప్ప శాస్త్రవేత్త.

AP Board 6th Class Telugu వ్యాసాలు

6. గ్రంథాలయాలు

తరతరాల విజ్ఞాన సంపదను, అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం అంటారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలు ఉన్నాయి. అమెరికాలోని ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోమ్ నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరు పొందాయి. మన దేశంలో చెన్నైలోని ‘కన్నెమరా’ గ్రంథాలయం, తంజావూరులోని, ‘సరస్వతీ మహలు’, హైదరాబాదులోని ‘శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం’, వేటపాలెంలోని ‘సారస్వత నికేతనం’ మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి.

అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నాళం కృష్ణారావు మొదలైన వాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి. గ్రంథాలయాలవల్ల చాలా లాభాలున్నాయి. గ్రంథ పఠనంవల్ల విజ్ఞాన వినోదాలు పొందవచ్చు. అక్కడ లభించే దిన, వార, పక్ష, మాసపత్రికలను చదివి రాజకీయ, సాహిత్య, క్రీడారంగాది విషయాలు తెలుసుకోవచ్చు. గ్రంథాలయాలు మనిషిని మనిషిగా మారుస్తాయి. దేశాభ్యుదయానికి, సమాజ వికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.

7. కంప్యూటర్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్ లో ‘డేటా’ ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్చితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్‌ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ వల్ల చాలా లాభాలున్నాయి. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు.

విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైన వాటి టెక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి.

కంప్యూటర్‌ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటిని మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు. ఆధునిక విజ్ఞాన ప్రగతికి నిదర్శనం కంప్యూటర్.

8. పర్యావరణం

పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం. మనచుట్టూ ఉండేది పరిసరం. పరిసరమంతా కాలుష్యంతో నిండిపోయింది. మానవ జీవితంపై యీ పరిసరాల కాలుష్య ప్రభావం ఉంటుంది. అదే అనారోగ్యానికి కారణమవుతుంది. కాబట్టి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.

పరిసరాలలో కాలుష్యం మూడు రకాలుగా ఉంటుంది. అవి :

  1. జలకాలుష్యం
  2. ధ్వని కాలుష్యం
  3. వాతావరణ కాలుష్యం.

1) జలకాలుష్యం :
నదుల్లో, కాలువల్లో, చెరువుల్లో స్నానాలు చేయడం, బట్టలుతకడం, పశువుల్ని కడగడం మొదలైన కారణాల వల్ల నీరు కలుషితమౌతుంది.

2) ధ్వనికాలుష్యం :
రోడ్లపై కార్లు, మోటార్ల హారన్స్, భారీ యంత్రాల కదలికలు, కర్మాగారాల శబ్దాలు మొదలైన వాటివల్ల ధ్వని కాలుష్యం ఏర్పడుతుంది.

3) వాతావరణ కాలుష్యం :
కర్మాగారాలు, బస్సులు, కార్లు, స్కూటర్లు మొదలైన వాటి నుండి వ్యర్థ వాయువులు పొగరూపంలో వాతావరణంలో ప్రవేశిస్తాయి. అందువల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.

పర్యావరణం కాలుష్యం కాకుండా ఉండాలంటే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలుష్యాలను నిరోధించాలంటే ఇంటా బయటా అంతటా చెట్లు విరివిగా పెంచాలి. ఇందువల్ల మంచి గాలి వస్తుంది. పరిసరాలు సమతుల్యం అవుతాయి.

9. అక్షరాస్యత

‘విద్య లేనివాడు వింత పశువు’ అని పెద్దలంటారు. చదవడం, రాయడం, లెక్కలు నేర్చుకోవటమే అక్షరాస్యత.

విద్య నేర్చినవాడు అన్ని రంగాల్లో రాణిస్తాడు. కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనదేశంలో చదువుకున్నవారి శాతం చాలా తక్కువ. దీనికి కారణాలు ప్రజల్లో చైతన్యం లేకపోవడం మరియు పేదరికం.

ప్రభుత్వం ప్రత్యేకంగా వయోజనులకోసం అక్షరాస్యతా పథకాలు ప్రారంభించింది. పగలంతా పనుల్లో మునిగిపోయినవారికోసం రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం జిల్లాల వారీగా సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాలు చేపట్టింది.

పనిపాటలు చేసుకుంటూ చదువుకోవాలనుకునేవారికోసం, మధ్యలో బడి మానేసిన పిల్లలకోసం అనియత విద్యాకేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ఇంట్లో కూర్చొని తీరిక వేళల్లో చదువుకోడానికి వీలుగా సార్వత్రిక పాఠశాల విద్య ఏర్పాటు చేశారు.

మనదేశంలో జనవిజ్ఞాన వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు సాక్షరతా ఉద్యమంలో మంకు ఆ విద్వాప్పుడు నాలు. ఎక్కువగా పాల్గొంటున్నాయి. సుఖసంతోషాలతో బతకాలంటే ప్రతివ్యక్తి విద్యావంతుడు కావాలి.

AP Board 6th Class Telugu వ్యాసాలు

10. ఆధునిక సాంకేతిక ప్రగతి

మానవ జీవితంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉపయోగం నిత్యకృత్యమయింది. గడియారం, రేడియో, టేప్ రికార్డర్, టి.వి., టెలిఫోన్, ఫ్రిజ్ ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువుల జాబితాను చెప్పవచ్చు. ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల జాబితాలోకి చెందిన వాటిలో కంప్యూటర్ ముఖ్యంగా పేర్కొదగింది. ఆధునిక సాంకేతిక ప్రగతికి నిదర్శనం కంప్యూటర్.

ఒకనాడు టెలిఫోన్ కనిపెట్టినందుకు, రేడియో తయారు చేసినందుకు ఆశ్చర్యపోయాం . ఇప్పుడు దేశ విదేశాలకు నేరుగా వెంటనే మాట్లాడే అవకాశం ఏర్పడింది. మూవింగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఫోన్లు, కాలెస్ ఫోన్లు, సెల్యులర్ ఫోన్లు ప్రవేశించాయి. ‘షేర్’ అనే అద్భుత సాధనం అందుబాటులోకి వచ్చింది. ‘దూరదర్శన్’ మనకి ఈనాడు అత్యవసర సాధనమయింది. ఇవన్నీ ఆధునిక సాంకేతిక ప్రగతికి నిదర్శనాలే.

కంప్యూటర్‌ను కనుక్కోవడంతో ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇది కంప్యూటర్ యుగం అనిపించుకుంటోంది. మనిషికన్నా వేగంగా చకచకా శాస్త్రీయంగా కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. “ఇంతింతై వటుడింతయై ……………..” అన్నట్లుగా ఈనాడు కంప్యూటర్ అన్ని రంగాలలో విస్తరించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కంప్యూటర్ తప్ప మరోమాట వినిపించదు.

మనిషి కొన్ని రోజుల్లోగానీ అందించలేని సమాచారం కంప్యూటర్ కొన్ని క్షణాల్లోనే అందిస్తుంది. కంప్యూటర్ లోని ఇంటర్నెట్ సదుపాయంవల్ల ప్రపంచంలో ఏ మూలనైనా జరిగే వింతలు విశేషాలూ క్షణాల్లో తెలుసుకోగలం. ఇంటర్నెట్లో ఉన్న గొప్ప సదుపాయం ఇ – మెయిల్ (e-mail). దీని ద్వారా మనం అనుకున్న సమాచారాన్ని కంప్యూటర్ లో ఇంటర్నెట్ కలిగి ఉన్న మరొక వ్యక్తికి కొన్ని క్షణాల్లోనే అందజేయవచ్చు. ఈ విధంగా ఆధునిక సాంకేతిక ప్రగతి దినదినాభివృద్ధి చెందుతోంది.

11. వార్తా పత్రికలు

వార్తలను అందించే పత్రికలను వార్తాపత్రికలు అంటారు. ప్రాచీనకాలంలో వార్తలను చేరవేయడానికి మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని వాడేవారు. విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందిన తరువాత ముద్రణాయంత్రాలు కనిపెట్టబడ్డాయి. వార్తాపత్రికల వ్యాప్తి జరిగింది.

ప్రపంచంలో మొట్టమొదటగా వెనిస్ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు. సుమారు క్రీ.శ. 1620 నాటికి వార్తాపత్రికలు వచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ‘ఇండియా గెజిట్’ అని కొందరూ, ‘బెంగాల్ గెజిట్’ అని కొందరూ చెబుతారు. 1850 నుంచి మన దేశంలో పత్రికల ప్రచురణ అధికమైంది.

వార్తాపత్రికలు అనేక భాషలలో వెలువడుతున్నాయి. మన ఆంధ్రభాషలో ఈనాడు, వార్త, అంధ్రభూమి, ఆంధ్రప్రభ, సాక్షి, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర మొదలైనవి బాగా ప్రచారంలో ఉన్న దినపత్రికలు.
వార్తాపత్రికలవల్ల లాభాలు చాలా ఉన్నాయి. వీటివల్ల ప్రపంచవార్తలు తెలుసుకోవచ్చు. విజ్ఞానం పెరుగుతుంది. ఇవి ప్రభుత్వం చేపట్టే పనులూ, లోపాలూ ప్రజలకి తెలియజేస్తాయి. ప్రజల కష్టనష్టాలూ, సమస్యలూ, అభిప్రాయాలూ ప్రభుత్వానికి తెలియజేస్తాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు వార్తాపత్రికలు కరదీపికలలాంటివి. ఇవి జాతీయాభివృద్ధికి, జాతి సమైక్యతకు దోహదపడతాయి.

12. దూరదర్శన్ (టి.వి.)

విజ్ఞానశాస్త్ర ప్రగతికి, మానవుడి ప్రతిభకి నిదర్శనం టెలివిజన్. ఇది బ్రిటన్లో 1936లో మొదట వ్యాప్తిలోకి – వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్ బర్డ్ 1928లో కనిపెట్టాడు.

రేడియోలో శబ్దాన్ని మాత్రమే వింటాం. శబ్దంతో పాటు దృశ్యాన్ని చూసే అవకాశం టెలివిజన్లో ఉంటుంది. టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. టి.వి.లు లేని ఊరు లేదు.

టి.వి.ల వల్ల చాలా లాభాలున్నాయి. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. దీనిద్వారా ప్రభుత్వం, వాణిజ్య సంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మనం స్వయంగా వెళ్ళి చూడలేని ప్రదేశాలెన్నో ఇందులో చూడవచ్చు.

విద్యారంగంలో, వైద్య రంగంలో, వాణిజ్య రంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో ఈనాడు టెలివిజన్‌కు తిరుగులేని స్థానం ఉంది. నిరక్షరాస్యతా నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్. ‘వీడియో’ పరిజ్ఞానానికి టి.వి. మూలకారణం. మన సంస్కృతిని కళలను కాపాడుకోవడానికి టి.వి. ఎంతగానో ఉపయోగపడుతుంది.

టి.వి.ల వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. వీటివల్ల కొందరు వృధా కాలయాపన చేస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతోంది. ఎక్కువగా చూడటంవల్ల కండ్ల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

13. ఒక పండుగ (దీపావళి)

మనం జరుపుకొనే ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఇది ప్రతిసంవత్సరం ఆశ్వయుజమాసం కృష్ణపక్షంలో వస్తుంది. దీన్ని రెండు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు నరక చతుర్దశి. రెండోరోజు దీపావళి అమావాస్య. ఈ దీపావళి పండుగను మన దేశంలో అన్ని రాష్ట్రాలవారు జరుపుకొంటారు.

నరక చతుర్దశిని గూర్చి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం నరకుడనే రాక్షసుడు లోకాల్ని బాధిస్తుండేవాడు. ఆ బాధలు భరించలేక ప్రజలు శ్రీకృష్ణునితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకునిపై యుద్ధానికి వెళ్ళి వాడిని సంహరించాడు. నరకుడు మరణించినందుకు ప్రజలందరూ సంతోషించారు. అది చతుర్దశినాడు జరిగింది. కాబట్టి నరక చతుర్దశి అనే పేర పండుగ చేసుకున్నారు. నరకునివల్ల. చీకటిలో మ్రగ్గిన ప్రజలు వెలుగు చూశారు. కాబట్టి దీపాల వెలుగులో మరునాడొక పండుగ చేసుకున్నారు.

నరక చతుర్దశి రోజు తెల్లవారు జామున లేచి పిల్లలు, పెద్దలు శిరస్నానం చేస్తారు. నూత్న వస్త్రాలు ధరించి, పిండివంటలతో భోజనాలు చేస్తారు. ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. దీపావళి రోజు రకరకాల టపాకాయలు, మతాబులు, చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలవంటి మందు సామానులు కాలుస్తారు. కొందరు దీపావళి పండుగరోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

AP Board 6th Class Telugu వ్యాసాలు

14. లాల్ బహదూర్ శాస్త్రి (జాతీయ నాయకుడు)

లాల్ బహదూర్ 1904 వ సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన వారణాసిలో జన్మించాడు. ఆయన తల్లి పేరు రామ్ దులారీదేవి, తండ్రి శారదా ప్రసాద్.

లాల్ బహదూర్ కాశీ విశ్వవిద్యాలయం నుండి ‘శాస్త్రి’ పట్టా పొందాడు. ఆనాటి నుండి లాల్ బహదూర్ శాస్త్రిగా ‘ పిలువబడ్డాడు. ఆయన భార్య పేరు లలితాదేవి.

మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో జవహర్ లాల్ నెహ్రూకు కుడిభుజంగా పనిచేశాడు. రవాణా, తంతి తపాలా శాఖలు, హోం శాఖ, పరిశ్రమల శాఖ, వాణిజ్య శాఖ, రైల్వేశాఖల మంత్రిగా భారతదేశానికి ఎంతో సేవ చేశాడు.

నెహ్రూ తర్వాత శాస్త్రి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. “జై జవాన్, జై కిసాన్” అన్న నినాదంతో భారతదేశాన్ని ఉర్రూతలూగించాడు. ఆయనలో పట్టుదల ఎక్కువ. నైతిక విలువలకు, నిజాయితీకి, నిరాడంబరతకు పెట్టింది పేరు. ఆయన 1966వ సంవత్సరం జనవరి పదకొండవ తేదీన మరణించాడు.

15. విజ్ఞాన యాత్రలు (విహార యాత్రలు)

విజ్ఞానాన్ని సంపాదించాలనే కోరికతో విద్యార్థులు చేసే యాత్రలను విజ్ఞాన యాత్రలు అంటారు. వీటినే ‘విహారయాత్రలనీ, వినోదయాత్రలనీ’ అంటారు.

పుస్తక పఠనంవల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరిగా చేయాలి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా గ్రహించాలంటే యాత్రలు చేయాలి. ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తుందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. జల విద్యుత్ కేంద్రానికి వెళ్ళి, పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు అది సంపూర్ణ జ్ఞానం అవుతుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాలను అర్థంచేసుకోడానికి యాత్రలు ఎంతో అవసరం.

విజ్ఞాన యాత్రలవల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటివల్ల లోకజ్ఞానం అలవడుతుంది. మానసిక విశ్రాంతి లభిస్తుంది. విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యార్థులలో ఐకమత్యం పెంపొందుతుంది.

విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం విద్యార్థులకే అనుకోవడం సరికాదు. అన్ని వయస్సుల వాళ్ళకీ, అన్ని వృత్తుల వాళ్ళకీ ఇవి అవసరమే.

16. చలనచిత్రాలు (సినిమాలు)

చలనచిత్రాలు అంటే ‘కదిలే బొమ్మలు’ అని అర్థం. వీటినే సినిమాలు అంటారు. పూర్వం ప్రజల విజ్ఞాన వినోదాల కోసం తోలుబొమ్మలాటలు, భామా కలాపాలు, వీథినాటకాలు ప్రదర్శింపబడుతుండేవి.

కెమేరాలు కనిపెట్టబడ్డ తరువాత ‘మూకీ’ చిత్రాలు ప్రదర్శించేవారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన తరువాత ‘టాకీ’ చిత్రాలు వచ్చాయి. ప్రపంచంలో నేడు చలనచిత్రరంగాన హాలీవుడ్ పేరుగాంచింది. మన దేశంలో ముంబాయి సినీరంగాన పేరుగాంచింది.

ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదాన్ని పొందడానికి ఈ సినిమాలు ఉపయోగిస్తాయి. ప్రపంచంలోగానీ, దేశంలోగానీ ఉన్న వివిధ సుందర దృశ్యాల్ని సినిమాలలో చూసి ఆనందించవచ్చు. సినిమాలు సాంఘికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా గొప్ప ప్రచార సాధనాలు.

నేడు ఈ పరిశ్రమ పెక్కుమందికి జీవనోపాధిని కలిగిస్తున్నది. అనేకమంది నటీనటులు, కళాకారులు దీనివల్ల ఐశ్వర్యవంతులవుతున్నారు. కార్మికులు, విద్యార్థులు, పిన్నలు, పెద్దలు అందరూ వీటిని చూసి మానసిక విశ్రాంతిని, వినోదాన్ని పొందుతున్నారు.

ఈ సినిమాలను సరైన పద్ధతిలో తీయకపోతే సమాజానికి చెడు కలుగుతుంది. కాబట్టి నిర్మాతలు కేవలం వ్యాపారదృష్టితోనే కాక, కళాత్మకపు విలువలను, నైతిక విలువలను పెంచే చిత్రాలను నిర్మించాలి.

17. రేడియో (ఆకాశవాణి)

రేడియోను ‘మార్కొని’ అనే ఇటలీ దేశస్థుడు కనిపెట్టాడు. శబ్దతరంగాలను విద్యుత్తరంగాలుగా మార్చి నిస్తంత్రీ విధానంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఎక్కడెక్కడి విషయాలను తెలియజేసే అద్భుత సాధనం రేడియో.

మన దేశంలో రేడియో కేంద్రాలు పెద్ద పెద్ద నగరాలలో ఉన్నాయి. వాటిని బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్లు అంటారు. కొన్ని ఉపకేంద్రాలు ప్రసారం మాత్రమే చేస్తాయి. వాటిని రిలే కేంద్రాలు అంటారు.

రేడియోలో వార్తలు, సంగీతం, నాటకాలు, సినిమాలు, హరికథలు, ప్రసంగాలు ప్రసారం చేయబడతాయి. అలాగే రైతులకు వ్యవసాయ కార్యక్రమాలు, మహిళలకు మహిళామండలి కార్యక్రమాలు, బాలబాలికలకు బాలానందం, యువకులకు యువవాణి కార్యక్రమాలు ప్రసారం చేయబడతాయి. ఈ

ఇంకా భక్తిరంజని కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, విద్యావిషయకమైన కార్యక్రమాలు, క్రీడలు, ధరవరలు, ప్రకటనలు మరెన్నోరకాల కార్యక్రమాలు రేడియోలో ప్రసారం చేయబడతాయి.

అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందిస్తూ, ప్రజలలో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాల్ని పెంపొందింపజేస్తున్న అద్భుతసాధనం రేడియో.

AP Board 6th Class Telugu వ్యాసాలు

18. గ్రామ సచివాలయాలు

2019 అక్టోబరు 2న నవ్యాంధ్రప్రదేశ్ సరికొత్త శకానికి నాంది పలికింది. గ్రామసీమలు స్వచ్ఛంగా ఉండాలని, అందుకు గ్రామ స్వరాజ్యమే ఏకైక మార్గమని గాంధీజీ అభిలషించారు. ఆ అభిలాషకు జీవంపోస్తూ గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. “ఈ ‘ప్రపంచంలో నీవు చూడాలనుకున్న మార్పు నీతోనే ఆరంభం కావాలి” అని మహాత్మాగాంధీ చెప్పిన మాటలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాంది పల్కింది.

1959వ సం||రంలో “బల్వంతరాయ్ కమిటీ” నివేదిక ఆధారంగా మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పాటైంది. ఈ అంచెలే గ్రామపంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లాపరిషత్. తరువాతి కాలంలో గ్రామపంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ గా వ్యవస్థీకృతమైనాయి. 73 రాజ్యాంగ సవరణ ద్వారా 29 శాఖలకు సంబంధించిన నిధులు, విధులు, అధికారాలు స్థానిక సంస్థలకు బదలాయింపు జరిగింది.

2001 సం||రంలో గ్రామ సచివాలయం ప్రవేశపెట్టినా గ్రామ ప్రజలకు సేవలు అందించకుండానే ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇంతేగాక సమాంతర వ్యవస్థల్ని ప్రవేశపెట్టి పంచాయతీరాజ్ సంస్థల్ని నిర్వీర్యపరిచారు.

ఈ పరిస్థితుల్లో ఈనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణులకు పలు సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశ్యంతో నవరత్నాలలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి కంకణం కట్టుకుంది. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల నియామకం జరిగింది.

గ్రామ ప్రజలకు పలు సేవలు అందించే ఉద్దేశ్యంతో ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించారు. వీరి ద్వారా గ్రామీణ ప్రజలు ప్రభుత్వపరంగా లభించే సర్టిఫికెట్లు, సేవలు,సంక్షేమ పథకాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో పంచాయతీ సంక్షేమ కార్యదర్శి, పోలీసు అసిస్టెంటు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్, గ్రామ సర్వేయర్, హార్టికల్చర్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు పోస్టుల్ని మంజూరుచేసింది. గ్రామ సచివాలయాల ద్వారా అవసరమైన ధ్రువపత్రాల జారీ నుంచి విద్యుత్తు బిల్లుల చెల్లింపు, గ్రామపంచాయతీ నిధుల విడుదల వినియోగం తదితర వివరాలు అందుబాటులో ఉంచాలి. రైతులకు మేలైన విత్తనాలు సరఫరా చేయడం, అవసరమైన క్రిమి సంహారక మందులు సరఫరా చేయడం, మేలైన పశువైద్యం, పింఛన్ల పంపిణీ, కుటీర పరిశ్రమలకు ఆర్థిక సహాయం, మార్కెటింగ్ కల్పన, భూములకు సంబంధించిన రికార్డులు త్వరితగతిన అందజేయడం వంటివి జరగాలి. వీటితోపాటు గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీ నిధుల విడుదల వినియోగంపై సమాచారం కూడా అందజేయవలసిన అవసరం ఉంది. ఇదంతా గ్రామవాలంటీర్ల బాధ్యతే. అందుకని గ్రామవాలంటీర్లు గ్రామ ప్రజలకు, సచివాలయాలకు అందుబాటులో ఉండి శ్రద్ధగా, సమర్థవంతంగా పనిచేయాల్సి ఉంది.

ఈ దశలో గ్రామ సచివాలయం పటిష్ఠతకు ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పంచాయతీలకు నిధులు సకాలంలో సమకూర్చడం, పంచాయతీ సొంత నిధుల వినియోగంపై CFMS తొలగించడం, సకాలంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి కేంద్రప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల్ని రాబట్టుకోవాలి. అలాగే సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సాంకేతిక నైపుణ్యం అందజేయడం, నిధుల వినియోగంపై ఆన్లైన్ ద్వారా తనిఖీ చేసే అధికారం పంచాయతీ విస్తరణాధికారికి కల్పించడం వంటివి చేయాల్సి ఉంది. కార్యక్రమాల అమలుకు మండల స్థాయిలో మరొక పంచాయతీ విస్తరణాధికారిని నియమించాలి. నిర్ణీత తేదీల్లో గ్రామ సభలు ఖచ్చితంగా జరిగేలా . చూడాలి. సచివాలయ నిర్ణయాలను మండల స్థాయిలో నెలకొకసారి సమీక్షించడం తప్పనిసరిగా జరగాలి. వీటన్నితోపాటు పంచాయతీ ఉద్యోగుల సమస్య కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. ముఖ్యంగా పంచాయతీ తాత్కాలిక సిబ్బంది సేవల్ని క్రమబద్దీకరించాలి. అన్నిస్థాయిల్లో గల ఖాళీలను వెంటనే భర్తీ చెయ్యాలి. మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, డివిజినల్ పంచాయతీ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు కల్పించడం ద్వారా ఆర్థిక అక్రమాల్ని అరికట్టే అవకాశముంటుంది. గణాంక ఆడిట్ విభాగాల ఏర్పాటు తప్పనిసరి. ఈవిధంగా గ్రామ సచివాలయాల్ని బలోపేతం చేయడం వల్ల మహాత్మాగాంధీ కన్న కలలు నిజమౌతాయి.

19. న్యా యమిత్ర

సామాన్యుడు ఆశించే వ్యవధిలోగా, కేసుల పరిష్కారం లభించాలని న్యాయస్థానాల ముఖ్య ఉద్దేశ్యం. దిగువస్థాయి న్యాయస్థానాల నుండి జిల్లా కోర్టులకు, అక్కడ నుండి హైకోర్టుకు, సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళి న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడం, అధికారులు, ప్రజల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, స్వల్పకాలానికి అధికారంలోకి వస్తున్న పార్టీలు వ్యవస్థను అతలాకుతలం చేయడంలో వ్యాజ్యాలు పెరిగాయి. వేలకొలది కేసులు పెండింగ్ లో పడ్డాయి. ఈ కేసుల విషయంలో సామాన్యుని పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అందుకని సామాన్యునికి సత్వర న్యాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం ‘న్యాయమిత్ర’ పథకాన్ని 2017 వ సం||రంలో ప్రవేశపెట్టింది.

1986వ సం||రంలోనే ‘లా’ కమీషన్ గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అంశంపై నివేదికను ఇచ్చింది. 2002 సం||రంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2007 నాటికి ప్రతి పదిలక్షలమంది జనాభాకు 50 మంది న్యాయమూర్తులుండాలి. ఇపుడున్నది కేవలం 16 మంది మాత్రమే.

భారత రాజ్యాంగం 39వ ఆర్టికల్ ఆదేశిక సూత్రాల్లో భాగంగా గ్రామ న్యాయాలయాల ముసాయిదా బిల్లు రాజ్యసభలో 2007 సం||రంలో ప్రవేశపెట్టబడింది. రాజ్యసభ బిల్లును అన్ని ప్రభుత్వ శాఖలకు, స్టాండింగ్ కమిటీలకు, న్యాయశాస్త్ర కోవిదులకు పంపించి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి, హైకోర్టు రిజిస్ట్రార్లతో ఒక భేటీ నిర్వహించి, వారి అభిప్రాయాలను కూడా తీసుకుని ఆ తర్వాత ముసాయిదాలో సవరణలు తెచ్చారు. లోక్ సభలో ఆమోదం అనంతరం కేంద్రప్రభుత్వం 2008 సం||రంలోగా బిల్లుగా తీసుకువచ్చింది. ఈ బిల్లు 2 అక్టోబరు 2009 నుండి అమలులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా తొలిదశలో 6000 న్యాయాలయాలను ఏర్పాటుచేయాల్సి ఉంది. పేదలకు వారి ఇంటివద్దనే న్యాయం అందించడమే దీని లక్ష్యం. కొత్త కేసులతో పాటు పాతకేసులను కూడా ఈ న్యాయాలయాలకు బదిలీ చేయాలని తొలుత నిర్ణయించారు.

గ్రామ న్యాయాలయాల్ని కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కనీసం ఏడాదిపాటు వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. తర్వాత కాలంలో కేంద్రం కొంతమేర ఆర్థికసాయం చేస్తుంది. కేవలం చట్టాల పరిధికే పరిమితం కాకుండా సహజ న్యాయ సూత్రాలకు లోబడి పనిచేయాలనే కీలక అంశం ఈ గ్రామ న్యాయాలయాల నిర్వహణలో ఉండడం అనేది అందరికీ కలిసొచ్చిన విషయం.

గ్రామాల్లో న్యాయ సహాయాన్ని తక్షణమే అందించేందుకు, సలహా సంప్రదింపులకు, మధ్యవర్తిత్వానికి, లోక్అదాలత్ ఏర్పాటుకు, ఉచిత న్యాయసహాయం, పేదలకు, బాలలకు, మహిళలకు అల్పసంఖ్యాక వర్గాల వారికి తక్షణ సాయం అందించేందుకు వీలుగా గ్రామ న్యాయాలయాలు పనిచేస్తాయి.

గ్రామ న్యాయాలయాల చట్టం – 2008ని హైకోర్టుకు పంపించి గ్రామ న్యాయాధికారుల్ని నియమించాలి. వారికి ప్రథమశ్రేణి మెజిస్టేట్ హెూదాతో పాటు సమాన జీతభత్యాల్ని చెల్లించాలి. ప్రతి నగర పంచాయతీ, గ్రామపంచాయతీల్లో కోర్టుల్ని ఏర్పాటు చేయాలి. మొబైల్ కోర్టుల్ని ఏర్పాటు చేయడంతోపాటు సివిల్, క్రిమినల్ కేసుల్ని కూడా విచారించే అధికారం ఈ న్యాయాలయాలకు ఉంటుంది. ఆస్తి కొనుగోలు, కాలువనీరు వినియోగంలో వివాదాలు, కనీస వేతన చట్టం అమలు, వ్యవసాయభూమి భాగస్వామ్య వివాదాలు గ్రామ న్యాయాలయాల పరిధిలోకి వస్తాయి. సివిల్ కేసుల్ని తొలుత రాజీమార్గంలో పరిష్కరించాల్సి ఉంటుంది.

గ్రామ న్యాయాలయాలు ఇచ్చే తీర్పులపై ఒక అప్పీలుకు వీలుంటుంది. తీర్పు అనంతరం 30 రోజుల్లో అసిస్టెంట్ జవద్ద అప్పీలు చేసుకోవచ్చు. తర్వాత ఈ తీర్పులపై అప్పీలుండవు. తద్వారా హైకోర్టులపై భారం తగ్గుతుంది. ఈ చట్టాన్ని 8 చాప్టర్లు, 40 క్లాజులతో రూపొందించారు.

మనదేశంలో 11 రాష్ట్రాల్లో 320 పంచాయతీల్లో మాత్రమే న్యాయాలయాల ఏర్పాటుపై నోటిఫై చేయగా అందులో 204 మాత్రమే తమ కార్యకలాపాల్ని ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా 50వేల పంచాయతీల్లో ప్రారంభంకానున్నాయి. ఇవి కూడా ప్రారంభమైతే గాంధీజీ కన్నకలలు పండి గ్రామాభ్యుదయం జరుగుతుందనుట నిర్వివాదాంశం.

AP Board 6th Class Telugu వ్యాసాలు

20. సుజల స్రవంతి

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడున్న సాగునీటి వనరుల్ని అభివృద్ధి చెయ్యాలి. ఉత్తరాంధ్రలో మొత్తం 23.24 లక్షల ఎకరాలు సాగుభూమి ఉండగా అందులో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఉత్తరాంధ్ర ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి కష్టాల్ని పరిష్కరించడానికై ఒకే ఒక్కమార్గం “బాబూ జగజ్జీవనరామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి” ప్రాజెక్టును పూర్తిచేయడమే తప్ప మరో మార్గం లేదు.

విశాఖపట్టణంలో 3.21 లక్షల ఎకరాలు; విజయనగరంలో 3.94 లక్షల ఎకరాలు; శ్రీకాకుళం జిల్లాలో 0.85 లక్షల ఎకరాలు; మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 12 వందల గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. 53.40 TMCలు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతుల్ని GO.MS No. 3 తేది 02 – 01 – 2009న 7,214. 10 కోట్ల రూపాయలతో పూర్తిచేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు.

అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డి 21 ఫిబ్రవరి 2009న ఈ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారు. దీన్ని గురించి తర్వాత వచ్చిన నాయకులెవ్వరూ పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ 2014 సం||రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి “ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధన సమితి” వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో పలు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వంలో చలనం వచ్చి ఈ ప్రాజెక్టు పనులపైన కొంత దృష్టి సారించింది.

5 సెప్టెంబరు 2017న G.O.MS No. 53 ప్రాజెక్టుకు మొదటి దశ పనులకు 2022.22 కోట్లకు పరిపాలనా అనుమతుల్ని మంజూరు చేసింది. 2009 నాటి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 7,214.10 కోట్ల వ్యయం అవుతుంది. ధరల పెరుగుదల, రూపాయి విలువ తరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టు వ్యయం కనీసం 30,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం కేటాయించిన విధంగా నిధులు ఇస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తికావడానికి కనీసం 176 ఏళ్ళు పడుతుంది.

గోదావరి వరదనీరు వృధాగా సముద్రంలోకి కేవలం 120 రోజులపాటు కాలువల్లోకి ఎత్తిపోసి, 196 కిలోమీటర్లు పొడవునా కాలువలు నిర్మించి నాలుగు రిజర్వాయర్లలో నిలువ చేయడం ద్వారా ఉత్తరాంధ్ర సాగు, తాగు నీరు అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టును నిర్దేశించారు. పోలవరం ఎడమ కాలువనుండి ఉత్తరాంధ్రకు నీటిని మళ్ళించేందుకు మూడుచోట్ల ఎత్తిపోతల పథకాలను నిర్మించాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద మొదటిదశలో 28 మీటర్లు పాపాయిపాలెం వద్ద రెండవదశలో 45 మీటర్లు, చివరి దశలో 4 రిజర్వాయర్ల వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాల్సి ఉంది. విశాఖజిల్లా రావికమతం వద్దనున్న పెద్దపూడి రిజర్వాయర్, భూదేవి రిజర్వాయర్, విజయనగరం జిల్లాలోని S. కోట వద్దనున్న వీరనారాయణం రిజర్వాయర్ తాటిపూడి వద్ద ఎటెన్షన్ రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంది. మొత్తం 4 రిజర్వాయర్లలో 19.70 టి.యం.సీల నీటిని నిలువ చేసేందుకు 339 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది.

వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాలకు దీటుగా అభివృద్ధి చెందాలంటే ఉత్తరాంధ్ర ‘సుజల స్రవంతి’ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడమే శరణ్యం తప్ప మరో మార్గం లేదు. ఈ ప్రాంత అభివృద్ధికి జీవనాధారమైన ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రతి ఒక్కరూ గొంతెత్తాల్సిన సమయం ,ఆసన్నమైంది.

21. అమ్మ ఒడి

మన ఆంధ్రప్రదేశ్ లో చదువుకోని సంఖ్య ఇంకను 40% ఉందని చారిత్రకుల అంచనా. పైచదువులు చదువుటకై ఆర్థిక స్తోమత లేనివారు, 30% ఉన్నారు. బాల్యంలో చదువుకొనుటకు ఆర్థిక స్తోమత లేని పేదవారికి ధనసహాయం ప్రభుత్వమే చేసి చదివిస్తుంది. ఇలా సహకారంగా చేయూతనిచ్చే పథకానికి ‘అమ్మ ఒడి’ పథకం అని పేరు. అక్షరాస్యతను పెంచడమే అమ్మ ఒడి పథకం లక్ష్యం.

అమ్మ ఒడి పథకానికి ప్రభుత్వం కొన్ని అర్హతల్ని నిర్దేశించింది. అవి (1) ప్రభుత్వం జారీచేసిన తెల్లరేషన్ కార్డు ఉండాలి. (2) లబ్దిదారుని తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి. (3) ఈ పథకం 1వ .తరగతి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు వర్తిస్తుంది. (4) విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగియుండాలి. (5) ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కారు. పిల్లల్ని బడికి పంపే ప్రతి పేదతనికి ప్రతిసం||రం రూ. 15,000 రూపాయల్ని ఇస్తుంది. అన్ని ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థుల తల్లులకు ఇస్తారు. దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు, తద్వారా దాదాపుగా 82 లక్షలమంది పిల్లలకు లబ్ధి చేకూరుతుంది. ఇందుకుగాను ప్రభుత్వం రు. 6456 కోట్లు ఏటా ఖర్చు చేస్తుంది.

భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లులు గురించి వారి పిల్లల గురించి ఆలోచించి 9 జనవరి 2020న చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. చదువుకు పేదరికం అడ్డురాకుండా సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే నేటి ప్రభుత్వ లక్ష్యం.

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యాబోధన కావిస్తూ, తప్పనిసరి సబ్జక్టుగా తెలుగును చదవాలి. 2020 – 21 విద్యాసంవత్సరం నుండి అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన ; ఆ తర్వాత సం||రం నుండి 7వ తరగతి, ఆ తర్వాత 8వ తరగతి దశలవారీగా ప్రతి సం||రం ఒక్కో తరగతిని పెంచుకుంటూ నాలుగేళ్ళలో 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇంగ్లీషు మీడియంలో వ్రాసే విధంగా బోధన జరుగుతుంది.

మధ్యాహ్న భోజన మెనూను మార్చి నాణ్యతను పెంచి పౌష్టికాహారం అందించటానికిగాను 353 కోట్లు .. కేటాయించారు. 21 జనవరి 2020 నుండి దీన్ని ప్రారంభిస్తారు. సోమవారం నాడు అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, చిక్కి, మంగళవారం నాడు పులిహోర, టమాటాపప్పు, ఉడికించిన గుడ్డు, బుధవారం నాడు కూరగాయలతో అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి గురువారం నాడు పెసరపప్పు అన్నం (కిచిడి), టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు, శుక్రవారం నాడు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి శనివారం నాడు అన్నం, సాంబారు, స్వీట్ పొంగలి. ఈ విధంగా బాలబాలికలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మధ్యాహ్న భోజనం ఏర్పాటు, చేసింది.

తర్వాత డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కోర్సులు చదివే ST, SC, BC, EBC, కాపు, దివ్యాంగ, మైనార్టీ , మరియు పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయంబర్స్మెంటు చేయుట. ఈ ఫీజు రీయింబర్స్మెంటు పథకం – అర్హతకు – వార్షిక ఆదాయం పరిమితి రు.2.5 లక్షలకు పెంపు చేశారు.

అంతేకాకుండా ST.SC, BC, EBC, కాపు, దివ్యాంగ, మైనార్టీ మరియు పేదవిద్యార్థులకు వసతితో భోజనం ఏర్పాటు చేయుటకు అయ్యే ఖర్చు రు. 20,000 రెండు దఫాల్లో ఇస్తారు. మొదటి దఫా రు. 10,000 జనవరి, ఫిబ్రవరిలోను; . రెండవ దఫా రు. 10,000 లు జులై-ఆగష్టులలో చెల్లిస్తారు.

ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో నున్న పేద విద్యార్థులకు మౌఖిక మరియు సాంకేతిక సౌకర్యాల్ని ప్రభుత్వం కల్పించింది. నిరక్షరాస్యత సమూలంగా నశింపచేస్తారు. ప్రతి పేదవిద్యార్థి ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తారు. మేము పేదవాళ్ళం అనే భావన ఉండదు. చదువుకోవాలని ఆసక్తి కల్గుతుంది. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్న సూక్తి నేడు నిజం అవుతోంది. దేశభక్తి విద్యార్థుల్లో అభివృద్ధి అవుతుంది. మానవులంతా ఒక్కటే అనే జ్ఞానం కల్గుతుంది. విద్యార్థులంతా కలసి అన్నదమ్ముల్లా మెలగుట వల్ల తరతమ భేదాలు నశిస్తాయి.

ఏమైనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ముదావహం. ప్రతి విద్యార్థి అక్షర జ్ఞానాన్ని సంపాదించుకొని మేధావులవుతారన్నది అక్షరసత్యం.

AP Board 6th Class Telugu వ్యాసాలు

22. నాడు – నేడు (విద్యావ్యవస్థ)

ఈనాటి విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండుటవలన నేటి ప్రభుత్వం ‘నాడు – నేడు’ అనే పేరుతో ఒక పథకాన్ని 14 నవంబరు 2019న ప్రారంభించింది. ఇప్పుడున్న పాఠశాల పరిస్థితిని ఫోటో తీసి రికార్డు చేస్తారు. తర్వాత ఆ పాఠశాలకు కావలసిన సౌకర్యాల్ని రూపొందించి ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. పూర్తి అయిన తదుపరి మరల ఫోటోతీస్తారు. నాటికీ – నేటికీ ఉన్న తేడాను గమనిస్తారు. తర్వాత ఇంకను కావలసిన అవసరాలుంటే వాటిని కూడా పూర్తిచేస్తారు. ఇదియే ‘నాడు – నేడు’ పథక ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14 నవంబరు 2019న ప్రకాశం జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా సుమారు 45,000 పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 151 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 3287 ప్రభుత్వ హాస్టళ్ళ రూపురేఖలు సమూలంగా ఈ కార్యక్రమం క్రింద అభివృద్ధి చేయాలని నిర్దేశించారు.

పాఠశాలల్లో మౌలిక వసతులైన మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరీల్ని నిర్మించుట, క్రీడామైదానాన్ని ఏర్పాటు చేయుట, ఫర్నిచర్ ను రూపొందించుట, కరెంటు, ఫ్యాన్లను ఏర్పాటు చేయుట, పక్కా భవనాల్ని నిర్మించి వాటికి రంగులు వేయుట ఇవన్నీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయుట, ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని నేటి ప్రభుత్వం వెల్లడించింది. ప్రతిపాఠశాలలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి జాబితాను సిద్ధం చేసుకొని పారదర్శకంగా నిర్వహించి పరీక్షిస్తారు. ప్రతి పాఠశాలలో తొమ్మిది రకాల పనుల్ని చేపట్టాలని ఈనాటి ప్రభుత్వం ఆదేశించింది. మూడుదశలుగా ఈ కార్యక్రమాల్ని అమలుచేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యాకమిటీల్ని భాగస్వామ్యం చేస్తారు.

విద్యాసంవత్సరం ప్రారంభమైన వెంటనే పుస్తకాలు, జతబూట్లు పంపిణీ చేస్తారు. అవసరమైన పాఠ్యప్రణాళికలతో విద్యార్థుల సంఖ్యకు తగ్గ ఉపాధ్యాయులుండేలా చర్యలు చేపడతారు. తొలిదశలో 15వేల పాఠశాలల్లో అమలుచేస్తారు. అంతేకాక మండలాల్లో ఉత్తమ హైస్కూల్ ని ఎంపికచేసి జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేస్తారు. 500 మంది విద్యార్థులున్న హైస్కూళ్ళను ఈ పరిధిలోకి తెస్తారు. 2020 -2021 విద్యాసంవత్సరం నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. 2021 నాటికి 9వ తరగతికి అమలుచేస్తారు. అంతేగాక పాఠశాలలు తెరిచే నాటికి 3 జతల యూనిఫామ్ లు, పుస్తకాలు, నోటు పుస్తకాలు, బెల్ట్ బ్యాగ్ తో కూడిన కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆంగ్లభాషా నైపుణ్యాన్ని పెంపొందించేలా ప్రతిపాఠశాలలో ఇంగ్లీషు ల్యాబీలు ఏర్పాటుచేయుట. ఈ పథకం అమలుకు 14 వేల
కోట్లు కేటాయిస్తారు.

పాఠశాలలకు సంబంధించిన పరిపాలనా అంశాలతో పాటు నిర్వహణలో కూడా పిల్లల తల్లిదండ్రులతో కూడిన విద్యాకమిటీలు కీలకపాత్ర పోషిస్తాయి. పాఠశాల అభివృద్ధి తర్వాత దశలో జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటిఐ, గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళను అభివృద్ధి చేస్తారు.

ఇంకను పాఠశాలలకు కావల్సిన సైన్స్ లాబ్స్, సోషల్ లాబ్, లైబ్రరీలు ఏర్పాటుచేసి, విద్యార్థుల విజ్ఞానానికి దోహదం చేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉత్తమ విద్యార్థిగా ఎదుగుటకు అవకాశం కల్గుతుంది. అన్ని రంగాల్లో కూడా విజ్ఞానాభివృద్ధిని పెంపొందించుకుంటారు. చదువుతో పాటు ఆటలుకూడా విజ్ఞానాభివృద్ధికి దోహదం చేస్తాయి. ఆటలందు మంచి క్రీడాకారులుగా ఎదిగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆటలాడి ఉత్తమ క్రీడాకారులవుతారు.

ఏమైనను నేటి ప్రభుత్వం విద్యావ్యవస్థ యందు తీసుకున్న నిర్ణయాల వల్ల ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడతారు.

23. వలసలు

జీవనోపాధి కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడాన్ని వలసలు అని అంటారు. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. ఒక ఊరి నుండి మరొక ఊరికి; పల్లె నుండి పట్నానికి ; పట్నం నుండి పల్లెకు ; ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ; ఒక దేశం నుండి మరొక దేశానికి ; ఒక ఖండం నుండి మరొక ఖండానికి జీవనం కొరకు వలసలు వెడుతుంటారు. వలసలు వెళ్ళడానికి సైతం విభిన్న పరిస్థితులతో కూడుకొని ఉంటాయి. పెళ్ళిళ్ళరీత్యా మరియు చదువుల నిమిత్తం కొందరు ; బ్రతుకు దెరువుకై కొందరు ; వ్యాపార నిమిత్తం మరికొందరు వలసలు వెడుతుంటారు.

వివిధ దినపత్రికలు, టీవీలలో, మాసపత్రికలలో వెలువడిన వ్యాసాలు, పరిశోధన పత్రం ద్వారా దీనిని విపులంగా వివరించిన మాట వాస్తవం. ప్రభుత్వం సైతం వాటిని నియంత్రించడానికి పలు పథకాల్ని ప్రవేశపెట్టినప్పటికీ అనుకున్నంత ప్రగతి సాధించలేదన్నది నిజం.

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా తయారయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లలో చేపట్టే అభివృద్ధి పథకాల్ని కాంట్రాక్టర్లకు అప్పగించడం ఆనవాయితీ. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో పనిచేసే పనివారి గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుమనక మానదు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పట్నాలకు వలసలు వెళ్ళే కార్మికులు భవనాల నిర్మాణంలో ఎక్కువగా పనిచేస్తూ, మిగతా చిన్న చితక పనులు చేయడానికి మొగ్గుచూపుచున్నారు. వారి సంపాదన తక్కువగా ఉండి ఖర్చులు అధికంగా ఉండటం మూలంగా నగరాల్లో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ కాలం గడుపుతుంటారు.

బీహార్ రాష్ట్రం నుంచి వలస కార్మికులు కొంతమంది తెలంగాణాలోని జాతీయ రహదారులకు ఇరువైపుల ధనవంతులు వ్యసాయం భూమిని కొనుగోలు చేసి అక్కడ వివిధ పండ్లతోటల పెంపకం చేపడుతూ, అందులో పనిచేయడానికి ఈ రాష్ట్రం నుండి వచ్చిన వ్యక్తుల్ని నియమించుకోవడం జరుగుతోంది. అలాగే బడా కాంట్రాక్టర్లు వివిధ రహదారుల ఏర్పాటు నిమిత్తం రకరకాల బ్రిడ్జిలు, వంతెనలు, ప్రాజెక్టులు, డ్యాముల నిర్మాణంలో పనిచేసే కార్మికులు ఎక్కువగా ఈ ప్రాంతానికి చెందినవారు.

బోర్ వెల్స్ లో పనిచేసే కార్మికుల్లో అత్యధికమంది ఛత్తీస్ డ్ కు చెందిన ఆదివాసులే ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ, ఎలాంటి లాభార్జన లేకుండా ఏదో మోటు కష్టానికి పరిమితమై పనిచేస్తూ ఎప్పుడు ఎక్కడ ఉంటారో వారికే తెలియకుండా పనిచేస్తూ కాలం గడుపుతుంటారు.

భాగ్యనగరంలో ఇటుకల తయారీలో ఎక్కువగా ఒడిషా రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. వారు నామమాత్రపు డబ్బులు తీసుకొని యజమానుల క్రింద పనిచేస్తుంటారు. పేదరికంతో ముందుగానే వారి వద్ద డబ్బులు తీసికొని అప్పు తీర్చుటకు నెలలకొద్దీ పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణాకు వలసలు వచ్చి పండ్లతోటలలో పనిచేస్తున్నారు.

“ఎన్నో కష్టాలు, మరెన్నో చీదరింపులు, వేధింపుల మధ్య పనిచేస్తూ పొట్టకూటి కోసం పనిచేస్తున్న వలసకూలీల బ్రతుకులను మార్చేవారే లేరు సరికదా! అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టినా ఆ ఫలాలు ఎవరికి వెళుతున్నాయో అర్థం కాని పరిస్థితి.

దేశంలో రోజు రోజుకు నిరుద్యోగత పెరిగిపోతోంది. ఎలాంటి ఉన్నతమైన చదువులు చదివినా నేటికీ తల్లిదండ్రులపై ఆధారపడి జీవించే పరిస్థితులు నెలకొన్నాయి. ‘కనుక ముందు ప్రభుత్వాలు మేల్కొని పల్లెల్లో వ్యవసాయానికి తగిన పరిశ్రమలు నెలకొల్పాలి. అర్హత కలిగిన వారికి ఉద్యోగాలివ్వాలి. కూలీలకు శాశ్వతమైన వేతనంతో కూడిన పనిని కల్పించాలి. ప్రజలు వలసలు వెళ్ళకుండా ప్రభుత్వమే అరికట్టాలి.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలసకూలీల పట్ల, శ్రామిక వర్గాల పట్ల అండగా ఉంటూ, రక్షణనిస్తూ, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకునేలా ప్రత్యక్ష చర్యలు తీసుకునే విధంగా చట్టాల్ని రూపొందించాలి. ఈ వలసల నియంత్రణను కావించాలి. వలసలు వెళ్ళేవారికి ఆర్థికపరమైన భరోసా ఇవ్వాలి. అప్పుడే మన భారతదేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనటంలో అతిశయోక్తి లేదు.

AP Board 6th Class Telugu వ్యాసాలు

24. కరోనా

కరోనా వైరస్ చైనాలోని ఊహాన్ నగరంలో పుట్టి అన్ని ప్రాంతాలకు పాకుతుండడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఈ వైరస్ అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొదట ఈ వైరస్ ఎలా పుట్టిందో అన్న విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నాల్లో అనేక సంచలన విషయాలు తెలిశాయి.

చైనాలో కైట్, కోబ్రా అను రెండూ కూడా విషపూరితమైన సర్పాలు, ఎక్కువగా ఉంటాయి. ఈ విషపూరితమైన … పాములు కరవడం వల్ల లేదంటే వాటిని తినడంవల్లను వైరస్ సోకి ఉండవచ్చు అని అంటున్నారు. ఈ వైరస్ సోకిన 28 రోజుల్లోగా మనిషి మరణిస్తాడు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి యాంటీయాక్షన్ మెడిసన్ తయారుచేసే పనిలో నిమగ్నమై పోయింది చైనాదేశం. ఇప్పటికే వేలకొలది మనుష్యులకు వైరస్ సోకిందని చైనా ప్రభుత్వం చెప్తోంది.

కొత్తగా పుట్టుకు వచ్చిన – ‘కరోనా’ వైరస్ ప్రాణాంతకంగా మారుతోంది. ఇది శ్వాస వ్యవస్థపై పంజా విసరి ప్రాణాల్ని హరిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

1937వ సం||రంలో ఈ కరోనా వైరస్ ను కనిపెట్టారు. ఈ వైరస్ ఎక్కువగా కోళ్ళు , చుంచు ఎలుకలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పందులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గబ్బిలాల ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమౌతోంది. కొన్నిరకాల కరోనా వైరస్లు మానవుల్లో కూడా సాధారణ జలుబు, ఫ్లూఫీవర్ వంటి స్వల్పకాలిక వ్యాధులకు కారణమవుతున్నాయని 1960 సం||రంలో గుర్తించారు. కాలక్రమేణా ఈ వైరస్లో ఉత్పరివర్తనలు జరిగి మనిషికి ప్రాణాంతక వైరస్లుగా మారాయని వైద్య పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరురకాల హ్యూమన్ కరోనా వైరస్లను గుర్తించారు. వీటినే 229 E – ఆల్ఫా కరోనా వైరస్ ; OC 43 — బీటా కరోనా వైరస్ ; HRU. I – బీటా కరోనా వైరస్ ; సార్స్ కరోనా వైరస్ ; మెర్స్ కరోనా, వైరస్ ; నోవెల్ కరోనా వైరస్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం చైనాలోని ఊహాన్ – నగరంలో విజృంభిస్తున్న వైరసను నోవెల్ కరోనా వైరస్ గా గుర్తించారు.

ఈ వైరస్ సోకిన రెండు మూడు రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణా జిట్టి మైల్డ్, మోడరేట్, సేవియర్ లక్షణాలుగా విభజించారు. మైల్డ్, మోడరేట్ లక్షణాల్లో ముక్కుల నుంచి స్రావాలు కారడం (రన్నింగ్ నోస్), దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, నీరసం, నిస్సత్తువ, ఫ్లూజ్వరం, కామన్ కోల్డ్ లాంటి లక్షణాలుంటాయి. వైరస్లు 1 శ్వాసనాళాలు, శ్వాసకోశాలకు వ్యాపించినపుడు బ్రాంకైటీస్, న్యుమోనియా లక్షణాలు బయటపడతాయి. తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు, ఊపిరి పీల్చడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలుంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, అవయవాలు మార్పిడి చేయించుకున్న వారిలో క్యాన్సర్, ఎయిడ్స్ బాధితుల్లో, ఎక్కువ కాలం విచక్షణా రహితంగా స్టెరాయిడ్స్ వాడిన వారిలో, ఊపిరితిత్తుల వ్యాధుల బాధితులు, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణుల్లో వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

మంచినీరు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు గుర్తించిన “వెంటనే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించాలి. వ్యాధిపై అప్రమత్తతతో ఉండి ముఖానికి మాస్క్ ధరించాలి. వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలకు, కోళ్ళఫారాలు, జంతు సంరక్షణశాలలు, కబేళాల దగ్గరకు వెళ్ళకూడదు. అనుమానితులకు ఇతరులు దూరంగా ఉండాలి. దగ్గినా, తుమ్మినా కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. తరచూ చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా మానవాళి జాగ్రత్తలను పాటించినచో మానవులు ఎటువంటి రోగాల బారినపడకుండా సుఖంగా ఉంటారు.

AP Board 6th Class Telugu లేఖలు

SCERT AP Board 6th Class Telugu Solutions 6th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu లేఖలు

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలియజేస్తూ పత్రికా సంపాదకునికి లేఖ

తిరుపతి,
XXXXXXX.

గౌరవనీయులైన
పత్రికా సంపాదకులు,
ఈనాడు పత్రికా కార్యాలయం,
తిరుపతి.

అయ్యా ,
మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే వాతావరణం ప్రశాంతంగాను, ఆరోగ్యకరంగాను ఉంటుంది. ఈ ఉద్దేశ్యంతోనే భారత ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ స్థాయిల్లో విజయవంతంగా అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అవసరం. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి. ముందుగా ప్రజలు తమ ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే నిర్మలమైన వాయువును మనం పీల్చగలుగుతాము. స్వచ్ఛభారత్ కార్యక్రమ లక్ష్యాలపై మీ పత్రిక ద్వారా ప్రజల్లో అవగాహన పెంచవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
మీ విధేయుడు,
పి. ప్రభాకర్.

చిరునామా :
గౌ|| పత్రికా సంపాదకులు,
‘ఈనాడు’ పత్రికా కార్యాలయం,
తిరుపతి, చిత్తూరు జిల్లా,

మీ ఊరిలో చూడదగిన ప్రదేశాల గురించి మిత్రునికి లేఖ

అమలాపురం,
XXXXXXX

మిత్రుడు రవిరాజాకు,

ఇక్కడ మేమంతా క్షేమం. మీ ఇంట్లో అంతా క్షేమం అని తలుస్తాను. నీవు మా ఊరు వేసవి సెలవుల్లో తప్పక రా. మా ఊళ్ళో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

మా ఊరిలో కొబ్బరి తోటలు ఎంతో ఆకుపచ్చగా అందంగా ఉంటాయి. తోటల ప్రక్కన వరిచేలు గాలికి ఊగుతూ మనల్ని రమ్మని పిలుస్తూ ఉంటాయి. పనస చెట్లు పళ్ళతో నిండి ఉంటాయి. మా ఊరికి దగ్గరలోనే గౌతమీ నది ఉంది. ఆ నదిలో పడవ ప్రయాణం, లాంచి ప్రయాణం కూడా మంచి మజాగా ఉంటాయి. కాలువలు అందులో పడవలు, బాతుల విహారం చూడ్డానికి ఎంతో బాగుంటాయి.

నీవు తప్పక రా. నీకోసం మా ఇంట్లో అంతా ఎదురుచూస్తూ ఉంటాము. నీకు కోనసీమ అందాలు చూపిస్తా.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
రాజారావు.

చిరునామా:
కె. రవిరాజా, 6వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
క్రోసూరు, కృష్ణా జిల్లా,

AP Board 6th Class Telugu లేఖలు

విహారయాత్రను గూర్చి స్నేహితునికి / స్నేహితురాలికి లేఖ

నిడదవోలు,
XXXXXXX

ప్రియమైన విరజకు,

శుభాకాంక్షలతో కల్పన వ్రాయునది.

నేను వేసవి సెలవులలో హైదరాబాదు విహారయాత్రచేసి వచ్చాను. అక్కడ చూడాల్సిన వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాలార్జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, నెహ్రూ జంతుప్రదర్శనశాల (జూ), చార్మినార్, బిర్లామందిర్, అసెంబ్లీహాల్, గోలకొండ మొదలైనవి చూసి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాల సౌందర్యాన్ని అందరూ తప్పక చూడవలసిందే. కాబట్టి హైదరాబాదును నీవు కూడా దర్శించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
జి. కల్పన.

చిరునామా :
కె. విరజ, 6వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా.

సెలవు కోరుతూ ప్రధానోపాధ్యాయుడికి లేఖ

విజయవాడ,
XXXXXXX

ప్రధానోపాధ్యాయుడు,
ఎ.కె.ఆర్. హైస్కూలు,
గవర్నరుపేట,
విజయవాడ – 2.

అయ్యా,
వినయపూర్వక నమస్కారం. రామ్ కుమార్ అనే నేను తమ హైస్కూలులో ఆరవ తరగతి చదువుతున్నాను. నాకు గత నాల్గు రోజులుగా ఆరోగ్యం బాగా ఉండటం లేదు. డాక్టరుగారు మద్రాసు వెళ్ళి వైద్యం చేయించుకోవలసిందిగా సలహాయిచ్చారు. అందువల్ల నేను పాఠశాలకు హాజరుకాలేకపోవుచుంటిని. తమరు దయతో నేటి నుంచి వారం రోజులు సెలవును మంజూరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తిరిగి రాగానే డాక్టరు సర్టిఫికెట్ జతపరచగలవాడను.

ఇట్లు,
తమ విధేయుడు,
రామ్ కుమార్,
6వ తరగతి.

AP Board 6th Class Telugu లేఖలు

పండుగను గురించి స్నేహితురాలికి లేఖ

శ్రీకాకుళం,
xxxxxxx

ప్రియ స్నేహితురాలు శైలజకు,

నేను బాగా చదువుతున్నాను. నీ చదువు ఎలా సాగుతున్నది ? నేను ఈ లేఖలో నాకు బాగా నచ్చిన దీపావళి పండుగను గురించి వ్రాస్తున్నాను. దీపావళి పండుగకు మా నాన్నగారు రకరకాల మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు ఎన్నో తీసుకువస్తారు. నేను, మా అన్నయ్య, మా తమ్ముడు ముగ్గురం కలిసి సరదాగా కాలుస్తాం. మేము – పువ్వొత్తులు కాలుస్తుంటే మా తల్లిదండ్రులు చూసి ఎంతో ఆనందిస్తారు. కాంతులను విరజిమ్మే ఈ పండుగ అంటే నాకెందుకో చెప్పరానంత ఇష్టం.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
ఆర్. అన్విత.

చిరునామా :
జి. శైలజ, 6వ తరగతి,
బాలికల పాఠశాల,
తిరుపతి, చిత్తూరు జిల్లా,

సోదరి వివాహానికి మిత్రుడిని ఆహ్వానిస్తూ లేఖ

అమలాపురం,
xxxxxxxప్రియ మిత్రమా,నేను క్షేమంగా ఉన్నాను. నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. ఈ నెల 28వ తారీఖున మా సోదరి వివాహం తిరుపతిలో జరుగుతుంది. కాబట్టి నీవు తప్పక రావలసిందిగా కోరుతున్నాను. మీ నాన్నగారికి అమ్మగారికి నా నమస్కారములు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
ఆర్. హరికృష్ణ,

చిరునామా :
పి. నిఖిల్, 6వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
చీరాల, ప్రకాశం జిల్లా,

రిపబ్లిక్ దినోత్సవ లేఖ (గణతంత్ర దినోత్సవం)

అనంతపురం,
xxxxxxx

ప్రియ స్నేహితుడు క్రాంతికుమార్‌కు,

గడచిన జనవరి 26న మా పాఠశాలలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకొన్నాం. నాటి సమావేశానికి మా జిల్లా విద్యాశాఖాధికారి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆయన భారత రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని గూర్చి చక్కగా ఉపన్యసించారు. సభా ప్రారంభానికి ముందు జాతీయ జెండాను ఎగురవేసి జెండాగీతాన్ని పాడాం. ‘జనగణమన’తో సభాకార్యక్రమం ముగిసింది. చివరిలో అందరికి స్వీట్సు పంచిపెట్టబడ్డాయి.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
జి. సంపత్.

చిరునామా :
బి. క్రాంతికుమార్,
6వ తరగతి,
విజ్ఞానభారతి హైస్కూల్,
చిత్తూరు,
చిత్తూరు జిల్లా.

AP Board 6th Class Telugu లేఖలు

6వ తరగతి చదువును గురించి వివరిస్తూ నాన్నగారికి లేఖ

శ్రీకాకుళం,
xxxxxxx

పూజ్యులైన నాన్నగారికి,

మీ కుమారుడు రవి నమస్కరించి వ్రాయు విశేషాలు.

నేను 6వ తరగతి బాగానే చదువుతున్నాను. గత పరీక్షలలో అన్ని సబ్జెక్టులలో కూడా మంచి మార్కులే వచ్చాయి. ఒక్క గణితశాస్త్రం తప్ప మిగిలిన వాటిలో 80% మార్కులు సంపాదించాను. గణితంలో మటుకు నూటికి 67 మార్కులు వచ్చాయి. అందువల్ల గణితంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాను.
జిల్లా కామన్ పరీక్షల్లో అన్ని సబ్జక్టులు బాగా వ్రాసి మంచి . . , మార్కులు సంపాదించటానికి విశేష కృషి చేస్తున్నాను. అమ్మగారికి నా నమస్కారములు తెలుపగలరు. . . . . . . !

ఇటు,
మీ కుమారుడు,
రవి.

చిరునామా :
శ్రీ ఆర్. వెంకటేశ్వరరావు,
డోర్ నెం. 3-6-12,
శారదా హైస్కూల్ రోడ్,
ప్రొద్దుటూరు.
కడప జిల్లా.

గురుపూజోత్సవం (ఉపాధ్యాయ దినోత్సవం) గురించి మిత్రునికి లేఖ

గుంటూరు,
xxxxxxx

ప్రియమిత్రుడు పుష్పరాజ్ కు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవం దినంగా ప్రకటించింది కదా ! మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరిని ఆ రోజున ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు,
నీ మిత్రుడు,
జయరాజ్.

చిరునామా :
ఎస్. పుష్పరాజ్, 6వ తరగతి,
నవోదయ హైస్కూలు,
నాయుడుపేట,
నెల్లూరు.

వృద్ధులపట్ల పిల్లలు ఆదరాభిమానాలు చూపాలనే ఆలోచనను కల్గించే విధంగా చైతన్యాన్ని పెంపొందించాలని కోరుతూ పత్రికా – సంపాదకునికి లేఖ

విజయవాడ,
xxxxxxx

గౌరవనీయులైన
ప్రతికా సంపాదకునికి,
‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం,
విజయవాడ.

అయ్యా,

‘ఈనాటి సమాజంలో ఎంతోమంది వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. వివిధ కారణాలతో వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. ఇది విచారింపదగిన విషయం.

పిల్లలు తమ తల్లిదండ్రులపట్ల, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మలపట్ల ఆధారం చూపాలి. వారికి అవసరమైన సపర్యలు చేయాలి. మానవీయ విలువలను కాపాడాలి. ఈతరం విద్యార్థుల్లో వృద్ధులపట్ల ఆదరం చూపించాల్సిన బాధ్యతను పెంపొందించాల్సి ఉంది. ఉపాధ్యాయులు, పెద్దలు, విద్యార్థుల్లో పరివర్తనను సాధించాలి. మీ పత్రిక ద్వారా నేటి యువతలో వృద్ధులపట్ల సేవాదృక్పధం అలవడే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను.

ఇట్లు,
మీ విధేయుడు,
పి. మల్లికార్జునరావు.

చిరునామా :
గౌ|| పత్రికా సంపాదకుడు,
‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం,
విజయవాడ.

AP Board 6th Class Telugu లేఖలు

శతక పద్యాలు మానవీయ విలువలను పెంచుతాయి. దీన్ని సమర్థిస్తూ మిత్రునికి లేఖ

శ్రీకాకుళం,
xxxxxxx

ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు,

శుభాకాంక్షలు. నేను బాగానే ఉన్నాను. నీవు కూడా బాగానే ఉన్నావని ఆశిస్తున్నాను. నేను ఈ లేఖలో శతక పద్యాల ప్రాధాన్యాన్ని గురించి తెలియజేస్తున్నాను. శతక పద్యాలు విద్యార్థుల్లో సత్ప్రవర్తనను కలిగిస్తాయి. మానవీయ సంబంధాలను పరిపుష్టం చేస్తాయి. సమాజం పట్ల గౌరవాన్ని, సేవాదృక్పధాన్ని కలిగిస్తాయి. అందువల్ల శతక పద్యాలను అందరు చదువాలి. ఆదర్శవంతులుగా తయారవ్వాలి. నీవు కూడా శతక పద్యాలను చదివి అందరికి ఆదర్శంగా నిలిచే గుణాలను పెంపొందించుకుంటావని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
వి. మనోజ్.

చిరునామా :
వి. సతీష్
7వ తరగతి,
నిర్మలా హైస్కూల్,
ఏలూరు,
పశ్చిమ గోదావరి జిల్లా.

చదువు ప్రాధాన్యతను తెలియజేస్తూ మిత్రునికి లేఖ

నెల్లూరు,
xxxxxxx

ప్రియమైన మిత్రుడు రామారావుకు,

శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఎంతోమంది పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారు. వివిధ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. చదువుకోవలసిన వయస్సులో పనులు చేస్తున్నారు. నేను ఈ విషయాన్ని గుర్తించి బాలకార్మికులుగా ఉన్నవారిని బడిలో చేర్పించాను. చదువు అవసరాన్ని వివరించి చెప్పాను. చదువు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాను. నీవు కూడా బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించు. వారందరికి చదువు ప్రాధాన్యతను వివరించు. పెద్దలకు నమస్కారాలు తెలుపు.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.చంద్రశేఖర్,

చిరునామా :
కె. రామారావు,
6వ తరగతి,
ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల,
దక్షారామం, తూర్పుగోదావరి జిల్లా.

పుస్తక విక్రేతకు లేఖ

బొబ్బిలి,
xxxxxxx

మేనేజర్,
వి.జి.యస్. పబ్లిషర్స్,
విజయవాడ – 9.

అయ్యా !

నాకు ఈ క్రింద తెలియజేసిన పుస్తకాలను సాధ్యమైనంత త్వరలో రిజిష్టర్డ్ పోస్టు ద్వారా పంపించవలసినదిగా ప్రార్థన. పుస్తకాలపై ఇచ్చు కమీషన్ తగ్గించి మిగతా పైకమును చెల్లించగలవాడను.
1) 6వ తరగతి తెలుగు క్వశ్చన్ బ్యాంక్ – 10 కాపీలు
2) 6వ తరగతి ఇంగ్లీషు క్వశ్చన్ బ్యాంక్ – 10 కాపీలు
3) 6వ తరగతి గణితశాస్త్రం క్వశ్చన్ బ్యాంక్ – 10 కాపీలు
4) 6వ తరగతి సామాన్యశాస్త్రం క్వశ్చన్ బ్యాంక్ – 10 కాపీలు

ఇట్లు,
తమ విధేయుడు,
జి. శివ ప్రసాద్,
6వ తరగతి,
అభ్యుదయ హైస్కూల్,
బొబ్బిలి.

చిరునామా :
మేనేజర్, వి.జి.యస్. పబ్లిషర్స్,
తమ్మినకృష్ణ వీధి, విజయవాడ.
పిన్ కోడ్ – 520 009.

AP Board 6th Class Telugu లేఖలు

వార్షికోత్సవమును గూర్చి మిత్రునికి లేఖ

జగ్గయ్య పేట,
xxxxxxx

ప్రియ మిత్రుడు రమేష్ కు,

ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను.

గత శనివారం మా పాఠశాల వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా రంగురంగుల తోరణాలతో అలంకరించాం. సాయంత్రం 6 గం||లకు సభ ప్రారంభింపబడింది. ఆ సభకు మా ప్రాంత ఎం.ఎల్.ఏ. గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నివేదిక చదివి వినిపించారు. ముఖ్య అతిథిగారు విద్యార్థులంతా బాగా చదువుకోవాలని చక్కని సందేశం ఇచ్చారు. ఆటల పోటీలలోనూ, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలోనూ గెలుపొందినవారికి బహుమతులు పంచిపెట్టబడ్డాయి. ఆ తరువాత పిల్లలచే నాటికలు వేయబడ్డాయి. ఈ

మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం గూర్చి వ్రాయగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
ఎం. సంతోష్,

చిరునామా:
కె. రమేష్, 6వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
కొవ్వూరు, ప.గో. జిల్లా,
పిన్ : 534 351.

AP Board 6th Class Telugu Grammar

SCERT AP Board 6th Class Telugu Solutions 6th Class Telugu Grammar Notes, Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Grammar

1. వర్ణమాల

తెలుగు భాషలో 56 అక్షరాలున్నాయి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని మూడు విధాలు.

AP Board 7th Class Telugu Grammar 1

1. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు. – అ ఇ ఉ ఋు, ఇ, ఎ, ఒ – హ్రస్వాలు.
2. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు – ఆ, ఈ, ఊ, ఋ, 2, ఏ, ఐ, ఓ, ఔ – దీర్ఘాలు.

* హల్లులు – విభాగం

‘క’ నుండి ‘మ’ వరకు గల అక్షరాలను అయిదు వర్గాలుగా విభజించవచ్చు. అవి :

క – ఖ – గ – ఘ – జ – ‘క’ వర్గం
చ – ఛ – జ – ఝ – 2 – ‘చ’ వర్గం
ట – ఠ – డ – ఢ – ణ – ‘ట’ వర్గం
త – థ – ద – ధ – న – ‘త’ వర్గం
ప – ఫ – బ – భ – మ – ‘ప’ వర్గం

AP Board 7th Class Telugu Grammar

1. కఠినంగా పలికే అక్షరాలు – క, చ, ట, త, ప – పరుషాలు
2. తేలికగా పలికే అక్షరాలు – గ, జ, డ, ద, బ – సరళాలు
3. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు – ఖ, ఘ, ఛ, ఝ, ఠ, డ, ఢ, ధ, ఫ, భ – వర్గయుక్కులు
4. ముక్కు సాయంతో పలికే అక్షరాలు – ఆ, ఇ, ణ, న, మ – అనునాసికాలు.
5. అంగిలి సాయంతో పలికే అక్షరాలు – య, ర, ఱ, ల, ళ, వ – అంతస్థాలు
6. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు – శ, ష, స, హ – ఊష్మాలు
7. పరుష, సరళాలు కాకుండా మిగిలిన హల్లులు – స్థిరాలు
8. ‘క’ నుండి ‘మ’ వరకు గల హల్లులు – స్పర్శాలు.

వర్ణోత్పత్తి స్థానాలు

AP Board 7th Class Telugu Grammar 2

ద్విత్వ, సంయుక్తాక్షరాలు

1. ద్విత్వాక్షరం :
ఒక హల్లుకు, అదే హల్లు తాలూకు ఒత్తు చేరితే, దాన్ని “ద్విత్వాక్షరం” అంటారు.
ఉదా : 1. క్క = క్ +్క(క్) + అ = క్క = ఇందులో కకారం రెండుసార్లు వచ్చింది.
2. త్త = త్ + త్ + అ = c = ఇందులో తకారం రెండుసార్లు వచ్చింది.

2. సంయుక్తాక్షరం :
ఒక హల్లుకు వేరొక హల్లు తాలూకు ఒత్తు చేరితే , దాన్ని “సంయుక్తాక్షరం” అంటారు.
ఉదా : 1. న్య = న్ + య్ + అ = న్య = ఇందులో నకారం, యకారాలనే రెండు హల్లులు వచ్చాయి.
2. క్ష్మి = 5 + క్ + మ్ + ఇ = క్ష్మి = ఇందులో కూర, షకార, మకారములనే మూడు హల్లులు కలిశాయి.

2. భాషాభాగాలు

1. నామవాచకం : పేర్లను తెలిపేది నామవాచకం.
ఉదా : రాముడు, వనం, సీత, కాకినాడ మొదలైనవి.

2. సర్వనామం : నామవాచకానికి బదులుగా ఉపయోగించేది సర్వనామం.
ఉదా : అతడు, ఆమె, అది, అవి మొదలైనవి.

3. విశేషణం : నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణం మొదలైన వానిని తెలి.పేది విశేషణం.
ఉదా : అందంగా, తెల్లని, పొడవైన మొదలైనవి.

4. క్రియ : పనిని తెలియజేసేది క్రియ. ఇది రెండు రకాలు.
1. సమాపక క్రియ
2. అసమాపక క్రియ

1. పని పూర్తయినట్లు తెలియజేసేది సమాపక క్రియ.
ఉదా : వచ్చాడు, రాసింది, నవ్వెను మొదలైనవి.

2. పని పూర్తవనట్లు తెలియజేసేది అసమాపక క్రియ.
ఉదా : వచ్చి, చూస్తూ, చూసి మొదలైనవి.

AP Board 7th Class Telugu Grammar

3. తెలుగు సంధులు

సంధి :
ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం రెండు పదాలను కలిపి మాట్లాడతాం. ఇలా రెండు పదాలను కలపడాన్ని సంధి అంటారు.
ఉదా :
రాముడు + తడు = రాముతడు
మే + త్త = మేత్త
ది + మి = అదేమి మొదలైనవి.

తెలుగు సంధులు :
రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధులను తెలుగు సంధులు అంటారు.

సంధి కార్యం :
రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును ‘సంధి కార్యం’ అంటారు.

పూర్వస్వరం :
రెండు పదాల మధ్య సంధి జరిగినపుడు, మొదటి పదం చివరి అచ్చును పూర్వస్వరం అంటారు.

పరస్వరం :
రెండు పదాల మధ్య సంధి జరిగినపుడు, రెండవ పదం యొక్క మొదటి అచ్చును పరస్వరం అంటారు.
ఉదా : నేను + గి = నేనేగి
వీనిలో ‘నేను’ లోని ‘ఉకారము’ను పూర్వస్వరం అంటారు. గిలోని ‘ఏ కారము’ను పరస్వరం అంటారు.

సంధి జరిగినపుడు పూర్వస్వరం లోపిస్తుంది. పరస్వరం మిగులుతుంది.

1. ఉత్వ సంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారము.
ఉదా : సమ్మతము + మిటి = సమ్మతమేమిటి
మాయము + య్యేవాడు = మాయమయ్యేవాడు
మొదలు + య్యాయి = మొదలయ్యాయి
ఎవరు + గగలరు = ఎవరాగగలరు.
కష్టము + నది = కష్టమైనది

గమనిక :
పైన పూర్వపదాలన్నిటిలోనూ చివరి అచ్చు హ్రస్వమైన ఉకారం పరస్వరం (ఏ, ఆ, అ, ఐ) ఏదో ఒక అచ్చు ఉంది. సంధులు కలిసినపుడు అన్ని పదాలలోనూ పూర్వస్వరం ఉత్తు (హ్రస్వమైన ఉకారం) లోపించింది. పరస్వరమే (ఏ, అ, ఆ, ఐ) ఆ హల్లు మీదికి చేరింది. కనుక ఇది ‘ఉత్వసంధి’ అని పిలువబడుతుంది.

2. ఇత్వ సంధి సూత్రం :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.

ఏమ్యాదులు :
ఏమి, మణి, కి (షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలైనవాటిని ఏమ్యాదులు అంటారు.

వైకల్పికం :
ఒకసారి సంధి జరుగుతుంది. ఒకసారి సంధి జరగకపోవచ్చు. దీనిని వైకల్పికం అంటారు.

ఇత్తు :
హ్రస్వమైన ఇకారం
ఉదా :
ఏమి + అంటివి = ఏమంటివి (సంధి జరిగినపుడు)
ఏమి + అంటివి = ఏమియంటివి (సంధి జరగనపుడు యడాగమం వస్తుంది)
మఱి + ఏమి = మఱేమి (సంధి జరిగినపుడు)
మఱి + ఏమి = మఱియేమి (సంధి జరగనపుడు యడాగమం వచ్చింది)
పైకి + ఎత్తినారు = పైకెత్తినారు
ఉన్నది + అంట = ఉన్నదంట
ఒకరికి + ఒకరు = ఒకరికొకరు

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వపదం చివర హ్రస్వ ఇకారం ఉంది. పరపదం మొదట అచ్చు (ఏ, ఎ, అ, ఓ..) ఉంది. రెండూ కలిసినపుడు పూర్వపదం చివరగల హ్రస్వ ఇకారం (ఇత్తు) లోపించింది. పరస్వరమే (ఏ, ఎ, అ, ఒ, …..) ఆ హల్లు మీదికి చేరింది. కనుక దీనిని ‘ఇత్వ సంధి’ అంటారు.

సూత్రం-2 :
ప్రథమ, ఉత్తమ పురుష బహువచన క్రియల ఇకారానికి, సంధి వైకల్పికంగా జరుగుతుంది.
వచ్చిరి + పుడు = వచ్చిరిపుడు
వచ్చితిమి + పుడు = వచ్చితిమెపుడు

AP Board 7th Class Telugu Grammar

3. అత్వసంధి సూత్రం :
అత్తునకు సంధి బహుళంబుగానగు.

వివరణ :
అత్తు = హ్రస్వమైన అకారము

బహుళము :
1. సంధి ఒకసారి నిత్యంగా వస్తుంది.
ఉదా : సీ + మ్మ = సీతమ్మ
సుబ్బయ్య + న్నయ్య = సుబ్బయ్యన్నయ్య
రా + య్య = రాయ్య

2. సంధి ఒకసారి వైకల్పికంగా వస్తుంది.
ఉదా : మే + త్త = మేనత్త (సంధి జరిగినపుడు)
మే + త్త = మేనయత్త (సంధి జరగనపుడు యడాగమం)

3. సంధి ఒక్కొక్కసారి రాదు.
ఉదా : సీత + అన్నది = సీతయన్నది (సంధి జరుగక యడాగమం)
రామ! + అని = రామయని (సంధి జరుగక యడాగమం వచ్చింది)

4. ఇతర విధముగా సంధి వచ్చిన రూపం.
ఉదా : ఒక + ఒక = ఒకానొక

యడాగమం సూత్రం :
సంధిలేని చోట స్వరంబు కంటె పరమైన స్వరమునకు యడాగమంబగు.
ఉదా : మా + మ్మ = మామ్మ
రత్నగర్భ + అన = రత్నగర్భ
నాది + న్న = నాదిన్న
విరిగి + లుగుల = విరిగిన లుగుల
న్ని + పాయములను = ఎన్నియుపాయములను.

4. సంస్కృత సంధులు

రెండు సంస్కృత (తత్సమ) పదాలకు ఏర్పడే సంధులను సంస్కృత సంధులు అంటారు.

1. సవర్ణదీర్ఘ సంధి సూత్రం :
అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వానికి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. సవర్ణములు అంటే అవే అక్షరాలు.

వివరణ :
అ(లేక) ఆ + అ(లేక) ఆ = ఆ
ఇ(లేక) ఈ + ఇ(లేక) ఈ = ఈ
ఋ (లేక) ఋ + ఋ(లేక) ఋ = ఋ

ఉదా : ఆహా + అన్వేషణ = ఆహారాన్వేషణ (అ + అ = ఆ)
1) విశ్వ + భిరామ = విశ్వదాభిరామ (అ + అ = ఆ)
2) రో + వేశము = రోషావేశము (అ + ఆ = ఆ)
3) పర + త్మ = పరమాత్మ (అ + ఆ = ఆ)
4) భాను + దయం = భానూదయం (ఉ + ఉ = ఊ)
5) పితృ + ణము = పితౄణము (ఋ + ఋ = ఋ)
6) కవి + ఇంద్రుడు = కవీంద్రుడు (ఇ + ఇ = ఈ)
7) ఋషి + శ్వరుడు = ఋషీశ్వరుడు (ఇ + ఈ = ఈ)
8) అతి + ఇంద్రియ శక్తి = అతీంద్రియ శక్తి (ఇ + ఇ = ఈ)

గుణసంధి సూత్రం :
అకారానికి ఇ, ఉ, ఋలు పరమైతే వానికి క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశంగా వస్తాయి. ఏ, ఓ, అలకు గుణములని పేరు కనుక. దీని పేరు గుణసంధి.
ఉదా :
రా + ఇంద్రుడు = రాజేంద్రుడు (అ + ఇ = ఏ)
రా + శ్వరం = రామేశ్వరం (అ + ఈ = ఏ)
+ పకారం = పరోపకారం (అ + ఉ = ఓ)
దే + న్నతి = దేశోన్నతి (అ + ఉ = ఓ)
రా + షి = రాజర్షి (అ + ఋ = అర్)
హా + షి = మహర్షి (ఆ + ఋ = అర్)

AP Board 7th Class Telugu Grammar

విభక్తులు :

ప్రత్యయాలు విభక్తులు
డు,ము,వు,లు ప్రథమా విభక్తి
ని(న్), ను(న్), ల(న్), కూర్చి, గురించి ద్వితీయా విభక్తి
చేత(న్), చే(న్), తోడ(న్), తో(న్) తృతీయా విభక్తి
కొఱకు(న్), కై (కోసం) చతుర్థి విభక్తి
వలన(న్), కంటె(న్), పట్టి పంచమీ విభక్తి
కి(న్), కు(న్), యొక్క లో(న్), లోపల(న్) షష్ఠీ విభక్తి
అందు(న్), న(న్) సప్తమీ విభక్తి
ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమా విభక్తి

5. సమాసములు

సమాసం :
వేరు, వేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దానిని సమాసం అంటారు.
ఉదా :
రామబాణము – అనే సమాసపదంలో ‘రామ’ అనే, ‘బాణము’ అనే రెండు అర్థవంతమైన పదాలున్నాయి. వాటి కలయికతో ‘రామబాణము’ అనే సమాసపదం ఏర్పడింది. దీనిలో మొదటి పదము (రామ)ను పూర్వపదం అంటారు. రెండవ పదము (బాణము)ను ఉత్తరపదం అంటారు.

1. ద్వంద్వ సమాసం :
రెండు కాని, అంతకంటే ఎక్కువ కాని నామవాచకాలు కలిసి ఏర్పడేది ద్వంద్వ సమాసం. .. దీనిలో పూర్వపదానికి, ఉత్తర పదానికీ (రెండిటికీ) ప్రాధాన్యం ఉంటుంది.
ఉదా :
అన్నదమ్ములు ఎంతో మంచివారు.
దీనిలో ‘అన్నదమ్ములు’ ద్వంద్వ సమాసం.
అన్నయును, తమ్ముడును. – దీనిని విగ్రహవాక్యం అంటారు.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. తల్లిదండ్రులు తల్లియును, తండ్రియును ద్వంద్వ సమాసం
2. కష్టసుఖాలు కష్టమును, సుఖమును ద్వంద్వ సమాసం
3. ఆకలిదప్పులు ఆకలియును, దప్పికయును ద్వంద్వ సమాసం
4. అన్నపానీయాలు అన్నమును, పానీయమును ద్వంద్వ సమాసం
5. గంగా యమునలు గంగయును, యమునయును ద్వంద్వ సమాసం

2. ద్విగు సమాసం :
సమాసంలో పూర్వ (మొదటి) పదం సంఖ్యావాచకం అయితే దానిని ద్విగు సమాసం అంటారు.
ఉదా :
నవరసాలు – నవ (9) సంఖ్య గల రసాలు –
దీనిలో పూర్వపదం నవ అంటే తొమ్మిది కనుక ఇది ద్విగు సమాసం.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. రెండు జడలు రెండు (2) సంఖ్య గల జడలు ద్విగు సమాసం
2. ఏడురోజులు ఏడు (7) సంఖ్య గల రోజులు ద్విగు సమాసం
3. దశావతారాలు దశ (10) సంఖ్య గల రోజులు ద్విగు సమాసం
4. నాలుగువేదాలు నాలుగు (4) సంఖ్య గల వేదాలు ద్విగు సమాసం
5. త్రిమూర్తులు త్రి (3) సంఖ్య గల మూర్తులు ద్విగు సమాసం

AP Board 7th Class Telugu Grammar

6. వాక్యాలలో రకాలు

సామాన్య వాక్యం :
క్రియ ఉన్నా, లేకపోయినా, ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలుగా అంటారు.
ఉదా :
1. ఉష పాఠం చదువుతున్నది.
2. కిరణ్ మంచి బాలుడు

మొదటి వాక్యంలో క్రియ (చదువుతున్నది) ఉంది. రెండవ వాక్యంలో క్రియాపదం లేదు. అయినా రెండూ సామాన్య వాక్యాలే.

క్రియతో కూడిన సామాన్య వాక్యాలు :

  1. రాము అన్నం తిన్నాడు.
  2. గోపి పుస్తకం చదువుతున్నాడు.
  3. లత బాగా పాడుతుంది. . .

క్రియాపదం లేని సామాన్య వాక్యాలు :

  1. సుశీలకు కోపం ఎక్కువ.
  2. రాజుకు బద్ధకం తక్కువ.
  3. ఢిల్లీ మనదేశ రాజధాని.
  4. మన రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్.
  5. మన భాష తెలుగు భాష.

సంక్లిష్ట వాక్యం :
రెండు కాని, అంతకంటే ఎక్కువ కానీ సామాన్య వాక్యాలను ఒకసారే నామవాచకాన్ని ఉపయోగించి, రెండు కాని అంతకంటే ఎక్కువ కాని అసమాపక క్రియలను ఉపయోగించి ఒకే వాక్యంగా రాస్తే దానిని సంక్లిష్ట వాక్యం అంటారు.
ఉదా :
రాము అన్నం తిన్నాడు. రాము సినిమా చూశాడు.

సంక్లిష్ట వాక్యం : రాము అన్నం తిని సినిమా చూశాడు.

గమనిక :
పైన రెండు సామాన్య వాక్యాలున్నాయి. రెండింటిలోనూ ఒకే నామవాచకం (రాము) ఉంది.

రెండింటిలోనూ రెండు వేర్వేరు పనులు (అన్నం తినడం, సినిమా చూడడం) చేశాడు.

రెండింటినీ కలిపి సంక్లిష్టవాక్యంగా మార్చినపుడు నామవాచకం ఒక్కసారే ఉపయోగించాం. మొదటి క్రియా పదం (తిన్నాడు)ను అసమాపకం (తిని)గా మార్చాం. అది గమనించండి.

సామాన్య వాక్యాలు :
నాన్నగారు బజారుకు వెళ్లారు. నాన్నగారు కూరలు తెచ్చారు.

సంక్లిష్ట వాక్యం :
నాన్నగారు బజారుకు వెళ్లి, కూరలు తెచ్చారు.

AP Board 7th Class Telugu Grammar 3

సంయుక్త వాక్యాలు :
సమాన ప్రాధాన్యం గల రెండు గాని, అంతకంటే ఎక్కువ గాని సామాన్య వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాస్తే దానిని సంయుక్త వాక్యం అంటారు. రెండు వాక్యాలను కలపడానికి మరియు, కనుక, లేదా, కానీ మొదలైన పదాలను ఉపయోగిస్తారు.
ఉదా :
రాముడు అడవికి వెళ్లాడు.
సీత అడవికి వెళ్లింది.

సంయుక్త వాక్యం :
రాముడు మరియు సీత అడవికి వెళ్లారు.
సీతారాములు అడవికి వెళ్లారు.
(ఇలాగ రెండు రకాలుగానూ రాయవచ్చు)

AP Board 7th Class Telugu Grammar 4

ప్రశ్నార్థక వాక్యం :
(జవాబును కోరుతూ) ప్రశ్నను సూచించే వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు.

ఉదా : మీరెవరు?
1) మీదే ఊరు?
2) డాక్టరు గారున్నారా?
3) ఎక్కడికి వెడుతున్నావు?
4) ఎన్నవ తరగతి చదువుతున్నావు?
5) నేను చెప్పే పాఠం అర్థమవుతోందా? …….. మొదలైనవి.

AP Board 7th Class Telugu Grammar

ఆశ్చర్యార్థక వాక్యం :
ఆశ్చర్యం కలిగించే భావాన్ని కలిగిన వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. ఈ వాక్యాలకు సాధారణంగా అబ్బ ! ఆహా ! ఓహో ! ఔరా ! …… వంటి అవ్యయాలుంటాయి.
ఉదా :
అబ్బ ! ప్రకృతెంత అందంగా ఉందో !
1) ఆహా ! ఏమి రుచి !
2) ఓహో ! ఈ చిత్రం ఎంత బాగుందో !
3) ఔరా ! 60 కిలోమీటర్లు నడిచావా !
4) ఆహా ! మీ ఇల్లు ఎంత బాగుందో !
5) అబ్బ ! ఈ సినిమా ఎంత బాగుందో !

అనుమత్యర్థక వాక్యం :
ఒక పని చేయడానికి అనుమతినిచ్చే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు.
ఉదా :
మీరు బడికి రావచ్చు.
1) ఆటలు ఆడుకోవచ్చు.
2) టి.వి. చూడవచ్చు.
3) రచనలు చేయవచ్చు.
4) పాటలు పాడవచ్చు.
5) గెంతులు వేయవచ్చు.

ఆశీరర్థక వాక్యం :
ఆశీస్సులను తెలియజేసే వాక్యమును ఆశీరర్థక వాక్యం అంటారు.
ఉదా : నీవు చిరకాలం వర్ధిల్లుగాక !
1) దీర్ఘ సుమంగళీ భవ !
2) ఆయురారోగ్యాలతో ఉండుగాక !
3) దీర్ఘాయుష్మాన్ భవ !
4) మీరంతా అభివృద్ధి చెందుగాక !
5) మీకు మంచి విద్యాబుద్ధులు కలుగుగాక !

నిషేధార్థక వాక్యం :
ఒక పని చేయవద్దని నిషేధించే వాక్యమును నిషేధార్థక వాక్యం అంటారు.
ఉదా : అల్లరి చేయకండి.
1) హద్దులు దాటవద్దు.
2) అనవసరంగా మాట్లాడవద్దు
3) ఎవ్వరినీ ఎగతాళి చేయకండి.
4) అబద్దాలు చెప్పకండి.
5) తప్పుడు పనులు చేయకండి.

AP Board 6th Class Telugu Solutions Chapter 12 ఎంత మంచివారమ్మా….!

SCERT AP Board 6th Class Telugu Solutions 12th Lesson ఎంత మంచివారమ్మా….! Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 12th Lesson ఎంత మంచివారమ్మా….!

6th Class Telugu 12th Lesson ఎంత మంచివారమ్మా….! Textbook Questions and Answers

ప్రశ్నలు – జవాబులు

అ) లఘు ప్రశ్నలు:

ప్రశ్న 1.
యానాది రూపాన్ని వర్ణించండి.
జవాబు:
యానాదుల కళ్లు నిర్మలంగా ఉంటాయి. వీరి కనుబొమ్మలు విల్లుల వలె ఒంపులు తిరిగి ఉంటాయి. వీరిది ఉంగరాల జుట్టు. వీరి పెదవులు సన్నగా ఉంటాయి. వీరు సన్నగా ఉంటారు. వీరు చాలా వేగంగా పరుగెత్తడానికి అనువైన లేసైన కాలిపిక్కలు కలిగి ఉంటారు. సన్నని నడుములు కలిగి ఉంటారు. చిరునవ్వుతో జీవిస్తారు. ఆదివాసులందరిలో యానాదులే అందగాళ్లని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం.

ప్రశ్న 2.
యానాదులు నిరాడంబర భక్తులు – సమర్థించండి.
జవాబు:
వీరు భజనలు, మౌనధ్యానాలు, మంత్రతంత్రాలు ఇష్టపడరు,” యానాదుల దైవం వేంకటేశ్వరస్వామి, ఆయన కొబ్బరి కాయలతో, తులసిదళాలతో సులభంగా తృప్తిపడతాడని వీరి ఉద్దేశం. వీళ్లు వేటకు వెళ్లేముందు కాట్రాయుడికి మొక్కుతారు. అంటువ్యాధులు వస్తే మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలసియుండే చెట్ల దగ్గర, గ్రామవావిళ్ల దగ్గర ప్రార్థిస్తుంటారు. వీరు యక్షగానం ప్రదర్శిస్తారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 12 ఎంత మంచివారమ్మా....!

ప్రశ్న 3.
యానాదుల భాషణం ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
యానాదులు మాట్లాడేటపుడు స్వచ్ఛమైన అచ్చ తెలుగు మాటలు ముత్యాల్లా జారుతాయి. ఒత్తులు లేని పదాలకు ఒత్తులు కల్పించి, భాషకు కొత్త అందాలను తెస్తారు. బావను భావ అని పలికినట్లు. వీరు తక్కువగా మాట్లాడే మిత భాషులు.

ఆ) వ్యాసరూప ప్రశ్నలు:

ప్రశ్న 1.
యానాదులను చూసి మనం ఎందుకు గర్వపడాలి?
జవాబు:
యానాదులు కష్టజీవులు. కష్టపడి బతుకుతారు. వనమూలికలు, కషాయాలతో వైద్యం చేసుకొంటారు. చిరునవ్వుతో ఆదరిస్తారు. అల్ప సంతోషులు, నిబ్బరంగా జీవిస్తారు. బాహ్య ప్రపంచానికి నీతిని నేర్పగలవారు. నేటి తరంలో యానాదులు సగౌరవంగా జీవిస్తున్నారు. వారి భాషను అభివృద్ధి చేసుకొన్నారు. విద్యావంతులయ్యారు. ఆంధ్ర దేశాభివృద్ధిలో వారూ భాగస్వాములయ్యారు. పరస్పర సహకారంతో జీవిస్తున్నారు. మన తెలుగు వారి పట్ల అభిమానంగా అందరూ నావాళ్లే అనే భావంతో ఉంటారు. సంఘశక్తిని పెంచడంలో భాగస్వాములయ్యారు. అత్యున్నత పదవులను పొందడంలో పౌరుషం, పట్టుదల, దీక్ష చూపించారు. ఇవన్నీ యానాదుల నుండి నేర్చుకొనతగినవి. గర్వించతగిన లక్షణాలు.

ప్రశ్న 2.
“యానాది వేదాంతి” – దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
ఒక విధంగా ఆలోచిస్తే యానాదిని వేదాంతిగానే భావించవచ్చు. వారికి ఆస్తి మీద ఆశ ఉండదు. వారి కాయ కష్టం మీద వారు ఆధారపడి జీవిస్తారు. వీరు ఇంటిని కూడా చెట్లకొమ్మలు, చిట్టి వెదుళ్లు, వెదురు బొంగులతో ‘ వలయాకారంగా నిర్మిస్తారు. ఇంటిని తాటాకులతో నేల నుండి పై వరకు నారతో కుట్టేస్తారు. వారి ఇంటికి కుడి ప్రక్కన గుంటపొయ్యి, నీళ్లకుండలు, చెంబు ఉంటాయి. ఎడమ పక్క తట్టలు, బుట్టలు ఉంటాయి. మధ్యలో రోకటి గుంట ఉంటుంది. నెత్తి మీద తగిలేటట్టు కట్టి పెట్టిన తప్పెట ఉంటుంది. వాకిలి వెనుక జాజి చెక్కల పెట్టె ఉంటుంది. దానిపై వేలాడ గట్టిన ఈతాకుల చాప ఉంటుంది. చూరులో దూపిన గెసిక కర్ర ఉంటుంది. ఇంత నిరాడంబరంగా జీవిస్తాడు. జీవితం అశాశ్వతం, ఐశ్వర్యం నిలబడదు అనే సందేశం తన జీవన విధానం ద్వారా ఇస్తాడు కనుకనే యానాదిని వేదాంతి అనవచ్చు.

పాఠ్యభాగ సారాంశం

మనదేశంలో ఉన్న ప్రాచీన జాతుల్లో యానాదులు ఒకరు. వీరందరూ నిరాడంబరంగా జీవిస్తారు. కష్టజీవులు. అనాది అనే పదం నుంచి యానాది పదం పుట్టి ఉండొచ్చు. అడవుల్లో దొరికే తేనె, మూలికలు, కలప, వెదురు తెచ్చి గ్రామాల్లో అమ్మి తమకు అవసరమైన వస్తువులను కొనుక్కుంటారు.

యానాదులు నిర్మలమైన కళ్ళు, అందమైన కనుబొమ్మలు, సన్నని పెదవులు, గట్టి శరీరంతో అందంగా ఉంటారు. వీరు జంతువుల జాడలను, మనుషుల జాడలను పసిగట్టడంలో నేర్పరులు. పులులు, చిరుతలు మొదలైన జంతువుల జాడలు తెలుసుకుంటారు. వీళ్ళకు పాములంటే భయం లేదు. మూలికలు వీళ్ళకు బాగా తెలుసు. కుండ కషాయాలు, మూలికలే వీరికి ఔషధాలు.

యానాదులు గొప్ప వేదాంతులు. వీరికి. ఆస్తులు ఉండవు. వీళ్ళ ఇళ్ళు ప్రత్యేకంగా, నిరాడంబరంగా ఉంటాయి. వీళ్ళు అల్ప సంతోషులు అయినందువల్ల వీరికి నిరాశానిస్పృహ, ఈర్షాద్వేషాలు, అసూయలు ఉండవు. మితభాషులు. వీరికి పండుగకు, పస్తుకు తేడా తెలియదు. వీళ్ళు మాంసాహారంతో పాటు శాకాహారం తీసుకుంటారు. మద్యపానం చేయరు. మంచి, మర్యాద వంటి సుగుణాలు వారి పెదవుల పైన చిరునవ్వులో కనిపిస్తాయి. వీరి తెలుగుమాటల్లో ఒత్తులు ఎక్కువగా ఉంటాయి.

యానాదులు తిరునాళ్ళు, తోలుబొమ్మలాటకు ఇంటిల్లిపాది వెళతారు. యక్షగానాలు వీరు ప్రదర్శిస్తారు. యానాదుల భాగవతాలు, యువతుల గొబ్బిపాటలు ఎంతో మధురంగా ఉంటాయి. వీరు వెంకటేశ్వర్లును పూజిస్తారు. వేటకు వెళ్ళేటప్పుడు కాట్రాయుడికి మొక్కుతారు. మహాలక్ష్మమ్మను, పోలేరమ్మను ప్రార్థిస్తారు.

యానాదులు అందగాళ్ళేకాదు అమాయకులు, నీతిమంతులు. నేటి తరంలో యానాదులు కూడా చదువుకొని జనంతో జేరి పురోగమిస్తున్నారు. సంఘాభిమానం, సహకారం, పౌరుషం మొదలైన లక్షణాలతో ఉన్నత పదవులు పొందుతున్నారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 12 ఎంత మంచివారమ్మా....!

కవి పరిచయం

రచయిత పేరు : వెన్నెలకంటి రాఘవయ్య

కాలం : 4.6.1897 నుండి 24.11.1981.

ప్రత్యేకతలు : 1. వారు నెల్లూరు గాంధీగా ప్రసిద్ధులు
2. వారు స్వాతంత్ర్య సమరయోధులు, సంఘసేవకులు, చరిత్రకారులు.
3. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని 21 నెలలు జైలుశిక్ష అనుభవించారు.

పురస్కారాలు : 1973లో భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది.

రచనలు : ‘యానాదులు’, ‘భారతదేశంలో ఆదివాసులు’ మొదలైన 22 పుస్తకాలు రాశారు.

అడవిపూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 తెలుగు పుస్తకాలు రచించారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

SCERT AP Board 6th Class Telugu Solutions 11th Lesson డూడూ బసవన్న Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 11th Lesson డూడూ బసవన్న

6th Class Telugu 11th Lesson డూడూ బసవన్న Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న 1

ప్రశ్న 1.
పై సన్నివేశాలు ఏ పండుగరోజు కనిపిస్తుంటాయి?
జవాబు:
సంక్రాంతి పండుగ రోజులలో పై సన్నివేశాలు కనిపిస్తుంటాయి.

ప్రశ్న 2.
ఏ పండుగ సందర్భంలో హరిదాసు మీ ఇంటికి వస్తాడు?
జవాబు:
సంక్రాంతి పండుగ రోజులలో సుమారు నెలరోజులు హరిదాసు మా ఇంటికి వస్తాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ప్రశ్న 3.
సంక్రాంతి పండుగరోజు ఇంకా మన ఇంటి ముంగిళ్ళ ముందు ఎవరు కనిపిస్తారు?
జవాబు:
సంక్రాంతి పండుగరోజులలో హరిదాసులు, గంగిరెద్దులవాళ్లు, పాములనాడించే వారు, పగటివేషగాళ్లు, చిలక జ్యోతిష్యం చెప్పేవారు, సోదమ్మలు మొదలైన వాళ్లంతా మన ముంగిట కనిపిస్తారు.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
మీరు చూసిన లేదా విన్న ఏదైనా కళారూపం గురించి చెప్పండి.
జవాబు:
మేము బుర్రకథను చూశాం. బుర్రకథలో ముగ్గురు ఉంటారు. ముగ్గురిలో మధ్య కథకుడు. అతని చేతిలో తంబూరా ఉంటుంది. తంబూరా మీటుతూ కథను నడుపుతాడు. అతనికి అటు, ఇటు ఇద్దరు ఉంటారు. వారిని వంతలు అంటారు. వారిద్దరి చేతిలో డోలకు ఉంటాయి. వారిలో ఒకరు రాజకీయం చెబుతారు. మరొకరు హాస్యం పండిస్తారు. ముగ్గురికి గజ్జెలు ఉంటాయి. తందాన ….. తాన తందనాన… అంటూ సాగుతుంది.

ప్రశ్న 2.
గంగిరెద్దుల వాళ్ళను చూసినప్పుడు రచయితకు ఎందుకు బాధ కలిగిందో రాయండి.
జవాబు:
పాత ఆచారాలు పోతున్నందుకు రచయిత బాధపడ్డాడు. అందచందాలు ఉన్నది గంగిరెద్దాట. ఎంతోమంది రాజులూ, రాణులూ కూడా ఆదరించినది గంగిరెద్దాట. సామాన్య జనాన్ని కూడా సంతోషపెట్టిన ఆట గంగిరెద్దాట. అటువంటి గంగిరెద్దాట కనుమరుగవుతున్నందుకు రచయిత బాధపడ్డాడు.

ప్రశ్న 3.
బసవయ్య గంగిరెద్దులు ఆడించడం ఎలా నేర్చుకున్నాడు?
జవాబు:
బసవయ్య చిన్నతనం నుండీ తండ్రితో ఊరూరా తిరిగాడు. తండ్రిని గమనిస్తూ ఉండేవాడు. ఆయన మాటల్ని, మన పద్ధతుల్ని అనుకరించేవాడు. అలా చిన్నతనం నుండీ గంగిరెద్దాటలోని మెలుకువలన్నీ నేర్చుకొన్నాడు. తన తండ్రి ఎద్దుచేత మోళీ చేయిస్తుంటే బసవయ్య రాండోలు వాయించేవాడు. అలా పూర్తిగా గంగిరెద్దులను ఆడించడం నేర్చుకొన్నాడు.

ప్రశ్న 4.
కింది గద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

సమాజ వినోదం కోసం ఏర్పడినవే జానపద కళారూపాలు. ఇవి కొండ గ్రామాలలో పుట్టి క్రమక్రమంగా ద్రావిడ దేశాలన్నింటా విస్తరించాయి. వీటిలో ప్రత్యేకమైనది కురవంజి. ఆటవికుల నుండి పుట్టిన ప్రాచీన జానపద కళారూపం కురవంజి. కురవలు అనేవారు ఏదో వినోదం కోసం ఆరంభించినా క్రమంగా అదే జీవనోపాధి అయింది. వీరు పుణ్యక్షేత్రాల దగ్గర వాటి స్థలపురాణాలను, పవిత్ర కథలు, గాథల్ని ఆశువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులుగా చేసేవారు. యాత్రికులు వారి ప్రదర్శనకు మెచ్చి బహుమతులిచ్చేవారు. కురవంజి కాలానుగుణంగా అనేక రూపాంతరాలు చెందింది. ఏకపాత్రగా మారి ఎఱుక చెప్పే సోదెగా నేడు మిగిలింది. వారు సోదె చెప్పే విధానం అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది.

అ) జానపద కళారూపాలు ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
సమాజ వినోదం కోసం జానపద కళారూపాలు ఏర్పడ్డాయి.

ఆ) కురవంజి ప్రదర్శనలో వేటి గురించి కురవలు చెప్పేవారు?
జవాబు:
పుణ్యక్షేత్రాల స్థల పురాణాలు, పవిత్ర కథలు, గాథలను గురించి కురవంజి ప్రదర్శనలో కురవలు చెప్పేవారు.

ఇ) కురవంజి ప్రస్తుతం ఏ కళారూపంగా మారింది?
జవాబు:
కాలక్రమేణా కురవంజి ఏకపాత్రగా మారింది. ప్రస్తుతం ఎఱుక చెప్పే సోదెగా మారింది.

ఈ) పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జానపద కళారూపాలు ఎక్కడ విస్తరించాయి ?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“ఎక్కడ ధర్మప్రభువులుంటే అదే మా ఊరు” అని బసవయ్య ఎందుకు అని ఉంటాడు?
జవాబు:
బసవయ్య దృష్టిలో ధర్మప్రభువులు అంటే దానగుణం కలవారు. కళాపోషణ చేసేవారు. అటువంటి వారున్నచోట గంగిరెద్దాట ఆడేవారికి లోటుండదు. బియ్యం ఇస్తారు. డబ్బులు ఇస్తారు. బట్టలు ఇస్తారు. గంగిరెద్దుకు మేత పెడతారు. తమకు నివాసం చూపిస్తారు. గంగిరెద్దాట చూసి ఆనందిస్తారు. బహుమతులిస్తారు. కనుక ధర్మప్రభువులున్న ఏ ఊరైనా తమ ఊరేనన్నాడు. గుప్పెడన్నం ఎక్కడ దొరికితే అదే తన ఊరని బసవయ్య ఉద్దేశం. అందుకే అలా అన్నాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ప్రశ్న 2.
గంగిరెద్దాట ప్రాచీనమైనదని ఎలా చెప్పగలవు?
జవాబు:
దేవతలలో ఆదిదేవుడు పరమేశ్వరుడు. ఆయన వాహనం నందీశ్వరుడు. ఆ పరమేశ్వరుడే నందీశ్వరుడిచేత గంగిరెద్దాట ఆడించాడంటారు.

ఒకసారి శివలింగాన్ని గజాసురుడు మింగేస్తాడు. శివుడి గురించి పార్వతీదేవి, వినాయకుడు, మొదలైన వారు ఆందోళన చెందుతారు. విష్ణువును ఆశ్రయిస్తారు. విష్ణువు గంగిరెద్దుల నాడించేవానిగా మారతాడు. నందీశ్వరుని చేత గజాసురుని ముందు గంగిరెద్దాటను ఆడిస్తాడు. గజాసురుడు ఏం కావాలో కోరుకోమంటాడు. ఆనందంతో పరమేశ్వరుడు కావాలంటాడు. సరే అంటాడు. గజాసురుని పొట్టను నందీశ్వరుడు తన కొమ్ములతో చీల్చాడు. శివుని తెచ్చాడు.

అలాగే రాజులు, రాణులు కూడా గంగిరెద్దాటను ఆస్వాదించారు. అందుచేత గంగిరెద్దాట చాలా ప్రాచీన కాలం నుండీ ఉంది. గంగిరెద్దును నందీశ్వరునిగా, గంగిరెద్దును ఆడించేవాసిని విష్ణువుగా, అతని భార్యను లక్ష్మీదేవిగా పూర్వం భావించేవారు. గంగిరెద్దు గుమ్మంలో ఆడితే ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం.

ప్రశ్న 3.
గంగిరెద్దుల వాళ్ళ దగ్గర ఏ వాయిద్యాలుంటాయి? వాటిని ఎలా ఉపయోగిస్తారు?
జవాబు:
గంగిరెద్దుల వాళ్ళ దగ్గర డోలు, సన్నాయి ఉంటాయి. డోలును రాండోలు అని కూడా అంటారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
గంగిరెద్దుల ఆట ఎలా ఉంటుందో వర్ణిస్తూ రాయండి.
జవాబు:
ఒక వ్యక్తి గంగిరెద్దు చేత మోళీ చేయిస్తుంటాడు. మరొక వ్యక్తి రాండోలు వాయిస్తుంటాడు. రాండోలు వాయించడ మంటే రెండుచేతులతోనూ రెండు కర్రలు పట్టుకొంటారు. ఒక కర్రతో డోలు చర్మాన్ని రాపాడిస్తారు. మరో కర్రతో రెండోవైపున వరసలు వాయిస్తారు. ఇది గంగిరెద్దు మోళీకి తగినట్లుగా ఉండాలి.

గంగిరెద్దు మోళీ చేస్తుంది. ముంగాళ్లు వంచి ముందుకు నడుస్తుంది. వెనక్కు జరుగుతుంది. ఒంటికాలితో దండం పెడుతుంది. కాదు, ఔను అని తలలో సైగలు చేస్తుంది. రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేస్తుంది. అలుగుతుంది. కోపగించుకొంటుంది. ఆనందంతో చిందులు వేస్తుంది. కోపంతో కాలు దువ్వుతుంది. తోక ఎగబెట్టి రంకెలు వేస్తుంది. ఇలా ఏ పని చెబితే ఆ పనిని చేస్తుంది.

ప్రశ్న 2.
గంగిరెద్దుల వాళ్ళు పల్లెటూళ్ళలోనే ఉండిపోవడానికి కారణాలు రాయండి.
జవాబు:
మారుమూల పల్లెటూళ్లలో కళాపోషణ ఉంటుంది. తోటివారిని ఆదుకొనే మనస్తత్వం ఉంటుంది. ఎక్కువమంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. వారి దగ్గర పశువులు కూడా ఉంటాయి. అందుచేత పశువుల మేత కూడా ఉంటుంది. తిండిగింజలకు లోటుండదు. భక్తి ఎక్కువ, ఆదరణ ఎక్కువ. గంగిరెద్దుకు, తమ కుటుంబానికి తిండికీ సౌకర్యానికీ, ఆదరణకూ లోటుండదు కనుక గంగిరెద్దుల వాళ్లు పల్లెటూళ్లలోనే ఉంటున్నారు. సాయంత్రం అయితే అందరూ ఇళ్లకు చేరతారు. గంగిరెద్దాటంటే పల్లెటూరి జనానికి ఇష్టం కూడా.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ప్రశ్న 3.
మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన జానపద కళారూపాన్ని ప్రశంసిస్తూ రాయండి.
జవాబు:
నాకు గొరవయ్యల నృత్య ప్రదర్శన ఇష్టం. ఇది మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురాలలో ప్రసిద్ది చెందిన జానపద కళారూపం. దీనిని మాదాసి కురవలు అనేవారు ప్రదర్శిస్తారు. ఒక చేత్తో పిల్లనగ్రోవి వాయిస్తారు. మరో చేత్తో జగ్గు లేదా డమరుకం వాయిస్తూ మధ్యమధ్యలో వచనాలు పాడుతూ సామూహిక నృత్యం చేస్తారు. వీరు పెట్టుకొనే టోపీ ఖండాంతరాల కావల గల ఆదివాసీ పురాతన సంప్రదాయ నమూన కలిగి ఉంటుంది. వీరు కన్నడంలోనూ తెలుగులోనూ కూడా వచనాలు చెబుతూ అదరకొట్టేస్తారు. మన జానపద కళలకు ఇటువంటి వారే వారసులు.

భాషాంశాలు

అ) కింద గీతగీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : ఆరిఫ్ కుటుంబం శ్రీకాకుళంలో మకాం ఉంటుంది.
మకాం = నివాసం
ఎలుకలు బొరియలలో నివాసం ఉంటాయి.

1. రాబర్ట్ వాళ్ళ బామ్మ నన్ను ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తుంది.
జవాబు:
ఆప్యాయం = వాత్సల్యం
మా ఉపాధ్యాయులు మమ్ము వాత్సల్యంతో చూస్తారు.

2. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడచుకోవాలి.
జవాబు:
అనుగుణం = తగినట్లు
ప్రశ్నకు తగినట్లు జవాబు ఉండాలి.

3. కాలుష్యం ఎక్కువైతే ప్రకృతి అందాలు కనుమరుగు అవుతాయి.
జవాబు:
కనుమరుగు = నాశనం
మానవులలో మంచితనం నాశనం అవుతోంది.

ఆ) కింది పదాలకు సమానార్థక పదాలు (పర్యాయపదాలు) వెతికి రాయండి.
ఉదా : నదులలో నీరు తియ్యగా, సముద్రంలో జలం ఉప్పగా ఉంటుంది.
జవాబు:
ఉదకం : నీరు, జలం

1. సునీల తండ్రి గురవయ్య. వినయ్ జనకుడు స్వామి.
జవాబు:
నాన్న = తండ్రి, జనకుడు

2. వృషభం, ఎద్దు, గోవు, ధేనువు, పాదపం.
పై వాటిలో ‘బసవయ్య’ అనే పదానికి సమానార్థక పదాలు గుర్తించి రాయండి.
జవాబు:
బసవయ్య = వృషభం, ఎద్దు

3. మా విజ్ఞానయాత్ర మాకు ఆనందాన్ని, మా ఉపాధ్యాయులకు సంతసాన్ని పంచింది.
జవాబు:
సంతోషం = ఆనందం, సంతసం

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ఇ) కింది పదబంధాలకు విశేషార్థాలు చదవండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : రూపుమాపు = నాశనం చేయు
మనం వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి.

1. పట్టుకొని వేలాడు = వదిలిపెట్టకుండా ఉండు
మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడకూడదు.

2. కాలుదువ్వు = తగవుకు సిద్ధపడడం.
అయినదానికీ, కాని దానికి అందరి మీదా కాలుదువ్వడం మంచిదికాదు.

3. తిలోదకాలివ్వడం = సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం.
దుర్మార్గానికి తిలోదకాలివ్వడం మంచిది.

వ్యాకరణాంశాలు

అ) కింది పదాలను విడదీసినప్పుడు వచ్చిన మార్పును గమనించండి.

1. మహేశ = మహా + ఈశ = ఆ + ఈ = ఏ
2. మహోదధి = మహా + ఉదధి = ఆ + ఉ = ఓ
3. రాజర్షి = రాజ + ఋషి = అ + ఋ = అర్

పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదం చివర అ ఆ అనే అచ్చులు ఉన్నాయి. పరపదంలో మొదటి అచ్చులుగా ఇ, ఉ, ఋ లు ఉన్నాయి. వాటి స్థానంలో క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వచ్చాయి కదా !

అలాగే కిందనున్న పదాలను విడదీసి రాయండి.
1. రాజేంద్ర = రాజ + ఇంద్ర = అ + ఇ = ఏ
2. తిలోదకాలు = తిల + ఉదకాలు = అ + ఉ = ఓ
3. మహర్షి = మహా + ఋషి = ఆ + ఋ = అర్

పరిశీలించండి.

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న 2

ఏ, ఓ, అర్ లను గుణములు అంటారు. ఇలా అకారానికి (అ, ఆ) “ఇ, ఉ, ఋ” లు (ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ఋ) పరమైతే క్రమంగా ఏ, ఓ, అర్ లు వస్తాయి. దీనినే గుణ సంధి అంటారు.

ఆ) కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

1. పరోపకారం = పర + ఉపకారం – గుణ సంధి
2. రమేశ = రమ + ఈశ = గుణ సంధి
3. జాతీయోద్యమం = జాతీయ + ఉద్యమం – గుణ సంధి
4. దేవర్షి = దేవ + ఋషి = గుణ సంధి

ఇ) కింది సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

1. సత్యాగ్రహం = సత్య + ఆగ్రహం = సవర్ణదీర్ఘ సంధి
2. గిరీశుడు = గిరి + ఈశుడు = సవర్ణదీర్ఘ సంధి
3. గురూపదేశం – గురు + ఉపదేశం = సవర్ణదీర్ఘ సంధి
4. పిత్రణం = పితృ + ఋణం = సవర్ణదీర్ఘ సంధి

ఈ) కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి.
1. శైల + అగ్రం = శైలాగ్రం = సవర్ణదీర్ఘ సంధి
2. ముని + ఇంద్రుడు = మునీంద్రుడు = సవర్ణదీర్ఘ సంధి
3. మధు + ఉదయం = మధూదయం = సవర్ణదీర్ఘ సంధి

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ఉ) కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి.

1. అందచందాలు : అందమును, చందమును
2. కాలుసేతులు : కాళ్ళును, చేతులును
3. అన్నదమ్ములు : అన్నయును, తమ్ముడును

కింది విగ్రహ వాక్యాలను ద్విగు సమాస పదాలుగా మార్చి రాయండి.

1. రెండైన చేతులు = రెండు చేతులు
2. మూడైన మాసాలు = మూడు మాసాలు
3. ఐదుగురైన పిల్లలు = ఐదుగురు పిల్లలు

ఎ) కింది వాక్యాలను పరిశీలించండి.

1. మీరు లోపలికి రావచ్చు.
2. నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు.
3. మీరు సెలవు తీసుకోవచ్చు.

ఇలా ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే, అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు. ఉదాహరణకు “మీరు పరీక్ష రాయవచ్చు”. ఇలాంటి వాక్యాలు సేకరించి రాయండి.

1. మీరు ఆటలు ఆడుకోవచ్చు – అనుమత్యర్థక వాక్యం
2. మీరు భోజనాలు చేయవచ్చు – అనుమత్యర్థక వాక్యం
3. నీవు లోపలికి రావచ్చు – అనుమత్యర్థక వాక్యం అలాగే

1. నీకు శుభం కలుగుగాక !
2. నిండు నూరేళ్ళూ వర్దిల్లు
3. నీకు మంచి బుద్ధి కలుగుగాక !

ఈ విధంగా ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను ఆశీరర్థక వాక్యాలు అంటారు. ఆంటోనీ ! నీకు దైవానుగ్రహము కలుగుగాక ! – ఇలాంటి వాక్యాలు సేకరించి రాయండి.

1. నీవు కలకాలం చల్లగా ఉండుగాక ! – ఆశీరర్థక వాక్యం
2. నీవు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడవగు గాక ! – ఆశీరర్థక వాక్యం
3. నీవు ఉన్నత స్థితికి వచ్చుగాక ! ఆశీరర్థక వాక్యం

ఏ) కింది వాక్యాలు చదివి అవి ఏరకం వాక్యాలో రాయండి.
1. నాయనా ! వర్ధిల్లు !
2. రహీమ్ నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు.
3. సరోజా! సద్విద్యా ప్రాప్తిరస్తు !
4. ఎల్విన్ ! నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును.
5. నీకు ఎల్లెడలా శుభం కలుగుగాక !
6. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిరావచ్చును.

వాక్యం వాక్యపు రకం
1. నాయనా ! వర్ధిల్లు ! ఆశీరర్థక వాక్యం
2. రహీమ్ నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. అనుమత్యర్థక వాక్యం
3. సరోజా! సద్విద్యా ప్రాప్తిరస్తు ! ఆశీరర్థక వాక్యం
4. ఎల్విన్ ! నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును. అనుమత్యర్థక వాక్యం
5. నీకు ఎల్లెడలా శుభం కలుగుగాక ! ఆశీరర్థక వాక్యం
6. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిరావచ్చును. అనుమత్యర్థక వాక్యం

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

ఐ) జతపర్చండి.

1. నువ్వు పద్యం చదివావా? అ) ఆశీరర్థకం
2. అల్లరి చేయకండి. ఆ) ఆశ్చర్యార్థకం
3. అబ్బో! పువ్వు ఎంత బాగుందో ! ఇ) ప్రశ్నార్థకం
4. సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక ! ఈ) నిషేధార్థకం

జవాబు:

1. నువ్వు పద్యం చదివావా? ఇ) ప్రశ్నార్థకం
2. అల్లరి చేయకండి. ఈ) నిషేధార్థకం
3. అబ్బో! పువ్వు ఎంత బాగుందో ! ఆ) ఆశ్చర్యార్థకం
4. సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక ! అ) ఆశీరర్థకం

చమత్కార పద్యం

కప్పను చూసి పాము వణికింది అని సమస్యను ఒక కవికి ఇవ్వడం జరిగింది. కప్పను చూసి పాము వణకదు. ఈ సమస్యకు కవి కింది విధంగా పరిష్కారం చూపాడు.

కుప్పలు కావలిగాయగ
చెప్పులు కర్రయును బూని శీఘ్రగతిం దా
జప్పుడగుచు వచ్చెడి వెం
కప్పను గని ఫణివరుండు గడగడ వణికెన్.

భావం :
పద్యం చివరిపాదంలో కప్ప దాని ముందరి అక్షరంతో కలిసి వెంకప్ప అయింది. ఆ వెంకప్ప కుప్పలు కాయడానికి చెప్పులు వేసుకొని కర్రతో బయలుదేరాడు. ఆ వెంకప్పను చూసి ఒక పాము గడగడ వణికిందట.

డూడూ బసవన్న – రచయిత పరిచయం

రచయిత పేరు : రావూరి భరద్వాజ

జననం : 1927 జూలై 5వ తేదీన గుంటూరు జిల్లాలోని తాడికొండలో జన్మించారు.

తల్లిదండ్రులు : మల్లికాంబ, కోటయ్య దంపతులు.

ఉద్యోగం : వ్యవసాయం, ప్రెస్సులో ఉద్యోగం, జమీన్ రైతు పత్రికా సంపాదక వర్గంలోనూ, జ్యోతి, సమీక్ష మొదలైన పత్రికలో పనిచేశారు.

రచనలు : విమల – తొలికథ, అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు, ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలలు రచించారు.

అవార్డులు : పాకుడు రాళ్లు నవలకు జ్ఞానపీఠ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మీ పౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం), లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు. ప్రస్తుత పాఠ్యభాగం ‘జీవన సమరం’ అనే వ్యథార్త జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకొన్నారు.

కఠినపదాలు – అర్థాలు

ప్రభువు = పరిపాలకుడు
దణ్ణం = దండం
కనుమరుగు = నశించు
చందము = విధము
ప్రాచీనం= పూర్వకాలం
పుడక = పుల్ల
గొడ్డుమోతు = సంతానం లేనిది
ముంగాళ్లు = ముందరి కాళ్లు
సుబ్బరంగా = శుభ్రంగా
సాదిక = సారధ్య
మకాం = నివాసం
ఉడకేసుకొని = వండుకొని
ఉత్తరీయం = పైబట్ట (తువ్వాలు, కండువా)
దాటిపోయింది = వెళ్లిపోయింది

AP Board 6th Class Telugu Solutions Chapter 11 డూడూ బసవన్న

గడి = గంగిరెద్దాడే ప్రదేశం
దేదీప్యమానంగా = ప్రకాశవంతంగా
ఘట్టం = సంఘటన
తిలోదకాలివ్వడం = వదిలేయడం
గొడ్డు = పశువు
చిందులు = గంతులు
మాసం = నెల
గంగడోలు = ఆవు మెడ దగ్గర మెత్తటి చర్మం
క్రీడ = ఆట

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

SCERT AP Board 6th Class Telugu Solutions 10th Lesson త్రిజట స్వప్నం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 10th Lesson త్రిజట స్వప్నం

6th Class Telugu 10th Lesson త్రిజట స్వప్నం Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం 1

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
చిత్రంలో అన్నాచెల్లెలు ఉన్నారు.

ప్రశ్న 2.
పాప ఎందుకు బాధపడుతుంది?
జవాబు:
పాప తన తండ్రి గురించి బాధపడుతోంది.

ప్రశ్న 3.
అన్నయ్య చెల్లికి ఎలాంటి మాటలు చెబుతున్నాడు?
జవాబు:
అన్నయ్య చెల్లికి ఓదార్పు మాటలు చెబుతున్నాడు.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాల భావం సొంత మాటలలో చెప్పండి.
జవాబు:
ఓ స్త్రీలారా ! వినండి. అని త్రిజట చెప్పింది. తను కలగన్నది. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోయినట్లు, రావణుని రత్న కిరీటాలు నేలపడినట్లు, రాముడు మదించిన ఏనుగు నెక్కి సీతాదేవిని తీసుకొని వెడుతున్నట్లు కలగన్నది. రాముడు, సీత పవిత్రులు. సీతాదేవితో కఠినంగా మాట్లాడవద్దన్నది. ఇటుపైన ఆమె వలన రక్షణ పొందాలన్నది. సీతమ్మను తప్పక రాముడు తీసుకొని వెడతాడని చెప్పింది. తమను కాపాడమని ప్రార్థించింది. రాక్షస స్త్రీలు నిద్రపోయేరు. సీతాదేవి దుఃఖించింది. శ్రీరాముడు బాగున్నాడు. సీతాదేవిని తప్పక తీసుకొని వెడతాడని ‘హనుమ సీతతో చెప్పాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ప్రశ్న 2.
త్రిజటకు లంకను గురించి ఏమని కల వచ్చిందో రాయండి.
జవాబు:
త్రిజటకు కల వచ్చింది. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోతున్నట్లు కనిపించింది. రావణుని తలలపై ప్రకాశించే రత్న కిరీటాలు నేలపై పడినట్లు ఆమెకు కలలో కనిపించింది.

ప్రశ్న 3.
త్రిజట స్వప్నం పాఠ్యభాగ నేపథ్యం రాయండి.
జవాబు:
రావణుడు సీతను అపహరించాడు. సీతతో లంకకు చేరాడు. అశోకవనంలో శింశుపా వృక్షం కింద ఆమెను ఉంచాడు. తనకు అనుకూలంగా సీత మనసును మార్చమని రాక్షస స్త్రీలను ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు చంపుతామని భయపెట్టారు. ఆ సమయంలో అంతవరకు నిదురించిన త్రిజట మేల్కొంది. తనకు వచ్చిన కలను గురించి కాపలాగా ఉన్న తోటి రాక్షస స్త్రీలతో చెప్పింది. అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగ నేపథ్యం.

ప్రశ్న 4.
కింది పద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
తనవారు లేనిచోటను
జనవించుక లేనిచోట, జగడము చోటన్
అనుమానమైనచోటను
మనుజుడచట నిలువదగదు మహిలో సుమతీ !

అ) తనవారు అంటే ఎవరు?
జవాబు:
తనవారు అంటే తన బంధువులు, తన మిత్రులు.

ఆ) జగడం అంటే ఏమిటి?
జవాబు:
జగడం అంటే గొడవ.

ఇ) ఈ పద్యం ఏ శతకంలోనిది?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది.

ఈ) మనిషి ఎక్కడెక్కడ నివసించకూడదు?
జవాబు:
తనవారు లేనిచోట, చనువు లేనిచోట, గొడవలు జరిగేచోట, అనుమానించే చోట మనిషి నివసించకూడదు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
త్రిజట తోటి రాక్షస స్త్రీలతో సీతాదేవిపట్ల ఎలా నడచుకోవాలని చెప్పింది?
జవాబు:
రాముడు పవిత్రాత్మ గలవాడు. సీతాదేవి ఆయన రాణి. కనుక సీతాదేవిని రక్షిస్తున్న రాక్షస స్త్రీలెవ్వరూ కఠినంగా మాట్లాడకూడదు. ఇటుపైన సీతాదేవి వల్లనే రాక్షస స్త్రీలందరూ రక్షించబడాలి. కనుక సీతాదేవిని జాగ్రత్తగా చూడాలని త్రిజట రాక్షస స్త్రీలకు చెప్పింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ప్రశ్న 2.
కవయిత్రి మొల్ల గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
మొల్ల పూర్తి పేరు ఆత్కూరి మొల్ల. ఆమె 16వ శతాబ్దపు కవయిత్రి. ఆమె రామాయణం తెలుగులో రచించారు. ఆమె పద్యాలు సరళంగా, రమణీయంగా ఉంటాయి.

ప్రశ్న 3.
తనను రక్షించేవారు లేరని బాధపడుతున్న సీతాదేవిని హనుమంతుడు ఏమని ఓదార్చాడు?
జవాబు:
శ్రేష్ఠుడైన శ్రీరాముడు సీతాదేవిని రక్షించడానికి ఉన్నాడు. వానరులతో కలిసి వస్తాడు. తప్పనిసరిగా ఆమెను తీసుకొని వెడతాడు. అది నిజమని సీతాదేవిని హనుమంతుడు ఓదార్చాడు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
త్రిజట తన కలలో వచ్చిన అంశాలను తోటి వారితో ఎలా వివరించిందో మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
అశోకవనంలో సీతాదేవికి కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో త్రిజట తన కలలో వచ్చిన అంశాలను వివరించింది. తను కల కనినట్లు చెప్పింది. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోయింది. తమ ప్రభువు తలలపై ప్రకాశించే రత్న కిరీటాలు నేలపై పడ్డాయి. రాముడు ఆనందంగా ఉన్నాడు. మదించిన ఏనుగును శ్రీరాముడు ఎక్కాడు. కాంతితో ప్రకాశిస్తున్న సీతను శ్రీరాముడు తీసుకొని వెడుతున్నాడు. అని వివరించింది.

ప్రశ్న 2.
త్రిజట సీతను ఎలా ఓదార్చింది? ఆ తరువాత ఏం జరిగిందో వివరించండి.
జవాబు:
త్రిజట “అమ్మా ! మీరు భయపడవద్దు. మనసులో ఆనందం నింపుకో ! నీ భర్త వచ్చి నిన్ను త్వరలో తీసుకొని వెళతాడు. నీవే మమ్ములనందరిని రక్షించాలి” అని సీతను ఓదార్చింది. ఆ తరువాత రాక్షస స్త్రీలందరూ నిద్రపోయారు. అప్పుడు హనుమంతుడు మానవ భాషలో “సీతమ్మ తల్లీ ! రాముడు క్షేమంగా ఉన్నాడు. వానర సైన్యంతో త్వరలో వస్తాడు. నిన్ను తీసుకొని వెళతాడు. ఈ మాటలు నిజం” అని చెప్పి సీతను ఓదార్చాడు.

ప్రశ్న 3.
రాష్ట్రస్థాయి ఆటలపోటీకి ఎన్నికై గెలుపు గురించి ఆందోళన చెందుతున్న మీ మిత్రుడికి ధైర్యం చెబుతూ లేఖ రాయండి.
జవాబు:

లేఖ

కర్నూలు,
XXXXX.

ప్రియమైన
శ్రీధర్ కు, శ్రీకర్ వ్రాయు లేఖ

ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

నీవు రాష్ట్రస్థాయి ఆటలపోటీకి ఎన్నికైనందుకు అభినందనలు. జిల్లాస్థాయిలో నెగ్గినవాడికి రాష్ట్రస్థాయిలో నెగ్గడం పెద్ద కష్టమేం కాదు. దీని గురించి ఆందోళన చెందకు. నీ పట్టుదల, కృషి మాకు తెలుసు. పట్టుదలతో కృషి చేస్తే దేనినైనా సాధించవచ్చనే మన తెలుగు ఉపాధ్యాయుల మాటలు మరచిపోకు. మన వ్యాయామ ఉపాధ్యాయులు జాతీయస్థాయి క్రీడా విజేత. ఆయన పర్యవేక్షణలో అపజయం ఉండదు. నీ ఆత్మవిశ్వాసమే నిన్ను గెలిపిస్తుంది. ధైర్యంతో ఆడు. విజయం సాధించు. నీ పేరు టి.వి.లోనూ, పేపర్లలోనూ మార్ర్మోగాలి. ఉంటాను. నీ విజయగాథతో రిప్లై రాయి.

ఇట్లు,
నీ స్నేహితుడు,
సి. శ్రీకర్ వ్రాలు.

చిరునామా:
టి. శ్రీధర్, 6వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
పేరుసోముల, కర్నూలు జిల్లా.

భాషాంశాలు

అ) కింద గీతగీసిన మాటలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యం రాయండి.
ఉదా : ఆ చెట్టు కింద ఉన్న ఇంతి సీతాదేవి.
ఇంతి = స్త్రీ
మసం స్త్రీలను గౌరవించాలి.

1. రావణుని తల పైనున్న కోటీరం నేలపై పడింది.
కోటీరం = కిరీటం
ప్రజాస్వామ్యంలో రాచరికాలు కిరీటాలు లేవు.

2. ఈ ఉర్వి పై మనమంతా నివసిస్తున్నాము.
ఉర్వి = భూమి
భూమిని జాగ్రత్తగా కాపాడాలి.

3. సీతాదేవి భర్త అయిన రాఘవుడు వస్తాడు.
రాఘవుడు = శ్రీరాముడు
శ్రీరాముడు ధర్మ స్వరూపుడు.

4. శ్రీరాముడు లెస్సగా ఉన్నాడు,
లెస్స = బాగు
అన్ని భాషలలోకీ తెలుగుభాష బాగుగా ఉంటుంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ఆ) కింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోను ఒక పదానికి అదే అర్ధం వచ్చే మరొక పదం ఉన్నది. ఆ పదాలను గుర్తించి రాయండి.
ఉదా :
భూమిపై మనం నివసిస్తున్నాం. ఈ ధరణిలో మనతోపాటు అనేక ప్రాణులున్నాయి.

1. సీతను చూడగానే హనుమంతుడు సంతోషించాడు. శ్రీరాముని గురించి వినగానే సీతమనసు ఎలమితో పొంగిపోయింది.
జవాబు:
సంతోషం , ఎలమి

2. గురువు చెప్పిన మాట వినాలి. ఆ ఉక్తి మనకు మేలు చేస్తుంది.
జవాబు:
మాట, ఉక్తి

3. చంద్రుడి కాంతి మనకు ఆనందాన్నిస్తుంది. ఆ వెలుగు ప్రకృతిని కూడా పరవశింప జేస్తుంది…
జవాబు:
కాంతి, వెలుగు

4. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిపై కరుణ చూపాలి. మనం చూపే దయ వారికి ఆ బాధను తగ్గిస్తుంది.
జవాబు:
కరుణ, దయ

ఇ) కింది పదాలకు ప్రకృతి, వికృతులను జతపరచి రాయండి.
భాష, అమ్మ, నిద్ర, బాస, అంబ, నిదుర
జవాబు:
ప్రకృతి – వికృతి
ఉదా : భాష – బాస
అంబ – అమ్మ
నిద్ర – నిదుర

వ్యాకరణాంశాలు

ఈ) కింది పదాలను విడదీయండి.
ఉదా : శుద్ధాత్ముడు = శుద్ధ + అత్ముడు
రామాలయం = రామ + ఆలయం

ఉదా : రవీంద్రుడు = రవి + ఇంద్రుడు
2. కవీంద్రుడు = కవి + ఇంద్రుడు

ఉదా : భానూదయం = భాను + ఉదయం
3. గురూపదేశం = గురు + ఉపదేశం

ఉదా : పితౄణం = పితృ + ఋణం
4. మాతౄణం = మాతృ + ఋణం

పై మాటలలో ఈ కింది మార్పు జరిగింది.
1. అ + ఆ = ఆ
2. ఇ + ఇ = ఈ
3. ఉ + ఉ = ఊ
4. ఋ + ఋ = ఋ
‘అ-ఇ-ఉ-ఋ’ అనే వర్ణాలకు అవే వర్ణాలు (సవర్ణాలు) కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని ‘సవర్ణదీర్ఘ సంధి’ అంటారు.
‘అ’ వర్ణానికి ‘అ ఆ’ లు సవర్ణాలు.
‘ఇ’ వర్ణానికి ‘ఇ ఈ’ లు సవర్ణాలు .
‘ఉ’ వర్ణానికి ‘ఉ-ఊ’ లు సవర్ణాలు.
‘ఋ’ వర్ణానికి ‘ఋ ఋ’ లు సవర్ణాలు.

పైన సంధి జరిగిన పదాలు సంస్కృత పదాలు / సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను ‘సంస్కృత సంధులు’ అంటారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ఉ) కింది పదాలను విడదీయండి.

ఉదా : విద్యార్థి = విద్యా + అర్థి = (ఆ + అ = ఆ)
1. కవీశ్వరుడు = కవి + ఈశ్వరుడు = (ఇ + ఈ = ఈ)
2. కోటీశ్వరుడు = కోటి + ఈశ్వరుడు = (ఇ + ఈ = ఈ)
3. వధూపేతుడు = వధూ + ఉపేతుడు = (ఊ + ఉ = ఊ)
4. దేవాలయం = దేవ + ఆలయం = (అ + ఆ = ఆ)

ఊ) కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.

1. సీతకు ఆనందం కలిగింది.
రామునికి ఆనందం కలిగింది.
సంయుక్త వాక్యం : సీతారాములకు ఆనందం కలిగింది.

2. త్రిజట బాధపడింది.
ద్విజట బాధపడింది.
సంయుక్త వాక్యం : త్రిజట, ద్విజటలు బాధపడ్డారు.

3. మీరు కఠినంగా మాట్లాడకండి.
మీరు కోపంగా మాట్లాడకండి.
సంయుక్త వాక్యం : మీరు కఠినంగానూ, కోపంగానూ మాట్లాడకండి.

4. హనుమంతుడు గొప్పవాడు.
హనుమంతుడు మంచి భక్తుడు.
సంయుక్త వాక్యం : హనుమంతుడు గొప్పవాడు మరియు మంచి భక్తుడు.

5. అపర్ణ సంగీతం నేర్చుకుంది.
అపర్ణ నృత్యం నేర్చుకుంది.
సంయుక్త వాక్యం : అపర్ణ సంగీతం మరియు నృత్యం నేర్చుకుంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

ఎ) ప్రశ్నార్థక వాక్యం :
వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దానిని ప్రశ్నార్థక వాక్యం అంటారు.
ఉదా : 1. త్రిజట ఏం మాట్లాడుతుంది ?
2. సీత ఎందుకు బాధపడింది?

మీరు కొన్ని ప్రశ్నార్థక వాక్యాలు రాయండి.
1. హనుమంతుడు ఎవరిని చూశాడు?
2. త్రిజట తన కల గురించి ఎవరికి చెప్పింది?
3. సీతాదేవి భర్త పేరేమిటి?

ఏ) ఆశ్చర్యార్థక వాక్యం :
వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లైతే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు.
ఉదా :
1. ఆహా ! ఎంత బాగుందో !
2. ఔరా ! సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో !

మీరు కొన్ని ఆశ్చర్యార్థక వాక్యాలను రాయండి.
1. ఆహా ! అరణ్యం ఎంత పచ్చగా ఉందో !
2. అబ్బ ! హనుమ ఎంత బలవంతుడో !
3. ఓహో ! ఇది ఇల్లా ! నందనవనమా !

త్రిజట స్వప్నం కవయిత్రి పరిచయం

కవయిత్రి పేరు : ఆత్కూరి మొల్ల
కాలం : 16వ శతాబ్దం
జన్మస్థలం : కడప జిల్లాలోని గోపవరం
రచనలు : 871 గద్య పద్యాలతో మొల్ల రామాయణం రచించారు. చక్కని పద్యాలతో సరళంగా,రమణీయంగా రాశారు. తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటకట్టుగొన్న రచయిత్రి. ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండలోనిది.

పద్యాలు – అర్థాలు – భావాలు

1. మ! కలగంటిన్ వినుఁడింతులార! మన లంకాద్వీప మీయబి లో
పల వ్రాలన్, మన రావణేశ్వరుని శుంభద్రత్నకోటీరముల్
కలనన్ గూల రఘూద్వహుండెలమితో గంధిద్విపం బెక్కి, యు
జ్జ్వలకాంతిన్ విలసిల్లుసీతఁ గొనిపోవన్ మిన్నకే నిప్పుడే
అర్థాలు :
కంటిన్ = చూచితిని
ఇంతులు = స్త్రీలు
అబ్ధి = సముద్రం
ఈశ్వరుడు = ప్రభువు
శుంభత్ = ప్రకాశించే
కోటీరములు = కిరీటాలు
ఎలమి = సంతోషం
ద్విపం = ఏనుగు
ఉజ్జ్వలము = వెలుగునది
విలసిల్లు = ప్రకాశించు

భావం :
“ఓ స్త్రీలారా! వినండి. నేను కలగన్నాను. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగి పోయింది. రావణుని తలలపై ప్రకాశించే రత్నకిరీటాలు నేలపై రాలిపడ్డాయి. రాముడు ఆనందంతో ఉన్నాడు. మదించిన ఏనుగును ఎక్కాడు. కాంతితో ప్రకాశిస్తున్న సీతాదేవిని తీసుకుని వెళుతున్నాడు” అని అప్రయత్నంగా తనకు కలిగిన కలను త్రిజట వివరించింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

2. క॥ శుద్దాత్ముఁడైన రాముఁడు
శుద్దాంతపుదేవిఁ గానశుభసూచకముల్
శుద్ధమయి తోఁచుచున్నవి
సిద్ధం బీమాట వేదసిద్ధాంతముగాన్
అర్థాలు :
శుద్ధాత్ముడు = పవిత్రమైన ఆత్మ గలవాడు
శుద్ధాంతము = అంతఃపురము
శుద్ధమయి = పవిత్రమయి
సిద్ధాంతము = స్థిరమైన నిర్ణయం
సిద్ధము = న్యాయమైనది

భావం :
రాముడు పవిత్రమైన ఆత్మ కలవాడు. ఆయన అంతఃపుర రాణి సీతాదేవి కనుక అన్నీ పవిత్రమైన శుభసూచకాలే కనిపిస్తున్నాయి. వేదం యొక్క స్థిరమైన నిర్ణయం లాగా నా మాట న్యాయమైనది.

3. క॥ కావున నిక్కోమలియెడఁ
గావలి యున్నట్టిమీరు కఠినోక్తులు గా
నేవియు నాడకుఁ, డిఁక నీ
దేవియ రక్షింప మనకు దిక్కగు మీఁదన్
అర్థాలు :
కావున = కనుక కావలి = కాపలా
కఠిన + ఉక్తులు – పరుషమైన మాటలు
ఆడకుడు = మాట్లాడకండి
దిక్కు = శరణు
మీదన్ = ఇటుపైన

భావం :
అందువల్ల సీతాదేవిని రక్షిస్తున్న మీరు కఠినంగా మాట్లాడవద్దు. ఇకమీదట ఈ సీతాదేవి వల్లనే మనం రక్షింపబడతాము.

4. వ|| అని చెప్పి మటియును
భావం : అని చెప్పి ఇంకా ఇలా అంది.

5. క॥ అమ్మా వెఱవకు మదిలో
నిమ్ముగ మటి వేడ్క నుండు మిఁక, నీ మగఁడున్
నెమ్మిగ నినుఁ గొనిపోవును
మమ్మందఱ మనుపు మమ్మ! మఱవక కరుణన్
అర్థాలు :
వెఱవకు = భయపడకు
మది = మనస్సు
ఇమ్ముగ = ఆనందంగా
నెమ్మిగ = ప్రేమగ
మునుపు = ముందు, పూర్వం
మనుపుము = బ్రతికించుము
కరుణన్ = దయతో రక్షించుము

భావం :
“అమ్మా! భయపడవద్దు. మనసులో ఆనందాన్ని నింపుకుని సుఖంగా ఉండు. నీ భర్త ప్రేమతో నిన్ను తీసుకొని వెళతాడు. తప్పక దయతో మమ్మల్ని కాపాడు.”

6. ఆ|| అనుచు దనుజకాంత లంతంత నెడఁబాసి
నిదుర వోయి రంత నదరి సీత
తనకు దిక్కు లేమిఁ దలపోసి దుఃఖింపఁ
బవనసుతుఁడు మనుజ భాషఁ బలికె
అర్థాలు :
దనుజకాంతలు = రాక్షస స్త్రీలు
ఎడబాసి = విడిచి
అదరి = భయపడి, ఉలిక్కిపడి
లేమి = లేకపోవడం
తలపోసి = ఆలోచించి
పవనము = గాలి, వాయువు
సుతుడు = కొడుకు
పవనసుతుడు = హనుమంతుడు

భావం :
అంటూ రాక్షస స్త్రీలు దూరంగా జరిగి నిద్ర పోయారు. సీత తనకు సమీపంలో రక్షించేవారు ఎవరూ లేరనే భావనతో దుఃఖించింది. అప్పుడు ఆంజనేయుడు మానవ భాషలో ఇలా పలికాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 10 త్రిజట స్వప్నం

7. క॥ ఉన్నాఁడు లెస్స రాఘవుఁ
డున్నాఁ డిదె కపులఁ గూడి, యురుగతి రానై
యున్నాఁడు, నిన్నుఁ గొని పో
నున్నాఁ డిది నిజము నమ్ము ముర్వీతనయా!
అర్థాలు :
లెస్స = బాగుగా
రాఘవుడు = రాముడు
కపులన్ = కోతులతో
కొనిపోవుట = తీసుకొని వెళ్లుట
ఉరుగతి = వేగంగా, గొప్పగా
ఉర్వి = భూమి
తనయ = కుమార్తె
ఉర్వీతనయ : సీతాదేవి

భావం : ఓ సీతమ్మా! శ్రేష్ఠుడైన రాముడు నిన్ను రక్షించడానికి ఉన్నాడు. ఇప్పుడే వానరులతో కలిసి తగిన మార్గంలో వస్తాడు. నిన్ను తీసుకొని వెళతాడు. ఇది నిజం.

AP Board 6th Class Telugu Solutions Chapter 9 ధర్మ నిర్ణయం

SCERT AP Board 6th Class Telugu Solutions 9th Lesson ధర్మ నిర్ణయం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 9th Lesson ధర్మ నిర్ణయం

6th Class Telugu 9th Lesson ధర్మ నిర్ణయం Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 9 ధర్మ నిర్ణయం 1

ప్రశ్న 1.
చిత్రాలను చూసి కథ చదవండి, మాట్లాడండి.
జవాబు:
కథ :
ఒక జింక ఒక పులికి చిక్కింది. తనను చంపవద్దని పులిని ప్రార్థించింది. తన బిడ్డకు పాలిచ్చి వస్తానని నమ్మబలికింది. పులికి దయకలిగింది. జింకను విడిచిపెట్టింది. జింక బిడ్డకు పాలిచ్చి, బిడ్డకు మంచి మాటలు చెప్పి తిరిగి వచ్చింది. పులి ఆశ్చర్యపోయింది. అన్నమాట నిలబెట్టుకొన్న జింకను చంపకుండా విడిచి పెట్టింది.

జింక యొక్క నిజాయితీయే దాని ప్రాణాలు కాపాడింది. మాట తప్పకుండా వచ్చిన జింక, క్రూరమైన పులి స్వభావాన్ని కూడా మార్చింది. సత్యమునకు తప్పక విజయం లభిస్తుంది.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
మాధవవర్మ వంటి ధర్మాత్ములు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తే ఎలా ఉంటుంది? మాట్లాడండి. చెప్పండి.
జవాబు:
మాధవవర్మ వంటి ధర్మాత్ములు పరిపాలిస్తే ప్రజలంతా ధర్మపరాయణులై ఉంటారు. ఎవరూ అబద్దం ఆడరు. మోసం చేయరు. పెద్దలను ఎదిరించరు. తమది కాని దానిని ఆశించరు. తమకు కేటాయించిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. హత్యలు, ఆత్మహత్యలు ఉండవు. ప్రమాదాలు జరుగవు. సుభిక్షంగా ఉంటుంది.

ప్రశ్న 2.
రాజకుమారుడు చేసిన పొరపాటు ఏమిటి?
జవాబు:
అతివేగంగా పరిగెత్తే గుజ్రాలను కట్టిన రథాన్ని ప్రజలు తిరిగే కోటవీధిలో వేగంగా నడపడం తప్పు. అతని మితిమీరిన ఉత్సాహం వలన ఆ రథ చక్రాల కిందపడి ఒక యువకుడు మరణించాడు. అది రాజకుమారుడు చేసిన పొరపాటు.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 3.
దుర్గాదేవి ఎందుకు ప్రసన్నురాలైంది?
జవాబు:
ఒక వృద్ధురాలి కొడుకు మరణానికి తన కుమారుడు కారణమయ్యాడని మాధవవర్మకు తెలిసింది. మాధవవర్మ ధర్మాత్ముడు. వివేకి. తన కుమారునికి మరణశిక్ష విధించాడు. ఆ సాయంకాలమే అమలు జరిపాడు. ఆయన ధర్మనిరతికి దుర్గాదేవి ప్రసన్నురాలయింది. బంగారు వర్షం కురిపించింది. మరణించిన వారిద్దరినీ బ్రతికించింది.

ప్రశ్న 4.
కింది సంభాషణ చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

కెజియా : సుప్రజా ! సెలవుల్లో ఎక్కడి కెళ్ళావ్?
సుప్రజ : నేనా ! మా కుటుంబంతో యాగంటి క్షేత్రం చూడటానికి వెళ్ళాను.
కెజియా : ఓహెూ ! అలాగా ఆ పుణ్యక్షేత్రం ప్రత్యేకత ఏమిటో !
సుప్రజ : ఒకటేమిటి? అనేక ప్రత్యేకతల నిలయమది.
కెజియా : నిజమా ! అవేమిటో చెప్పు.
సుప్రజ : ‘యాగంటి’ కర్నూలు జిల్లా నల్లమల కొండల్లో ఉంది. అత్యంత రమణీయ ప్రదేశం, సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగరూపంలో ఉంటాడు. కానీ ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు.
కెజియా : అలాగా !
సుప్రజ . : ఔను ! ఆలయం వెలుపల ‘అగస్త్య పుష్కరిణి’ అనే కొలను ఉంది. అందులో నీళ్ళు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. అంతేకాదు అక్కడ ఉన్న నంది విగ్రహం రోజు రోజుకూ పెరుగుతూ ఉండటం ముఖ్యమైన విశేషం. అక్కడ మూడు సహజసిద్ధంగా ఏర్పడిన గుహలున్నాయి. వీరబ్రహ్మంగారు ఆ గుహల్లోనే కూర్చుని కాలజ్ఞానం రాశారట !
పర్వీన్ : ఏంటి ? మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు. పదండి. బడికి వెళ్తాం ! (ముగ్గురూ నిష్క్రమిస్తారు)

ప్రశ్నలు – జవాబులు :
అ) యాగంటిలోని ఉమామహేశ్వరాలయానికి, మిగిలిన శివాలయాలకు తేడా ఏమిటి?
జవాబు:
సాధారణంగా శివాలయాలలో శివుడు లింగరూపంలో ఉంటాడు. కాని యాగంటిలో పార్వతీ, పరమేశ్వరులు విగ్రహరూపంలో ఉంటారు.

ఆ) అగస్త్య పుష్కరిణి ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
అగస్త్య పుష్కరిణిలో నీరు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది.

ఇ) కాలజ్ఞానం ఎవరు రాశారు?
జవాబు:
వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు.

ఈ) పై సంభాషణ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
యాగంటి క్షేత్రం ఏ జిల్లాలో ఉంది?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దుర్గాదేవిని కనకదుర్గగా ప్రజలెందుకు పిలుస్తున్నారు?
జవాబు:
మాధవవర్మ కుమారుని రథం క్రింద పడి ఒక యువకుడు మరణించాడు. ధర్మాత్ముడైన మాధవవర్మ తన కుమారుడు చేసిన తప్పుకు మరణశిక్ష విధించి అమలు జరిపాడు. అతని ధర్మనిరతికి దుర్గాదేవి ఆనందించింది. విజయవాడ నగరమంతా బంగారుకాసుల వర్షం కురిపించింది. అలా కనకవర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి కనకదుర్గగా ప్రజలంతా పిలుస్తున్నారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 2.
మాధవవర్మ దృష్టిలో అందరూ సమానులేనని ఎట్లా చెప్పగలవు?
జవాబు:
మాధవవర్మ రాజ్యంలో ఎవరు తప్పుచేసినా తగిన శిక్ష విధించేవాడు. తప్పు చేసిన వారిపట్ల తనవాళ్ళు, పరాయివాళ్ళు అనే భావన ఉండేది కాదు. అతని రాజ్యంలో వ్యక్తిని చంపినవాడికి మరణశిక్ష విధించేవాడు. రథాన్ని వేగంగా నడిపి ఒక యువకుని మరణానికి మాధవవర్మ కొడుకే కారణమయ్యాడు. ఆ నేరానికి తన కుమారునికి కూడా
మరణశిక్ష విధించి అమలు జరిపాడు. అందుచేత మాధవవర్మ దృష్టిలో అందరూ సమానులే అని చెప్పగలను.

ప్రశ్న 3.
పుత్రవాత్సల్యం అంటే ఏమిటి?
జవాబు:
తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఉండే ప్రేమను పుత్రవాత్సల్యం అంటారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
విజయవాడలో బంగారు వర్షం ఎందుకు కురిసిందో వివరంగా రాయండి.
జవాబు:
విజయవాడను పరిపాలించే మహారాజు పేరు మాధవవర్మ. ఆయన ధర్మాత్ముడు. ఒకసారి ఆయన కుమారుడు రథం మీద చాలావేగంతో కోట వీధిలో ప్రయాణించాడు. ఒక యువకుడు రథం కిందపడి మరణించాడు.

అతని తల్లి వృద్ధురాలు. తనకు న్యాయం చేయమని రాజును అర్థించింది. ఆ నేరం చేసినవాడు తన కుమారుడే అని తెలిసింది. న్యాయం ప్రకారం అతనికి మరణశిక్ష విధించాడు. ఆ సాయంత్రమే అతనిని ఉరి తీయించాడు.

అతని ధర్మనిరతికి దుర్గాదేవి ఆనందించింది. ఘడియసేపు బంగారు వర్షం కురిపించింది. ప్రజలంతా వీథులలోకి వచ్చి, బంగారు కాసులు ఏరుకొన్నారు. మరణించిన వారిద్దరిని బతికించింది.

ప్రశ్న 2.
ధర్మపరాయణుడైన మాధవవర్మ గురించి సొంత మాటల్లో రాయండి.
జవాబు:
మాధవవర్మ ధర్మ పరాయణుడు. ధర్మం, న్యాయం విషయంలో ఆయనకు తనవారు, పరాయివారు అనే భేదం లేదు. ఒకరోజు తన కుమారుని రథచక్రాల కిందపడి ఒక యువకుడు మరణించాడు. ధర్మనిర్ణయం చేయమని, న్యాయాధికారులను ఆదేశించాడు మాధవవర్మ. దానికి మరణశిక్ష తప్ప మరో దారి లేదని న్యాయాధికారులు చెప్పారు. రాజకుమారుడైనా, సామాన్యుడైనా న్యాయదేవతకు సమానమేనని చెప్పారు. బంధుప్రీతికి చోటులేదని చెప్పారు. తీర్పు వింటున్నంతసేపూ మాధవవర్మ మౌనంగా ఉన్నాడు. గంభీరంగా ఉన్నాడు. ఆయన ధర్మాన్ని కాదనలేడు. పుత్రవాత్సల్యం, ధర్మ నిర్ణయం రెండింటికీ ఘర్షణ ఏర్పడినపుడు ధర్మ నిర్ణయమే గెలిచింది. అందుకే మాధవవర్మ పట్ల దుర్గాదేవి కూడా ప్రసన్నురాలైంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 3.
కింద ఇవ్వబడిన పదాల ఆధారంగా కథను రాయండి.

శిబిచక్రవర్తి – కొలువు – పావురం-డేగ – ప్రవేశించడం – శరణు – అభయం – ఇవ్వడం – తక్కెడ – తేవడంతూచడం – సరితూగకపోవడం – సిద్ధమవడం – త్యాగనిరతి – ప్రజలు – మెచ్చుకోవడం – అగ్ని – ఇంద్రుడు – ప్రత్యక్షమవడం – ప్రవేశించడం.
జవాబు:
త్యాగం
ఒకనాడు శిబిచక్రవర్తి కొలువుతీరి ఉన్నాడు. ఆయన కొలువులోనికి ఒక పావురం ప్రవేశించింది. దానిని తరుముకొంటూ ఒక డేగ వచ్చింది. పావురం .శిబి చక్రవర్తిని శరణు వేడింది. తనను కాపాడమని ప్రార్థించింది. శిబి అభయం ఇచ్చాడు. అది తన ఆహారం కనుక తనకు మాంసం కావాలని డేగ అడిగింది. శిబి చక్రవర్తి తక్కెడ తెమ్మన్నాడు. తన శరీరం నుండి మాంసం కోసి తక్కెడలో వేసి పావురంతో తూచాడు. ఎంత మాంసం వేసినా సరిపోలేదు. చివరకు తానే కూర్చున్నాడు. ఆయన త్యాగనిరతిని ప్రజలు మెచ్చుకొన్నారు. అగ్ని, ఇంద్రుడు ప్రత్యక్షమయ్యారు. తామే డేగ, పావురం రూపంలో వచ్చినట్లు చెప్పారు. శిబి చక్రవర్తిని ఆశీర్వదించారు.

భాషాంశాలు

అ) కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : శ్రీకృష్ణుని చేతిలో కంసుడు అసువులు వదిలాడు.
అసువులు = ప్రాణాలు
సమయానికి సరైన వైద్యం అందడంచేత ఒక వ్యక్తి ప్రాణాలు నిలిచాయి.

1. ఘడియ మాత్రంలోనే సత్య వంటపని ముగించింది.
ఘడియ = 24 నిముషాలు.
ఈ రోజు 24 నిముషాల్లోనే 20 కిలోమీటర్లు వెళ్లాను.

2. పర మతాన్ని గౌరవించడం ధర్మం.
పర = ఇతర
ఇతర విషయాలు పట్టించుకోకుండా చదువుకోవాలి.

3. పూర్వం అశ్వాన్ని వాహనంగా ఉపయోగించేవారు.
అశ్వం = గుర్రం
దూరం పరుగెత్తినా గుఱ్ఱం తొందరగా అలసిపోదు.

4. సువర్ణ భూషణాలంటే అందరికీ ప్రీతి.
సువర్ణం = బంగారం
బంగారం ధర నానాటికీ పెరిగిపోతోంది.

ఆ) కింది వాక్యాలలో సమానార్థక పదాలు (పర్యాయ పదాలు) గుర్తించి రాయండి.

1. వాసు గుర్రం ఎక్కి ఊరు బయలుదేరాడు.. ఆ అశ్వం వేగవంతమైంది. గంట లోపలే హయం వల్ల ఊరు చేరిపోయాడు.
జవాబు:
1) గుర్రం
2) అశ్వం
3) హయం

2. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఆదిత్యుని రశ్మి సోకి ప్రకృతి నిదుర లేచింది. రవి తాపాన్ని భరించడం సాధ్యం కాదు.
జవాబు:
1) సూర్యుడు
2) ఆదిత్యుడు
3) రవి

3. అద్రి శిఖరం నుండి సెలయేరు జాలువారుతోంది. కొండపైన నగరం విస్తరించింది. ఆ పర్వతం మీదనే . దేవాలయం వెలసింది.
జవాబు:
1) అది
2) కొండ
3) పర్వతం

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ఇ) కింది ప్రకృతులను వికృతులతో జతపర్చండి.

1) రథం అ) ఆన
2) కుమారుడు ఆ) అరదం
3) ఆజ్ఞ ఇ) కొమరుడు

జవాబు:

1) రథం ఆ) అరదం
2) కుమారుడు ఇ) కొమరుడు
3) ఆజ్ఞ అ) ఆన

ఈ) కింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి.

1) న్యాయం 2) అసామాన్యం  3) అస్తమిస్తాడు 4) దుఃఖం

1. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పడమరన …………… (అస్తమిస్తాడు)
2. నా కుమారునికి అన్యాయం జరిగిందని అనుకుంటే ……………….. జరిగింది. (న్యాయం)
3. సుఖం …………….. కావడి కుండలు అంటారు. (దుఃఖం)
4. ప్రతి సామాన్య విషయం ఒక్కోసారి ……………… గా మారుతుంది. (అసామాన్యం)

వ్యాకరణాంశాలు

అ) కింది పదాలను గమనించండి.

1) నాలుగు ముఖాలు
2) మూడు కన్నులు
3) పంచ పాండవులు
4) ముల్లోకాలు
5) ఏడు ద్వారాలు

పై పదాలన్నీ సమాస పదాలే. వాటిలో పూర్వపదం సంఖ్యను సూచిస్తోంది. ఉత్తరపదం నామవాచకాన్ని సూచిస్తోంది. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ద్విగు సమాసాలంటారు.

కింది వాక్యాల్లో ద్విగు సమాస పదాలున్నాయి. గుర్తించి రాయండి.
1. వ్యాసుడు వేదాలను చతుర్వేదాలుగా విభజించాడు.
జవాబు:
చతుర్వేదాలు

2. శంకుస్థాపనలో నవధాన్యాలు వాడతారు.
జవాబు:
నవధాన్యాలు

3. ఇంద్రధనుస్సులో సప్తవర్ణాలు ఉంటాయి.
జవాబు:
సప్తవర్ణాలు

ఆ) ముందటి పాఠాలలో అత్వ సంధి పదాలను తెలుసుకున్నారు కదా! కింద ఇచ్చిన అత్వ సంధి పదాలను విడదీయండి.
1. చిన్నప్పుడు
2. తిరగకేమి
3. రామయ్య
4. జరగకేమి
5. రామక్క
6. సీతమ్మ
జవాబు:
1. చిన్నప్పుడు = చిన్న + అప్పుడు – అత్వ సంధి
2. తిరగకేమి = తిరగక + ఏమి – అత్వ సంధి
3. రామయ్య = రామ + అయ్య అత్వ సంధి
4. జరగకేమి జరగక + ఏమి – అత్వ సంధి
5. రామక్క = రామ + అక్క – అత్వ సంధి
6. సీతమ్మ = సీత + అమ్మ – అత్వ సంధి

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ఇ) ఈ కింది సంధి పదాలను కలిపి రాయండి.
1. రవ్వ + అంత 2. చింత + ఆకు 3. వెంక + అప్ప
జవాబు:
1. రవ్వ + అంత = రవ్వంత – అత్వ సంధి
2. చింత + ఆకు = చింతాకు – అత్వ సంధి
3. వెంక + అప్ప = వెంకప్ప – అత్వ సంధి

ఈ) సంయుక్త వాక్యం :

సమప్రాధాన్యం గల ‘రెండుగాని, అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్తవాక్యం ఏర్పడుతుంది. ఇందులో అన్నీ ప్రధానవాక్యాలే ఉంటాయి. కాబట్టి, కాని, మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి.

కింద ఇచ్చిన వాక్యాలను గమనించండి. సంయుక్త వాక్యాలుగా మార్చండి.
ఉదా :
మధు బడికి వెళ్లాడు. రహీమ్ బడికి వెళ్ళాడు. జాన్ బడికి వెళ్ళాడు.
మధు, రహీమ్, జాన్ బడికి వెళ్ళారు.

1. సీత అక్క. గీత చెల్లెలు.
2. శారద సంగీతం నేర్చుకుంది. శారద నాట్యం నేర్చుకుంది.
3. నగీస్ స్టేషన్ కి వెళ్లింది. రైలు వెళ్ళిపోయింది.
4. మాధవి పరుగెత్తింది. బస్సు అందలేదు.
5. వర్షాలు వచ్చాయి. చెరువులు నిండలేదు.
జవాబు:
1. సీత, గీత అక్కాచెల్లెళ్ళు.
2. శారద సంగీతం, నాట్యం నేర్చుకుంది.
3. నగీస్ స్టేషనుకు వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది.
4. మాధవి పరుగెత్తింది కానీ బస్సు అందలేదు.
5. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రాజెక్టు పని (నాలుగవ నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం)

* మీ ప్రాంతంలోని దర్శనీయ స్థలాలను గూర్చిన వివరాలు సేకరించి రాయండి.
జవాబు:
మేము విజయవాడలో నివసిస్తాం.

విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్నది. లెనిన్ విగ్రహం నాకు చాలా నచ్చింది. విక్టోరియా మ్యూజియం కూడా చాలా బాగుంటుంది.

గాంధీ కొండపై మహాత్ముడి సంస్మరణార్థం ఒక స్మారక స్తూపం ఉంది. ఈ స్తూపం 52 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ గాంధీ స్మారక గ్రంథాలయం, నక్షత్రశాల చూడతగినవి. ప్రకాశం బ్యారేజీ కూడా దర్శనీయ ప్రాంతమే. రాజీవ్ గాంధీ పార్కులో చాలా పూలమొక్కలు ఉన్నాయి. సంగీతాన్ని వినిపించే ఫౌంటేను, మినీ జూపార్కు ఇక్కడ ప్రత్యేకాకర్షణ. విజయవాడకు 4 కిలోమీటర్ల దూరంలో భవానీ ద్వీపం చక్కటి పర్యాటక క్షేత్రం. విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గమ్మ గుడి, చాలా బాగుంటుంది. గుణదల మేరీమాత గుడి కూడా చూడదగిన ప్రాంతం.

కఠిన పదాలు – అర్ధాలు

కోలాహలం = హడావిడి
సువర్ణం = బంగారం
అశ్వం = గుఱ్ఱం
రథం = తేరు
ధ్వని = శబ్దం
అసువులు = ప్రాణాలు
ఆకస్మికంగా = హఠాత్తుగా
వదనం = ముఖం
మూర్తీభవించిన = రూపుదాల్చిన
ఆశ్రితులు = ఆశ్రయించినవారు
ఆపన్నులు = ఆపదలో ఉన్నవారు
మృతదేహం = శవం
సొమ్మసిల్లుట = స్పృహ తప్పుట
సపర్యలు = సేవలు
ఆనతి = ఆజ్ఞ
శాసనం = చట్టం
సూక్తి = మంచిమాట
శోకము= ఏడ్పు

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

SCERT AP Board 6th Class Telugu Solutions 8th Lesson మేలుకొలుపు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 8th Lesson మేలుకొలుపు

6th Class Telugu 8th Lesson మేలుకొలుపు Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు 1

ప్రశ్న 1.
చిత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
చిత్రంలో ఒక చక్రవర్తి, భరతమాత, ఒక కవి, ఒక ఋషి ఉన్నారు. ప్రజలకు జీవన విధానాన్ని తెలిపినవాడు ఋషి. కవి ఆ జీవితాలను చక్కగా జీవించడం, మంచిచెడులు తెలుసుకోవటం చెబుతాడు. రాజు ప్రజలందరికీ రక్షణ కల్పిస్తాడు. భారతదేశంలోని అన్ని జీవులను ప్రకృతిని కాపాడేది భరతమాత. భరతమాత చేతిలోని జెండా ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణార్పణ చేస్తే వచ్చింది. ఆ జెండాను పింగళి వెంకయ్యగారు రూపొందించారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 2.
రాజుల కాలం నాటికి, ఇప్పటికి మన దేశంలో వచ్చిన మార్పు ఏమిటి?
జవాబు:
రాజుల కాలంలో రాజు మాటే శాసనం. తనకు తోచింది చేసేవాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రాజుగారి అధికారాన్ని ప్రజలు భరించవలసిందే. అతని తర్వాత అతని కొడుకు రాజయ్యేవాడు. ఇలా అనువంశిక పాలన కొనసాగేది. ఇప్పుడు మన దేశంలో రాచరికం లేదు. రాజుల పాలన అంతమయ్యింది. ఇప్పుడు ప్రజలే పాలకులను ఓటు ద్వారా ఎన్నుకుంటారు. ప్రజాప్రతినిధుల పరిపాలన నచ్చకపోతే తర్వాత ఎన్నికలలో వారిని దింపేస్తారు. ప్రజల హక్కులను కాపాడడానికి రాజ్యాంగం ఉంది. న్యాయస్థానాలు ఉన్నాయి. ఇపుడు మనదేశంలో ప్రజలకు చాలా హక్కులు ఉన్నాయి.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
ఈ పాఠంలో మీకు నచ్చిన పద్యం గురించి చెప్పండి.
జవాబు:
ఈ పాఠంలో ‘కాళిదాసాది’ అనే పద్యం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆ పద్యంలో భరతమాత యొక్క సమగ్ర స్వరూపాన్ని వర్ణించారు. . ఆమెను కాళిదాసాది మహాకవులను కన్న విద్యావంతురాలిగా వర్ణించారు. కృష్ణదేవరాయల వంటి మహావీరులను, చక్రవర్తులను కన్న వీరమాత భరతమాత అన్నారు. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు కలిగిన పుణ్యాత్మురాలన్నారు. కోహినూరు వంటి వజ్రాలు గల రత్నగర్భగా వర్ణించారు. సద్గుణవతి, పుణ్యవతి, తేజోవతి, దాతృత్వం కలది భరతమాత అని వర్ణించారు కనుక ఈ పద్యం అంటే నాకిష్టం.

ప్రశ్న 2.
హక్కులకై పోరాడటం గురించి నాలుగు వాక్యాలలో రాయండి.
జవాబు:
హక్కులకై పోరాడాలి. సమయము దాటిపోకుండా పోరాడాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతీ వ్యక్తికీ అన్నిటి పైనా అందరిలాగే హక్కులున్నాయి. హక్కుల కోసం పోరాటంలో ప్రాణం పోయినా ఫరవాలేదు. హక్కులను సాధించాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 3.
కుసుమ ధర్మన్న కవి గురించి రాయండి.
జవాబు:
కుసుమ ధర్మన్న కవి రాజమండ్రిలోని లక్ష్మీవారపు పేటలో జన్మించారు. నాగమ్మ, వీరస్వామి ఆయన తల్లిదండ్రులు. వైద్య విద్వాన్ చదివారు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో ఆయన పండితుడు. నిమ్నజాతి ముక్తి తరంగిణీ, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం మొదలైనవి రచించారు. అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేశారు.

ప్రశ్న 4.
ఈ కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
అన్నమయములైన వన్నిజీవమ్ములు
కూడులేక జీవకోటి లేదు
కూడు తినెడికాడ కులభేదమేలకో
కాళికాంబ హంసకాళికాంబ

అ) జీవులు దేనిమీద ఆధారపడి బ్రతుకుతాయి?
జవాబు:
జీవులు అన్నం మీద ఆధారపడి బ్రతుకుతాయి.

ఆ) కూడు లేకపోతే ఏమి లేదు?
జవాబు:
కూడు లేకపోతే జీవకోటి లేదు.

ఇ) అన్నం తినేదగ్గర ఏ భేదం చూపించరాదని కవి అంటున్నాడు?
జవాబు:
అన్నం తినేదగ్గర కుల భేదం చూపించరాదని కవి అంటున్నాడు.

ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై పద్యంలోని అమ్మవారి పేరేమిటి?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దీనజనుల హక్కుల కోసం పోరాడటం నిజమైన స్వర్గమని పిలుపునిచ్చిన కవి గురించి రాయండి.
జవాబు:
కుసుమ ధర్మన్న కవి రాజమండ్రిలోని లక్ష్మీవారపు పేటలో జన్మించారు. నాగమ్మ, వీరస్వామి ఆయన తల్లిదండ్రులు. వైద్య విద్వాన్ చదివారు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో ఆయన పండితుడు. నిమ్నజాతి ముక్తి తరంగిణీ, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం మొదలైనవి రచించారు. అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేశారు.

ప్రశ్న 2.
కవి, తన కవితను ఎవరికి అంకితమిస్తానన్నాడు? ఎందుకు?
జవాబు:
పరుల ధనాన్ని అపహరించడం మహాపాపం. ఇతరుల గౌరవాన్ని పాడుచేయడం తప్పు. ఇతరుల ప్రాణాలను తీయడం మహాపాతకం. ఇలా ఆలోచించేవారికే కుసుమ ధర్మన్న కవి తన కవితను అంకితమిస్తానన్నాడు.

ఎందుకంటే అటువంటి వారు ధన్యులు. ఇతరులను పీడించకుండా ఉండే అటువంటి వారి వలన దేశంలో శాంతి పెరుగుతుంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ప్రశ్న 3.
భరతమాత దుఃఖానికి కారణం వివరించండి.
జవాబు:
భరతమాత తన సంతానం యొక్క దీనత్వాన్ని చూసి దుఃఖిస్తోంది. వారి బాధలను చూసి బాధపడుతోంది. ఆమె దుఃఖానికి కారణం దీనుల కన్నీరు, అంటరానితనం, జాతి భేదాలు, విద్యా గర్వం, ధన గర్వం, కుల గర్వం అనే మూడు గర్వాలు కలవారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
భరతమాత గొప్పతనాన్ని కవి ఏమని వర్ణించాడు?
జవాబు:
భరతమాత సకల సద్గుణరాశి. ఆమె అందరి పాపాలను దూరం చేస్తుంది. అందరిచేత పొగడ్తలందుకొంటుంది. గొప్ప తేజస్సు కలది. అనేక విధాలుగా కీర్తి కలది. కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది. కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి. కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి. కోహినూరు వజ్రం వంటి మణులను కన్న రత్నగర్భ మన భరతభూమి. అటువంటి భరతమాత మనకు భద్రతను కల్గిస్తోంది.

ప్రశ్న 2.
స్వరాజ్య రథం ఎప్పటిదాకా సాగాలని కవి భావించాడు?
జవాబు:
దీనులైన తన సంతానాన్ని చూసి భరతమాత బాధపడుతున్నది. ఆ బాధ తగ్గేవరకు శుభప్రదమైన స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలి. అణగారిన ప్రజల కన్నీటి సముద్రం ఇంకిపోయేదాకా నడపాలి. అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలి. జాతి భేదాలు పోయి, భరతమాత శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా రూపుదిద్దు కొనేవరకు సాగాలి. ధర్మానికి అడ్డుపడే మదత్రయం (విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం) నాశనమయ్యే వరకు భారతీయుల మేలును కోరేవారు స్వరాజ్య రథాన్ని నడపాలి.

ప్రశ్న 3.
కింది కవితను పొడిగించండి.
జవాబు:
భరతమాత మా మాత
జగతినామె పరమ దేవత
నేత వైరము మాకు రోత
గాంధీజీ మాకు తాత
ఆయన స్వాతంత్ర్యోద్యమ
మారుస్తాం దేశపు తల రాత

భాషాంశాలు

అ) కింద గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
ఉదా : మగవానితో సమానంగా వెలది ని గౌరవించాలి.
వెలది = స్త్రీ
స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.

1. రణం నాశనానికి దారితీస్తుంది.
రణం = యుద్ధం
యుద్ధం వలన అనర్థాలెక్కువ.

2. అఘం చేయకూడదు.
అఘం = పాపం
ఏ జీవినైన బాధపెట్టడం పాపం.

3. సన్నుతం విని పొంగిపోకు.
సన్నుతం = పొగడ్త
పొగడ్తలన్నీ నిజమనుకొంటే గర్వం పెరుగుతుంది.

4. తలపోటు దుర్భరంగా ఉంటుంది.
దుర్భరం = భరింపరానిది
భరింపరాని బాధనైనా ఒక్కొక్కసారి భరించాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ఆ) కింద ఇచ్చిన పదానికి సమానార్ధక పదాలు వాక్యాలలో ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి.

1. జనని ప్రేమకు వెలకట్టలేము. బ్రహ్మయైనా మాతకు కొడుకే.
జవాబు:
తల్లి = జనని, మాత

2. వెలదిని దేవతగా భావించి ఆ పొలతిని గౌరవించాలి.
జవాబు:
నారి = వెలది, పొలతి

3. తగిన సమయంలో కాలమును అనుసరించి మాట్లాడాలి.
జవాబు:
తరుణము = సమయం, కాలం

4. పాతకం చేసేటపుడు ఆ దురితం వల్ల వచ్చే నష్టాలను ఊహించుకోవాలి.
జవాబు:
పాపము = పాతకం, దురితం

ఇ) కింది వానిలో ప్రకృతి, వికృతులను జతపర్చండి.

1. కవి అ) విద్య
2. విద్దె ఆ) కృష్ణుడు
3. కన్నడు ఇ) కయి

జవాబు:

1. కవి ఇ) కయి
2. విద్దె అ) విద్య
3. కన్నడు ఆ) కృష్ణుడు

ఈ) కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.

1. విద్య × అవిద్య
2. పుణ్యం × పాపం
3. సద్గుణం × దుర్గుణం

వ్యాకరణాంశాలు

అ) కింది ఖాళీలను పూరించండి.

సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు
1. అక్కాచెల్లెళ్లు …………………………… ద్వంద్వ సమాసం
2. …………………………… తల్లియును తండ్రియును ……………………………
3. తండ్రీకొడుకులు …………………………… ……………………………
4. …………………………… ధర్మమును, అధర్మమును ద్వంద్వ సమాసం
5. పాపపుణ్యాలు …………………………… ద్వంద్వ సమాసం

జవాబు:

సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు
1. అక్కాచెల్లెళ్లు అక్కాచెల్లెళ్లు అక్కయును ద్వంద్వ సమాసం
2. తల్లిదండ్రులు తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం
3. తండ్రీకొడుకులు తండ్రియును, కొడుకులును ద్వంద్వ సమాసం
4. ధర్మాధర్మములు ధర్మమును, అధర్మమును ద్వంద్వ సమాసం
5. పాపపుణ్యాలు పాపమును, పుణ్యమును ద్వంద్వ సమాసం

ఆ) కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

1. భరతమాత కవులను కన్నది. భరతమాత కవులను పెంచింది.
జవాబు:
భరతమాత కవులను కని, పెంచింది.

2. హక్కులకై పోరాడాలి. హక్కులను సాధించాలి.
జవాబు:
హక్కులను పోరాడి, సాధించాలి.

3. దేశభక్తి కలిగి ఉండాలి. దేశభక్తితో జీవించాలి.
జవాబు:
దేశభక్తిని కలిగి, జీవించాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

ఇ) సంధులు:

రెండు పదాల మధ్య సంధి జరిగినపుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం. మొదటి పదం చివర ‘ఉ’ ఉంటే అది ఉత్వ సంధి. ‘అ’ ఉంటే అత్వ సంధి, ‘ఇ’ ఉంటే ఇత్వ సంధి.

అత్వ సంధి బహుళం కాబట్టి నాలుగు విధాలుగా సంధిరూపాలు ఏర్పడతాయి.
ఉదా :
చూసినప్పుడు = చూసిన + అప్పుడు = న్ + అ + అ = అ
AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు 2
జవాబు:
AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు 3

ఈ) కింది అభ్యాసాలు పరిశీలించి రాయండి.
1. తగినంత = తగిన + అంత
2. చూసినప్పుడు = చూసిన + అప్పుడు
3. ఇచ్చినంత = ఇచ్చిన + అంత
4. చిన్నప్పుడు = చిన్న + అప్పుడు

చమత్కార పద్యం

వంగతోటనుండు వరిమళ్ళలోనుండు
జొన్నచేలనుండు చోద్యముగను
తలుపుమూల నుండు తలమీదనుండును
దీని భావమేమి తిరుమలేశ !

పద్యం చదవగానే – వంగతోటలో, వరిమళ్ళలో, జొన్నచేలలో, తలుపు మూలలో, తల పైన ఉండేది ఏది? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ సమాధానం అక్కడే ఉంది. వంగ – తోటలోనే ఉంటుంది. వరి – ‘మళ్ళ’ లోనే ఉంటుంది. జొన్న – ‘చేల’ లోనే ఉంటుంది. తలుపు – ఇంటికి, ‘మూల’నే ఉంటుంది. తల – శరీరానికి ‘మీద’ నే ఉంటుంది.

మేలుకొలుపు కవి పరిచయం

కవి పేరు : కుసుమ ధర్మన్న

జననం : 17.3. 1900న రాజమహేంద్రవరంలోని లక్ష్మివారపు పేటలో జన్మించారు.

తల్లిదండ్రులు : నాగమ్మ, వీరాస్వామి గార్లు.

చదువు : వైద్య విద్వాన్, సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం కలవారు.

రచనలు : నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్ల దొరతనం మొదలైనవి.

ప్రత్యేకత : దళిత వర్గం నుంచి అతికష్టం మీద చదువుకొని, పైకొచ్చి, ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించారు. చదువుకొనే రోజులలోనే సంఘసంస్కరణాభిలాష గల కందుకూరి వారిచే ప్రభావితం అయ్యారు. భారతరత్న, డా|| బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది, అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలితరం తొలి దళిత కవి. ప్రస్తుత పాఠ్యభాగం ఆయన రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహించబడింది. 1946లో ఆయన స్వర్గస్థులయ్యారు.

పద్యాలు – అర్థాలు – భావాలు

1. సీ॥ కాళిదాసాది సత్కవి పుంగవుల గాంచి
విద్యావతి యన నేవెలది యొప్పె ?
రణశూరులగు కృష్ణరాయాదులను గని
వీరమాత యన నేనారి తనరె?
నతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు గల్గి
పుణ్యవతియన నేపొలతి నెగడె ?
కొహినూరు మొదలగు మహిత మణులనీని
రత్నగర్భయన నేరామ వెలసె ?

తే॥గీ|| నట్టి సద్గుణసంఘాత యఘ విదూర
సన్నుతవ్రాత విపుల తేజస్సమేత
బహుళ విఖ్యాత యాచక పారిజాత
భద్రముల మీకొసగుగాత భరతమాత.
అర్థాలు :
సత్కవి పుంగవుడు = మంచి కవులలో శ్రేష్ఠుడు
పుంగవము = ఎద్దు
ఆది = మొదలైన
వెలది = స్త్రీ
రణము = యుద్ధము
శూరుడు = వీరుడు
వీరమాత = వీరులను కన్న తల్లి
నారి = స్త్రీ
తనరు = ఒప్పు
అతుల = సాటిలేని
పొలతి = స్త్రీ
నెగడు = అతిశయించు
మహిత = గొప్పదైన
రామ = స్త్రీ
సంఘాత = సమూహం
అఘము = పాపము
విదూర = దూరముగా నెట్టునది
సన్నుతి = పొగడ్త
వ్రాత = సమూహము
సమేత = కూడినది
విఖ్యాతి = కీర్తి
యాచకులు = భిక్షువులు

భావం :
సకల సద్గుణ రాశి మన భరతమాత. ఈమె అందరి పాపాలను దూరం చేస్తుంది. అందరూ పొగడ దగినది. గొప్ప తేజస్సు కలది. అనేక విధాలుగా కీర్తి కలది. కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది. కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి. కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి. కోహినూరు వజ్రం వంటి మణులను కన్న రత్నగర్భ మన భరతభూమి. అటువంటి భరతమాత మీకు భద్రతను కల్గిస్తోంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

2. సీ॥ దీన జాతుల దుర్గతిగని ఘోషిలు భార
తాంబ దుర్భర దుఃఖమణగు వఱకు
నిమ్నులు కురియు కన్నీటి మున్నీరు సం
పూర్ణంబుగా నింకిపోవువలకు
అస్పృశ్యతాబాడబానల జ్వాల ది
గంత భూములకు జల్లారువఱకు
జాతిభేద చ్చిన్న సకలాంగకంబులు
సంచితాకృతి ధరియించు వఱకు

తే॥గీ॥ ధర్మమున కడ్డుపడెడు మదత్రయంబు
హైందవుల డెందముల నాశమందు
వఱకు ప్రథిత మంగళదత్త స్వరాజ్యరథము
తెంపు సాగింతురే భారతీయ హితులు
అర్థాలు :
దుర్గతి = చెడ్డ స్థితి
దుర్భరము = భరింపరానిది
అణగు = నశించు
మున్నీరు = సముద్రము
బడబానలము = సముద్రంలో ఉండే అగ్ని
జ్వాల = మంట
అంగకములు = అవయవాలు
మదత్రయము = కుల, ధన, విద్యా గర్వములు మూడూ
డెందము = హృదయము
ప్రధిత = కీర్తి గల
దత్త = ఇవ్వబడిన
ఆకృతి, = ఆకారము
హితులు = మిత్రులు

భావం :
దీనులైన తన సంతానాన్ని చూసి బాధపడుతున్నది భరతమాత. ఆ బాధ తగ్గేవరకు శుభప్రదమైన స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలి. అణగారిన ప్రజల కన్నీటి సముద్రం ఇంకిపోయేదాకా నడపాలి. అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలి. జాతి భేదాలు పోయి, భరతమాత శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా రూపుదిద్దు కొనేవరకు సాగాలి. ధర్మానికి అడ్డుపడే మదత్రయం (విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం) నాశనమయ్యే వరకు భారతీయుల మేలును కోరేవారు స్వరాజ్య రథాన్ని నడపాలి.

3. తే॥గీ॥ మేలుకొనుమయ్య తరుణము మించకుండ
జన్మహక్కులకై పోరుసల్పు మిపుడె
హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు
స్వర్గపదమని నమ్ముము స్వాంతమందు
అర్థాలు :
తరుణము = సమయము
పోరు = రణము

భావం :
ఓ దీనజనుడా! మేలుకో! సమయం దాటిపోనివ్వకు. ఈ దేశంలో పుట్టిన నీకు అన్నింటిపై అందరిలా హక్కులున్నాయి. ఆ హక్కుల కోసం పోరాడు. హక్కుల కోసం పోరాటంలో ప్రాణం పోయినా పరవాలేదు. అదే స్వర్గం. దీనిని హృదయంలో నమ్ము.

AP Board 6th Class Telugu Solutions Chapter 8 మేలుకొలుపు

4. తే॥గీ|| పరుల ధన మాన ప్రాణ సంపదల ద్రుంచి
మనుచునుండుట పాతకంబని దలంచు
వారలెందున ధన్యులు వారికెల్ల
నంకితమొనర్తు దానినేనధికభక్తి
దేశమున శాంతి చేకూరి తేజరిలగ
అర్థాలు :
మనుట = జీవించుట
పాతకము = పాపము

భావం :
ఇతరుల ధనాన్ని, గౌరవాన్ని, ప్రాణాలు, ఐశ్వర్యాన్ని నాశనం చేసి బతకడం మహాపాపం అనుకొనేవారు ధన్యులు. మన దేశానికి శాంతి కలిగేలాగా నేనటు వంటి వారికే నా కవిత్వం అంకితం చేస్తాను. కవి జీవించిన కాలంలో స్వాతంత్ర్య పోరాటం దేశమంతా తీవ్రంగా వ్యాపించింది. త్వరలోనే స్వాతంత్ర్యం వస్తుందని కవి నమ్మకం. అయితే ఈ పోరాట స్ఫూర్తి అధికారం మార్పుతో ఆగిపోకుండా దేశంలో వేళ్ళూనుకుని ఉన్న అసమానతలు అంతమయ్యేవరకు కొనసాగాలని కవి ఈ విధంగా కోరుకున్నాడు.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

SCERT AP Board 6th Class Telugu Solutions 7th Lesson మమకారం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Solutions 7th Lesson మమకారం

6th Class Telugu 7th Lesson మమకారం Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం 1

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
ఇద్దరు పిల్లలు, ఒక తల్లి ఈ చిత్రంలో ఉన్నారు.

ప్రశ్న 2.
చిత్రంలోని అమ్మాయి అమ్మకు తన స్నేహితురాలిని ఎలా పరిచయం చేస్తుంది?
జవాబు:
తన స్నేహితురాలు పేరు చెప్పింది. ఆ అమ్మాయి చదువుతున్న తరగతి చెప్పింది. ఏ బెంచీలో కూర్చుంటారో చెప్పింది. వారిద్దరి స్నేహం గురించి చెప్పి పరిచయం చేసింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

ప్రశ్న 3.
మీ స్నేహితులు మీ అమ్మానాన్నలను ఏమని పిలుస్తారు?
జవాబు:
కొంతమంది స్నేహితులు మా అమ్మానాన్నలను ఆంటీ, అంకుల్ అంటారు. కొంతమంది పిన్నిగారూ, బాబాయి గారూ అంటారు. కొంతమంది అత్తయ్యగారూ, మామయ్యగారూ అంటారు.

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
మీ భాష అంటే మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి.
జవాబు:
మా భాష తెలుగుభాష. అది మా మాతృభాష. మా ఇంట్లో అందరం మాట్లాడుకొనే భాష. మా స్నేహితులంతా మాట్లాడుకొనే భాష. మా చుట్టుప్రక్కల వారంతా మాట్లాడే భాష. రోజూ నేను మా తాత దగ్గర కథలు వినేది మా మాతృభాషలోనే, రోజూ మా మామ్మ దగ్గర మా భాష (తెలుగు)లోనే ఎన్నో పాటలు, పద్యాలు, పొడుపు కథలు, సామెతలు, జాతీయాలు, చమత్కారాలు వింటాను. నేర్చుకుంటాను. అందుకే మా (తెలుగు) భాషంటే మాకు చాలా చాలా ఇష్టం.

ప్రశ్న 2.
ఏది స్వర్గంతో సమానమైనదని రచయిత అన్నాడో రాయండి.
జవాబు:
పిల్లల కేరింతలూ, ఆటలూ, వాళ్ల మధ్య చిట్టి పొట్టి తగవులూ, కొట్లాటలూ, ఏడుపులూ ఒకవైపు కొనసాగుతుండాలి. మరొక వైపు వదిన మరదళ్ల సరసాలూ, విరసాలు, బావ బావమరుదుల వెక్కిరింతలూ, జాణతనాలూ సాగుతుండాలి. అక్కా చెల్లెళ్లూ, తమ్ముళ్లూ వాళ్ల ఒద్దికలూ, ప్రేమలూ, ఆప్యాయతానురాగాలూ ఉండాలి. ఇలా ఎక్కడయితే ఇల్లంతా సందడిగా ఉంటుందో ఆ ఇల్లు స్వర్గంతో సమానమని రచయిత అన్నారు. తమ అత్తగారిల్లు అటువంటి స్వర్గతుల్యం అని ఆయన అభిప్రాయం.

ప్రశ్న 3.
బంధువుల ఇంట్లో రచయితకు కనిపించిన కొత్త వాతావరణం ఏమిటో రాయండి.
జవాబు:
రచయిత ఒక ఆదివారం బళ్లారిలోని అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ వదిన, మరదళ్ల సరసాలు, పిల్లల అల్లరి, పెద్దల హడావిడీ అంతా రచయితకు చాలా ఇష్టం.

కాని, అక్కడ వాతావరణం అలా లేదు. కొత్త వాతావరణం కనిపించింది. అదేమిటా అని పరిశీలించాడు. గతంలో లాగా వాళ్ల సంబోధనలు లేవు. చిన్నాయనా-పిన్నీ, మామా-అత్తా పిలుపులను ఆంటీ, అంకుల్ తో సరిపెడుతున్నారు. అట్లా పిలుస్తున్నది రచయిత మరదళ్ల పిల్లలే.

రచయితకు తెలుగులో పిలవడం, పిలిపించుకోవడం అలవాటు, ఇష్టం. తెలుగు సంస్కృతి కూడా ఇష్టం. కానీ, అక్కడ ఆ వాతావరణం లేదు. అదే విషయం మరదళ్ళకు చెబితే వాళ్లు మొగాలు మాడ్చుకొన్నారు. తన భార్య తనకు అలా ప్రవర్తించకూడదని కూడా చెప్పింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

ప్రశ్న 4.
కింది కరపత్రాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత

భక్తులారా !
ఆంధ్ర మహావిష్ణువు తెలుగువారి ఆరాధ్య దైవం. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవుణ్ణి దర్శించుకొని స్వామి ఆదేశం మేరకు తాను ఆముక్తమాల్యద గ్రంథం రాసినట్లు చెప్పారు. నేను తెలుగు వల్లభుణ్ణి. నా భాష తెలుగు భాష, అది అన్ని భాషలకన్నా గొప్పది అని స్వామి స్వయంగా తనకు చెప్పినట్లు కూడా పేర్కొన్నారు. అటువంటి అరుదైన ఆంధ్ర విష్ణు దేవాలయాన్ని పరిరక్షించుకుందాం. మరింత అభివృద్ధి చేద్దాం. ఇది మనందరి బాధ్యత.

ఇట్లు,
అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘం,
అమరావతి

అ) ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది?
జవాబు:
కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది.

ఆ) ఈ కరపత్రం ప్రచురించింది ఎవరు?
జవాబు:
అమరావతిలోని అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘంవారు ఈ కరపత్రం ప్రచురించారు.

ఇ) నా భాష తెలుగు భాష – అని చెప్పింది ఎవరు?
జవాబు:
నా భాష తెలుగు భాష అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు.

ఈ) ఆముక్తమాల్యద గ్రంథం రాసింది ఎవరు?
జవాబు:
ఆముక్తమాల్యద గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రచించారు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
అత్త-మామ, పిన్ని-బాబాయి, బావ బావమరిది…. ఇలా మీకు తెలిసిన బంధువాచక పదాలు పది రాయండి.
జవాబు:
అమ్మ – నాన్న, అన్న – వదిన, తమ్ముడు – మరదలు, అక్క – బావ, చెల్లి – బావ, పెద్దమ్మ – పెదనాన్న, తాత – మామ్మ, తాతయ్య – అమ్మమ్మ, పెద్దత్త – పెద్ద మామయ్య, చిన్నత్త – చిన్న మామయ్య.

ప్రశ్న 2.
‘సత్యం’ కుటుంబాన్ని చూసి రచయితకు ‘మమకారం’ ఎందుకు కలిగింది?
జవాబు:
సత్యం ఇంటికి వెళ్లగానే వాళ్లబ్బాయి ఆరేళ్ళవాడు ‘మామా’ అని అభిమానంగా పలకరించాడు. “నువ్వు రాజు మామవని మా నాన్న చెప్పాడు”, అని ఆ అబ్బాయి అనడంతో వారి అభిమానానికి, చక్కటి వరస పెట్టి పిలవడం . చూసి రచయిత పొంగిపోయేడు. ఆ పిల్లలు, తండ్రిని ప్రశ్నలు వేయడం, సత్యం వాటికి విసుక్కోకుండా జవాబులు చెప్పడం చూసి రచయితకు ముచ్చటేసింది. మళయాళీ అయిన సత్యం భార్య కూడా చక్కగా తెలుగు మాట్లాడుతుందని తెలుసుకొని చాలా ఆనందించాడు. తను కోరుకొనే తెలుగు కుటుంబాన్ని సత్యం ఇంట చూసిన రచయితకు ఆ కుటుంబంపై మమకారం కలిగింది.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

ప్రశ్న 3.
ఈ కథ “ఎందుకో నా కళ్లల్లో నీటి పొర…” అని ముగుస్తుంది. ఆనందంతో వచ్చే కన్నీటిని ఏమంటాం? అవి ఎప్పుడు వస్తాయి?
జవాబు:
ఆనందంతో వచ్చే కన్నీటిని ఆనందబాష్పాలు అంటారు. విపరీతమైన ఆనందం కలిగినపుడు ఆనంద బాష్పాలు వస్తాయి. తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు వస్తే ఆనందబాష్పాలు వస్తాయి. పాఠశాల సమావేశంలో . మెచ్చుకొంటే వస్తాయి. ఏదైనా పోటీలో రాష్ట్రస్థాయి విజయం సాధిస్తే ఆనందబాష్పాలు వస్తాయి. కోటి రూపాయల లాటరీ తగిలితే ఆనందబాష్పాలు వస్తాయి. ఈ విధంగా మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఫలితం వచ్చినపుడు ఆనందబాష్పాలు వస్తాయి.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
భాష విషయంలో రచయిత అభిప్రాయాలను వివరించండి.
జవాబు:
రచయితకు తెలుగుభాష అంటే చాలా ఇష్టం. సాధ్యమైనంతవరకూ తెలుగులో మాట్లాడాలి. తెలుగులోనే చక్కటి వరసలు పెట్టి పిలుచుకోవాలి. పిల్లలకు చిన్నతనం నుండి తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూపించాలి.

తెలుగు కుటుంబాల గొప్పతనమంతా తెలుగులో మాట్లాడుకోవడంలోనే ఉంది. అమ్మా-నాన్న, అత్త-మామా ఇలా తెలుగులో పిలుచుకోవడంలోనే ఆనందం ఉంది. తప్పనిసరి పరిస్థితులలో ఆంగ్లం ఉపయోగించాలి. కానీ, ఇంట్లో కూడా ఆంగ్లం మాట్లాడడం రచయితకు నచ్చదు. బంధుత్వాలను కూడా ఆంగ్లంలోకి మార్చడం రచయితకు అస్సలు నచ్చదు.

ప్రశ్న 2.
“ఇంగ్లీష్ భాష మనకు అవసరమే ! అంతవరకే దాన్ని వాడుకుంటాం. మన భాషనీ, సంస్కృతినీ ఎందుకు వదిలేసుకుంటాం ?” దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
ఉన్నత చదువులకు ఆంగ్లభాష అవసరం. ఉద్యోగాలలో కూడా ఆంగ్లభాష అవసరమే. ఎక్కువ విజ్ఞానాన్ని సంపాదించాలంటే ఆంగ్ల గ్రంథాలు కూడా చదవాలి. అర్థం చేసుకోవాలి. దీని కోసం ఆంగ్లభాషా పాండిత్యం అవసరమే. ఇతర దేశాలకు వెళ్లినా ఆంగ్లం తప్పదు.

కానీ, మన ఇంట్లో ఆంగ్లం మాట్లాడక్కరలేదు. తెలుగువాళ్ళం తెలుగులోనే మాట్లాడుకోవాలి. తెలుగులోని తీపిని మరచిపోకూడదు. మన తెలుగు భాషలాగే మన సంస్కృతి కూడా చాలా గొప్పది. ఎవరినైనా ఆప్యాయంగా పలకరించే సంస్కృతి మనది. శత్రువునైనా ఆదరించే సంస్కారం మనది.. అడిగిన వారికి లేదనకుండా దానం చేసే స్వభావం తెలుగువారిది.

అందుకే ఎన్ని భాషలు నేర్చినా మన తెలుగు భాషను వదలకూడదు. ఎన్ని దేశాలు తిరిగినా మన సంస్కృతిని విడిచిపెట్టకూడదు. మనం సంపాదించిన ఆంగ్ల భాషా జ్ఞానంతో మన భాషను సుసంపన్నం చేసుకోవాలి.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

ప్రశ్న 3.
మీరు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు పిల్లలంతా ఒకచోట చేరి ఉండటంతో కనుల పండుగగా ఉంటుంది కదా ! ఆ పిల్లల కేరింతలు, ఆటలు, వాళ్ల మధ్య చిన్న చిన్న తగాదాలు…. వీటిని గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

కాకినాడ,
xxxxx.

ప్రియమైన రజనీకి,

నీ స్నేహితురాలు జ్యోత్స్న వ్రాయు లేఖ.
ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

మొన్న వేసవి సెలవులు వచ్చాయి కదా ! ఆ సెలవులలో మా కుటుంబం, మా పెదనాన్న గారి కుటుంబం, మా బాబయ్యగారి కుటుంబం కలిసి అమలాపురంలోని మా. మేనత్త గారింటికి వెళ్లాం.

వాళ్లది పెద్ద పెంకుటిల్లు. ఇంటి ముందు బోలెడంత స్థలం. ఇంటి వెనక పెద్ద కొబ్బరితోట ఉంది. అక్కడ మామిడి, జామ, సపోటా లాంటి చెట్లు చాలా ఉన్నాయి.

మేము మొత్తం 12 మంది పిల్లలం పోగయ్యాం . చాలా అల్లరి చేశాం. పెరట్లోని చెట్లెక్కేశాం. చెరువులో ఈతలు కొట్టాం. కోతి కొమ్మచ్చి, వాలీబాల్, కుంటాట, తొక్కుడు బిళ్ల ఎన్నో ఆటలు ఆడాం. ట్రాక్టరు, ఎడ్లబండి ఎక్కి ఊళ్లన్నీ తిరిగేశాం. ఈ సారి మీ కుటుంబం కూడా రండి. కోనసీమకు భూతల స్వర్గం అని పేరు. చూద్దురుగాని, ఉంటామరి.

నీ స్నేహితురాలు,
కె. జ్యోత్స్న వ్రాలు.

చిరునామా :
సి. రజని, 6వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
కర్నూలు, కర్నూలు జిల్లా,

భాషాంశాలు

అ) కింది సూచనల ఆధారంగా ‘కారం’ తో అంతమయ్యే పదాలు రాయండి.
1. ఈ పాఠం పేరు మమకారం.
2. ఎదుటివారికి మేలు చేయడం …………………….. కారం.
3. ఎదుటివారిని గేలి చేయడం …………………… కారం.
4. దట్టమైన చీకటి …………………….. కారం.
5. గర్వం , అహంభావం …………………….. కారం.
జవాబు:
1. మమకారం
2. ఉపకారం
3. వెటకారం
4. అంధకారం
5. అహంకారం

ఆ) కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాల అర్థాలు తెలుసుకొని సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
విహారయాత్రకు వెళ్లాలన్న మా ఉబలాటం చూసి మా ఉపాధ్యాయులు ముచ్చటపడ్డారు.
ఉబలాటం = కోరిక
మా మిత్రులందరూ సినిమాకు వెళ్ళాలని ఉబలాటపడుతున్నారు.

1. బాపు, రమణలు ఒద్దిక గా ఉండి జీవితాంతం స్నేహితులుగా ఉన్నారు.
ఒద్దిక = అనుకూలం
ఒకరికొకరు అనుకూలంగా ఉంటే స్నేహం నిలబడుతుంది.

2. మదర్ థెరిసా చూపే వాత్సల్యం చాలామంది జీవితాల్లో వెలుగులు నింపింది.
వాత్సల్యం = ప్రేమ
రోగులకు ప్రేమతో సేవ చేయాలి.

3. ఆ నగరంలోని అధునాతన కట్టడాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
అధునాతన = ఆధునికమైన
ఆధునికమైన జీవితాలలో మానవత్వం దూరమౌతోంది.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

ఇ) కింది వాక్యాలలో సమానార్ధక పదాలు ఉన్నాయి. గుర్తించి గీత గీయండి.
1. వచ్చీరాని మాటలతో ఆ బుడతడు చేసే అల్లరి అందరికీ ఆనందాన్నిస్తోంది. ఆ పిల్లవాడు అందరి దృష్టినీ ఆకర్షించాడు.
జవాబు:
బుడతడు, పిల్లవాడు

2. మనిషికి అసలైన ధనం విద్యాధనమే ! అని తేటతెల్లం చేశారు పూర్వికులు. దీంతో మనం సంపాదించు కోవాల్సింది ఏమిటో స్పష్టమైంది కదా !
జవాబు:
తేటతెల్లం, స్పష్టం

3. మహాత్ముల జీవనశైలి నన్ను ఆకర్షిస్తుంది. వారు బతికే పద్ధతి నిరాడంబరంగా ఉంటుంది.
జవాబు:
శైలి, పద్ధతి

ఈ) కింది వ్యతిరేక పదాలను జతపరచండి.

1. పండితుడు అ) దురదృష్టం
2. సరసం ఆ) పామరుడు
3. అదృష్టం ఇ) విరసం

జవాబు:

1. పండితుడు ఆ) పామరుడు
2. సరసం ఇ) విరసం
3. అదృష్టం అ) దురదృష్టం

ఉ) కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.

1. ఆశ్చర్యం అ) బయం
2. భయం ఆ) ఇంతి
3. స్త్రీ ఇ) అచ్చెరువు

జవాబు:

1. ఆశ్చర్యం ఇ) అచ్చెరువు
2. భయం అ) బయం
3. స్త్రీ ఆ) ఇంతి

వ్యాకరణాంశాలు

అ) సామాన్య – సంక్లిష్ట వాక్యాలు :
సామాన్య వాక్యం :
అసమాపక క్రియలు లేకుండా ఒక ‘సమాపక క్రియ’ తో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యమంటారు.
ఉదా :
సురేష్ గుడికి వెళ్ళాడు.
మేరీ పుస్తకం తీసింది.
చందు కలం పట్టుకున్నాడు.

సంక్లిష్ట వాక్యం :
ఒకటి కాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి, చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంక్లిష్ట వాక్యమంటారు.
ఉదా :
పద్మ నిద్రలేచింది. (సామాన్య వాక్యం)
పద్మ స్నానం చేసింది. (సామాన్య వాక్యం)
పద్మ బడికి వెళ్ళింది. (సామాన్య వాక్యం)

ఈ మూడు వాక్యాలనూ కలిపితే …….
AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం 2
అలా రెండు వాక్యాలను కూడా ‘కలపవచ్చు.

* రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు. రమేష్ బడికి వెళ్తున్నాడు.
AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం 3

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

ఆ) కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1. గురువుగారు పాఠం చెబుతున్నారు. గురువుగారు నవ్వుతున్నారు.
జవాబు:
గురువుగారు పాఠం చెబుతూ, నవ్వుతున్నారు.

2. అమ్మ బుజ్జగించింది. అమ్మ అన్నం పెట్టింది.
జవాబు:
అమ్మ బుజ్జగించి, అన్నం పెట్టింది.

3. ఎలుక అక్కడకు వచ్చింది. ఎలుక గుడ్లగూబను చూసింది.
జవాబు:
ఎలుక అక్కడకు వచ్చి, గుడ్లగూబను చూసింది.

ప్రాజెక్టు పని (మూడవ నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం)

1. పది పొడుపు కథలు సేకరించి ప్రదర్శించండి.
1) తండ్రి గరగరా,
తల్లి పీచు పీచు
బిడ్డలు రత్న మాణిక్యాలు
మనుమలు బొమ్మరాళ్లు.
జవాబు:
పనసపండు :
తండ్రి – పైభాగం, తల్లి – లోపల పీచు, బిడ్డలు – తొనలు, మనుమలు – లోపలి గింజలు

2) అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది. తైతక్కలాడింది.
జవాబు:
రోకలి

3. మా తాతకు జత ఎడ్లున్నాయి.
వాటికి నీళ్లంటే భయం. అవేమిటి?
జవాబు:
(లెదర్) చెప్పులు

4. గుడినిండా నీళ్లు గుడికి తాళం.
జవాబు:
కొబ్బరి కాయ

5. ఇంటి వెనకాతల ఇంగువ చెట్టు. ఎంత కోసినా తరగదు.
జవాబు:
పొగ

6. తోకలేని పిట్ట తొంభై ఆమడలు తిరిగింది.
జవాబు:
ఉత్తరం

7. అమ్మ అంటే కలుస్తారు. నాన్న అంటే విడిపోతారు? ఎవరూ?
జవాబు:
పెదవులు

8. తెల్లటి పొలంలో విత్తనాలు. చేత్తో వేస్తాం. కళ్లతో ఏరతాము?
జవాబు:
అక్షరాలు

9. నాలుగు కాళ్ళు ఉంటాయి గాని, నడవలేదు.
జవాబు:
కుర్చీ

10. తోకతో తాగే పిట్ట.
జవాబు:
దీపం

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

చమత్కార పద్యం

ఒడలినిండ కన్నులుండు నింద్రుడుకాడు
కంఠమందు నలుపు కాడు శివుడు
ఫణులబట్టి చంపు పక్షీంద్రుడా ? కాదు
దీనిభావమేమి తెలుసుకొనుడు
అర్థాలు :
ఒడలు = శరీరం
కంఠం = గొంతు
ఫణి = పాము
పక్షీంద్రుడు = గరుత్మంతుడు

ఇంద్రునిలాగా శరీరం నిండా కన్నులుంటాయి. శివుని లాగా గొంతు నల్లగా ఉంటుంది. గరుత్మంతుని లాగా పాములను చంపుతాడు. అది ఏమిటి?
జవాబు:
నెమలికి శరీరం నిండా నెమలి కన్నులుంటాయి. దాని మెడ నల్లగా ఉంటుంది. అది పాములను చంపుతుంది. కనుక ఈ చమత్కార పద్యానికి జవాబు ‘నెమలి’.

మమకారం కవి పరిచయం

రచయిత పేరు : చిలుకూరి దేవపుత్ర

జననం : అనంతపురం జిల్లా కాల్వ పల్లెలో 24.4.1952న జన్మించారు.

తల్లిదండ్రులు : సోజనమ్మ, ఆశీర్వాదం గార్లు

విద్య : 12వ తరగతి

ఉద్యోగం : జైళ్ల శాఖలో ఉద్యోగం, డిప్యూటీ తహసీల్దారు.

రచనలు : ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, ఆరుగ్లాసులు మొదలైనవి కథా సంపుటాలు. అద్దంలో చందమామ, పంచమం నవలలు.

పురస్కారాలు : పంచమం నవలకు 1996లో ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) వారి నవలల పోటీలో తృతీయ బహుమతి, 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001 లో చా.సో. స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం పొందారు.

ప్రస్తుత పాఠ్యాంశం : వీరు రచించిన ‘ఆరుగ్లాసులు’ అనే కథా సంపుటిలోనిది. ఆయన 18. 10, 2016న స్వర్గస్తులయ్యారు.

AP Board 6th Class Telugu Solutions Chapter 7 మమకారం

కఠిన పదాలు అర్థాలు

జాంతణాలు = జాణతనాలు (తెలివిగా ప్రవర్తించడాలు)
ఒద్దిక = అనుకూలం
తుల్యం = సమానం
మునుపు = గతం
ప్రతీక = గుర్తు
వాత్సల్యం = పెద్దలకు పిల్లల పట్ల ఉండే ఆప్యాయత
శైలి = విధానం
కొలీగ్ = సహోద్యోగి
వార్నింగ్ = హెచ్చరిక
అనర్గళంగా = ధారాళంగా
దొరసాని = దొరగారి భార్య, పరిపాలకు రాలు
ఉబలాటం = ఆత్రుత
వీథి మొగదల = వీథి చివర, వీథి ప్రారంభం
తేటతెల్లం = పూర్తిగా అర్థం కావడం
తొణుకూబెణుకూ = తొట్రుబాటు, జంకు
కరచాలనం = చేతులు కలపడం (షేక్ హాండ్)