AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Practice the AP 7th Class Science Bits with Answers Chapter 3 Animal Fibre on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP State Syllabus 7th Class Science Bits 3rd Lesson Animal Fibre with Answers

Choose the correct answer.

Question 1.
Eggs of silk moth are called
A) Larva
B) Seeds
C) Pupa
D) Imago
Answer:
B) Seeds

Question 2.
A female moth lays around ………………. eggs in one go.
A) 500
B) 50
C) 5,000
D) 5
Answer:
A) 500

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 3.
A big silk seed growing centre is at
A) Pochampadu
B) Dharmavaram
C) Horsely Hills
D) Kanchi
Answer:
C) Horsely Hills

Question 4.
The cocoons have to be stiffled to kill ……………. inside.
A) Eggs
B) Larva
C) Pupa
D) The worm
Answer:
B) Larva

Question 5.
Food for silk worms.
A) Mulberry leaves
B) Mango leaves
C) Coconut leaves
D) Jasmine leaves
Answer:
A) Mulberry leaves

Question 6.
The hair of animals collectively called
A) Fur
B) Skin
C) Fibre
D) None
Answer:
A) Fur

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 7.
Fleece of sheep is removed from its body during …………….. season.
A) Winter
B) Summer
C) Rainy
D) Spring
Answer:
D) Spring

Question 8.
After washing, …………… is passed over the wool to make it softer.
A) Steam
B) Grease
C) Cool air
D) Hot air
Answer:
C) Cool air

Question 9.
Silk is mainly
A) Carbohydrate
B) Worms
C) Protein
D) Cocoon
Answer:
C) Protein

Question 10.
Cotton is mainly
A) Proteins
B) Cellulose
C) Coarse
D) Soft
Answer:
B) Cellulose

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 11.
………………. useful to make different types of fibres.
A) Cotton
B) Jute
C) Coconut
D) All the above
Answer:
D) All the above

Question 12.
Eggs of silk moth called …………………
A) Embryo
B) Larvae
C) Seeds
D) Cocoon
Answer:
C) Seeds

Question 13.
“Chilakalu” means
A) Silk moths
B) Butterfly
C) Caterpillar
D) All the above
Answer:
A) Silk moths

Question 14.
Moths are also called ……………….
A) Bombyx mori
B) Insects
C) Butterfly
D) Honey bee
Answer:
A) Bombyx mori

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 15.
A female moth lays around ………………. number of eggs in one go.
A) 400
B) 500
C) 600
D) 550
Answer:
B) 500

Question 16.
Grinages grow ……………….
A) Embryos
B) Seeds
C) Caterpillar
D) Cocoon
Answer:
B) Seeds

Question 17.
Caterpillars feed by ……………… leaves.
A) Grass
B) Leaves
C) Cocoon
D) Mulberry leaves
Answer:
D) Mulberry leaves

Question 18.
Chandrikalu means …………………..
A) Cane frames
B) Glass tubs
C) Cocoons
D) Mulberry huts
Answer:
A) Cane frames

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 19.
Caterpillar stops eating at the age of ……………….
A) 25 to 30 days
B) 30 to 35 days
C) 40 days
D) Several months
Answer:
B) 30 to 35 days

Question 20.
Caterpillar secretes …………….. substance.
A) Fibre
B) Cellulose
C) Starch
D) All the above
Answer:
A) Fibre

Question 21.
“Pattu kayalu’ means
A) Silk worm
B) Cocoon
C) Seeds
D) Chandrikalu
Answer:
B) Cocoon

Question 22.
Young moths come out from …………..
A) Eggs
B) Mulberry leaves
C)Seeds
D) Cocoon
Answer:
D) Cocoon

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 23.
Stiffling helps to store ……………. for a long time.
A) Cocoons
B) Seeds
C) Worms
D) Caterpillar
Answer:
A) Cocoons

Question 24.
Stiffling done in …………….. centres.
A) Seed growing
B) Reeling
C) Weaving
D) All the above
Answer:
B) Reeling

Question 25.
Silk moths that lay eggs on oak plant produce …………….. silk.
A) Moonga
B) Tussar
C),Eri
D) Mulberry
Answer:
B) Tussar

Question 26.
……………. silk is produced in our state Telangana.
A) Mulberry
B) Tasar
C) Desali
D) All of these
Answer:
D) All of these

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 27.
Silk is made up of ………………….. proteins.
A) Sirisine
B) Fibroin
C) Both A & B
D) None of these
Answer:
C) Both A & B

Question 28.
Obtaining silk fibre from cocoon is called
A) Weaving
B) Spinning
C) Reeling
D) Knitting
Answer:
C) Reeling

Question 29.
Special machines like reelers and twisters are used in …………….
A) Reeling
B) Spinning
C) Knitting
D) Weaving
Answer:
A) Reeling

Question 30.
Cotton is made up of cellulose, but silk has
A) Protein
B) Lipids
C) Carbohydrates
D) Vitamins
Answer:
A) Protein

Question 31.
……………. is famous for wide boarder and rich buta
A) Potchampally
B) Darmavaram
C) Banaras
D) Bengal
Answer:
B) Darmavaram

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 32.
2000 to 3000 cocoons alre required to produce ………………. gms of silk
A) 500
B) 600
C) 700
D) 300
Answer:
A) 500

Question 33.
Good quality of wool is given by ……………….
A) Angora goat
B) Merino sheep
C) Llama
D) Camels
Answer:
B) Merino sheep

Question 34.
Rough and coarse hair is produced by
A) Goat
B) Sheep
C) Camel
D) Rabbit
Answer:
C) Camel

Question 35.
Scouring means removing of
A) Dust
B) Grease
C) Dirt
D) All of these
Answer:
D) All of these

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 36.
Which one of the following is a poor conductor of heat ?
A) Copper
B) Silver
C) Iron
D) Air
Answer:
D) Air

Question 37.
Wool is use as
A) Conductor
B) Insulator
C) Heater
D) Cooler
Answer:
B) Insulator

Question 38.
1) Egg 2) Pupa 3) Adult D) larva
The correct order is
A) 1,2,4, 3
B) 1. 4, 2, 3
C) 1, 3, 2,4
D) 1, 4, 3, 2
Answer:
B) 1. 4, 2, 3

Question 39.
‘Grinages’ are
A) Seed centers
B) Larva centers
C) Adult centers
D) Silk centers
Answer:
A) Seed centers

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 40.
‘Bombyx mori’ is a
A) Honey bee
B) Warsp
C) Housefly
D) Silk moth
Answer:
D) Silk moth

Question 41.
Name of the sac, where the catterpillar sleeps
A) Stuff
B) Chandrikalu
C) Cocoon
D) Reels
Answer:
C) Cocoon

Question 42.
Killing of the silk moth larva’s is called
A) Reeling
B) Yarn
C) Stiffling
D) Silk
Answer:
C) Stiffling

Question 43.
The stiffling process takes place at
A) Reeling centers
B) Grinages
C) Chandrikalu
D) Horsely Hills
Answer:
A) Reeling centers

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 44.
‘Desali pattu ‘is
A) Tasar silk
B) Moonga silk
C) Erisilk
D) Mulberry silk
Answer:
A) Tasar silk

Question 45.
The process in the picture is
AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers 1
A) Stiffling
B) Reeling
C) Warping
D) Feeding
Answer:
A) Stiffling

Question 46.
The equipment show in the figure is
AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers 2
A) Cacoon
B) Chandrikalu
C) Reeling
D) Woven
Answer:
B) Chandrikalu

Question 47.
Fill the blank in the life cycle of silk moth
AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers 3
A) Pupa
B) Laren
C) Silk moth
D) Housefly
Answer:
A) Pupa

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 48.
The country that used the silk for first time
A) India
B) China
C) Japan
D) America
Answer:
B) China

Question 49.
1) Dying 2) Sorting
3) Scouring 4) Shearing
The correct order is
A) 4, 3, 2, 1
B) 2, 3, 4, 1
C) 4, 3, 1,2
D) 3, 4, 2,1
Answer:
A) 4, 3, 2, 1

Question 50.
Removing the colour of wool is
A) Bleaching
B) Sorting
C) Spinning
D) Scouring
Answer:
A) Bleaching

Question 51.
Making threads of yarn is
A) Spinning
B) Carding
C) Dyeing
D) Sorting
Answer:
A) Spinning

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 52.
Write the correct order of Collecting Wool.
A) Shearing, Scouring, Sorting
B) Scouring, Sarting, Shearing
C) Shearing, Sorting, Scouring
D) Sorting, Shearing, Scouring
Answer:
A) Shearing, Scouring, Sorting

Question 53.
Which city is called silk city in our State?
A) Venkatagiri
B) Dharmavaram
C) Madanapalli
D) Hanuman Junction
Answer:
B) Dharmavaram

Question 54.
The first stage in making of woollen clothes?
A) Scouring
B) Sorting
C) Shearing
D) Bleaching
Answer:
C) Shearing

Question 55.
Fill the blank in the flow chart with the given answer.
AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers 4
A) Stuffing
B) Moths
C) Reeling
D) Chilakalu
Answer:
A) Stuffing

Question 56.
Material present in silk thread
A) Protein
B) Fat
C) Carbohydrate
D) Cellulose
Answer:
A) Protein

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 57.
If you went to silk showroom to know the quality of silk, what type of exact question do you ask?
A) How you decide the cost
B) These silk clothes have long life
C) Silk is prepared with
D) Silks are how many types
Answer:
D) Silks are how many types

Question 58.
In summer season what type of clothes do you wear?
A) Cotton, light colour
B) Woollen, Silk
C) Cotton, dark colour
D) Silk, Woollen
Answer:
A) Cotton, light colour

Question 59.
Animal fibre: protein :: plant fibre:
A) Fat
B) Protein
C) Carbohydrate
D) Mineral
Answer:
C) Carbohydrate

Question 60.
Which of the following shows the correct sequence of processes in making woollen fabric?
A) Shearing – scouring – combing – spinning – weaving
B) Scouring – spinning – combing – shearing – weaving
C) Weaving – scouring – shearing – combing – spinning
D) Shearing – weaving – combing – spinning – scouring
Answer:
A) Shearing – scouring – combing – spinning – weaving

AP 7th Class Science Bits Chapter 3 Animal Fibre with Answers

Question 61.
Name the stages of silkworm weavers buy from sericulture industury.
A) Larva
B) Pupa
C) Eggs
D) Moth
Answer:
B) Pupa

Question 62.
Identify the process that helps to store the cocoons for a long time.
A) Boiling
B) Stiffling
C) Reeling
D) Weaving
Answer:
A) Boiling

Question 63.
The silk fibres are composed of
A) Siricin & thrombin
B) Fibroin & thrombin
C) Cellulose & fat
D) Siricin & fibroin
Answer:
D) Siricin & fibroin

AP Board 6th Class Telugu Important Questions and Answers

Andhra Pradesh SCERT AP State Board Syllabus 6th Class Telugu Important Questions and Answers are part of AP Board 6th Class Textbook Solutions.

Students can also read AP Board 6th Class Telugu Solutions for exam preparation.

AP State Board Syllabus 6th Class Telugu Important Questions and Answers

AP Board 7th Class Telugu పదాలు – అర్థాలు

SCERT AP Board 7th Class Telugu Solutions పదాలు – అర్థాలు Questions and Answers.

AP State Syllabus 7th Class పదాలు – అర్థాలు

పదాలు – అర్థాలు

అంఘ్రి = కాలు
అంచిత = ఒప్పిదమైన
అంతరిక్షం = ఆకాశం
అంపశయ్య = బాణాలతో తయారు చేసిన పడక
అంభోధి = సముద్రం
అక్షౌహిణి = 21,870 రథాలు 21,870 ఏనుగులు, 65,160 గుజ్రాలు 1,09,350 సైనికులు
అగ్రిమెంటు = ఒప్పందం
అచ్చర = అప్సరస (దేవలోకపు స్త్రీ)
అడకించు (క్రి) = మోసంచేయడం
అతిథి = తిథి మొ|| కాలనియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు పిలుపు లేకనే వచ్చువాడు
అతృప్త = తృప్తిలేని
అద్రి = కొండ
అధికం = ఎక్కువ
అద్భుతం = చాల చక్కగా, ఆశ్చర్యం
అనంతరం = తరవాత
అనురక్తి = ఇష్టం
అపహాస్యం = ఎగతాళి
అప్సరోజనములు = అప్సరసలు
అపార = అంతులేని
అపార్థం = తప్పుడర్థం
అభినందన = ప్రశంస, పొగడ్త, మెప్పు
అభినందించు = పొగడు
అబ్ధి = సముద్రం
అభ్యాగతుడు = పిలుపుగా వచ్చినవాడు
అభ్యున్నతి = అభివృద్ధి, మేలు, ప్రగతి
అమలుచేయు (క్రి) = ఆచరించడం
అమాంతంగా = అకస్మాత్తుగా
అరయు (క్రి) _ = చూడడం, వెదకడం, జాగ్రత్తగా – గమనించడం
అరసిన = చూసిన
అర్జీ = పై అధికారులకు రాసే లేఖ, విన్నపం
అలమటించు (క్రి)= బాధపడటం
అల్లులు = ఆటలు
అవధానం = ఏకాగ్రత
అవని = భూమి
అవరోధం = అడ్డంకి, ఆటంకం
అవశ్యం = తప్పకుండా, తప్పనిసరిగా
అశ్వత్థామ = కృపి, ద్రోణుల కుమారుడు
అశ్వమేధయాగం = ఒక విధమైన యాగం
అసెంబ్లీ = శాసనసభ

AP Board 7th Class Telugu పదాలు – అర్థాలు

ఆంతర్యం = మనసులోని విషయం
ఆకాంక్ష = కోరిక
ఆకాశవాణి = రేడియో ప్రసారాల సంస్థ
ఆకృతి = ఆకారం
ఆచరణీయం = చేయదగినది
ఆటపట్టు = నిలయం, చోటు
ఆతురత = తొందర
ఆత్మజుడు = కొడుకు
ఆత్రం = ఆతురత, తొందర
ఆది = మొదలు
ఆదరం = గౌరవం
ఆదేశం = ఆజ్ఞ
ఆపద = కష్టం
ఆపళంగా = ఉన్నట్టుండి, అప్పుడు
ఆపాదమస్తకం = పాదాల నుండి తల వరకు
ఆప్తులు = ఇష్టమైనవారు, బంధువులు, స్నేహితులు మొ||వారు
ఆబాలగోపాలం = పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు
ఆర్జన = సంపాదన
ఆర్జించు (క్రి) = సంపాదించడం
ఆలోచనీయం = ఆలోచింపదగినది
ఆవళి / ఆళి = వరుస, పంక్తి, సమూహం
ఆవాసం = ఇల్లు, నివాసం
ఆవిష్కరణ : వెల్లడి చేయడం, ప్రకటన
ఆస్వాదించు (క్రి) = అనుభవించడం
ఆహ్లాదంగా = ఆనందంగా

AP Board 7th Class Telugu పదాలు – అర్థాలు

ఇక్షురసం = చెరుకురసం
ఇగురొత్తు (క్రి) = చిగురించడం
ఇరవు = స్థానం

ఈడు = వయస్సు

ఉత్తరాయణం = సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన నాటి నుండి ఆరు నెలల కాలం
ఉదరాగ్ని = కడుపులోని మంట, ఆకలి మంట
ఉల్లము = మనసు
ఉల్లసిల్లు (క్రి) = ప్రకాశించడం, వికసించడం సంతోషించడం

ఎడ = చోటు, స్థానం
ఎన = సమానం
ఎరవు = అప్పు
ఎలరుపు = సంతోషం
ఏమఱుచు (క్రి) = వంచించడం, మోసం చేయడం
ఏమఱుపాటు = పరధ్యానం

ఒండుచోట = ఒకచోట
ఒడిగట్టు = పూనుకొను
ఒడుపుగా = నేర్పుగా
ఒదరు (క్రి) = సంభ్రమించడం, తిరగడం, విజృంభించడం
ఒనర్చు = చేయడం
ఒప్పు = ప్రకాశించడం, తగి ఉండడం
ఒలుకు (క్రి) : చిందడం, కిందపడడం, జారడం
ఒసగు (క్రి) = ఇయ్యడం
ఓలి = వరుస

కంబము = స్తంభం
కజ్జము = భక్ష్యం, తినుబండారం
కడు = ఎక్కువ, చాలా
కదనం = యుద్ధం
కనుదోయి = రెండు కళ్ళు
కన్నుమూయు (క్రి) = మరణించడం
కపి = కోతి
కపిల = ఎరుపు కలిసిన గోధుమ వన్నె గల గోవు, ఒక జాతి ఆవు
కబళించు (క్రి) = మింగడం, ఆక్రమించడం
కర్మ = చేసినపని, చేసిన దానికి ఫలితం, పాపం
కలిమి = సంపద
కలుగు = రంధ్రం, బొరియ, బొర్రె
కలుషం = మురికి, పాపం
కల్ల = అబద్ధం, అసత్యం
కష్టార్జితం = కష్టపడి సంపాదించినది
కసవు = మేత
కాంతులీను (క్రి) = వెలుగును బయలుపరచడం లేదా వెలుగును వెదజల్లడం
కాంపౌండ్ = ప్రహరీగోడ
కాక = వేడి
కామం = కోరిక
కాయకష్టం = శరీర శ్రమ
కాలక్షేపం = సమయాన్ని (వృథాగా) గడపడం
కికురువొడుచు (క్రి) = వంచించడం, మోసం చేయడం
కీర్తించు (క్రి) = పొగడడం
కుంగదీయు (క్రి) = బాధపెట్టడం
కుజనులు = చెడ్డవాళ్ళు
కుడుచు (క్రి) = తినడం, భుజించడం, (పొదుగునుంచి) పాలు తాగడం
కురుక్షేత్రం = కౌరవులూ, పాండవులూ యుద్ధం చేసిన ప్రదేశం
కుఱుచ = పొట్టి
కులభూషణుడు = కులం మొత్తానికి అలంకారం లాంటివాడు, గొప్పవాడు
కుసుమం = పువ్వు
కూపీ = రహస్యం, గుట్టు
కృతజ్ఞత = చేసిన మేలును మరచిపోకుండా ఉండుట
కృతవర్మ = భోజదేశపు రాజు, దుర్యోధనుని స్నేహితుడు
కృప = దయ
కృపుడు = కౌరవ పాండవులకు విలువిద్య నేర్పిన మొదటి గురువు.
కేబుల్ గ్రాం = విదేశాలకు పంపే టెలిగ్రాం
కేశపాశం = తల వెంట్రుకల కొప్పు
కొమరు = అందం
క్రోడీకరించు (క్రి) = ఒకచోటికి చేర్చడం
క్రోధం = కోపం
క్రౌర్యం = క్రూరత్వం, ఇతరులను బాధపెట్టే గుణం
క్షాత్రం = క్షత్రియ ధర్మం, వీరత్వం

AP Board 7th Class Telugu పదాలు – అర్థాలు

గగనం = ఆకాశం
గర్భం = పొట్ట, కడుపు
గజం = ఏనుగు
గహ్వరం = గుహ
గారవం = గౌరవం
గున్న ఏనుగు = చిన్న / పిల్ల ఏనుగు
గుమ్మ = పాలు పిండేటప్పుడు వచ్చే ధార
గురిగి = మట్టితో చేసిన చిట్టి పాత్ర (కుండ)
గురు = పెద్ద, గొప్ప

ఘటించు (క్రి) = కలగజేయడం
ఘట్టం = సంఘటన, సన్నివేశం
ఘన = గొప్పదైన
ఘనకార్యం = గొప్ప పని

చండిమ = వాడిమి
చక్రవర్తి = రాజులకు రాజు
చతురత్వం = చాతుర్యం, నేర్పు
చనుదెంచు (క్రి) = రావడం
చయ్యన = వెంటనే
చిందు (క్రి) = ఒలకడం
చిత్తవిస్ఫూర్తి = మనోవికాసం
చిరజీవత్వం = ఎప్పుడూ ఉండటం
చివురు = లేత
చీటి = ఉత్తరం
చెండాడు (క్రి) = ఖండించడం, చంపడం
చెంత = దగ్గర
చెర = ఖైదు, జైలు
చెలమ = ఎండిపోయిన వాగు, నది మొదలయిన వాటిలో నీటి ఊట కోసం చేసిన గొయ్యి
చెలువము = అందం
చేతము = మనసు
చేదోడు వాదోడు = చేతిసాయం, మాటసాయం
చేవ = శక్తి / బలం ; చెట్టుమానులో సారవంతమైన పదార్థం
ఛాయ = నీడ
ఛారిటీ షో = ఒక మంచి పనికి సహాయపడటానికి ధనం కొరకు ఇచ్చే ప్రదర్శన

AP Board 7th Class Telugu పదాలు – అర్థాలు

జనపదం = పల్లెటూరు
జనిత = పుట్టిన
జాగిలం = వేటకుక్క
జారీచేయు (క్రి) = ఇయ్యడం
జాలువారు (క్రి) = ప్రవహించడం, కిందికి జారడం
జీవగడ్డ = చైతన్యంతో తొణికిసలాడుతున్న భూమి
జుంటీగలు = తేనెటీగలు
జ్ఞానేంద్రియాలు = కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్శం

టూకీగా = సంగ్రహంగా, సంక్షిప్తంగా

తటాలున = వెంటనే
తతంగం = ప్రక్రియ, పనివిధానం
తద్ద (యు) . = అత్యంతం, ఎక్కువగా
తనరు (క్రి) = ఒప్పడం, ప్రకాశించడం, అతిశయించడం, విజృంభించడం
తనువు = శరీరం
తరంగం = అల/ ధ్వని ప్రయాణం చేసే మార్గం
తరంగితం = అలలతో కూడినది
తలగడ = దిండు, తలకింది మెత్త
తలపు = ఆలోచన
తలము = పైభాగం
తల్లడిల్లు (క్రి) = బాధపడటం
తామసభావం = తమోగుణం, సోమరితనం మొదలగు లక్షణాలు
తార్కాణం = ఉదాహరణం, నిదర్శనం, రుజువు
తాల్మి = ఓర్పు
తిలకించు (క్రి) = చూడటం
తురుము (క్రి) = కొబ్బరి మొ|| వాటిని సన్నగా తరగటం, పొడిగా చేయడం, తలలో పూలు మొ||నవి పెట్టుకోడం
తెలిఱాయి = తెల్లరాయి
తెలుగునాడు = తెలుగునేల
తెల్లబోవు (క్రి) = వెలవెలపోవడం
తేజరిల్లు (క్రి) = ప్రకాశించడం
తోరము = అధికమైన, దట్టమైన, సాంద్రమైన
త్రచ్చు (క్రి) = మథించడం, చిలకడం, తరచడం
త్రెళ్ళు (క్రి) = పడటం
త్రోపాడు (క్రి) = తోపులాడటం, తోసుకోవడం

AP Board 7th Class Telugu పదాలు – అర్థాలు

దంపతులు = భార్యాభర్తలు, ఆలుమగలు
దరహాసం = చిరునవ్వు
దారువు = కర్ర, కొయ్య
దినకృత్యం = రోజూ చేసే పని
దివ్యలోకం = దేవలోకం
దీప్తి = కాంతి
దురంతం = అంతము లేనిది, చెడ్డపని
దురితం = పాషం
దురితదూర ! = పాపాలను పోగొట్టేవాడా !
దైత్యులు = రాక్షసులు, దితి కుమారులు
ధరిత్రి = భూమి
ధీ = బుద్ధి
ధీ జడిమ = బుద్ధికున్న మందగొడితనం
ధీరుడు = ధైర్యవంతుడు
ధేనువు = ఆవు, గోవు

నక్కి ఉండు (క్రి) = దాక్కొని ఉండడం
నయనాంచలం = కంటికొన
నల్గడలు = నాలుగు దిక్కులు
నిక్కము = నిజం
నిజావాసం = స్వస్థలం
నిర్విరామంగా = విశ్రాంతి లేకుండా
నిర్జీవంగా = ప్రాణం లేకుండా
నిశితం = పదునయిన
నృపుడు = రాజు
న్యూస్ పేపర్ = వార్తాపత్రిక

పక్కాగా = కచ్చితంగా
పజ్జ = దగ్గర, వెనక
పట్టాభిషేకం = కొత్తగా, రాజును ఎన్నుకొన్నప్పుడు ఆనవాయితీగా చేసే ఉత్సవం
పట్టి = సంతానం (కొడుకు కూతురు)
పడతి, పడంతి = స్త్రీ
పథం = మార్గం
పన్నిదము = పందెం
పరబ్రహ్మ = భగవంతుడు, దేవుడు
పరారీ = పారిపోయినవాడు
పరితృప్తి = మిక్కిలి సంతోషం
పరిమళం = సువాసన
పరిమాణం = కొలత
పరివృద్ధి = అభివృద్ధి
పల్లం = దిగువ ప్రాంతం, ప్రదేశం
పసిగట్టుట (క్రి) = వాసన ద్వారా గుర్తించడం
పాదపరాగం = కాలిదుమ్ము, పాదధూళి
పాదు = మూలం
పారావారం = సముద్రం
పాఱు (క్రి) = ప్రవహించడం, పరుగెత్తడం
పాషాణం = రాయి
పుండరీకం = పులి, వ్యాఘ్రం
పుత్తడి = బంగారం
పునీతులు = పవిత్రమైనవాళ్ళు
పూరి = గడ్డి
పుష్కలం = ఎక్కువ
పైడి = బంగారం
పొడుచు (క్రి) = ఉదయించడం, పోట్లాడటం
పోలు (క్రి) = ఒప్పడం, తగి ఉండడం
ప్రజ్ఞ = తెలివి, నేర్పు, ప్రతిభ
ప్రత్యక్షంగా = కంటికి ఎదురుగా
ప్రతిమ = విగ్రహం
ప్రమేయం = గ్రహించదగినది
ప్రల్లదము = కఠినం, దుర్భాషణము
ప్రవేశించు (క్రి) . = లోపలికి వెళ్ళడం
ప్రాచీన = పూర్వకాలానికి సంబంధించిన
ప్రాప్తించు (క్రి) = కలగడం, లభించడం
ప్రాయశ్చిత్తం = పాపం పోవడం కోసం చేసే పని
ప్లే గ్రౌండ్ = ఆటస్థలం
ఫణి = పాము

AP Board 7th Class Telugu పదాలు – అర్థాలు

బంధుర = దట్టమయిన, తగిన
బడబానలం = సముద్రంలోని అగ్ని
బహుళ ఆ = అనేక రకాల
బాదరాయణుడు = వ్యాసుడు
బాలభానుడు = ఉదయిస్తున్న సూర్యుడు
బాసాడు (క్రి) = ప్రమాణం చేయడం
బీజం = విత్తనం
బుధులు = పండితులు
బేల్పరచి = మోసంచేసి
బోధించు (క్రి) = తెలియజేయడం
భంగము = అల, కెరటం
భయద = భయం కలిగించే
భాషణం = మాట
భీతి = భయం, బెదురు
భువి = భూమి, స్థానం
భూతకోటి = ప్రాణికోటి, ప్రాణుల సమూహం
భూప, సభ = రాజసభ
భ్రమ = భ్రాంతి; లేనిది ఉన్నట్లుగా తోచడం

మంజరి = గుత్తి, సమూహం
మకాం = నివాసం, బస
మణులు = రత్నాలు
మథనపడు (క్రి) = సతమతమగు
మదం = కొవ్వు ; ఏనుగు కుంభస్థలం నుండి కారే ద్రవం; గర్వం.
మధురం = తీయనైనది
మధువు = తేనె
మమత్వం = ‘నాది’ అనే ఆలోచన, మోహం
మహత్కార్యం = గొప్పపని
మహత్తర = గొప్ప
మహనీయుడు = గొప్పవాడు
మహీజం = చెట్టు
మానం = శీలం, గౌరవం
అని మార్గం = దారి
మిట్టు (క్రి) = ఎగరడం
ముగ్థులు = ఆశ్చర్యచకితులు
ముచ్చటగా = ముద్దుగా, చక్కగా
మునుపడగా = ముందుగా
ముమ్మరంగా = ఎక్కువగా
మెఱుగు = తళతళలాడే కాంతి
మేగజైన్ = నిర్ణీత కాలవ్యవధిలో వచ్చే పత్రిక
మేలు = మంచి, ఉపకారం
మైత్రి = స్నేహం
మొనయు (క్రి) = పూనడం, చేయడం
మొఱఁగికొని = నక్కి, దాక్కొని
మొఱయు (క్రి) = మోగు
మౌఖికం = ముఖం నుంచి వెలువడినది, మాట, పాట వంటివి

యశము = కీర్తి

రవము = అరుపు, ధ్వని
రసాభాస = రసభంగం
రాజనాలు = ఒక రకమైన మేలి రకపు ధాన్యం
రాజసభావం = రజోగుణం; కోపం మొ||న లక్షణాలు
ఱాలు = రాళ్ళు
రెమ్మ = పెద్ద కొమ్మకుండే చిన్న కొమ్మ
రేయి = రాత్రి

లతిక = తీగ
లవణం = ఉప్పు
లసత్ = ప్రకాశించే
లెస్స = బాగా ఉన్నది
లోభి = పిసినారి

వనం = అడవి
వరహా = ఒకప్పటి వాడుకలోని నాణెం
వల్లరి = తీగ
వల్లవుఁడు = యాదవుడు, వంటవాడు
వల్లె వేయించు = మళ్లీ మళ్లీ చెప్పించు
వసుధ = భూమి, అవని
వాంఛ = కోరిక
వాక్కు = మాట
వాటి = తోట
వాటి(క) = ప్రదేశం
వార్త = సమాచారం
వార్తకెక్కు (క్రి) = ప్రచారాన్ని పొందడం
వాస్తవం = నిజం
వికలం = విరగడం, కలత
విమల =స్వచ్ఛమైన
వ్రాలు = సంతకం
వితరణం = దానశీలం
విత్తం = ధనం
విద్వాంసుడు = పండితుడు
విధాతృడు, విధాత = బ్రహ్మ
వినాశం = నాశనం
వినిర్గతం = బయలు వెడలినది
విపినం = అడవి
వీపుల = విస్తరించిన
విప్లవం = విశేషమైన మార్పు
విభిన్న = వేరువేరు
విమల = పవిత్రమైన, నిర్మలమైన
విరాళం = చందా
విలసితము = ప్రకాశితము, పెంపొందింప జేసినది
విలసిల్లు (క్రి) = పెంపొందడం, ప్రకాశించడం
విశదంచేయు (క్రి) = వివరించడం
విస్తరించు (క్రి) = వ్యాపించడం
వీనులవిందు = చెవులకింపు కలిగించేది
వృద్ధులు = ముసలివారు
వృషము = ఎద్దు, వృషభం
వేదశాఖలు = నాలుగు వేదాలు, వేదాలలోని శాఖలు

AP Board 7th Class Telugu పదాలు – అర్థాలు

శపథం = ప్రమాణం, ఒట్టు
శార్దూలం = పులి
శాశ్వతుడు = జన ఎప్పుడూ ఉండేవాడు
శిలాతటి = రాళ్లున్న ప్రదేశం
శిల్పవిద్యానిధి = శిల్ప విద్యలో ఆరితేరినవాడు
శిల్పికంఠీరవా ! = శిల్పులలో గొప్పవాడా !
శౌర్యచండిమ =పరాక్రమ తీవ్రత
శోకం = ఏడుపు, రోదన
శ్రీలు = సంపదలు
శ్రుతులు = వేదాలు
శ్రేణి = వరస
శ్రేష్ఠం = ఉత్తమం, గొప్పది

షరతు = నియమం, నిబంధన

సంక్షేమం = మేలు, మంచికోసం చేసే సహాయం
సంకేతం = గుర్తు, చిహ్నం
సంగ్రామం = యుద్ధం
సంస్తవనీయుడు = పొగడదగినవాడు
సంశయం = సందేహం
సఖులు = స్నేహితులు, చెలికత్తెలు
సజ్జనులు = మంచివారు
సత్యసూక్తి = మంచిమాట
సత్వరం = వెంటనే
సదృశం = సమానం, తగినది, సారూప్యం
సదా = ఎప్పుడూ
సమరం = యుద్ధం
సమష్టి = సమస్తం, మొత్తం
సమీపం = దగ్గర
సమృద్ధి = నిండుగా ఉండడం
సమ్మోదము = సంతోషము
సాత్యకి = ఇతని మరోపేరు యుయుధానుడు, వృష్టివంశ యోధుడు, కృష్ణుని సమీపవర్తి
సాధువాదములు = మెచ్చుకోలు మాటలు, ప్రశంసలు
సాయుధ దళాలు = ఆయుధాలు ధరించిన సైనికుల బృందాలు
సావధానంగా = ఏకాగ్రతతో
స్నిగ్ధ = స్వచ్చమైన
సీమ = ప్రదేశం, హద్దు, ఎల్ల
స్వీకరించు (క్రి) = తీసుకోడం, గ్రహించడం
సుగమం = సులభంగా తెలిసేది, లేదా వెళ్ళగలిగినది
సుగుణం = మంచి స్వభావం
సునామి = పెద్ద ఉప్పెన
సుభటకోటి = మంచిభటుల సమూహము
సుభాషిణి = చక్కగా మాట్లాడేది
సుభిక్షం = కరవు కాటకాలు లేకుండా ఉండటం
సురభి = కామధేనువు
సురులు = దేవతలు
సెగ = వేడి
సేవించు (క్రి) = సేవచేయడం
సోగకన్నులు = పొడుగాటి కన్నులు
స్థితప్రజ్ఞుడు = స్థిరమైన మంచిబుద్ధి గలవాడు
స్నిగ్ధం = సుకుమారం

AP Board 7th Class Telugu పదాలు – అర్థాలు

హరిత్తు = సింహం
హర్షం = ఆనందం
హాని = కీడు, చెడు
హితైషిణి = మేలుకోరేది / శ్రేయోభిలాషిణి
హేతువు = కారణం

AP Board 7th Class Telugu లేఖలు

SCERT AP Board 7th Class Telugu Solutions లేఖలు Questions and Answers.

AP State Syllabus 7th Class కరపత్రాలు / లేఖలు

1. ‘మాయాకంబళి’ పాఠం నుండి నీవేమి గ్రహించావో నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

స్నేహితుడు / స్నేహితురాలికి లేఖ

గుంటూరు,
xxxxx.

ప్రియమైన స్నేహితుడు / స్నేహితురాలికి,
శుభోదయం. నేను బాగున్నాను. నీవెలా ఉన్నావు. నేను . ఈ లేఖలో ‘మాయాకంబళి’ పాఠం గురించి చెప్పదలచాను. మా తెలుగు మాస్టారు పాఠం చెబుతుంటే ఎదురుగా జరుగుతోందా అన్నట్లు అనిపించింది. ఇంకా, ఈ పాఠం ద్వారా కొన్ని పాత్రలు మన నిజ జీవితంలో ఎదురుపడేవే అనే భావన కల్గించాయి. ‘ఆత్మానందుడు’ యోగి ఎలా ఉంటాడో అలాగే కోపం, గర్వం లేకుండా దయా స్వభావంతో ,కనబడతాడు. రాజు దేశం కోసం ఆలోచన తప్ప స్వార్థం లేనివాడు. విక్రముడు రాజునే చంపి రాజ్యం కాజేయాలనే స్వార్థపరుడు. చంచల రాజుకు ప్రక్కనే ఉంటూ గోతులు తవ్వేది. ఇలా ఇవన్నీ లోకంలో కనబడే పాత్రలే. రచయిత సదానందగారు కథ బాగా రాశారు. మనలాంటి పిల్లలకు మార్గదర్శనం చేసే విధంగా ఉందని నా ఉద్దేశం. మరి నీ ఉద్దేశం ఏమిటి ? ఉత్తరం రాయి. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు / స్నేహితురాలు,
xxxxxx.

చిరునామా :
కె. ఫణిరామ్,
7వ తరగతి, భాష్యం పబ్లిక్ స్కూలు,
గుంటూరు, గుంటూరు జిల్లా.

2. శతక పద్యం చదవడం వలన ప్రయోజనాలను వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

చెరుకూరు,
xxxxx.

ప్రియమైన జస్వంత కు,
నీ మిత్రుడు లీలాకృష్ణ వ్రాయు లేఖ. ఉభయకుశలోపరి. ఇటీవల మాకు ‘పద్యపరిమళం’ పాఠం చెప్పారు. నాగేశ్వరరావు మాస్టారు పద్యాలు పాడుతుంటే వినడానికి ఎంతో బాగున్నాయి. అన్నీ నీతి శతకాలలోని పద్యాలే. “ఓర్పు, పెద్దలకు సేవ చేయుట, పరనింద పనికిరాదు, సత్యశీలనం, గురుభక్తి, ధారణ, దానం, శాస్త్రపఠనం” ఇలా చాలా వాటి గురించి చెప్పారు. మంచి విషయాలను వినడమే కాదు ఆచరణలో కూడా పెట్టాలని నాగేశ్వరరావు మాస్టారు చెప్పారు. నేను కుమార, భాస్కర శతకాలు – . కొనుక్కున్నాను. పద్యాలు చదువుతున్నాను. ఈ ఉత్తరం అందిన వెంటనే రిప్లై రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
జస్వంత్.

చిరునామా:
కె. లీలాకృష్ణ, 7వ తరగతి,
భాష్యం హైస్కూలు,
తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా.

3. “కప్పతల్లి పెళ్ళి” పాఠం గురించి నీ మిత్రునికి లేఖ రాయి.
జవాబు:

మిత్రునికి లేఖ

ఒంగోలు,
xxxxx.

ప్రియమైన స్నేహితుడు ఫణికి,
నీ స్నేహితుడు నాగలక్ష్మణ్ వ్రాయునది. “కప్పతల్లి పెళ్ళి” పాఠం గురించి నీవు చెప్పినట్లే చాలా బాగుంది. మా తెలుగు మాస్టారు “రామారావు” గారు చాలా బాగా చెప్పారు. గేయం పాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలని పించింది. పూర్వపు ఆచారాలలో కొన్నింటిని కళ్ళకు కట్టినట్లు చెప్పారు. మన ఆచార, సంప్రదాయాలను వివరిస్తూ, వాటిని పాటించడంలో ఆవశ్యకతను వివరించారు. చావలి బంగారమ్మ గూర్చి, ఆమె కవిత్వంలోని సరళతను, లయాత్మకతను గురించి చెప్పారు. కప్పతల్లి పెళ్ళికి ప్రకృతి కూడా పరవశించిన తీరును కవయిత్రి రచనా శైలిని మా గురువుగారు చక్కగా తెలియజేశారు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు. మళ్ళీ ఉత్తరం రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
ఎస్. నాగలక్ష్మ ణ్.

చిరునామా:
కె. ఫణిరామ్,
నెం. -6; 7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
చెరుకూరు, ప్రకాశం జిల్లా.

AP Board 7th Class Telugu లేఖలు

4. రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గురించి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

బాపట్ల,
xxxxx.

ప్రియమైన శ్రీవల్లికి,
నీ స్నేహితురాలు లలిత వ్రాయు లేఖ.

ఇటీవల మా తెలుగు మాస్టారు ‘హితోక్తులు’ పాఠం చెప్పారు. దీనిని రాసిన కవి రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు. రాళ్ళపల్లి గ్రంథ పరిష్కర్తగా, వ్యాస రచయితగా, విమర్శకునిగా, గానకళా ప్రపూర్ణగా సాహిత్య లోకానికి సుపరిచితులని చెప్పారు. రఘువంశం, స్వప్న వాసవదత్త గాథా సప్తశతి (ప్రాకృతభాష వంటి సంస్కృత గ్రంథాలను ఆంద్రీకరించారు. అనేక గ్రంథాలను పరిశీలించి, పరిశోధకుడిగా పరిష్కరించి సమగ్ర. పీఠికలను అందించారు. తిరుమలతిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో 108 అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారు. రాళ్ళపల్లివారి పాత్ర చిత్రీకరణను తెలియజేసే వ్యాసాలు నిగమశర్మ అక్క తిక్కన తీర్చిన సీతమ్మ. వేమనపై ఏడు ఉపన్యాసాలు ఇచ్చారు. ‘ఏకసంథాగ్రాహి’ పేరు పొందారని మా సార్ చెబుతుంటే అద్భుతం అనిపించింది. ఇలాంటి గొప్పకవి రాసిన పద్యాలు చదవడం అదృష్టంగా భావిస్తున్నా. దీనిపై నీ అభిప్రాయం రాయి.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
కె. లలిత.

చిరునామా :
ఎస్. శ్రీవల్లి, 7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా.

5. ఏదైనా ఒక పండుగ / దర్శనీయ స్థలం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునికి లేఖ

చిలకలూరి పేట,
xxxxx.

ప్రియమైన మిత్రుడు కౌశికకు,
నీ మిత్రుడు ఫణిరామ్ శుభాకాంక్షలు తెలుపుతూ రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తున్నాను. నేను ఈ లేఖలో నాకు బాగా నచ్చిన పండుగలలో ఒకటైన ‘ఉగాది’ పండుగను గురించి వ్రాస్తున్నాను. ఆ రోజున ఉదయాన్నే నిద్రలేచి, తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకున్నాను. ముందురోజే సిద్ధం చేసుకొన్న ఉగాది ప్రసాదం సామాన్లతో పచ్చడి అమ్మ చేయగా, దేవునికి నమస్కరించి ప్రసాదంగా తీసుకున్నాను. పంచాంగ శ్రవణం విని తద్వారా రాబోయే పరిస్థితులను అవగాహన చేసుకొన్నాను. అమ్మానాన్నల ఆశీస్సులు తీసుకొన్నాను. చక్కని పిండి వంటలతో పండుగ బాగా జరుపుకున్నాము. నీకు ఇష్టమైన పండుగను గురించి ఉత్తరం రాయి.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
సి. హెచ్. కౌశిక్, 7వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
చీరాల, ప్రకాశం జిల్లా.

6. ‘బాలచంద్రుని ప్రతిజ్ఞ’ నీకెలా నచ్చిందో నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

పూళ్ళ,
xxxxx.

ప్రియ మిత్రుడు శ్రీరామచంద్రమూర్తికి,

నీ మిత్రుడు ఫణిరామ్ స్నేహపూర్వకంగా వ్రాయునది. ఇటీవల మా పాఠశాలలో మా తెలుగు మాస్టారు ‘బాలచంద్రుని ప్రతిజ్ఞ’ పాఠం రాగయుక్తంగా చెప్పారు. బాలచంద్రుని ప్రతిజ్ఞను, పరాక్రమాన్ని చక్కగా తెలిపారు. ‘ఉత్సాహం వీరలక్షణమ్’ అన్నట్లు బాలచంద్రుడు తల్లితో మాట్లాడిన ప్రతి మాటా అతనిలోని పరాక్రమాన్ని తెలుపుతున్నాయి. తెలుగు సాహిత్యంలో ‘ద్విపద’ ప్రత్యేకతను కూడా మా సార్ తెలిపారు. ఆనాటి యుద్ధ విశేషాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు. పల్నాటి యుద్ధం ఆంధ్ర భారతముగా ప్రసిద్ధి చెందినదని తెలిపారు. నీవు కూడా ఈ పాఠం గురించి ఉత్తరం రాయి.

ఇట్లు,
కె. ఫణిరామ్.

చిరునామా:
సి. హెచ్. శ్రీరామచంద్రమూర్తి,
7వ తరగతి,
జిల్లా పరిషత్ పాఠశాల,
చెరుకూరు, ప్రకాశం జిల్లా,

7. కరోనా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తూ మిత్రునకు లేఖ.
జవాబు:

విశాఖపట్నం,
xxxxx.

ప్రియమైన మాధురికి,
నీ స్నేహితురాలు లావణ్య వ్రాయు లేఖ.

ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

కోవిడ్ – 19 వలన మనం రెండు విద్యా సంవత్సరాలు నష్టపోయాము. సెకండ్ వేవ్ మరీ భయంకరంగా ఉంది.

ఐనా మనవాళ్లు చాలామంది బయట తిరగడం మానడం లేదు. కరోనా వైరస్ మన వరకూ రాకూడదంటే, అనవసరంగా బయట తిరగకూడదు. తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్లినా మాస్కులు రెండు ధరించాలి. మనిషికి 3 మీటర్ల దూరంలో ఉండాలి. శానిటైజర్ ఉపయోగించాలి. వేటినీ తాకకూడదు. ఇంటికి రాగానే బట్టలు తడిపేసి, సబ్బుతో స్నానం చేయాలి.

థర్డ్ వేవ్ చిన్న పిల్లలకు ప్రమాదం అంటున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటాను మరి.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
వి.లావణ్య.

చిరునామా :
సి. హెచ్. మాధురి,
నెం. 12, 7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
నారాకోడూరు, గుంటూరు జిల్లా.

AP Board 7th Class Telugu లేఖలు

8. తెలుగు భాష గొప్పదనాన్ని గూర్చి ‘తెలుగు వెలుగు’ పాఠం ఆధారంగా మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

లేఖ

కాకినాడ,
xxxxx

మిత్రుడు పి. రాజారావుకు,

శుభాభినందనలు. మిత్రమా! నీకు ఈ లేఖలో మన మాతృభాష తెలుగు యొక్క గొప్పదనాన్ని గూర్చి వ్రాస్తున్నాను. మన మాతృభాష తెలుగు భాష, తెలుగు భాష తేనెకన్న తీపిదనం కలది. తెలుగు భాషలో ఎన్నో చమత్కారాలు ఉన్నాయి. “దేశ భాషలలో తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు. మన తెలుగు భాషలో పొడుపుకథలు, సామెతలు, జాతీయాలు, శబ్ద పల్లవాలు ఉన్నాయి. తెలుగు భాష, సంగీతానికి అనువైన భాష. తెలుగులో త్యాగయ్య కీర్తనలు వ్రాశాడు. తెలుగులో జోలపాటలు, సంకీర్తనలు ఉన్నాయి. జానపద గేయాలు, స్త్రీల పాటలు, బుర్ర కథలు, హరికథలు ఉన్నాయి.

తెలుగులో పద్యం పాడడానికి వీలుగా చక్కగా ఉంటుంది. తెలుగులో అవధాన ప్రక్రియ ఉంది. ఆశు కవిత్వం ఉంది. తెలుగు అజంత భాష. దీనిని పాశ్చాత్యులు ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని మెచ్చుకున్నారు. నేను తెలుగు పద్యాలు 500 చదువుతా. నీవు కూడా చదువు. సెలవుల్లో పద్యపఠనం పోటీ పెడదాం. మీ నాన్నగార్కి నమస్కారం. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కాంతారావు.

చిరునామా:
పి. రాజారావు,
S/O రమణరావు,
బాపూజీ నగర్, కొవ్వూరు,
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

9. స్వాతంత్ర్య దినోత్సవ లేఖ (జాతీయ వర్వదినం)
జవాబు:

అనంతపురం,
xxxxx

ప్రియ స్నేహితురాలు శశిరేఖకు,

నీ ఉత్తరం ఇప్పుడే అందింది. సంతోషం. మేము గడచిన ఆగస్టు 15వ తేదీనాడు మా పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకొన్నాము. మున్సిపల్ కమీషనర్ గారు ముఖ్య అతిథిగా వచ్చి, జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మనదేశానికి స్వాతంత్ర్యం లభించిన విధానాన్ని చక్కగా వివరిస్తూ ఉపన్యసించారు. తరువాత మా ప్రధానోపాధ్యాయుడూ మరికొంతమంది ఉపాధ్యాయులూ, విద్యార్థులు కూడా ఉపన్యసించారు. చివరకు విద్యార్థులందరికీ స్వీట్సు పంచిపెట్టబడ్డాయి.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
పి. దివ్య.

చిరునామా:
కె. శశిరేఖ,
7వ తరగతి, మున్సిపల్ హైస్కూలు,
చీరాల, ప్రకాశం జిల్లా.

10. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను వివరిస్తూ మిత్రునకు లేఖ
జవాబు:

నెల్లూరు,
xxxxx

ప్రియ మిత్రమా,
నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగుగా చదువుతున్నావని తలుస్తాను. గడచిన సోమవారం మా నెల్లూరు పట్టణంలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించబడింది. జిల్లాలోని నాలుగు మూలల నుండి, వివిధ పాఠశాలల బాలబాలికలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థులచే తయారుచేయబడ్డ రకరకాల నమూనాలు ఇందులో ప్రదర్శింపబడ్డాయి. మా పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి లభించింది. ఆ ఆనందంతో నీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
వి. కోటేశ్వర్.

చిరునామా:
కోట శ్రీధర్ కుమార్,
7వ తరగతి,
టౌన్ హైస్కూలు,
గుడివాడ, కృష్ణా జిల్లా.

11. శతక పద్యాలు మానవీయ విలువలను పెంచుతాయి. దీన్ని సమర్థిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

శ్రీకాకుళం,
xxxxxxx

ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు,

శుభాకాంక్షలు. నేను బాగానే ఉన్నాను. నీవు కూడా బాగానే ఉన్నావని ఆశిస్తున్నాను. నేను ఈ లేఖలో శతక పద్యాల ప్రాధాన్యాన్ని గురించి తెలియజేస్తున్నాను. శతక పద్యాలు విద్యార్థుల్లో సత్ప్రవర్తనను కలిగిస్తాయి. మానవీయ సంబంధాలను పరిపుష్టం చేస్తాయి. సమాజం పట్ల గౌరవాన్ని, సేవాదృక్పధాన్ని కలిగిస్తాయి. అందువల్ల శతక పద్యాలను అందరు చదువాలి. ఆదర్శవంతులుగా తయారవ్వాలి. నీవు కూడా శతక పద్యాలను చదివి అందరికి ఆదర్శంగా నిలిచే గుణాలను పెంపొందించుకుంటావని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
వి. మనోజ్ఞ.

చిరునామా :
వి.సతీష్,
7వ తరగతి,
నిర్మలా హైస్కూల్,
ఏలూరు,
పశ్చిమ గోదావరి జిల్లా.

AP Board 7th Class Telugu లేఖలు

12. చదువు ప్రాధాన్యతను తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

నెల్లూరు,
xxxxxxx

ప్రియమైన మిత్రుడు రామారావుకు,

శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఎంతోమంది పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారు. వివిధ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. చదువుకోవలసిన వయస్సులో పనులు చేస్తున్నారు. నేను ఈ విషయాన్ని గుర్తించి బాలకార్మికులుగా ఉన్నవారిని బడిలో చేర్పించాను. చదువు అవసరాన్ని వివరించి చెప్పాను. చదువు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాను. నీవు కూడా బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించు. వారందరికి చదువు ప్రాధాన్యతను వివరించు. పెద్దలకు నమస్కారాలు తెలుపు.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.చంద్రశేఖర్.

చిరునామా :
కె రామారావు,
7వ తరగతి,
ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల,
దక్షారామం, తూర్పుగోదావరి జిల్లా.

13. మాతృభాషా దినోత్సవం గూర్చి మిత్రునకు లేఖ
జవాబు:

చెరుకూరు,
xxxxx

ప్రియ మిత్రుడు ప్రవీణ్ కుమార్‌కు,

ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ఇటీవల మా పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21 న బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా చక్కనైన సూక్తులు రాసిన : చార్టులు తగిలించి, అలంకరించాం. మన మాతృభాషను కాపాడిన, కాపాడుతున్న ఎందరో మహనీయులైన వారి చిత్రపటాలు సేకరించి, ప్రదర్శనగా ఉంచాం. ప్రక్కనే వారు మాతృభాష కోసం చేసిన కష్టాన్ని క్లుప్తంగా రాసి, ఉంచాం. – గిడుగు, గురజాడ వంటి మహనీయులకు పెద్దపీట వేసాం. ఆ సభకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త “ఆర్ష విద్యాసాగర్, మధురభారతి” శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిని ఆహ్వానించాం. వారి ఉపన్యాసం ఎలా సాగిందంటే బీడునేల మీద వాన చినుకులు పడిన విధంగా మమ్మల్ని ఉత్తేజితులను చేసింది. ఆ తర్వాత మాలో కొంతమంది మాతృభాష గొప్పదనాన్ని గురించి మాట్లాడారు.

అలాగే మీ పాఠశాలలో జరిగిన విశేషాలను లేఖ వ్రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా:
డి. ప్రవీణ్ కుమార్,
8వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
బాపట్ల, గుంటూరు జిల్లా.

14. ‘అమ్మకు వందనం’ కార్యక్రమంలోని విశేషాలను తెలుపుతూ సోదరికి లేఖ
జవాబు:

చెరుకూరు,
xxxxx

ప్రియమైన పద్మావతి అక్కకు,

మేము ఇక్కడ క్షేమం. మీరు అక్కడ క్షేమమని తలుస్తాను. నేను బాగా చదువుతున్నాను. ఇటీవల మా పాఠశాలలో ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి తల్లిని పిలిపించారు. ఆ తల్లులకు వారి పిల్లల చేత కాళ్ళు కడిగించి, పాదాల మీద పూలు వేసి, నమస్కరించమన్నారు. మేమంతా అట్లా చేసి, అమ్మల ఆశీస్సులు తీసుకొన్నాము. నేను, మరికొంతమంది విద్యార్థులు అమ్మ గొప్పదనాన్ని గురించి మాట్లాడాము. అమ్మ కళ్ళలో ఏదో తెలియని ఆనందం కనిపించింది. దానిని ఎప్పుడూ పోకుండా చూసుకోవాలని అనుకున్నాను. బావగారు, పిల్లలు ఏం చేస్తున్నారు? అందరినీ అడిగానని చెప్పు.

ఇట్లు,
నీ తమ్ముడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
ఎస్. పద్మావతి,
W/o ఎస్. పూర్ణచంద్ర,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

15. శ్రవణకుమారుడు ముసలివాళ్ళైన తన తల్లిదండ్రులను మోస్తూ పుణ్య క్షేత్రాలన్నింటినీ సర్శింపజేసాడు కదా! ఆయనలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో తెలియజేస్తూ మిత్రునకు లేఖ రాయి.
జవాబు:

లేఖ

కడప,
xxxxx

మిత్రుడు శంకర్ కు,
మిత్రమా! నీ లేఖ చేరింది. నీవు మీ తల్లిదండ్రులతో తిరుపతి వెళ్ళివచ్చానని రాశావు. సంతోషం. మనం పెద్ద వారం అయ్యాక మన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో పెంచి పెద్ద చేస్తారు. ఎంతో కష్టపడి మనకు చదువు చెప్పించి, మనకు కావలసినవన్నీ వారు కొని పెడతారు. తల్లిదండ్రుల ఋణాన్ని తీర్చుకోడం చాలా కష్టము.

మనం మన ముసలి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్చవద్దు. మనం వారిని మన ఇంట్లోనే ఉంచుకొని వారికి కావలసిన అవసరాలను తీర్చుదాం. కనీసం నెలకు ఒకసారి వారిని డాక్టర్లకు చూపిద్దాం. రోజూ వారితో కూర్చుని భోజనం చేద్దాం. వారి అవసరాలను అడిగి తెలుసుకుందాం… వారిని వారానికి ఒకసారి గుడికి తీసుకువెడదాం.

సెలవుల్లో వారికి కాశీ, రామేశ్వరం, తిరుపతి తీసుకువెడదాం. తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు వారిని గౌరవిద్దాం. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కె. రవికుమార్.

చిరునామా:
ఎన్. శంకర్, 7వ తరగతి,
జి.ప. హైస్కూలు, ప్రొద్దుటూరు, కడప.

AP Board 7th Class Telugu లేఖలు

16. తెలుగు భాష గొప్పదనాన్ని గూర్చి ‘తెలుగు వెలుగు’ పాఠం ఆధారంగా మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

లేఖ

కాకినాడ,
xxxx

మిత్రుడు పి. రాజారావుకు,

శుభాభినందనలు. మిత్రమా! నీకు ఈ లేఖలో మన మాతృభాష తెలుగు యొక్క గొప్పదనాన్ని గూర్చి వ్రాస్తున్నాను. మన మాతృభాష తెలుగు భాష. తెలుగు భాష తేనెకన్న తీపిదనం కలది. తెలుగు భాషలో ఎన్నో చమత్కారాలు ఉన్నాయి. “దేశ భాషలలో తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు. మన తెలుగు భాషలో పొడుపు కథలు. సామెతలు, జాతీయాలు, శబ్ద పల్లవాలు ఉన్నాయి. తెలుగు భాష, సంగీతానికి అనువైన భాష. తెలుగులో త్యాగయ్య కీర్తనలు వ్రాశాడు: తెలుగులో జోలపాటలు, సంకీర్తనలు ఉన్నాయి. జానపద గేయాలు, స్త్రీల పాటలు, బుర్ర కథలు, హరికథలు ఉన్నాయి.

తెలుగులో పద్యం పాడడానికి వీలుగా చక్కగా ఉంటుంది. తెలుగులో అవధాన ప్రక్రియ ఉంది. ఆశు కవిత్వం ఉంది. తెలుగు అజంత భాష. దీనిని పాశ్చాత్యులు ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని మెచ్చుకున్నారు. నేను తెలుగు పద్యాలు 500 చదువుతా. నీవు కూడా చదువు. సెలవుల్లో పద్యపఠనం పోటీ పెడదాం. మీ నాన్నగార్కి నమస్కారం. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కాంతారావు.

చిరునామా :
పి. రాజారావు,
S/o రమణరావు,
బాపూజీ నగర్, కొవ్వూరు,
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

17. వార్షికోత్సవమును గూర్చి సోదరునకు లేఖ

జగ్గయ్యపేట,
xxxxx

ప్రియ సోదరుడు శ్రీరాంకుమారు, ఈ ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాము. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను.

నిన్న మా పాఠశాల వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా రంగు రంగుల తోరణాలతో అలంకరించాము. సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభింపబడింది. ఈ సభకు మా ప్రాంతం ఎం.ఎల్.ఏ. గారు ముఖ్యఅతిథిగా వచ్చారు. మా ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నివేదిక చదివి వినిపించారు. ముఖ్య అతిథిగారు విద్యార్థులంతా బాగా చదువుకోవాలని చక్కని సందేశం ఇచ్చారు. ఆటల పోటీలలోనూ, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలోనూ గెలుపొందిన వారికి బహుమతులు పంచి పెట్టబడ్డాయి. ఆ తరువాత పిల్లలచే నాటికలు వేయబడ్డాయి.

మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం గూర్చి తప్పక లేఖవ్రాయి.

ఇట్లు,
నీ ప్రియ సోదరుడు,
ఆనంద్.

చిరునామా :
గార్లపాటి శ్రీరాంకుమార్,
7వ తరగతి,
ఎస్.పి.వి.కె.ఆర్. హైస్కూలు,
దొమ్మేరు, ప.గో. జిల్లా,
పిన్ : 534 351.

18. విహారయాత్రను గూర్చి స్నేహితునికి / స్నేహితురాలికి లేఖ

చీరాల,
xxxxx

ప్రియమైన స్వప్నకు,

శుభాకాంక్షలతో శశిరేఖ వ్రాయునది.
నేను గడచిన సెలవులలో హైదరాబాదు విహారయాత్ర చేసి వచ్చాను. అక్కడ చూడాల్సిన వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాలార్‌జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, నెహ్రూ జంతుప్రదర్శనశాల (జూ), చార్మినార్, బిర్లా ‘ మందిర్, అసెంబ్లీ హాల్, గోలకొండ మొదలైనవి చూసి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాల సౌందర్యాన్ని అందరూ తప్పక చూడవలసిందే. కాబట్టి హైదరాబాదును నీవు కూడా దర్శించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
శశిరేఖ.

చిరునామా :
కె. స్వప్న,
7వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ప్రత్తిపాడు,
గుంటూరు జిల్లా.

AP Board 7th Class Telugu లేఖలు

19. సెలవు కోరుతూ ప్రధానోపాధ్యాయునికి లేఖ

విజయవాడ,
xxxxxx

ప్రధానోపాధ్యాయుడు,
ఎ.కె.ఆర్. హైస్కూలు,
గవర్నరుపేట,
విజయవాడ – 2.

అయ్యా,
వినయపూర్వక నమస్కారం. మోహన ప్రసాద్ అనే నేను, తమ హైస్కూలులో ఏడవ తరగతి చదువుతున్నాను. నాకు గత నాల్గు రోజులుగా ఆరోగ్యం బాగా ఉండటం లేదు. డాక్టరుగారు చెన్నై వెళ్ళి వైద్యం చేయించుకోవలసిందిగా సలహాయిచ్చారు. అందువల్ల నేను పాఠశాలకు హాజరు కాలేకపోతున్నాను. తమరు దయతో నేటి నుంచి వారం రోజులు నాకు సెలవును మంజూరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తిరిగి రాగానే డాక్టరు సర్టిఫికేట్ అందిస్తాను. ..

ఇట్లు,
తమ విధేయుడు,
కె. మోహన ప్రసాద్,
7వ తరగతి.

20. పండుగను గురించి స్నేహితురాలికి లేఖ

శ్రీకాకుళం,
xxxxx

ప్రియ స్నేహితురాలు పద్మకు,

నేను బాగా ‘చదువుతున్నాను. నీ చదువు ఎలా సాగుతున్నది? నేను .ఈ లేఖలో నాకు బాగా నచ్చిన దీపావళి’ – పండుగను గురించి వ్రాస్తున్నాను. దీపావళి పండుగకు మా నాన్నగారు రకరకాల మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు . ఎన్నో తీసుకువస్తారు. నేను మా అన్నయ్య, మా తమ్ముడు ముగ్గురం కలిసి, సరదాగా కాలుస్తాం. మేము పువ్వొత్తులు కాలుస్తుంటే మా తల్లిదండ్రులు చూసి ఎంతో ఆనందిస్తారు. కాంతులను విరజిమ్మే ఈ పండుగ అంటే నాకెందుకో చెప్పరానంత ఇష్టం.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
ఆర్. స్వప్న.

చిరునామా :
జి. పద్మ,
7వ తరగతి,
బాలికల పాఠశాల,
తిరుపతి, చిత్తూరు జిల్లా.

21. పుస్తకాలు కొనడానికి రూ. 100/-పంపమని కోరుతూ నాన్నగారికి లేఖ

చిత్తూరు,
xxxxx

పూజ్యులైన నాన్నగారికి,
నమస్కారాలు. నేను ఇక్కడ బాగానే చదువుతున్నాను. వచ్చే నెలలో మా కామన్ ఎగ్జామినేషన్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ఫీజు ఈ నెలాఖరులోపు కట్టాలి. పరీక్షకు సంబంధించిన కొన్ని పుస్తకాలు కూడా కొనాల్సిన అవసరం ఉంది. కాబట్టి ధయయుంచి వెంటనే రూ. 100/- మనియార్డరు ద్వారా పంపవలసినదిగా ప్రార్థిస్తున్నాను. నేను తమ్ముళ్ళనూ, చెల్లాయినీ అడిగినట్లు చెప్పగలరు. అమ్మగారికి నా నమస్కారాలు.

ఇట్లు,
మీ కుమారుడు,
ఐ. గణేష్.

చిరునామా :
ఐ. జగన్నాధరావు గారు,
చలమాజీ & కంపెనీ,
న్యూ గాజువాక,
విశాఖపట్నం.

22. స్వాతంత్ర్య దినోత్సవ లేఖ (జాతీయ పర్వదినం)

అనంతపురం,
xxxxx

ప్రియ స్నేహితురాలు శశిరేఖకు,

నీ ఉత్తరం ఇప్పుడే అందింది. సంతోషం. మేము గడచిన ఆగస్టు 15వ తేదీనాడు మా పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకొన్నాము. మున్సిపల్ కమీషనర్ గారు ముఖ్యఅతిథిగా వచ్చి, జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మనదేశానికి స్వాతంత్ర్యం లభించిన విధానాన్ని చక్కగా వివరిస్తూ ఉపన్యసించారు. తరువాత మా’ ప్రధానోపాధ్యాయుడూ మరికొంతమంది ఉపాధ్యాయులూ, విద్యార్థులు కూడా ఉపన్యసించారు. చివరకు విద్యార్థులందరికీ స్వీట్సు పంచిపెట్టబడ్డాయి.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
పి. దివ్య.

చిరునామా :
కె. శశిరేఖ,
7వ తరగతి,
మున్సిపల్ హైస్కూలు,
చీరాల, ప్రకాశం జిల్లా.

AP Board 7th Class Telugu లేఖలు

23. సోదరి వివాహానికి మిత్రుని ఆహ్వానిస్తూ

అమలాపురం,
xxxxx

ప్రియ మిత్రమా,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. ఈ నెల 28వ తారీఖున మా సోదరి వివాహం తిరుపతిలో జరుగుతుంది. కాబట్టి నీవు తప్పక రావలసిందిగా కోరుతున్నాను. మీ నాన్నగారికీ, అమ్మగారికీ నా నమస్కారములు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
ఆర్. మోహన్.

చిరునామా:
గార్లపాటి లక్ష్మీనారాయణ,
S/o డా. శ్రీనివాసరావు గారు,
ఫిజిక్స్ లెక్చరర్,
లయోలా కాలేజి,
విజయవాడ.

24. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను వివరిస్తూ మిత్రునకు లేఖ

నెల్లూరు,
xxxxx

ప్రియ మిత్రమా,
నేను. బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగుగా చదువుతున్నావని తలుస్తాను. గడచిన సోమవారం మా నెల్లూరు పట్టణంలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించబడింది. జిల్లాలోని నాలుగు మూలల నుండి, వివిధ పాఠశాలల బాలబాలికలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థులచే తయారుచేయబడ్డ రకరకాల నమూనాలు ఇందులో ప్రదర్శింపబడ్డాయి. మా పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి లభించింది. ఆ ఆనందంతో నీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
వి. కోటేశ్వర్.

చిరునామా :
కోట శ్రీధర్ కుమార్,
7వ తరగతి,
టౌన్ హైస్కూలు,
గుడివాడ, కృష్ణా జిల్లా.

25. రిపబ్లిక్ దినోత్సవ లేఖ (గణతంత్ర దినోత్సవం)

కందుకూరు,
xxxxx

ప్రియ స్నేహితుడు మోహన్ బాబుకు,
గడచిన జనవరి 26న, మా పాఠశాలలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకొన్నాం . నాటి సమావేశానికి మా జిల్లా విద్యాశాఖాధికారి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆయన భారత రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని గూర్చి చక్కగా ఉపన్యసించారు. సభా ప్రారంభానికి ముందు జాతీయ జెండాను ఎగురవేసి జెండాగీతాన్ని పాడాం. ‘జనగణమన’తో సభా కార్యక్రమం ముగిసింది. చివరిలో అందరికీ స్వీట్సు పంచిపెట్టబడ్డాయి.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
వి. రాజేంద్ర ప్రసాద్.

చిరునామా :
జి. మోహన్ బాబు,
7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

26. తరగతి ఉపాధ్యాయునకు సెలవు చీటీ

కావలి,
xxxxx

7వ తరగతి ఉపాధ్యాయుల వారికి,
ఆర్. సి. యం. హైస్కూలు,
కావలి.

అయ్యా,
గడచిన రాత్రి నుండి నేను తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నాను. డాక్టరుగారు రెండు రోజులు విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా ఇచ్చారు. కనుక దయ ఉంచి ఈ రోజు, రేపు సెలవును మంజూరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
మీ విధేయుడు,
ఎస్. రాజారాం ,
7వ తరగతి.

AP Board 7th Class Telugu లేఖలు

27. పుస్తక విక్రేతకు లేఖ

కొవ్వూరు,
xxxxx

మేనేజర్,
వి.జి.యస్. పబ్లిషర్స్,
విజయవాడ – 1.

అయ్యా !,
నేను ఈ క్రింద తెలియజేసిన పుస్తకాలను సాధ్యమైనంత త్వరలో రిజిష్టర్డ్ పోస్టుద్వారా పంపించవలసినదిగా ప్రార్థిస్తున్నాను. పుస్తకాలపై ఇచ్చే కమిషన్ తగ్గించి మిగతా పైకమును చెల్లించగలవాడను.
1) 7వ తరగతి తెలుగు క్వశ్చన్ బ్యాంక్ – 10 కాపీలు
2) 7వ తరగతి ఇంగ్లీషు క్వశ్చన్ బ్యాంక్ – 10 కాపీలు
3) 7వ తరగతి గణితశాస్త్రం క్వశ్చన్ బ్యాంక్ – 10 కాపీలు
4) 7వ తరగతి సామాన్యశాస్త్రం క్వశ్చన్ బ్యాంక్ – 10 కాపీలు

ఇట్లు,
తమ విధేయుడు,
జి.యస్. కుమార్,
డోర్ నెం. 4-16-72,
-కొవ్వూరు,
ప.గో. జిల్లా.

చిరునామా:
మేనేజర్,
వి.జి.యస్. పబ్లిషర్స్,
తమ్మిన కృష్ణ వీధి,
విజయవాడ – 520 001.

28. జలల దినోత్సవం గురించి మిత్రునకు లేఖ

ఒంగోలు,
xxxxx

ప్రియ మిత్రుడు సతీష్ కు,
మా పాఠశాలలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న ‘బాలల దినోత్సవం’ బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకున్నాం. చాచా నెహ్రూగారి జయంతి సందర్భంగా భారతదేశమంతటా ఈ బాలల దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. నెహ్రూగారికి చిన్న పిల్లలన్నా, గులాబీ పూలన్నా ఇష్టం. అందువల్ల ఆయన పుట్టినరోజున ఈ కార్యక్రమం అందరూ జరుపుకుంటారు. ఈ సందర్భంగా మా పాఠశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు కూడా నిర్వహింపబడ్డాయి. నాకు తెలుగు వ్యాసరచనలో ప్రథమ బహుమతి లభించింది.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
దివాకర్.

చిరునామా:
పి. సతీష్, 7వ తరగతి,
మున్సిపల్ హైస్కూల్,
చీరాల, ప్రకాశం జిల్లా,

AP Board 7th Class Telugu లేఖలు

29. గురుపూజోత్సవం గురించి మిత్రునకు లేఖ

కర్నూలు,
xxxxx

ప్రియమిత్రుడు ఆనంద్ కు,
గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవ దినంగా ప్రకటించింది కదా! మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరినీ ఆ రోజున ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నా కెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజారాం.

చిరునామా:
ఎస్. ఆనంద్,
7వ తరగతి,
జిల్లాపరిషత్ హైస్కూలు,
కొండపల్లి, కృష్ణా జిల్లా.

30. శతక పద్యాలు మానవీయ విలువలను పెంచుతాయి. దీన్ని సమర్థిస్తూ మిత్రునికి లేఖ రాయండి.

శ్రీకాకుళం,
xxxxxxx

ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు,
శుభాకాంక్షలు. నేను బాగానే ఉన్నాను. నీవు కూడా బాగానే ఉన్నావని ఆశిస్తున్నాను. నేను ఈ లేఖలో శతక పద్యాల ప్రాధాన్యాన్ని గురించి తెలియజేస్తున్నాను. శతక పద్యాలు విద్యార్థుల్లో సత్ప్రవర్తనను కలిగిస్తాయి. మానవీయ సంబంధాలను పరిపుష్టం చేస్తాయి. సమాజం పట్ల గౌరవాన్ని, సేవాదృక్పధాన్ని కలిగిస్తాయి. అందువల్ల శతక పద్యాలను అందరు చదువాలి. ఆదర్శవంతులుగా తయారవ్వాలి. నీవు కూడా శతక పద్యాలను చదివి అందరికి ఆదర్శంగా నిలిచే గుణాలను పెంపొందించుకుంటావని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
వి. మనోజ్ఞ.

చిరునామా :
వి.సతీష్,
7వ తరగతి,
నిర్మలా హైస్కూల్,
ఏలూరు,
పశ్చిమ గోదావరి జిల్లా.

31. చదువు ప్రాధాన్యతను తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.

నెల్లూరు,
xxxxxxx

ప్రియమైన మిత్రుడు రామారావుకు,
శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఎంతోమంది పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారు. వివిధ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. చదువుకోవలసిన వయస్సులో పనులు చేస్తున్నారు. నేను ఈ విషయాన్ని గుర్తించి బాలకార్మికులుగా — ఉన్నవారిని బడిలో చేర్పించాను. చదువు అవసరాన్ని వివరించి చెప్పాను. చదువు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాను. నీవు కూడా బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించు. వారందరికి చదువు ప్రాధాన్యతను వివరించు. ,పెద్దలకు నమస్కారాలు తెలుపు.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.చంద్రశేఖర్.

చిరునామా :
కె. రామారావు,
7వ తరగతి,
ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల,
దక్షారామం, తూర్పుగోదావరి జిల్లా.

32. మాతృభాషా దినోత్సవం గూర్చి మిత్రునకు లేఖ

చెరుకూరు,
xxxxx

ప్రియ మిత్రుడు ప్రవీణ్ కుమార్‌కు,
ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ఇటీవల మా పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ‘ఫిబ్రవరి 21 న బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా చక్కనైన సూక్తులు రాసిన చార్టులు తగిలించి, అలంకరించాం. మన మాతృభాషను కాపాడిన, కాపాడుతున్న ఎందరో మహనీయులైన వారి చిత్రపటాలు సేకరించి, ప్రదర్శనగా ఉంచాం. ప్రక్కనే వారు మాతృభాష కోసం చేసిన కష్టాన్ని క్లుప్తంగా రాసి, ఉంచాం. గిడుగు, గురజాడ వంటి మహనీయులకు ‘పెద్దపీట వేసాం. ఆ సభకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త “ఆర్ష విద్యాసాగర్, మధురభారతి” శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిని ఆహ్వానించాం. వారి ఉపన్యాసం ఎలా సాగిందంటే బీడునేల మీద వాన చినుకులు పడిన విధంగా మమ్మల్ని ఉత్తేజితులను చేసింది. ఆ తర్వాత మాలో కొంతమంది మాతృభాష గొప్పదనాన్ని గురించి మాట్లాడారు.

అలాగే మీ పాఠశాలలో జరిగిన విశేషాలను లేఖ వ్రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
డి. ప్రవీణ్ కుమార్,
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
బాపట్ల, గుంటూరు జిల్లా.

AP Board 7th Class Telugu లేఖలు

33. ‘అమ్మకు వందనం’ కార్యక్రమంలోని విశేషాలను తెలుపుతూ సోదరికి లేఖ

చెరుకూరు,
xxxxx

ప్రియమైన పద్మావతి అక్కకు,
మేము ఇక్కడ క్షేమం. మీరు అక్కడ క్షేమమని తలుస్తాను. నేను బాగా చదువుతున్నాను. ఇటీవల మా పాఠశాలలో ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి తల్లిని పిలిపించారు. ఆ తల్లులకు వారి పిల్లల చేత కాళ్ళు కడిగించి, పాదాల మీద పూలు వేసి, నమస్కరించమన్నారు. మేమంతా అట్లా చేసి, అమ్మల ఆశీస్సులు తీసుకొన్నాము. నేను, మరికొంతమంది విద్యార్థులు అమ్మ గొప్పదనాన్ని గురించి మాట్లాడాము. అమ్మ కళ్ళలో ఏదో తెలియని ఆనందం కనిపించింది. దానిని ఎప్పుడూ పోకుండా చూసుకోవాలని అనుకున్నాను. బావగారు, పిల్లలు ఏం చేస్తున్నారు? అందరినీ అడిగానని చెప్పు.

ఇట్లు,
నీ తమ్ముడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
ఎస్. పద్మావతి,
w/o ఎస్. పూర్ణచంద్ర,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

II. (స్వీయరచన – వ్యవహార రూపాలు)

1. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి కదా! మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో తెలియజేస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

పరిసరాల పరిశుభ్రత

మిత్రులారా! చదవండి.

రోగం వస్తే చేంతాడంత క్యూలో నిలబడి, డాక్టర్లను కలిసి, మనం గుప్పెళ్ళు కొద్దీ మందు బిళ్ళలను మ్రింగుతాం. ఆ మందులు మ్రింగడం వల్ల తాత్కాలికంగా తగ్గినా కొత్త రోగాలు పుట్టుకు వస్తున్నాయి.

అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయనే దాని గురించి మనం శ్రద్ధ తీసుకోము. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఇంటి చుట్టూ, మన వీధిలో మన రోడ్డు ప్రక్క మురికి కాలువలో, తుక్కు పేరుకుపోయి, దోమలు వ్యాపించడం వల్లే, మలేరియా, డెంగ్యూ, హెపటైటిస్ వంటి భయంకర వ్యాధులు వస్తున్నాయి.

మనం ఇంటిని నిత్యం తుడుచుకుంటాం. అలాగే మన ఇంటి చుట్టూ శుభ్రం చేయాలి. మన రోడ్డును శుభ్రంగా ఉంచాలి. మన ఇంటివద్ద మురికి కాలువలను శుభ్రం చేయాలి. తుక్కు తుడిచి రోడ్లపై వేయకుండా పంచాయితీ, లేక మునిసిపల్ బళ్ళల్లో పోయాలి. దోమల మందులు చల్లాలి. ముగ్గు చల్లాలి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం మన వద్దకు రాదు. అందుకే మన ప్రధాని ‘స్వచ్ఛభారత్’ నినాదం చేశారు. మనం ప్రతిజ్ఞ చేద్దాం. మన ఇంటిని, మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. రోగాలను తరిమి కొడదాం. ‘జై స్వచ్ఛభారత్’

దివి. xxxxxx
కందుకూరు.

ఇట్లు,
స్వచ్ఛభారత్ గ్రామ కమిటీ

2. దోమల నిర్మూలన చేస్తే అసలు అంటురోగాలు మన దగ్గఱకే రావు. దోమలను నిర్మూలించే ఉద్యమం చేపట్టాలని కరపత్రం తయారు చెయ్యండి.
జవాబు:

స్నేహితులారా! ఈనాడు మన పరిసరాల్లో పెరిగిపోయిన దోమలవల్ల అనేక భయంకర రోగాలు సమాజంలో ప్రబలిపోతున్నాయి. మలేరియా, డెంగ్యూ, హెపటైటిస్ ఎ, బి, లు వంటి రోగాలన్నింటికీ దోమలే కారణం.

మన ఇల్లు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్లనే, దోమలు ప్రబలిపోతున్నాయి. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. మరుగుదొడ్ల గొట్టాలకు తెరలు కడదాం. దోమలు రాకుండా ‘ఆల్ అవుట్’ వంటి వాటిని వాడదాం. దోమల చక్రాలు వెలిగిద్దాం. నిత్యం మన రోడ్డుపై తుక్కు తొలగించేలా శ్రద్ధ తీసుకొందాం. మురికి కాలువలు నిత్యం శుభ్రం చేసేలా చర్యలు చేపడదాం. క్రిమిసంహారక మందులు చల్లుదాం.

వారంవారం, మన వాడలోని వారంతా కలసి ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం చేపడదాం. దోమలు వ్రాలడానికి వీలు లేకుండా, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుదాం. దోమల నిర్మూలనకు కంకణం కట్టుకుందాం. రోగాలను తరిమి కొడదాం. రోజూ మురికి కాలువలు శుభ్రం చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం.

పేరూరు,
దివి. xxxxxx

ఇట్లు,
గ్రామ పంచాయితీ,
ఆరోగ్య రక్షణ సమితి.

AP Board 7th Class Telugu లేఖలు

3. ‘ఆలోచనం’ గేయం మీ తరగతిలో ఎవరు బాగా పాడారు ? ఎవరు బాగా అభినయించారు ? వారిని ప్రశంసిస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

ఒంగోలు,
xxxxx

మిత్రుడు రవికుమార్‌కు,

మిత్రమా ! నీ లేఖ చేరింది. మీ అమ్మానాన్నలు కుశలం అని తలుస్తాను. ఈ మధ్య మా తరగతిలో గేయ పఠనం పోటీలు, అభినయం పోటీలు మా టీచర్ సుజాత గారు పెట్టారు. గేయ పఠనంలో నా మిత్రుడు ‘రాజా’ మొదటి బహుమతి పొందాడు. నిజంగా వాడు గేయం పాడుతూ ఉంటే, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నట్లు అద్భుతంగా ఉంది.

అలాగే అభినయం పోటీల్లో నా స్నేహితురాలు ‘కమల’ అద్భుతంగా నటించింది. కమల ఎప్పటికైనా సినిమాలలో నటిస్తుందని అనుకుంటున్నాను. ఆరోజు మా తరగతి .పిల్లలంతా ‘రాజా, కమలల’కు టీ పార్టీ ఇచ్చాము. మా సుజాత టీచర్ వాళ్ళిద్దరినీ గొప్పగా మెచ్చుకున్నారు. ఉంటా.
విశేషాలతో లేఖ రాయి.

నీ ప్రియమిత్రుడు,
రవికృష్ణ,

చిరునామా :
K. రవికుమార్,
S/o. బలరామ్ గారు,
మున్సిపల్ స్కూలు,
కడప.

4. చెట్ల పెంపకం గురించి శ్రద్ధ తీసుకోవాలని కరపత్రం తయారు చేయండి.
జవాబు:

చెట్లు ప్రగతికి. మెట్లు. పచ్చని చెట్లు, ఆరోగ్య సంజీవనులు. ఈ రోజు దేశంలో ఎక్కడ చూసినా పరిశుభ్రమైన గాలికి, నీటికి కొరత ఉంది. దీనికి కారణం, వర్షాలు లేకపోవడం, చెట్లు లేకపోవడం. మంచి వర్షాలు కురిస్తే, చెట్లు మొలుస్తాయి. చెట్లు పెంచితే, చల్లని ప్రాణవాయువు లభిస్తుంది. వర్షాలు కురుస్తాయి. దేశంలో 1/3 వంతు భాగంలో అడవులు ఉంటే, సకాలంలో చక్కని వర్షాలు పడతాయి.

చెట్లు మనం విడిచే కార్బన్ డై ఆక్సెడ్ ను పీల్చుకొని, మనకు ప్రాణవాయువును ఇస్తాయి. చెట్ల వల్ల పండ్లు, కాయలు, కూరగాయలు, కలప, తేనె వగైరా లభిస్తాయి. మంచి పువ్వులు దొరుకుతాయి. పండ్లు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెట్లు దేశ భవితకు మెట్లు.

కాబట్టి ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెంచుదాం. దేశంలో వాతావరణంలో సమతుల్యతను సాధిద్దాం. చెట్లు మనకు కావలసిన అన్ని వస్తువులను ఇస్తాయి. చెట్లను కొట్టడం నేరం. ప్రతి బడిలోనూ, రోడ్డు ప్రక్కనూ, ఖాళీ స్థలాల్లోనూ కాలువ గట్ల వెంబడిని, చెట్లను ఉద్యమంగా నాటుదాం. పెంచుదాం. రండి. కదలిరండి.

దివి. xxxxxx,

ఇట్లు,
వన సంరక్షణ సమితి,
గన్నవరం.

AP Board 7th Class Telugu వ్యాసాలు

SCERT AP Board 7th Class Telugu Guide వ్యాసాలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu వ్యాసాలు

II. స్వీయరచన – వ్యవహార రూపాలు

1. నీకు నచ్చిన కవి గూర్చి వ్యాసరూపంగా రాయండి.
జవాబు:
నాకు నచ్చిన కవి
“రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొక తార గగన మెక్కె
రాజు జీవించు రాతి విగ్రహముల యందు
సుకవి జీవించే ప్రజల నాలుకల యందు !”

అంటూ తన కవితాకేతనాన్ని తెలుగు సాహితీ గగనాన సముజ్వలంగా ఎగురవేసిన కవి చక్రవర్తి జాషువా. ఈ కవి అంటే నాకు చాలా ఇష్టం. ఈయన 1895 సెప్టెంబరు 28న గుంటూరు జిల్లా వినుకొండలో వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించాడు. చిన్ననాటి నుండి సమాజంలోని అసమానతలను చూసి, అనుభవించి, బడుగుల బతుకు వెతలను అనన్య సామాన్యంగా పద్యరూపంలో చిత్రించిన అసాధారణ కవి జాషువా. మూఢ విశ్వాసాలపై తిరుగు బావుటాను ఎగురవేశాడు. ఈ విశ్వమే మమతల మందిరం కావాలని అభిలషించిన నిత్య సత్య కృషీవలుడు జాషువా.”

పద్యం, గద్యం, పాట, మాట….. అన్నీ ఆయన మస్తిష్క అక్షయపాత్ర నుండి మనకు వడ్డించిన అమృతాన్నాలే. పద్య గద్య విద్యలతో అప్రతిహతంగా శరసంధానం చేసిన సవ్యసాచి జాషువా. నాటక రచనలోను తనదైన శైలిలో రవ్వలు రాల్చి గరగరల్ పచరించిన దిట్టగా గణుతికెక్కాడు.

జాషువా కలం నుంచి వెలువడ్డ అసంఖ్యాక రచనల్లో “గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్, గిజిగాడు, శ్మశాన వాటిక” మొదలైన రచనల ద్వారా తెలుగు లోకానికి ఆప్తులయ్యారు. వీరి ‘క్రీస్తు చరిత్ర’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కళాప్రపూర్ణ, పద్మభూషణ్, కవికోకిల, కవితా విశారద, నవయుగ కవితా చక్రవర్తి” అంటూ ఆంధ్రదేశం కీర్తించింది. 1951లో గుంటూరులో కనకాభిషేకంతో గజారోహణం, గండపెండేరంతో ఈ తెలుగునేల సత్కరించింది. “వడగాడ్పు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వం” అని చాటిన ‘విశ్వనరుడు’ జాషువా.

2. ‘పోలమ్మ’లాంటి గుండెధైర్యం ఉన్న స్త్రీలు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో మీకు తెలిసిన ఒకరి గురించి, వారి కష్టం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
మన భారతదేశంలో స్త్రీలను శక్తి స్వరూపిణులుగా భావిస్తారు. దేశాభివృద్ధికి స్త్రీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నిలబడుతున్నారు. మనదేశంలో స్త్రీలు అన్ని రంగాలలోను సాధిస్తున్న విజయాలు కోకొల్లలు. యువతను సక్రమ మార్గంలో నడిపించాలన్నా, విద్యాబుద్ధులు నేర్పాలన్నా స్త్రీ పాత్ర ప్రధానమైనది. అలాంటి స్త్రీలు వంచనకు గురై బలౌతున్నారు. వారిలో కొందరే తమ సమస్యలను అధిగమించగల్గుతున్నారు. దేశానికి రైతు ఎంత అవసరమో ఇంటికి ఇల్లాలు అంతే.

మా ఊరిలో ఇటీవల ఒక రైతు మరణించాడు. చాలా అప్పులు ఉన్నాయి. అతని భార్య అప్పులవాళ్ళతో రెండు సంవత్సరాలు ఆగమని, సాగు చేసి ఋణం తీరుస్తానని చెప్పింది. ఆ మాటలకు అక్కడున్న వాళ్ళంతా ఆడదానివి నీవు వ్యవసాయం చేస్తావా ? అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఆవిడ వారి మాటలను ప్రేరణగా తీసుకొని . వ్యవసాయం మొదలు పెట్టింది. నిజంగానే రెండేళ్ళలోనే వారి అప్పులు తీర్చింది. ఆ తర్వాత ఆమె సొంత ట్రాక్టరు కొన్నది. నవ్విన వాళ్ళే ఆశ్చర్యపోయేటట్లు నలుగురికి ఆదర్శంగా నిలిచింది.

AP Board 7th Class Telugu వ్యాసాలు

3. లలితకళల్లో నీకు నచ్చిన అంశం గురించి వ్యాసం రాయండి.
జవాబు:
లలితకళలు తెలుగు సంప్రదాయానికి పట్టుకొమ్మలు. భారతీయ సంస్కృతికి నిలువుటద్దాలు. పూర్వం నుండి మానవుడు తన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఎన్నో పద్ధతులను అనుసరిస్తున్నాడు. మానవ హృదయానికి ఆనందాన్ని కలిగించేవి లలితకళలు. లలితకళలను ఆంగ్లంలో FINE ARTS అంటారు. ‘సాహిత్యం , సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం’ ఇవి లలితకళలు. వీటిలో సంగీతం అంటే నాకు చాలా ఇష్టం.

సంగీతం – శ్రవణేంద్రియముల ద్వారా మనస్సుకు ఆనందం కలిగిస్తుంది. ఈ సంగీతం. ఇది కేవల స్వరమయమైనది. తాళ, లయ ఆశ్రయమైనది. ఇది మానవులనే కాక ప్రాణవంతమైన జంతుజాలమునంతను తన వైపు ఆకర్షించుకొనగలదు. అందుచేతనే …… శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి:….. అను నానుడి ఏర్పడింది. సప్తస్వరాల సమ్మేళనంతో మనస్సుకు సంగీతం ఆనందాన్ని అందిస్తుంది. సంగీతానికి మోళ్ళు చిగురిస్తాయి. పాములు పడగ విప్పి నాట్యం చేస్తాయి. ఏడ్చే పసిపాప హాయిగా నిద్రిస్తుంది. మనకు అన్నమయ్య, త్యాగయ్య, రామదాసులు ఉన్నారు. నేడు ఘంటసాల, మంగళంపల్లి, బాలు, ఏసుదాసు, సుశీల, జానకి, చిత్ర వంటి సంగీత , గాయకులూ ఉన్నారు.

4. కోవిడ్ – 19

సార్స్ వైరస్ కుటుంబమైన కోవిద్ – 19కు చెందినది కరోనా వైరస్. ఇది 2019 డిసెంబర్ లో చైనాలోని వూహాలో బయటపడింది. అప్పటినుండి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. అనేక లక్షల మంది మరణానికి కారణమైంది. ప్రపంచం పాలిట మహమ్మారిగా నిలిచింది.

ఇది ఇన్ఫెక్షన్ కలిగించే వైరస్. కరోనా వైరస్ సోకితే జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు, రుచి, వాసన తెలియకపోవడం మొదలైన లక్షణాలుంటాయి. దీనిని నిర్ధారించడానికి RT. P CR పరీక్ష,

CT స్కాన్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష వంటివి చేస్తారు. కరోనా వైరస్ సోకితే సుమారు 5 రోజులు నుండి 10 నెలల వరకు కూడా మందులు వాడవలసి రావచ్చును.

ఇంట్లో ప్రత్యేక గదిలో ఉండాలి. ఎవరితోనూ ఏవిధంగా కలిసిమెలిసి తిరగకూడదు. కనీసం 14 రోజులు అలా ఉండాలి. తర్వాత పరీక్షించుకొని కరోనా వైరస్ లేదని తేలితే మరొక 20 రోజులు బైటకు రాకూడదు.

వ్యాక్సిన్ వేయించుకోవాలి. మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. శానిటైజర్ వాడాలి. అనవసరంగా బైట తిరగకూడదు. జనసమూహాలలోకి వెళ్లకూడదు. అప్పుడు కరోనా వైరసను పూర్తిగా జయించవచ్చు.

జూలై 2021 నాటికి భారతదేశంలో 3 కోట్ల 4 లక్షలమందికి కరోనా సోకింది. 2 కోట్ల 95 లక్షలమంది కోలుకున్నారు. మూడు లక్షల 99 వేలమంది కరోనాతో మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా 18 లక్షల 90 వేల మందికి సోకింది. 18 లక్షల 40 వేల మంది కోలుకున్నారు. 12,706 మంది కరోనాతో మరణించారు.

అందుచేత కరోనా మన ప్రపంచానికి పట్టిన మహమ్మారిగా వైద్యులు పేర్కొన్నారు.

5. బాల్య వివాహాలు

బాల్యవివాహాలు అంటే చిన్నతనంలోనే పెళ్ళిళ్లు చేయడం. ఒకప్పుడు ఆటలాడుకొనే వయస్సులోనే పెళ్ళిళ్ళు చేసేవారు. బ్రిటిష్ ప్రభుత్వం శారదా చట్టం పెట్టి చిన్నతనంలో పెళ్ళి చేయరాదని నిషేధించింది.

బాల్యవివాహాలు మంచివి కావు. చిన్నతనంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. తల్లిదండ్రుల, అత్తమామల పెత్తనం సాగుతుంది. దానితో చిక్కులు వస్తాయి. 13, 14 ఏళ్ళ వయస్సులోనే వారికి సంతానం కలుగుతుంది. అందువల్ల ఆడువారికి ఆరోగ్యం పాడవుతుంది.

కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన యువతీయువకులకే పెళ్ళిళ్ళు చేయాలని నియమం పెట్టింది. భార్యాభర్తలు ఇద్దరూ పెద్దవారైతే వారు ఒకరినొకరు ప్రేమగా మంచిగా చూసుకుంటారు. వారు వారికి పుట్టిన పిల్లలను చక్కగా పెంచుతారు. వారి పిల్లలు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతారు. వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

కాబట్టి బాల్య వివాహాలను అరికట్టాలి. వయస్సు వచ్చిన పిల్లలకే పెళ్ళిళ్లు చేయాలి. అప్పుడు వారి జీవితాలు ఆనందంగా హాయిగా సాగుతాయి.

6. కాలుష్యం (లేదా) పర్యావరణం (లేదా) కాలుష్యం గురించి 3 పేరాలలో వ్యాసం రాయండి

మన పరిసరాలన్నీ కాలుష్యంతో నిండి పోతున్నాయి. దేశంలో జనాభా పెరిగిపోయింది. మానవ జీవితంపై, వారి ఆరోగ్యాలపై కాలుష్య ప్రభావం ఉంటుంది. కాబట్టి మన పరిసరాలనూ, మనం పీల్చేగాలినీ, నీటినీ, శుభ్రంగా ఉంచుకోవాలి.

పరిసరాలలో కాలుష్యం మూడు రకాలుగా ఉంటుంది. 1) జల కాలుష్యం 2) ధ్వని కాలుష్యం 3) వాతావరణ కాలుష్యం.
1) జలకాలుష్యం :
నదుల్లో, కాలువల్లో, చెరువుల్లో స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువుల్ని కడగడం మొదలయిన కారణాల వల్ల జలకాలుష్యం ఏర్పడుతోంది.

2) ధ్వని కాలుష్యం :
రోడ్లపై కార్లు, మోటారు కార్ల హారన్స్, యంత్రాల చప్పుళ్ళు, మైకుల హోరు మొదలైన వాటి వల్ల ధ్వని కాలుష్యం వస్తోంది.

3) వాతావరణ కాలుష్యం :
కర్మాగారాలూ, బస్సులూ, మొదలైన వాటి నుండి, విషవాయువులు పొగ రూపంలో గాలిలో కలిసి ‘వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. ప్రజలు శుభ్రత పాటించి, చెట్లను పెంచి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. వారు కాలుష్యం కోరలలో చిక్కుకోరాదు.

AP Board 7th Class Telugu వ్యాసాలు

7. వార్తా పత్రికలు

వార్తలను అందించే పత్రికలను వార్తాపత్రికలు అంటారు. ప్రాచీనకాలంలో వార్తలను చేరవేయడానికి మనుషుల్నీ, జంతువుల్నీ, పక్షుల్నీ వాడేవారు. విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందిన తరువాత ముద్రణాయంత్రాలు కనిపెట్టబడ్డాయి. వార్తాపత్రికల వ్యాప్తి జరిగింది.

ప్రపంచంలో మొట్టమొదటగా వెనిస్ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు. సుమారు క్రీ.శ. 1620 నాటికి వార్తాపత్రికలు వచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ‘ఇండియా గెజిట్’ అని కొందరూ, ‘బెంగాల్ గెజిట్’ అని కొందరూ చెబుతారు. 1850 నుంచి మన దేశంలో పత్రికల ప్రచురణ అధికమైంది.

వార్తాపత్రికలు అనేక భాషలలో వెలువడుతున్నాయి. మన తెలుగుభాషలో ఈనాడు, వార్త, సాక్షి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర మొదలైనవి బాగా ప్రచారంలో ఉన్న దినపత్రికలు.

వార్తాపత్రికలవల్ల లాభాలు చాలా ఉన్నాయి. వీటివల్ల దేశవిదేశవార్తలు తెలుసుకోవచ్చు. విజ్ఞానం పెరుగుతుంది. వీటివల్ల ప్రభుత్వం చేపట్టే పనులూ, లోపాలూ ప్రజలకి తెలియజేస్తాయి. ఇవి ప్రజల కష్టనష్టాలూ, సమస్యలూ, అభిప్రాయాలూ ప్రభుత్వానికి తెలియజేస్తాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ వార్తాపత్రికలు, కరదీపికలవంటివి. ఇవి జాతీయాభివృద్ధికీ, జాతి సమైక్యతకూ దోహదపడతాయి.

8. గ్రంధాలయాలు

తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల స్థలాన్ని గ్రంథాలయం అంటారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలు ఉన్నాయి. అమెరికాలోని ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోమ్ నగరంలోని వాటికన్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరు పొందాయి. మన దేశంలో చెన్నైలోని ‘కన్నెమరా’ గ్రంథాలయం, తంజావూరులోని ‘సరస్వతీ మహలు’, హైదరాబాదులోని ‘శ్రీకృష్ణదేవవూయాంధ్రభాషా నిలయం’, వేటపాలెంలోని ‘సారస్వత నికేతనం’ మొదలైనవి చెప్పుకోదగిన గ్రంథాలయాలు.

అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నాళం కృష్ణారావు మొదలైనవాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు. ఇప్పుడు ప్రతి విద్యాలయంలోనూ గ్రంథాలయాలున్నాయి.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి.

గ్రంథాలయాలవల్ల చాలా లాభాలున్నాయి. గ్రంథ పఠనంవల్ల విజ్ఞాన వినోదాలు పొందవచ్చు. అక్కడ లభించే దిన, వార, పక్ష, మాసపత్రికలను చదివి రాజకీయ, సాహిత్య, క్రీడారంగాది విషయాలు తెలుసుకోవచ్చు. గ్రంథాలయాలు మనిషిని మనీషిగా మారుస్తాయి. దేశాభ్యుదయానికీ, సమాజ వికాసానికీ మూలస్తంభాలు గ్రంథాలయాలు.

9. విజ్ఞాన యాత్రలు (విహార యాత్రలు)

విజ్ఞానాన్ని సంపాదించాలనే కోరికతో విద్యార్థులు చేసే యాత్రలను విజ్ఞాన యాత్రలు అంటారు. వీటినే ‘విహారయాత్రలనీ, వినోదయాత్రలనీ’ కూడా పిలుస్తారు.

పుస్తక పఠనంవల్ల పుస్తక జ్ఞానం, మాత్రమే లభిస్తుంది.. లోకానుభవం, ప్రజల ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరిగా చేయాలి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా గ్రహించాలంటే యాత్రలు చేయాలి. ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తుందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. జల విద్యుత్ కేంద్రానికి వెళ్ళి, పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాలను అర్థంచేసుకోవడానికి ఈ యాత్రలు ఎంతో అవసరం.

విజ్ఞాన యాత్రలవల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటివల్ల లోకజ్ఞానం అలవడుతుంది. మానసిక విశ్రాంతి లభిస్తుంది. విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు. విజ్ఞాన యాత్రల వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యార్థులలో ఐకమత్యం పెంపొందుతుంది.

విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం విద్యార్థులకే అనుకోవడం సరికాదు. అన్ని వయస్సుల వాళ్ళకీ, – అన్ని వృత్తుల వాళ్ళకీ ఇవి అవసరమే. పెద్దలు చేసే తీర్థయాత్రలు కూడా ఒక రకంగా విజ్ఞానయాత్రలే.

AP Board 7th Class Telugu వ్యాసాలు

10. చలనచిత్రాలు ( సినిమాలు)

చలనచిత్రాలు అంటే ‘కదిలే బొమ్మలు’ అని అర్థం. వీటినే సినిమాలు అంటారు. పూర్వం ప్రజల విజ్ఞాన వినోదాల కోసం తోలుబొమ్మలాటలు, భామా కలాపాలు, వీథినాటకాలు ప్రదర్శింపబడుతుండేవి.

కెమేరాలు కనిపెట్టబడ్డ తరువాత ‘మూకీ’ చిత్రాలు ప్రదర్శించేవారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన తరువాత ‘టాకీ’ చిత్రాలు వచ్చాయి. ప్రపంచంలో నేడు చలనచిత్రరంగాన హాలీవుడ్ పేరుగాంచింది. మన దేశంలో ముంబయి సినీరంగాన పేరుగాంచింది. చెన్నై, హైదరాబాదులు సినీ పరిశ్రమలో ముందున్నాయి.

ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదాన్ని పొందడానికి ఈ సినిమాలు ఉపయోగిస్తాయి. ప్రపంచంలోగానీ, దేశంలోగానీ ఉన్న వివిధ సుందర దృశ్యాల్ని సినిమాలలో చూసి ఆనందించవచ్చు. సినిమాలు సాంఘికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా గొప్ప ప్రచార సాధనాలు.

నేడు ఈ పరిశ్రమ పెక్కుమందికి జీవనోపాధిని కలిగిస్తున్నది. అనేకమంది నటీనటులు, కళాకారులు దీనివల్ల ధనవంతులవుతున్నారు. కార్మికులు, విద్యార్థులు, పిన్నలు, పెద్దలు అందరూ వీటిని చూసి మానసిక విశ్రాంతిని, వినోదాన్ని పొందుతున్నారు.

ఈ సినిమాలను సరైన పద్ధతిలో తీయకపోతే సమాజానికి చెడు కలుగుతుంది. కాబట్టి నిర్మాతలు కేవలం వ్యాపారదృష్టితోనే కాక, కళాత్మకపు విలువలను, నైతిక విలువలను పెంచే చిత్రాలను నిర్మించాలి.

11. రేడియో (ఆకాశవాణి)

రేడియోను ‘మార్కొని’ అనే ఇటలీ దేశస్థుడు 1895లో కనిపెట్టాడు. శబ్దతరంగాలను విద్యుత్తరంగాలుగా మార్చి నిస్తంత్రీ విధానంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఎక్కడెక్కడి విషయాలనూ తెలియజేసే అద్భుత సాధనం రేడియో.

మన దేశంలో రేడియో కేంద్రాలు పెద్ద పెద్ద నగరాలలో ఉన్నాయి. వాటిని బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్లు అంటారు. కొన్ని ఉపకేంద్రాలు ప్రసారం మాత్రమే చేస్తాయి. వాటిని రిలే కేంద్రాలు అంటారు.

రేడియోలో వార్తలు, సంగీతం, నాటకాలు, సినిమాలు, హరికథలు, ప్రసంగాలు, ప్రసారం చేయబడతాయి. అలాగే రైతులకు వ్యవసాయ కార్యక్రమాలు, మహిళలకు మహిళామండలి కార్యక్రమాలు, బాలబాలికలకు బాలానందం, యువకులకు యువవాణి కార్యక్రమాలు ప్రసారం చేయబడతాయి.

ఇంకా భక్తిరంజని కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, విద్యావిషయకమైన కార్యక్రమాలు, క్రీడలు, ధరవరలు, ప్రకటనలు మరెన్నోరకాల కార్యక్రమాలూ రేడియోలో ప్రసారం చేయబడతాయి. టీవీల వ్యాప్తి జరిగాక రేడియోలు * వెనుకబడ్డాయి. –

అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందిస్తూ, ప్రజలలో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాల్ని పెంపొందింపజేస్తున్న అద్భుతసాధనం రేడియో.

AP Board 7th Class Telugu వ్యాసాలు

12. దూరదర్శన్ (టీ.వీ)

విజ్ఞానశాస్త్ర ప్రగతికీ, మానవుడి ప్రతిభకీ నిదర్శనం టెలివిజన్. ఇది బ్రిటన్ లో 1936లో మొదట వ్యాప్తిలోకి వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్. బైర్డ్ 1928లో కనిపెట్టాడు.

రేడియోలో శబ్దాన్ని మాత్రమే వింటాం. శబ్దంతో పాటు దృశ్యాన్ని చూసే అవకాశం టెలివిజన్ లో ఉంటుంది. టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. నేడు టీవీ లేని ఇల్లు లేదు.

టీ.వీ. ల వల్ల చాలా లాభాలున్నాయి. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. దీనిద్వారా ప్రభుత్వమూ, వాణిజ్య సంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మనం స్వయంగా వెళ్ళి చూడలేని ప్రదేశాలెన్నో ఇందులో చూడవచ్చు.

విద్యారంగంలో, వైద్య రంగంలో, వాణిజ్య రంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో ఈనాడు టెలివిజన్ కు తిరుగులేని స్థానం ఉంది. నిరక్షరాస్యతా నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్. ‘వీడియో’ పరిజ్ఞానానికి టీవీ మూలకారణం. మన సంస్కృతిని, కళలను , కాపాడుకోవడానికి టీవీ ఎంతగానో ఉపయోగపడుతుంది.

టీ.వీల వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. అతి ఎక్కడా పనికిరాదు. టీవీలను ఎక్కువగా చూస్తూ కొందరు వృధా కాలయాపన చేస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతోంది. ఎక్కువగా చూడటంవల్ల కండ్ల జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

13. కంప్యూటర్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్ లో ‘డేటా’ ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్చితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్‌ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ వల్ల చాలా లాభాలున్నాయి. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు.

విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైనవాటి టిక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.

కంప్యూటర్‌ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు. ఆధునిక విజ్ఞాన ప్రగతికి నిదర్శనం కంప్యూటర్.

AP Board 7th Class Telugu వ్యాసాలు

14. ఒక పండుగ (దీపావళి)

మనం జరుపుకొనే ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసం కృష్ణపక్షంలో వస్తుంది. దీన్ని రెండు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు నరక చతుర్దశి. రెండోరోజు దీపావళి అమావాస్య. ఈ దీపావళి పండుగను మన దేశంలో అన్ని రాష్ట్రాలవారూ జరుపుకొంటారు.

నరక చతుర్దశిని గూర్చి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం నరకుడనే రాక్షసుడు లోకాల్ని బాధిస్తుండేవాడు. . . ఆ బాధలు భరించలేక ప్రజలు శ్రీకృష్ణుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకుడిపై యుద్ధానికి వెళ్ళి, వాడిని సంహరించాడు. నరకుడు మరణించినందుకు ప్రజలందరూ సంతోషించారు. అది చతుర్దశినాడు జరిగింది. కాబట్టి నరక చతుర్దశి అనే పేర పండుగ చేసుకున్నారు. నరకునివల్ల చీకటిలో మ్రగ్గిన ప్రజలు వెలుగు చూశారు. కాబట్టి దీపాల వెలుగులో మరునాడొక పండుగ చేసుకున్నారు.

నరక చతుర్దశి రోజు తెల్లవారు జామున లేచి పిల్లలు, పెద్దలు శిరస్నానం చేస్తారు. నూతన వస్త్రాలు ధరించి, పిండివంటలతో భోజనాలు చేస్తారు. ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. దీపావళి రోజు రకరకాల టపాకాయలు, మతాబులు, చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలవంటి మందు- సామానులు కాలుస్తారు. కొందరు దీపావళి పండుగరోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

15. లాల్ బహదూర్ శాస్త్రి (జాతీయ నాయకుడు)

లాల్ బహదూర్ 1904 వ సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన, వారణాసిలో జన్మించాడు. ఆయన తల్లి పేరు రామ్ దులారీదేవి. తండ్రి శారదా ప్రసాద్.

లాల్ బహదూర్ కాశీ విశ్వవిద్యాలయం నుండి ‘శాస్త్రి’ పట్టా పొందాడు. ఆనాటి నుండి లాల్ బహదూర్ శాస్త్రిగా పిలువబడ్డాడు. ఆయన భార్య పేరు లలితాదేవి.

మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో జవహర్ లాల్ నెహ్రూకు కుడిభుజంగా పనిచేశాడు. రవాణా, తంతి తపాలా శాఖలు, హోం శాఖ, పరిశ్రమల శాఖ, వాణిజ్య శాఖ, రైల్వేశాఖల మంత్రిగా భారతదేశానికి ఎంతో సేవ చేశాడు.

నెహ్రూ తర్వాత శాస్త్రి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. జై జవాన్, జై కిసాన్ అన్న నినాదంతో భారతదేశాన్ని , ఉర్రూతలూగించాడు. ఆయనలో పట్టుదల ఎక్కువ. నైతిక విలువలకు, నిజాయితీకి, నిరాడంబరతకు ఈయనది పెట్టింది పేరు. ఆయన 1966వ సంవత్సరం జనవరి పదకొండవ తేదీన మరణించాడు.

16. అక్షరాస్యత

‘విద్య లేనివాడు వింత పశువు’ అని పెద్దలంటారు. చదవడం, రాయడం, లెక్కలు నేర్చుకోవటమే. అక్షరాస్యత.

విద్య నేర్చినవాడు అన్ని రంగాల్లోనూ రాణిస్తాడు. కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనదేశంలో చదువుకున్నవారి శాతం చాలా తక్కువ. దీనికి కారణాలు ప్రజల్లో చైతన్యం లేకపోవడం మరియు పేదరికం.

ప్రభుత్వం ప్రత్యేకంగా వయోజనుల కోసం అక్షరాస్యతా పథకాలు ప్రారంభించింది. పగలంతా పనుల్లో మునిగిపోయినవారికోసం, రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం జిల్లాల వారీగా సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాలు చేపట్టింది.

పనిపాటలు చేసుకుంటూ చదువుకోవాలనుకునే వారి కోసం, మధ్యలో బడి మానేసిన పిల్లల కోసం అనియత విద్యాకేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ఇంట్లో కూర్చొని తీరిక వేళల్లో చదువుకోవడానికి వీలుగా సార్వత్రిక పాఠశాల విద్య ఏర్పాటు చేశారు.

మనదేశంలో జనవిజ్ఞాన వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు సాక్షరతా ఉద్యమంలో ఎక్కువగా పాల్గొంటున్నాయి. సుఖసంతోషాలతో బతకాలంటే ప్రతివ్యక్తి విద్యావంతుడు కావాలి.

AP Board 7th Class Telugu వ్యాసాలు

17. బాలకార్మికులు

నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేట్లు చూడాలి.

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళల్లోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళకు చదువుకొనే అవకాశం కల్పించాలి.

మన రాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది.

బాలకార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

18. కరవు – నివారణోపాయాలు

అనావృష్టి వల్ల కరవు వస్తుంది. కరవును క్షామం అని కూడా అంటారు. సామాన్య వర్షపాతంలో 75% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘కరవు’గాను, 50% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరవు’ గాను భారత వాతావరణ శాఖ నిర్వచించింది.

ఋతుపవనాల నియమరహిత స్వభావం వల్ల దేశంలో ఏదో. ఒకచోట ప్రతి సంవత్సరం తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. . ఎక్కువగా వాయవ్య భారతదేశం, ఆ తరువాత దక్షిణ మరియు మధ్య భారతదేశంలో తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులు అతిగా కరవులు సంభవించే రాష్ట్రాలు.

నివారణోపాయాలు :

  1. కరవు పీడిత ప్రాంతాలలో భూమిశిస్తు పూర్తిగా తొలగించడం గానీ, తగ్గించడం గానీ చేయాలి.
  2. క్షామపీడిత ప్రాంతాలలో ప్రజలు తిరిగి వ్యవసాయం చేసుకొనేందుకు వీలుగా ఆర్థిక సహాయం అందించడం, నీటి పారుదల సౌకర్యాలు కలిగించడం వంటివి చేయాలి.
  3. ఆయా ప్రాంతాలను బట్టి ఏయే పంటలు వేస్తే బాగా పండుతాయో వ్యవసాయదారులకు సూచనలివ్వాలి.
  4. పండిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కలిగించాలి.
  5. తుపానులు వచ్చినపుడు తట్టుకొని నిలబడి పంటనిచ్చే కొత్త రకాలను శాస్త్రజ్ఞులు కనిపెట్టాలి.
  6. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడాలి.

కరవు నష్టాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం “కరవుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక” (Drought prone area programme) ప్రవేశపెట్టింది.. ఈ ప్రణాళికలో నీటిపారుదల, మృత్తికా పరిరక్షణ, వనీకరణ మొదలగు పథకాలున్నాయి. ప్రభుత్వమేకాకుండా ప్రజలు కూడా మానవతాదృష్టితో కరవుపీడిత ప్రాంతీయులను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించాలి.

AP Board 7th Class Telugu వ్యాసాలు

19. మాతృభాషలో విద్యను నేర్చుకోవడం (విద్యలో మాతృభాష ప్రాముఖ్యం)

మాతృభాష అంటే తల్లిభాష అని అర్థం. మనం పుట్టిన చోట జనవ్యవహారంలో ఉండే భాష మాతృభాష. మానవుడు పుట్టింది మొదలు గిట్టేవరకు మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో కలలు కంటామో ఆ భాషలోనే విద్యను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా పరాయి భాషను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయాస పడాల్సి వస్తుంది. అందులో తగినంత పరిజ్ఞానం అలవడనిదే విషయ గ్రహణంగానీ, విషయ వ్యక్తీకరణగానీ సాధ్యపడదు. మాతృభాషలో విద్యాభ్యాసంవల్ల విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకొని పరీక్షలు బాగా వ్రాయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని పొందవచ్చు.

మాతృభాషలో విద్యను నేర్చుకోవడం తల్లిపాలు త్రాగి పెరగడం వంటిది. పరభాషలో విద్యను నేర్చుకోవడం దాది పాలు త్రాగడం వంటిది. ఆంగ్లం వంటి పరాయిభాషలో విద్యార్థికి సరైన పరిజ్ఞానం లేనందువల్ల విద్యార్థికి ఆ భాష రాక బట్టీపట్టి ఏదోవిధంగా కృతార్థుడవుతున్నాడు. ఉపాధ్యాయులు చెప్పేది అర్థంకాక గైడ్సు (Guides) వెంట పడుతున్నాడు. కాబట్టి కనీసం సెకండరీ విద్యాస్థాయి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం, విద్యను నేర్చుకోవడం అవసరం.

AP Board 7th Class Telugu Grammar

SCERT AP Board 7th Class Telugu Guide Grammar Questions and Answers.

AP State Syllabus 7th Class Grammar

అక్షరమాల (వర్ణమాల)

ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అని అర్థం. భాషా విషయంలో మాత్రం, ‘ధ్వని’ అంటే నోటితో పలికేది అని అర్థం. భాషా ధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్టికను, ‘వర్ణమాల’ అంటారు. ‘అక్షరమాల’ అని కూడా . అంటారు.
ఉదా :
1. ‘అ’ – అనేది ఒక ధ్వ నిని తెలిపే గుర్తు, అంటే అక్షరం.
2. ‘మ’ – అనే అక్షరంలో రెండు ధ్వనులున్నాయి. మ్ + అ = “మ” అవుతుంది.

అక్షరాలలో, మనందరకూ చిన్నప్పటినుండి పరిఛితమైన అచ్చులు, హల్లులు అని రెండు రకాలున్నాయి.

ఉదా :
1. ‘అ, ఆ, ఇ, ఈ ‘ వంటి వర్ణాలను (అక్షరాలను ) “అచ్చులు” అంటారు. అచ్చులను స్వరాలు, ప్రాణాలు అని కూడా అంటారు.

ఉదా :
‘కథగఘ’ వంటి అక్షరాలు (వర్ణాలు) హల్లులు: హల్లులను వ్యంజనాలు, ప్రాణులు అని కూడా పిలుస్తారు.

తెలుగు భాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజించారు. అవి
1. అచ్చులు
2. హల్లులు
3. ఉభయాక్షరాలు.

1. అచ్చులు (స్వరాలు):
ఆ – ఆ – ఇ – ఈ – ఉ – ఊ – ఋ, – బూ – ఎ – ఏ – ఐ – ఒ – ఓ – ఔ

అ) హ్రస్వ అచ్చులు :
ఒక మాత్రా కాలంలో ఉచ్చరింపబడే అచ్చులను, హ్రస్వాచ్చులు (హస్వాలు) అంటారు.
అవి : అ, :- ఇ, – ఉ – ఋ, – ఎ – ఒ (మాత్ర అంటే కనురెప్పపాటుకాలం).

ఆ) దీర్ఘాచ్చులు :
రెండు మాత్రల కాలంలో ఉచ్చరింపబడే అచ్చులను, ‘దీర్ఘాచ్చులు’ – దీర్ఘాలు – అంటారు.
అవి : ఆ – ఈ – ఊ – బూ – ఏ – ఐ – ఓ – ఔ.

2. హల్లులు (వ్యంజనాలు, ప్రాణులు) :
AP Board 7th Class Telugu Grammar 1

ఉచ్చారణ విధానాన్ని బట్టి, హల్లులను ఈ క్రింది విభాగాలుగా చేశారు.
అ) పరుషాలు :- కఠినంగా పలికే ధ్వనులు — “క – చ -ట – త – ప”.
ఆ) సరళాలు :- సరళంగా పలికే ధ్వనులు 41 – జ – డ – ద – ఓ”.
ఇ) అల్పప్రాణాలు :- పరుష సరళాలను అల్పప్రాణాలు అంటారు.
ఈ) మహా ప్రాణాలు :- అర ఛఝ, ఠ,ఢ,థ, ధ, ఫ,భ – లను మహాప్రాణాలు అంటారు. వీటిని ” వర్గయుక్కులు” అని కూడా అంటారు.
ఉ) అనునాసికాలు :- ముక్కు సహాయంతో పలికే వర్ణాలు – “జ, ఇ’, ణ, న, మ”
ఊ) అంతస్థాలు. :- “య, ర, ఱ, ల, ళ, వ ”.

సూచన :- ‘ఱ’ – ఇది గ్రాంథిక భాషలోనే కనిపిస్తుంది.

AP Board 7th Class Telugu Grammar

3. ఉభయాక్షరాలు :- ఇవి మూడు.
అవి :
1. సున్న = ‘O’ (పూర్ణ బిందువు) (పూర్ణానుస్వారం)
2. అరసున్న = “c” (అర్ధానుస్వారం), (అర్ధ బిందువు)
3. విసర్గ = ‘ః’

పై మూడు అక్షరాలనూ, అచ్చులలోనూ, హల్లులలోనూ కూడా ఉపయోగించడం వల్ల, వీటిని ” ఉభయాక్షరాలు” అని పిలుస్తారు.

సూచన :-
1. అరసున్న గ్రాంథిక భాషలో మాత్రమే కనిపిస్తుంది.
2. విసర్గ, తత్సమ పదాల్లో మాత్రమే కనిపిస్తుంది.
ఉదా :
1. కృష్ణుడు
2. దుఃఖము మొ||నవి.

అభ్యాసం:
1) కింది వాక్యంలో పరుషములతో మొదలయ్యే పదములను గుర్తించి రాయండి.
డుపు బరువు గ్గినా, చ్చి క్కున జరజర ని అయ్యింది.
జవాబు:
1. డుపు, 2. చ్చి, 3. క్కున, 4. గ్గిన, 5. ని

2) కింది మాటల్లో సరళములతో మొదలయ్యే పదాలు గుర్తించి రాయండి.
లం, కలం, గాలి, లం, ళం, తళుకు, కాలు, బ్బు,
జవాబు:
1. గాలి, 2. లం, 3. బ్బు, 4. ళం, 5. లం – అనేవి
సరళాలతో మొదలయ్యే పదాలు.

3) కింది ‘మాటల్లో అంతస్థాలను గుర్తించండి.
మున, కారం, పాలు, వం, వేళ
జవాబు:

  1. మునలో ‘య’ అంతస్థము
  2. కారంలో ‘ర’ అంతస్థము
  3. పాలులో ‘లు’ అంతస్థము
  4. వంకరలో ‘వం’ అంతస్థము
  5. వేలో వ, ళ (అంతస్థాలు)

4) కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి.
భాషను మాట్లాడే సహజ శక్తి మనుషులందరికీ ఉంటుంది.
జవాబు:

  1. భాషలో ‘
  2. సహజశక్తిలో ‘,,
  3. మనుషులులో ‘‘ అనేవి ఊష్మాలు.

ద్విత్వ, సంయుక్తాక్షరాలు

కొన్ని అక్షరాలలో రెండేసిగాని, మూడేసి గాని హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి రెండు రకాలు.
1. ద్విత్వాక్షరం
2. సంయుక్తాక్షరం

1. ద్విత్వాక్షరం :
ఒక హల్లుకు, అదే హల్లు తాలూకు ఒత్తు చేరితే, దాన్ని “ద్విత్వాక్షరం అంటారు.
ఉదా :
1. క్క = క్ +్క (క్) + అ = క్క = ఇందులో కకారం రెండుసార్లు వచ్చింది.
2. త్త = త్ + త్ + అ = త్త = ఇందులో తకారం రెండుసార్లు వచ్చింది.

2. సంయుక్తాక్షరం :
ఒక హల్లుకు వేరొక హల్లు తాలూకు ఒత్తు చేరితే, దాన్ని “సంయుక్తాక్షరం” అంటారు
ఉదా :
1. న్య = న్ + య్ + అ = న్య = ఇందులో నకారం, యకారాలనే రెండు హల్లులు వచ్చాయి.
2. క్ష్మి = క్ + ష + మ్ + ఇ = క్ష్మి = ఇందులో కకార, షకార, మకారములనే మూడు హల్లులు కలిశాయి.

హల్లులు – వర్గాక్షరములు

1. వర్గాక్షరాలు : ‘క’ నుండి ‘మ’ వరకు ఉండే హల్లులను, ఐదు వర్గములుగా విభజించారు. ‘క’ నుండి ‘మ’ వరకు ఉండే హల్లులను, ‘స్పర్శములు’ అని కూడా అంటారు.

1) క వర్గం :- ‘క, ఖ, గ, ఘ, జ
2) చ వర్గం :- చ, ఛ, జ, ఝ, ఇ
3) ట వర్గం :- ట, ఠ, డ, ఢ, ణ
4) త వర్గం :- త, థ, ద, ధ, న
5) ప వర్గం :- ప, ఫ, బ, భ, మ

AP Board 7th Class Telugu Grammar

భాషాభాగాలు

వాక్యాల్లో ‘పదాలు’ ఉంటాయి. పదాల్లో అక్షరాలు ఉంటాయి. కొన్ని అక్షరాలు కలిస్తే, పదాలు అవుతాయి. ఈ పదాలను వ్యాకరణవేత్తలు, కొన్ని భాగాలుగా విభజించారు. వీటిని ‘భాషాభాగాలు’ అంటారు.

1. నామవాచకాలు :
మనుష్యుల పేర్లు, నదులు, ఊర్లు మొదలయిన వాటి పేర్లు, సముదాయాల పేర్లు, జాతులను సూచించే పదాలు “నామవాచకాలు” అంటారు.
ఉదా :
రాజు, కృష్ణుడు, గోదావరి, విశాఖపట్టణం, మొ||నవి.

2. సర్వనామాలు :
నామవాచకాలకు బదులుగా వాడే పదాలను “సర్వనామము”లు అంటారు.
ఉదా : వాడు, వారు, అతడు, నీవు, మీరు, మొ||నవి.

3. విశేషణాలు :
నామవాచకముల యొక్క సర్వనామముల యొక్క గుణాలనూ, లేక లక్షణాల్నీ తెలిపే పదాలకు విశేషణాలని పేరు.
ఉదా :
తెల్లని బట్టలు, మంచి పిల్లవాడు, అతడు పొట్టి, పొడుగు కాదు. ఇక్కడ తెల్లని, మంచి, పొట్టి, పొడుగు అనేవి విశేషణాలు.

4. క్రియలు :
పనులను తెలియజేసే పదాలు.
ఉదా :
1. వండుతోంది
2. రాస్తున్నాడు
3. తొక్కుతున్నాడు
4. చదువుతోంది మొదలుగునవి.

5. అవ్యయాలు :
లింగ వచన విభక్తుల వల్ల మారని పధాలు.
ఉదా : ఆహా, ఓహో, బాపురే, కాబట్టి మొదలగునవి.

ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు

1. రమేష్ సినిమాకు వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) నామవాచకం
2) అవ్యయం
3) సర్వనామం
4) క్రియ
జవాబు:
1) నామవాచకం

2. కాంతి బాబు అసలు విషయం బయట పెట్టాడు – గీత గీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) విశేషణం
2) అవ్యయం
3) క్రియ
4) నామవాచకం
జవాబు:
4) నామవాచకం

3. లింగవచన విభక్తులవల్ల మారని పదాలను ఇలా పిలుస్తారు.
1) విశేషణం
2) సర్వనామం
3) అవ్యయం
4) క్రియ
జవాబు:
3) అవ్యయం

4. భుజమంతా తెల్లగా బూడిదయ్యింది – గీత గీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) నామవాచకం
2) క్రియ
3) విశేషణం
4) అవ్యయం
జవాబు:
3) విశేషణం

5. ఆమె బజారుకు వెళ్ళింది – గీతగీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) అవ్యయం
2) సర్వనామం
3) విశేషణం
4) నామవాచకం
జవాబు:
2) సర్వనామం

AP Board 7th Class Telugu Grammar

6. ఆమె అన్నం వండుతోంది – గీత గీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) సర్వనామం
2) విశేషణం
3) క్రియ
4) అవ్యయం
జవాబు:
3) క్రియ

7. ఓహో నీ పని పూర్తి అయ్యిందా? – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
1) అవ్యయం
2) నామవాచకం
3) సర్వనామం
4) క్రియ
జవాబు:
1) అవ్యయం

8. మీరు పొట్టి మనిషి – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
1) సర్వనామం
2) విశేషణం
3) క్రియ
4) అవ్యయం
జవాబు:
2) విశేషణం

లింగం, వచనాలు

1. లింగం :
‘లింగం’ అంటే చిహ్నం. అంటే గుర్తు. పురుష, స్త్రీ, నపుంసక వర్గాలను సూచించడానికి, ఇవి సహాయపడతాయి.

అ) పుంలింగం :
పురుషులనూ, వారి విశేషాలనూ తెలిపేది. ఉదా : రాముడు, గుణవంతుడు, ధీరుడు మొ||నవి.

ఆ) స్త్రీలింగం :
స్త్రీలనూ, వారి విశేషాలనూ తెలిపే పదాలు . ఉదా : సత్య, రాధ, అందగత్తె, సుందరి.

ఇ) నపుంసకలింగం :
స్త్రీ, పురుషులు కాని వాటినీ, వాటి విశేషాలను తెలిపేది నపుంసకలింగం.
ఉదా :
పేరు, మనస్సు, మంచిది మొ||నవి.

AP Board 7th Class Telugu Grammar

2. వచనం :
తెలుగులో వచనాలు రెండు రకాలు. అవి:
అ) ఏకవచనం :
ఒకే వస్తువును సూచించేది. ఉదా : రాముడు, పుస్తకం మొ||నవి.

ఆ) బహువచనం :
ఒకటి కన్నా ఎక్కువ వస్తువులను సూచించేది.
ఉదా :
రాములు, పుస్తకాలు మొ||నవి.

బహువచనంలో మూలపదానికి, లు, రు, ఱు,ండ్రు మొదలయిన ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :
పుస్తకం (ఏకవచనం) – పుస్తకాలు (బహువచనం)

1. నితైకవచన పదాలు:
కొన్ని పదాలు ఎప్పుడూ ఏకవచనంలోనే ఉంటాయి. వాటిని ‘నిత్యాకవచన పదాలు’ అంటారు.
ఉదా :
నీరు, బంగారం, బియ్యం , తెలుపు, నిన్న, వరి, మొ||నవి.

2. నిత్యబహువచనాలు:
కొన్ని పదాలు ఎప్పుడూ బహువచనంలోనే ఉంటాయి. వాటిని ‘నిత్యబహువచనాలు’ అంటారు.
ఉదా :
వడ్లు, పెసలు, పేలాలు, అచ్చనగాయలు,అందరు ఎందరు మొ||నవి.

విభక్తి ప్రత్యయాలు

* విభక్తులు:- పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలను, లేదా పదాలను “విభక్తులు” అంటారు.

1. కింది వాక్యాలను గమనించండి.

అ) భారత్ ఆరు వికెట్లతో కప్ గెలిచింది.
ఆ) సమాజంలో అవసరమున్నవాళ్ళకు సేవచేయడమే సమాజసేవ.
ఇ) అనారోగ్యం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
ఈ) లంక సింహాలు తోక ముడిచాయి.
ఉ) సచిన్ గురించి నీకు తెలిసిన విషయాలు ఏమిటి?

పై వాక్యములలో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి. వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్లుగా అనిపిస్తుంది. “ఆరు వికెట్ల కప్” అనేది ఉండదు. ఇప్పుడు ‘తో’ అనే ప్రత్యయం కలిపి చూడండి.

“భారత్ ఆరు వికెట్లతో కప్ గెలిచింది”. అప్పుడు వాక్యం పదాల మధ్య సంబంధం ఏర్పడుతుంది.

* విభక్తులు:
పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలను, లేదా పదాలను, “విభక్తులు” అంటారు.

“విభక్తి ప్రత్యయాలు” “విభక్తులు”
అ) అడు, ము, వు, లు ప్రథమా విభక్తి
ఆ) ని(న్), ను(న్) , ల(న్), కూర్చి, గురించి ద్వితీయా విభక్తి
ఇ) చేత(న్), చే(న్), తోడ(న్), తో(న్) తృతీయా విభక్తి
ఈ) కొలకు(న్), కై చతుర్డీ విభక్తి
ఉ) వలన(న్), కంటె(న్), పట్టి పంచమీ విభక్తి
ఊ) కి(న్), కు(న్), యొక్క లో(న్), లోపల(న్) షష్ఠీ విభక్తి
ఋ) అందు(న్), న(న్), సప్తమీ విభక్తి
ఋ) ఓ ! ఓరి! ఓయి! ఓసి! సంబోధన ప్రథమా విభక్తి

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసము:

1. కింది వాక్యాలలోని విభక్తి ప్రత్యయాలను గుర్తించి, అవి ఏ విభక్తులో రాయండి.

ప్రత్యయం “విభక్తి”
1) సమావేశములో చదివిన విషయం బాగున్నది. లో షష్ఠీ విభక్తి
2) గాలికి రెపరెప లాడుతున్నది. …………… కి షష్ఠీ విభక్తి
3) రహస్యాలను అన్వేషించండి …………… ను ద్వితీయా
4) జంతువులు మన కంటే ముందున్నాయి………. కంటె పంచమీ
5) జ్ఞానేంద్రియాలచేత గ్రహిస్తాం …………… చేత తృతీయా
6) బాధ వలన దుఃఖం వస్తుంది ………….. వలన పంచమీ
7) ధ్వనులను బట్టి జంతువులను గుర్తించవచ్చు ……… పట్టి పంచమీ
8) రాముడు ధేనువు పాలు పిండుతున్నాడు ………. డు,వు, లు ప్రథమా

ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు

1. ఈ కింది వానిలో చతుర్థి విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.
1) చేత, తోడ,
2) కొఱకు, కై
3) అందు,న
4) వలన, కంటె, పట్టి
జవాబు:
2) కొఱకు, కై

2. ఇనుముతో నాగటి కర్రు చేస్తారు – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
1) ప్రథమా
2) ద్వితీయ
3) తృతీయ
4) చతుర్డీ
జవాబు:
3) తృతీయ

3. ధ్వనులను బట్టి జంతువులను గుర్తించవచ్చు – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
1) తృతీయ
2) చతుర్డీ
3) పంచమీ
4) షష్ఠీ
జవాబు:
3) పంచమీ

4. రహస్యాలను అన్వేషించండి – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం ?
1) ప్రథమా
2) సప్తమీ
3) ద్వితీయ
4) పంచమీ
జవాబు:
3) ద్వితీయ

AP Board 7th Class Telugu Grammar

5. ఈ కింది వానిలో సప్తమీ విభక్తి ప్రత్యయాలు గుర్తించండి.
1) అందు, న
2) కి, కు, యొక్క లో, లోపల
3) చేత, చే
4) కొఱకు, కై
జవాబు:
1) అందు, న

ఉపవిభక్తులు – ఔపవిభక్తికాలు

ఉప విభక్తులు:
ఈ కింద గీత గీసిన పదాలను గమనించండి. వాటి నామవాచకం అసలు రూపాన్ని గుర్తించి రాయండి.

నామవాచకం

ఉదా:- కంటిలోని నలుసు కన్ను ‘కన్ను’ యొక్క ఔపవిభక్తిక రూపం “కంటి”
1) ఇంటికి వెలుగు ఇల్లాలు ఇల్లు ‘ఇల్లు’ యొక్క ఔపవిభక్తిక రూపం “ఇంటి”
2) ఏటిలోని చేపపిల్ల ఏఱు యొక్క ఔపవిభక్తిక రూపం “ఏటి”
3) ఊరి కట్టుబాటు ఊరు ‘ఊరు’ యొక్క ఔపవిభక్తిక రూపం “ఊరి”
4) కాలికి బుద్ధి చెప్పారు కాలు ‘కాలు’ యొక్క ఔపవిభక్తిక రూపం “కాలి”
5) రాతిని శిల్పంగా చెక్కారు రాయి ‘రాయి’ యొక్క ఔపవిభక్తిక రూపం “రాతి”

పై వాక్యాలలోని నామవాచకాలలో వచ్చిన మార్పులు గమనించండి. నామవాచకాలు వాక్యాలలో ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాటి స్వరూపం మారుతోంది. (కన్ను – కంటిగా ; ఇల్లు – ఇంటిగా ; ఏరు – ఏటిగా ; ఊరు – ఊరిగా, కాలు – కాలిగా ; రాయి – రాతిగా) మారాయి. అలా మారేటప్పుడు నామవాచకం చివరి అక్షరం మీద ‘ఇ’ గాని, ‘టి’ గాని, ‘తి’ గాని చేరుతున్నాయి.

వీటిని ‘ఉపవిభక్తులు’ అంటారు. ఉపవిభక్తులు కలిగిన నామవాచకాలను “ఔపవిభక్తికాలు” అంటారు.

అభ్యాసము:
1. కింది నామవాచకాలకు ఇచ్చిన ఉపవిభక్తులు చేర్చి, ఔపవిభక్తికాలుగా మార్చి వాక్యాలు రాయండి.
1) ఉదా:
చేయి + త = చేతి
అతనికి చేతినిండా పని ఉంది.

2) గోరు + టి = గోటి .
గోటితో గిల్లితే పోయేదానికి గొడ్డలెందుకు !

3) రోలు + టి = రోటి
రోటిలో వారు పిండిని దంచారు.

4) నూయి + తి = నూతి
నూతిలో కప్పలా ఉండకు.

5) గోయి + తి = గోతి
గోతిలో వారి చెంబు పడింది.

సమాసాలు

సమాసం :
వేరు వేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి, ఒకే పదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు. అర్థవంతమైన రెండు పదాలు కలిసి, కొత్త పదం ఏర్పడటాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటిపదాన్ని ‘పూర్వపదం’ అనీ, రెండవపదాన్ని ‘ఉత్తరపదం’ అనీ అంటారు.
ఉదా :
రామలక్ష్మణులు చాలా గొప్పవారు.

పై వాక్యంలో నామవాచక పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి ‘రామలక్ష్మణులు’. ఇందులో పూర్వపదము , రాముడు. ఉత్తర పదము – లక్ష్మణుడు – వీటికి రాముడును, లక్ష్మణుడును అని అర్థం చెప్పుకుంటాం.

ద్వంద్వ సమాసం :
రెండుగాని అంతకంటే ఎక్కువ గాని నామవాచకాల . మధ్య ఏర్పడే ఈ సమాసాన్ని, “ద్వంద్వసమాసం” అంటారు.

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 1
1. ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.
అ) ఆ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు.
జవాబు:
అన్నదమ్ములు

ఆ) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు

ఇ) ప్రమాదంలో నా కాలు చేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలు చేతులు

ఈ) మనిషికి ఈర్ష్యాసూయలు ఉండకూడదు.
జవాబు:
ఈర్ష్యాసూయలు

ఉ) భారతంలో కృష్ణార్జునులు ప్రధాన పాత్రలు పోషించారు.
జవాబు:
కృష్ణార్జునులు

ఊ) మనం నిరాశా నిస్పృహలకు లోను కాకూడదు.
జవాబు:
నిరాశా నిస్పృహలు

అభ్యాసం: 2
కింది మాటలను వివరించండి. (విగ్రహవాక్యాలు రాయండి.)
సమాస పదాలు – విగ్రహవాక్యాలు
1) ఎండవానలు – ఎండా, వానా
2) తల్లిదండ్రులు – తల్లీ, తండ్రీ !
3) రేయింబవళ్ళు – రేయీ, పగలూ
4) గంగాయమునలు – గంగా, యమునా

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 3
కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.
ఇచ్చిన విగ్రహవాక్యం – చేసిన సమాస పదం
ఉదా : రాముడూ – లక్ష్మణుడూ – రామలక్ష్మణులు
1) కుజనుడూ, సజ్జనుడూ – కుజనసజ్జనులు
2) కూరా, కాయా కూరగాయలు
3) అన్నా, తమ్ముడూ అన్నదమ్ములు
4) కష్టమూ, సుఖమూ – కష్టసుఖములు
5) మంచి, చెడు – మంచిచెడులు

ద్విగు సమాసం :
సమాసాల్లో మొదటి (పూర్వ) పదంలో ‘సంఖ్య’ గల సమాసాలను, ద్విగు సమాసాలు అంటారు.

అభ్యాసం : 4

1. కింది సమాస పదాలను ఉదాహరణలో చూపిన విధంగా వివరించండి.
ఉదా :- నవరసాలు – నవ (9) సంఖ్య గల, రసాలు.
అ) రెండు జడలు – రెండు (2) సంఖ్య గల, జడలు.
ఆ) నాలుగు వేదాలు – నాలుగు (4) సంఖ్య గల, వేదాలు.
ఇ) దశావతారాలు . – దశ (10) సంఖ్య గల, అవతారాలు.
ఈ) చతుషష్టి కళలు – చతుషష్టి (64) సంఖ్య గల, కళలు.
ఉ) ఏడు రోజులు – ఏడు (7) సంఖ్య గల, రోజులు.

గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్య ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు “ద్విగు సమాసాలు” అంటారు.

అభ్యాసం : 5

సమాస పదం విగ్రహవాక్యం సమాస నామం
అ) అక్కాచెల్లెళ్ళు అక్కా చెల్లెలూ ద్వంద్వ సమాసము
ఆ) పంచ పాండవులు పంచ (5) సంఖ్య గల పాండవులు ద్విగు సమాసము
ఇ) ద్వాదశ జ్యోతిర్లింగాలు ద్వాదశ(12) సంఖ్యగల జ్యోతిర్లింగాలు ద్విగు సమాసము
ఈ) సీతారాములు సీతా, రాముడూ ద్వంద్వ సమాసము
ఉ) రాబర్ట్ రహీములు రాబర్టూ, రహీమూ ద్వంద్వ సమాసము
ఊ) త్రిమూర్తులు త్రి (3) సంఖ్యగల.మూర్తులు ద్విగు సమాసము
ఋ) నవగ్రహాలు నవ (9) సంఖ్యగల గ్రహాలు ద్విగు సమాసము
ఋ) ఏడు రంగులు ఏడు (7) సంఖ్యగల రంగులు ద్విగు సమాసము
ఎ) వంద పరుగులు వంద (100) సంఖ్యగల పరుగులు ద్విగు సమాసము
ఏ) సూర్యచంద్రులు సూర్యుడూ, చంద్రుడూ ద్వంద్వ సమాసము

ఐచ్చిక సమాధాన ప్రశ్నలు

1. విష్ణువు దశావతారములు ఎత్తెను – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
1) పది సంఖ్య గల అవతారములు
2) నూరు సంఖ్య గల అవతారములు
3) వేయి. సంఖ్య గల అవతారములు
4) పద్దెనిమిది సంఖ్య గల అవతారములు
జవాబు:
1) పది సంఖ్య గల అవతారములు

2. అన్నదమ్ములు కలసిమెలసి జీవిస్తున్నారు – గీత గీసిన పదం సమాసం పేరు
1) ద్విగు సమాసం
2) ద్వంద్వ సమాసం
3) బహుప్రీహి సమాసం
4) అవ్యయీభావ సమాసం
జవాబు:
2) ద్వంద్వ సమాసం

3. సీతారాములు భద్రాచలం వెళ్ళారు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
1) సీతా రాముడు
2) సీతతో రాముడు
3) సీతారాములు కలది
4) సీత కొఱకు రాముడు
జవాబు:
1) సీతా రాముడు

4. త్రిమూర్తులు కలసి వచ్చారు – గీత గీసిన పదం, ఏ సమాసమో గుర్తించండి.
1) ద్వంద్వ సమాసం
2) ద్విగు సమాసం
3) బహుజొహి సమాసం
4) అవ్యయీభావ సమాసం
జవాబు:
2) ద్విగు సమాసం

AP Board 7th Class Telugu Grammar

5. ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించాలి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
1) పది సంఖ్య గల జ్యోతిర్లింగాలు
2) ఇరవై సంఖ్య గల జ్యోతిర్లింగాలు
3) మూడు సంఖ్య గల ‘లింగాలు
4) పండ్రెండు సంఖ్య గల జ్యోతిర్లింగాలు
జవాబు:
4) పండ్రెండు సంఖ్య గల జ్యోతిర్లింగాలు

తెలుగు సంధులు

నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి.

గమనిక:
పై వాక్యంలో ‘చిన్నప్పుడు’ అనే పదం, చిన్న + అప్పుడు అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనిని సంధిపదం అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం, రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసినపుడు, రాయవలసినపుడు, “సంధిపదం” – ఏర్పడుతుంది.

తెలుగు సంధులు :
రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధులను, “తెలుగు సంధులు” అంటారు.

సంధి :
వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల (అచ్చుల) కలయికకు, “సంధి” అని అంటారు.

సంధి కార్యం :
రెండు స్వరాల అచ్చుల) మధ్య జరిగే మార్పును, “సంధి కార్యం” అని అంటారు.

పూర్వ స్వరం:
మొదటి పదం చివరి అక్షరంలోని స్వరాన్ని (అచ్చును), “పూర్వ స్వరం” అని అంటారు.

పర స్వరం :
రెండవ పదము మొదటి అక్షరములోని స్వరాన్ని (అచ్చును), “పరస్వరం” – అని అంటారు.
ఉదా :
రామ + అయ్య ; “మ” లోని ‘అ’ పూర్వస్వరం + ‘అయ్య’ లోని ‘అ’ ; పరస్వరం.

1. అత్వసంధి :
కింది పదాలను విడదీయండి.
ఉదా:
మేనల్లుడు = మేన + అల్లుడు = (న్ +) అ + అ
1) ఒకప్పుడు = ఒక + అప్పుడు = (అ + అ = అ) = అకారసంధి
2) వచ్చినందుకు = వచ్చిన + అందుకు = (అ + అ = అ) = అకారసంధి
3) చెప్పకున్న = చెప్పక + ఉన్న = (అ + ఉ = ఉ) = అకారసంధి
4) చేయకుంటే = చేయక + ఉంటే = (అ + ఉ = ఉ) = అకారసంధి
5) రాకుంటే = రాక + ఉంటే = (అ + ఉ = ఉ) = అకారసంధి
6) జరగకేమి = జరగక + ఏమి = (అ + ఏ = ఏ) = అకారసంధి
7) లేకేమి = లేక + ఏమి = (అ + ఏ = ఏ) = అకారసంధి
8) పోవుటెట్లు = పోవుట + ఎట్లు = (అ + ఎ = ఎ) = అకారసంధి

గమనిక :
పై సంధి పదాలలో ‘అ’, పరస్వరంలోని అచ్చుతో కలిసినప్పుడు ‘అ’ లోపించింది. – పరస్వరం – రూపం కనిపిస్తుంది. దీన్ని “అత్వసంధి” అంటారు. – (హ్రస్వ (పొట్టి) ‘అ’ అనే అక్షరానికి, అచ్చు పరమైతే “అత్వసంధి” ఏర్పడుతుంది.

అత్వసంధి సూత్రం:
అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. (‘అత్తు’ అంటే హ్రస్వ అకారం)

2. ఇత్వసంధి :
కింది పదాలను విడదీయండి.
ఉదా:- (1) ఏమంటివి = ఏమి + అంటివి = (ఇ + అ= అ) (ఇత్వసంధి)
సంధి జరగనప్పుడు, యకారం ఆగమంగా వస్తుంది.

(ఆ) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి = (ఇ + అ = య) (ఇకారసంధి రాని యడాగమరూపం)
వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు = (ఇ + ఇ = 3) = వచ్చిరిపుడు – (ఇత్వసంధి)
వచ్చిరియిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు = (ఇ + ఇ = యి) = (యడాగమం వచ్చిన రూపం)

గమనిక :
పై ఉదాహరణములలో హ్రస్వ ఇకారానికి, అచ్చు కలిసినపుడు సంధి జరిగింది. దీనిని “ఇత్వసంధి” అంటారు. ‘ఇత్వసంధి’, తప్పక జరగాలన్న నియమం లేదు.

వైకల్పికం :
ఇత్వసంధి జరుగవచ్చు, జరుగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని “వైకల్పికం” అంటారు.

అభ్యాసం:
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా:
1) ఏమంటివి = ఏమి + అంటివి = (మ్ + ఇ + అ = మ) = ఇత్వసంది
2) పైకెత్తినారు = పైకి + ఎత్తినారు = (ఇ + ఎ = ఎ) = ఇత్వసంధి
3) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు = (ఇ + అ = అ) = ఇత్వసంధి
4) కోవెలలోకేగినారు = కోవెలలోకి + ఏగినారు = (ఇ + ఏ = ఏ) = ఇత్వసంధి

ఇత్వసంధి సూత్రం :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంబుగా వస్తుంది. (‘ఇత్తు’ అంటే హ్రస్వ ఇకారం)

3. ఉత్వసంధి :
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా:
1) రాముడతడు = రాముడు + అతడు = (డ్) (ఉ + అ = డ) = ఉత్వసంధి
2) అతడెక్కడ = అతడు + ఎక్కడ = (ఉ + ఎ = ఎ) = ఉత్వసంధి
3) మనమున్నాము = మనము + ఉన్నాము = (ఉ + ఉ = ఉ) = ఉత్వసంధి
4) మనసెన = మనసు + ఐన = (ఉ + ఐ = ఐ) = ఉత్యసంధి

గమనిక :
హ్రస్వ ఉకారానికి, అనగా (ఉత్తుకు) అచ్చు కలిసినప్పుడు, ఉకారం లోపించి, పరస్వరం కనిపిస్తుంది. దీన్నే “ఉత్వసంధి” అంటారు.

ఉత్వసంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమైతేసంధి నిత్యంగా వస్తుంది.

నిత్యం :
నిత్యం అంటే తప్పక సంధికార్యం జరుగుతుంది అని అర్థం.

AP Board 7th Class Telugu Grammar

4. యడాగమ సంధి :
1. కింది పదాలను విడదీయండి.

ఉదా:
1) మాయమ్మ = మా + అమ్మ = మాయమ్మ
2) మీ ఇల్లు = మీ + ఇల్లు = మీ యిల్లు
3) హరియతడు = హరి + అతడు = హరియతడు

గమనిక:
పై ఉదాహరణలలో సంధి జరుగలేదు. కాని కొత్తగా ‘య్’ వచ్చి చేరింది. అలా చేరడం వల్ల ఈ కింది విధంగా మార్పు జరిగింది.
1) మా + య్ + అమ్మ – మా ‘య’ మ్మ
2) మీ + య్. + ఇల్లు = మీ ‘యి’ ల్లు
3) హరి + య్ + ఇతడు = హరి ‘యి’ తడు

యడాగమం :
సంధి లేని చోట ‘య్’ వచ్చి చేరడాన్నే, ‘యడాగమం’ అంటారు.

అభ్యాసం:
ఈ కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి, సంధి జరిగిన విధాన్ని చర్చించండి.

అ. అత్వసంధి సూత్రం :
అత్తునకు సంధి బహుళంబుగా వస్తుంది.
1) జీవగడ్డయి = జీవగడ్డ + అయి = (అ + అ = అ) = అత్వసంధి
2) భాగ్యసీమయి = భాగ్యసీమ + అయి = (అ + అ = అ) = అత్వసంధి

ఆ. ఇత్వసంధి సూత్రం:
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.
3) ఏమిటాకథ = ఏమిటి + ఆ కథ = (ఇ + ఆ = ఆ) = ఇత్వసంధి
4) చేసుకోవాలని = చేసుకోవాలి + అని= (ఇ + అ = అ) = ఇత్వసంధి
5) రానిదని = రానిది + అని = (ఇ + అ = అ) = ఇత్వసంధి
6) ఎవరికెంత = ఎవరికి + ఎంత = (ఇ + ఎ = ఎ) = ఇత్వసంధి
7) వచ్చితిరిపుడు = వచ్చితిరి + ఇపుడు = (ఇ + ఇ = ఇ) – ఇత్వసంధి

ఇ. ఉత్వసంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యంగా వస్తుంది.
8) సెలవిచ్చి = సెలవు + ఇచ్చి = (ఉ + ఇ = ఇ) = ఉత్వసంధి
9) కావ్యంబలం = కావ్యంబు + అలరె = (ఉ + అ = అ) = ఉత్వసంధి
10) మధువొలికె = మధువు + ఒలికె = (ఉ + ఒ = ఒ) = ఉత్వసంధి
11) కవితలల్లిన = కవితలు + అల్లిన = (ఉ + అ = అ) = ఉత్వసంధి\

మరికొన్ని తెలుగు సంధులు

1. ఆమ్రేడితం :
మొదట పలికిన పదమునే తిరిగి రెండో మారు పలుకుతాం. అలా రెండోమారు పలికే పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటాము. వ్యాకరణ పరిభాషలో ద్విరుక్తము యొక్క పరరూపమును ఆమ్రేడితం అంటారు.
ఉదా:
ఆహా + ఆహా ‘ = ‘ఆహా’ అనే పదం రెండు సార్లు వచ్చింది. అందులో రెండవ ‘ఆహా’ అనే – దాన్ని ఆమ్రేడితం అనాలి.

మరి కొన్ని ఉదాహరణములు :
1) ఔరౌర = ఔర + ఔర = రెండవసారి వచ్చిన ఔర ఆమ్రేడితం
2) అరెరె = అరె + అరె = రెండవసారి వచ్చిన అరె ఆమ్రేడితం
3) ఆహాహా = ఆహా + ఆహా = రెండవసారి వచ్చిన ఆహా ఆమ్రేడితం
4) ఏమేమి = ఏమి + ఏమి రెండవసారి వచ్చిన ఏమి ఆమ్రేడితం
5) ఎట్లెట్లు = ఎట్లు + ఎట్లు = రెండవసారి వచ్చిన ఎట్లు ఆమ్రేడితం
6) ఏమిటేమిటి = ఏమిటి + ఏమిటి = రెండవసారి వచ్చిన ఏమిటి ఆమ్రేడితం
7) ఓహోహో = ఓహో + ఓహో = రెండవసారి వచ్చిన ఓహో ఆమ్రేడితం

గమనిక :
పై ఉదాహరణములో .ఒక్కొక్క పదం, రెండు సార్లు వచ్చింది కదా ! రెండవసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.

ఆమ్రేడిత సంధి :
ఔర + ఔర = ఔర్ + అ
ఆహా + ఆహా = ఆహ్ + ఆ
ఓహో + ఓహో = ఓహ్ + ఓ

గమనిక :
పై ఉదాహరణములలో పూర్వ పదం అనగా మొదటి పదం చివర, అ, ఆ, ఓ, వంటి అచ్చులు ఉన్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే సంధి వస్తుంది.

ఔర + ఔర = ఔరౌర (అ + ఔ = ఔ)
ఆహా + ఆహా = ఆహాహా (ఆ + ఆ = ఆ)
ఓహో + ఓహో = ఓహోహో (ఓ + ఓ = ఓ)
ఏమి + ఏమి = ఏమేమి (ఇ + ఏ = ఏ)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు (ఉ + ఎ = ఎ)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి (ఇ + ఏ = ఏ)
అరె + అరె = అరెరె (ఎ + అ = అ) లుగా మారుతాయి.

గమనిక :
పై విషయాలను బట్టి ఈ సంధిని గుర్తు పట్టడానికి, ఇలా సూత్రం తయారుచేయవచ్చు.

ఆమ్రేడిత సంధి సూత్రం :
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా అవుతుంది.

గమనిక : ఆమ్రేడిత సంధి, కింది ఉదాహరణలలో వికల్పంగా జరుగుతుంది. ఈ ఉదాహరణలను. చూస్తే, సంధి జరిగిన రూపం, సంధి రాని యడాగమ రూపం కనబడతాయి.
ఉదా:
1) ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి (సంధి వైకల్పికం)
2) ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు, ఎట్లు యెట్లు (సంధి వైకల్పికం)
3) ఎంత + ఎంత = ఎంతెంత. ఎంతయెంత . (సంధి వైకల్పికం)

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం:
కింది పదాలను విడదీసి, సంధిని పేర్కొని సూత్రాన్ని రాయండి.

1) అడిగడిగి = అడిగి + అడిగి = (ఇ + అ = అ) = ఆమ్రేడిత సంధి
2) ఊరూరు = ఊరు + ఊరు = (ఉ | ఊ = ఊ) = ఆమ్రేడిత సంధి
3) అంతంత = అంత + అంత = (అ + అ = అ) = ఆమ్రేడిత సంధి
4) ఓరోరి = ఓరి + ఓరి = (ఇ + ఓ = ఓ) = ఆమ్రేడిత సంధి

ద్విరుక్తటకారసంధి :
కింది సంధులను విడదీయండి.
1) కుట్టుసురు = కుఱు + ఉసురు
2) చిట్టెలుక = చిఱు + ఎలుక
3) కట్టెదురు = కడు + ఎదురు
4) నట్టిల్లు = నడు + ఇల్లు
5) నిట్టూర్పు = నిడు + ఊర్పు

గమనిక :
పై ఉదాహరణములలో, పూర్వ, పరస్వరాలను కలిపితే ఈ కింది విధంగా మారతాయి.

1) ఱు + ఉ . = ట్టు
2) ఱు + ఎ = ట్టె
3) డు + ఎ – ట్టె
4) డు + ఇ = ట్టి
5) డు + ఊ – ట్టూ

గమనిక :
పూర్వ పదం చివర ఉన్న ఐ, డ లకు అచ్చు పరమైతే “ట్ట” – అంటే, ద్విరుక్తటకారం వచ్చింది. దీన్ని “ద్విరుక్తటకారసంధి” అంటారు.

అభ్యాసం:
కింది సంధులను విడదీసి, సంధిని పేర్కొనండి. సంధి సూత్రాన్ని రాయండి.
1) చిట్టడవి = చిఱు + అడవి = (ఱు + అ = ట్ట) = ద్విరుక్తటకార సంధి
2) నట్టేట = నడు + ఏట = (డు + ఏ ఇట్టే) = ద్విరుక్తటకార సంధి.

ద్విరుక్తటకార సంధి సూత్రం :
కులు, చిఱు, కడు, నడు, నిడు శబ్దములలోని ఐ,డ లకు, అచ్చుపరమైతే ద్విరుక్తటకారం ఆదేశం అవుతుంది.

అభ్యాసం:
కింది సంధి పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
అ) అయ్యయ్యో = అయ్యో + అయ్యో = (ఓ + అ = అ) = ఆమ్రేడిత సంధి
ఆ) అన్నన్న = అన్న + అన్న = (అ + అ = అ) = ఆమ్రేడిత సంధి
ఇ) ఎట్లెట్లు = ఎట్లు + ఎట్లు = (ఉ + ఎ = ఎ) = ఆమ్రేడిత సంధి
ఈ) ఆహాహా = ఆహా + ఆహా = (ఆ + ఆ = ఆ) = ఆమ్రేడిత సంధి
ఉ) అడిగడిగి = అడిగి + అడిగి = (ఇ + అ = అ) = ఆమ్రేడిత సంధి
ఊ) ఓరోరి = ఓరి + ఓరి = (ఇ + ఓ = ఓ) = ఆమ్రేడిత సంధి
ఋ) కుట్టుసురు = కుఱు + ఉసురు = (ఱు + ఉ = ట్టు) = ద్విరుక్తటకార సంధి
ఋ)పట్టపగలు = పగలు + పగలు = ఆమ్రేడిత సంధి
ఎ) కొట్టకొన = : కొన + కొన = ఆమ్రేడిత సంధి

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి :
ఈ కింది పదాలను విడదీయండి.
1) ఉదా :
రామానుజుడు = రామ + అనుజుడు = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
అ) రామాలయం = రామ + ఆలయం = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి

2) ఉదా :
కవీంద్రుడు = కవి + ఇంద్రుడు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
అ) కవీశ్వరుడు = కవి + ఈశ్వరుడు = (ఇ + ఈ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి

3) ఉదా :
భానూదయం = భాను + ఉదయం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
అ) వధూపేతుడు = వధూ + ఉపేతుడు = (ఊ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి

4) ఉదా :
పిత్రణం = పితృ + ఋణం = (బ + ఋ = ౠ) = సవర్ణదీర్ఘ సంధి
అ) మాతణం = మాతృ + ఋణం = (బ + ఋ =ఋ) = సవర్ణదీర్ఘ సంధి

సవర్ణదీర్ఘ సంధి సూత్రం:
అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

పై విధంగా సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను ‘సంస్కృత సంధులు’ అంటారు.
సవర్ణములు:
‘అ’ వర్ణానికి – “అ – ఆ -” లు సవర్ణాలు
‘ఇ’ వర్ణానికి – “ఇ – ” లు సవర్ణాలు
‘ఉ’ వర్ణానికి – “ఉ – ఊ -” లు సవర్ణాలు
‘ఋ’ వర్ణానికి – “ఋ – ఋ -” లు సవర్ణాలు

అభ్యాసం: 1
కింది పదాలను విడదీయండి.
1) ఉదా :- విద్యా ర్థి = విద్యా + అ = (ఆ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) మహానందము = మహా + ఆనందము = (ఆ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
3) కోటీశ్వరులు = కోటి + ఈశ్వరులు = (ఇ + ఈ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
4) సువర్ణాధ్యాయం = సువర్ణ అధ్యాయం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
5) కరీంద్రం = కరి + ఇంద్రం = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
6) సమరాంగణం = సమర + అంగణం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
7) శుభారంభం = శుభ + ఆరంభం = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
8) కపీంద్రులు = కపి + ఇంద్రులు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
9) అష్టావధానం = అష్ట + అవధానం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
10) మహీంద్రుడు = మహీ + ఇంద్రుడు = (ఈ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
11) పితౄణం = పితృ + ఋణం = (ఋ + ఋ = బూ)= సవర్ణదీర్ఘ సంధి

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 2
కింది పదాలు కలిపి రాయండి. సంధిని పేర్కొనండి.
1) సోమన + అది = సోమనాద్రి = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) రవి + ఇంద్రుడు = రవీంద్రుడు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
3) భాను + ఉదయం = భానూదయం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
4) మాతృ + ఋణం = మాతణం = (ఋ + ఋ = ఋ) = సవర్ణదీర్ఘ సంధి
5) మహా + ఆత్ముడు = మహాత్ముడు = (ఆ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
6) చారు + ఊహ = చారూహ = (ఉ + ఊ – ఊ) = సవర్ణదీర్ఘ సంధి
7) కర + అగ్రం = కరాగ్రం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
8) గిరి + ఈశుడు = గిరీశుడు = (ఇ + ఈ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి

2. గుణసంధి :
ఈ కింది పదాలను విడదీయండి.
1. ఉదా :
రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణసంధి
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణసంధి
ఆ) మహేంద్రుడు = మహా + ఇంద్రుడు = (ఆ + ఇ = ఏ) = గుణసంధి
ఇ) నరేంద్రుడు = నర + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణసంధి

2. ఉదా :
పరోపకారం = పర + ఉపకారం = (అ + ఉ = ఓ) = గుణసంధి
ఈ) మహోన్నతి = మహా + ఉన్నతి = (ఆ + ఉ = ఓ) = గుణసంధి
ఉ) దేశోన్నతి = దేశ + ఉన్నతి = (అ + ఉ = ఓ) = గుణసంధి
ఊ) గృహోపకరణం = గృహ + ఉపకరణం = (అ + ఉ = ఓ) = గుణసంధి

3. ఉదా :
మహర్షి = మహా + ఋషి = (ఆ + ఋ = అర్)= గుణసంధి
ఋ) రాజర్షి = రాజ + ఋషి = (అ + ఋ = అర్) = గుణసంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను, మూడు రకాలుగా విడదీయడం సాధ్యమైంది.

1. అ / ఆ లకు, ఇ / ఈ లు కలసి, ‘ఏ’ గా మారడం.
2. అ ఆ లకు, ఉ / ఊ లు కలసి ‘ఓ’ గా మారడం.
3. అ / ఆ లకు, ఋ, ౠ లు కలసి, ‘అర్’ గా మారడం.

పై మూడు సందర్భాల్లోనూ పూర్వస్వరం అంటే, సంధి విడదీసినపుడు మొదటి పదం చివరి అచ్చు, అ | ఆ లు గా ఉంది. పరస్వరం’ అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు, ఇ – ఉ – ఋ – లు గా వచ్చాయి. ‘ఇ’ కలిస్తే – ఏ , ‘ఉ’ కలిస్తే – ఓ, ‘ఋ’ కలిస్తే ‘అర్’ ఆదేశంగా వచ్చాయి.

గుణాలు : ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని “గుణసంధి” అంటారు.

గుణసంధి సూత్రం :- అకారానికి ఇ ఉ ఋ లు పరమైతే, ఏ, ఓ, ‘అర్ లు ఏకాదేశంగా వస్తాయి.

అభ్యాసం : 3
ఈ కింది పదాలను కలిపి, ఏ సంధులో పేర్కొనండి.
1) నర + ఈశ్వరుడు = నరేశ్వరుడు = (అ + ఈ = ఏ) = గుణసంధి
2) మహా + ఈశ్వరుడు = మహేశ్వరుడు = (ఆ + ఈ = ఏ) = గుణసంధి
3) దేవ + ఋషి = దేవర్షి = (అ + ఋ = అర్) = గుణసంధి
4) స్వాతంత్ర్య + ఉద్యమం = స్వాతంత్ర్యోద్యమం = (అ + ఉ = ఓ) = గుణసంధి
5) రామ + ఈశ్వరం = రామేశ్వరం = (అ + ఈ = ఏ) = గుణసంధి
6) ఇతర + ఇతర = ఇతరేతర = (ఆ +a = ఏ) = , గుణసంధి

3. యణాదేశ సంధి :
ఈ కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.
అ. ఉదా :
అత్యానందం = అతి + ఆనందం = (త్ + ఇ + ఆ =య) = యణాదేశసంధి
1. అత్యంతం = అతి – + అంతం = (అత్ + ఇ + అ = య) = యణాదేశ సంధి

ఆ. ఉదా :
అణ్వస్త్రం = అణు + అస్త్రం = (డ్ + ఉ + అ = వ) = యణాదేశసంధి
2. గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ = (ర్ + ఉ + ఆ = వ) = యణాదేశ సంధి

ఇ. ఉదా :
పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ = (ఋ + ఆ = ర్) = యణాదేశ సంధి
3. మాత్రంశ = మాతృ + అంశ = (బ + అ = ర) = యణాదేశసంధి

గమనిక :
ఇ, ఉ, ఋ లకు, అసవర్ణాలు (వేరేవర్ణాలు) పక్కన వచ్చినపుడు క్రమంగా వాటికి, య – వ-ర-లు వచ్చాయి. (య వ ర లను ‘యజ్ఞులు’ అంటారు.) ఇవి చేరినపుడు ఏర్పడే సంధిని, “యణాదేశసంధి” అంటారు.

యణాదేశ సంధిలో
‘ఇ’ కి బదులుగా = య్
‘ఉ’ కి బదులుగా = వ్
‘ఋ’ కి బదులుగా = ర్ వచ్చాయి.

యణాదేశ సంధి సూత్రం :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 4
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
ప్రత్యహం = ప్రతి + అహం = (ఇ + అ = య) = యణాదేశ సంధి
అ) ప్రత్యుత్తరం = ప్రతి + ఉత్తరం = (ఇ + ఉ = యు) = యణాదేశ సంధి
ఆ) మధ్వరి = మధు + అరి = (ఉ + అ = వ) = యణాదేశ సంధి
ఇ) పిత్రార్జితం = పితృ + ఆర్జితం = (ఋ + ఆ = రా) = యణాదేశ సంధి
ఈ) అత్యంత = అతి + అంత = (ఇ + అ = య) = యణాదేశ సంధి
ఉ) మాత్రంశ = మాతృ + అంశ = (ఋ + అ = ర) = యణాదేశ సంధి
ఊ) అణ్వాయుధం = అణు + ఆయుధం = (ఉ + ఆ = వా) = యణాదేశ సంధి
ఋ) ప్రత్యక్షం = ప్రతి + అక్షం = (ఇ + అ = య) = యణాదేశ సంధి
ఋ) ప్రత్యహం = ప్రతి + అహం = (ఇ + అ = య) = యణాదేశ సంధి
ఎ) ఆద్యంత = ఆది + అంత = (ఇ + అ = య) = యణాదేశ సంధి

అభ్యాసం: 5

ఈ కింది పదాలను కలిపి రాసి, సంధిని పేర్కొనండి.
1) సు + ఆగతం = స్వాగతం = (ఉ + ఆ = వా) = యణాదేశ సంధి
2) అణు + అస్త్రం = అణ్వస్త్రం = (ఉ + అ = ఆ) = యణాదేశ సంధి
3) అతి + ఆశ = అత్యాశ = (ఇ + ఆ = యా) = యణాదేశ సంధి
4) పితృ + ఆర్జితం = పిత్రార్జితం = (ఋ + ఆ = రా) = యణాదేశ సంధి

4. వృద్ధి సంధి :
ఈ కింది పదాలను విడదీయండి.
1. ఉదా :
వసుధైక =వసుధా + ఏక = (ఆ + ఏ = ఐ) = వృద్ధి సంధి
అ) రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
ఆ) సురైక = సుర + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి

2. సమైక్యం = సమ + ఐక్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఇ) అప్లైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఈ) దేవైశ్వర్యం = దేవ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి

3. పాపౌఘము = పాప + ఓఘము = (అ + ఓ = ఔ) = వృద్ధిసంధి
ఉ) వనౌకసులు = వన + ఓకసులు = (అ + ఓ = ఔ) = వృద్దిసంధి
ఊ) వనౌషధి = వన + ఓషధి = (అ + ఓ = ఓ) = వృద్ధి సంధి

4. రసౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ = ఔ) = వృద్దిసంధి
ఋ) దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఋ) దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధిసంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను విడదీసినపుడు మీరు గమనించిన విషయం సరిచూడండి.
1) వృద్ధిసంధి ఏర్పడేటప్పుడు, ప్రతిసారీ పూర్వస్వరంగా ‘అ’ వచ్చింది.
2) పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఏ, ఐ, ఔ లున్నాయి.
3) అకారానికి ఏ, ఐ లు కలిసినపుడు ‘ఐ’ వచ్చింది.
4) అకారానికి ఓ, ఔ లు కలిసినపుడు ‘ఔ’ వచ్చింది.

వృద్ధి సంధి సూత్రం :
అకారానికి ఏ, ఐ లు పరమైతే ‘ఐ కారమూ, ఓ, ఔలు పరమైతే, ఔ కారమూ ఏకాదేశంగా .. వస్తాయి. దీనిని వృద్ధి సంధి అంటారు.

వృద్ధులు :
ఆ, ఐ, ఔలను వృద్ధులు అంటారు.

అభ్యాసం : 6
ఈ కింది సంధులను విడదీసి, సంధి పేర్లు రాయండి.
1) సభాంతరాళం = సభ + అంతరాళం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) కిరీటాకృతి = కిరీట + ఆకృతి = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి.
3) లఘత్తరం = లఘు + ఉత్తరం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
4) గిరీంద్రం = గిరి + ఇంద్రం = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
5) మాతణం = మాతృ + ఋణం = (బ + ఋ = ఋ) = సవర్ణదీర్ఘ సంధి
6) ఉదరాగ్ని = ఉదర + అగ్ని = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
7) మహేశ = మహా + ఈశ = (ఆ + ఈ = ఏ) = గుణసంధి
8) సూర్యోదయం = సూర్య + ఉదయం = (అ + ఉ = ఓ) = గుణసంధి
9) నరేంద్ర = నర + ఇంద్ర = (అ + ఇ = ఏ) = గుణసంధి
10)వర్షర్తువు = వర్ష + ఋతువు = (అ + ఋ = అర్) = గుణసంధి
11) అభ్యుదయం = అజి + ఉదయం = (ఇ + ఉ = యు) యణాదేశ సంధి
12) మాత్రాదరం = మాతృ + ఆదరం = (ఋ + ఆ = రా) = యణాదేశ సంధి
13) అణ్వస్త్రం = అణు + అస్త్రం = (ఉ + అ = వ) = యణాదేశ సంధి
14) లోకైక = లోక + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
15) దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
16) భాషోన్నత్యం = భాషా + ఔన్నత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధిసంధి
17) నిఖిలైశ్వర్యం = నిఖిల + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్దిసంధి

క్రియలు – భేదములు

ఈ కింది వాక్యాలలోని క్రియలను గమనించండి.

  1. ఉదయ్ భోజనం చేసి, సినిమాకు వెళ్ళాడు.
  2. అరుణ్ చిత్రాలు గీసి, ప్రదర్శనకు పెట్టాడు.
  3. వైష్ణవి పుస్తకం చదివి, నిద్రపోయింది.

సమాపక క్రియలు :
పై వాక్యాలలో ప్రతి వాక్యం చివర ఉన్న క్రియలు, పని పూర్తి అయ్యిందని తెలుపుతున్నాయి. వీటిని ‘సమాపక క్రియలు” అంటారు.

అసమాపక క్రియలు :
అవాక్యం మధ్యలో ఉన్న “చేసి”, “గీసి”, “చదివి” – అన్న క్రియలు పని పూర్తి కాలేదని తెలుపుతున్నాయి. వీటిని “అసమాపక క్రియలు” అంటారు.

వాక్య భేదాలు

1. సామాన్యవాక్యం :
1) ఉష ఫారం చదువుతున్నది.
2) మురళి మంచి బాలుడు.

గమనిక :
మొదటి వాక్యంలో క్రియ ఉంది. రెండో వాక్యంలో క్రియలేదు. ఈ విధంగా క్రియ ఉన్నా, లేకున్నా, ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను “సామాన్య వాక్యాలు” అంటారు.

2. సంక్లిష్ట వాక్యం :
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి, రాయండి.
ఉదా :
1. శ్రీకాంత్ అన్నం తిన్నాడు.
2. శ్రీకాంత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీకాంత్ అన్నం తిని, బడికి వచ్చాడు. (సంక్లిష్టవాక్యం)

గమనిక :
పై వాక్యాలను కలిపినపుడు ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని, అసమాపక క్రియలూ ఉంటాయి. ఇటువంటి వాక్యాలను “సంశిష్ట వాక్యాలు” అంటారు.

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 1
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి, సంక్లిష్ట వాక్యాలుగా రాయండి.
1) మాధవి బాగా చదివింది.
2. మాధవి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నది.
జవాబు:
మాధవి బాగా చదివి, ఎక్కువ మార్కులు తెచ్చుకున్నది. (సంక్లిష్టవాక్యం)

2) గౌతమి సంగీతం నేర్చుకున్నది.
2. గౌతమి బాగా పాడింది.
జవాబు:
గౌతమి సంగీతం నేర్చకొని, బాగా పాడింది (సంక్లిష్టవాక్యం)

3. సంయుక్తవాక్యం :-
సమప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడ్డ వాక్యాలు “సంయుక్తవాక్యాలు”

అభ్యాసం : 2
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి.
ఉదా :
1) కల్పన పాడుతుంది. కల్పన నాట్యం చేస్తుంది.
జవాబు:
కల్పన పాడుతుంది, నాట్యం చేస్తుంది.

2) అతడు నటుడు. అతడు రచయిత.
జవాబు:
అతడు నటుడు, రచయిత.

3) అశ్విని అక్క. జ్యోతి చెల్లెలు.
జవాబు:
అశ్విని, జ్యోతి అక్కా చెల్లెండ్రు.

4) అరుణ ఊరికి వెళ్ళింది. అనూష ఊరికి వెళ్ళింది.
జవాబు:
అరుణ, అనూష ఊరికి వెళ్ళారు.

వాక్య భేదములు కింది వాక్యాన్ని చదివి అర్థం చేసుకోండి.

1. ఆశ్చర్యార్థక వాక్యం :
1. ఆహా ! ఎంత బాగుందో !

గమనిక :
పై వాక్యము ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కనుక ఈ వాక్యం “ఆశ్చర్యార్థక వాక్యం”

2. విధ్యర్థక వాక్యం :
ఉదా :
చేతులు కడుక్కో గమనిక : ఈ వాక్యం విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచిస్తున్నది. అంటే చేయాల్సిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని “విధ్యర్థక వాక్యం” అంటాం.

3. నిషేధక వాక్యం :
ఉదా :
చాలాసేపు టీవీ చూడొద్దు. ఈ వాక్యము టీవీ చూడొద్దని చెబుతున్నది. టీవి చూడటాన్ని ఈ వాక్యం నిషేధిస్తోంది. కాబట్టి ఇది “నిషేధార్ధక వాక్యం ”.
లక్షణం :
ఒక పనిని చేయవద్దని నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యం “నిషేధార్థక వాక్యం”.

4. అనుమత్యర్థక వాక్యం :
ఉదా : లోపలికి రావచ్చు.
ఈ వాక్యము ఒక వ్యక్తికి అనుమతిని ఇస్తున్నట్లు సూచిస్తున్నది. అంటే ఇది “అనుమత్యర్థక వాక్యం”.

5. సామర్థ్యార్థక వాక్యం :
ఉదా : గోపాల్ చెట్టు ఎక్కగలడు.

ఈ వాక్యములో గోపాలు చెట్టు ఎక్కగలడు. అంటే గోపాల్ కు ఉన్న చెట్టును ఎక్కే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది “సామర్థ్యార్థక వాక్యం”.

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 1
కింది వాక్యాలు వాటిలోని భావాన్ని అనుసరించి, ఏ వాక్యాలు అవుతాయో, గుర్తించి రాయండి.
అ) సీత కలెక్టరైందా? :- ప్రశ్నార్థక వాక్యం
ఆ) మీరు తర్వాత కొట్టుకోవచ్చు :- అనుమత్యర్థకవాక్యం
ఇ) అక్క చెప్పేది విను :- ప్రార్థనాద్యర్థక వాక్యం
ఈ) రసాభాస చేయకండి :- నిషేధార్థక వాక్యం
ఉ) సీత లెక్కలు బాగా చేసింది :- సామాన్యవాక్యం
ఊ) నీవు ఇంటికి వెళ్ళవచ్చు :- అనుమత్యర్థక వాక్యం

అభ్యాసం : 2
కింది వాక్యాలు వాటిలోని భావాన్ని అనుసరించి, ఏ వాక్యోలో గుర్తించండి.
ఉదా :
అ) ఎంత బాగుందో! :- ఆశ్చర్యార్థకం
ఆ) నువ్వు చదువు :- విధ్యర్థకం
ఇ) అల్లరి చేయవద్దు :- నిషేధార్థక వాక్యం
ఈ) పరీక్ష రాయవచ్చు :- అనుమత్యర్థక వాక్యం

మరికొన్ని వాక్య భేదాలు :
1. సందేహార్థక వాక్యం :
ఉదా : రవి పనిచేస్తాడో? చెయ్యడో?
ఈ వాక్యం చదివితే, రవి పని చేయడం అనే విషయంలో అనుమానం, అంటే సందేహం కలుగుతున్నది. ఇలా సందేహాన్ని తెలిపే వాక్యాలను “సందేహార్థక వాక్యాలు” అంటారు.

2. ఆశీరర్థక వాక్యం : (ఆశీరర్థక వాక్యాలు)
ఉదా : నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు.
పై వాక్యం ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నట్లు కనబడుతోంది. ఇలా ఆశీర్వదిస్తున్నట్లు అర్థాన్ని సూచించే వాక్యాలను “ఆశీరర్థక వాక్యాలు” అంటారు.

3. ప్రార్థనాద్యర్థక వాక్యం :
ఉదా : దయచేసి పని చేయ్యండి.
ఈ వాక్యం ఒక పనిని చేయమని ప్రార్థిస్తూ ఉంది. అంటే ప్రార్థన అర్థాన్ని సూచిస్తోంది. కాబట్టి ఇది ప్రార్థనాద్యర్థక వాక్యం

లక్షణం : ఒక వాక్యం ప్రార్థన అర్థాన్ని సూచిస్తున్నట్లు ఉంటే అది “ప్రార్థనాద్యర్థక వాక్యం”.

4. ప్రశ్నార్థక వాక్యం :
ఉదా : ఏం ! ఎప్పుడొచ్చా వ్? ఈ వాక్యం ప్రశ్నిస్తున్నట్లు ఉంది. అంటే ఇది ‘ప్రశ్నార్థక వాక్యం’.

5. హేత్వర్థక వాక్యం :
ఉదా : వర్షాలు లేక పంటలు పండలేదు.

గమనిక :
ఈ వాక్యం మనకు రెండు విషయాల్ని తెలుపుతోంది. ఒకటి, “వర్షాలు లేవని, రెండు పంటలు పండలేదు అని”. పంటలు పండక పోవడానికి కారణం, మొదటి విషయం అంటే వర్షాలు లేకపోవడం. ఇక్కడ మొదటి విషయం, రెండో విషయానికి కారణం అవుతోంది. అంటే హేతువు. అన్నమాట. ఇలా హేతువు అర్థాన్ని సూచించే వాక్యం “హేత్వర్థక వాక్యం”

లక్షణం :
ఒక పని కావడానికి, కారణాన్ని లేదా హేతువును సూచించే అర్థం ఉన్న వాక్యాన్ని, హేత్వర్థక వాక్యం : అంటారు.

అభ్యాసం :
కింది వాక్యాలు ఏ అర్థాన్ని సూచించే వాక్యాలో రాయండి.
1) ఎవరా పైడి బొమ్మ? :- ప్రశ్నార్థక వాక్యం
2) పంటలు పండలేదు. :- సామాన్యవాక్యం
3) దయచేసి సెలవు ఇయ్యండి :- ప్రార్థనాద్యర్థక వాక్యం
4) కిషన్ చదువుతాడో? లేదో? :- సందేహార్థక వాక్యం
5) మీకు శుభం కలగాలి :- ఆశీరర్ధక వాక్యం

ఛందస్సు – గురు లఘు నిర్ణయం

పద్యాలు, గేయాలు కొన్ని నియమాలకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోవడానికి వీలుగా ఉంటాయి.

ప్రతి నియమానికీ కూడా, కొన్ని గుర్తులుంటాయి.

1. లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు, “లఘువులు”. హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకునే అక్షరాలు లఘువులు.

2. గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు, గురువులు.

లఘువునకు గుర్తు = “l”
గురువునకు గుర్తు = “U”

లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించడం.

AP Board 7th Class Telugu Grammar 2

గురువులు లక్షణాలు – వాటిని గుర్తించే విధము

AP Board 7th Class Telugu Grammar 3

AP Board 7th Class Telugu Grammar 4
అభ్యాసం: 1
కింది పదాలకు గురువు, లఘువులను నిర్ణయించండి.
AP Board 7th Class Telugu Grammar 5

అభ్యాసం : 2
కింది పదాలకు లఘువు, గురువులు నిర్ణయించండి.

అలంకారాలు

1. అలంకారం :
చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.
అలంకారాలు రెండు రకాలు :
అ) శబ్దాలంకారములు.
ఆ) అర్థాలంకారములు

అ. శబ్దాలంకారం :
శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి శబ్దాలంకారాలు.
కింది గేయాన్ని గమనించండి.
“అది గదిగో మే
మేడ కున్నది గో
గోడ పక్కన నీ
నీడలో కోడెదూ
దూడవేసింది పే

పై కవితలో ప్రతి వాక్యం చివర ‘డ’ అనే అక్షరం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. (అంటే పునరావృతమయ్యింది). ” ఇది కవితకు అందం తెచ్చింది. వినసొంపుగా తయారయింది. ఈ అందం, వినసొంపు, ‘డ’ అనే శబ్ద ప్రయోగం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని ‘శబ్దాలంకారం’ అంటారు.

1. అంత్యానుప్రాసాలంకారం :
ఒక అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు వాక్యం చివర మాటిమాటికి వస్తే, దాన్ని • “అంత్యానుప్రాస” అలంకారం” అంటారు.
1. “భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామకథయే రక్తి
ఓ కూనలమ్మ”

గమనిక :
పై కవితలో ప్రతి వాక్యం చివర ‘క్తి’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ కవితలో “అంత్యానుప్రాస” అనే శబ్దాలంకారం ఉంది.

2. “గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము
పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం, ప్రతి పాదం చివర వచ్చింది. కాబట్టి. దీనిలో “అంత్యానుప్రాస” అనే శబ్దాలంకారం ఉంది.

1. అంత్యానుప్రాసాలంకార లక్షణం :
పాదాంతంలో, లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు, లేదా అక్షరాలు ఉంటే, దాన్ని “అంత్యానుప్రాసాలంకారం” అంటారు.

గమనిక :
కింది గేయాలు గమనించండి.
1. వేదశాఖలు వెలిసె నిచ్చట
ఆది – కావ్యం బలరె నిచ్చట
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర “ఇచ్చట” అని, రెండో పాదం చివర కూడా “ఇచ్చట” అని ఉంది. కాబట్టి ఇది “అంత్యానుప్రాసాలంకారం”.

2. “తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుర్రపు కళ్ళెం
పై మూడు పాదాల్లో చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి ‘అంత్యానుప్రాసాలంకారం’.

2. వృత్త్యనుప్రాసాలంకార లక్షణం :
ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అక్షరాలు అనేక సార్లు తిరిగి రావడాన్ని, ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. (వృత్తి అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం)
ఉదా :
నానా ! నేను నిన్నేన్నాన్నానా? నీవు నన్నేన్నా అన్నావా?

గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం అనేక సార్లు వచ్చింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాస” అనే శబ్దాలంకారం.

అభ్యాసం : 1
కింది వాక్యాల్లో ఏ అలంకారాలున్నాయో గుర్తించి, కారణాలు చెప్పండి.

1. కా కి కో కి కా దు దా !
జవాబు:
ఈ వాక్యంలో ‘క’ అనే అక్షరం చాలా సార్లు వచ్చింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాసాలంకారం”

2. లచ్చి పుచ్చకాయలు తెచ్చి యిచ్చింది.
జవాబు:
పై వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం, ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఈ వాక్యంలో ‘వృత్త్యనుప్రాసాలంకారం’ ఉంది.

అభ్యాసం : 2
1. “గంతులు వేతురు కౌతు కమున”
జవాబు:
ఈ పద్యంలో మళ్ళీ వచ్చిన హల్లు :- ‘త’

2. పోరు దురు గికురు వొడుచుచు దూఱుదురు.
జవాబు:
ఈ పద్యంలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు :- ‘ర’

3. ఒ నొ ని చల్ది కావడి,
నొ డడ కించి దాచు, నొ డదివే
ఱొ డొని మొఱగి కొని చన
నొ డొక
జవాబు:
ఈ పద్యంలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు :- ‘క’ ..

గమనిక :
పై మూడు ఉదాహరణలలోనూ, ఒకే హల్లు ఎక్కువ సార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఆ పాదాలలో వృత్త్యనుప్రాసాలంకారం ఉంది.

ఆ. “అర్థాలంకారాలు” :

1. ఉపమాలంకారం :
1. ఆమె ముఖం అందంగా ఉంది.
2. ఆమె ముఖం చంద్రబింబం లాగ అందంగా ఉన్నది.

పై వాక్యాలలోని తేడాను గమనించండి. ‘ఆమె ముఖం అందంగా ఉంది’ అనే దానికి బదులుగా, ‘ఆమె ముఖం చంద్రబింబంలాగ అందంగా ఉంది. అనే వాక్యం మనలను బాగా ఆకట్టుకుంటుంది. ఇలా ఆకట్టుకొనేలా చెప్పడానికి ‘చంద్రబింబం’ అనే పోలికను తీసుకున్నాము. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి అందమైన పోలికను చెప్పడాన్ని “ఉపమాలంకారం” అంటారు.

సోముడు భీముడి లాగా(వలె) బలవంతుడు.

గమనిక :
ఈ. వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను, కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1. సోముడు – “ఉపమేయం” (అంటే ఎవరిని గురించి చెప్తున్నామో ఆ పదం)
2. భీముడు – ఉపమానం (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3. బలవంతుడు – సమానధర్మం (పోల్చడానికి వీలయిన సమాన గుణం, ఉపమాన, ఉపమేయాలలో ఉన్న ఒకే విధమైన ధర్మం కావాలి.)
4. లాగ (వలె) – ఉపమావాచకం. (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)
వివరణ :
ఉపమాన, ఉపమేయాలకు చక్కని సామ్యం అంటే పోలిక చెప్పడాన్ని “ఉపమాలంకారం” అంటారు. * ఉపమాలంకారం లక్షణం : ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే “ఉపమాలంకారం”.

AP Board 7th Class Telugu Grammar

2. ఉత్ప్రేక్షాలంకారము :
ఉదా : అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహమేమోనని భయపడ్డాను.

గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి, మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం ఊహించుకోవడం కూడా ఒక అలంకారమే.

ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేని దాన్ని ఉన్నట్లుగా, ఊహించి చెప్పడాన్ని “ఉత్ప్రేక్షాలంకారం” అంటారు.
ఉదా :
1. ఆ మేడలు, ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అన్నట్లు ఉన్నవి. ..
2. ఆ ఏనుగు, నడగొండా అన్నట్లు ఉంది.

ఈ కింది వాక్యాన్ని గమనించండి. ఇందులో కూడా పోలిక ఉంది. ఆ పోలిక ఊహించి చెప్పినది.
పై వాక్యంలో 1. ఉపమేయం : ఏనుగు
2. ఉపమానం : నడిచే కొండ

అంటే ఏనుగును నడిచే కొండలా ఊహిస్తున్నాము.

ఉత్ప్రేక్షాలంకార లక్షణం :
ఉపమేయాన్ని, మరొక దానిలా ఊహించి చెప్పడం “ఉత్ప్రేక్షాలంకారం”.

అభ్యాసాలు:
కింది వాక్యాల్లోని అలంకారాలను గుర్తించండి.
1. గోపి సూర్యుని లాగ ప్రకాశిస్తున్నాడు.
జవాబు:
ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉంది. ఇందు గోపి సూర్యునితో పోల్చడం జరిగింది.

2. మండే ఎండ నిప్పుల కొలిమా ! అన్నట్లు ఉంది.
జవాబు:
ఈ వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉంది. ఇందు ‘మండే ఎండ’ నిప్పుల కొలిమిగా ఊహింపబడింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 17 వేసవి సెలవుల్లో

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 17th Lesson వేసవి సెలవుల్లో Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 17th Lesson వేసవి సెలవుల్లో

7th Class Telugu 17th Lesson వేసవి సెలవుల్లో Textbook Questions and Answers

ప్రశ్నలు జవాబులు

కింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి.

ప్రశ్న 1.
చదువంటే కేవలం రాయటం, చదవడమేనా ?. ఇంకా ఏ ఏ అంశాలను చదువులో చేర్చవచ్చు?
జవాబు:
చదువు అంటే కేవలం, రాయడం, పుస్తకాలు చదవడమూ మాత్రం కాదు. తెలియని విషయాలను తెలుసుకొనే దంతా, పాఠమే. తెలియని విషయాలు నేర్చుకోడం అంతా చదువే.

ఈ రోజుల్లో చాలామంది సంవత్సరం చివర జరిగే పరీక్షలలో సమాధానాలు రాయడానికి కావలసిన విషయం నేర్చుకోవడమే చదువు అని భ్రాంతి పడుతున్నారు. ఆ పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవడమే వారికి లక్ష్యంగా ఉంటోంది. దాని కోసం పాఠాలు, నోట్సులు బట్టీ పట్టి, వారు పరీక్షలు రాస్తున్నారు.

నిజానికి పిల్లలు తమకు తెలియని విషయాలు అన్నీ నేర్చుకోవాలి. ఇండ్లలో పెరిగే మొక్కల గురించి, పొలాల్లో పండించే పంటలు గురించి తెలుసుకోవాలి. ఆటలలో మెలకువలు తెలుసుకోవాలి. తెలుగు పద్యాలు భావంతో నేర్చుకోవాలి. ఈత, యోగాభ్యాసాలు నేర్చుకోవాలి. వ్యాయామం చేయడం నేర్చుకోవాలి.

మహాత్ముల జీవిత చరిత్రలు చదివి విషయాలు గ్రహించాలి. తల్లిదండ్రులు చేసే వృత్తి రహస్యాలను తెలుసుకోవాలి. .. చేపలు పట్టడం, చెరువుల్లో ఈత , పాటలు పాడడం, పద్యాలు వ్రాయడం, గణిత అవధానం చేయడం మొదలయినవన్నీ నేర్చుకోవాలి. తల్లి చేసే పనులు కూడా నేర్చుకోవాలి. వంట పని కూడా నేర్వాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 17 వేసవి సెలవుల్లో

ప్రశ్న 2.
మీకిష్టమైన ఆట ఏది? ఎందుకు? దానివల్ల మీరు ఏం సాధించాలనుకుంటున్నారు?
జవాబు:
నాకు ఇష్టమైన ఆట ‘క్రికెట్టు’. మా తాతగారి ఊరు పల్లెటూరు. సెలవుల్లో అక్కడకు వెళ్ళేవాడిని. అక్కడి పిల్లలు గూటీబిళ్ళ ఆట ఆడేవారు. అక్కడి పిల్లలతో కలిసి నేనూ ఆ ఆట ఆడేవాడిని. గూటీబిళ్ళ ఆట క్రికెట్ లాంటిదే. తరువాత మా స్కూల్లో క్రికెట్ నేర్చుకున్నా తీరిక సమయంలో మా ఇంట్లో అంతా టీ.వీ.లో క్రికెట్’ చూస్తారు. ఆ విధంగా నాకు క్రికెట్ అంటే అభిమానం కలిగింది.

ఈ రోజు మన దేశంలో సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, ‘కపిల్ దేవ్, గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, గంగూలీ వంటి మంచి క్రికెటర్లు ఉన్నారు. వాళ్ళు ఈ ఆట ద్వారా ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కోట్లకొలది రూపాయలు సంపాదించారు. ఇంకా వాణిజ్య ప్రకటనల ద్వారా ఎంతో సంపాదిస్తున్నారు. దేశానికి ఎంతో పేరు తెచ్చారు. వారికి ఎందరో అభిమానులున్నారు.

నేను క్రికెట్ బాగా నేర్చుకొని, పైన చెప్పిన క్రికెటర్లలాగా పేరు తెచ్చుకోవాలనీ, డబ్బు సంపాదించాలనీ కోరుకొంటున్నాను.

ప్రశ్న 3.
ఈ కథ చదివిన తర్వాత పద్యపఠనం మీద నీకు కలిగిన అభిప్రాయాలు తెలపండి.
జవాబు:
పద్య పఠనం పోటీ మంచి పోటీ. ఈ పోటీ ద్వారా ప్రసిద్ధులైన తెలుగుకవుల పద్యాలూ, వాటి భావాలూ తెలుసుకోవచ్చు. పద్యాలు కంఠతా పట్టడం వల్ల, మనలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా పద్యాలు మన తెలుగు వారి ఆస్తి. ఇంక ఏ భాషల్లోనూ పద్యాలు రాగాలతో చదవడం ఉండదు. వుహాకవుల పద్యాలు బట్టీ పట్టడం వల్ల, వాటి అర్థం తెలుసుకోవడం వల్ల అర్థజ్ఞానం కలిగి, మన మాతృభాషపై మంచి పట్టు ఏర్పడుతుంది. మన తల్లిభాషపై అభిరుచి ఏర్పడుతుంది. భాషా జ్ఞానం పెరగడంతో పోటీ పరీక్షలు తెలుగు మాధ్యమంలో రాసి మంచి ఉద్యోగాలు సాధింపవచ్చు. దైవభక్తి కలిగి భగవంతుణ్ణి పద్యాలతో స్తోత్రం చేయవచ్చు.

పద్య పఠనం వల్ల మంచి ఉత్సాహం, ఆనందం, సంతోషం కలుగుతాయి.

AP Board 7th Class Telugu Solutions Chapter 17 వేసవి సెలవుల్లో

ప్రశ్న 4.
మీ వేసవి సెలవులు ఎక్కడ గడపాలనుకుంటున్నారు? ఎందుకు?
జవాబు:
నేను వేసవి సెలవులు మా మామయ్య గారింట్లో గడపాలనుకుంటున్నాను. మా మామయ్య హైస్కూల్లో, – ప్రధానోపాధ్యాయుడు. ఆయనకు లెక్కలు” భౌతికశాస్త్రం బోధించడంలో మంచి అనుభవం ఉంది. ఆయన దగ్గర ఆ సబ్జెక్టుల్లో మెలకువలు నేర్చుకోవాలి. మా మామయ్య గారి ఊరు పల్లెటూరు. మా మామయ్య గారికి కొబ్బరి, మామిడి తోటలు ఉన్నాయి. బొండాలు త్రాగుతూ, మామిడి కాయలు కారం, ఉప్పు నంజుకు తినాలి. కాలువ గట్లపై పరుగులు పెట్టాలి. చెరువులో ఈతలు ఈదాలి.

మామయ్య గారి ఊరులో కాలువ లాకులు ఉన్నాయి. లాకుల్లోకి పడవలు రావడం, పోవడం మహా సరదాగా .. ఉంటుంది. అక్కడే మా తాతగారు ఉన్నారు. ఆయన తెలుగు పండితునిగా పనిచేసి రిటైరయ్యారు. ఆయన దగ్గర పద్యాలు నేర్చుకోవాలి. అందుకే నేను వేసవి సెలవులకు మా మామయ్యగారి ఊరు వెడదామని ఉంది.

కఠిన పదములకు అర్థములు

దోస్తులు = స్నేహితులు
పిసరంత = కొంచెము
ఏమారితే = జాగ్రత్త లేకపోతే
మొరాయించింది = మొండికేసింది
స్పోకెన్ ఇంగ్లీషు క్లాసు = ఇంగ్లీషు మాట్లాడడం నేర్పే తరగతి
మ్యాబ్స్ ట్యూషన్ = లెక్కలు ప్రైవేటు
డుమ్మాకొట్టి = ఎగకొట్టి
నిర్వాకానికి = చేసే పనికి (ఉద్దరింపుకు)
సీరియస్ (Serious) = గంభీరంగా
అయోమయం = బొత్తిగా తెలియనిది
ఉలిక్కిపడు = అదిరిపడు, త్రుళ్ళిపడు
భళ్ళున = గట్టిగా
అంబలి = గంజి
నీట్ (Neat) = శుభ్రము
వాచ్ = గడియారం
ఇంట్రెంస్టింగ్ గా = ఆసక్తిగా
ఫాస్ట్ బౌలింగ్ = వేగంగా బంతి విసరడం
కోచ్ = శిక్షకుడు
కండిషన్ = నియమము
యాక్సిడెంట్ = ప్రమాదము
ద్రోణాచార్య అవార్డు = ఆటలలో మంచి నేర్పుగల వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బహుమతి

AP Board 7th Class Telugu Solutions Chapter 17 వేసవి సెలవుల్లో

ఫిట్ (Fit) = అర్హత
ఆహ్వానించేడు = రమ్మని పిలిచాడు
డాన్సు (Dance) = నృత్యము
డకౌట్ = మొదటి బంతికే పరుగులు ఏమీ చేయకుండా ఔట్ అవడం
న్యాయ నిర్ణేతలు = న్యాయాన్ని నిర్ణయించేవారు
తత్తరపడటం = తొట్రుపాటు పడడం
ప్రశంసలు = పొగడ్తలు
తథ్యము = తప్పనిసరి (ఖాయం)
ఆలయప్రాంగణం = గుడి వాకిలి; ముంగిలి
చిచ్చర పిడుగులు = అగ్గి పిడుగులు (సమర్థులు)
ఏకాగ్రత = ఒకే విషయంపై మనస్సు లగ్నం కావడం
రాణించాడు = శోభించాడు
చిప్పిల్లాయి = కారాయి

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 16th Lesson బాల్య క్రీడలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 16th Lesson బాల్య క్రీడలు

7th Class Telugu 16th Lesson బాల్య క్రీడలు Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి.
జవాబు:

  1. పిల్లలు ఆడుకుంటున్నారు.
  2. పక్షి ఎగురుతూ ఉంది.
  3. కుక్క పరిగెడుతోంది.

ప్రశ్న 2.
చిత్రంలో పిల్లలు ఏ ఏ ఆటలాడుతున్నారు?
జవాబు:

  1. ఒకామె ఉయ్యాల ఊగుతూ ఉంది.
  2. మరికొందరు కబడ్డీ ఆడుతున్నారు.
  3. కొందరు దాగుడుమూతలు ఆడుతున్నారు.
  4. కొందరు పరుగులు పెడుతున్నారు.
  5. కొందరూ కోకో ఆట ఆడుతున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

ప్రశ్న 3.
మీకిష్టమైన ఒక ఆటను ఎలా ఆడతారో చెప్పండి.
జవాబు:
నాకు ‘వాలీబాల్’ ఆట ఇష్టం. వాలీబాల్ ఆటలో రెండు జట్లు ఉంటాయి. అటు ఆరుగురు, ఇటు ఆరుగురు. మధ్యన వాలీబాల్ నెట్ కడతారు. వాలీబాల్ ను ఒక వైపు వారు ఎదుటి వారికి సర్వీసు చేస్తారు. బంతిని అవతల వైపుకు గుద్దుతాడు. ఇవతలివారు దాన్ని అవతలి వైపుకి గెంటాలి. కింద పడిపోతే అటువైపు వారికి పాయింట్ వస్తుంది.. అలా ఎవరికి 15 పాయింట్లు ముందు వస్తే, ఆ పక్షము ఆటలో గెలుస్తుంది.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను భావయుక్తంగా పాడండి.
జవాబు:
మీ గురువుల సాయంతో పద్యాలు పాడడం నేర్చుకోండి.

ప్రశ్న 2.
పాఠంలోని ఏ ఏ పద్యాలు మీకు బాగా నచ్చాయి? ఎందువల్ల?
జవాబు:
ఈ పద్యాలలో పిల్లల ఆటలను వర్ణించిన మూడవ పద్యమూ, ఐదవ పద్యమూ బాగున్నాయి. గోపబాలుర అదృష్టాన్ని గూర్చి చెప్పిన “ఎన్నఁడునైన” అన్న పద్యము ఈ పద్యాలన్నింటిలో మణిపూస వంటిది.

ప్రశ్న 3.
ఈ పద్యాలు విన్నారు కదా ! బలరామకృష్ణులు, గోపబాలకులు ఏ ఏ ఆటలు ఆడారు? వాటిలో ఏ ఏ ఆటలను ఇప్పటి పిల్లలు కూడా ఆడుతున్నారు?
జవాబు:
బలరామకృష్ణులు కింది ‘ఆటలు ఆడారు.

  1. పిల్లన గ్రోవులు ఊదడం
  2. “అల్లి” ఆట
  3. చెట్ల పండ్లు రాలగొట్టడం
  4. జంతువుల గొంతుల పోలికగా కూతలు పెట్టడం
  5. పరుగుపందాలు
  6. బండరాళ్ళపై నుండి జారడం
  7. విచిత్ర వేషాలు
  8. చల్టి చిక్కాలు దాచడం
  9. వెనుక నుండి కళ్ళు మూయడం
  10. తినుబండారాలు దొంగిలించడం.

ఇప్పటి పిల్లలు

  1. పరుగుపందాలు
  2. వెనుకగా వచ్చి కళ్ళు మూసి, మూసింది ఎవరో చెప్పమనడం – వంటి ఆటలు నేటికీ ఆడుతున్నారు.

II చదవడం – రాయడం

1. పాఠం ఆధారంగా కింది అంశాలకు సంబంధించిన పద్యాలు ఏవో చెప్పండి. వాటి కింద గీత గీయండి.
అ) బృందావనం
ఆ) గోపబాలకుల భాగ్యం
ఇ) పిండివంటలతో ఆడుకోవడం
ఈ) ఒకరినొకరు ముట్టుకునే ఆట

అ) బృందావనం :
బృందావనం గురించి, 1వ పద్యం “కసపు గల దిరవు …… పొదడచ్చటికిన్” అనే పద్యంలో చెప్పబడింది.

ఆ) గోపబాలకుల భాగ్యం :
గోపబాలకుల భాగ్యం గురించి, 10వ పద్యం “ఎన్నఁడునైన …………. భాగ్యములింత యొప్పునే” అనే పద్యంలో చెప్పబడింది.

ఇ) పిండివంటలతో ఆడుకోవడం :
పిండి వంటలతో ఆడుకోవడం గురించి, 8వ పద్యం “తీపుగల ………….. నృపా!” అనే పద్యంలో చెప్పబడింది.

ఈ) ఒకరి నొకరు ముట్టుకునే ఆట :
ఒకరినొకరు ముట్టుకొనే ఆట గురించి, 9వ పద్యం “వనజాక్షుఁడు ………….. నరేంద్రా! ” అనే పద్యంలో చెప్పబడింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

2. కింది పద్యాలను చదవండి. వాటి భావం ఆధారంగా ఆ పద్యాలకు శీర్షికలు పెట్టండి.

అ) “వేణువులూఁదుచు ……………. బాల్యవిహారులగుచు” : ఈ పద్యానికి ‘గోపాలుర బాల్య విహారాలు’ అనే శీర్షిక బాగుంటుంది.
ఆ) “కపులమై జలరాశి ………. గొమరు మిగిలి” : ఈ పద్యానికి ‘గోపాలుర విచిత్ర వేషధారణ’ అనే శీర్షిక బాగుంటుంది.

3. కింది పేరాను చదవండి.

ఒకనాడు బలరామకృష్ణులూ, గోపబాలురు అందరూ కలిసి వనభోజనాలు చేయాలని సరదాపడ్డారు. పొద్దుటే లేచి, గబగబా తమ ఇంటి లేగదూడలను బయటికి తోలుకొని వచ్చారు. అందమైన కొమ్ము బూరలను పూరించి ఊదగానే మిగిలిన గోపకుమారులందరూ మేల్కొన్నారు. చల్ది అన్నపు కావడులను భుజాలకు తగిలించుకొన్నారు. తల్లులు సిద్ధం చేసి ఉంచిన రకరకాల పిండివంటలు మూటలు కట్టుకొన్నారు. కాళ్ళకు చెప్పులు వేసుకున్నారు, చేతికర్రలు పట్టుకున్నారు. లెక్కపెట్టడానికి కూడా కష్టమనిపించే తమతమ లేగలమందలను ‘హెహెయ్’ అని కేకలతో తోలుకొంటూ బయలుదేరారు. పరుగులతో ఆయాసపడుతూ అడవిలోకి ప్రవేశించారు. బంగారు, మణి భూషణాలు ధరించి ఉన్న పూలను, చిగుళ్ళను, చిన్నచిన్న పండ్లను అలంకారాలుగా ధరించారు.

కొమ్ముబూరలు పూరిస్తూ, పిల్లనగ్రోవులు ఊదుతూ, తుమ్మెదలతోబాటు ఝుమ్మని పాడుతూ, నెమళ్ళతో సమానంగా నాట్యంచేస్తూ, కోకిలలను, మిగిలిన పక్షులను అనుకరించి కూతలు కూస్తూ, చిలకలతోపాటు అరుస్తూ కేరింతలు కొట్టారు. పైన పక్షులు ఎగురుతూ ఉంటే వాటి నీడలతోపాటు తామూ పరుగులెత్తారు. జలజలపారే సెలయేళ్ళను చెంగున దాటారు. హంసలపక్కనే వాటిని అనుకరిస్తూ నడిచారు. కొంగలతో పాటు ఒంటికాలిమీద నిలబడ్డారు. బెగ్గురు పక్షులను తరిమితరిమి అలసిపోగొట్టారు. నదీ జలాలలో స్నానాలు చేశారు. తీగల ఉయ్యాలలు ఊగారు. గోతులలో దాక్కొన్నారు. దూరాలకు పరుగు పందాలు వేసుకొన్నారు. కోతులవలె చెట్టు ఎక్కారు. పండ్లు తిని, ఆ రుచులకు పరవశించిపోయారు. కుప్పించి దూకి, తమ నీడలను చూసి నవ్వుకొన్నారు. ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. కేరింతలు కొడుతూ, పరుగెడుతూ, పడుకొంటూ, అలసిపోతూ ఇలా ఎన్నో రకాలుగా ఆటలు ఆడుకొన్నారు.

అ) పై పేరాకు వీలైనన్ని ప్రశ్నలు రాయండి.
జవాబు:

  1. బలరామకృష్ణులు దేనికి సరదా పడ్డారు?
  2. వారు వేటిని తోలుకొని వచ్చారు?
  3. బలరామకృష్ణులు గోపకుమారులను నిద్ర నుండి ఎలా లేపారు?
  4. గోపబాలకులు వేటిని భుజాలకు తగిలించు – కున్నారు?
  5. గోపబాలురు వేటిని మూటకట్టుకున్నారు?
  6. వారు కాళ్ళకు ఏమి ధరించారు?
  7. వారి లేగల మందలు ఎన్ని ఉన్నాయి?
  8. వారు లేగలను ఎలా తోలుకుంటూ వచ్చారు?
  9. వారు దూడలతో ఎక్కడ ప్రవేశించారు?
  10. గోపబాలుర అలంకారాలు పేర్కొనండి.
  11. గోపబాలురు ఎలా కేరింతలు కొట్టారు?
  12. గోపబాలురు దేనితో పాటు పరుగులెత్తారు?
  13. గోపబాలురు దేనిని దాటారు?
  14. గోపబాలురు దేని ప్రక్కన ఎలా నడిచారు?
  15. గోపబాలురు ఎలా నిలబడ్డారు?
  16. గోపబాలురు ఏ పక్షులను తరిమి అలిసి పోయారు?
  17. గోపబాలురు ఎక్కడ స్నానం చేశారు?
  18. గోపబాలురు దేనిలో ఊగారు?
  19. గోపబాలురు ఎక్కడ దాక్కొన్నారు?
  20. గోపబాలురు ఏమి పందాలు వేసుకున్నారు?
  21. వారు ఏమి ఎక్కారు?
  22. వారు దేనికి పరవశించిపోయారు?
  23. గోపబాలురు దేన్ని చూసి నవ్వుకున్నారు?
  24. ఏమి చేస్తూ గోపబాలురు ఆడుకున్నారు?

ఆ) పై పేరాకు శీర్షికను రాయండి.
జవాబు:
‘గోపబాలుర బాల్య క్రీడలు’ అనే శీర్షిక ఈ పేరాకు సరిపోతుంది.

ఇ) పై పేరాకు, పాఠానికి ఉన్న సంబంధం ఏమిటి?
జవాబు:
పాఠంలోనూ, ఈ పేరాలోనూ కూడా గోపబాలకుల ఆటలను గూర్చి వర్ణింపబడింది.

4. క్రింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.

అ) బృందావనం ఎలా ఉంది?
జవాబు:
‘బృందావనం’లో పశువులకు మేత సమృద్ధిగా దొరకుతుంది. అక్కడ అందమైన చెట్లు, కొండలు, నదులు, తీగలు ఉన్నాయి. బృందావనం నివసించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఆ) గోపబాలురతో బలరామకృష్ణులు నీటికి సంబంధించి ఏ ఏ ఆటలు ఆడారు?
జవాబు:

  1. సరస్సులలో ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకొనే ‘చల్లులాట’ ఆడారు.
  2. కాలువలకు అడ్డుకట్టలు కట్టారు.
  3. కొలనులలో దిగి, చేతులతో నీళ్ళను చిలికారు.

ఇ) గోపబాలకులు నవ్వుకొనేలా ఏ ఆటలాడారు?
జవాబు:

  1. ఒకరి చల్టికావడిని ఇంకొకడు దాచాడు. వాణ్ణి మోసగించి మరొకడు దాన్ని పట్టుకెళ్ళాడు. ఇంకొకడు దాన్ని తెచ్చి అసలు వాడికిచ్చాడు.
  2. ఒకడు పరధ్యానంగా నడచివెడుతూ ఉంటే, వాడు ఉలిక్కిపడేలా మరొకడు వెనుకగా వచ్చి, పెద్దకేక పెట్టాడు. ఒకడు వెనుకగా వచ్చి, మరొకటి రెండు కళ్ళూమూశాడు. అది చూచి మరొకడు నవ్వాడు.
  3. కృష్ణుడిని ముట్టుకోవాలని ఇద్దరు పిల్లలు పందాలు వేశారు. అందులో కృష్ణుడిని ముందుగా ముట్టుకున్నవాడు, ముట్టుకోలేనివాడిని చూచి నవ్వాడు.
  4. ఒకరు తెచ్చుకున్న పిండివంటను ఒకడు లాక్కొని పారిపోగా, వాడి చేతిలోది మరొకడు లాక్కుని ఎవరికీ అందకుండా వాడు దూడల మధ్యకు పరుగుపెట్టాడు. గోపాలురు పై విధంగా నవ్వు తెప్పించే ఆటలు ఆడారు.

ఈ) పోతన గోపబాలకుల అదృష్టాన్ని ఏమని చెప్పాడు?
జవాబు:
యోగీశ్వరులు సైతం, పరమ పురుషుడు అయిన శ్రీకృష్ణుని పాదధూళిని రవ్వంత కూడా చూడలేరు. అటువంటి శ్రీకృష్ణుణ్ణి గోపబాలురు కౌగిలించుకున్నారు. చెట్టాపట్టాలు వేసుకున్నారు. తన్నుతూ, నవ్వుతూ, గుద్దుతూ, మీదపడుతూ కృష్ణుడితో కలిసి వారు ఆడుకున్నారు. అందువల్ల గోపబాలుర అదృష్టం ఎంతో గొప్పది అని పోతన అన్నాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) పోతన పద్యాలలో చెప్పిన ఆటల్లో మీరు ఆడే ఆటలు ఏమైనా ఉన్నాయా? అవి ఏవి?
జవాబు:

  1. చెట్లపై కాయలు రాలగొడతాను
  2. చెరువులలో దిగి నీళ్ళను చిలుకుతాను
  3. నేను అప్సరసలాగా నాట్యం చేస్తాను
  4. విచిత్ర వేషాలు ధరిస్తాను.

ఆ) గోపబాలకులతో బలరామకృష్ణులు బృందావనంలో ఆటలు ఆడారు కదా ! మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ ఏ ఆటలు, ఎవరితో ఆడతారు?
జవాబు:

  1. నేను మా వీధిలో, మా చెల్లెలుతో షటిల్ ఆడతాను.
  2. మా వీధి మొదలులో మిత్రులతో కబడ్డీ ఆడతాను.
  3. మా స్నేహితురాండ్రతో పాఠశాలలో బాడ్మింటన్ ఆడతాను.
  4. నా స్నేహితులతో పాఠశాల ఆట స్థలంలో క్రికెట్ ఆడతాను.

ఇ) గోపబాలకులు ఎంతో భాగ్యవంతులని పోతన వివరించాడు కదా ! ఇలా పోతన అనడానికి కారణం ఏమిటి?
జవాబు:
శ్రీకృష్ణుడు భగవంతుడు. అవతార స్వరూపుడు. కృష్ణుని చూడాలని యోగీశ్వరులు సైతం తపస్సు, ధ్యానం వగైరా చేస్తారు. కాని వారికి కృష్ణుని దర్శనం జరుగదు. గోపాలురు ఏ యోగమూ, ధ్యానమూ లేకుండానే, కృష్ణుణ్ణి చూశారు. కృష్ణుడితో కలసి ఆడిపాడారు. అందుకే గోపాలురు భాగ్యం గొప్పదని భక్తుడైన పోతన అన్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) పోతన సుమారు 500 సంవత్సరాల కిందట భాగవతంలో రకరకాల ఆటలను గురించి వివరించాడు కదా ! నాటి ఆటలతో పోల్చినపుడు నేటి ఆటల్లో ఏమైనా తేడాలున్నాయా? అలాగే ఆడుతున్నారా? మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
పోతన చెప్పిన ఆటలు చాలావరకు నేడు లేవు. నిజానికి ఇప్పుడు పిల్లలకు ఆటలు ఆడే సమయమే లేదు. కాన్వెంటులకు వెళ్ళడం, వారు చెప్పినవి రాసుకోవడం. బట్టీపట్టడంతోనే వారికి సరిపోతోంది. చాలా పాఠశాలల్లో ఆట స్థలాలే లేవు. ఆటల పోటీలు ఏడాది కొకసారి పెడతారు. కాని పాఠశాలలో దానికి తగిన శిక్షణ లేదు. తల్లిదండ్రులు కూడా, ఆటలకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ఇప్పుడు క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, కోకో వంటి ఆటలు వచ్చాయి. పరుగు పందాలు నేటికీ ఉన్నాయి. జలక్రీడలు ఉన్నాయి కాని, దానిలో ఈతకే ప్రాధాన్యం.

ఆ) బలరామకృష్ణుల బాల్యక్రీడలను గురించి సొంతమాటల్లో రాయండి.
(లేదా)
బలరామకృష్ణులు గోప బాలకులతో కలిసి ఆడిన బాల్య క్రీడా విశేషాల గురించి వివరించండి.
జవాబు:
బలరామకృష్ణులు పిల్లనగ్రోవులు ఊదుతూ గంతులు వేశారు. కంబళ్ళతో ఎద్దులను చేసి, ఒకరినొకరు ఎదిరించుకున్నారు. అల్లులు చేసి, తమ గజ్జెలు మ్రోగేలా వాటిని తన్నారు. పండ్ల గుత్తులు రాల గొట్టారు. అడవి జంతువుల్లా అరిచారు. సరస్సుల్లో చల్లులాట. ఆడారు. ఉత్తుత్త యుద్ధాలు చేశారు. బండరాళ్ళు ఎక్కి జారారు. కాలువలకు అడ్డుకట్టారు. మునులులాగా మౌనంగా ఉన్నారు. పాటలు పాడారు. నాట్యాలు చేశారు. సరస్సుల్లో నీళ్ళు చిలికారు. చలిది చిక్కాలు దాచి, స్నేహితుల్ని ఏడిపించారు. వెనక నుంచి స్నేహితుల కళ్ళు మూసి, కేకలు పెట్టి వారిని బెదరించారు. చేతులలోని పిండివంటలను లాక్కొని పారిపోయారు. పరుగు పందాలు వేసుకొని ఆడారు.

ఎదిరించుకున్నారు. అంచారు. సరసమునులులాగా మౌనూరుల్ని ఏడిపించారు. కొని పారి

IV. పదజాలం

1. పాఠంలోని పద్యాల ఆధారంగా బలరామకృష్ణులు ఏ ఏ వస్తువులు ఉపయోగించి ఆడుకున్నారో, ఆ వస్తువుల పేర్లు రాయండి.
జవాబు:
గోపాలురు ఉపయోగించిన వస్తువులు ఇవి.

  1. పిల్లన గ్రోవి
  2. కంబళాలు
  3. అల్లులు
  4. బండరాళ్ళు
  5. చల్ది కావడి
  6. తియ్యని కజ్జములు

2) కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాల అర్థాలను రాయండి.

అ) రాముడు కపులతో కలసి వారధి కట్టాడు.
జవాబు:
కోతులు

ఆ) నదులన్నీ జలరాశిలో కలుస్తాయి.
జవాబు:
సముద్రము

ఇ) నరేంద్రుడు రాజ్యాన్ని పాలిస్తాడు.
జవాబు:
రాజు

ఈ) ప్రావీణ్యం కోసం రోజూ అభ్యాసం చేయాలి.
జవాబు:
నేర్పు

ఉ) రామయ్యకు భాగ్యం కొద్దీ ఉద్యోగం దొరికింది.
జవాబు:
అదృష్టము

3) కింది పదాలను చదవండి. వీటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) బొబ్బపెట్టు :
మా తమ్ముడు చీకటిలో దేనినో చూచి, దెయ్యం అని భయపడి, పెద్దగా బొబ్బపెట్టాడు.

ఆ) ఒడిసిపట్టుకొని :
నీటిలో మునిగిపోతున్న నా మిత్రుని జుట్టును నేను ఒడిసిపట్టుకొని వాడిని పైకి లాగాను.

ఇ) కౌతుకము :
పరీక్షా ఫలితాలు తెలుసుకోవాలనే కౌతుకము మాకు ఎక్కువయ్యింది.

ఈ) వన్యజంతువులు :
చట్టం ప్రకారం వన్య జంతువులను వేటాడరాదు.

ఉ) బాల్యక్రీడలు :
ఎవరికైనా తమ బాల్యక్రీడలు గుర్తు చేసుకొంటే సరదాగానే ఉంటుంది.

ఊ) మన్ననచేయు : నేను బాగా చదువుతానని మా ఇంట్లో అంతా నన్ను మన్నన చేస్తారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

4) ప్రకృతులు – వికృతులు రాయండి.

ప్రకృతి – వికృతి
పశువులు – పసులు
రూపము – రూపు
పణితము – పన్నిదము
కుల్య – కాలువ
తపము – తబము
విద్యలు – విద్దెలు
కుమారులు – కొమరులు
కావటి – కావడి
ఖాద్యము – కజ్జెము
యోగి – జోగి
మాననము – మన్నన
ఘాసము – కసవు

V. సృజనాత్మకత

ప్రశ్న 1.
పాఠం ఆధారంగా బృందావనం ఎలా ఉంటుందో ఊహించి చిత్రం గీయండి. రంగులు వేయండి. దాన్ని గురించి రాయండి.
జవాబు:
బృందావనంలో పశువులకు పచ్చిమేత సమృద్ధిగా దొరుకుతుంది. అక్కడ అందమైన చెట్లు, కొండలు, నదులు, తీగలు ఉన్నాయి. బృందావనం నివాసయోగ్యమైన స్థలం.

బృందావనంలో సరస్సులు, కాలువలు ఉన్నాయి. కూర్చుండి తపస్సు చేసుకొనేందుకు బండరాళ్ళు ఉన్నాయి. ఈతలు కొట్టడానికి కాలువలు, సరస్సులు ఉన్నాయి.

బృందావనంలోని పచ్చిగడ్డిని మేస్తే పశువులు సమృద్ధిగా పాలు ఇస్తాయి. అక్కడ పచ్చని కొండలు ఉన్నాయి. చెట్లు అన్నీ పూలతో, పండ్లతో నిండి ఉంటాయి. పూలతీగలు చెట్లకు దట్టంగా అల్లుకొని ఉంటాయి.

అక్కడ పచ్చికమేస్తున్న పశువులు బలిసిన పొదుగులతో చూడముచ్చటగా నడుస్తూ ఉంటాయి. ఎద్దులు కైలాసం నుండి దిగివచ్చిన శివుని నందివాహనములా అన్నట్లు ఉంటాయి.

(లేదా)

ప్రశ్న 2.
మీరు ఆడుకొనే ఆటల జాబితా తయారుచేసి, వాటిని ఉపయోగించి ఒక గేయం రాయండి.
జవాబు:
రండి రండి పిల్లలూ – ఆటలాడుదాం, ఆటలాడుదాం ||
దాగుడు మూతలూ – కోతి కొమ్మచ్చులూ
కిరికీ ఆటలూ – కుందెన గుడులూ
దూదుంపుల్లలూ – కుప్పాతన్నులూ
వెన్నెల పాటలూ – బిళ్ళా బాధుడూ || రండి రండి పిల్లలూ || ఆటలాడుదాం ||
చెడుగుడు ఆటలూ – ఉప్పట్టి కూతలూ
కొక్కో ఆటలూ – కబడ్డీ ఆటలూ
బ్యాడ్మింటన్, ఫుట్ బాలూ – వాలీబాలు, క్రికెట్టూ
లాంగు జంపు, హై జంపు – పోలు జంపు, రన్నింగులు
నడక పరుగు పోటీలు – రకరకాల ఆటలు || రండి రండి పిల్లలూ || ఆటలాడుదాం ||

VI. ప్రశంసలు

1) పిల్లలను గురించి వాళ్ళు ఆడే ఆటలను గురించి పోతన ఎంతో చక్కగా పద్యాలలో వివరించాడు కదా! ఇలా – పోతన రాసిన మరికొన్ని పద్యాలను సేకరించండి. వాటిని రాగంతో, భావంతో పాడండి.
జవాబు:
1. అలవైకుంఠ పురంబులో నగరిలోనా మూల సౌధంబు దా
పల మందారవనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోదియగు నా పన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియై

2. కం|| నీపాద కమల సేవయు
నీపాదార్చకులతోడి నెయ్యమును నితాం
తా పార భూత దయయును
తాపస మందార ! నాకు దయసేయగదే !

(లేదా)

2) బాల్య క్రీడలనే పాఠం పోతన భాగవతంలోది కదా ! భాగవతంలోని, మరికొన్ని కథలను తెలుసుకొని చెప్పండి.
జవాబు:
భాగవతంలో

  1. వామనావతారము
  2. గజేంద్రమోక్షము
  3. ధ్రువ చరిత్ర
  4. అంబరీషోపాఖ్యానం
  5. కుచేలోపాఖ్యానం వంటి కథలు చాలా ఉన్నాయి. మీ గురువుగారిని అడిగి తెలుసుకోండి.

VII. ప్రాజెక్టు పని

* మీ నాన్న, అమ్మ, మీ తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలను అడిగి, వాళ్ళ చిన్నతనంలో ఏ ఏ ఆటలు ఆడుకొనేవారో, అడిగి తెలుసుకోండి. వాటి ఆధారంగా కింది పట్టికను పూరించండి.

తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు నాన్న, అమ్మ, అత్త మొదలైన 1. మీరు ఇప్పుడు ఆడుకొనే ఆటలు | వారు చిన్నప్పుడు ఆడిన ఆటలు వాళ్ళు చిన్నప్పుడు ఆడిన ఆటలు
మీరు ఇప్పుడు ఆడుకొనే ఆటలు
| తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు వారు చిన్నప్పుడు ఆడిన ఆటలు
నాన్న, అమ్మ, అత్త మొదలైన — వాళ్ళు చిన్నప్పుడు ఆడిన ఆటలు
1) చెడుగుడు 2) ఉప్పాట 3) కుప్పతన్నులు 4) దూదుంపుల్ల 5) కిరికి 6) చింత గింజలు 7) వామన గుంటలు 8) పరమ పదసోపాన పటం 9) పేకాట 10) చదరంగం 11) దాగుడు మూతలు

1) కబడ్డీ 2) కోకో 3) బ్యాడ్మింటన్ 4) వాలీబాల్ 5) బాస్కెట్ బాల్ 6) రింగు టెన్నిసు 7) షటిల్ 8) క్రికెట్ 9) పులి-మేక 10) లాంగ్ జంప్ మొ||నవి.

1) అంత్యాక్షరి 2) క్రికెట్ 3) హాకీ 4) షటిల్ 5) తాడు ఆట 6) వాలీబాల్ 7) చదరంగం 8) పరుగు 9) హైజంప్ 10) చింతగింజలు 11) కిరికి 12) దాగుడుమూతలు

Note :
బలరామకృష్ణులు గోపబాలురతో ఆడిన ఆటలతో, వీటిని పోల్చండి. ఏమి గ్రహించారో చెప్పండి.
జవాబు:
ఆనాడు ఆడిన ఆటలు నేడు లేవు. కొత్త ‘ఆటలు కాలానికి తగ్గవి వస్తున్నాయి. ఈ వేళ ఆడ – మగ అందరినీ ఆకర్షించే ఆట “క్రికెట్” – ఆట.

VIII. భాషను గురించి తెలుసుకుందాం అని

అ. ఈ పాఠంలోని కింది పద్యపాదాలను గమనించి, అందులో ఉన్న అలంకారాన్ని గుర్తించండి.

1) గంతులు వేతురు కౌతుకమున
దీనిలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు
జవాబు:
‘తు’

2) పోరుదురు గికుర్తు వొడచుచు దూఱుదురు.
(దీనిలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు :
జవాబు:
‘రు’

3) ఒకనొని చల్టికావడి
నొకఁ డడకించి దాచు, నొకఁ డొకఁ డదివే
టొకఁడొకఁని మొఱగి కొని చన
నొకఁ డొ ……… ఈ పద్యంలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు
జవాబు:
‘క’

పై ఉదాహరణల్లో ఏ అలంకారం ఉన్నదని గుర్తించారు? వృత్త్యనుప్రాసాలంకారం.

పైన మీరు రాసిన సమాధానాలను బట్టి వృత్త్యనుప్రాసాలంకారం గుర్తించడం ఎట్లాగో తెలుసుకుందాం.

వృత్త్యనుప్రాసాలంకారం లక్షణం :
ఒకే హల్లు పునరావృత్తమైతే అంటే పలుమార్లు వచ్చినట్లైతే దాన్ని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

4) పాఠంలోని మూడవ, ఐదవ పద్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
‘మూడవ పద్యంలో వృత్త్యనుప్రాసాలంకారములు ఉన్నాయి.
1) వేణువు లూదుచు వివిధ రూపములతో :
‘వ’ అనే హల్లు పలుమార్లు వచ్చింది.

2) గంతులు వైతురు కౌతుకమున :
‘తు’ అనే హల్లు పలుమార్లు వచ్చింది.

3) మొరయ దన్నుదు రోలి ముమ్మరముగ :
‘మ’, ‘ర’ హల్లులు, పలుమార్లు వచ్చాయి.

4) న్యజంతు చయంబుల వాని వాని :
‘వ’ హల్లు పలుమార్లు వచ్చింది.

ఐదవ పద్యంలో వృత్త్యనుప్రాసలు ఉన్నాయి.
1) మునులమై తపములు మొనయుదమా యని :
‘మ’ అనే హల్లు చాలసార్లు వచ్చింది.

2) కొమరులను సరింప కొమరు మిగుల :
‘ర’ అనే హల్లు చాలాసార్లు వచ్చింది.

గమనిక :
పై ఉదాహరణలలో ఒకే హల్లులు పలుమార్లు వచ్చాయి. కాబట్టి అవి వృత్త్యనుప్రాసాలంకారములు.

ఆ. అంత్యానుప్రాసం :
1) వేద శాఖలు వెలిసెనిచ్చట
ఆది ‘కావ్యంబలరె నిచ్చట,
ఈ గేయంలోని రెండు పంక్తుల చివరన ఉన్న పదాలు ఏవి?
మొదటి పంక్తి చివర – ఇచ్చట; రెండో పంక్తి చివర – ఇచ్చట అనే పదాలు ఉన్నాయి.

2) తలుపు గొళ్ళెం
హారతిపళ్ళెం
గుఱ్ఱపుకళ్ళెం
ఈ మూడు వరసల్లో చివర వచ్చిన పదాలు ఏవి?

  1. గొళ్ళెం
  2. పళ్ళెం
  3. కళ్ళెం అనేవి.

గమనిక :
పై ఉదాహరణలలో మీరు రాసిన సమాధానాల ద్వారా, మీరు ఒక విషయాన్ని గుర్తించి ఉండాలి. అన్ని పంక్తులూ, చివరన ఒకే రకమైన పదంతోనో, అక్షరంతోనో ముగుస్తున్నాయి. అంతే కదూ !

ఇప్పుడు మీరు ఇది అంత్యానుప్రాసాలంకారమని గుర్తించారు ‘కదూ ! ఈ అలంకారాన్ని గుర్తించడానికి లక్షణం ఏమిటో రాద్దాం.

అంత్యానుప్రాసలంకార లక్షణం :
పాదాంతంలో లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని “అంత్యానుప్రాసాలంకారం” అంటాం.

ఇ. ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం :

* కింది తరగతిలో పోలిక చెప్పడంలో అలంకారం ఉన్నదని. అది ‘ఉపమాలంకారం’ అని తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు ఉపమాలంకారం లక్షణాన్ని తెలుసుకుందాం.

ఉదా : సోముడు భీముడిలాగ (వలె) బలవంతుడు.

ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినప్పుడు వాక్యంలో ఉండే పదాలను కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాం

సోముడు – ఉపమేయం (అంటే ఎవరిని గురించి చెప్తున్నామో ఆ పదం)
భీముడు – ఉపమానం (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)

బలవంతుడు – సమానధర్మం – పోల్చడానికి వీలయిన సమానగుణం (ఉపమేయ ఉపమానాలలో ఉన్న ఒకే విధమైన ధర్మం) లాగ (వలె) – ఉపమావాచకం (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

గమనిక :
ఇక్కడ ఉపమాన, ఉపమేయాలకు చక్కని సామ్యం అంటే పోలిక – చెప్పటం జరిగింది. ఇలా చెప్పటాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.

ఉపమాలంకార లక్షణం :
“ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ‘ఉపమాలంకారము’.

ఈ. ఉత్ప్రేక్షాలంకారము :
ఆరో తరగతిలో, ఊహించి చెప్పడంలో ఒక అలంకారం ఉందని తెలుసుకున్నారు కదా ! అది ‘ఉత్ప్రేక్షాలంకారం’. ఇప్పుడు దీని లక్షణం తెలుసుకుందాం.

ఉదా : ‘ఆ ఏనుగు నడిచే కొండా! అన్నట్టు ఉంది’.

పై వాక్యాన్ని గమనించండి. ఇందులో కూడా పోలిక కనబడుతున్నది కదూ? ఈ పోలిక అనేది ఊహించి చెప్పినది.

ఈ వాక్యంలో ఉపమేయం – ‘ఏనుగు’, ఉపమానం – ‘నడిచే కొండ’.
ఇక్కడ ఏనుగును కొండలా ఊహిస్తున్నామన్నమాట.
దీన్ని బట్టి ఉత్ర్ఫేక్ష అలంకారం లక్షణాన్ని కింది విధంగా చెప్పవచ్చు.

ఉత్ప్రేక్షాలంకార లక్షణం : ఉపమేయాన్ని మరోకదానిలా (ఉపమానంగా) ఊహించి చెప్పడం ‘ఉత్ప్రేక్ష’.

కింది వాక్యాల్లోని అలంకారములు గుర్తించండి.

1. గోపి సూర్యుడిలాగ ప్రకాశిస్తున్నాడు.
జవాబు:
పై వాక్యంలో ‘ఉపమాలంకారము’ – ఉంది. ఇందు ‘గోపి’ని ‘సూర్యుడి’తో పోల్చారు.

2. మండే ఎండ నిప్పుల కొలిమా! అన్నట్లు ఉంది.
జవాబు:
పై వాక్యంలో ‘ఉత్ప్రేక్షాలంకారము’ – ఉంది. ఇందు ‘మండే ఎండ’ ‘నిప్పుల కొలిమి’గా ఊహించడం జరిగింది.

II. లఘువులు, గురువులు గుర్తించుట

మీరు చదువుకొనే పద్యాలు, గేయాలు, పాటలు ఒక పద్ధతిలో రాగంతో పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. కదూ ! అలా ఎందుకు ఉంటాయంటే వాటిని కవులు కొన్ని నియమాలకు లోబడి రాస్తారు. ప్రతి నియమానికి కొన్ని గుర్తులు ఉంటాయి.

1) కింది అక్షరాలను పలకండి.

1) అ, ఇ, ఉ, ఋ, ఎ, ఒ
క, చి, తు, టె, ప, జొ
ఘ, ఝ, థ, ధ, భ, స, హ

పైన వ్రాసిన అక్షరాలను ఒక్కోటి పలకటానికి ఎంత సమయం పడుతున్నది?

గమనిక :
వీటిని పలకటానికి కనుటెప్ప పాటు అంతకాలం, లేక చిటికె వేసే అంతకాలం పడుతుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

2) ఆ, ఈ ఊ, ఏ, ఐ, ఓ, ఔ, అం
గౌ, జం, డం, దా

పైన వ్రాసిన అక్షరాల వంటి అక్షరాలలో ఒక్కో అక్షరాన్ని పలకటానికి ఎంత సమయం పడుతున్నది? గమనించారా?

(1) లో సూచించిన అక్షరాలు పలకటానికి, (2) లో సూచించిన అక్షరాలు పలకటానికి పట్టే సమయంలో కొంత తేడా కనబడుతున్నది కదూ !

(1) లో వ్రాసిన అక్షరాలు పలకటానికి కనుటెప్పపాటు కాలం పడుతుంది లేదా చిటికె వేసేటంత కాలం పడుతుంది.
(2) లో వ్రాసిన అక్షరాలు పలకటానికి చిటికె వేసేటంత కాలం కంటె ఎక్కువ సమయం పడుతుంది.

గమనిక :
మరి వీటిని గుర్తు పట్టేందుకు మనవారు గుర్తులను ఏర్పాటు చేశారు – ఆ గుర్తులు ఏమిటో చూడండి.

రెప్పపాటు కాలంలో పలికే అక్షరాలు – అంటే మనం హ్రస్వాక్షరాలుగా పిలుచుకొనే అక్షరాలను ‘l’ గుర్తుతో సూచిస్తాం. ఈ గుర్తును ‘లఘువు’ అని అంటాం. ‘l’ = లఘువు.

లఘువు పలికే సమయం కంటె ఉచ్చారణకు ఎక్కువ సమయం అవసరం అయ్యే అక్షరాలను ‘U’ గుర్తుతో సూచిస్తాం. ఈ గుర్తును గురువు అంటాం. ‘U’ = గురువు.

గమనిక :
లఘువు మన అంకెల్లోని ’19, గురువు ఆంగ్ల అక్షరాలలోని ‘U’ ను పోలి ఉంటాయి.

* ఈ పదాలను చూడండి. వీటిలోని అక్షరాలను ఎలా సూచించారో గుర్తించండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 2

గమనిక :
అయితే గురులఘువులను గుర్తించటానికి మనం మరికొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

3) కింది పదాలను చూడండి.

1) తర్కం 2) మెట్ట 3) చూడగన్ 4) నష్టం వీటిలో
‘ర్క’ – ఇది సంయుక్తాక్షరం కదూ!
‘ట్ట’ – ఇది, ద్విత్వక్షరం కదూ!
‘గన్’ – ఇందులో “గ”న్ అనే పొల్లుతో కూడి ఉంది కదూ!
మరి ఇలాంటప్పుడు ‘లఘుగురువులను ఎలా గుర్తించవచ్చునో చూడండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 3

వీటిలో ఏం గమనించారు? సంయుక్తాక్షరాల ముందున్న అక్షరాన్ని గురువుగా గుర్తించాం కదూ!

* అంటే సంయుక్తాక్షరం ముందు అక్షరాన్ని గురువుగా గుర్తించాలి.
ఈ కింది పదాలలో గురులఘువులను ఎలా గుర్తిస్తామో చూడండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 4

వీటిలో ద్విత్వాక్షరం ముందు అక్షరాన్ని గురువుగా గుర్తించాం కదూ!

* అంటే సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరాల విషయంలో ఒకే విధానాన్ని పాటిస్తాం.
ఇక –
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 5

* వీటిలో పొల్లుతో కూడిన అక్షరాలను గురువుగా గుర్తించాం కదూ!
ఇలా లఘుగురువులను గుర్తించడం అనేది పద్యాలు రాయటానికి ఉపయోగపడే నియమాల్లో మొదటి నియమం. మిగిలిన విషయాలను పై తరగతుల్లో నేర్చుకుందాం.

4) కింది పదాలకు లఘువు, గురువులను గుర్తించండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 6

కవి పరిచయం

పాఠ్యభాగం పేరు : “బాల్య క్రీడలు”
కవి పేరు : బమ్మెర పోతన
కాలం : 15వ శతాబ్దం
జన్మస్థలం : బమ్మెర గ్రామం, వరంగల్ జిల్లా
దేని నుండి గ్రహింపబడింది : ‘ఆంధ్రమహా భాగవతం’ దశమస్కంధం నుండి గ్రహింపబడింది.
రచనలు : 1) భోగినీ దండకం
2) ఆంధ్రమహా భాగవతం
3) వీరభద్ర విజయం

బిరుదు : “సహజ పండితుడు.

1. బాల్య క్రీడలు పాఠ్యభాగ రచయిత పోతన కవిని గూర్చి పరిచయం చేయండి.
జవాబు:
‘బాల్య క్రీడలు’ అనే పాఠం పోతన మహాకవి రచించిన ఆంధ్రమహా భాగవతము దశమ స్కంధములోనిది. పోతన 15వ శతాబ్దము వాడు. ఈయన తెలంగాణలో వరంగల్లు జిల్లా బమ్మెర గ్రామంలో పుట్టాడు. ఈయనకు ‘సహజ పండితుడు’ అనే బిరుదు ఉంది.

పోతన గారు ఆంధ్రమహా భాగవతము, భోగినీ దండకము, వీరభద్ర విజయము, నారాయణ శతకము అనే గ్రంథాలు రచించాడు. పోతనగారి పద్యం ఒక్కటైనా రాని తెలుగువాడు ఉండడు.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

1వ పద్యం : – కంఠస్థ పద్యం
* క. కసవు గల దిరవు పసులకు,
లస దద్రినదీ మహీజ లతికావలి పెం
పెసఁగును, గాఁపురమునకును, .
బొసఁగును బృందావనంబు వొదఁడచ్చటికిన్.
ప్రతిపదార్థం :
బృందావనంబు = బృందావనము అనే ప్రదేశము ఉంది.
కసవు = గడ్డి (పశువులకు మేత)
కలదు = (అక్కడ) ఉంది
పసులకున్ = పశువులకు
ఇరవు = (అది) అనుకూలమైన చోటు
లసత్ = ఒప్పుచున్న
అద్రీ = పర్వతములు (క్రీడా పర్వతములు)
నదీ = నదులూ
మహీజ = చెట్లు
లలితావలి (లతికా + ఆవలి) = తీగల సమూహమును
పెంపు = ఇంపుగా (అందముగా)
ఎసగును = (అక్కడ) ఉంటాయి
కాపురమునకును = (మనము) నివసించడానికి
పొసగును = (అది) అనుకూలంగా ఉంటుంది
అచ్చటికిన్ = ఆ బృందావనానికి
పొదఁడు = పోదాం రండి.

భావం :
‘బృందావనం’ అనే ప్రదేశం ఉంది. అక్కడ పశువులకు మేత సమృద్ధిగా దొరుకుతుంది. అక్కడ అందమైన పర్వతాలూ, నదులూ, చెట్లూ, తీగలూ ఉన్నాయి. అది నివసించడానికి తగినట్లుగా ఉంటుంది. అక్కడికి పోదాం పదండి.

గమనిక :
ఉపనందుడు అనే ముసలి గోపాలకుడు, మిగిలిన గోపాలురతో ఈ మాట చెప్పాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

2వ పద్యం :
వ. ఇట్లు బృందావనంబుఁ జెందిఁయందుఁగొంతకాలంబునకు
రామకృష్ణులు సమానవయస్కులైన గోపబాలకులం గూడికొని
వేడుక లూదు కొన దూడలఁ గాచుచు.
ప్రతిపదార్థం :
ఇట్లు = ఈ విధంగా
బృందావనంబున్ + చెంది = బృందావనానికి పోయి
అందున్ = అక్కడ
కొంతకాలంబునకు = కొంతకాలానికి
రామకృష్ణులు = బలరామకృష్ణులు
సమాన వయస్కులు + ఐన = తమతో సమానమైన వయస్సు కలవారైన
గోపబాలకులన్ = గోపాల బాలురను
కూడికొని = కలిసికొని
వేడుకలు = సంతోషములు
ఊడుకొనన్ = నాటుకొనేటట్లు (సంతోషంతో)
దూడలన్ + కాచుచు = దూడలను కాస్తున్నారు.

భావం :
ఇలా బృందావనం చేరిన కొంత కాలానికి, బలరామకృష్ణులు వేడుకతో తమ ఈడు గోపబాలురతో కలిసి, ఆనందంగా దూడలను కాస్తున్నారు.

3వ పద్యం : కంఠస్థ పద్యం
* సీ. వేణువు లూఁదుచు వివిధరూపములతో
గంతులు వైతురు కౌతుకమున,
గురుకంబళాదుల గోవృషంబులఁబన్ని
పరవృషభము లని ప్రతిఘటింతు,
రల్లులు దట్టించి యంఘ్రుల గజ్జెలు
మొరయఁ దన్నుదు రోలి ముమ్మరముగఁ
బన్నిదంబులు వైచి ఫలమంజరులు గూల్చి
వ్రేటులాడుదురు ప్రావీణ్యమొప్ప,

తే.గీ. వన్యజంతుచయంబుల వాని వాని,
వదరు వదరుచు వంచించి పట్టఁబోదు,
రంబుజాకరములఁజల్లులాడఁజనుదు
రాకుమారులు బాల్యవిహారులగుచు.
ప్రతిపదార్థం :
ఆ కుమారులు = ఆ బాలురైన రామకృష్ణులు
బాల్య విహారులు + అగుచు = చిన్నతనంలో ఆటలు ఆడుతూ
వేణువులు = పిల్లన, గ్రోవులు
ఊదుచున్ = ఊదుతూ
వివిధ రూపములతోన్ = రకరకాల వేషాలతో
కౌతుకమునన్ = ఉత్సాహంతో
గంతులు వైతురు = గంతులు వేస్తారు
గురుకంబళ + ఆదులన్ = పెద్ద పెద్ద కంబళ్ళు మొదలయిన వాటితో
గోవృషంబులన్ = ఆబోతులను (ఎద్దులను)
పన్ని = తయారు చేసి
పరవృషభములు + అని = అవి శత్రువుల ఎద్దులు అని
ప్రతిఘటింతురు = వాటిని ఎదిరిస్తారు
అల్లులు = బట్టలతో తయారు
చేసిన బొమ్మలు
దట్టించి = కూరి, (గుడ్డలతో కూరి)
అంఘ్రుల = (తమ) కాళ్ళ;
గజ్జెలు = గజ్జెలు
మొరయన్ = మ్రోగేటట్లు
ముమ్మరముగా = ఎక్కువగా
ఓలిన్ = వరుసగా
తన్నుదురు = ఆ బొమ్మలను తన్నుతారు
పన్నిదంబులు = పందెములు
వైచి = వేసుకొని
ఫల మంజరులన్ = పండ్ల గుత్తులను
ప్రావీణ్యము + ఒప్పన్ = నేర్పుగా
కూల్చి = పడగొట్టి
వ్రేటులాడుదురు = దెబ్బలాడుకుంటారు
వన్యజంతుచయంబులన్ = అడవి జంతువుల సమూహములను
వాని వాని = ఆయా జంతువుల యొక్క
వదరు వదరుచున్ = కూతలవలె కూస్తూ (అరపులవలె అరిచి వాటిని ఆకర్షించి)
వంచించి = వాటిని మోసగించి
పట్టన్ + పోదురు = వాటిని పట్టుకోబోతారు
అంబుజ + ఆకరములన్ = తామరపూలు నిండిన సరస్సులలో
చల్లులు + ఆడన్ = ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకొనే జలక్రీడలు ఆడడానికి
చనుదురు = వెళతారు

భావం :
ఆ బలరామకృష్ణులు వేణువులు ఊదుతూ, రకరకాల వేషాలు ధరించి సంతోషంగా గంతులు వేస్తున్నారు. పెద్ద పెద్ద కంబళ్ళను కప్పుకొని, ఎద్దుల రూపాలు తయారుచేసి, అవి శత్రువుల ఎద్దులని వాటిని ఎదిరిస్తారు. బట్టలతో తయారుచేసిన బొమ్మలను తన్నుతూ ఆడుతుంటే, వాళ్ళ కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లుమంటున్నాయి. పండ్ల గుత్తులను రాలగొట్టడానికి పందెములు వేసుకొని వారు తమ నేర్పరితనాన్ని చూపిస్తున్నారు.

అడవి జంతువుల కూతలను అనుకరిస్తూ అరుస్తూ, ఆ జంతువులు దగ్గరకు రాగానే, వాటిని పట్టుకోబోతారు. సరస్సుల్లోకి వెళ్ళి ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకుంటూ బాల్య క్రీడలలో సంచరిస్తున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

4వ పద్యం :
క. పోరుదురు గికురు వొడుచుచు,
దూఱుదురు భయంబు లేక తోరపుటిరవుల్
జాఱుదురు ఘనశిలాతటి,
మీఱుదు రెన్నంగరాని మెలఁకువల నృపా !
ప్రతిపదార్థం :
నృపా = ఓ రాజా ! పరీక్షిన్మహా రాజా ‘ (శుక మహర్షి భాగవతాన్ని పరీక్షిత్తు మహారాజుకు చెబుతున్నాడు. అందువల్లనే ‘నృపా’ అంటే ఇక్కడ పరీక్షి న్మహారాజా ! అని భావం)
కికురు + పొడుచుచు = మోసగించుచు; (ఒకరితో ఒకరు ఉత్తుత్త యుద్ధాలు చేస్తూ)
పోరుదురు = పోరాడుతారు; (దొంగదెబ్బలు కొట్టుకుంటారు)
భయంబు లేక = భయం లేకుండా
తోరపుటిరవుల్ (తోరము + ఇరవుల్) = సుందరమైన ప్రదేశాలలో
దూఱుదురు = ప్రవేశిస్తారు
ఘనశిలా తటిన్ = పెద్ద బండరాళ్ళు పైకి ఎక్కి వాటిపై నుండి
జాఱుదురు = కిందికి జారుతూ ఉంటారు
ఎన్నంగరాని = ఊహింపశక్యముకాని
మెలకువలన్ = నైపుణ్యాలతో
మీఱుదురు = అతిశయిస్తారు (మించి పోతారు)

భావం :
ఒకరితో ఒకరు ఉత్తుత్త యుద్దాలు చేస్తూ, దొంగదెబ్బలు కొట్టుకుంటారు. అందమైన స్థలాలలోకి ఏ మాత్రం భయం లేకుండా పోతారు. పెద్ద పెద్ద బండరాళ్ళ పైకి ఎక్కి కిందికి జారుతూ ఉంటారు. ఈ పనులు చేయడంలో ఊహింపశక్యం కాని నైపుణ్యాన్ని వారు ప్రదర్శిస్తూ ఉన్నారు.

5వ పద్యం : కంఠస్థ పద్యం
* సీ. కపులమై జలరాశిఁగట్టుదమా యని
కట్టుదు రడ్డంబుఁగాలువలకు,
మునులమై తపములు మొనయుదమా యని
మౌనులై యుందురు మాట లేక,
గంధర్వవరులమై గానవిద్యలు మీఱఁ
బాడుదమా యని పాడఁ జొత్తు,
రప్సరోజనులమై యాడుదమా యని
యాండు రూపుల ఁదాల్చి యాడఁ జనుదు,

ఆ.వె. రమర దైత్యవరులమై యభిం ద్రక్తమా,
యని సరోవరములయందు హస్త
దండచయముఁ ద్రిప్పి తరుతురు తమ యీడు
కొమరులనుచరింపఁ గొమరు మిగిలి.
ప్రతిపదార్థం :
కపులము + ఐ = కోతుల వలె అయి
జలరాశిన్ = సముద్రానికి
కట్టుదము + ఆ = వారధికడదామా?
అని = అంటూ
కాలువలకున్ = (దగ్గరలోని) కాలువలకు
అడ్డంబు = అడ్డుకట్టలు
కట్టుదురు = కడుతున్నారు
మునులము + ఐ = (మనమంతా) మునులవలె అయి
తపములు = తపస్సులకు
మొనయుదుమా = పూనుకుందామా (చేద్దామా?)
అని = అంటూ
మౌనులు + ఐ = మునులవలె అయి
మాటలేక = మాట్లాడకుండా
ఉందురు = ఉంటారు
గంధర్వ వరులము + ఐ = శ్రేష్ఠులైన గంధర్వుల వలె
గానవిద్యలు = సంగీత విద్యలు
మీఱన్ = అతిశయించేటట్లుగా (సంగీత విద్యా నైపుణ్యంతో)
పాడుదుమా + అని = పాడదామా ? అని;
పాడన్ + బొత్తురు = పాడడం మొదలు పెడతారు
అప్సరోజనులమై (అప్పరః + జనులము + ఐ) = అప్సరసలవలె అయి
ఆడుదమా + అని = “నాట్యం చేద్దామా? అంటూ
ఆడురూపులన్ = ఆడువేషాలను
తాల్చి = ధరించి
ఆడన్ = నాట్యం చేయడానికి
చనుదురు = సిద్ధం అవుతారు
అమర, దైత్యవరులము + ఐ = దేవతలూ, రాక్షస శ్రేష్ఠులమూగానై
అబ్దిన్ = సముద్రాన్ని
త్రత్తమా + అని ఆ మథిద్దామా అంటూ
హస్తదండచయమున్ = (తమ) కట్టల వంటి చేతులతో
త్రిప్పి = నీళ్ళు చిలికి
తమ + ఈడు = తమతో సమాన వయస్సుగల
కొమరులు = కుమారులు
అనుచరింపన్ = అనుసరించి తమగ వెంట రాగా
కొమరు మిగిలిన్ = సౌందర్యము అతిశయించేటట్లు (కనుల విందుగా)
తరుతురు = నీటిని చిలుకుతారు.

భావం :
మనము అంతా కోతుల వలె సముద్రానికి వారధి కడదామా? అంటూ, కాలువలకు అడ్డుకట్టలు కడుతున్నారు. మునులవలె తపస్సు చేద్దామా? అంటూ, మాట్లాడకుండా మునులులాగా కూర్చుంటున్నారు. గంధర్వులవలె చక్కగా పాటలు పాడుదామా ? అంటూ, చెవులకు ఇంపుగా పాడుతున్నారు. మనం అంతా అప్సరసల వలె నాట్యం చేద్దామా? అంటూ, ఆడువేషాలు వేసుకొని నాట్యం చేస్తున్నారు. “మేము దేవతలం, మీరు రాక్షసులు, మనం కలిసి సముద్రాన్ని మథిద్దామా?” అంటూ, సరస్సులలో నీళ్ళను చేతులతో చిలుకుతున్నారు. ఈ విధంగా తమ ఈడు పిల్లలతో కలిసి బలరామకృష్ణులు ఆటలాడు తున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

6వ పద్యం :
క. ఒకనొకని చల్దికావడి,
నొకఁడొకఁ డడకించి దాఁచు, నొకఁడొకఁడది వే
ఱోకనొకని మొఱగికొని చన
నొకఁడొకఁ డది దెచ్చి యిచ్చు నుర్వీనాథా !
ప్రతిపదార్థం :
ఉర్వీనాథా = ఓ రాజా ! (పరీక్షిన్మహా రాజా!)
ఒకనొకని = ఒకానొక పిల్లవాడి యొక్క
చల్టికావడిన్ = చలిది అన్నం మూట తెచ్చుకున్న కావడిని (చిక్కాన్ని)
ఒకడొకడు = ఒకానొకడు (ఒక పిల్లవాడు)
అడకించి = బెదరించి
దాచున్ = దాస్తాడు
ఒక డొకడు = ఇంకొకడు
అది = ఆ కావడిని
వేఱోకనొకని = ఇంకో బాలుడిని
మొఱగికొని = దాచిన వాడిని మోసగించి
చనన్ = పట్టుకొని పోగా
ఒకడు = ఇంకో పిల్లవాడు
అది = ఆ కావడిని
తెచ్చి + ఇచ్చు = తీసుకొని వచ్చి మొదటి వాడికి ఇస్తాడు

భావం :
ఒకని చల్ది కావడిని (చిక్కాన్ని) మరొకడు బెదరించి తీసుకొని ఒక చోట దాచాడు. దాచిన వాణ్ణి మోసగించి ఇంకొకడు ఆ చిక్కాన్ని తీసికొని వెళ్ళాడు. వాడి దగ్గర నుంచి వేరొకడు తెచ్చి మొదటి వాడికి దాన్ని ఇచ్చాడు.

7వ పద్యం : కంఠస్థ పద్యం
* క. ఒక్కఁడు ము న్నే మటి చన
నొక్కఁడు బలుబొబ్బ వెట్టు నులికిపడన్, వే
ఱోక్కఁడు ముట్టి తటాలున,
నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁ గన్.
ప్రతిపదార్థం :
ఒక్కడు = ఒక పిల్లవాడు
మున్ను = ముందు
ఏమఱి = ప్రమాదపడి (పరధ్యానంగా ఉండి)
చనన్ = నడుస్తూ ఉండగా
ఒక్కడు = మరో బాలుడు
ఉలికిపడన్ = (నడిచేవాడు) ఉలిక్కిపడేటట్లు (త్రుళ్ళిపడేటట్లు)
బలు బొబ్బ = పొలికేక (పెద్దకేక)
పెట్టున్ = పెడతాడు (వేస్తాడు)
వేరు + ఒక్కడు = మరో పిల్లాడు
ముట్టి = ముట్టుకొని
తటాలునన్ = అకస్మాత్తుగా
ఒక్కడు = మరో పిల్లాడు
నగగన్ = నవ్వేటట్లు
ఒక్కని = ఒక పిల్లవాని
కనుదోయిన్ = కన్నుల జంటను
మూయున్ = మూస్తాడు .

భావం :
ఒకడు పరధ్యానంగా నడుస్తూంటే, ఇంకొకడు వెనుక నుండి గట్టిగా కేకపెడతాడు. అది విని వాడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు, ఇంకొకడు వెనుక నుండి వచ్చి మరొకడి కళ్ళు రెండూ మూశాడు. అది చూసి వేరొకడు నవ్వుతున్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

8వ పదం: కంఠస్థ పద్యం
* క. తీపుగల కట్ట మన్యుఁడు,
గోపింపఁగ నొడిసి పుచ్చుకొని పోవాఁడుం
బైపడి యదిగొని యొక్క ఁడు,
కేపులలో నిట్టునట్టుఁగికురించు నృపా !
ప్రతి పదార్థం :
నృపా = ఓ రాజా (పరీక్షిత్తు మహారాజా!)
కోపింపగన్ = కోపం వచ్చేటట్లు
తీపు + కల = తియ్యదనం కల
కజ్జము = పిండివంటను
అన్యుడు = మరొకడు
ఒడిసి పుచ్చుకొని = బలవంతంగా పట్టుకొని
పోలాడ్రున్ = పారిపోవును
ఒక్కడు = మరొకడు
పైపడి = వాడి మీద పడి (పిండి వంట లాగుకున్న వాడి మీద పడి)
అది + కొని = వాడి చేతిలోని పిండి వంటను తీసికొని
క్రేపులన్ = దూడల మధ్యన
ఇట్టునట్టున్ = ఇటూ అటూ
కికురించున్ = తప్పించుకొని తిరుగుతాడు

భావం :
ఒకడి చేతిలోని పిండి వంటను మరొక్కడు లాక్కొని పారిపోతున్నాడు. పిండి వంట తెచ్చుకొన్న వాడికి చాలా కోపం వచ్చింది. కాని ఆ పారిపోతున్నవాడి దగ్గరి నుంచి దాన్ని మరొకడు లాక్కొనిపోయి దూడల మధ్య అటూ ఇటూ తిరుగుతూ వాడికి తాను దొరకకుండా వీణ్ణి ఏడిపిస్తున్నాడు.

9వ పద్యం : కంఠస్థ పద్యం
* క. వనజాక్షుఁడు మున్నరిగిన,
మునుపడఁగా నేనెయతని ముట్టెద’ ననుచుం
గని మును ముట్టనివానిన్,
మును ముట్టినవాఁడు నవ్వు మొనసి నరేంద్రా !
ప్రతిపదార్థం :
నరేంద్రా = ఓ రాజా !
వనజాక్షుడు (వనజ + అక్షుడు) = పద్మముల వంటి కన్నులు కలవాడైన శ్రీకృష్ణుడు
మున్ను = ముందుగా
అరిగినన్ = వెళ్ళగా (నడుస్తూ ఉంటే)
అతనిన్ = ఆ శ్రీకృష్ణుని
మునుపడగా = ముందుగా
నేనె = నేనే
ముట్టెదన్ = ముట్టుకుంటాను
అనుచుంగని = అంటూ చూచి
మును = ముందుగా
ముట్టనివానిన్ = ముట్టుకోలేనివాణ్ణి (చూచి)
మునుముట్టినవాడు = ముందుగా శ్రీకృష్ణుణ్ణి ముట్టుకొన్న పిల్లవాడు
మొనసి = గట్టిగా ప్రయత్నించి
నవ్వున్ = నవ్వుతున్నాడు

భావం :
కృష్ణుడు ముందు నడుస్తూ ఉంటే చూసి, ఇదరు బాలురు “కృష్ణుణ్ణి ముందుగా ఎవరు ముట్టుకుంటారో చూద్దాం” అని పందెం వేసుకున్నారు. వారిలో ముందుగా వెళ్ళి కృష్ణుని ఒకడు ముట్టుకున్నాడు. వాడు కృష్ణుని ముందుగా ముట్టుకోలేని పిల్లవాణ్ణి చూసి, గట్టిగా నవ్వుతున్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

10వ పద్యం : -కంఠస్థ పద్యం
ఉ. ఎన్నఁడునైన యోగివిభు లేవ్వని పాదపరాగ మింతయుం
గన్నులఁగానరట్టి హరిఁ గౌఁగిటఁ జేర్చుచుఁ జెట్టఁబట్టుచుం
దన్నుచుగ్రుద్దుచున్ నగుచుఁదద్దయు ఁబైపడి కూడి యాడుచున్
మన్నన సేయు వలవకుమారుల భాగ్యము లింత యొప్పునే?
ప్రతిపదార్థం :
యోగి విభులు : యోగీశ్వరులు (మహాయోగులు)
ఎన్నడునైనన్ = ఎప్పుడైనా
ఎవ్వని = ఏ శ్రీకృష్ణుని
పాదపరాగము = పాద ధూళిని
ఇంతయున్ = రవ్వంతయైనా
కన్నులన్ = తమ కన్నులతో
కానరు = చూడలేకపోయారో
అట్టిహరిన్ = అటువంటి శ్రీకృష్ణుని
కౌగిటన్ = కౌగిలిలో
చేర్చుచున్ = చేర్చుకుంటూ (ఆలింగనం చేసికొంటూ)
చెట్టపట్టుచున్ = చెట్టాపట్టాలు వేసికొంటూ (భుజాలపై చేతులు వేసికొంటూ)
తన్నుచున్ = ఒకరినొకరు తన్నుకుంటూ
గ్రుద్దుచున్ = గుద్దుకుంటూ
నగుచున్ = నవ్వుకుంటూ
తద్దయున్ = మిక్కిలి (ఎక్కువగా)
పైబడి (పైన్ + పడి) . = మీదపడి
కూడి + ఆడుచున్ = కలసి ఆడుకుంటూ
మన్నన + చేయు = ఆదరించే
వల్లవ కుమారులు – గొల్లపిల్లల (గోపబాలుర)
భాగ్యములు = నా అదృష్టములు
ఇంత ఒప్పునే = ఎంత గొప్పవో కదా !

భావం :
యోగి శ్రేష్ఠులు సైతం, పరమ పురుషుడయిన శ్రీకృష్ణుని పాదధూళిని రవ్వంత కూడా తమకన్నులతో చూడలేరు. అటువంటి శ్రీకృష్ణుణ్ణి గోపబాలురు కౌగిలించు కుంటున్నారు. చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. తన్నుకుంటున్నారు, గుద్దుతున్నారు. నవ్వుతూ మీదపడుతూ కలిసి ఆడుకుంటున్నారు. ఈ గోప బాలకుల అదృష్టం ఎంత గొప్పదో కదా?

గమనిక :
ఈ మాట పోతన కవి అంటున్నాడు. మనం అందరం ఇలాగే అనుకోవాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 15th Lesson జానపద కళలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 15th Lesson జానపద కళలు

7th Class Telugu 15th Lesson జానపద కళలు Textbook Questions and Answers

ఇవి చేయండి

ప్రశ్న 1.
‘తోలుబొమ్మలాట’ గురించి రాయండి.
జవాబు:
తోలు బొమ్మలాట, ప్రాచీన కళ. మొదట కొండగుహల్లో, కొవ్వు దీపాల వెలుగులో, రాతి గోడలపై నీడలు పడేలా చేసేవారు. మొదట్లో కీలుబొమ్మలు, ఊచబొమ్మలు ప్రదర్శించేవారు. ఈ తోలు బొమ్మలాట కళింగపట్నం, మచిలీపట్టణం వంటి ఓడరేవుల నుండి, టర్కీ, పర్షియా వంటి విదేశాలకు వ్యాపించింది.

తోలుబొమ్మలాటలో తెరకట్టి తెరవెనుక దీపాలు వెలిగించి, తోలుబొమ్మలు ఆడిస్తారు. . ఈ బృందంలో భర్త రాముడి మాటలు, భార్య సీత మాటలు చెపుతుంది. మిగతా కుటుంబ సభ్యులు, మిగిలిన పాత్రలకు వాచికం చెపుతారు.

తోలుబొమ్మలను, మేక, జింక, దుప్పి చర్మాలతో చేస్తారు. అందుకే దీనిని ‘చర్మనాటకం’ అని కూడా పిలుస్తారు. . తోలుబొమ్మలను వెదురుబద్దతో ఆడిస్తారు.

మధ్య మధ్య కేతిగాడు, జుట్టు పోలిగాడు, ‘బంగారక్క వంటి హాస్య పాత్రలు నవ్విస్తారు. పూర్వం తోలు బొమ్మలాట వారు, బళ్ళపై ఊరూరు తిరిగి, ప్రదర్శనలు ఇచ్చేవారు. వీరు భీష్మపర్వం, పద్మవ్యూహం, రామాయణంలో సుందరకాండ, భాగవతంలో కృష్ణలీలలు, రావణవధ వంటి ప్రదర్శనలు ఇచ్చేవారు.

మన రాష్ట్రంలో హిందూపురం, అనంతపురం, మధిర, నెల్లూరు, కాకినాడ ప్రాంతాలలో ఈ తోలు బొమ్మలాట – బృందాలు ఉన్నాయి.

ప్రశ్న 2.
వీధి భాగవతం గురించి మీ సొంతమాటల్లో రాయండి. .
జవాబు:
పురాణ గాథలను నాట్యరూపంగా ప్రదర్శించేవారిని, భాగవతులు అంటారు. భాగవతులు అంటే భగవంతుడి కథలను ప్రదర్శించేవారని అర్థం. వీరు పోతనగారి భాగవతంలోని కథలను, ‘కస్తూరి రంగ రంగా’ అంటూ జానపద శైలిలో నటిస్తూ పాడతారు. ఈ భాగవతాలలో కూచిపూడి భాగవతం, చిందు భాగవతం, గంటె భాగవతం, ఎరుకల భాగవతం, శివ భాగవతం, చెంచు భాగవతం, తూర్పు భాగవతం ప్రసిద్ధమైనవి.

మన రాష్ట్రంలో ఎర్రగొల్లలు, కూచిపూడి భాగవతులు, జంగాలు, చిందు భాగవతులు, యానాదులు, దాసరులు, ఈ భాగవతాలను ప్రదర్శిస్తున్నారు. నేటికీ వీధి భాగవతం లేదా తూర్పు భాగవతం, మన రాష్ట్ర తూర్పు తీరంలో సజీవంగా ఉంది. దీన్ని ‘సత్యభామా కలాపం’ అని కూడా అంటారు. తూర్పు భాగవతం అనే పేరుతో, విజయనగరం జిల్లాలో అమ్మవారి పండుగలలో నేటికి ఇది ప్రదర్శింపబడుతోంది.

ఉత్తరాంధ్ర మాండలికాలతో, యాసతో ఇది వినసొంపుగా ఉంటుంది. ఈ తూర్పు భాగవత ప్రదర్శన ఇచ్చేవారిలో వరదనారాయణ, జగన్నా నం, శంకరయ్య, దాలయ్య, వెంకటస్వామి ప్రముఖులు.

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

ప్రశ్న 3.
‘తప్పెటగుళ్ళు’ ప్రత్యేకత” . వివరించండి.
జవాబు:
తప్పెటగుళ్ళు ఉత్తరాం లో ఎక్కువగా కనిపించే జానపద కళ. తప్పెట గుళ్ళను ప్రదర్శించేవారు, రంగు బనియన్లు నిక్కరులు ధరించి, కాళ్ళకు బరువైన గజ్జెలు కట్టుకుంటారు. రేకుతో గుండ్రంగా చేసిన తప్పెట గుండ్లను, గుండెకు . కట్టుకొని, గట్టిగా వాయిస్తారు. వారు గుండ్రంగా తిరుగుతూ, లయానుగుణంగా అడుగులు వేస్తూ, ఎగురుతూ తప్పెట వాయిస్తూ పాడతారు. ఈ బృందంలో 20 మంది ఉంటారు. మిగిలిన వారు నాయకుడిలాగే తిరుగుతూ నృత్యం చేస్తారు. నాట్యం చివర, వీరు అద్భుత విన్యాసాలు చేస్తారు.

వీరు రామాయణ, భారత, భాగవత కథల్ని గేయాలుగా అల్లుకుంటారు. ఇదంతా మౌఖిక సాహిత్యం . వీరు చెంచులక్ష్మి, సారంగధర, లక్ష్మణ మూర్ఛ వంటి పురాణ కథలతో పాటు, తెలుపాట, గాజులోడి పాట, మందులోడి పాట, చుట్టపాట, వంటి జానపదాలు కూడా పాడతారు.

దేశ విదేశాలలో ఇచ్చిన ప్రదర్శనల వల్ల “తప్పెటగుళ్ళు” పేరుకెక్కింది. కోరాడ పోతప్పడు, చిన్నప్పయ్య, ఆదినారాయణ, కీట్లంపూడి బృందం యలమంచిలి బంగారమ్మ, దుర్యోధన బృందం, మొదలయినవి, ప్రసిద్ధి చెందిన తప్పెట గుళ్ళ కళా బృందాలు.

కింతాడి సన్యాసి రావు కళా బృందం, “తాగొద్దు మామో ! నీవు సారా తాగొద్దు” అంటూ, జన చైతన్యం కోసం ఇస్తున్న ప్రదర్శనలు ప్రజల మెప్పు పొందాయి.

ప్రశ్న 4.
బుర్రకథ – హరికథలను గురించి రాయండి.
జవాబు:
బుర్రకథ :
బుర్రలతో చెప్పే కథ కాబట్టి, ఇది బుర్రకథ. ప్రధాన కథకుడు తంబుర వాయిస్తూ పాడతాడు. వంతలు బుర్రలు వాయిస్తూ వంత పాడతారు. ప్రధాన కథకుడు కథ చెపుతాడు. వంతలలో ఒకడు కథను వివరిస్తాడు. మరొకడు హాస్యం చెపుతాడు.

బుర్రకథకు మొదటివాడు, షేక్ నాజర్. ఈయనకు ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు నిచ్చింది. వీరు అల్లూరి సీతారామరాజు, బొబ్బిలి యుద్ధం, పలనాటి వీరచరిత్ర వంటి చారిత్రక గాథలు చెపుతారు. పద్మవ్యూహం, లంకా దహనం వంటి పురాణ కథలూ, చెపుతారు.

హరికథ :
చేతిలో చిడతలు, కాళ్ళకు గజ్జెలు, పట్టుబట్టలు, మెడలో దండ ధరించి, హరిదాసులు ఈ కథ చెపుతారు. హరికథలో ఒకే వ్యక్తి అన్ని పాత్రలలో రసవంతంగా నటిస్తాడు. మంచివేషంతో, నోటితో కథ చెపుతూ, హరిదాసు తియ్యగా పాడుతాడు. కాళ్ళతో నృత్యం చేస్తాడు, చేతులతో అభినయిస్తాడు.

మొదటి హరికథ, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి రాసిన “ఆధ్యాత్మిక రామాయణం”. హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణ దాసుగారు, హరికథను అన్ని కళల మొత్తంగా తీర్చిదిద్ది ప్రపంచ ప్రఖ్యాతిని తీసుకువచ్చారు.

ఉమాచౌదరి, లలితకుమారి, కోట సచ్చిదానంద భాగవతార్, అమ్ముల విశ్వనాథ భాగవతార్, మంగరాజు భాగవతారిణి వంటి కళాకారులు, పేరుపొందిన హరిదాసులు.. సామవేదం కోటేశ్వరరావు, సూర్యనారాయణ భాగవతాలు, మధుర హరికథా గాయకులు.

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

ప్రశ్న 5.
‘కోలాటం – చెక్క భజనలను’ గురించి మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
మీ ప్రాంతంలో ప్రసిద్ది చెందిన ఏదైనా రెండు జానపద కళలను గురించి మీ సొంతమాటలలో రాయండి.
జానపద కళలైన కోలాటం, చెక్కభజనలను గురించి మీకు తెలిసింది రాయండి.
జవాబు:
‘కోలాటం, అంటే కోలలతో అంటే కర్రలతో చేసే భజన నృత్యం. దీనిని గ్రామ దేవత పండుగలలో, తీర్థాలలో,. జాతరలలో ప్రదర్శిస్తారు. కళాకారులు చేతిలో కోలాటం కర్రలు పట్టుకుంటారు.

జట్టు నాయకుడు ఈల వేస్తూ ఎలా నాట్యం చేయాలో చెపుతాడు. జట్టులో వారు కర్రలు ఒకరికొకరు తగిలిస్తూ లయకు అనుగుణంగా పాడుతూ నృత్యం చేస్తారు. జట్టు నాయకుణ్ణి కోలన్న పంతులు లేక మేళగాడు అంటారు. వీరు జానపద పాటలు, రామాయణం ఘట్టాలు, కృష్ణుడి బాల్య చేష్టలు, భక్తి పాటలు, మొ||వి పాడతారు. పాటకు తగ్గట్టుగా నృత్యం చేయడాన్ని, ‘కోపు’ అంటారు. వెంకట రమణ ప్రముఖ కోలాట విద్వాంసుడు.

చెక్క భజన :
చెక్క భజనలు, పండుగలలో, జాతరలలో యువకులు రాత్రివేళ దేవాలయాల దగ్గర చేస్తారు. వీరు పంచె కట్టి, రంగు గుడ్డ తలకు చుట్టి, నడుమునకు పట్టి, కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. ఇత్తడి బిళ్ళలు ఉన్న చెక్కలను చేతితో ఆడిస్తూ, గుండ్రంగా వెనుకకూ, ముందుకు నడుస్తూ, తిరుగుతూ భజన చేస్తారు. అందరూ ఈ కలిసి ఒకేసారి ఎగరడం, కూర్చోడం, లేవడం చేస్తారు.

వీరు భారత, రామాయణ, భాగవతాది పురాణ గాథలను పాడతారు. వీటిలో హరి భజనలు, పండరి భజనలు, కోలాట భజనలు, అడుగు భజనలు వంటి ప్రక్రియలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి చాలావరకు తగ్గాయి.

ప్రశ్న 6.
‘గిరిజన నృత్యం’ గురించి మీ సొంతమాటల్లో చెప్పండి. జ. అరకులోయలో కొండదొర, భగత, ఖ్యోద్, బోండీ అనే తెగల గిరిజనులున్నారు. ఉత్సవాల సమయంలో ఒక – గ్రామం వారు, మరో గ్రామానికి వెళ్లి, ‘థింసా’ నృత్యం. చేస్తారు. వివాహం సమయంలోనూ, చైత్రమాసంలో ఇటికల పండుగ రోజుల్లోనూ, గిరిజనులు ఈ నృత్యం చేస్తారు.

థింసా జట్టుకు ఒక నాయకుడు ఉంటాడు. 20 మంది స్త్రీలు నృత్యం చేస్తారు. వాయిద్యాలు, మగవారు వాయిస్తారు. థింసాలో సన్నాయి, తుడుము, కిరిడి, డప్పు, బాకా, పిన్నలగర్ర, జోడి కొమ్ములు అనే ఆరు వాయిద్యాలు పురుషులు వాయిస్తారు. తమ గ్రామదేవత ‘నిసాని దేవత’ ను ఆరాధిస్తూ చేసే నృత్యాన్ని, “బోడి థింసా” అంటారు.

ఈ నృత్యంలో ఒకవైపు మగవారు, మరొకవైపు స్త్రీలు, చేతులు పట్టుకొని వరుసగా నిలబడతారు. వీరు బృంద నాయకుడిని అనుసరిస్తూ లయబద్ధంగా అడుగులు వేస్తారు. ఈ నృత్యంలో పొంగిబుల్లమ్మ, కొర్రరాజమ్మ, కిలోల్ల లక్ష్మమ్మ మొదలయిన థింసా నృత్యబృందాలు. దేశమంతా ప్రదర్శనలు ఇస్తూ పేరుపొందాయి.

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

ప్రశ్న 7.
కురవంజిని గూర్చి రాయండి.
జవాబు:
తెలుగువారి మొట్టమొదటి గిరిజనుల దృశ్యకావ్యం అని, కురవంజిని గూర్చి చెపుతారు. కురవంజి అంటే ఒక నృత్యవేషంతో కూడిన లయబద్దమైన అడుగు. అరణ్యాలలో నివసించే చెంచులు, కోయలు, కురవలు ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారు.

‘కురవలు’ అనే గిరిజనులు ప్రదర్శించేది, కాబట్టి దీనిని కురవంజి లేక కొరవంజి అని పిలుస్తూ వచ్చారు. పుణ్యక్షేత్రాలను గురించిన పురాణకథలు ఈ నృత్యంలో ప్రదర్శింపబడతాయి. ఈ నాటికీ తిరుపతి, మంగళగిరి, శ్రీశైలం, భద్రాద్రి, సింహాచలం మొదలయిన యాత్రాస్థలాల్లో, కురవలు కురవంజి నృత్యాన్ని ప్రదర్శిస్తారు.

కఠిన పదములకు అర్థములు

పరవశించిన = ఆనందంతో తృప్తిపడిన
గాథలుగా = కథలుగా
అభినయించేవారు = నటించేవారు
ఓనమాల వంటివి = ప్రారంభకములు (మొదటివి)
రూపుదిద్దుకున్నాయి = రూపం ధరించాయి
జాలువారిన = ప్రసరించిన, వ్యాపించిన
వీనుల విందు = చెవులకు పండుగ
ఇతిహాసాలు = పరంపరగా చెప్పుకొనే పూర్వకథలు
వన్నె తరుగుతున్న = యోగ్యత తగ్గిన
ఆధ్యాత్మిక ఔన్నత్యం = పరమాత్మ సంబంధమైన గొప్పతనం
అలరిస్తున్నాయి = ఆనందింపచేస్తున్నాయి
సంతరించుకుంటుంది = ధరిస్తుంది
ఆమడలు = నాలుగు క్రోసుల దూరం,
యోజనము నానుడి = సామెత
వాచికం = మాట
వంతపాడు = ఒకరు అన్న మాటనే అనాలోచితంగా తాను కూడా అనడం
అనుగుణంగా = తగ్గట్టుగా
జీవనోపాధి (జీవన + ఉపాధి) = బ్రతుకు దెరవు
ప్రఖ్యాతి చెందాయి = ప్రసిద్ధి పొందాయి
జానపద శైలి = గ్రామీణ శైలి
ఉధృతంగా = గొంతెత్తి గట్టిగా
వలయాకారంగా = గుండ్రంగా
పతాక స్థాయి = ఉన్నతస్థాయి
విన్యాసాలు = ప్రదర్శనలు
ఆకట్టుకుంటాయి = ఆకర్షిస్తాయి
ప్రాచుర్యం = విస్తారము
మన్ననలు పొందాయి = ఆదరం పొందాయి
గుమ్మెట = తుడుము అనే వాయిద్యము
రక్తి కట్టిస్తారు = ఆసక్తి కలిగేలా ప్రదర్శిస్తారు
ఆద్యుడు = మొదటివాడు
సత్కరించింది = గౌరవించింది

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

ప్రజాదరణ (ప్రజా+ఆదరణ) = ప్రజల ఆదరణ
ఆహార్యం = వస్త్రధారణ రూపమైన అభినయం
వాచకం = నోటితో మాట్లాడడం ద్వారా చేసే అభినయం
సమాహారం = మొత్తము, గుంపు
అనాది = మొదలు లేనిది (చిరకాలంగా ఉన్నది)
ప్రాంగణం = ముంగిలి
ఉత్కృష్టము = శ్రేష్ఠము
దర్పణాలు = అద్దాలు
శ్రుత పాండిత్యం = వినడం ద్వారా నేర్చుకొన్న పాండిత్యము
కాలగర్భం = కాలము కడుపు
గ్రంథస్థం = గ్రంథములో వ్రాయడం
జీవనోపాధి = బ్రతకడానికి దారి
వర్తమానం = ప్రస్తుత కాలం
వలస పోతున్నారు = మరో దేశానికి పోతున్నారు
కర్తవ్యం = చేయవలసిన పని

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 14th Lesson కరపత్రం Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 14th Lesson కరపత్రం

7th Class Telugu 14th Lesson కరపత్రం Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై చిత్రం చూడండి. చిత్రంలో ఎవరెవరున్నారు ? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
చిత్రంలో బాలబాలికలు ఉన్నారు. వారు ఊరేగింపుగా నడచి వెడుతున్నారు. వారు బాలల హక్కుల గురించి నినాదాలు ఇస్తున్నారు.

ప్రశ్న 2.
ఇలాంటి దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా?
జవాబు:
ఇలాంటి దృశ్యాల్ని నేను చాలామార్లు చూశాను. ఎయిడ్స్ వారోత్సవాలు, నెహ్రూ జయంతి ఉత్సవాలు, చిన్నపిల్లలకు టీకాలు వేయించడం, స్వచ్ఛభారత్ ఉద్యమం వంటి సందర్భాలలో పిల్లలు నినాదాలు చేస్తూ వీధుల్లో ఊరేగుతారు.

ప్రశ్న 3.
ఇలా ఎప్పుడెప్పుడు ఊరేగింపులు నిర్వహిస్తారు? ఎందుకు?
జవాబు:
ఇలాంటి ఊరేగింపులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, సేవాదళ్ కార్యకర్తలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు శోభాయాత్రలు చేస్తూ ఉంటారు. ప్రజలకు విషయాలు తెలియజేయడానికీ, తమ హక్కులను గూర్చి, – కోరికలను గూర్చి, ప్రభుత్వాలకు చాటి చెప్పడానికి ఇలాంటి ఊరేగింపులను నిర్వహిస్తారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

ప్రశ్న 4.
ఊరేగింపులో ఏమి పంచుతున్నారు? వాటిని ఏమంటారు?
జవాబు:
ఊరేగింపులో కాగితాలు పంచుతున్నారు. వాటిని “కరపత్రాలు” అంటారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఏదైనా ఒక కరపత్రాన్ని సేకరించండి. ఇద్దరిద్దరు కలిసి కూర్చోండి. ఒకరు తెచ్చిన కరపత్రాన్ని ఇంకొకరికి చదివి వినిపించండి. విన్న తరువాత ఆ కరపత్రంలో ఏ అంశాలు ఉన్నాయో చెప్పండి.
జవాబు:
నేను సేకరించిన కరపత్రం “సాయిబాబా గుడి ప్రారంభోత్సవానికి సంబంధించినది. మా నగరంలో కొత్తగా కట్టిన షిరిడీసాయి దేవాలయంలో వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజూ ఒక కార్యక్రమం ఉంది. వాటిని చూచి, ప్రసాదం తీసుకొని తరించండని కరపత్రం పంచారు

ప్రశ్న 2.
పిల్లల హక్కులను గూర్చి మీ తల్లిదండ్రులను అడగండి. వారు ఏమి చెప్పారో చెప్పండి.
జవాబు:
పిల్లలకు (1) చదువుకొనే హక్కు (2) అభివృద్ధి చెందే హక్కు’ (3) కూడు-గూడు-గుడ్డ హక్కు (4) తల్లిదండ్రుల ఆస్తిలో వాటా పొందే హక్కు ఉన్నాయని మా తల్లిదండ్రులు చెప్పారు.

ప్రశ్న 3.
మీ వాడలో / గ్రామంలో బడికి వెళ్ళని పిల్లలు ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళను బళ్ళలో చేర్చడానికి మీరేం చేస్తారు?
జవాబు:
మా బడిలో జరిగే ఉత్సవాల గురించి, టీచర్లు చెప్పే కథలను గూర్చి, బడికిరాని పిల్లలకు చెపుతాను. వారిని బడికి . రమ్మని ప్రోత్సహిస్తాను. వాళ్ళకు నా పుస్తకాలు అరువు ఇస్తాను. బడికి రాని పిల్లల ఇళ్ళకు, నా మిత్రులతో, ఉపాధ్యాయులతో కలిసి వెళ్ళి, వారి పిల్లలను బడికి పంపమని, వారి తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పిస్తాను.

II. చదవడం – రాయడం

1. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

మదునయ్య చేపల వ్యాపారి. శ్రీశైలం రిజర్వాయరులో చేపలు పట్టి అమ్ముతాడు. పెద్ద పెద్ద వలలను నీటిలో వేసి చేపలను పడతాడు. ఇందుకోసం ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్ కు వెళ్ళి, ఆరో తరగతి చదివే గంగయ్య అనే బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి, పదివేలకు అతన్ని పనికి కుదుర్చుకున్నాడు. గంగయ్యను తన వెంట తీసుకొని శ్రీశైలం వచ్చాడు. గంగయ్య రోజూ నీటి ఒడ్డున కూర్చొని వలను చూస్తూ ఉండేవాడు. ఒక్కోసారి రాత్రి కూడా అక్కడే పడుకొనేవాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మదునయ్యను శిక్షించారు. గంగయ్యను బళ్ళో చేర్పించి అతని తల్లిదండ్రులకు తెలియజేశారు.

అ) మదునయ్య ఎవరు? ఏం చేసేవారు?
జవాబు:
మదునయ్య చేపల వ్యాపారి. ఆయన శ్రీశైలం రిజర్వాయరులో చేపలు పట్టి అమ్ముతాడు.

ఆ) గంగయ్య ఎవరు? శ్రీశైలానికి ఎందుకు వచ్చాడు?
జవాబు:
గంగయ్య బరంపురంలో 6వ తరగతి చదివేవాడు. మదునయ్య వద్ద చేపల చెరువును కాపలా కాసేందుకు శ్రీశైలం వచ్చాడు.

ఇ) గంగయ్య పనిలో చేరడం వల్ల ఏమేం కోల్పోయాడు?
జవాబు:
గంగయ్య పనిలో చేరడం వల్ల చదువుకొనే స్వేచ్ఛ కోల్పోయాడు.

ఈ) బాలల హక్కులలో గంగయ్య ఏ హక్కులకు దూరమయ్యాడు?
జవాబు:
బాలల హక్కులలో గంగయ్య (1) చదువుకొనే హక్కు (2) కూలి జీవితం నుండి బయటపడే హక్కు (3) ఆటపాటలతో కూడిన వినోదం, విశ్రాంతి పొందే హక్కు కోల్పోయాడు.

ఉ) మదునయ్యను ఎందుకు శిక్షించారు? ఇలా చేయడం సరైందేనా?
జవాబు:

  1. మదునయ్య గంగయ్య యొక్క చదువుకొనే హక్కుకు భంగం కలిగించాడు. .
  2. కష్టమైన పని చేయకుండా బయటపడే హక్కును భంగపరచాడు.
  3. చదువుకొనే బాలుడిని మదునయ్య పనిలో పెట్టుకున్నాడు. అది తప్పు కాబట్టి మదునయ్యను శిక్షించడం సబబే.

ఊ) గంగయ్య తల్లిదండ్రులు చేసినపని సరైందేనా? ఎందుకు?
జవాబు:
గంగయ్య యొక్క తల్లిదండ్రులు చేసిన పని సరైంది కాదు. 6వ తరగతి చదువుకొంటున్న గంగయ్యను వారు బడి మాన్పించి బాలకార్మికునిగా పనిచేయడానికి మదునయ్యకు అమ్మివేశారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

2. కింది వాక్యాలను చదివి తప్పో, ఒప్పో గుర్తించండి. కారణం రాయండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం 2

3. పాఠం చదవండి. జవాబులు రాయండి.

అ) కరపత్రం అంటే ఏమిటి? లేఖలకు, కరపత్రాలకు గల తేడాలు ఏమిటి?
జవాబు:
చేతిలో అనువుగా ఒదిగి, ఒక విషయానికి సంబంధించిన వివరణను “కరపత్రం” అంటారు. చేతిలో కాగితం అని దీని అర్థం. పదిమందికీ తెలియవలసిన విషయంతో కూడుకున్నదే కరపత్రం.

లేఖలలో రాసే, చదివే వ్యక్తుల వ్యక్తిగత విషయాలు ఉంటాయి. కరపత్రాలలో వ్యక్తిగత విషయాలే కాక, మనచుట్టూ ఉన్న సమాజం, దేశం, ప్రపంచంలోని విషయాలు ఉంటాయి.

ఆ) కరపత్రాలను ఎందుకు రూపొందిస్తారు? కరపత్రాలు ఎలా ఉంటాయి?
జవాబు:
ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద విషయాన్ని అందరికీ తెలియచేయడం కోసమే కరపత్రాన్ని రూపొందిస్తారు.

కరపత్రాలు వేసిన వాళ్ల, రాసిన వాళ్ళ పేర్లు, ముద్రణాలయం పేరు, కరపత్రంలో ఉండాలి. సాధారణంగా కరపత్రాలు అన్నీ చౌకగా ఉండే రంగు కాగితాల్లోనే అచ్చువేస్తారు. ఎక్కువగా కరపత్రాలు ఒకటి రెండు పేజీలకు పరిమితం అవుతాయి. అవసరాన్ని బట్టి ఇవి వేరు వేరు కొలతలలో, పరిమాణాలలో కనిపిస్తాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనం ఉన్న అంశాలు సామాన్య ప్రజలకు చేరవేయడానికి, కరపత్రం మంచి సాధనంగా ఉపయోగిస్తుంది.

ఇ) పాఠంలోని కరపత్రం దేనికి సంబంధించినది? దీన్ని ఏ శాఖవారు తయారుచేశారు? ఎందుకు?
జవాబు:
పాఠంలోని కరపత్రం, బాలల హక్కుల వారోత్సవాలకు సంబంధించినది. దీనిని పాఠశాల విద్యాశాఖ వారు తయారుచేశారు. బాలల హక్కులను గూర్చి అందరికీ తెలియజేయడానికి ఈ కరపత్రాన్ని తయారుచేశారు.

ఈ) కరపత్రంలో ఏ చట్టాన్ని గురించి తెలిపారు? అది ఎప్పటి నుంచి అమలు జరుగుతున్నది?
జవాబు:
కరపత్రంలో ‘బాలల హక్కుల చట్టాన్ని గురించి తెలిపారు. ఐక్యరాజ్యసమితి 1989లో బాలల హక్కులను నిర్వచించి, వాటి అమలుకు పూనుకొన్నది. ఆగస్టు 2009లో భారత ప్రభుత్వం, బాలల విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించి చట్టం చేసింది. మన రాష్ట్రంలో 1-4-2010 నుండి నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చింది.

ఉ) బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా ఏ ఏ అంశాలను గురించి అవగాహన కల్పించాలని భావించారు?
జవాబు:
బాలల హక్కుల వారోత్సవాలలో విద్యాహక్కు చట్టం గురించి తెలియజేయాలని భావించారు. 6 -14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలబాలికలందరూ, ఉచిత నిర్బంధ విద్యను పొందడం, బాలల హక్కులు రక్షింపబడటం, బడికి వెళ్ళని పిల్లల్ని బడుల్లో చేర్చడం, పిల్లల దగ్గర ఫీజులు, విరాళాలు వసూలు చేయడం, చట్ట విరుద్ధమని, తెల్పడం, వలస వచ్చిన పిల్లలకు కూడా విద్యా సౌకర్యాలు కల్పించడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు అందించడం, వగైరా విషయాలపై అవగాహన కల్పించాలని భావించారు.

ఊ) బాలల హక్కుల జాబితా తయారుచేయండి.
జవాబు:

  1. జీవించే హక్కు
  2. చదువుకొనే హక్కు
  3. ఆరోగ్యం పోషణ హక్కు
  4. కూడు, గూడు, గుడ్డ హక్కు
  5. ఆటపాటలతో కూడిన వినోదం, విశ్రాంతి పొందే హక్కు
  6. కష్టమైన పని చేయకుండా బయటపడే హక్కు
  7.  కూలి జీవితం నుండి బయట పడే హక్కు
  8. కులమత వర్గ విచక్షణ లేని బాల్యం అనుభవించే హక్కు
  9. దౌర్జన్యాల నుండి రక్షణ పొందే హక్కు – ప్రత్యేకించి ఆడపిల్లలు దుర్మార్గుల నుండి రక్షణ పొందే హక్కు
  10. అభివృద్ధి చెందే హక్కు

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) అందరూ చదువుకోవాలి కదా! కాని కొంతమంది ఆడపిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు చదివించడం లేదు. దీనిమీద మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
ఆడపిల్లలను తల్లిదండ్రులు తప్పక చదివించాలి. మగ పిల్లలవలె పోటీ పరీక్షలకు పంపించి, ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు సాధించేలా వారికి శిక్షణ ఇప్పించాలి.

ఇపుడు చదువుకొని, ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లలకే పెళ్ళిళ్లు అవుతున్నాయి. నేడు భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే కాని, సంసారాలు నడవవు. ఒకవేళ ,,వారు ధనవంతులయినా, తల్లిదండ్రులు ఇద్దరూ విద్య చదువుకున్నవారు కాకపోతే, వారికి పుట్టిన పిల్లలు అభివృద్ధి కాలేరు. కాబట్టి ఆడపిల్లలను తప్పక చదివించాలి.

ఆ) బాలబాలికలలో ‘ప్రత్యేక అవసరాలున్న పిల్లలు కూడా ఉంటారు. మరి ఈ పిల్లలు బడిలో ఉంటే వాళ్ళ హక్కులను కాపాడటానికి మీరేం చేస్తారు?
జవాబు:
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, అంటే అంగవైకల్యం గల పిల్లలు. అంగవైకల్యం గలవారు మిగిలిన పిల్లలవలె చదువుకొనడం వీలుపడదు. కొందరికి సరిగా వినబడదు. కొందరు.సరిగా నడవలేరు. కొందరికి చూపు తక్కువ.

పైన చెప్పిన అంగవికలురకు ప్రత్యేక పాఠశాలలు, మండల కేంద్రాల్లో పెట్టాలి. లేదా రెవెన్యూ డివిజన్ కేంద్రాలలోనయినా, ప్రభుత్వము చెవిటి, మూగ మొదలయిన అంగవైకల్యం కలవారికి, వారికి పాఠం చెప్పే నేర్పు కల ఉపాధ్యాయులను నియమించి; పాఠశాలలు స్థాపించాలి.

నేను నా మిత్రుల సాయంతో కొంత నిధిని పోగుచేసి, అటువంటి మిత్రులకు వారి చదువుకు కావలసిన ఉపకరణాలు కొనియిస్తాను.

IV. పదజాలం

1. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) హక్కులు, బాధ్యతలు :
ప్రతి దేశపౌరుడూ తనకు గల హక్కులూ, బాధ్యతలూ తెలుసుకోవాలి.

ఆ) కంటికి రెప్పలా :
మన దేశ సైనికులు, రాత్రింబగళ్ళు శ్రమించి దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు.

ఇ) సొంతకాళ్ళమీద నిలబడు :
నా మిత్రుడు తాను ఉద్యోగం సంపాదించి,. సొంతకాళ్ళమీద నిలబడాలని ప్రయత్నిస్తున్నాడు.

ఈ) విజయం సాధించు :
నేను పరీక్షలలో మంచి మార్కులతో విజయం సాధించాను.

ఉ) రక్షణ :
పిల్లలందరికీ తల్లిదండ్రులతో పాటు, ప్రభుత్వ రక్షణ కూడా అవసరం.

ఊ) పనితనం :
మంచి పనితనం ఉన్నవారికి, అన్ని రంగాలలో గుర్తింపు వస్తుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

2. నీకు వినోదాన్ని, విశ్రాంతిని, ఆనందాన్ని ఇచ్చేవి ఏవి? కష్టాన్ని, విసుగును, అలసటను కలిగించేవి ఏవి?
జవాబు:

వినోదం, విశ్రాంతి, ఆనందం కలిగించేవి కష్టం, విసుగు, అలసట కలిగించేవి
1. సినీమా, టీవీ, పాటలు వినడం 1. విశ్రాంతి లేకుండా చదవడం.
2. ఆటలు ఆడడం, చూడడం 2. ఉదయాన్నే లేచి నడవడం, జాగింగ్ వగైరా శరీరశ్రమ.
3. క్రికెట్ ను టీవీలో చూడడం 3. పెద్దవాళ్ళ చాదస్తపు సలహాలు
4. మిత్రులతో షికారుకు వెళ్ళడం, పూలతోటల్లో సంచరించడం. 4: నీతి ఉపదేశాలు.
5. షవర్ కింద స్నానంచేయడం, చెరువులో,కాలువలో ఈత లాడడం. 5. పరుగుపోటీల్లో పాల్గొనడం వగైరా

3. “బడి”, పిల్లల ప్రపంచం. ఇది పిల్లల అభివృద్ధికి కృషి చేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బడికి సంబంధించిన పదాలు రాయండి.
జవాబు:
బడి క్రమశిక్షణకు ఉత్తమసాధనం. పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు. పాఠశాలల్లో క్రీడలు, భావి క్రీడాకారుల కార్చానాలు. పరీక్షలు విజ్ఞానాన్ని మెరుగుపెట్టే సానరాళ్ళు. బడి పిల్లలు, పుష్పాల వంటివారు. పిల్లలు దుర్మార్గం, కపటం, మోసం ఎరుగని జాతి పుష్పాలు. బడి పిల్లలకు వెలుగును, విజ్ఞానాన్ని పంచే దేవాలయం.

4. వారం రోజులపాటు ఏదైనా ఒక అంశం గురించి, కార్యక్రమాలను నిర్వహిస్తే ‘వారోత్సవం’ అంటారు. వారోత్సవాలలాగ, ఇంకా ఏ ఏ ఉత్సవాలు నిర్వహిస్తారు. వాటి పేర్లు రాయండి.
జవాబు:

  1. మాసోత్సవాలు : నెలరోజులు చేసే ఉత్సవాలు.
  2. పక్షోత్సవాలు : 15 రోజులు చేసే ఉత్సవాలు.
  3. సప్తాహాలు : ఏడు రోజులు చేసే ఉత్సవాలు.
  4. ప్రభాత సేవలు : తెల్లవారు జామున చేసే సేవలు.
  5. దినోత్సవం : స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం వంటివి ఒక్కరోజు మాత్రమే చేసే ఉత్సవాలు.
  6. వార్షికోత్సవాలు : సంవత్సరానికి ఒకసారి చేసే ఉత్సవాలు.
  7. సాంవత్సరికోత్సవం : సంవత్సరము (ఏడాది). చివరన చేసే ఉత్సవం.
  8. రజతోత్సవం : 25 సంవత్సరాల తరువాత చేసే ఉత్సవం.
  9. స్వర్ణోత్సవం : 50 సంవత్సరాల తరువాత చేసే ఉత్సవం.
  10. వజోత్సవం : 60 సంవత్సరాల తరువాత చేసే ఉత్సవం.

5. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.

1. మన సాహిత్య సమావేశం వివరాల కరపత్రం పంచి పెట్టాము. (చేతిలో కాగితం)
2. వ్యాపారంలో ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలించాలి. (లోతుగా)
3. ఈ రోజు నగరంలో జనసమ్మర్దము ఎక్కువగా ఉంది. (జనుల సందడి)
4. ఆధునిక కాలం లో ప్రజలకు “టీవీ”లపై మోజు పెరిగింది. (నేటి కాలం)
5. పత్రికలలో అసంఖ్యాకమైన ప్రకటనలు వస్తున్నాయి. (లెక్కలేనన్ని)
6. నాకు ఈ విషయంలో ఇంకా సందిగ్ధంగా ఉంది. (సందేహాలు)
7. మాట్లాడేటప్పుడు అపార్థాలకు చోటివ్వకుండా మాట్లాడాలి. (అపోహలు)
8. కరపత్రం భావప్రకటనా స్వేచ్ఛకు సంకేతం. (గుర్తు)

6. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1) నిశితంగా : మా తమ్ముడు ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తాడు.
2) ప్రపంచవ్యాప్తంగా : ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలు పెరిగాయి.
3) జన సమ్మర్ధము : తీర్ధంలోని జన సమ్మర్టంలో మా తమ్ముడు ‘తప్పిపోయాడు.
4) ఆధునిక కాలం : ఆధునిక కాలంలో పిల్లలకు ఫ్యాషన్ల పిచ్చి ముదిరింది.
5) అసంఖ్యాకంగా : నేడు ప్రభుత్వం అసంఖ్యాకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది.
6) అపార్ధము : మాట్లాడే మాట అపార్థాలకు తావు లేకుండా ఉండాలి.
7) సందిగ్ధం : చేసే పనిలో సందిగ్గానికి చోటు ఉండరాదు. –
8) ఆస్కారము : నీవు చెప్పిన మాటను బట్టి అతడు ఇంట్లో ఉండడానికి ఆస్కారముంది.
9) సమకాలీనం : సహజంగా జనానికి, సమకాలీన విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

7. కింది పదాలకు వ్యతిరేకపదాలు రాయండి.

1. సౌకర్యం × అసౌకర్యం
2. ప్రధానము × అప్రధానము
3. ప్రాచీనము × నవీనము
4. గట్టిగా × నెమ్మదిగా.
5. నిర్భయం × భయం
6. సందిగం × అసందిగం
7. సాధారణం × అసాధారణం
8. వాస్తవం × అవాస్తవం

V. సృజనాత్మకత

బాలల హక్కుల వారోత్సవాల గురించి కరపత్రం చదివారు కదా ! కింది అంశాలలో ఏదైనా ఒక అంశంపై మీ మిత్రులతో కలిసి ఒక కరపత్రం తయారు చేయండి.

అ) పరిసరాల పరిశుభ్రత,
ఆ) దోమల నిర్మూలన
ఇ) చెట్ల పెంపకం
జవాబు:

పరిసరాల పరిశుభ్రత

చదవండి ! – ఎదగండి !
రోగం వస్తే చేంతాడు క్యూలో నిలబడి, డాక్టరును కలిసి మందులు కొనుక్కొని మింగుతాం. అసలు రోగాలెందుకు వస్తున్నాయి? దానికి మనం ఎంతవరకు కారణం అని ఆలోచించం. నిజంగా ఆలోచిస్తే మన ఇంటిచుట్టూ పరిసరాల శుభ్రత లేకపోవడం వల్లే, ఈ రోగాలు మనపై దండయాత్ర చేస్తున్నాయి.

మనం ఇల్లు తుడిచి ఆ తుక్కు పక్క ఇంటి వాని గుమ్మం ముందు వేస్తాం. ‘మన ఇంట్లోని మురికినీరు రోడ్లపైకి వదలివేస్తాం. మనకు పనికిరాని ‘వస్తువులు రోడ్లపైకి విసరుతాం. మనం పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమలు రావు. దోమల వల్లే మనకు సగం రోగాలు. అందరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మందులూ, డాక్టర్లూ అవసరం ఉండదు. పరిసరాల పరిశుభ్రత పాటించండి. మందుల అవసరం తగ్గించండి. బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జనలు మానండి. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోండి.

మా మాట వినండి.
తేది XXX,
విజయవాడ.

ఇట్లు,
పాఠశాల ఆరోగ్యసమితి.

VI. ప్రశంసలు

* బాలల హక్కుల కోసం కృషి చేసే వారి గురించి / సంస్థల గురించి మీ అభిప్రాయాలు రాయండి. వారిని అభినందిస్తూ లేఖ రాయండి.
జవాబు:

అభినందనలేఖ

తిరుపతి,
XXXXX

రాజీవ్/నెహ్రూ బాలల హక్కుల సంఘాల వారికి,

ఆర్యులారా !
అభినందనలు నగరంలో మీరు చేస్తున్న కృషి వల్ల మన నగరంలోని బాల బాలికలందరూ, నేడు పాఠశాలల్లో చదువుతున్నారు. మీ కృషి వల్ల ఎందరో వీధి బాలలూ, రైళ్ళల్లో తిరుగుతూ ముష్టి ఎత్తుకొనే పిల్లలూ, అనాథ బాలబాళికలూ, నేడు మీరు స్థాపించిన సేవాసదన్లలో చేరి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఎందరో కాఫీ హోటళ్ళలో పనిచేస్తూ ఉండే బాలురు, వీధుల్లో చెత్త కాగితాలు ఏరుకొనే పిల్లలు, నేడు మీ సంస్థల ద్వారా సాయం పొంది, హాయిగా తిండికీ బట్టకూ లోటు లేకుండా చదువుకుంటున్నారు.

మీరు చేస్తున్న కృషికి, సేవా భావానికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు. నమస్సులు.

ఇట్లు, పి.
రాము & కె. సరోజ,
7వ తరగతి,
దేవస్థానం ఉన్నత పాఠశాల,
తిరుపతి.

చిరునామా :
కార్యదర్శి,
రాజీవ్/నెహ్రూ బాలల హక్కుల సంఘాలు,
తేరువీధి, తిరుపతి.

VII. ప్రాజెక్టు పని

* కొన్ని కరపత్రాలు సేకరించండి. వాటిని ఎవరు ముద్రించారు? ఎందుకోసమో తెలపండి.
జవాబు:

ముద్రించినవారు ఎందుకోసం
1. అమలాపురం మునిసిపల్ కమీషనర్ 1. పిల్లలకు పోలియో చుక్కలు వేయించమని
2. మండల విద్యాధికారి, అమలాపురం 2. బడి ఈడు పిల్లలను అందరినీ బడులలో చేర్పించమని
3. వేంకటేశ్వర దేవస్థానం, కార్యనిర్వహణాధికారి 3. వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల కార్యక్రమం గురించి
4. డీలక్సు సినిమా హాలు వారు 4. కొత్తగా రిలీజయిన సినిమా గురించి
5. చందన బ్రదర్సు, అమలాపురం 5. ఆ సంస్థ వార్షికోత్సవంలో ఇస్తున్న రిబేట్ల గురించి, బంగారు వస్తువుల, బట్టల అమ్మకం గురించి.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1. అ) కింది వాక్యాలు భావాన్ని అనుసరించి ఏ వాక్యాలో గుర్తించండి. ఆ ప్రక్కన రాయండి.
ఉదా : ఎంత బాగుందో ! (ఆశ్చర్యార్థక వాక్యం)

అ. నువ్వు చదువు. (విధ్యర్థక వాక్యం)
ఆ. అల్లరి చేయవద్దు. (నిషేధార్థక వాక్యం)
ఇ. పరీక్షలు రాయవచ్చు. (అనుమత్యర్థక వాక్యం)
ఈ. తనూ బొమ్మలు వేయగలడు. (సామర్థ్యార్థక వాక్యం)

కింది వాక్య భేదాలు చూద్దాం.

1. రవి పనిచేస్తాడో చెయ్యడో !
ఈ వాక్యం చదివితే రవి పనిచేయటం అనే విషయంలో అనుమానం, అంటే సందేహం కలుగుతున్నది కదూ! ఇలా సందేహాన్ని తెలిపే పాక్యాలను “సందేహార్థక వాక్యాలు” అంటారు.

2. నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు !
ఈ వాక్యం ఏ అర్థాన్ని సూచిస్తున్నది? ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నట్లు కనబడుతోంది కదా ! ఇలా ఆశీర్వదిస్తున్నట్లు అర్థాన్ని సూచించే వాక్యాలను “ఆశీరక వాక్యాలు” అంటారు.

3. దయచేసి పని చేయండి
ఈ వాక్యం ఒక పనిని చేయమని ప్రార్థిస్తూ ఉంది. అంటే ప్రార్థన అర్థాన్ని సూచిస్తున్నది. కాబట్టి ఇది “ప్రార్థనార్థక వాక్యం”

ఒక వాక్యం ప్రార్థన అర్థాన్ని సూచిస్తున్నట్లు ఉంటే అది ప్రార్థనార్థక వాక్యం అన్నమాట.

4. ఏం ! ఎప్పుడొచ్చావ్ ?
ఈ వాక్యం ప్రశ్నిస్తున్నట్లుంది కదూ ! అంటే ఇది “ప్రశ్నార్థక వాక్యం”.
ఒక వాక్యానికి ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటాం.

5. వర్షాలు లేక పంటలు పండ లేదు.

ఈ వాక్యం మనకు రెండు విషయాల్ని తెలుపుతోంది. ఒకటి వర్షాలు లేవని, రెండు పంటలు పండలేదని. ఐతే పంటలు పండకపోవడానికి కారణం మొదటి విషయం. అంటే వర్షాలు లేకపోవటం. ఈ మొదటి విషయం . రెండో విషయానికి కారణం అవుతోంది. అంటే హేతువు అన్నమాట. ఇలా హేతువు అర్థాన్ని సూచించే వాక్యం “హేత్వర్థక వాక్యం”.

ఒక పని కావడానికి కారణాన్ని లేదా హేతువును సూచించే అర్థం ఉన్న వాక్యాన్ని “హేత్వర్థక వాక్యం” అంటాం.

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

2) కింది వాక్యాలు ఏ అర్థాన్ని సూచించే వాక్యాలో రాయండి.

అ) ఎవరా పైడిబొమ్మ? (ప్రశ్నార్థక వాక్యం)
ఆ) పంటలు పండలేదు. (సామాన్యవాక్యం)
ఇ) దయచేసి సెలవు ఇవ్వండి. (ప్రార్థనార్థక వాక్యం)

అభ్యాసాలు : ఇలాంటి వాక్యాల్ని మీ పాఠ్యాంశాలలో వెతికి రాయండి.

  1. భక్తిపాడర తమ్ముడా ! (ప్రార్థనార్థక వాక్యం)
  2. పదముపాడర తమ్ముడా ! (ప్రార్థనార్థక వాక్యం)
  3. గారవింపవె చెల్లెలా ! (ప్రార్థనార్థక వాక్యం)
  4. పాటపాడవె చెల్లెలా ! (ప్రార్థనార్థక వాక్యం)
  5. మీ ఆకలి బాధ నివారించుకోండి. (ప్రార్థనార్థక వాక్యం)
  6. తమరు కుశలమేకదా? (ప్రశ్నార్థక వాక్యం)
  7. తుదకు దొంగలకిత్తురో? దొరలకౌనో? (సందేహార్థక వాక్యం)
  8. తిరిగి యిమ్మువేగ తెలుగుబిడ్డ? (విధ్యర్థక వాక్యం)
  9. పుస్తకమ్ములను చింపబోకు మురికీ చేయబోకు (విధ్యర్థక వాక్యం)
  10. కుసుమ వల్లరు లేరీతి గ్రుచ్చినావు? (ప్రశ్నార్థక వాక్యం)
  11. మీరు పక్షులను గుర్తించగలరా? (ప్రశ్నార్థక వాక్యం)
  12. దేన్ని గురించి నేను మీకు రాయాలి? (ప్రశ్నార్థక వాక్యం)
  13. స్టేషన్లో టికెట్లను జారీ చెయ్యకండి. (నిషేధార్థక వాక్యం)
  14. కేబుల్ గ్రామ్ పంపించండి. (ప్రార్థనార్థక వాక్యం)
  15. దాచిన బడబానలమెంతో? (ప్రశ్నార్థక వాక్యం)
  16. సుకృతంబు గట్టికొనవన్న (ప్రార్థనార్థక వాక్యం)
  17. పోయిరమ్ము (విధ్యర్థక వాక్యం)
  18. మమత్వంబు విడువుమన్న (ప్రార్థనార్థక వాక్యం)
  19. ఆడకుమ సత్య భాషలు (విధ్యర్థక వాక్యం)

(ఆ) కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.

1. విషయాసక్తి = విషయ + ఆసక్తి = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
2. వివాదాత్మకం = వివాద + ఆత్మకం = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
3. వివాదాస్పదం = వివాద + ఆస్పదం = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
4. ముద్రణాలయం = ముద్రణ + ఆలయం = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
5. అపార్థాలు = అప + అర్థాలు = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
6. వారోత్సవాలు = వార + ఉత్సవాలు = (అ + ఉ = ఓ) – గుణసంధి
7. దినోత్సవం = దిన + ఉత్సవం = (అ + ఉ = ఓ) – గుణసంధి
8. సాహిత్యపు విలువ = సాహిత్యము + విలువ – పుంప్వాదేశ సంధి

(ఇ) కింది సమాసాలకు అర్థం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాస నామం
1. ముద్రణ సౌకర్యం ముద్రణ యొక్క సౌకర్యం షష్ఠీ తత్పురుష సమాసం
2. ముద్రణాలయం ముద్రణకు ఆలయం షష్ఠీ తత్పురుష సమాసం
3. భావప్రకటన భావము యొక్క ప్రకటన షష్ఠీ తత్పురుష సమాసం
4. దేశ భవిష్యత్తు దేశము యొక్క భవిష్యత్తు షష్ఠీ తత్పురుష సమాసం
5. బాలల భవిష్యత్తు బాలల యొక్క భవిష్యత్తు షష్ఠీ తత్పురుష సమాసం
6. చట్ట విరుద్ధం చట్టమునకు విరుద్ధం షష్ఠీ తత్పురుష సమాసం
7. గుడ్డ ఉత్తరాలు గుడ్డతో ఉత్తరాలు తృతీయ తత్పురుష సమాసం
8. విషయాసక్తి విషయము నందు ఆసక్తి సప్తమీ తత్పురుష సమాసం
9. చిత్తశుద్ధి చిత్తము నందు శుద్ధి సప్తమీ తత్పురుష సమాసం
10. అచ్చుతప్పులు అచ్చు నందలి తప్పులు సప్తమీ తత్పురుష సమాసం
11. వార్తా పత్రిక వార్తల కొఱకు పత్రిక చతుర్థి తత్పురుష సమాసం
12. బాలల హక్కులు బాలల యొక్క హక్కులు షష్ఠీ తత్పురుష సమాసం
13. అమానుషము మానుషము కానిది నఇ! తత్పురుష సమాసం
14. అనాగరికము నాగరికము కానిది నxణ్ తత్పురుష సమాసం
15. రెండు పేజీలు రెండు (2) సంఖ్య గల పేజీలు ద్విగు సమాసం
16. ప్రాచీన మఠాలు ప్రాచీనమైన మఠాలు విశేషణ పూర్వపద కర్మధారయం
17. భారతదేశము భారతము” అనే పేరుగల దేశం సంభావనా పూర్వపద కర్మధారయం

(ఈ) కింది ఖాళీలలో సరైన విభక్తులు రాయండి.

1. వీడు వాడి ……………. 1 ……………. కలిసి బడి ………….. 2 ……………. వెళ్ళాడు.
2. ఈ టీవీ ………………. 3 ……………. మద్రాసు ……………….. 4 ……………. తెచ్చాను.
3. పాప పొద్దున్నే బడి …………………… 5 ……………… వెళ్ళింది.
4. పిల్లవాడు ఆకలి ……………………. 6 ………………. ఉన్నాడు.
జవాబులు:
1) తో
2)కి
3) ని
4) నుండి
5) కి
6) తో

కొత్త పదాలు-అర్థాలు

అనువు = అనుకూలము
అసంఖ్యాకం = లెక్కలేనన్ని
అపార్థాలు = అపోహలు
ఆస్కారము = ఆధారము
అనుగుణం = తగినది
అమానుషం = మనుష్య శక్తికి మించినది (క్రూరమైనది)
అనాగరికం = నాగరికము కానిది
ఉపకరణాలు = పనిముట్లు
కరపత్రం = ప్రకటన పత్రం
గరిగ = చిన్నపాత్ర
జన సమ్మర్దము = జనుల రాయిడి
నిఘంటువు = అర్థములు తెలిపే గ్రంథం (Dictionary)
నిర్వచనం = అర్థమును వివరించి చెప్పుట
చిత్తశుద్ధి = మనశ్శుద్ధి
దృక్పథం = దృష్టిమార్గం
పర్యవసానము = సమాప్తి, చివరకు జరిగేది
ప్రతిబింబించేవి = ప్రతిఫలించేవి
నిశితంగా = తీక్షణముగా
పరిణామదశ = పర్యవసాన దశ (క్రమంగా వచ్చిన మార్పు)
వ్యక్తీకరణ = వెల్లడి

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

వ్యక్తిగతం = ఆ వ్యక్తికి సంబంధించినది
జన సమ్మర్దం = జనం గుంపు
కూడళ్ళు = రోడ్లు కలసిన స్థలాలు
సమాజం = సంఘము
శిలాశాసనం = రాతిపై చెక్కిన శాసనం
సమకాలీనం = ఒకే కాలమునకు చెందినది
వాస్తవ దృక్పథము = సత్య దృష్టి
ముద్రణాలయం = అచ్చుయంత్రం (Printing press)
సందిగ్ధం = సందేహం
సంక్షేమ పథకాలు = చక్కగా క్షేమం కలిగించే పనులు (Welfare schemes)
సంకేతం = గుర్తు
వాస్తవం = నిజం
వారోత్సవం = ఒక వారంపాటు చేసే ఉత్సవం
రూపుదిద్దుకున్నాయి = రూపం ధరించాయి (ఏర్పడ్డాయి)

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 13th Lesson ఆలోచనం Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 13th Lesson ఆలోచనం

7th Class Telugu 13th Lesson ఆలోచనం Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మొదటి చిత్రంలోని పిల్లలను చూస్తే మీకు ఏమనిపిస్తూంది?
జవాబు:
మొడటి చిత్రంలోని పిల్లలు అనాథలు, దిక్కులేనివారు, వారికి తల్లిదండ్రులు లేరు, పెద్ద పిల్లవాడు చిన్న పిల్లవాడిని ఊరుకోపెడుతున్నాడు. ఆ పిల్లలు బీదవాళ్ళనీ, ఏ దిక్కులేని వారనీ అనిపిస్తోంది. వారు అనాథ బాలురనిపిస్తూంది.

ప్రశ్న 2.
రెండో చిత్రంలో ఏం జరుగుతోంది? యుద్ధాలు ఎందుకు జరుగుతాయి?
జవాబు:
రెండో చిత్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. రాజ్యాలను పాలించే ప్రభువులు, ప్రక్క దేశాలను ఆక్రమించడానికి యుద్దాలు చేస్తారు. అన్నదమ్ములు బంధువులు సైతం, రాజ్యాల కోసం యుద్ధాలు చేస్తారు. కులమత దురహంకారాలతో రాజులు యుద్ధాలు చేస్తారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

ప్రశ్న 3.
ఇలాంటి బాధలులేని లోకం కోసం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
ప్రపంచంలోని పిల్లలు అందరూ శాంతి, ప్రేమ, సహనం అనే మంచి గుణాలు కలిగి, చెట్టాపట్టాలు వేసుకొని జీవించాలి. విశ్వశాంతి కోసం. మానవులు అందరూ కృషి చేయాలి. నేను కూడా ఆ విశ్వశాంతి యజ్ఞంలో ఓ సమిథగా నిలబడతాను.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాగయుక్తంగా గానం చేయండి.
జవాబు:
గేయాన్ని పాటగా పాడడానికి, మీ గురువుగారి సాయంతో ప్రయత్నం చేయండి.

ప్రశ్న 2.
కవి ఈ గేయం ద్వారా ఎవరిని గురించి చెప్పాడు?
జవాబు:

  1. అసంతృప్తి గలవారిని గూర్చి
  2. భూగోళం పుట్టుక గూర్చి
  3. మానవరూపం పరిణామం గూర్చి
  4. సైనికులను గూర్చి
  5. శ్రమ జీవులను గూర్చి
  6. నవయుగాన్ని గురించి
  7. పేదలను గూర్చి
  8. పసి పాపలను గూర్చి
  9. కులమత యుద్ధ బాధితులను గూర్చి కవి ఈ గేయంలో చెప్పాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

ప్రశ్న 3.
పాఠంలో కవి ఆవేదనను మీ సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:

  1. సముద్రం మధ్యలో ఎంతో బడబాగ్ని దాగి ఉంది.
  2. ఆకాశంలో కనిపించని సూర్యగోళాలు ఎన్నో ఉన్నాయి.
  3. ఎన్నో సూర్యగోళాలు బద్దలయితే, ఈ భూగోళం ఏర్పడింది.
  4. ఎన్నో మార్పులు వస్తే ఈ మానవుడు తయారయ్యాడు.
  5. యుద్ధాల్లో రాజుకోసం ఎందరో సైనికులు మరణించారు.
  6. ఎంతోమంది శ్రమజీవుల రక్తం త్రాగి, ధనవంతులు తయారయ్యారో?
  7. తిండిలేనివారు, అనాథలు ఉండని నవయుగం ఎప్పుడు వస్తుందో కదా !
  8. కరవు కాటకాలు లేని రోజు ఎప్పుడు వస్తుందో కదా !
  9. పేదల శోకంలో కోపం ఎంతో ఉంది.
  10. నిద్రించే పసిపాపల అదృష్టం ఎలా ఉంటుందో కదా !
  11. కులమతాల కొట్లాటలు ఎప్పుడు నశిస్తాయో కదా !
  12. భారతీయులు ఎప్పుడు తమ బలపరాక్రమాలు ప్రదర్శిస్తారో కదా ! అని కవి ఆవేదన పడ్డాడు.

II. చదవడం – రాయడం

ప్రశ్న 1.
గేయాన్ని చదవండి. గేయంలోని కొన్ని పదాలు రెండు చిన్న పదాలతో కలిసి ఏర్పడ్డాయి. అలాంటి పదాలను వెతికి రాయండి.
ఉదా : సముద్రగర్భం , కవి గుండె.
జవాబు:

  1. నల్లని ఆకాశం
  2. సురగోళాలు
  3. మానవ రూపం
  4. నర కంఠాలు
  5. పచ్చినెత్తురు
  6. నవయుగం
  7. నిదుర కనులు
  8. పసిపాపలు
  9. సుడిగుండాలు
  10. బలపరాక్రమం

ప్రశ్న 2.
ఈ గేయం ప్రశ్నలతో ఉన్నది కదా ! వీటిలో, మిమ్మల్ని బాగా ఆలోచించేటట్లు చేసిన ప్రశ్నలు ఏవి? వాటిని రాయండి.
జవాబు:

  1. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో?
  2. కరవంటూ, కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో?
  3. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో?
  4. అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగ మదెంత దూరం?
    అన్న ప్రశ్నలు నన్ను ఆలోచించేటట్లు చేశాయి.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

ప్రశ్న 3.
కింది వాక్యాలు చదవండి. ఈ భావాలు గల గేయపంక్తుల కింద గీత గీయండి.
అ) పైకి చల్లగా, ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల, ఎవరికీ కనిపించని అగ్ని దాగి ఉంటుంది.
జవాబు:
“ఆ చల్లని సముద్రగర్భం, దాచిన బడబానల మెంతో ”?

ఆ) కులమతాల గొడవలకు, వివక్షలకు ఎంతోమంది గొప్పవారు, మంచివారు బలైపోయారు.
జవాబు:
కులమతాల సుడిగుండాలకు, బలియైన పవిత్రులెందరో?”

ఇ) కరవుకాటకాలు లేని మంచికాలం ఎప్పుడు వస్తుందో?
జవాబు:
కరవంటూ, కాటకమంటూ కనుపించని కాలాలెపుడో“!

ఈ) ‘ఆకలితో బాధపడే పేదల దుఃఖంలో ఎంత కోపం ఉంటుందో?
జవాబు:
ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో”?

4. పాఠం ఆధారంగా కింది గేయ పాదాలను పూరించండి.
“భూగోళం ……………………..
……………………………………….

……………………………………….
…………… పరిణామాలెన్నో”
జవాబు:
పద్యం పూరించడం :

“భూగోళం పుట్టుక కోసం
కూలిన సురగోళాలెన్నో?
ఈ మానవ రూపం కోసం
జరిగిన పరిణామాలెన్నో”

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) ఈ గేయానికి మీరైతే ఏ పేరు పెడతారు? రెండు కారణాలు రాయండి.
జవాబు:
“మేధావి అంతరంగం” – అని నేను ఈ కవితకు పేరు పెడతాను. దాశరథి గొప్ప మేధావి. అభ్యుదయకాంక్షి. ఆయన మనోవేదనే ఈ. కవితగా వచ్చింది. కాబట్టి మేధావి ‘అంతరంగ మథనం’ అని కూడా దీనికి పేరు పెట్టవచ్చు. ఈ గేయానికి ఆలోచనం అని, ప్రశ్న అని కూడా పేర్లు పెట్టవచ్చు.

ఆ) కరవు కాటకాల వల్ల వచ్చే నష్టాలేమిటి?
జవాబు:
తినడానికి తిండి ఉండదు. కట్టుకోవడానికి బట్టలు ఉండవు. తిండిలేని వారు రక్తం లేక పాలిపోయి జబ్బుల పాలవుతారు.. ఎండి పీనుగుల్లా మనుషులు తయారవుతారు. ప్రజల ముఖాల్లో సుఖసంతోషాలు ఉండవు. దొంగతనాలు పెరిగిపోతాయి. ప్రజలు ఒకరితో ఒకరు తిండికోసం దెబ్బలాడుకుంటారు. త్రాగడానికి, స్నానం చేయడానికి నీరు దొరకక, పాడిపంటలు ఉండవు.

ఇ) “రాజును గెలిపించడంలో ఒరిగిన నరకంఠాలెన్నో” ఈ వాక్యాన్ని కవి ఎందుకోసం రాశాడు? కవి భావం ఏమిటి?
జవాబు:
తమ తమ రాజులను గెలిపించడానికి, ఆ రాజు వద్ద పనిచేసే సైనికులు ప్రాణాలకు తెగించి, కత్తి యుద్దాలతో, తుపాకీ గుండ్లతో పోరాటం చేస్తారు. అందులో ఎవరో ఒక రాజు గెలుస్తాడు. కాని ఆ రాజును గెలిపించడానికి, ఎందరో అమాయకులైన సైనికుల పీకలు తెగి యుంటాయి. గుండు దెబ్బలకు సైనికుల గుండెలు బద్దలయి ఉంటాయి. రాజు జయిస్తే పండుగలు చేసికొంటారు. కాని దానికోసం చచ్చిన సైనికులను గూర్చి, ఎవరూ పట్టించుకోరు అని కవి బాధపడ్డాడు.

ఈ) పేదల కోపాన్ని కవి లావాతో ఎందుకు పోల్చాడు?
జవాబు:
అగ్నిపర్వతం బద్దలయితే దాంట్లో నుండి ‘లావా’ అనే ద్రవం బయటకు వస్తుంది. అగ్నిపర్వతం లోపల బాగా మంట మండితేనే, ఆ పర్వతం బద్దలయి, లావా బయటకు వస్తుంది – అలాగే పేదవారి కడుపు బాగా మండితేనే, లావాలా వారి కోపం బయటకు ఎగదన్నుతుందని కవి భావం. లావా అగ్నిపర్వతంలో ఎప్పుడూ ఉంటుంది. కాని లోపల వేడి ఎక్కువయితే ఒక్కసారి పేదవాడి కోపంలా అది బయటకు ఎగదన్నుకు వస్తుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) ఈ గేయం ఆధారంగా ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు?
జవాబు:
కవి ఈ గేయం రాసేనాటి పరిస్థితులు ఇవి.

  1. యుద్ధాలు జరుగుతున్నాయి. వాటిలో ఎందరో అమాయకులైన సైనికులు తమ రాజుల కోసం మరణిస్తున్నారు.
  2. ధనవంతులు శ్రామికులను, కార్మికులను దోచుకు తిని, ధనవంతులు అవుతున్నారు.
  3. దేశంలో అనాథలు, తిండిలేనివాళ్ళు, కరవు కాటకాలతో బాధపడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు.
  4. పేదవారు కోపంతో కసిగా ఉన్నారు. పసిపాపల భవిష్యత్తు మంచిగా లేదు.
  5. కవుల మనస్సులు గాయపడ్డాయి. కులమతాల చిచ్చులో మంచివారు నలిగిపోయారు. స్వతంత్రం వచ్చినా భారతీయులు, తమ బల పరాక్రమాలను ప్రదర్శించడం లేదు. వారింకా బానిసత్వంలో ఉన్నట్లే ఉంటున్నారు.

ఆ) “కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో?” అని కవి ఆవేదన చెందాడు కదా ! దీన్ని గురించి వివరించండి.
జవాబు:
మన భారతదేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నాయి. ప్రజలు కులమతాల ప్రాతిపదికగా విడిపోతున్నారు. భారతదేశంలో పుట్టిన వారంతా ఒక్కటే. వారంతా భారతీయులు. అటువంటి ఐక్యత నశించి ఒకరిని ఒకరు ద్వేషించుకొంటూ, కొట్టుకుంటూ జీవిస్తున్నారు. అంటరానితనాన్ని పాటిస్తున్నారు. దీనికి సాయం ఓట్ల కోసం, నాయకులు కులమతాల ద్వేషాగ్నిని మండిస్తున్నారు. కులాలకు, మతాలకు రిజర్వేషన్లు అంటూ అల్లర్లు సాగిస్తున్నారు. సాటి మానవులను కొట్టి చంపుతున్నారు. కులమతాలు నిజానికి కూడు పెట్టవు. మానవులందరిలో ఒకే రక్తం ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ‘మానవత’ అనేదే నిజమైన కులమని అందరూ కలసి మెలసి సుఖంగా ఒకరికొకరు సాయం చేసికొంటూ బ్రతకాలి.

ఇ) కులమతాలు లేని సమాజంలో ప్రజలందరూ ఎలా ఉంటారో ఊహించి రాయండి.
జవాబు:
కులమతాలు లేకపోతే ప్రజలంతా అన్నదమ్ములవలె. కలసిమెలసి ఆనందంగా జీవిస్తారు. ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ధనికులు పేదలకు సాయం చేస్తారు. బంధువుల్లా ప్రజలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. పక్కవాడు తన తోటివాడు అనే ప్రేమభావం వారిలో పొంగిపొర్లుతుంది. అందరూ కలసి పండుగలు చేసుకుంటారు. అందరికీ ఒకే దైవం ఉంటాడు. ప్రజలలో హెచ్చుతగ్గులు భేదభావాలు ఉండవు.. ప్రజలందరూ ఒకే దేవుని బిడ్డలు. అంటే సోదరులు. లోకంలో అన్నదమ్ములు ఎలా ఐక్యతగా ప్రేమభావంతో జీవిస్తారో అలాగే కులమతాలు లేని సమాజంలో ప్రజలు ప్రేమభావంతో, సోదర భావంతో, కలిసిమెలిసి ఆనందంగా, హాయిగా ఉంటారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడ్పడతారు.

IV. పదజాలం

1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు, గేయంలో ఉన్నాయి. వాటిని గుర్తించి ఎదురుగా రాయండి.
ఉదా : భారతదేశంలో దిక్కులేనివారు ఎందరో ఉన్నారు.
జవాబు:
అనాథలు

అ) ఆకలితో అలమటించే వారికోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది.
జవాబు:
అన్నార్తులు

ఆ) సముద్రంలో పుట్టే అగ్ని చాలా ప్రమాదకరమయింది.
జవాబు:
బడబాగ్ని

ఇ) సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు.
జవాబు:
భాస్కరుడు

ఈ) అగ్నిపర్వతం నుంచి వచ్చే వేడి ద్రవం వల్ల చాలా వినాశనం కలుగుతుంది.
జవాబు:
లావా

ఉ) మన పాలపుంతలో ఎన్నో సూర్యగోళాలు ఉన్నాయి.
జవాబు:
సురగోళాలు

ఊ) దెబ్బతగిలితే పిల్లలు ఏడుపు ఆపుకోలేరు.
జవాబు:
శోకం

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

2. కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ప్రకృతి, వికృతి పదాలు ఉన్నాయి. వాటిని పట్టికలో రాయండి.

అ) రాజరాజు రాజమహేంద్రవరాన్ని పాలించేవాడు. ఆ రాయల ఆస్థానకవి నన్నయ.
ఆ) సముద్రంలో అలలు ఉంటాయి. సంద్రాలలో చేపలు ఎగసిపడతాయి.
ఇ) చెట్ల రాపిడిలో అగ్ని పుట్టింది. ఈ అగ్గికి అడవి తగలబడిపోతుంది.
ఈ) అతని రూపం ఎంతో మనోహరం. ఆ రూపురేఖలు కొందరికే ఉంటాయి.
ఉ) ఆకాశం నిండా మేఘాలు అలముకున్నాయి. ఆకసం వర్షించడానికి సిద్ధంగా ఉంది.
ఊ) పోతన భాగవత కబ్బాన్ని రచించాడు. ఆ కావ్యాన్ని దైవానికి అంకితం చేశాడు.
జవాబు:
ఉదా : రాజు (ప్రకృతి) – రాయలు (వికృతి)
ప్రకృతి – వికృతి
రాజు – రాయడు
సముద్రం – సంద్రం
అగ్ని – అగ్గి
రూపం – రూపు
ఆకాశం – ఆకసం
కావ్యం – కబ్బం
గర్భము – కడుపు
కంఠము – గొంతు
అనాథ – అనద
నిద్రా – నిదుర
కుండము – గుండము

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

3. గేయం ఆధారంగా కింది పదాలు వివరించి రాయండి

అ) కానరాని భాస్కరులు అంటే:
కనబడని సూర్యులు అని అర్థం. ఆకాశంలో ఎన్నో సూర్యగ్రహాలు ఉంటాయి. కాని అవి మనకు కంటికి కనబడవు. అలాగే లోకంలో ఉన్న ఎందరో గొప్పవార్ని మనం గుర్తించలేము. వారంతా సూర్యుని వంటివారు.

ఆ) దాగిన బడబానలం అంటే :
అంటే కనబడకుండా ఉన్న సముద్రం నీటిలోని బడబాగ్ని. బడబాగ్ని పైకి మనకు కనబడనట్లే, అసంతృప్తి గల మనుష్యుల గుండెల్లో అగ్ని వంటి కోపం ఎంతో దాగి ఉంటుంది.

ఇ) ఒరిగిన నరకంఠాలంటే :
యుద్ధంలో తెగిపడిన సైనికుల పీకలు. రాజుల కోసం సైనికులు పరస్పరం కంఠాలు ఖండించుకుంటారు.

ఈ) రాయబడని కావ్యాలంటే :
మనస్సులోని బాధను గ్రంథంగా రాయలేకపోవడం. లోకంలోని అసమానతల్నీ, అక్రమాల్నీ చూచి, ఆ బాధను కవితా రూపంలో పెట్టలేకపోవడం.

ఉ) నవయుగం అంటే : మరో ప్రపంచం, కరవు కాటకాలు, అనాథలు, అన్నార్తులు, పీడితులు లేని క్రొత్త ప్రపంచం అని అర్థం.

V. సృజనాత్మకత

ప్రశ్న 1.
“ఆలోచనం” గేయ సారాంశం ఆధారంగా వచన కవిత రాయండి.
జవాబు:
వచన కవిత
“సముద్రంలో దాగి యుంటుంది ‘బడబానలం’
ఆకాశంలో దాగియుంటారు సూర్యసహస్రం
సురగోళాలు విచ్ఛిన్నం భూగోళం ప్రసన్నం
పరిణామ బహుళం నేటి మానవాకారం.
పీకలెన్నో తెగితేనే ఒక రాజు విజయం,
శ్రామికుల రక్తం త్రాగితేనే డబ్బుమయం.
అనాథలు, అన్నార్తులు లేనికాలం రావాలి.

కరవు కాటకాలు అదృశ్యం కావాలి.
అగ్నిపర్వతాల నుండి లావా పొంగుతుంది.
పేదవారి ఆకల్లోంచి శోకం ఉప్పొంగుతుంది.
పసిపాపల భవితవ్యం అది అంతా శూన్యం
గుండె నొచ్చు కవి రాతలు అవి అన్నీ శూన్యం
కులమతాల సుడిగుండంలో చిక్కారు పవిత్రులు
దాస్యంలో చిక్కాయి భారతీయ బలశౌర్యాలు”.

ప్రశ్న 2.
కవి నవయుగాన్ని కోరుకుంటున్నాడు కదా ! మీరు కోరుకునే నవయుగం ఎలా ఉండాలనుకుంటున్నారో ఊహించి రాయండి.
జవాబు:
భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడు, గుడ్డ, నీడ ఉండాలి. ప్రతివ్యక్తికి విద్యా, వైద్య సదుపాయాలుండాలి. ప్రతి పల్లెకు రోడ్డు, జద్యుచ్ఛక్తి ఉండాలి. చదువుకున్న వారందరికీ జీవనభృతి దొరకాలి. ఉద్యోగ సదుపాయాలు పెరగాలి. ధనిక పేద తారతమ్యం, కులమతాల భేదం, అంటరానితనం నశించాలి. రైతులు నవ్వుతూ జీవించగలగాలి. కులవృత్తులకు ప్రోత్సాహం లభించాలి. పల్లెలకు అన్ని సౌకర్యాలు ఉండాలి. నగరాలకు వలసలు తగ్గాలి. ఇదే నేను కోరుకొనే నవయుగం. పసిపాపలు నవ్వుతూ ఆనందంగా రోడ్లపై తిరగాలి.

VI. ప్రశంస

ప్రశ్న 1.
‘ఆలోచనం’ గేయం మీ తంగితిలో ఎవరు బాగా పాడారు ? ఎవరు బాగా అభినయించారు ? వాళ్ళను ప్రశంసిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి:
జవాబు:

ఒంగోలు,
దివి. xxxxxx

మిత్రుడు రవికుమార్‌కు, / స్నేహితురాలు కవితకు,

మిత్రమా ! నీ లేఖ చేరింది. మీ అమ్మానాన్నలు కుశలం అని తలుస్తాను. ఈ మధ్య మా తరగతిలో గేయ పఠనం పోటీలు, అభినయం పోటీలు మా మేష్టారు సుజాత గారు పెట్టారు. గేయ పఠనంలో నా మిత్రుడు ‘రాజా’ మొదటి బహుమతి పొందాడు. నిజంగా వాడు గేయం పాడుతూ ఉంటే, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నట్లు అద్భుతంగా ఉంది.

అలాగే అభినయం పోటీల్లో నా స్నేహితురాలు ‘కమల’ అద్భుతంగా నటించింది. కమల ఎప్పటికైనా సినిమాలలో నటిస్తుందని అనుకుంటున్నాను. ఆ రోజు మా తరగతి పిల్లలంతా రాజా, కమలలకు టీ పార్టీ ఇచ్చాము. మా సుజాత మేష్టారు వాళ్ళిద్దరినీ గొప్పగా మెచ్చుకున్నారు. ఉంటా.

విశేషాలతో లేఖ రాయి.

నీ ప్రియమిత్రుడు / మిత్రురాలు,
రవికృష్ణ / లక్ష్మీకుమారి.

చిరునామా :
K. రవికుమార్,
S/o. బలరామ్ గారు,
మున్సిపల్ స్కూలు,
కడప.

K. కవిత,
D/o. గోపాలకృష్ణ,
మున్సిపల్ స్కూలు,
కడప.

VII. ప్రాజెక్టు పని

1). దాశరథి రచించిన ఇతర రచనలను సేకరించండి.
(లేదా)
2) దాశరథి రచనలు, పొందిన అవార్డులు, బిరుదులతో ఒక పట్టిక తయారు చేయండి.
జవాబు:
దాశరథి కృష్ణమాచార్య రచనలు, అవార్డులు, బిరుదుల పట్టిక

రచనలు అవార్డులు బిరుదులు
1) అగ్నిధార 1) 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి బహుమతి 1) కవిసింహం
2) పునర్నవం 2) 1974లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి 2) అభ్యుదయ కవితా చక్రవర్తి
3) రుద్రవీణ 3) ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ 3) ఆంధ్రప్రదేశ్, ఆస్థాన కవి 1977 నుంచి 1983 వరకు
4) అమృతాభిషేకం 4) వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘డి.లిట్’ 4) ఆంధ్ర కవితా సారథి
5) మహాంద్రోదయం
6) ఆలోచనాలోచనలు
7) గాలిబ్ గీతాలు
8) కవితా పుష్పకం
9) తిమిరంతో సమరం
10) వేయి సినిమాపాటలు
11) నేత్ర పర్వం

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది వాక్యాలను చదివి, గీత గీసిన పదాలను ఉదాహరణలలో చూపినట్లు విడదీయండి.

అ) చిట్టెలుక చెట్టు రంధ్రంలోకి దూరింది.
ఉదా : కుట్టుసురు – కులు + ఉసురు
చిట్టెలుక = చిఱు + ఎలుక

ఆ) కట్టెదుటి అన్యాయాలను ఎదిరిద్దాం.
ఉదా : కట్టెదురు = కడు + ఎదురు

ఇ) నట్టిల్లు బాగుంది.
నట్టిల్లు = నడు + – ఇల్లు

ఈ) నిట్టూర్పులతో కాలయాపన చేయవద్దు.
నిట్టూర్పు : నిడు + ఊర్పు

పైన పేర్కొన్న పదాలు, రెండు విధాలుగా కనబడుతున్నాయి. వాటిలోని పూర్వ, పర స్వరాలను కలిపితే ఎలా. మారుతున్నాయో చూడండి.
1. ఱు + ఉ = ట్టు
2. ఱు + ఎ = ట్టె
3. డు + ఊ = ట్టూ
4. డు + ఎ = ట్టె
5. డు + ఇ = ట్టి

గమనిక : అంటే, పూర్వపదం చివర ఉన్న ఐ, డ లకు, అచ్చు పరమైతే ‘మీ’ అంటే, ద్విరుక్త’ట’కారం వస్తున్నది. ‘ కాబట్టి దీన్ని ‘ద్విరుక్తటకార సంధి’ అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

2) కింది పదాలను విడదీసి సంధిని గుర్తించండి.
చిట్టడవి = చిఱు + అడవి = ద్విరుక్తటకార సంధి
నట్టేట = నడు + ఏట = ద్విరుక్తటకార సంధి

3) కింది పదాలను ఉదాహరణలో చూపినట్లు విడదీయండి.
ఉదా : నట్టనడుమ =నడుమ + నడుమ

1. కట్టకడ = కడ + కడ
2. ఎట్టెదురు = ఎదురు + ఎదురు
3. తుట్టతుద = తుద + తుద
4. చిట్టచివర = చివర + చివర

గమనిక : ఇవి ద్విరుక్త టకార సంధికి సరిపోతాయా? సరిపోవు కదూ ! ఇవన్నీ ఆమ్రేడిత సంధికి ఉదాహరణలే. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను పై తరగతుల్లో తెలుసుకుందాం.

1) కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.

1. బడబానలము = బడబా + అనలము = (ఆ + అ + ఆ) – సవర్ణదీర్ఘ సంధి
2. అన్నార్తులు = అన్న + ఆర్తులు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
3. భరతావని = భరత + అవని = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
4. అదేంత = అది + ఎంత = (ఇ + ఎ = ఎ) – ఇకార సంధి
5. భానువులెందరో = భానువులు ఎందరో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
6. సురగోళాలెన్నో = సురగోళాలు + ఎన్నో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
7. పరిణామాలెన్నో = పరిణామాలు + ఎన్నో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
8. నాటకమంతా = నాటకము + అంతా = (ఉ + అ = అ) – ఉత్వ సంధి
9. కరవంటూ = కరవు + అంటూ = (ఉ +అ = అ) – ఉత్వ సంధి
10. ఇంకెన్నాళ్ళో = ఇంక + ఎన్నాళ్ళో = (అ + ఏ = ఎ) – అత్వ సంధి
11. కావ్యాలెన్నో = కావ్యాలు + ఎన్నో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
12. అనాథలుండని = అనాథలు + ఉండని (ఉ + ఉ = ఉ) = ఉత్వ సంధి
13. ధనవంతులెందరో = ధనవంతులు + ఎందరో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

2) కింది సమాసాలకు విగ్రహవాక్యం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. సముద్రగర్భం సముద్రము యొక్క గర్భం షష్ఠీ తత్పురుష సమాసం
2. నరకంఠాలు నరుల యొక్క కంఠాలు షష్ఠీ తత్పురుష సమాసం
3. నవయుగం కొత్తదైన యుగం విశేషణ పూర్వపద కర్మధారయం
4. కులమతములు కులమూ, మతమూ ద్వంద్వ సమాసం
5. కవి గుండెలు కవి యొక్క గుండెలు షష్ఠీ తత్పురుష సమాసం

కవి పరిచయం

పాఠం పేరు : ఆలోచనం

కవి : దాశరథి కృష్ణమాచార్యులు

పాఠం దేని నుండి గ్రహింపబడింది : ఈ పాఠ్యభాగం ‘ఆలోచనం’ – దాశరథి రచించిన ‘అగ్నిధార’ కవితా సంపుటి నుండి గ్రహింపబడింది.

రచయిత కలం పేరు : ‘దాశరథి’

జన్మస్థలం : చిన్న గూడూరు, వరంగల్ జిల్లా, – 1925 – 1987

రచనలు : అగ్నిధార, పునర్నవం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహాంద్రోదయం, ఆలోచనా ! లోచనాలు, గాలిబ్ గీతాలు.

బిరుదులు : కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి.

సాహిత్య సేవ : సినిమా గీతాలు, నాటికలు, వ్యాసాలు, పీఠికలు రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన ! కవిగా సేవలు అందించారు.

సామాజిక సేవ : వీరు హైదరాబాదు రాష్ట్ర విమోచన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
పురస్కారాలు :
1) దాశరథి గారి ‘కవితా పుష్పకం’ రచనకు, 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి , బహుమతి లభించింది.
2) వీరి ‘తిమిరంతో సమరం’ అన్న కవితా సంపుటికి, 1974లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి వచ్చింది.
3) వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదునూ, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘డి.లిట్’ బిరుదును ఇచ్చాయి.
4) 1977 నుండి 1983 వరకు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా ఉన్నారు.

1. ‘ఆలోచనం’ గేయ రచయిత దాశరథిని గూర్చి రాయండి.
జవాబు:
దాశరథి కృష్ణమాచార్యులుగారు అగ్నిధార అనే కవితా సంపుటిని రచించారు. ‘ఆలోచనం’ అనే గేయం అగ్నిధారలోనిది. ఈయన 1925లో వరంగల్ జిల్లా చిన్న గూడూరులో జన్మించారు. ఈయన అగ్నిధార, పునర్నవం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహాంద్రోదయం వంటి కవితా సంపుటాలు, గాలిబ్ గీతాలు రచించారు.

ఈయనకు కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి అనే బిరుదులు ఉన్నాయి. వీరి ‘తిమిరంతో సమరం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి వచ్చింది. వీరి ‘కవితా పుష్పకం’ రచనకు రాష్ట్ర సాహిత్యం అకాడమి బహుమతి లభించింది. వీరు అనేక సినీగేయాలు రచించారు.

గేయాలు – అర్థాలు – భావాలు

1. ఆ చల్లని సముద్రగర్భం
దాచిన బడబానల మెంతో?
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరు లెందరో?
అర్థాలు :
సముద్రగర్భం = సముద్రము లోపల
బడబానలము = ‘బడబా’ అనే అగ్ని
కానరాని = కంటికి కనబడని
భాస్కరులు = సూర్యులు

భావం :
పైకి చల్లగా, ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల, బడబాగ్ని దాగి ఉంటుంది.. అలాగే ఎన్నో అసమానతలు గల ఈ ప్రపంచంలో అసంతృప్తి గలవాళ్ళ గుండెల్లో కూడా, అగ్ని దాగి ఉంటుంది. నల్లని మబ్బులతో నిండిపోయిన ఆకాశంలో కంటికి కనిపించని ఎన్నో సూర్యబింబాలు దాగి ఉంటాయి. అదే విధంగా, ఈ పెద్ద ప్రపంచంలో ప్రతిభ గలవారూ, గొప్పవాళ్ళూ, పైకి కనబడకుండా ఎంతమంది మరుగున పడియున్నారు?

విశేషం :
1) ‘బడబాగ్ని’ :
అనేది సముద్రం లోపల ఉండే అగ్ని. ఇది ఈశ్వరుడిచే పుట్టించబడిన “బడబా” అనే ఆడుగుఱ్ఱము నోటిలో ఉంటుంది. ఇది సముద్ర జలాలను తాగుతూ ఉంటుంది.

2) ఆకాశంలో కానరాని భాస్కరులు :
ఆకాశంలో మొత్తం 12 మంది సూర్యులు ఉంటారు. వారినే ‘ద్వాదశాదిత్యులు’ అంటారు. ఈ 12 మందే కాకుండా, ఇంకా ఎందరో సూర్యులు ఆకాశంలో ఉండి ఉంటారని కవి భావన.

2. భూగోళం పుట్టుకకోసం
కూలిన సురగోళా లెన్నో?
ఈ మానవరూపంకోసం
జరిగిన పరిణామాలెన్నో?
అర్థాలు :
భూగోళము = గోళాకారంలో ఉన్న భూమండలము
సురగోళాలు = సూర్యగోళాలు
పరిణామాలు = మార్పులు

భావం :
ఈ భూమండలం ఏర్పడడం కోసం, ఎన్నో సూర్యగోళాలు కూలిపోయాయి. ఆదిమానవుడి దగ్గర నుంచి, నేటి మనిషి రూపం ఏర్పడే వరకూ, ఎన్నో మార్పులు జరిగాయి.

విశేషం :
నక్షత్ర గ్రహాలు :
మనం ఇప్పుడు నివసించే ‘విశ్వం’ కోటానుకోట్ల విశ్వరూపాల్లో ఒకటి. ఈ విశ్వం 1500 కోట్ల సంవత్సరాలకు పూర్వం, చిన్న ముద్దగా ఉండేది. ఆ ముద్దలో చిన్న గోళీకాయ అంత పదార్థమును, “ఆదియుగపు బ్రహ్మాణువు” అంటారు. ఈ బ్రహ్మాణువులో ఉష్ణోగ్రత 1500 కోట్ల డిగ్రీలకు పెరిగి, అది బద్దలయ్యింది. ఆ పదార్థము నాలుగు వైపులకూ విస్తరించింది. ఈ విస్తరణ మార్పు, దాదాపు 2 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. క్రమంగా ఉష్ణోగ్రత 4000 డిగ్రీలకు తగ్గింది. ఈ పదార్థంలోని మూలకాలు ఒకదానిని. మరొకటి ఆకర్షించుకొని, పెద్ద మేఘాలుగా మారుతాయి. అవి క్రమంగా దగ్గరయి, తిరిగి ఉష్ణోగ్రత పెరిగితే, ఆ మేఘంలో పేలుళ్ళు జరుగుతాయి. అదే ‘నక్షత్రము” అవుతుంది. ఇందులో పదార్థం తక్కువగా ఉన్న మేఘాలు, గ్రహాలు అయి, ఆ నక్షత్రం చుట్టూ తిరుగుతాయి. దీన్ని “బిగ్ బాంగ్ సిద్ధాంతం” అంటారు.

2. నరజాతి పరిణామం :
నాలుగైదు కోట్ల సంవత్సరాల క్రితం ‘మనిషి’ లేడు. ‘మేట్స్’ అనే తులు ఉండేవి. ఈ కోతి జాతి నుండే, నేటి మానవజాతి పుట్టింది. ఈ మార్పు, 20 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. వానర జాతి నుండి నరజాతి పుట్టిందని ‘డార్విన్’ చెప్పాడు. మానవజాతికి చెందిన కోతులను నెపియన్స్’ అంటారు. ఇందులో మానవజాతి “హోమోసెపియన్స్” అనే ఉపజాతికి చెందినది. ఈ జాతి . అవశేషాలు, “క్రోమాన్యాన్ గుహలు” లో దొరికాయి. అందుకే ఈ జాతికి “క్రోమాన్యాన్ మానవులు” అంటారు. వీరే.నేటి నరజాతికి మూలపురుషులు.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

3. ఒక రాజును గెలిపించుటలో
జరిగిన నరకంఠా లెన్నో?
శ్రమజీవుల పచ్చినెత్తురులు
తాగని ధనవంతులెందరో?
అర్థాలు :
ఒరిగిన = తెగిపడిన
నరకంఠాలు = మానవుల కంఠాలు
శ్రమజీవులు = శ్రమపడి జీవించే మానవులు
నెత్తురు = రక్తం

భావం :
ఒక రాజును యుద్ధంలో గెలిపించడానికి, ఎంతమంది సైనికులు మరణించి యుంటారో? శ్రామికుల కష్టాన్ని దోచుకోనటువంటి, ధనవంతులెందరుంటారో? నేటి ధనికులు అందరూ పేదలను పీడించి పైకి వచ్చారని కవి భావన.

4. అన్నార్తులు అనాథ లుండని
ఆ నవయుగ మదెంత దూరమో?
కరువంటూ కాటకమంటూ
కనుపించని కాలాలెపుడో?
అర్థాలు :
అన్నార్తులు (అన్న + ఆర్తులు) = అన్నం కోసం దుఃఖము పొందిన వారు
అనాథలు = దిక్కులేనివారు
నవయుగము = కొత్త యుగము
కాటకము = కరవు

భావం :
తిండి దొరకని వాళ్ళూ, దిక్కులేని వాళ్ళూ, ఉండని కొత్త ప్రపంచం ఎంతదూరంలో ఉందో ? కరవు కాటకాలు లేని సుభిక్షమైన కాలం, ఎప్పుడు వస్తుందో?

5. అణగారిన అగ్నిపర్వతం
కని పెంచిన “లావా” యెంతో ?
ఆకలితో చచ్చే పేదల
శోకంలో కోపం యెంతో ?
అర్థాలు :
అణగారిన = శాంతించిన
లావా = అగ్నిపర్వతం బలయినపుడు దానిలో నుండి వచ్చే ద్రవం
శోకం = దుఃఖం

భావం :
శాంతించిన అగ్నిపర్వతంలో కనపడని లావా ఎంత ఉంటుందో ? ఆకలితో మరణించే పేదవారి మనస్సులో ఎంత కోపమూ, బాధ, దాగి ఉంటాయో?

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

6. పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో ?
గాయపడిన కవిగుండెల్లో
రాయబడని కావ్యాలెన్నో?

అర్థాలు :
పసిపాపలు = చిన్నబిడ్డలు, (శిశువులు)
ముసిరిన = చుట్టుముట్టిన, (వ్యాపించిన)
భవితవ్యం = భాగ్యము (శుభము)
గాయపడిన కవిగుండె = అక్రమాలు, అసమానతలు, అన్యాయాలు, అధర్మ కార్యాలు చూసి బాధపడిన కవి హృదయం

భావం :
హాయిగా నిద్రపోయే పసిపాపల కన్నులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో, మరి అంత ప్రశాంతత, వారి భావి జీవితంలో ఉంటుందా ? ఎన్నో అసమానతలు ఉన్న ఈ లోకాన్ని చూసి, కవుల హృదయాలు ఎంత లోతుగా గాయపడతాయో ! ఆ ఆవేదనలో మునిగి ఎన్ని కావ్యాలను వారు రాయలేకపోయారో !

7. కులమతాల సుడిగుండాలకు
బలియైన పవిత్రులెందరో?
భరతావని బలపరాక్రమం
చెర వీడే దింకెన్నాళ్ళకో?
అర్థాలు :
సుడిగుండాలు = కలతలు
బలియైన = నాశనమైన
భరతావని (భరత + అవని) భారత భూమి
చెరవీడు = నిర్బంధం నుండి బయటపడు

భావం :
ఈ కుల దురహంకార ప్రపంచంలో కులమతాలు అనే సుడిగుండాలలో చిక్కుకొని, బలి అయిపోయిన మంచివారు ఎంతమంది ఉంటారో? భారతదేశంలోని వీరుల శక్తి సామర్థ్యాలు, ఇంకెన్ని
రోజులకు బయట పడతాయో !

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

పదాలు – అర్థాలు

బడబానలము = బడబాగ్ని, (సముద్రంలో ‘పుట్టిన అగ్ని)
భాస్కరులు = సూర్యులు
సురగోళం = సూర్యగోళం
ఆర్తులు = దుఃఖము పొందినవారు
లావా = అగ్నిపర్వతం నుండి వెలువడే ద్రవం
చెరవీడు = నిర్బంధము నుండి బయటపడు
నరకంఠాలు = మానవుల గొంతులు
పరిణామాలు = మార్పులు
నెత్తురు = రక్తం
భవితవ్యం = అదృష్టం

AP Board 7th Class Telugu Solutions Chapter 12 అసామాన్యులు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 12th Lesson అసామాన్యులు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 12th Lesson అసామాన్యులు

7th Class Telugu 12th Lesson అసామాన్యులు Textbook Questions and Answers

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
“ఆదివాసులు మనందరికీ మార్గదర్శకులు” దీన్ని వివరించండి.
జవాబు:
ఆహారం లేకపోతే ఎవరూ బతకరు. ఆహారం గురించి మనకు ఆదివాసులే తెలిపారు. ఆదివాసులు అడవులే అమ్మ ఒడిగా, కొండకోనలే తోడునీడగా జీవిస్తారు. వారు రాత్రింబగళ్ళు ప్రకృతితో కలిసి జీవిస్తూ ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏమి తినాలో, ఏమి తినగూడదో, మనకు ఆదివాసులే చెప్పారు. ఇందుకోసం వారు ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలలో కొందరు ఆదివాసులు ప్రాణాలు కూడా వదిలారు. జంతువుల మాంసం తినేముందు, వారు ఆ జంతువులనూ, వాటి ఆహారం అలవాట్లనూ, పరిశీలించారు. తర్వాతనే ఫలానా జంతువు. మాంసం తినవచ్చునని వారు తేల్చి చెప్పారు.

కోయలు, గోండులు, చెంచులు వంటి గిరిజనులకు ఉన్న ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది. చెట్లను గురించి వారికి తెలిసినంతగా, ఇతరులకు తెలియదు. ఆదివాసులు కూడా, శాస్త్రజ్ఞులే, వారికి రోగాలు వస్తే, చెట్ల మందులతోనే వారు తిరిగి ఆరోగ్యాన్ని పొందుతారు. అందువల్ల ఆదివాసులే గురువులై మనకు మార్గదర్శకులయ్యారు.

ప్రశ్న 2.
కుమ్మరివారి గొప్పతనాన్ని గురించి వివరించండి.
జవాబు:
కుమ్మరి వాని చక్రం నుంచి, బంకమట్టి నుంచి, మనం నిత్యం ఉపయోగించే కుండలు, కూజాలు, అటికెలు, గురుగులు, ప్రమిదలు వస్తున్నాయి. మెత్తటి మట్టి, బూడిద లేదా రంపం పొట్టు, సన్న ఇసుకను కలిపి, బంకమట్టిని తయారుచేస్తారు. వారు కాళ్ళతో తొక్కి, చెమటోడ్చి సిద్ధం చేసిన బంకమట్టిని కుమ్మరిసారెపై పెడతారు.

కుమ్మరి చక్రం తిప్పుతూ, చక్రం మీద పెట్టిన బంకమట్టిని తన చేతివేళ్ళ కొనలతో నేర్పుగా నొక్కుతాడు. ఆశ్చర్యంగా అనుకున్న రూపాలు వస్తాయి. తయారైన మట్టి పాత్రలను ఆరబెడతారు. తర్వాత ‘కుమ్మర ఆము’లో పెట్టి, బురదమట్టితో కప్పుతారు. కొలిమిని మండిస్తారు. వేడి అన్ని పాత్రలకూ సమానంగా అందుతుంది. మట్టి పాత్రలన్నీ కాలి, గట్టిగా తయారవుతాయి. వేసవికాలంలో వీరి కూజాలకు, కుండలకు మహాగిరాకీ. వీరు చేసే ప్రమిదలు భక్తి జీవితంలో ప్రధాన భాగం.

AP Board 7th Class Telugu Solutions Chapter 12 అసామాన్యులు

ప్రశ్న 3.
“వడ్రంగివారు నేటి ఆధునిక ఇంజనీర్లు” – దీన్ని సమర్థిస్తూ పదివాక్యాలు రాయండి.
జవాబు:
వడ్రంగుల పనిలో ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం ఉంది. మనకు వ్యవసాయానికి కావః పిన నాగలి, గుంటక, గొర్రు వంటి పనిముట్లను అన్నింటినీ వడ్రంగులే తయారుచేస్తారు. ఆ పనిముట్ల ఈ రీకి ఏ చెట్టు కలప సరిపోతుందో వారు పరిశీలిస్తారు. చెట్టును చూస్తే సరిపోదు.

చెట్టును కొట్టి, దాన్ని కోసి, చిత్రిక పట్టాలి. తొలి కొట్టాలి. అందులో బిగించాలి. ఇలా వడ్రంగులు ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం చూపించాలి.

వ్యవసాయానికీ, ప్రయాణానికీ ఉపయోగించే బండి సౌకర్యాన్ని వడ్రంగులు సమాజానికి అందించారు. ఇంటి తలుపులు, వాసాలు, కిటికీలు, ఇళ్ళు, వడ్రంగుల పనితనం వల్లే, అందంగా తయారవుతున్నాయి. మనం వాడుకొనే మంచాలు, కుర్చీలు, బెంచీలు, టేబుళ్ళు అలమారలు సైతం వడ్రంగుల చేతుల్లోనే తయారవుతున్నాయి. వడ్రంగులు
“దారు శిల్పులు”. వారు నేటి కాలం “ఇంజినీర్లు”.

ప్రశ్న 4.
“రైతులు మన అన్నదాతలు” – వివరించండి.
జవాబు:
రైతులు మనకు అన్నదాతలు. రైతు దేశానికి వెన్నెముక. అతనికి కోపం వస్తే, మనకు అన్నం దొరకదు. రైతు నడుంవంచి కష్టించి పాడిపంటలు పెంచుతున్నాడు. తాను పస్తులు ఉండి, మన కడుపులు చల్లగా ఉండేటట్లు మనకు రైతు తిండి పెడుతున్నాడు. రైతు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తాడు. తాను ఎండకు ఎండినా, వానకు ‘ తడిసినా, చలికి వణకినా ధైర్యంతో కష్టపడి, రైతు పంటలు పండించి మన పొట్టలు నింపుతున్నాడు.

మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు అనేవి, రైతులు చెమటోడ్చి పనిచేసిన కృషికి ఫలాలు. రైతు రాత్రింబగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని, శ్రమిస్తేనే మనం హాయిగా తింటున్నాము. అందుకే లాల్ బహదూర్ శాస్త్రిగారు “జై జవాన్, జై కిసాన్” – అన్నారు.

కాబట్టి రైతులు మనకు అన్నదాతలు. రైతుల త్యాగం, కృషి అపూర్వమైనవి.

AP Board 7th Class Telugu Solutions Chapter 12 అసామాన్యులు

ప్రశ్న 5.
“దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తులవారు అంత అవసరం” – దీన్ని సమర్థిస్తూ వ్యాసం రాయండి.
(లేదా)
“సమాజ నిర్మాణానికి అన్ని వృత్తుల వాళ్లూ అవసరమే” దీన్ని సమర్థిస్తూ రాయండి.
అన్ని వృత్తుల వారు పరస్పరం సహకరించుకుంటేనే సమాజ గమనం సాగుతుందని అసామాన్యులు పాఠంలో. చదివారు కదా ! మన సమాజంలోని వృత్తులను, వాటి ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
కులవృత్తుల – ప్రాముఖ్యం

మన శరీరంలో కళ్లు, చెవి, ముక్కు, కాళ్ళు, చేతులు వంటి అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలు అన్నీ. సరిగా పనిచేస్తేనే మన శరీరం పనిచేస్తుంది. శరీరానికి ఈ అవయవాలు అన్నీ ముఖ్యమే. సంఘంలో అనేక వృత్తులవారు ఉన్నారు. కుమ్మరి, కంసాలి, కమ్మరి, వడ్రంగి, మంగలి, చర్మకారుడు, సాలె, కురుమలు, రజకుడు వంటి ఎందరో వృత్తి పనివారలు ఉన్నారు.

ప్రతి వృత్తి పవిత్రమైనదే. ఏ వృత్తినీ మనం చిన్న చూపు చూడరాదు. మన ఇంట్లో శుభకార్యం జరగాలంటే, మంగళ వాద్యాలు వాయించేవారు కావాలి. కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు అన్నీ కావాలి. అంటే అన్ని వృత్తులవారు సహకరిస్తేనే ఏ పనులయినా జరుగుతాయి. ఒకరికొకరు తోడ్పడితేనే, సమాజం నడుస్తుంది.

రైతులు పొలం దున్నాలంటే నాగలి కావాలి. దాన్ని వడ్రంగి చెక్కాలి. కమ్మరి దానికి గొర్రు తయారుచేయాలి. రైతుకు. చర్మకారులు చెప్పులు కుట్టాలి. సాలెలు బట్టలు వేయాలి. కంసాలి, వారికి నగలు చేయాలి. కుమ్మరి కుండలు చేయాలి. ఇలా అన్ని వృత్తులవారూ సహకారం అందిస్తేనే, సమాజం సక్రమంగా నడుస్తుంది.

ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. గ్రామ జీవనానికి అవసరమైన వస్తువులను, అన్ని వృత్తులవారు కలిసి మెలిసి తయారుచేసుకొనేవారు. వారు తమ కులాలను మరిచిపోయి, అక్క బావ, మామ, అత్త, అన్న అని పిలుచుకొనేవారు. .. తిరిగి గ్రామాల్లో అటువంటి తియ్యని జీవితం రావాలి. శరీరం నడవడానికి అవయవాలు అన్నీ ఎంత ముఖ్యమో మనిషి జీవనానికి అన్ని వృత్తులవారి శ్రమ కూడా అంత ముఖ్యం అని గుర్తించాలి.

ప్రశ్న 6.
‘ఒకరిమీద ఒకరు ఆధారపడడం’. అనేది మన సంస్కృతిలో చాలా గొప్పది. ఎందుకు? దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
నిత్య జీవితంలో మనిషి ప్రక్కమనిషి మీద ఆధారపడి బతకక తప్పదు. పరస్పరం ఒకరిపై ఒకరు. ఆధారపడటం అనేది మన సంస్కృతిలో గొప్ప విషయం.

ఈ మన ఇంట్లో పెళ్ళి అయితే మంగళవాద్యాలు కావాలి. కుండలు, ప్రమిదలు కావాలి. నగలు కావాలి. వంటల వారు కావాలి. పెండ్లి చేయించేవారు కావాలి. బట్టలు కావాలి. లైటింగ్ ఏర్పాట్లు కావాలి. అలంకరణ చేసేవారు కావాలి. ఈ పనులన్నీ చేసేవారు ఉంటే తప్ప, మన వద్ద డబ్బు ఉన్నా పెళ్ళి జరుగదు. దీనిని బట్టి మనం సంఘంలో ఒకరిపై ఒకరు ఆధారపడి బతుకుతున్నాం అని గ్రహించాలి.

రైతు పంటలు పండించాలి. ఆ పంటలను బజార్లకు తీసుకురావాలి. వాటిని వర్తకులు అమ్మాలి. అప్పుడే మనం వాటిని కొని, అనుభవించగలం. రోగం వస్తే వైద్యులు కావాలి, ఇళ్ళు కట్టడానికి, తాపీ పనివారు, వడ్రంగులు, ఇనుప పనివారు, విద్యుచ్ఛక్తి పనివారు, కుళాయిలు అమర్చేవారు కావాలి. ఇండ్లలో పనిచేసే పనివారు కావాలి.

దీనిని బట్టి మనం ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తున్నాం అనీ, పరస్పరం ఆధారపడటం మన సంస్కృతిలో గొప్ప విషయం అని గ్రహిస్తాము.

కఠిన పదములకు అర్థములు

అసామాన్యమైన = సాటిలేనిదైన
ప్రతిభ = తెలివి
క్షణాలలో = నిమిషాలలో
సారించామా? = ప్రసరింపజేశామా?
కృషి = పరిశ్రమ; ప్రయత్నము
త్యాగాన్ని = దానాన్ని
జీవమ్ములు = ప్రాణులు
జీవకోటి = ప్రాణికోటి
ఆదివాసులు = మొదట నివసించిన వారు
కొండకోనలు = కొండలు, అరణ్యాలు
రేయింబవళ్ళు = రాత్రింబవళ్ళు
ఆహారపుటలవాటు = ఆహారం, అలవాట్లు
అతిశయోక్తి = ఎక్కువగా చెప్పినమాట
జానపదులు = గ్రామీణులు
ప్రాచుర్యం = విస్తారం
సజావుగా = సరియైనరీతిలో
మురిసిపోతాం = ఆనందిస్తాము
గిరాకీ = అలభ్యత (దొరకకపోవడం)
అటికెలు = చిన్నకుండలు
గురుగులు = చిన్న పిడతలు
చకచకా = వేగంగా
సమాజగతిని = సంఘపు నడకను
ఆము = కుమ్మరి కుండలు కాల్చే నిప్పుల గుంట
తతంగము = కార్యక్రమము
కొలిమి = కమ్మరి ఇనుప పనిముట్లు కాల్చే నిప్పుల గుంట
కమ్మలు = చెవుల ఆభరణాలు (దుద్దులు)
ఆపాదమస్తకం = పాదాలనుండి తలవఱకు
సొమ్ములు = నగలు
మూస = బంగారం మున్నగువాటిని కరిగించే పాత్ర
అనారోగ్యము = ఆరోగ్యం చెడిపోవడం
నైపుణ్యం = నేర్పు
పొదగడం = అతకడం
గడ్డపార = గునపము
సెగ = వేడి
కీలకము = ముఖ్యము
గుంటక = విత్తనాలు చల్లడానికి నేలను చదును చేసే సాధనము
కొయ్య = కఱ్ఱ
దారు శిల్పులు = కఱ్ఱపై చెక్కే శిల్పులు
ఆవేదన = పెద్దనొప్పి
ఒడుపుగా = వీలుగా
ఔదార్యాన్ని = దాతృత్వాన్ని
కలిమిన్ కబళించి = సంపదను మ్రింగి
భరతావని = భారతభూమి
వక్కాణించారు = చెప్పారు

ముప్పు ఘటించి పద్యమునకు భావము

భావం :
చెప్పులు కుట్టి జీవించే వారి కులానికి కీడు చేసి, వారి సంపదను దోచుకొని, వారి శరీరాన్ని పిప్పి చేసిన భారతవీరుల యొక్క పాదాలు కందిపోకుండా వారికి చెప్పులు కుట్టి, చెప్పులుకుట్టేవారు జీవనాన్ని సాగిస్తారు. కాదని చెప్పరు. భరతభూమి చెప్పులు కుట్టేవారి సేవకు ఋణ పడింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 12 అసామాన్యులు

కాటికి = శ్మశానమునకు
బొక్కెనలు = చేదలు
క్షురకులు = మంగలులు
భాగస్వామ్యం = వాటా
అవగాహన = తెలిసికోవడం
గాట్లుపడటం = పుండ్లు పడడం
చిట్కాలు = సూక్ష్మరహస్యాలు
శరీరమర్ధనం = శరీరాన్ని పిసకడం; (మాలిష్ చేయడం)
ఆషామాషీ = అశ్రద్ధ
సుదీర్ఘము = మిక్కిలి పొడవైనది
శుభాశుభకార్యక్రమాలు = మంచి చెడుపనులు
ప్రమేయం = సంబంధము
ఆవిష్కరణలు = కొత్త వస్తువులను కనుక్కోడాలు
తల్లడిల్లుతాం = ఆవేదన చెందుతాము
నినాదము = కేక
పస్తులుండి (పస్తులు + ఉండి) = తిండితినకుండా ఉండి
సడలని స్టైర్యం = జారని (తొలగని) ఓర్పు (నిలుకడ)
పునీతుడు = పవిత్రుడు
పరస్పరం = ఒకరికొకరు
సహకరించుకుంటే = సాయం చేసుకుంటే
స్వయం సమృద్ధంగా = తనంతట తాను నిండుగా
చేదోడు వాదోడుగా = పనిలో మాటలో సాయముగా
ఆత్మీయ సంబంధం = తనవారనే సంబంధము
శ్రమైక జీవన సౌందర్యము = శ్రమించడమే ముఖ్యమైన
అందం పాటించడం = ఆచరించడం