AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 11భూదానం.

AP State Syllabus 8th Class Telugu Important Questions 11th Lesson భూదానం

8th Class Telugu 11th Lesson భూదానం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది పరిచిత గద్యాంశాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2018-19)

వినోభాభావే పవనార్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర సాగించారు. అప్పటికి సుమారు 35 వేల ఎకరాల భూమి దాన రూపంలో లభించింది. భారతీయ సంస్కృతి విశేషాలతో విలసిల్లిన ఈ భూ ఖండంలో శాంతియుతంగా సాగిన ఈ ఉద్యమానికి ప్రజల సహకారం పూర్తిగా లభించింది. భారతీయ సంస్కృతి విశేషాలతో విలసిల్లిన ఈ భూ ఖండంలో శాంతియుతంగా సాగిన ఈ ఉద్యమానికి ప్రజలు సహకారం పూర్తిగా లభించింది. దేశంలో మొత్తం 30 కోట్ల ఎకరాల భూమి ఉన్నది. ఆ మొత్తంలో 6వ భాగం ఇమ్మని కోరాను. భారతదేశంలో గల ఒక్కొక్క కుటుంబంలో సగటున ఐదు
మంది చొప్పున ఉన్నారు. ఆ కుటుంబంలో మరొకణ్ణి చేర్చుకోమని చెప్పాను. సామాన్య బీద ప్రజానీకమే ఆరో వ్యక్తి.
ప్రశ్నలు :
1. ఆరో వ్యక్తి అంటే ఎవరు?
జవాబు:
సామాన్య బీద ప్రజానీకం (పేదవాడు)

2. దేశంలో మొత్తం ఎంత భూమి ఉన్నది?
జవాబు:
30 కోట్ల ఎకరాల భూమి

3. వినోభాభావే ఎక్కడ నుండి ఎక్కడికి పాద యాత్ర సాగించారు?
జవాబు:
పవనార్ నుంచి ఢిల్లీ వరకు

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ఒక్కొక్క కుటుంబంలో సగటున ఎంత మంది ఉన్నారు?

ఆ) కింది అపరిచిత గద్యం చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

“జీవావరణం మీద పర్యావరణం మీద మనుష్యులు ఇంత కక్ష కట్టారెందుకో ? ఇలా ఉన్న చెట్లన్నింటినీ నరికేసుకుంటూ పోతే, చివరికి మనిషికి మిగిలేదేమిటి ? అయినా ఇప్పటికే అనుభవిస్తున్నారు కదా ! గ్రీన్ హౌజ్ ఎఫెక్టునీ………. ఆమ్ల దర్పాలనీ. ఆధునిక కాలుష్యకారక సమస్యలన్నింటికీ చెట్లు నరికివేతే కారణమని, ఈ మానవమేధావులే తేల్చి చెబుతారు. మళ్ళీ ఉన్న చెట్లన్నింటినీ నరికి భవనాలూ, నగరాలూ నిర్మిస్తారు. వాళ్ళ అభివృద్ధి ఎటు పోతోందో వాళ్ళకే అర్థం కావడం లేదు.
ప్రశ్నలు :
1. కాలుష్యానికి కారణం ఏమిటి?
జవాబు:
కాలుష్యానికి కారణం చెట్లు నరికివేత.

2. మానవులు చెప్పేదే చేస్తున్నారా?
జవాబు:
లేదు. మనుషులు జీవావరణ, పర్యావరణాలపై కక్ష కట్టారు.

3. మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేస్తోందా?
జవాబు:
మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేయడం లేదు.

4. చెట్లు లేకపోతే ఏమౌతుంది?
జవాబు:
చెట్లు లేకపోతే 1) గ్రీన్ హౌజ్ ఎఫెక్టు 2) ఆమ్ల దర్పాలు కలుగుతాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

2. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావించబడిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రకరకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువులు, గ్రీన్‌హౌస్ వాయువులు ఎక్కువవుతున్నాయి. వీటి వలన తీవ్రమయిన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15 మించి 35 శాతం జంతువులు నశించిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నలు:
1. వాతావరణ కాలుష్యానికి కారణమయిన వాయువేది?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు

2. జంతువులు ఎందుకు నశించిపోతాయి?
జవాబు:
వాతావరణ కాలుష్యం వలన

3. మానవులు ఉపయోగించే వాహనాలలో కాలుష్యం కలిగించనిదేది?
జవాబు:
సైకిలు

4. వాతావరణ కాలుష్య నివారణకు ఏం చేయాలి?
జవాబు:
చెట్లను ఎక్కువగా పెంచాలి

3. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అప్పటికి 200 సంవత్సరాల నుంచి ఆంగ్లేయుల కారణంగాను, అంతకు ముందు ఏడెనిమిది వందల ఏళ్ళ నుంచి తురుష్కుల కారణంగాను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బానిసత్వంలో మగ్గుతున్న భారత జాతి దైన్యస్థితి నుంచి మేల్కొని 1857లో వీరోచితంగా ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని సాగించింది. కానీ ఆ చైతన్యాన్ని సైనికుల తిరుగుబాటు అంటూ తక్కువగా అంచనా వేసి, ఆంగ్ల ప్రభుత్వం అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకుని భారతదేశాన్ని పాలించడం మొదలు పెట్టింది.
ప్రశ్నలు :
1. సుమారు ఏ సంవత్సరములో ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశించారు?
జవాబు:
క్రీ.శ. 1600లో

2. తురుష్కులు భారతదేశాన్ని పాలించడం ఎప్పుడు మొదలుపెట్టారు?
జవాబు:
సుమారు క్రీ.శ 800లు లేక 900 సంవత్సరాల నుండి

3. సైనికుల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
జవాబు:
క్రీ.శ. 1857

4. భారతదేశం ఆంగ్లేయుల పాలనలో పూర్తిగా ఎప్పటి నుంచి వెళ్ళింది?
జవాబు:
1857

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

4. కింది గద్యాన్ని చదివి, దిగువనిచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

“విద్యారణ్యుల వారి ఆశీర్వాదంతో సంగమ వంశరాజులు విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1335లో స్థాపించారు. వీరు కళలను పోషిస్తూ, కవులను ఆదరిస్తూ, ఆశ్రితులకు అగ్రహారాలు ఇస్తూ క్రీ.శ 1485 దాకా పాలించారు. ఈ వంశంలోని కడపటి రాజులు అతి దుర్భలు అవినీతిపరులుగా మారినందువల్ల వీరి కొలువులోనే ఉన్న దండనాయకుడు సాళువ నరసింహరాయలు సామ్రాజ్యాన్ని సంరక్షించడానికి క్రీ.శ. 1485లో అధికారాన్ని హస్తగతం చేసుకొని వజ్ర సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు తాళ్ళపాక అన్నమయ్యగారిని సత్కరించి సంకీర్తనలను ప్రోత్సహించాడు. పిల్లలమట్టి పినవీరయ్యను పోషించి కృతి పుచ్చుకున్నాడు.
ప్రశ్నలు :
1. సంగమరాజులు ఎవరి ప్రోత్సాహంతో ఎప్పుడు, ఏ రాజ్యం స్థాపించారు?
జవాబు:
సంగమరాజులు విద్యారణ్య స్వామి ప్రోత్సాహంతో 1335లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.

2. సాళువ నరసింహరాయలు ఎవరు? ఎప్పుడు అతడు విజయనగర సామ్రాజ్య పాలకుడయ్యాడు?
జవాబు:
సాళువ నరసింహరాయలు సంగమ వంశరాజుల దండనాయకుడు. ఇతడు 1485లో విజయనగర పాలకుడయ్యాడు.

3. పిల్లలమట్టి పినవీరయ్యను పోషించిన ప్రభువు ఎవరు?
జవాబు:
పిల్లలమర్రి పినవీరయ్యను సాళువ నరసింహ రాయలు పోషించాడు.

4. సంకీర్తనాచార్యుడు అన్నమయ్యకు ఏ రాజు ప్రోత్సాహం లభించింది?
జవాబు:
అన్నమయ్యకు సాళువ నరసింహరాయల ప్రోత్సాహం లభించింది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వినోబా పాదయాత్ర చేద్దామని ఎందుకు అనుకున్నారు?
జవాబు:
వినోబాభావే శివరాంపల్లిలో జరుగబోయే సర్వోదయ సమ్మేళనానికి పాదయాత్ర ద్వారా వెళ్ళాలనుకున్నారు. అక్కడికి రైల్లో వెళ్తే ఒక రాత్రి ప్రయాణం చేస్తే సరిపోతుంది. కాని అందమైన ప్రకృతిని, ప్రజలను దగ్గరగా చూడలేం. కాని పాదయాత్ర చేస్తే ఆయా పల్లెల్లోని సహజ పరిస్థితులను, ప్రజలు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ విధంగా ఆలోచించి వినోబాభావే పాదయాత్ర చేయాలని సంకల్పించారు.

ప్రశ్న 2.
రైలు యాత్ర, విమాన యాత్ర కంటే పాదయాత్ర మంచిదని వినోబా భావించారు కదా ! దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
రైలులోగాని, విమానంలోగాని ప్రయాణం చేస్తే ఆ తక్కువ సమయంలో గమ్యస్థానాలను చేరుకోవచ్చు. కాని మార్గమధ్యంలో ఉన్న సుందర ప్రదేశాలను, ప్రజల వేషభాషలను, ఆచారవ్యవహారాలను చక్కగా తెలుసుకొనే అవకాశం ఉండదు. ప్రజలకు సన్నిహితంగా కలసి మాట్లాడే అవకాశం కలుగదు. పాదయాత్ర చేసినట్లైతే ప్రకృతి అందాలను తనివితీరా ప్రజల ఇబ్బందులను తెలుసుకొనవచ్చు. సహాయ సహకారాలను ప్రజలకు అందించవచ్చు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి?
జవాబు:
మాన్యులు దానం చేయాలి. దానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని –

  • స్వార్థభావన తొలగిపోతుంది. విశాలభావన కలుగుతుంది.
  • సమాజంలో సమున్నత గౌరవ మర్యాదలు కలుగుతాయి.
  • అనాథలను, అభాగ్యులను ఆదుకునే అవకాశం కలుగుతుంది.
  • మానవసేవే మాధవసేవ అనే సమున్నత భావన కలుగుతుంది.
  • నా అనే భావన తొలగి ‘మన’ అనే భావం కలుగుతుంది.
  • అవినీతి, ఆశ్రిత పక్షపాతం మొదలైన దుర్గుణాలకు దూరంగా ఉండవచ్చు.
  • అంతులేని పుణ్యాన్ని సంపాదించుకొనే అవకాశం కలుగుతుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

ప్రశ్న 2.
నేటి సమాజానికి దాతృత్వం గల వ్యక్తుల ఆవశ్యకతను తెలుపండి.
జవాబు:
సమాజానికి నేడు విశిష్ట వ్యక్తుల సేవల అవసరం చాలా ఉంది. అన్ని రంగాలలో అవినీతి పేరుకుపోయింది. స్వార్థం పెచ్చుమీరిపోయింది. స్వార్థంతో ప్రగతి శూన్యమయింది. భేదభావాలు రాజ్యమేలుతున్నాయి. అన్యాయాలు, అక్రమాలు పెచ్చుమీరిపోయాయి.

దేశభక్తి, అనన్యమైన మాతృభూమి సేవ చేయగల యువత అవసరం ఉన్నది. నీతి, అవినీతి మధ్య సంఘర్షణ పెరిగిపోయింది. స్వామి వివేకానంద విశాల భారతదేశం కావాలంటే “ఇనుపకండలు, ఉక్కునరాలు కలిగిన యువత కావాలి. కార్మికులు, కర్షకులు, దేశభక్తి కలిగిన ప్రజలు నిర్మాణం కావాలి. త్యాగం, దానం మొదలైన లక్షణాలు గల మనుషులు కావాలి. సమాజానికి అర్పణ చేసే మంచి మనుషులు కావాలి. జాతీయాదర్శాలుగా దానం శోభిల్లాలి. రామరాజ్యం నిర్మాణం కావాలంటే దానగుణం గల (మనుషుల) వ్యక్తుల అవసరం ఎంతో ఉన్నది.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
వినోబా భూదానోద్యమం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

అమలాపురం,
x x x x x x x x

ప్రియమైన మిత్రుడు రవికి,

నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది. మన దేశంలో జన్మించిన మహనీయమూర్తుల్లో వినోబా ప్రముఖులు. ఈయన చేపట్టిన భూదానోద్యమం దేశంలో ఒక సంచలనం కలిగించింది. ఎంతోమంది నిరాశ్రయులకు ఆశ్రయం కలిగింది. ఎంతోమంది భూస్వాములు తమ భూములను ప్రజలకు స్వచ్ఛందంగా అందించారు. ఈ మహనీయుని స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలిచింది. ఈయనను ఆదర్శంగా తీసుకొని మనము కూడా తోటివారికి సహాయం చేద్దాం. దీనిపై నీ అభిప్రాయాన్ని తెలుపుతూ జాబు ఇవ్వగలవు. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
xxxxxxxxxx

చిరునామా:
పి. రవి,
8వ తరగతి,
వివేకానంద ఉన్నత పాఠశాల,
అజిత్ సింగ్ నగర్,
విజయవాడ, కృష్ణాజిల్లా.

ప్రశ్న 2.
దానం ఆవశ్యకతను తెలుపుతూ కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:
దానం చేయి – తోడ్పాటు అందించు
దానం చేయి – పేదరికాన్ని తొలగించు
స్వార్థం మానుకొని తోడ్పాటునందించు
సంపదలను పరహితం కోసం వెచ్చించు
పేదలను ఆదుకోవాలి. మమతను చాటాలి.
మానవత్వాన్ని చాటు – మహనీయునిగా జీవించు.
దానం చేయడంలోనే మాధవత్వం
ధర్మాన్ని ఆచరించండి. అదే మిమ్ములను రక్షిస్తుంది.

8th Class Telugu 11th Lesson భూదానం 1 Mark Bits

1. వారంతా వేగంగా నడవాలనుకున్నారు. (పదాన్ని విడదీయండి) (SA. I – 2018-19)
ఎ) వా + రంతా
బి) వార + 0త
సి) వారం + తొ
డి) వారు + అంత
జవాబు:
డి) వారు + అంత

2. మా గ్రామ రైతులు వ్యవసాయం చేయగా వారి పిల్లలు తమ వ్యవసాయంతో వ్యాపారాలు చేస్తున్నారు. (నానార్థాలు గుర్తించండి) S.A.I – 2017-18)
ఎ) సేద్యం, ప్రయత్నం
బి) ఉద్యోగం, విహారం
సి) వ్యాపారం, వేడుక
డి) నష్టపరచడం, నష్టపోవడం
జవాబు:
ఎ) సేద్యం, ప్రయత్నం

3. అశ్వం వేగంగా పరిగెత్తుతుంది. (అర్థం గుర్తించండి) (S.A. II – 2016-17)
ఎ) సింహం
బి) చిరుత పులి
సి) బట్టె
డి) గుఱ్ఱం
జవాబు:
డి) గుఱ్ఱం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

4. నా పుస్తకాన్ని జాగ్రత్తగా చూసుకో ! (సమాసాన్ని గుర్తించండి) (S.A. II – 2016-17)
ఎ) షష్ఠీ తత్పురుషం
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) ద్వితీయా తత్పురుషం
డి) చతుర్థి తత్పురుషం
జవాబు:
ఎ) షష్ఠీ తత్పురుషం

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

5. యశం పొందాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) యత్నం
బి) కీర్తి
సి) గొప్ప
డి) దారి
జవాబు:
బి) కీర్తి

6. రాష్ట్రం కళలకు ఆటపట్టు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) దాపు
ఓ) గుట్టుగ
సి) హీనం
డి) నిలయం
జవాబు:
డి) నిలయం

7. తార్కాణంగా నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సానుకూలత
బి) ఉదాహరణ
సి) సమన్వయం
డి) సాంద్రత
జవాబు:
బి) ఉదాహరణ

8. ధనాన్ని ఆర్జన చేయాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సముదాయం
బి) విక్రయం
సి) క్రమణం
డి) సంపాదన
జవాబు:
డి) సంపాదన

9. గాంధీ ఘనకార్యం చేశాడు – గీత గీసిన పదానికి అర్ధం గుర్తించండి.
ఎ) గొప్పపని
బి) చిన్నపని
సి) మధ్యపని
డి) అధమ పని
జవాబు:
ఎ) గొప్పపని

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

10. కంటికెదురు అని అర్థాన్ని తెలియజేసే పదం గుర్తించండి.
ఎ) ప్రత్యక్షం
బి) పరోక్షం
సి) అపరోక్షం
డి) అంతర్నిహితం
జవాబు:
ఎ) ప్రత్యక్షం

11. పొలంలో బీజం నాటాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వృక్షం
బి) విత్తనం
సి) చీర
డి) చినుగు
జవాబు:
బి) విత్తనం

12. పండుగకు విరాళం ఇచ్చాను – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ధనం
బి) విత్తం
సి) చందా
డి) ధాన్యం
జవాబు:
సి) చందా

పర్యాయపదాలు :

13. గ్రంథం చదవాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పుస్తకం, పొత్తం
బి) పురుషం, పైరు
సి) కావ్యం, ధ్వని
డి) శబ్దం, ధ్వని
జవాబు:
ఎ) పుస్తకం, పొత్తం

14. తోవ బాగుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఎద, హృదయం
బి) దారి, మార్గం
సి) పథం, ఆలోచన
డి) అంతరంగం, ఆరాధన
జవాబు:
బి) దారి, మార్గం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

15. చదువు అవసరం ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వితరణం, విరాళం
బి) ఆవశ్యకత, అక్కఱ
సి) దాపు, గుట్టు
డి) ధనం, విత్తం
జవాబు:
బి) ఆవశ్యకత, అక్కఱ

16. వ్యవసాయం చేయాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) కృషి, సేద్యం
బి) ప్రయత్నం, పరిశోధన
సి) పరిమితి, దున్ను
డి) కేదారం, కూలంకష
జవాబు:
ఎ) కృషి, సేద్యం

17. నిర్ణయం చేయాలి – గీత గీసిన పదానికి ప్యూయపదాలు గుర్తించాలి.
ఎ) ప్రగతి, పురోగతి
బి) అనునయం, అనుకరణ
సి) నిశ్చయం, సిద్ధాంతం
డి) రాద్దాంతం, పరిశీలన
జవాబు:
సి) నిశ్చయం, సిద్ధాంతం

18. ప్రయోజనం కలిగి ఉండాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పరిశోధన, ప్రగతి
బి) లాభం, ఉపయోగం
సి) సాధన, సాధికారత
డి) అనునయం, పరిశీలన
జవాబు:
బి) లాభం, ఉపయోగం

19. గుహంలో ఉండాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించాలి.
ఎ) అవసరం, ఆవరణ
బి) గేహం, సదనం
సి) సదనం, నిర్ణయం
డి) గుండె, గురుతు
జవాబు:
బి) గేహం, సదనం

ప్రకృతి – వికృతులు

20. రాత్రి పడింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) రాయితిరి
బి) రాతిరి
సి) రాతెరి
డి) రాతిరి
జవాబు:
బి) రాతిరి

21. దమం అనుసరించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) దోమం
బి) ధర్మం
సి) థెమ్మం
డి) దైవం
జవాబు:
బి) ధర్మం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

22. శాసం చదవాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) చట్టం
బి) శాసనం
సి) శాసె
డి) శస్త్రం
జవాబు:
ఎ) చట్టం

23. సంతోషంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సంబరం
బి) సహచరం
సి) వేడుక
డి) సంతసం
జవాబు:
డి) సంతసం

24. పయనం అయ్యారా? – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) ప్రొయాణం
బి) ప్రయాణం
సి) ప్రమోదం
డి) ట్రయాణం
జవాబు:
బి) ప్రయాణం

25. బాస నేర్వాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) బస
బి) భాష
సి) బోస
డి) బైస
జవాబు:
బి) భాష

26. కార్యం పూర్తి కావాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) కఠోరం
బి) కఠినం
సి) కర్ణం
డి) కర్ణం
జవాబు:
సి) కర్ణం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

27. జతనం చేయాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) యత్నము
బి) యాతర
సి) బాతనం
డి) జేతనం
జవాబు:
ఎ) యత్నము

నానార్థాలు:

28. వ్యవసాయం చేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కృషి, ప్రయత్నం
బి) పరిశోధన, కానుక
సి) కరుణ, దయ
డి) వ్యయం, దాపు
జవాబు:
ఎ) కృషి. ప్రయత్నం

29. వర్మం కురిసింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వాన, సంవత్సరం
బి) వాయువు, మబ్బు
సి) వారిధి, జలధి
డి) ప్రగతి, అరుణ
జవాబు:
ఎ) వాన, సంవత్సరం

30. మిత్రుడు వచ్చాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జలధి, వారిధి
బి) సూర్యుడు, స్నేహితుడు
సి) వైరి, విరోధి
డి) పగతుడు, ఆత్నీయుడు
జవాబు:
బి) సూర్యుడు, స్నేహితుడు

31. కరంతో పనిచేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కంది, కంచు
బి) చేయి, తొండము
సి) కర్ణం, నాశిక
డి) శీర్షం, శిరం
జవాబు:
బి) చేయి, తొండము

32. గుణం పెరగాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చాలు, కులం
బి) వర్ణం, వంశం
సి) మార్గం, గోపురం
డి) స్వభావం, అల్లెత్రాడు
జవాబు:
డి) స్వభావం, అల్లెత్రాడు

వ్యాకరణాంశాలు

సంధులు :

33. గుణసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) సూర్యాస్తమయం
బి) సర్వోదయం
సి) మనోహరం
డి) తపోధనుడు
జవాబు:
బి) సర్వోదయం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

34. ఊహాతీతంగా ఉంది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) గుణసంధి
సి) యణాదేశ సంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

35. తేవాలని ఉంది – గీత గీసిన పదాన్ని విడదీయడం గుర్తించండి.
ఎ) తేవాల + అని
బి) తేవాలి + అని
సి) తేవ + అని
డి) తేవాలే + అని
జవాబు:
బి) తేవాలి + అని

36. మరొకటి ఉండాలి – గీత గీసిన పదాన్ని విడదీయడం గుర్తించండి.
ఎ) మర + ఒకటి
బి) మరె + ఒకటి
సి) మంచి + ఒకటి
డి) మరి + ఒకటి
జవాబు:
డి) మరి + ఒకటి

37. కష్టార్జితం ఉత్తమం – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) కష్ట + యార్జితం
బి) కష్టి + ఆర్జితం
సి) కష్ట + ఆర్జితం
డి) కష్ట + ఆర్జితం
జవాబు:
సి) కష్ట + ఆర్జితం

38. ఏ, ఓ, అర్ – అనే వాటిని గుర్తించండి.
ఎ) గుణాలు
బి) వృద్దులు
సి) సరళాలు
డి) స్థిరాలు
జవాబు:
ఎ) గుణాలు

39. వృద్ధి సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) వసుధేక
బి) వసుధైక
సి) వసుధోక
డి) వసుధాక
జవాబు:
బి) వసుధైక

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

40. శంకరాచార్యులు మహాగురువు – గీత గీసిన పదం సంధి?
ఎ) శంకరి + ఆచార్యులు
బి) శంకరా + ఆచార్యులు
సి) శంకరో + ఆచార్యులు
డి) శంకర + ఆచార్యులు
జవాబు:
డి) శంకర + ఆచార్యులు

సమాసాలు :

41. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన సమాసం గుర్తించండి.
ఎ) ద్వంద్వ సమాసం
బి) బహువ్రీహి సమాసం
సి) సప్తమీ తత్పురుష
డి) ద్విగు సమాసం
జవాబు:
డి) ద్విగు సమాసం

42. పల్లె యందలి ప్రజలు దీనికి సమాసపదం గుర్తించండి.
ఎ) ప్రథమా తత్పురుష
బి) సప్తమీ తత్పురుష
సి) తృతీయా తత్పురుష
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
బి) సప్తమీ తత్పురుష

43. వందలాదిగా వచ్చారు – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) గుణసంధి
సి) యణాదేశ సంధి
డి) అత్వసంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

44. కష్టార్జితం – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) కష్టమునకు ఆర్జితం
బి) కష్టమునందు ఆర్జితం
సి) కష్టము కొరకు ఆర్జితం
డి) కష్టము చేత ఆర్జితం
జవాబు:
డి) కష్టము చేత ఆర్జితం

గణ విభజన :

45. న గణానికి గణాలు ఏవి?
ఎ) UUI
బి) III
సి) UUU
డి) IIU
జవాబు:
బి) III

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

46. IUU – ఇది ఏ గణం?
ఎ) య గణం
బి) త గణం
సి) ర గణం
డి) స గణం
జవాబు:
ఎ) య గణం

47. అత్యంత – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UUI
బి) UIU
సి) TUU
డి) IIU
జవాబు:
ఎ) UUI

48. IUI – ఇది ఏ గణము?
ఎ) య గణం
బి) జ గణం
సి) స గణం
డి) న గణం
జవాబు:
బి) జ గణం

వాక్యారకాలు :

49. బాలునిచే పనిచేయబడింది – ఇది ఏ వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) నిశ్చయార్థక వాక్యం
డి) నిర్ణయాత్మక వాక్యం
జవాబు:
ఎ) కర్మణి వాక్యం

50. భూదానం తప్పక చేయాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) భూదానం విధిగా చేయకూడదు
బి) భూదానం తప్పక చేయకూడదు
సి) భూదానం తప్పక చేయలేకపోవచ్చు
డి) భూదానం కొంత చేయాలి
జవాబు:
బి) భూదానం తప్పక చేయకూడదు

51. నేను తప్పక వస్తాను – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధార్థక వాక్యం
బి) నిశ్చయాత్మక వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) ఆత్మార్థక వాక్యం
జవాబు:
బి) నిశ్చయాత్మక వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

52. శత్రర్థకం – అనగా
ఎ) వర్తమాన అసమాపక క్రియ
బి) భూతకాలిక అసమాపక క్రియ
సి) భవిష్యత్కాలక అసమాపక క్రియ
డి) విధ్యర్థక అసమాపక క్రియ
జవాబు:
ఎ) వర్తమాన అసమాపక క్రియ

53. బస్సు వచ్చింది గాని చుట్టాలు రాలేదు – ఇది ఏరకమైన వాక్యం?
ఎ) కరరి వాక్యం
బి) సంయుక వాక్యం
సి) సామాన్య వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
ఎ) కరరి వాక్యం

54. మీరు ఇంటికి వెళ్ళవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) అనుమత్యర్థక వాక్యం
సి) నిర్ణయాత్మక వాక్యం
డి) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
బి) అనుమత్యర్థక వాక్యం

55. మీరు ఎక్కడ ఉన్నారు? – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిశ్చయార్థక వాక్యం
బి) నిర్ణయాత్మక వాక్యం
సి) ప్రశ్నార్థక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
సి) ప్రశ్నార్థక వాక్యం

56. పాలు తెల్లగా ఉంటాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) ఆత్మార్థక వాక్యం
జవాబు:
ఎ) తద్ధర్మార్థక వాక్యం

57. దయతో అనుగ్రహించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) శత్రర్థక వాక్యం
బి) ప్రార్ధనార్ధక వాక్యం
సి) ఆత్మార్థక వాక్యం
డి) చేదర్థక వాక్యం
జవాబు:
బి) ప్రార్ధనార్ధక వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

58. అందరు వెళ్ళాలి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధార్థక వాక్యం
బి) విధ్యర్థక వాక్యం
సి) అప్యర్థక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
బి) విధ్యర్థక వాక్యం

అలంకారాలు :

59. కమలాక్షునర్చించు కరములు కరములు – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) వృత్త్యనుప్రాస
బి) ఉపమ
సి) లాటానుప్రాస
డి) యమకం
జవాబు:
సి) లాటానుప్రాస

60. ఉపమానోపమేయాలకు పోలిక చెప్పడం – ఇది ఏ అలంకారం?
ఎ) ఉపమ
బి) రూపక
సి) అతిశయోక్తి
డి) అర్థాంతరన్యాస
జవాబు:
ఎ) ఉపమ

61. మీకు వంద వందనాలు – ఇది ఏ అలంకారం?
ఎ) అంత్యానుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) యమకం
డి) వృత్త్యనుప్రాస
జవాబు:
బి) ఛేకానుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 11 భూదానం

62. నీ కరుణాకటాక్ష వీక్షణములకు నిరీక్షిస్తున్నాను – ఇది ఏ అలంకారం?
ఎ) వృత్త్యనుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) రూపకం
జవాబు:
ఎ) వృత్త్యనుప్రాస

సొంత వాక్యాలు :

63. పాదయాత్ర : రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తారు.

64. సంస్కృతి : భారతీయ సంస్కృతి సమున్నతమైనది.

65. దర్శనం : భగవంతుని దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.

66. కల్పవృక్షం : ఉపాధ్యాయుడు విద్యార్థులపట్ల కల్పవృక్షం వంటివాడు.

67. ఆకాంక్ష : దేశసేవ చేయాలనే ఆకాంక్ష ఉండాలి.

68. సాక్షాత్కారం : భక్తునికి భగవంతుని దివ్య సాక్షాత్కారం కలిగింది.

69. ప్రత్యేకత : మా అమ్మగారి వంటకాలు దేనికవే ప్రత్యేకతగా ఉంటాయి.

70. ఊహాతీతం : నాకు మొదటి ర్యాంకు వచ్చినపుడు ఊహాతీతమైన ఆనందం కల్గింది.

71. హత్తుకోవడం : మా గురువుల పాఠాలు మా మనస్సులకు బాగా హత్తుకున్నాయి.

72. లోటుపాట్లు : కార్యక్రమంలో లోటుపాట్లు జరగకుండా చూడాలి.

73. నిండు హృదయం : దానం చేసేటప్పుడు నిండు హృదయంతో సంతోషంగా దానం చేయాలి.

74. కష్టార్జితం : కష్టార్జితంతో జీవించడంలో ఆనందం ఉంది.

75. అసాధారణము : దేశంలో అవినీతి అసాధారణంగా పెరిగింది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం.

AP State Syllabus 8th Class Telugu Important Questions 9th Lesson సందేశం

8th Class Telugu 9th Lesson సందేశం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అపరిచిత గద్యం చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

పరశురాముడు దుష్టులైన క్షత్రియులను చంపుటకు పుట్టినవాడు. అతని చేతిలో ఎందరో రాజులు మరణించారు. ఒక్క శ్రీరాముడు మాత్రమే అతనిని ఓడించాడు. అప్పటి నుండి యుద్దాలు మానేసి, మహేంద్రపర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. అటువంటివాడు గంగ కోరిక పై భీష్మునికి యుద్ధవిద్యలు నేర్పాడు. భీష్ముడు పరశురాముని శిష్యుడు కనుక గురువు ఆజ్ఞాపించిన కార్యమును శిరసావహించి తీరతాడని అంబ నమ్మింది. ఏదో విధంగా పరశురాముని అనుగ్రహం సంపాదించి, భీష్ముని సాధించవచ్చని ఊహించింది.
ప్రశ్నలు :
1. గురు, శిష్యులెవరు?
జవాబు:
పరశురాముడు, భీష్ముడు.

2. ఎవరి ఆజ్ఞను శిరసావహించాలి?
జవాబు:
గురువు యొక్క ఆజ్ఞను.

3. రాజులు ఎందుకు మరణించారు?
జవాబు:
దుష్టత్వము వలన.

4. పరశురాముడిని శ్రీరాముడు ఎందుకు ఓడించగలిగాడు?
జవాబు:
శ్రీరామునిలో దుష్టత్వము లేకపోవటం వలన.

2. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ప్రపంచంలో మొట్టమొదట విడుదల చేయబడిన తపాళాబిళ్ళ అతికించే రకం కాదు. అది రెండు అణాల ఖరీదు కలిగిన కాపర్ టికెట్. ఈస్టిండియా కంపెనీ అధికారానికి లోబడిన వందమైళ్ళ లోపు చిరునామాకు దాని ద్వారా ఒక కవరును పంపవచ్చును. ఆ కవరును డాక్ రన్నర్ తీసుకువెడతాడు. ఈ కాపర్ టోకెన్ ప్రప్రథమంగా 1774 మార్చి 31వ తేదీన పాట్నాలో విడుదల చేయబడింది. 1852లో సింధు ప్రావిన్స్ కమిషనర్ సర్ బార్టీల్ ఫైర్ ఆసియాలో మొట్టమొదట తపాలాబిళ్ళను తీసుకువచ్చాడు. అందులో ఈస్టిండియా కంపెనీ ముద్ర ఉండేది. దానిని సింధు లోపల ఉత్తరాలు పంపడానికి ఉపయోగించేవారు. దీనిని సింధ్ డాక్ అనేవారు.
ప్రశ్నలు :
1. డాక్ రన్నర్ అంటే ఎవరు?
జవాబు:
తపాలా బంట్రోతు

2. సింధు ప్రావిన్స్ ఎవరి పరిపాలనలో ఉంది?
జవాబు:
ఈస్టిండియా కంపెనీ.

3. అణా అంటే ఎన్ని పైసలు?
జవాబు:
ఆరు పైసలు.

4. సింధ్ డాక్ అంటే ఏమిటి?
జవాబు:
సింధు ప్రావిన్స్ లోని కాపర్ టికెట్.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

3. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

అక్టోబర్ 16వ తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నాము. నిజానికి ఆహారధాన్యాల కొరత లేకపోయినా ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ప్రజలు తిండి లేక చనిపోవటం దారుణసత్యం. దీనికి కారణాలు అనేకం. అందులో ఆహార పదార్థాలను వృథా చేయటం. మనం ఆహారాన్ని వృథా చేస్తున్నామంటే అది అందవలసిన వారికి అందకుండా అడ్డపడుతున్నామన్నమాట. ఇలా వృథా అవుతున్న ఆహారంలో సగానికి సగం మామూలుగా పిల్లలు తినే కంచాలలోనే వృథా అవుతున్నది. తల్లిదండ్రులే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. పిల్లలు ఇష్టపడే ఆరోగ్యకరమైన, పుష్టికరమైన ఆహారాన్ని వారికి ఇవ్వాలి. వారు దాన్ని వృథా చేయకుండా తినేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత.
ప్రశ్నలు :
1. పిల్లల పట్ల ఎవరు బాధ్యతగా ఉండాలి?
జవాబు:
తల్లిదండ్రులు.

2. ప్రపంచ ఆహారదినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం?
జవాబు:
అక్టోబరు 16వ తేదీ.

3. సరిపడ ఆహారమున్నా కొందరికి ఎందుకు తిండిలేదు?
జవాబు:
కొంతమంది ఆహారాన్ని వృథా చేయడం వలన.

4. మనం వృథా చేసేవాటిలో ఇంకొకటి ఏమిటి?
జవాబు:
నీరు

4. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఈ పురాతనమైన ఏడు ప్రపంచ అద్భుతాలలో ప్రధానమైనవి ఈజిప్టులోని పిరమిడ్లు. మిగిలిన ఆరు అద్భుతాలు కాలగర్భంలో కలిసిపోయాయి. లేదా శిథిలావస్థను చేరుకున్నాయి. విలక్షణమయిన ఆకారంతో భూమ్యాకర్షణ శక్తికి తట్టుకుని నిలబడడం వలన పిరమిడ్లు ఈనాటికీ నిలిచి ఉన్నాయి. పిరమిడ్ ఆకారంలో ఇళ్ళు నిర్మించడానికి ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించలేదు. అయినా కలపతో, గాజుతో చేసిన పిరమిడ్ ప్రతిరూపాలు ఫ్యూరియోలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. భవిష్యత్ లో సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటీ క్విటీస్ ఆఫ్ ఈజిప్ట్ సంస్థ అనుమతి పొందకుండా వీటి రెప్లికాలు తయారుచేయడానికి వీలుకాదు.
ప్రశ్నలు:
1. ప్రపంచంలోని వింతలెన్ని?
జవాబు:
ఏడు

2. కాలగర్భంలో కలిసిపోవడమంటే ఏమిటి?
జవాబు:
నశించిపోవడం.

3. “శిథిలావస్థ” – దీనిలో ఏ సంధి ఉంది?
జవాబు:
సవర్ణదీర్ఘ సంధి

4. ఎవరి అనుమతితో పిరమిడ్ ఆకారం తయారుచేయాలి?
జవాబు:
సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటీక్విటీస్ ఆఫ్ ఈజిప్టు

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

5. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావించిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రకరకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువులు, గ్రీన్‌హౌజ్ వాయువులు ఎక్కువవుతున్నాయి. వీటి వలన తీవ్రమయిన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15 మించి 35 శాతం జంతువులు నశించిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నలు :
1. వాతావరణ కాలుష్యానికి కారణమయిన వాయువేది?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు

2. జంతువులు ఎందుకు నశించిపోతాయి?
జవాబు:
వాతావరణ కాలుష్యం వలన

3. మానవులు ఉపయోగించే వాహనాలలో కాలుష్యం కలిగించనిదేది?
జవాబు:
సైకిలు

4. వాతావరణ కాలుష్య నివారణకు ఏం చేయాలి?
జవాబు:
చెట్లను ఎక్కువగా పెంచాలి.

6. కింది అపరిచిత గద్యం చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (S.A. III – 2016-17)

ప్రతి జీవికి ఆహారం అవసరం. అందుకే “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అన్నారు. అన్నం దొరకని వారికి ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు అన్నం విలువ ఏమిటో తెలుస్తుంది. చాలా మంది అన్నాన్ని వృథాగా పడేస్తుంటారు. అలా పడేసే ముందు వారు అన్నం దొరకక అల్లాడిపోయే పేదవారి గురించి ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది.
ప్రశ్నలు:
1. పూర్వులు అన్నాన్ని దేని స్వరూపంగా భావించారు?
జవాబు:
అన్నం పరబ్రహ్మ స్వరూపం.

2. అన్నం విలువ ఎప్పుడు తెలుస్తుంది?
జవాబు:
ఆకలితో ఉన్నప్పుడు

3. అన్నం వృథాగా పడేసే ముందు ఎవరి గురించి ఆలోచించాలి?
జవాబు:
అన్నం దొరకని పేదవారిని గురించి

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ప్రతి జీవికి అవసరమైనదేది?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సంపాదకీయ వ్యాసం ప్రక్రియను వివరించండి.
జవాబు:
ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో సంపాదకీయ వ్యాసం ముఖ్యమైనది. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యానురూపంగా పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగేరచన సంపాదకీయ వ్యాసం. దీన్ని పత్రికా సంపాదకులు గానీ, ప్రత్యేక వ్యాసకర్తలు గానీ రాస్తూ ఉంటారు. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకునేటట్లు, ఆలోచించేటట్లు చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ వర్తిస్తుంటాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 2.
‘సంస్కరణ’ – పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
సంస్కరణ’ పాఠ్యభాగ రచయిత ‘నండూరి రామమోహనరావు’గారి రచనా విశేషాలు రాయండి. (S.A. II – 2017-18)
జవాబు:
‘సంస్కరణ’ అనే పాఠ్యభాగ రచయిత శ్రీ నండూరి రామమోహనరావుగారు. తెలుగు పాత్రికేయులలో సుప్రసిద్ధులైన నండూరి రామమోహనరావు (1927 – 2011) కృష్ణాజిల్లా విస్సన్నపేటలో జన్మించారు. జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితాజ్యోతి మొదలైన పత్రికల్లో సంపాదకులుగా పనిచేసారు. విశ్వరూపం, నరావతారం, విశ్వదర్శనం వీరి ప్రముఖ రచనలు. నండూరి వారి సంపాదకీయ వ్యాసాలు అయిన “అనుపల్లవి”, ‘చిరంజీవులు”, “నండూరి రామమోహనరావు వ్యాఖ్యావళి” పేరిట సంకలనాలుగా వచ్చాయి. పిల్లలకోసం కొన్ని ఇంగ్లీషు నవలలను తెలుగులో రాశారు. “చిలకచెప్పిన రహస్యం”, “మయూరకన్య” పిల్లల నవలలు, “హరివిల్లు” పేరిట పిల్లలగేయాలు వ్రాశారు.

తెలుగు విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేటు ఇచ్చి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ పాత్రికేయుడు అవార్డుతో సత్కరించింది.

ప్రశ్న 3.
సమాజంలో దురాచారాలపట్ల ప్రజల్లో ఏహ్యభావం కల్పించడం ద్వారా, వాటిని నిర్మూలించవచ్చని నండూరి వారన్నారు కదా ! దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
మద్యం తాగడం, మత్తు పదార్థాలు సేవించడం, పటేలో అర్ధనగ్ననృత్యాలు వంటి దురాచారాల పట్ల వ్యతిరేక ప్రచారం ద్వారా, ఆ దురాచారాల వల్ల నష్టపోయిన వారి కథల ప్రచారం ద్వారా, అప్పటి వారి రూపాల ఫొటోలను వారికి చూపడం ద్వారా, వారికి ఆ దురాచారాల పట్ల ఏహ్యభావం కల్పించాలి.

వరకట్నం తీసికోవడం అంటే, తమ సంతానాన్ని సంతలో పశువుల్లా అమ్మడమే అని, వారికి తెలియజెప్పాలి. కట్నం తీసికొన్న మగవాడు సంతలో అమ్మబడ్డ పశువు అని అతడికి తెలియజెప్పాలి. కట్నం పుచ్చుకున్న వాడిని పెళ్ళాడిన స్త్రీ, పశువును పెళ్ళాడినట్లే అని కన్యలకు చెప్పాలి.

ఈ విధంగా దురాచారాలపట్ల ఏహ్యభావం కల్పిస్తే క్రమంగా ఆ దురాచారం రూపుమాసిపోతుంది అన్నమాట సత్యం. క్లబ్బులో సగం బట్టలతో నాట్యం చేసిన తన ఫొటోను చూసిన ఆడది తిరిగి ఎన్నడూ, ఆ పని చేయదు. ఆ దుస్తుల్లో తన భార్య ఫొటోను చూసిన భర్త ఇంక ఎప్పుడూ భార్యను పట్లకు పంపడు. కాబట్టి నండూరి వారి మాట సమర్థింపదగినది.

ఆ) కింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘సంస్కరణ’ పాఠ్యభాగ సారాంశం రాయండి.
జవాబు:
సమాజంలో ఎన్నో సాంఘిక దురాచారాలు ఉన్నాయి. వాటిలో బాల్యవివాహాలు, వరకట్నం, మద్యపానం మొదలైన వాటిని ప్రముఖంగా చెప్పవచ్చు. బాల్యవివాహాలను నిర్మూలించడానికి శారదా చట్టం వంటిది వచ్చింది. అయినా ఎంతోమంది సంఘసంస్కర్తల ప్రయత్నాల మూలంగా బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయి. ఈనాడు ‘వరకట్నం’ అనే సాంఘిక దురాచారం పెనుభూతంలా మారింది.

ఒకప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి నందినీ శతపథి స్త్రీల అభ్యున్నతికి అవరోధాలుగా విద్యావిహీనత, వరకట్నం అనే ఈ రెండూ ప్రధానమని చెప్పారు. జనాభాలో నూటికి 70 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ప్రజలు కూడా వరకట్న నిర్మూలనకు సిద్ధంగా లేరని తెలుస్తున్నది. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం అనేది సంఘంలో గౌరవానికి చిహ్నంగా మారింది.

ఈనాడు వివాహాలు కూడా ఆర్భాటంగా జరుగుతున్నాయి. వివాహాల్లో వృథా వ్యయం అవుతున్నది. ఈ దురాచారాలకు శాసనాల అవసరం ఉంది. అయినా అంతకంటే ముఖ్యంగా ఈ దురాచారాలపట్ల ప్రజల్లో ఏహ్యభావం కలిగించాలి. యువతీయువకులు కూడా దురాచారాలను ఎదిరించాలి. అప్పుడే దురాచారాల నిర్మూలన జరుగుతుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 2.
సమాజంలో దురాచారాలపట్ల ప్రజల్లో అసహ్యభావం కలిగించడం ద్వారా వాటిని నిర్మూలించవచ్చని నండూరివారు అన్నారు కదా! దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
నండూరి రామమోహనరావు గారు ‘సంస్కరణ’ అనే పాఠ్యభాగాన్ని రచించారు. ఈ పాఠంలో కవి సంఘ సంస్కరణాభిలాషను, దాని ఆవశ్యకతను లోకానికి చాటి చెప్పాడు. ప్రస్తుత సమాజంలో సంఘ దురాచారాల పట్ల ప్రజల్లో ఏహ్యభావం కలిగించడం ద్వారా వాటిని నిర్మూలించవచ్చని తెలియజేశారు. ఈ విషయం అక్షరాల సత్యం.

కేవలం చట్టాలు చేసినంత మాత్రాన సాంఘిక దురాచారాలను నిర్మూలించలేము. వరకట్నం లాంటి దురాచారాల నిర్మూలకు ఎన్నో చట్టాలు వచ్చాయి. అయినా ప్రజల్లో మార్పు రాలేదు. బాల్యవివాహాల నిర్మూలనకు శారదా చట్టం వచ్చింది. అంతమాత్రాన బాల్యవివాహాలు ఆగడం లేదు. సంఘసంస్కర్తలు అలుపెరగని ఎన్నో ఉద్యమాలు చేశారు. అయినా ఆశించినంత ఫలితం రాలేదు. కాని చివరకు ప్రజల్లో ఇప్పుడిప్పుడే మూఢనమ్మకాల మీద, దురాచారాల మీద ఏహ్యభావం కలుగుతుంది. ఇది మరింతగా పెరగాలి. అప్పుడే సంఘ దురాచారాలు పూర్తిగా తొలిగిపోతాయి. ప్రజల జీవితాల్లో చైతన్యం కలుగుతుంది.

ఆధునిక కాలంలో వరకట్నం తీవ్రంగా వేధిస్తున్న ఒక సంఘ దురాచారం. ఎన్నో కాపురాలు దీని మూలంగా కూలిపోతున్నాయి. చట్టాలు ఎన్నో వచ్చాయి. అయినా ప్రజల్లో ఇప్పటికీ మార్పు రాలేదు. ఇప్పటికైనా రావాలి. స్త్రీ విద్యపై కూడా ఇంకా ప్రజల్లో దురభిప్రాయం ఉంది. అది కూడా తొలగిపోవాలి. సమభావన కలగాలి. ప్రజల్లో సాంఘిక దురాచారాల పట్ల ఏహ్యభావం కలిగినప్పుడే సమాజానికి మేలు కలుగుతుంది.

ఇ) క్రింది అంశం గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
‘సంఘ సంస్కర్త’ ను గూర్చి వివరిస్తూ చెల్లికి లేఖ :
జవాబు:

నర్సాపురం,
x x x x x x x x

ప్రియమైన చెల్లెలు సుజాతకు,

ఆశీస్సులు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. నేను ముఖ్యంగా ఈ లేఖలో గొప్ప సంఘ సంస్కర్తయగు కందుకూరి వీరేశలింగం పంతులుగారిని గూర్చి నీకు తెలియజేయ తలచాను.

వీరేశలింగం పంతులుగారు కవిగా సంపాదించిన కీర్తి కంటె సంఘసంస్కర్తగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఆయన బాల్య వివాహాలను నిరసించారు. వితంతు వివాహాలను, స్త్రీ విద్యను ప్రోత్సహించారు. హితకారిణి సమాజాన్ని స్థాపించి దాని ద్వారా అనాథ స్త్రీ ఉద్ధరణకు పాటుపడ్డారు. సంఘంలోని అనేక దురాచారాలను, మూఢాచారాలను ఖండించారు. అందుకే కందుకూ 3 వీరేశలింగం పంతులుగారు తెలుగుజాతి గర్వించతగ్గ గొప్ప సంఘసంస్కర్త అని నా అభిప్రాయం.

ఇట్లు,
మీ సోదరుడు,
x x x x x

చిరునామా :
పి. సుజాత, 8వ తరగతి,
ఎస్. ఆర్. హైస్కూలు,
గూడూరు, నెల్లూరు జిల్లా.

ప్రశ్న 2.
సంఘసంస్కరణ ఆవశ్యకతను, సంఘ దురాచారాలను నిర్మూలించాలని కోరుతూ కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:
అంటరానితనం వద్దు. మానవత్వమే ముద్దు.
మూఢాచారాలను దూరం చేయి. ప్రగతి సాధించు.
కులం కన్న గుణం మిన్న.
కులమతాలు వద్దు. ఆత్మీయతే ముద్దు.
మూఢనమ్మకాలపై అలుపెరగని పోరాటం చేయాలి.
స్త్రీలను గౌరవించు – ఆదర్శంగా జీవించు.
స్త్రీల ప్రగతే – దేశానికి గౌరవం.
బహుజన హితాయ – బహుజన సుఖాయ.

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 3.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంగా మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

కరపత్రం

“ధైర్యే సాహసే లక్ష్మీ”

మహిళామణులారా! ‘పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం, పైపైకి’ అన్న శ్రీశ్రీ మాట మరచిపోకండి. ఈనాడు మనపట్ల సంఘం ఎంతో వివక్షత చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందని తెలిస్తే, తల్లిదండ్రులు విలవిల లాడుతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు.

తండ్రి ఆస్తిలో స్త్రీలకు మగవారితో సమాన వాటాలు ఇవ్వడం లేదు. పేపరు తిరగవేస్తే, స్త్రీల మానభంగాల వార్తలు, టి.వి. పెడితే స్త్రీలకు జరిగిన అన్యాయాలు, అత్తవారింట స్త్రీల కష్టాలు, వరకట్నాల చావులు కనబడతాయి. వినబడతాయి. పసిపిల్లల నుండి పండు ముదుసళ్ళు వరకు అత్యాచారాలకు గురి అవుతున్నారు.

స్త్రీలంతా కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేసే మగవారి చెంపలు పగుల కొట్టాలి. నిర్భయంగా పోలీసు వారికి రిపో , చెయ్యాలి. మీరు పొరపాటున అన్యాయానికి గురి అయితే, సిగ్గుతో చితికిపోవద్దు. ధైర్యంగా నిలవండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి. బాగా చదవండి. ఉద్యోగాలు చేయండి. మనం ఈ దురాచారాల్ని ఖండిద్దాం.

అన్యాయం జరిగిన తోటి స్త్రీలకు, మనం అండగా నిలవాలి. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని, ఆనందించే రోజు రావాలి. అందుకు మనమంతా చేయి చేయి కలిపి పోరాడుదాం. ఝాన్సీ లక్ష్మీబాయిలా, సరోజినీ దేవిలా, దుర్గాబాయమ్మలా తలలెత్తి నిల గాం. ధైర్యమే మనకు శ్రీరామరక్ష.

ఇట్లు,
వనితా సంఘం.

ప్రశ్న 4.
వరకట్న సమస్యపై పదివాక్యాల్లో వ్యాసం రాయండి.
(లేదా)
నేటికీ వరకట్న మరణాల గురించి ప్రసార మాధ్యమాల్లో ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ దురాచారాన్ని గురించి వ్యాసం రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
వరునికిచ్చు కట్నం వరకట్నం. దాని వల్ల సమాజంలో ఏర్పడే సమస్యని వరకట్న సమస్య అంటారు. వరకట్నం కేవలం ఆడపిల్ల తల్లిదండ్రులకే కాదు కుటుంబం మొత్తానికి కూడా అదొక దుర్భర సమస్యగా తయారైంది. అసలు కట్నం అంటే కానుక. పెళ్ళి సందర్భంగా ఇచ్చే కానుక క్రమక్రమంగా కట్నమైంది. పూర్వకాలంలో కన్యాశుల్కం ఉండేది. డబ్బు ఇచ్చి కన్యల్ని కొనుక్కొనేవాళ్ళు. ఆధునిక కాలంలో దాని స్థానంలో వరకట్నం వచ్చింది. ఇప్పుడు పెళ్ళి సమయంలో పెళ్ళికూతురు తల్లిదండ్రులు పెళ్ళికొడుక్కి ఇచ్చే ధనం లేదా సంపదని వరకట్నం అంటున్నారు. కొందరు డబ్బు కట్నంగా ఇస్తే మరికొందరు భూములు ఇస్తారు.

వరకట్నం తీసుకోవడం గానీ, ఇవ్వడం గానీ నేరమని చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని పాటిస్తున్నదెవరు ? చట్టాన్ని కాపాడవలసిన అధికారులే వరకట్నం ఇస్తున్నారు – తీసుకుంటున్నారు. కంచే చేను మేస్తోంది ! వరకట్నం ఇవ్వనని ఎవరైనా శపథం చేస్తే అమ్మాయికి పెళ్ళికాని పరిస్థితి కూడా ఏర్పడుతోంది ! ఆశ్చర్యం ఏమిటంటే అమ్మాయికి కట్నం ఇవ్వలేక నానా బాధలు పడ్డవారే, అబ్బాయి పెళ్ళి దగ్గరికి వచ్చేటప్పటికి కట్నం ఇవ్వాలని పట్టుబడతారు.

వరకట్న నిర్మూలనం సాధ్యమవ్వాలంటే ముందుగా పెద్దలలో మార్పురావాలి. . శాఖాంతర, కులాంతర, ప్రేమ వివాహాలను ప్రోత్సహించాలి. యువతీయువకులు ఆదర్శాలతో ఈ వరకట్నమనే దురాచారాన్ని రూపుమాపాలి. అమ్మాయికి ఇవ్వటం, అబ్బాయికి తీసుకోవటం రెండూ అక్రమమేనన్న ఆలోచన కలగాలి. కట్నం అనేది బానిసవ్యాపారమన్న ప్రచారం సాగాలి. రేడియోలు, టీ.వీ.లు, సాహిత్యం ద్వారా వరకట్న దురాచారం గురించి ప్రజలకి తెలియజెయ్యాలి. వరకట్న నిషేధ చట్టాన్ని ప్రజలు అమలుపరచాలి. అప్పుడే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుంది లేదా ‘తంటా’ అవుతుంది !

ప్రశ్న 5.
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారిని గౌరవించాలని తెలుపుతూ, ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:
స్త్రీలపై అత్యాచారాలను అరికట్టండి’

సోదరులారా!
మీకు ఒక విన్నపం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం . పేపరు తెరిస్తే, టివి పెడితే, ఎక్కడో ఒకచోట మన కన్నతల్లులకు, మనకు పాలిచ్చి పెంచిన స్త్రీమూర్తులకు అవమానం జరిగిందని వార్త చూస్తాం. మనం మానవులం. రాక్షసులం కాదు.

పసిపాపలపై అత్యాచారాలు, వృద్ధ స్త్రీలపై అత్యాచారాలు, తోడి విద్యార్థినులపై, పొరుగున ఉన్న ఇల్లాలిపై అత్యాచారాలు. వెంటనే అత్యాచారాలను అరికట్టండి.

దేవతలవంటి స్త్రీలపై అత్యాచారం చేయడం రాక్షసత్వం. స్త్రీలందరూ నీకు కన్నతల్లుల వంటివారు, అక్కచెల్లెళ్ళ వంటి వారు. స్త్రీలను గౌరవించాలి, పూజించాలి.

నిర్భయ చట్టం వచ్చింది. జాగ్రత్త. స్త్రీలను అగౌరవపరిస్తే నడిరోడ్డుపైననే మిమ్మల్ని కాల్చి చంపుతారు. చట్టం పదును ఎక్కింది.

జాగ్రత్త. స్త్రీమూర్తులను పవిత్రభావంతో చూడండి. వారిని గౌరవించండి. వారికి సాయపడండి. అన్యాయం మీ కంట పడితే ఉగ్రనరసింహునిలా విజృంభించండి.

మీరు తోటి స్త్రీలను గౌరవిస్తే, దుర్గాదేవికి లక్ష కుంకుమపూజ చేసినట్లే. లలితాసహస్రం పారాయణం చేసినట్లే. గుర్తుంచుకోండి. స్త్రీలు భారత భాగ్య కల్పలతలు.

ఇట్లు,
x x x x

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

ప్రశ్న 6.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

లేఖ

రాజమండ్రి,
x x x x x x x x

ప్రియ మిత్రుడు అఖిలేశ్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ లేఖలో తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ రాస్తున్నాను.

స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. వారికి అపచారం చేసేవారు ధ్వంసమైపోతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానం జరుగకుండా చూడాలి. తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
రాజేష్,

చిరునామా :
పి. అఖిలేష్,
8వ తరగతి, యం.వి.ఆర్. హైస్కూలు,
కుప్పం, చిత్తూరు జిల్లా.

8th Class Telugu 10th Lesson సంస్కరణ 1 Mark Bits

1. చైత్రశుద్ధనవమినాడు సీతారాములపరిణయం జరుగును. (పర్యాయపదాలు గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) పుట్టినరోజు, జన్మదినం
బి) సంబరం, సంతోషం
సి) పుంసవనం, సీమంతం
డి) పెళ్లి, కళ్యాణం
జవాబు:
డి) పెళ్లి, కళ్యాణం

2. విద్దె లేని వాడు వింత పశువు (ప్రకృతి గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) విధి
బి) విదియ
సి) విదె
డి) విద్య
జవాబు:
డి) విద్య

3. నిజమే ! నాకీ సంగతి తెలీదు. (సంధిని గుర్తించండి.) (S.A.III – 2016-17)
ఎ) అకారసంధి
బి) ఉకారసంధి
సి) యడాగమసంధి
డి) ఇకార సంధి
బి) విదియ
జవాబు:
బి) ఉకారసంధి

భాషాంశాలు – పదజులం

అర్థాలు:

4. సంఘనిర్మూలన ఆవశ్యకత ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనాదరం
బి) అవసరం
సి) అవకాశం
డి) అనంతం
జవాబు:
బి) అవసరం

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

5. అధర్మాన్ని నిర్మూలన చేయాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ప్రగతి
బి) తిరోగతి
సి) తొలగించడం
డి) ఏవగించడం
జవాబు:
సి) తొలగించడం

6. అభ్యున్నతి సాధించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ప్రగతి
బి) సాధికారత
సి) నేర్పరి
డి) గుర్తించు
జవాబు:
ఎ) ప్రగతి

7. దురాచారం తొలగాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సదాచారం
బి) చెడు ఆచారం
సి) గొప్పదైన
డి) కనబరచు
జవాబు:
బి) చెడు ఆచారం

8. చైతన్యం రావాలి – గీత గీసిన పదానికి అర్థం పదాలు రాయండి.
ఎ) కదలిక
బి) మదలిక
సి) అవరోధం
డి) సాధికారత
జవాబు:
ఎ) కదలిక

9. విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వినోదం
బి) ఆనందం
సి) విషాదం
డి) విచారం
జవాబు:
బి) ఆనందం

10. ప్రగతి ప్రస్ఫుటించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తెల్లారు
బి) అవసరము
సి) కనబరచు
డి) అసహ్యించు
జవాబు:
సి) కనబరచు

11. ఇతరులను అసహ్యించుకోరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పెద్ద భూతం
బి) అక్కడక్కడ
సి) తొలగించు
డి) ఏవగించుకొను
జవాబు:
డి) ఏవగించుకొను

12. ధనం సంపాదించాలి – గీత గీసిన పదానికి అర్థాలు గుర్తించండి.
ఎ) సంపద, సాగరం
బి) విత్తం, ద్రవ్యం
సి) జలధి, హలం
డి) దండనం, దాపరికం
జవాబు:
బి) విత్తం, ద్రవ్యం

పర్యాయపదాలు :

13. స్త్రీ ప్రగతి సాధించాలి – గీత గీసిన పదానికి పర్యాయ గుర్తించండి.
ఎ) మహిళ, జామాత
బి) ద్రవ్యం, పైకం
సి) మహిళ, వనిత
డి) చట్టం, ఉత్తరువు
జవాబు:
సి) మహిళ, వనిత

14. ఇనుడు ప్రకాశించాడు- గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) ప్రభాకరుడు, చందురుడు
బి) జాబిల్లి, అంతరంగం
సి) శాసనం, ధనము
డి) సూర్యుడు, రవి
జవాబు:
డి) సూర్యుడు, రవి

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

15. కార్యం ఘనంగా ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఢంక, దాపు
బి) గొప్ప, శ్రేష్ఠం
సి) ఆనందం, శ్రేష్ఠం
డి) గోప్ప, ఘనసారం
జవాబు:
సి) ఆనందం, శ్రేష్ఠం

16. కృషి చేయాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సేద్యం, సాగరం
బి) ప్రయత్నం, పరిశ్రమ
సి) గొప్ప, దాపరికం
డి) అసహ్యం, వ్యవసాయదారుడు
జవాబు:
బి) ప్రయత్నం, పరిశ్రమ

17. హర్షం పొందాలి – గీత గీసిన పదానికి సమానార్థకాలు గుర్తించండి.
ఎ) హారం, మనోహరం
బి) ఆనందం, సంతోషం
సి) సంతసం, సంతాపం
డి) సాగరం, జలధి
జవాబు:
బి) ఆనందం, సంతోషం

18. శాసనం తిరుగులేనిది-గీత గీసిన పదానికి సమానార్థకాలు గుర్తించండి.
ఎ) ఉత్తరువు, ఉత్తమం
బి) చట్టం, ఉత్తరువు
సి) అవేశం, ఆక్రందన
డి) అనువు, అరమరిక
జవాబు:
బి) చట్టం, ఉత్తరువు

19. స్త్రీ గౌరవనీయురాలు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) ఇంతి
బి) సింది
సి) శీరి
డి) గిరి
జవాబు:
ఎ) ఇంతి

20. దూరం ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) దేరం
బి) దవ్వు
సి) దాపు
డి) దాగరం
జవాబు:
బి) దవ్వు

21. నిక్కం పలకాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) నిజం
బి) నైజం
సి) నాగరం
డి) నైరాశ్యం
జవాబు:
ఎ) నిజం

22. విషయం తెలియాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) వివేకం
బి) విసయం
సి) విసురం
డి) విసెరం
జవాబు:
బి) విసయం

23. గౌరవం చూపాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) గారవం
బి) గార్దభం
సి) శాస్త్రం
డి) గేరవం
జవాబు:
ఎ) గారవం

24. రూపం మనోహరం – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) రూపు
బి) రోపు
సి) రేసు
డి) వైపు
జవాబు:
ఎ) రూపు

25. అందరు నిద్య చదవాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) వద్దె
బి) వెద్దె
సి) వొద్దె
డి) విద్దె
జవాబు:
డి) విద్దె

26. అచ్చెరువు పొందాము – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) ఆశ్చర్యం
బి) అక్కరువు
సి) ఆదరువు
డి) ఆవాసం
జవాబు:
ఎ) ఆశ్చర్యం

27. మంతిరి వచ్చాడు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) మంత్రి
బి) మంతెరి
సి) మబెరి
డి) మంచరి
జవాబు:
ఎ) మంత్రి

28. వివాహం జరిగింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) వేసహం
బి) వియ్యము
సి) వివాహం
డి) విసహం
జవాబు:
బి) వియ్యము

29. కృషి అవసరం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) సేద్యం, ప్రయత్నం
బి) సేద్యం, సాగరం
సి) పరిశ్రమ, పరిశీలన
డి) ప్రగతి, చైతన్యం
జవాబు:
ఎ) సేద్యం, ప్రయత్నం

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

30. జగతిన ప్రజలు వర్ధిల్లాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జాతి, వందనం
బి) సంతానం, జనం
సి) జాగృతి, అభ్యున్నతి
డి) శీలన, శిబిరం
జవాబు:
బి) సంతానం, జనం

31. చైతన్యం వెల్లివిరియాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చిరాకు, విరోగతి
బి) అధోగతి, అభ్యున్నతి
సి) ప్రాణం, తెలివి
డి) తపన, తామరసం
జవాబు:
సి) ప్రాణం, తెలివి

32. కళ్యాణం జరిగింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పరిశీలన, ప్రగతి
బి) పెండ్లి, బంగారం
సి) అక్షతలు, ఆకాశం
డి) అనంతం, అంతరంగం
జవాబు:
బి) పెండ్లి, బంగారం

33. ఘనం కురిసింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ఘనసారం, శబ్దం
బి) గొప్ప, మేఘం
సి) శరీరం, తనువు
డి) పుట్టుట, ప్రగతి
జవాబు:
బి) గొప్ప, మేఘం

34. సత్యం జయించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) నిజం, పూజ్యము
బి) నైజం, గుణం
సి) తపన, తాత్సారం
డి) పూజ్యం, పుణ్యము
జవాబు:
ఎ) నిజం, పూజ్యము

వ్యుత్పత్యర్థాలు :

35. నీటిని ధరించునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) జలధి
బి) కాసారం
సి) క్షీరం
డి) దాస్యం
జవాబు:
ఎ) జలధి

36. సత్పురుషులయందు పుట్టినది – అనే వ్యుత్పత్తి గల ఏది?
ఎ) అసహ్యం
బి) కులం
సి) దుఃఖం
డి) సత్యం
జవాబు:
డి) సత్యం

37. సమస్త ప్రాణులయందు సమభావన కలవాడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
ఎ) మిత్రుడు
బి) వైరి
సి) పగతుడు
డి) కృతజ్ఞుడు
జవాబు:
ఎ) మిత్రుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

38. శాసనం పాటించాలి – గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) అందరికి ఆమోదయోగ్యమైంది
బి) దీని చేత రక్షింపబడును
సి) దాని చేత కొనబడును
డి) అందరి చేత పొందబడును
జవాబు:
బి) దీని చేత రక్షింపబడును

వ్యాకరణాంశాలు

సంధులు :

39. కింది వానిలో బహుళ సంధిని గుర్తించండి.
ఎ) అత్వసంధి
బి) గుణసంధి
సి) వృద్ధి సంధి
డి) విసర్గ సంధి
జవాబు:
ఎ) అత్వసంధి

40. చేసినంత పని – గీత గీసిన పదాన్ని విడదీసి, గుర్తించండి.
ఎ) చేసిన + ఎంత
బి) చేసిన + అంత
సి) చేసినా + యంత
డి) చేసినే + యంత
జవాబు:
బి) చేసిన + అంత

41. కారణమని – ఇది ఏ సంధికి ఉదాహరణయో గుర్తించండి.
ఎ) ఉత్వసంధి
బి) గుణసంధి
సి) యణాదేశ సంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
ఎ) ఉత్వసంధి

42. వ్యతిరేకాభిప్రాయం – ఇది ఏ సంధికి ఉదాహరణ?
ఎ) వృద్ధి సంధి
బి) త్రికసంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) అత్వసంధి పదం
జవాబు:
సి) సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

43. సరిగదా – దీన్ని విడదీసిన పదం గుర్తించండి.
ఎ) సరి + కదా
బి) సరి + గదా
సి) సరి + అదా
డి) సరే + కదా
జవాబు:
ఎ) సరి + కదా

44. క్రింది వానిలో వికల్ప సంధిని గుర్తించండి.
ఎ) అత్వసంధి
బి) గసడదవాదేశ సంధి
సి) ఇత్వసంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి

45. వివాహాలు – దీనిని విడదీస్తే
ఎ) వివాహా + ఆలు
బి) వివాహము + లు
సి) వివ + అహములు
డి) వివాహ + ములు
జవాబు:
బి) వివాహము + లు

46. కింది వానిలో యణాదేశ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) అత్తమ్మ
బి) ఏమిచ్చెను
సి) అభ్యున్నతి
డి) సరాగాలు
జవాబు:
సి) అభ్యున్నతి

సమాసాలు :

47. ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) తత్పురుష
బి) బహుజొహి
సి) అవ్యయీభావం
డి) కర్మధారయం
జవాబు:
ఎ) తత్పురుష

48. విద్యాహీనత – ఈ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) విద్యకు హీనత
బి) విద్యయందు హీనత
సి) విద్యచేత హీనత
డి) విద్య కొరకు హీనత
జవాబు:
డి) విద్య కొరకు హీనత

49. కింది వానిలో తృతీయా తత్పురుషకు ఉదాహరణ
ఎ) శక్తిహీనత
బి) ఆరోగ్య భయం
సి) గురుదక్షిణ
డి) పతిభిక్ష
జవాబు:
ఎ) శక్తిహీనత

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

50. వరుని కొరకు కట్నం-దీన్ని సమాసపదంగా గుర్తించండి.
ఎ) వరకట్నం
బి) పరకట్నం
సి) అనువరకటనం
డి) ప్రతికట్నం
జవాబు:
ఎ) వరకట్నం

51. విద్యావ్యాప్తి – ఇది ఏ సమాసం?
ఎ) విద్య చేత వ్యాప్తి
బి) విద్య వలన వ్యాప్తి
సి) విద్య యొక్క వ్యాప్తి
డి) విద్యను వ్యాప్తి
జవాబు:
సి) విద్య యొక్క వ్యాప్తి

52. అసత్యం – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) సత్యమే అగుపించునది
బి) సత్యము కానిది
సి) ధర్మము కానిది
డి) సత్యముతో కూడినది
జవాబు:
బి) సత్యము కానిది

53. పూర్వకాలము – ఇది ఏ సమాసం?
ఎ) షష్ఠీ తత్పురుష
బి) పంచమీ తత్పురుష
సి) అవ్యయీభావం
డి) ప్రథమా తత్పురుష
జవాబు:
డి) ప్రథమా తత్పురుష

వాక్యాలు :

54. అంటరానితనం వద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధాక వాక్యం
బి) అష్యర్థక వాక్యం
సి) ముక్తపదగ్రస్తం
డి) నిదర్శనాలంకారం
జవాబు:
ఎ) నిషేధాక వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

55. రమ అల్లరి చేస్తూ ఆడుతున్నది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) భావార్థకం
బి) తుమున్నర్థకం
సి) అప్యర్థకం
డి) శత్రర్థకం
జవాబు:
డి) శత్రర్థకం

56. రామకృష్ణ పరమహంస, వివేకానందులు గురుశిష్యులు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధార్థక వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) అభ్యర్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) సంయుక్త వాక్యం

57. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) నిశ్చయాత్మక వాక్యం
జవాబు:
ఎ) హేత్వర్థక వాక్యం

58. మీరు ఆటలు ఆడవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుమత్యర్థకం
బి) అభ్యర్థకం
సి) హేత్వర్థకం
డి) నిషేధాకం
జవాబు:
ఎ) అనుమత్యర్థకం

59. జగతి వర్ధిల్లాలి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) సంయుక్త
బి) ఆశీర్వచనార్థకం
సి) అప్యర్థకం
డి) హేత్వర్ధకం
జవాబు:
ఎ) సంయుక్త

60. వర్తమానకాల అసమాపక క్రియను గుర్తించండి.
ఎ) శత్రర్థకం
బి) ఆశ్చర్యార్థకం
సి) క్వార్థకం
డి) అప్యర్థకం
జవాబు:
ఎ) శత్రర్థకం

గణవిభజన:

61. IUI – ఇది ఏ గణము?
ఎ) జ గణం
బి) త గణం
సి) మ గణం
డి) స గణం
జవాబు:
ఎ) జ గణం

62. జలజా – ఇది ఏ గణము?
ఎ) భ గణం
బి) స గణం
సి) న గణం
డి) మ గణం
జవాబు:
బి) స గణం

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

63. IIUI – ఇది ఏ గణము?
ఎ) స న
బి) న గ
సి) న ల
డి) స ల
జవాబు:
డి) స ల

అలంకారాలు :

64. అర్థభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉండునట్లుగా ఒక పదం వెంటవెంటనే రావడం
ఎ) లాటానుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) ఉపమ
జవాబు:
ఎ) లాటానుప్రాస

65. కింది వానిలో పొసగని అలంకారం గుర్తించండి. రకమైన వాక్యం?
ఎ) రూపక
బి) యమకం
సి) అతిశయోక్తి
డి) ఉత్ప్రేక్ష
జవాబు:
బి) యమకం

66. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పే అలంకారం ఏది?
ఎ) రూపక
బి) అతిశయోక్తి
సి) ముక్తపదగ్రస్తం
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) రూపక

67. ఉత్ప్రేక్ష – అనగా
ఎ) ఊహ
బి) ఆశ
సి) పల్లవి
డి) పోలిక
జవాబు:
ఎ) ఊహ

AP Board 8th Class Telugu Important Questions Chapter 10 సంస్కరణ

68. మానవా ! నీ ప్రయత్నం మానవా ! – ఇది ఏ అలంకారం?
ఎ) యమకం
బి) ముక్తపదగ్రస్తం
సి) లాటానుప్రాస
డి) ఉపమ
జవాబు:
బి) ముక్తపదగ్రస్తం

సొంతవాక్యాలు :

69. అవరోధాలు : కార్యసాధనలో అవరోధాలు తొలగించుకోవాలి.

70. ఆశ్చర్యం : ఇంద్రజాల ప్రదర్శన నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.

71. నిరాడంబరం : మహాత్ములు ఎంతో నిరాడంబరంగా జీవిస్తారు.

72. ఆవశ్యకత : సంఘసంస్కరణల ఆవశ్యకత ఎంతో ఉంది.

73. దురాచారం : సమాజంలో దురాచారాలను నిర్మూలించాలి.

74. ప్రతిష్ఠ : భారతదేశ సమున్నత ప్రతిష్ఠ విశ్వవ్యాప్తం అయింది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం.

AP State Syllabus 8th Class Telugu Important Questions 9th Lesson సందేశం

8th Class Telugu 9th Lesson సందేశం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది చుక్క గుర్తు గల పద్యాలకు భావాలను రాయండి.

1) చం. పరమ తపోనివేశనము బంగరుపంటలకు న్నివాస మ
బ్బురమగుశాంతిచంద్రికల భూమి ప్రపంచచరిత్రలోన బం
ధురతరకీర్తిగొన్న భరతోర్వర నాజనయిత్రియంచు పా
డర! శిరమెత్తరా! విజయఢంకను గొట్టుమురా! సహోదరా!

భావం :
ఓ సోదరా ! మనదేశం, తపోభూమి. ఇది బంగారు పంటలకు నిలయం. శాంతి వెన్నెలలు కురిసే పుణ్యభూమి. ప్రపంచంలో మనోహరమైన కీర్తిని పొందిన ఈ భరతభూమి, నా తల్లి అని గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతూ, విజయఢంకాను మ్రోగిస్తూ నీ దేశం గురించి కీర్తించు.

2) ఉ. జాతి శిరస్సు నెత్తికొని క్ష్మాతలవీధిని గౌరవాన హుం
దాతన మొప్పగాఁ దిరిగినన్ గలుగున్ గడుకీర్తి భారత
క్ష్మాతలి కట్టి భాగ్యమును గల్గగ శాంతి సముద్ధరింప లే
రా! తరుణమ్మిదే మరలరాదు సుమీ! గతకాల మెన్నడున్

భావం :
భారత జాతి తల ఎత్తుకొని ప్రపంచ వీధిలో సగౌరవంగా, హుందాగా తిరిగినప్పుడే, గొప్ప కీరి కలుగుతుంది. మనదేశానికి అటువంటి సౌభాగ్యం కలిగే విధంగా, శాంతిని పెంపొందించడానికి, ఇదే సరైన సమయము. అందుకు సిద్ధంకండి. ఎందు కంటే, పోయిన కాలం తిరిగి రాదు కదా !

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

3) శా. ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్
ఈ గోదావరి సింధు నర్మదలు నీ యీదేశ సౌభాగ్య ధా
న్యాగారాలకు పట్టుగొమ్మలు నఖండంబైన నీ ధారుణీ
భాగ్యమ్మీ సకల ప్రపంచమునకున్ స్వామిత్వముం బూనెడిన్

భావం :
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, సింధు నర్మద అనే జీవనదులు, ఈ దేశ సౌభాగ్యమైన ధాన్యాగారాలకు ముఖ్యమైన ఆధారం. అఖండమైన సౌభాగ్య సంపదలు గలిగిన ఈ దేశం, ప్రపంచానికే ఆధిపత్యం వహిస్తుంది.

ఆ) కింది అపరిచిత పద్యాలను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. మొదలు జూచినఁ గడు గొప్ప పిదపఁ గుఱుచ,
యాదిఁ గొంచెము తర్వాత నధిక మగుచుఁ
దనరు, దిన పూర్వ పరభాగ జనితమైన
ఛాయపోలిక గుజన సజ్జనుల మైత్రి
ప్రశ్నలు :
1. కుజనుల మైత్రి ఎటువంటిది?
జవాబు:
కుజనుల మైత్రి ఉదయకాలపు నీడవలె మొదట ఎక్కువగా ఉండి తరువాత తగ్గిపోతూ ఉంటుంది.

2. సజ్జనుల మైత్రి ఎటువంటిది?
జవాబు:
సజ్జనుల మైత్రి సాయంకాలపు నీడవలె మొదట తక్కువగా ఉండి తరువాత పెరుగుతూ ఉంటుంది.

3. కుజన, సజ్జనుల మైత్రిని కవి దేనితో పోల్చి చెప్పాడు?
జవాబు:
కవి కుజనుల మైత్రిని ఉదయకాలపు నీడతోను, సజ్జనుల మైత్రిని సాయంకాలపు నీడతోను పోల్చి చెప్పాడు.

4. ఈ పద్యం వల్ల మనకు ఏం తెలుస్తోంది?
జవాబు:
ఈ పదం వల్ల మనకు సజ్జనుల మైత్రి మంచిదని తెలుస్తోంది.

2. అఘము వలన మరల్చు, హితార్థ కలితుఁ
జేయుఁ గోష్యంబు దాచుఁ, బోషించుగుణము,
విడువ డాపన్ను, లేవడివేళ నిచ్చు,
మిత్రు డీలక్షణమ్ముల మెలగుచుండు

ప్రశ్నలు :
1. మిత్రుడు దేని నుండి మరలిస్తాడు?
జవాబు:
మిత్రుడు పాపం నుండి మరలిస్తాడు.

2. మిత్రుడు ఎట్టివారిని విడిచిపెట్టడు?
జవాబు:
మిత్రుడు ఆపదలో నున్నవారిని విడిచి పెట్టడు.

3. మిత్రుడు పోషించేది ఏది?
జవాబు:
మిత్రుడు సద్గుణాన్ని పోషిస్తాడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘మిత్ర లక్షణం’.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

3. తివిరి యిసుమునఁ దైలంబుఁ దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చుఁ
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
ప్రశ్నలు :
1. ఎవరి మనసు రంజింపచేయలేము?
జవాబు:
మూర్ఖుని మనసు రంజింపచేయలేము.

2. ఇసుక నుండి ఏమి తీయవచ్చును?
జవాబు:
ఇసుక నుండి తైలము తీయవచ్చు.

3. మృగతృష్ణలో ఏమి త్రాగవచ్చు?
జవాబు:
మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “మూర్ఖుని స్వభావం”.

4. కమలములు నీటఁ బాసినఁ
కమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!
ప్రశ్నలు :
1. కమలములు నీటిని విడిచిపెట్టి బయటికి వస్తే ఏం జరుగుతుంది ?
జవాబు:
కమలములు నీటిని విడిచి పెట్టి బయటికి వస్తే సూర్యరశ్మి సోకి వాడిపోతాయి.

2. ఎప్పుడు మిత్రులు శత్రువులౌతారు?
జవాబు:
తమ తమ స్థానాలను విడిచిపెడితే మిత్రులు శత్రువు లౌతారు.

3. తామరలకు మిత్రుడెవరు?
జవాబు:
తామరలకు మిత్రుడు సూర్యుడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘స్థానబలం’.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

5. ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగినదానిని
మఱువ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్
ప్రశ్నలు :
1. ఎవరి చరిత్ర తెలుసుకోవాలి?
జవాబు:
జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి.

2. ధర్మాన్ని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి?
జవాబు:
ధర్మాన్ని సజ్జనుల సమావేశం నుంచి తెలుసుకోవాలి.

3. దేనిని అనుష్ఠించాలి?
జవాబు:
ధర్మాన్ని అనుష్ఠించాలి.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యా నికి శీర్షిక ‘నీతిబోధ’.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘సందేశం’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
దేశం కోసం “సందేశం” ఇచ్చిన పాఠ్య రచయిత గురించి రాయండి. (S.A. II – 2018-19)
జవాబు:
‘సందేశం’ పాఠ్యభాగ : వయిత జ్ఞానానందకవి. ఈయన పూర్తి పేరు సురగాలి తిమోతి జ్ఞానానందకవి. బొబ్బిలి తాలూకా పెద పెంకి గ్రామంలో జన్మించారు. తెలుగు పండితులుగా పని చేశారు. ప్రాథమిక విద్యార్థి దశలోనే ఆశువుగా సీస పద్యాలు చెబుతూ ‘దీనబంధు శతకాన్ని’ రాశారు. ఆమ్రపాలి, పాంచజన్యం, క్రీస్తు శతకం, నాజీవిత గాథ, కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు, పర్జన్యం, గోల్కొండ మొ||లగు వీరి రచనలు. 1975లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డును పొందారు. రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించారు.

ప్రశ్న 2.
భారతమాత గొప్పదనాన్ని వివరించండి.
జవాబు:
మనది విశాలమైన భారతదేశం. ఇది హిమాలయాలకు పుట్టినిల్లు. ఇలాంటి భారతదేశంలో ప్రజలందరూ విశాల దృక్పథంతో మెలగాలి. మన మతాలు, భాషలు వేరైనప్పటికీ మనమంతా భారతీయులం. మన భారతదేశం ఎంతో సుందరమైనది. ఎదుటివారిపై పగ, కోపం విడనాడి ప్రేమ, స్నేహభావాలతో జీవించాలి. బుద్ధుడు, గాంధీ చేసిన బోధనలు మనకు శాంతిని చేకూరుస్తాయి.

ప్రేమ అనే జెండాను చేతపట్టుకొని ఐకమత్యంతో పయనిద్దాం. త్యాగమనే శక్తిని ఆయుధంగా చేసుకొని శత్రువుల నెదిరిద్దాం. కూలీలు, రైతులు, మేధావులు కలిసిమెలిసి పనిచేసినపుడే పల్లెలు, పట్నాలు అభివృద్ధి చెందుతాయి. మనమంతా కలిసి అనారోగ్యం, అవిద్య, అసమానతలను తొలగించటానికి పాటుపడాలి. ప్రజాస్వామ్యం కాపాడుకుంటూ సామ్యవాదం సాధించుకోవాలి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

ప్రశ్న 3.
మనదేశం ఒకప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి మధ్య తేడాను చర్చించండి.
జవాబు:
ఒకప్పుడు మన దేశం స్వతంత్ర రాజుల అధికారంలో ఉండేది. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. కేవలం వర్షాధారంగా పంటలు పండించేవారు. బ్రిటిష్ వారు దేశాన్ని తమ అధికారంలోకి తెచ్చుకున్నప్పుడు, వారు కొన్ని సదుపాయాలు చేశారు. కాని దేశం బానిసత్వం అనుభవించింది. విద్యా, ఆరోగ్య సదుపాయాలు విస్తరించలేదు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశం పంచవర్ష ప్రణాళికల ద్వారా ఎంతో అభివృద్ధి చెందింది. విద్యా, ఆరోగ్య, రవాణా వసతులు పెరిగాయి. దేశంలో పేదరికం తగ్గింది. పల్లెల్లో సహితం విద్యా సదుపాయాలు, రోడ్లు, పాడి పంటలు పెరిగాయి. పరిశ్రమలు పెరిగాయి. రోదసీ విజ్ఞానరంగంలో మనం ప్రపంచంలోనే ఉన్నత స్థితిలో ఉన్నాం.

కానీ దేశంలో నాయకుల్లోనూ, ప్రజల్లోనూ అవినీతి, లంచగొండితనం పెరిగిపోయాయి. మోసాలు, అక్రమాలు, అన్యాయాలు అధికమయ్యాయి. ధరలు చుక్కలనంటుతున్నాయి. దేశసంపద కేవలం కొంతమంది గుప్పెటలో బందీ అయ్యింది. దేశం అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం లేదు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
‘సందేశం’ పాఠం ద్వారా నీవేమి గ్రహించావో తెలుపుము.
జవాబు:
జ్ఞానానంద కవి ‘సందేశం’ అనే పాఠ్యభాగాన్ని రచించాడు. ఈ పాఠ్యభాగం ద్వారా మన భారతదేశము యొక్క గొప్పతనాన్ని, సంస్కృతీ వైభవాన్ని చక్కగా తెలియజేశాడు. ప్రపంచమంతా భారతదేశాన్ని గౌరవిస్తుంది. భారతీయులంతా శాంతిని కోరుతారు. అన్ని మతాలవారు అన్యోన్యంగా ఉంటారు. పరమత సహనాన్ని పాటిస్తారు.

భారతదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కులమత హింసలు లేవు. నానాటికీ పెరిగిపోతున్న దౌర్జన్యాలు తొలగిపోవాలి. లంచగొండితనాన్ని నిర్మూలించాలి. ప్రతినిధులు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి. ఆనాడే భారతదేశ సమైక్యత వర్ధిల్లుతుంది.

మనదేశంలో గంగ, కృష్ణా, గోదావరి వంటి మహానదులు ప్రవహిస్తున్నాయి. దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. మహాత్ముల నీతి మార్గంతో పునీతమైన పుణ్యభూమి మనది. ఈ అహింసా సిద్ధాంతాన్ని అందరూ పాటించాలి. దేశ సమగ్రతకు అందరూ కృషి చేయాలి.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
భారతమాత తన ఆత్మకథను ఎలా చెప్పుకుందో ఊహించి రాయండి.
జవాబు:
నేను భారతమాతను. నేను సిరిసంపదలు, పాడి పంటలు గలదానను. నా నేలపైననే, వేద వేదాంగాలు, రామాయణం వెలిశాయి. వ్యాసాది ఋషులు ఇక్కడే పుట్టారు. నాపై పెద్ద అరణ్యాలు ఏర్పడ్డాయి. ఉపనిషత్తులు నా నేలపైననే పుట్టాయి.

నన్ను పాలించిన రాజుల పరాక్రమ చరిత్రలు, నా ప్రజల బానిసత్వం వల్ల అంతరించాయి. నా ప్రజలు కిన్నెర మీటుతూ రాగాన్ని ఆలపిస్తూ నా భావిభాగ్యాన్ని గూర్చి పాడాలి. నవరసాలతో తేట తెలుగు పదాలతో వీనుల విందుగా కవితలు చెప్పిన కవులు నా నేలపై పుట్టారు. నన్ను కాపాడిన వీరులను గూర్చి గానం చేయాలి. నాపై పాండవేయులు చేసిన యుద్ధాన్ని గూర్చి పాడుకోవాలి. నన్ను పాలించిన కాకతీయుల యుద్ధనైపుణ్యాన్ని కీర్తించాలి. తుంగభద్రా తీరాన నన్ను పాలించిన తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి.

ప్రశ్న 2.
మనదేశంలాగే మనం పుట్టిన ఊరు కన్నతల్లి వంటిది. మీ ఊరిని గురించి పొగుడుతూ ఒక గేయం రాయండి.
జవాబు:
మా ఊరు గురించి గేయం

“సిరులు పొంగిన సీమరాయది
పాడిపంటల భాగ్యసీమది
కన్నతల్లిర “కడియమూ”
“జామతోటలు జాజిపూవులు
వంగతోటలు పండ్ల తరువులు
మల్లెపూవులు మొల్ల తోటలు
నిండియున్నవి దండిగా”
“గలగలలతో కాల్వ జలములు
గాలి కూగే కలమ సస్యము
విందు చేసే ప్రేమ పాటలు
కలసి యుండెడి కడియమూ”
కూరగాయలు కోరినన్నియు
పాడిపంటలు వలసినంతయు
వర్త కమ్మున భాగ్యసంపద
మరపురానిది “మా పురం”.

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

ప్రశ్న 3.
మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
మహాత్మాగాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. కానీ భారత ప్రజలు ఆత్మీయంగా ‘బాపూజీ’ అని పిలిచేవారు. ‘మహాత్మా’ అని గౌరవించేవారు. భారతజాతి మహాత్మాగాంధీని ‘జాతిపిత’ గా గౌరవించి కృతజ్ఞత ప్రకటించుకుంది.

గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడున్న భారతీయుల దాస్య వృత్తిని చూసి చలించిపోయాడు. ఆంగ్లేయుల ప్రవర్తన సహించలేక ఎదురుతిరిగాడు. ఎన్నో కష్టాలకు లోనయ్యాడు.

స్వదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ భారతీయుల బానిస బ్రతుకుల్ని చూసి సహించలేకపోయాడు. భారతమాత పరాయి పాలకుల సంకెళ్ళలో బందీగా ఉన్నందుకు గాంధీ తల్లడిల్లాడు. ఆంగ్లేయులపై స్వాతంత్ర్య సమరం ప్రకటించాడు. శాంతి, సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సమరం చేపట్టాడు. స్వరాజ్య ఉద్యమానికి కాంగ్రెసు సంఘం స్థాపించాడు.

ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, ఖద్దరు ఉద్యమాలను చేపట్టి ఆంగ్లేయులను గుక్క తిప్పుకోనీకుండా గడగడలాడించాడు. సత్యాగ్రహం, నిరాహారదీక్షల ద్వారా భారత జాతిని జాగృతం చేసి ఆంగ్లేయుల గుండెలు దద్దరిల్లజేశాడు.

అనేక జాతులు, కులాలు, మతాలు, భాషలు గల దేశ ప్రజల్ని ఒకే తాటి మీద నడిపించి, సమైక్యంగా పోరాటం సాగించాడు. గాంధీ నడిపించిన ఉద్యమం వల్ల 1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. దుడ్డు కర్ర, అంగవస్త్రం, కిర్రు చెప్పులు గల గాంధీ ప్రపంచ దేశాలచేత జేజేలు అందుకున్నాడు.

8th Class Telugu 9th Lesson సందేశం 1 Mark Bits

1. నీ తనువు నిండా దేశభక్తి ఉండాలి. (అర్ధాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) శరీరము
బి) అవయవము
సి) శరము
డి) మనసు
జవాబు:
ఎ) శరీరము

2. దేశ గౌరవమును పెంపొందించాలి (వికృతి గుర్తించండి.) (S.A.II – 2018-19)
ఎ) గౌవరము
బి) గవరం
సి) గారవము
డి) గౌవరం
జవాబు:
సి) గారవము

3. నా యీ దేశ సౌభాగ్య సంపద లీ విశ్వమునందు నెలకొల్పుదున్ (ఏ విభక్తి) (S.A.II – 2018-19)
ఎ) తృతీయ
బి) చతుర్థి
సి) సప్తమీ
డి) షష్టీ
జవాబు:
సి) సప్తమీ

4. భారతదేశం సకల సంపదలకు నిలయము (గురు లఘువులు గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) UII
బి) UIU
సి) IIU
డి) III
జవాబు:
డి) III

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

5. గాంధీజీ శాంతికి మారుపేరు. ఉగ్రవాదులు దేనికి మారుపేరు? (వ్యతిరేకపదం రాయండి) (S.A.II – 2017-18)
ఎ) ప్రేమ
బి) అశాంతి
సి) సహనం
డి) ఆప్యాయత
జవాబు:
బి) అశాంతి

6. వనముల్ – ఈ పదంలో ఉన్న గణం ఏది? (S.A.III – 2016-17)
ఎ) న గణం
బి) స గణం
సి) య గణం
డి) మ గణం
జవాబు:
బి) స గణం

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

1. కేతనం ఎగరాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) జెండా
బి) బాబిల్లి
సి) జాతర
డి) రథం
జవాబు:
ఎ) జెండా

2. వసుధ పై శాంతి నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ధిషణ
బి) వారిధి
సి) వారంగి
డి) భూమి
జవాబు:
డి) భూమి

3. శిరంపై కేశాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) యశం,ఖ్యాతి
బి) విరించి, వివరణ
సి) ఖ్యాతి, ఖననం
డి) కిరీటం, కరుణ
జవాబు:
బి) విరించి, వివరణ

4. నవ్వ జీవనం కావాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనురాగం
బి) కొత్త
సి) పాత
డి) మధురం
జవాబు:
బి) కొత్త

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

5. మంచి తరుణంలో రావాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సమయంలో
బి) సాధనలో
సి) యోధలో
డి) పోరాటంలో
జవాబు:
ఎ) సమయంలో

6. భగవంతుడు నిఖిలం అంతా ఉన్నాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సంగరం
బి) సమస్తం
సి) సంజాతం
డి) సముద్భూతం
జవాబు:
బి) సమస్తం

7. జనయిత్రి ఉన్నది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆడపడుచు
బి) తల్లి
సి) చెల్లి
డి) అక్క
జవాబు:
బి) తల్లి

పర్యాయపదాలు :

8. కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) అధరం
బి) తల
సి) నాశిక
డి) జిహ్వ
జవాబు:
ఎ) అధరం

9. కాను పాలించాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) కీరితి, కిరీటి
బి) ధ్వజం, కేతనం
సి) భూమి, అవని
డి) ధాత్రి, జనని
జవాబు:
సి) భూమి, అవని

10. సౌభాగ్యం వృద్ధి చెందాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) కిరీటం,మకుటం
బి) సమృద్ధి, వైభవం
సి) విశదం, వైభవం
డి) జనని, ధరణి
జవాబు:
బి) సమృద్ధి, వైభవం

11. కేతనం ఎగరాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఝరి, స్యందనం
బి) పతాకం, జెండా
సి) కీలు, కెరటం
డి) జలధి, వారిధి
జవాబు:
బి) పతాకం, జెండా

12. జనయిత్రి – దీనికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వారుణి, వసుధ
బి) తల్లి, మాత
సి) అవని, వసుధ
డి) జనక, జామాత
జవాబు:
బి) తల్లి, మాత

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

13. ప్రగతి సాధించాలి – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) పురోగతి, అభివృద్ధి
బి) జనని, జామాత
సి) పరిశీలన, పరిశోధన
డి) ఆరాటం, చైతన్యం
జవాబు:
ఎ) పురోగతి, అభివృద్ధి

ప్రకృతి – వికృతులు :

14. భృంగారం ధర పెరిగింది – గీత గీసిన పదానికి వికృతి పూరించండి.
ఎ) బండారం
బి) బంగారం
సి) శృంగారం
డి) భంగారం
జవాబు:
బి) బంగారం

15. విసయం తెలిసింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) వివరం
బి) వివేసం
సి) విషయం
డి) విశయం
జవాబు:
బి) వివేసం

16. సహజంగా ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సాజం
బి) సామ్యం
సి) సాధారణం
డి) సాధేయం
జవాబు:
ఎ) సాజం

17. గృహంలో ఉన్నారు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) గేహం
బి) గోహం
సి) గహం
డి) గోహము
జవాబు:
ఎ) గేహం

18. అచ్చెరువు పొందాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) ఆదరువు
బి) ఆశ్చర్యం
సి) అక్కరువు
డి) ఆచరువు
జవాబు:
బి) ఆశ్చర్యం

19. ఎదలో ఏమున్నది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం పదం గుర్తించండి.
ఎ) జలధి
బి) అగ్రణి
సి) హవం
డి) ఆరుణి
జవాబు:
సి) హవం

20. కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) కృతి
బి) కీరితి
సి) కేరితి
డి) కారితి
జవాబు:
బి) కీరితి

21. యజ్ఞము చేయాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) జైనము
బి) జన్నము
సి) జెన్నము
డి) జొన్నము
జవాబు:
బి) జన్నము

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

22. రూపు మనోహరం – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) రూపం
బి) రోగం
సి) రౌపం
డి) రైపం
జవాబు:
ఎ) రూపం

నానార్థాలు :

23. తనువును రక్షించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పుట్టుక, ప్రగతి
బి) నాడి, నాగరం
సి) ప్రజ, సంతానం
డి) శరీరం, పన్నము
జవాబు:
డి) శరీరం, పన్నము

24. నాడులు ఉన్నాయి – గీత గీసిన పదానికి నానార్థాలు పదం ఏది?
ఎ) నాశికలు, కర్ణములు
బి) నరములు, ఈనెలు
సి) ఈటెలు, ఈగలు
డి) ఆక్షితలు, మనుషులు
జవాబు:
బి) నరములు, ఈనెలు

25. ప్రజ వర్ధిల్లాలి – గీత గీసిన పదానికి నానార్థాలు ఏది?
ఎ) సంతానం, జనము
బి) జనని, జామాత
సి) జనక, జయం
డి) జనిత, వసుధ
జవాబు:
ఎ) సంతానం, జనము

వ్యుత్పత్త్యర్థాలు :

26. భారమును ఓర్చునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదాన్ని గుర్తించండి.
ఎ) వారిదం
బి) క్ష్మా
సి) జలధి
డి) వారుణి
జవాబు:
బి) క్ష్మా

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

27. వసుధ – దీనికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) ఐశ్వర్యం ఇచ్చునది
బి) జనులను కాపాడునది
సి) ధనమును ధరించునది
డి) విశ్వాన్ని పొందునది
జవాబు:
సి) ధనమును ధరించునది

28. ముందుండి నడిపించేవాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల గుర్తించండి.
ఎ) హేయం
బి) హారం
సి) అరుణ
డి) హృదయం
జవాబు:
బి) హారం

వ్యాకరణాంశాలు

సంధులు :

39. గుణసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) ప్రత్యయం
బి) సహోదర
సి) మనోరధం
డి) తపోధనుడు
జవాబు:
బి) సహోదర

40. పట్టుగొమ్మ – ఇది ఏ సంధి?
ఎ) విసర్గ సంధి
బి) గసడదవాదేశ సంధి
సి) త్రికసంధి
డి) గుణసంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి

41. కింది వానిలో యడాగమ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) కన్నయది
బి) ఆత్మానందం
సి) పంచకావ్యం
డి) నవ్యోదయం
జవాబు:
ఎ) కన్నయది

42. శివమెత్తరా – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) ఉత్వసంధి
సి) అత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
బి) ఉత్వసంధి

43. మొలకెతు – దీనిని విడదీయడం గుర్తించండి.
ఎ) మెలక + ఎత్తు
బి) మొలకి + ఎత్తు
సి) మొలకు + ఎత్తు
డి) మొలక + ఎత్తు
జవాబు:
డి) మొలక + ఎత్తు

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

44. నీయాదేశము – ఇది ఏ సంధి?
ఎ) ఉత్వసంధి
బి) యడాగమ సంధి
సి) త్రికసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) యడాగమ సంధి

45. కింది వానిలో వికల్ప సంధి ఏది?
ఎ) ఉత్వసంధి
బి) గుణసంధి
సి) ఇత్వసంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) ఇంద్ర గణం

46. కింది వానిలో పొసగని సంధి ఏది?
ఎ) గుణసంధి
బి) అత్వసంధి
సి) ఇత్వసంధి
డి) త్రికసంధి
జవాబు:
ఎ) గుణసంధి

సమాసాలు :

47. ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) రూపక సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహు బ్రీహి సమాసం
డి) కర్మధారాయ సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం

48. దేశభక్తి ఉండాలి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) దేశమును భక్తి
బి) దేశము నందు భక్తి
సి) దేశమునకు భక్తి
డి) దేశము చేత భక్తి
జవాబు:
బి) దేశము నందు భక్తి

49. దేశ సమగ్రత పాటించాలి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం ఏది?
ఎ) దేశము చేత సమగ్రత
బి) దేశము వలన సమగ్రత
సి) దేశము తెలుపు సమగ్రత
డి) దేశమందు సమగ్రత
జవాబు:
బి) దేశము వలన సమగ్రత

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

50. అన్యపదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) బహువ్రీహి
బి) ద్వంద్వ
సి) కర్మధారయ
డి) తత్పురుష
జవాబు:
ఎ) బహువ్రీహి

51. వంచకుల యొక్క ఆవశి – దీనికి సమాస పదం ఏది?
ఎ) వంచకావశి
బి) వచికశ్రేణి
సి) వంచికాశ్రేణి
డి) అగ్రవంచక
జవాబు:
ఎ) వంచకావశి

52. అన్నదమ్ములు – ఇది ఏ సమాసం?
ఎ) ద్వంద్వ సమాసం
బి) కర్మధారయ సమాసం
సి) ద్విగు సమాసం
డి) రూపక సమాసం
జవాబు:
ఎ) ద్వంద్వ సమాసం

గణవిభజన:

53. న, జ, భ, జ, జ, జ, ర – ఇవి ఏ పద్య గణాలు (S.A. III – 2015-16)
ఎ) ఆటవెలది
బి) చంపకమాల
సి) ఉత్పలమాల
డి) మత్తేభం
జవాబు:
బి) చంపకమాల

54. IIIU – ఇది ఏ గణము?
ఎ) సూర్య గణం
బి) న గణం
సి) ఇంద్ర గణం
డి) హ గణం
జవాబు:
సి) ఇంద్ర గణం

55. రాతరు – ఇది ఏ గణము?
ఎ) త గణం
బి) భ గణం
సి) య గణం
డి) న గణం
జవాబు:
బి) భ గణం

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

56. ఉత్పలమాలలో పాదానికి అక్షరాలు గుర్తించండి.
ఎ) 20
బి) 23
సి) 24
డి) 21
జవాబు:
ఎ) 20

వాక్యాలు :

57. రవి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) తుమున్నర్థక వాక్యం
సి) సందేహార్థక వాక్యం
డి) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
సి) సందేహార్థక వాక్యం

58. నీవు ఇంటికి వెళ్ళు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిశ్చయాత్మక వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
సి) విధ్యర్థక వాక్యం

59. మీరు భోజనం చేయవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుమత్యర్థక వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) వ్యతిరేకార్థక వాక్యం
జవాబు:
ఎ) అనుమత్యర్థక వాక్యం

60. వంట చేసి వెళ్ళాను – గీత గీసిన పదం ఏ క్రియా పదం?
ఎ) క్వార్ధకం
బి) చేదర్థకం
సి) శత్రర్థకం
డి) ఆత్మార్థకం
జవాబు:
ఎ) క్వార్ధకం

61. వారు నడుస్తూ వెళ్తున్నారు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ఆత్మార్థక వాక్యం
బి) శత్రర్థక వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
బి) శత్రర్థక వాక్యం

62. వాల్మీకి చేత రామాయణం రచింపబడింది – ఇది ఏ రకమైన వాక్యం? (S.A.III – 2015-16)
ఎ) కర్తరి వాక్యం
బి) సామాన్య వాక్యం
సి) హేత్వర్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
డి) కర్మణి వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

63. వర్షాలు కురవడం వల్ల చెరువులు నిండాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) భావార్థక వాక్యం
సి) తుమున్నర్ధక వాక్యం
డి) కర్తరి వాక్యం
జవాబు:
ఎ) హేత్వర్థక వాక్యం

64. వాడు వస్తాడో? రాడో? – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిశ్చయార్థక వాక్యం
బి) ఆత్మార్థక వాక్యం
సి) సంక్లిష్ట వాక్యం
డి) సంయుక్త వాక్యం
జవాబు:
సి) సంక్లిష్ట వాక్యం

అలంకారాలు :

65. ఇందు వదన కుంద రదన మంద గమన మధుర వచన ఇది ఏ అలంకారం?
ఎ) వృత్త్యనుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) యమకం
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
ఎ) వృత్త్యనుప్రాస

66. కింది వానిలో పొసగని సంధిని గుర్తించండి.
ఎ) ఉపమ
బి) యమకం
సి) లాటానుప్రాస
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) ఉపమ

67. బింబ ప్రతిబింబ భావం గల అలంకారం గుర్తించండి.
ఎ) దృష్టాంతం
బి) ఉత్ప్రేక్ష
సి) అతిశయోక్తి
డి) లాటానుప్రాస
జవాబు:
ఎ) దృష్టాంతం

AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం

68. మానవా ! నీ ప్రయత్నం మానవా ! – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) యమకం
బి) వృత్త్యనుప్రాన్
సి) లాటానుప్రాస
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) యమకం

సొంతవాక్యాలు :

29. కేతనము : అర్జునుని కేతనంపై కపీశ్వరుడుంటాడు.

30. నిఖిలం : నిఖిలమంతా దైవం నిండియున్నాడు.

31. అభ్యుదయం : ప్రజలు అభ్యుదయ మార్గంలో పయనించాలి.

32. సౌభాగ్యం : దేశ సౌభాగ్యం వర్ధిల్లాలి.

33. చంద్రిక : చంద్రుని చంద్రికలు ఆహ్లాదం కలిగిస్తాయి.

34. వసుధ : వసుధపై ప్రజలంతా సుఖంగా జీవించాలి.

35. వర్థిల్లు : జగతిపై శాంతి వర్థిల్లునట్లుగా కృషి చేయాలి.

36. ఉద్ధరించు : పేదలను ఉద్ధరించు కార్యక్రమాలు చేయాలి.

37. ధాన్యాగారం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధాన్యాగారంగా కీర్తి పొందింది.

38. నిలబెట్టుట : వంశ ప్రతిష్ఠలను అందరు నిలబెట్టాలి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం.

AP State Syllabus 8th Class Telugu Important Questions 8th Lesson జీవన భాష్యం

8th Class Telugu 8th Lesson జీవన భాష్యం Important Questions and Answers

I. అనగాహన – ప్రతిస్పందన

అ) కింది ఆసరిచిత గద్యాలు చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. కింది గద్యభాగాన్ని చదవండి. కింద ఇచ్చిన నాలుగు వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి, బ్రాకెట్లలో రాయండి.

అంతరించిపోతున్న తెలుగు భాషా సంస్కృతులకు పునరుజ్జీవనం కల్పించుటకై రంగంలోకి దిగిన కందుకూరి పూర్తి సంఘసంస్కరణ దృక్పథంతో పనిచేశారు. ఒకే రంగాన్ని ఎంచుకోకుండా, సంఘంలో అపసవ్యంగా సాగుతున్న పలు అంశాలవైపు దృష్టిని సారించాడాయన. ప్రధానంగా స్త్రీల అభ్యున్నతిని కాంక్షించిన మహామనీషిగా వాళ్ళ చైతన్యం కోసం అనేక రచనలు చేశారు. చంద్రమతి చరిత్ర, సత్యవతి చరిత్ర వంటివి అందులో కొన్ని. వారి బ్రహ్మవివాహం నాటకం, పెద్దయ్య గారి పెళ్ళి పేరుతో, వ్యవహార ధర్మబోధిని, ప్లీడర్ నాటకం పేరుతోనూ, ప్రసిద్ధి పొందాయి.
వాక్యాలు :
1. కందుకూరి పూర్తి పేరు వీరేశలింగం పంతులు. (✓)
2. చంద్రమతి చరిత్ర కందుకూరి రాసిన గొప్ప నాటకం. (✗)
3. సంఘంలోని సవ్యమైన అంశాలపై దృష్టి సారించాడాయన. (✗)
4. కందుకూరి గొప్ప సంఘసంస్కర్త. (✓)

2. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ప్రపంచంలో మొట్టమొదట విడుదల చేయబడిన తపాలాబిళ్ళ అతికించే రకం కాదు. అది రెండు అణాల ఖరీదు కలిగిన కాపర్ టికెట్. ఈస్టిండియా కంపెనీ అధికారానికి లోబడిన వందమైళ్ళ లోపు చిరునామాకు దాని ద్వారా ఒక కవరును పంపవచ్చును. ఆ కవరును డాక్ రన్నర్ తీసుకువెడతాడు. ఈ కాపర్ టోకెన్ ప్రప్రథమంగా 1774 మార్చి 31వ తేదీన పాట్నాలో విడుదల చేయబడింది. 1852లో సింధు ప్రావిన్స్ కమిషనర్ సర్ బార్టిల్ ఫెర్ ఆసియాలో మొట్టమొదట తపాలా బిళ్ళను తీసుకువచ్చాడు. అందులో ఈస్టిండియా కంపెనీ ముద్ర ఉండేది. దానిని సింధు లోపల ఉత్తరాలు పంపడానికి ఉపయోగించేవారు. దీనిని సిండే డాక్ అనేవారు.
ప్రశ్నలు:
1. డాక్ రన్నర్ అంటే ఎవరు?
జవాబు:
తపాలా బంట్రోతు.

2. సింధు ప్రావిన్స్ ఎవరి పరిపాలనలో ఉంది?
జవాబు:
ఈస్టిండియా కంపెనీ.

3. అణా అంటే ఎన్ని పైసలు?
జవాబు:
ఆరు పైసలు.

4. సిండే డాక్ అంటే ఏమిటి?
జవాబు:
సింధు ప్రావిన్స్ లోని కాపర్ టికెట్.

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

3. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అప్పటికి 200 సంవత్సరాల నుంచి ఆంగ్లేయుల కారణంగాను, అంతకు ముందు ఏడెనిమిది వందల ఏళ్ళ నుంచి తురుష్కుల కారణంగాను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బానిసత్వంలో మగ్గుతున్న భారత జాతి దైన్యస్థితి నుంచి మేల్కొని 1857లో వీరోచితంగా ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని సాగించింది. కానీ ఆ చైతన్యాన్ని సైనికుల తిరుగుబాటు అంటూ తక్కువగా అంచనా వేసి, ఆంగ్ల ప్రభుత్వం అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకుని భారతదేశాన్ని పాలించడం మొదలు పెట్టింది.
ప్రశ్నలు :
1. సుమారు ఏ సంవత్సరములో ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశించారు?
జవాబు:
క్రీ.శ. 1600లో

2. తురుష్కులు భారతదేశాన్ని పాలించడం ఎప్పుడు మొదలు పెట్టారు?
జవాబు:
సుమారు క్రీ.శ 800లు లేక 900 సంవత్సరాల నుండి

3. సైనికుల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
జవాబు:
క్రీ.శ. 1857

4. భారతదేశం ఆంగ్లేయుల పాలనలోకి పూర్తిగా ఎప్పటి నుంచి వెళ్ళింది?
జవాబు:
1857

4. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఉప్పు సత్యాగ్రహంలో లక్ష్మీబాయమ్మ స్త్రీలకు నాయకురాలిగా ఉండి, ‘దేవరంపాడు’ శిబిరానికి ప్రాతినిధ్యం వహించేది. ఈ శిబిరం బాగా పనిచేసిందని ప్రశంసలు పొందింది. వివిధ గ్రామాల నుండి వందలమంది సత్యాగ్రహులు ఈ శిబిరానికి వచ్చేవారు. వారిని పోలీసులు అరెస్టు చేసేవారు. అయినా స్త్రీలు భయపడక ధైర్యంగా వారి నెదుర్కొన్నారు. మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయినా లక్ష్మీబాయమ్మ నాయకత్వంలోని స్త్రీలు జంకలేదు. సత్యాగ్రహం మానలేదు.

శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులోను, దుర్గాబాయమ్మ చెన్నపూరిలోను, రుక్మిణమ్మ వేదారణ్యంలోనూ మరికొందరు స్త్రీలు భిన్న ప్రాంతాలలోనూ చూపిన సాహసోత్సాహములు, ఆంధ్రుల ప్రతిష్ఠను విస్తరింపజేశాయి అని ఆంధ్రపత్రిక 1932లో వీరిని ప్రశంసించింది.
ప్రశ్నలు :
1. లక్ష్మీబాయమ్మ ఉప్పు సత్యాగ్రహంలో ఏ శిబిరానికి నాయకత్వం వహించింది.
జవాబు:
లక్ష్మీబాయమ్మ ‘దేవరంపాడు’ శిబిరానికి నాయకత్వం వహించింది.

2. సత్యాగ్రహులు శిబిరానికి ఎక్కడ నుండి వచ్చేవారు?
జవాబు:
సత్యాగ్రహులు వివిధ గ్రామాల నుండి శిబిరానికి వచ్చేవారు.

3. ఎన్నిసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు?
జవాబు:
మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు.

4. గుంటూరు ఉప్పు సత్యాగ్రహానికి నాయకురాలు ఎవరు?
జవాబు:
శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులో నాయకత్వం వహించింది.

5. ఈ కింది గేయం చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది.
వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.
ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది.
ప్రశ్నలు :
1. మబ్బుకు మనసు కరగడం ద్వారా ఏ ఫలితం వస్తుంది?
జవాబు:
వర్షమై భూమి మీద కురుస్తుంది.

2. దారి ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
భయపడకుండా, నిరుత్సాహ పడకుండా ముందడుగు వేసే స్ఫూర్తి నలుగురికి దారి అవుతుంది.

3. ఈ గేయం రచయిత ఎవరు?
జవాబు:
సి. నారాయణరెడ్డి గారు.

4. పై గేయం చదివి ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘ఎడారి దిబ్బలు’ అంటే ఏమిటి?

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

6. కింది పరిచిత గేయం చదవండి. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి.

ఎవరికి వారే గీపెడితే ఆశించిన గమ్యం దొరకదోయ్,
సమైక్య సంఘర్షణలో ఉన్నది సంఘం చేసిన సంతకం,
ఆలయాలలో కొలిచే ప్రతిమలు ఆత్మ సంతృప్తికే ‘సినారే’
దయకురిసే మనుషుల్లో ఉన్నది దైవం చేసిన సంతకం
ప్రశ్నలు :
1. ‘సమైక్యతతోనే ‘సంఘం వర్ధిల్లుతుంది’ అనే భావం ఏ పాదంలో ఉంది?
జవాబు:
2వ పాదం

2. ‘దయకురిసే మనుషుల్లో ఉన్నది దైవం చేసిన సంతకం’ అనే మాట ద్వారా కవి మనుషులకు ఏమి సందేశం ఇస్తున్నాడు?
జవాబు:
తోటి మనిషికి సేవచేసే దయలోనే దైవం ఉన్నాడు.

3. ‘ప్రతిమలు’ అనే మాటకు అర్థం ఏమిటి?
జవాబు:
బొమ్మలు

4. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
గేయంలోని మొదటి పాదంలోని అర్థం ఏమిటి?

7. ఈ క్రింది పరిచిత గేయాన్ని చదవండి. అడిగిన విధంగా సమాధానాలు రాయండి.

మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది.
వంకలు డొంకలు కలవనీ జడిపించకు నేస్తం !
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.
ప్రశ్నలు :
1. మబ్బులు కురవాలంటే ఏం జరగాలి?
జవాబు:
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే కురుస్తాయి.

2. మనసుకు మబ్బు ముసరడం అంటే ఏమిటి?
జవాబు:
మనసుకు మబ్బు ముసరడం అంటే ఆందోళన, చింత, బాధ, దిగులు కమ్ముకోవడం.

3. ఈ పై గేయం ఆధారంగా రెండు ప్రశ్నలు తయారుచేయండి.
జవాబు:
1) ‘జంకని’ అంటే ఏమిటి?
2) ‘నేస్తం’ పర్యాయపదాలు రాయండి.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘జీవన భాష్యం’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
జవాబు:
ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి 1931లో కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామంలో పుట్టారు. వీరు ప్రముఖ ఆధునిక కవి, వక్త, పరిశోధకులు, బహుభాషావేత్త, ప్రయోగశీలి.

నాగార్జునసాగరం, కర్పూరవసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంభర, ప్రపంచ పదులు మొదలైన నలభైకి పైగా కావ్యాలు, అద్భుతమైన సినిమాపాటలు రాసారు. ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు’ అన్న వీరి సిద్ధాంత గ్రంథము ఎన్నో ముద్రణలను పొందింది. వీరి ‘విశ్వంభర’ కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన ‘జ్ఞానపీఠ అవార్డు’ లభించింది. భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ బిరుదుతో గౌరవించింది. ‘చమత్కారం’ – వీరి కలానికీ, గళానికీ, ఉన్న ప్రత్యేకత.

ప్రశ్న 2.
‘గజల్’ ప్రక్రియను వివరించండి.
జవాబు:
ఉర్దూ సాహిత్య ప్రక్రియ ‘గజల్’. దీంట్లో ఒకే విషయాన్ని చెప్పాలనే నిర్బంధం ఉండదు. గజల్ లోని భావం ఏ చరణానికి ఆ చరణం విడిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండు చరణాలు కలిసి ఒకే భావాన్ని వ్యక్తపరుస్తాయి. గజల్ పల్లవిని ఉర్దూలో ‘మత్తా’ అని, చివరి చరణాన్ని “మక్తా” అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. చివరి చరణంలో కవి నామముద్ర ఉంటుంది. దీన్ని “తఖల్లస్” అంటారు. సరసభావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ గజల్ జీవగుణాలు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

ప్రశ్న 3.
మన పేరు శాశ్వతంగా నిలవాలంటే ఏం చేయాలి?
జవాబు:
మన పేరు శాశ్వతంగా నిలవాలంటే చెరగని త్యాగం చేయాలి. మనం చేసిన త్యాగకృత్యం, ఎప్పటికీ మరచిపోలేనిదిగా ఉండాలి. అంతటి త్యాగము చేసిన వారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం ఏదో బిరుదులు ఇస్తున్నారని, ఆ బిరుదులు మనకు ఉన్నాయి కదా అని అనుకుంటే లాభం లేదనీ, ఆ బిరుదుల వల్ల, సన్మానాల వల్ల వచ్చే పేరు చిరకాలం నిలవదనీ కవి గుర్తుచేశారు. ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని గొప్ప త్యాగం చేసిన త్యాగమూర్తుల పేరు, చిరస్థాయిగా నిలిచి ఉంటుందని కవి తెలిపాడు.

ప్రశ్న 4.
“ఎంత ఎత్తుకు ఎదిగినా ఉంటుంది పరీక్ష” అనే వాక్యం ద్వారా కవి మనకు ఇచ్చిన సందేశం ఏమిటి?
జవాబు:
మనకు ఎంత సామర్థ్యం ఉన్నా, అధికారం, సంపదలు ఉన్నా, మనం ఎన్నో విజయాలు సాధించినా, ఇంక మనకు ఏ కష్టాలూ, బాధలూ రావని ధీమాగా ఉండరాదని కవి సందేశం ఇచ్చారు. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యలను తీసుకువస్తుందో, పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరని కవి సూచించాడు. విధి శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే అని కవి తెలియజెప్పారు. కవి తాను చెప్పిన మాటకు దృష్టాంతంగా హిమాలయ పర్వతాన్ని గూర్చి గుర్తుచేశాడు. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి, నదిగా ప్రవహించవలసి వస్తోంది. అలాగే ఎంతటి మనిషి అయినా, విధి పరీక్షిస్తే నీరు కారిపోవలసిందే అని కవి తెలిపాడు.

ప్రశ్న 5.
“ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు “సినారె” ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు?
జవాబు:
బీడు పడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని, ఏ ప్రయత్నాలూ చేయకుండా నిరాశకు లోనుకావద్దని, కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయని సినారె సందేశమిచ్చారు.

ఎడారి దిబ్బల వ్యవసాయంలాగే కొన్ని పనులు చేయడానికి మనం ముందుకురాము. దానివల్ల ప్రయోజనం ఉండదని ముందే తీర్మానించుకుంటాము. అది సరిగాదనీ, నీకు లభ్యమైన వస్తువును ఉపయోగంలో పెట్టుకోడానికి ప్రయత్నించాలని, అలా ప్రయత్నిస్తే ఎడారి చేలల్లో పంటలు పండినట్లు తప్పక ఫలితం ఉంటుందని నారాయణరెడ్డి గారి అభిప్రాయం. నీ వంతు ప్రయత్నం నీవు చేయాలనే కర్తవ్యాన్ని గుర్తుచేయడం ఈ వాక్యం యొక్క సందేశం.

ప్రశ్న 6.
ఈ గజల్ లో మీకు బాగా నచ్చిన చరణాలు ఏవి? ఎందుకు నచ్చాయో సమర్థిస్తూ వివరణ ఇవ్వండి.
జవాబు:
ఈ గజల్ లో నాకు “మనిషీ మృగము ఒకటనీ ………. ఒక ఊరవుతుంది” అనే చరణాలు బాగా నచ్చాయి. ఎందుకంటే ఈ చరణాలలో నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించటమే ఉత్తమ సాంఘిక జీవనం అనే అర్థం ఉంది.

“ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష” అన్న చరణం కూడా నచ్చింది. తాను గొప్పవాడిని అయ్యానని, ఇంక తనకు ఎదురే లేదని, తనకు ఎంతో సంపద, సామర్థ్యం ఉందని ధీమాగా ఉండరాదనీ, ఏదో సమస్య వస్తూనే ఉంటుందనీ దాని భావం. ఇది గొప్ప జీవిత సత్యం. అలాగే “చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది” అన్న చరణం గొప్ప సందేశాన్ని ఇస్తోంది. ఎన్నటికీ మరచిపోలేని గొప్ప త్యాగకార్యం చేస్తే ఆ వ్యక్తి పేరు శాశ్వతంగా నిలుస్తుందని దీని అర్థం. ఇది గొప్ప జీవనసత్యం. అందువల్ల పై చరణాలు నాకు నచ్చాయి.

ఆ) కింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది’ అని ‘సి.నా.రె’ ఎందుకు అని ఉంటారు?
జవాబు:
‘మనిషి’ భగవంతుని సృష్టిలో ఒకే రకం జీవి. అయినా నేడు సంఘంలో మనుష్యులు కులమత భేదాలతో, వర్గవైషమ్యాలతో విడిపోతున్నారు. అందువల్ల సమాజాభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. మత వైషమ్యాల వల్ల దేశాలూ, రాష్ట్రాలూ నాశనం అవుతున్నాయి. ప్రాంతీయ భేదాల వల్ల కలతలూ, కార్పణ్యాలూ పెరిగిపోతున్నాయి. అలాగాక గ్రామంలోని పదుగురూ అంటే పదిమందీ కలసి ఉంటే, అది చక్కని గ్రామం అవుతుంది. గ్రామంలోని ప్రజలంతా కలసి ఉంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది. గ్రామంలోని పదిమందీ అంటే ఉన్నవాళ్ళంతా కులమత భేదాలు లేకుండా కలిసి, గ్రామాభివృద్ధికి కృషిచేస్తే అది చక్కని “ఊరు’ అవుతుంది. ఆదర్శ గ్రామం అవుతుందని భావం. ఆ గ్రామానికి కావలసిన సదుపాయాలు అన్నీ సమకూరుతాయి. ప్రభుత్వం కూడా ఆ గ్రామానికి కావలసిన ధన సహాయం చేస్తుంది. గ్రామ ప్రజల్లో సహకారం, ఐకమత్యం అవసరం అని చెప్పడానికే ‘సి.నా.రె’ ఈ వాక్యాన్ని రాశారు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

ప్రశ్న 2.
‘జీవన భాష్యం’ గజల్ సారాంశం మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మబ్బులకు దయ కలిగితే నీరుగా మారి వర్షం వస్తుంది. మనస్సు పై దిగులు మబ్బులు కమ్మితే దుఃఖం వస్తుంది. వంకలూ, డొంకలూ ఉన్నాయని జంకకుండా ముందడుగు వేస్తే అదే పదిమందీ నడిచే దారిగా మారుతుంది. ఎడారి ఇసుకదిబ్బలు దున్నినా ఫలితం ఉండదని అనుకోకుండా, సేద్యం చేస్తే పంట పండుతుంది. మనిషి, జంతువు అని తేడాలు పెట్టుకోడం వ్యర్థం. పదిమంది మనుషులు కలిస్తే అది మంచి గ్రామం అవుతుంది.

ఎంత ఎత్తుకు ఎదిగినా పరీక్ష ఉంటుంది. హిమాలయం ఎత్తులో ఉన్నా వేడికి అది కరిగి నీరవుతోంది కదా ! బిరుదులు, సన్మానాలు పొందాము అనుకున్నా పేరు నిలువదు. గొప్ప త్యాగం చేస్తేనే పేరు నిలుస్తుంది.

ప్రశ్న 3.
ఏదైనా ఒక లక్ష్యసాధనలో విజయమూ కలగవచ్చు ! అపజయమూ కలగవచ్చు ! అందుకు గల కారణాలు ఊహించి రాయండి.
జవాబు:
మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలని కార్యసాధనకు దిగితే, అందుకు దైవం అనుకూలిస్తే, విజయం సాధించగలం. మనము చక్కని ప్రణాళికతో పని ప్రారంభిస్తే అందుకు పై అధికారులూ, తోటివారూ, ప్రక్కవారూ సహకరిస్తే మన లక్ష్యం నెరవేరుతుంది. మనం ప్రణాళిక లేకుండా పనికి దిగినా, పక్కవారు సాయం చేయకపోయినా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనం లక్ష్యమును సాధింపలేము. మనం మన శక్తికి తగిన లక్ష్యాన్ని ఎన్నుకుంటే తప్పక విజయం సాధిస్తాము. నేల విడిచి సాము చేస్తే కార్యాన్ని సాధించలేము.

మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థి ఐ.ఎ.ఎస్లో ఉత్తీర్ణత పొందగలడు. అత్తెసరు మార్కులవారు ఆ లక్ష్యాన్ని చేరలేరు. కార్యసాధనకు మంచి పట్టుదల, దీక్ష, నిరంతర కృషి కావాలి. అటువంటి వారు విజయాన్ని సాధిస్తారు. కృషి ఉంటే, మనిషి ‘ఋషి’ అవుతాడు. కృషి లేకుండా కేవలం పగటి కలలు కనడం వల్ల, కార్య లక్ష్యసాధన కాదు.

ప్రశ్న 4.
“చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది” అంటే త్యాగం చేసేవారి, మంచిపనులు చేసే వారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి మంచిపనులు చేయాలి?
జవాబు:
త్యాగం చేసేవారి, మంచి పనులు చేసేవారి పేర్లు మాత్రమే చరిత్రలో వెలుగుతాయని కవి ప్రబోధించాడు. మనం స్వార్థాన్ని విడిచి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. చేసే పనుల్లో చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలి. తనకు మేలు కలిగే పనులను చేయడంకంటే తోటివారికి ఎక్కువ మేలు కలిగే పనులను చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనాథలైన, అన్నార్తులైన, నిరాశ్రయులైన ప్రజలను ఆదుకోవాలి. వికలాంగుల సంక్షేమంకోసం నిరంతరం కృషి చేయాలి. వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలి. గ్రామంలో పచ్చని చెట్లను నాటాలి. మూగజీవాల సంరక్షణకు చర్యలను చేపట్టాలి. ప్రమాదాల్లో గాయపడినవారిని ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యసహాయం అందేవిధంగా కృషి చేయాలి. ఈ విధంగా మనమంతా ప్రజల హితం కోసం నిస్వార్థంగా సేవలను అందించాలి. ఇటువంటి పనుల వల్లనే మన పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

ప్రశ్న 5.
రైతు గొప్పదనాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి. (S.A. I – 2018-19)
జవాబు:
కష్టజీవి రైతు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులు పంటలు పండిస్తేనే మనం అన్నం తినగల్గుతాం. రైతు అంటే ‘పంటకాపు’ అని నిఘంటు అర్థం. అంటే పంటను రక్షించేవాడు. వ్యవసాయదారుడు, కృషీవలుడు అనే పర్యాయ పదాలున్నాయి.

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకునూ పండించే వ్యక్తి రైతు. పంటలు పండించే వారినే కాక మామిడి, కొబ్బరి, ద్రాక్ష తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తుంటారు. ఇంకా ఇతరుల భూమిని అద్దెకు తీసుకొని సాగు చేస్తుంటారు. వారిని కౌలు రైతులు అంటారు. పొలం పనుల్లో భాగంగా తాను పనిలో పెట్టుకొనే ఉద్యోగులను రైతు కూలీలు అంటారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకకు తగ్గకుండా మొండి ధైర్యంతో రైతులు సేద్యం కొనసాగిస్తున్నారు. వారు విరక్తిలో కాడి పడేస్తే మనకు అన్నం దొరకదు. రైతు సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అని మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వాలు రైతును బిచ్చగాళ్ళను చేస్తున్నాయి. రాష్ట్రంలో రైతాంగం దయనీయ దుస్థితిలో ఉన్నారు. సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకొని, దేశాన్ని స్వయం పోషకంగా నిలబెట్టాలన్న ఆలోచన, అందుకు తగ్గ వ్యూహం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. మన రాష్ట్రాలలో సగటున రోజుకు 30 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.

ఏ రైతూ కన్నీరు పెట్టనప్పుడే భూమాత సంతోషిస్తుంది. రెక్కాడితే కాని డొక్కాడని ఎందరో రైతులున్నారు. వారందరికి ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయాలి. గిట్టుబాటు ధరలు ప్రకటించాలి. ప్రభుత్వమే రైతు వద్ద పంటను కొనుగోలు చేయాలి. దళారీ వ్యవస్థను తొలగించాలి. అప్పుడే రైతులు సంతోషంగా ఉంటారు.

ఇ) క్రింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
“జీవన భాష్యం” గజల్ లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
జవాబు:

  1. మంచు కరిగితే నీరవుతుంది.
  2. మంచి నడక నడిస్తే అది దారవుతుంది.
  3. వర్మం కురిస్తే పంట పైరవుతుంది.
  4. మంచి వ్యక్తులు కూడితే ఊరవుతుంది.
  5. నదులు పారితే అది ఏరవుతుంది.
  6. త్యాగధనులుంటే అది పేరవుతుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

ప్రశ్న 2.
ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకొంటున్నారో ప్రశ్నలు రాయండి.
జవాబు:

  1. మీ రచనలలో మీకు బాగా నచ్చిన కావ్యం ఏది?
  2. ‘ప్రపంచ పదులు’ దీన్ని మీరు ఎలా సృష్టించారు?
  3. మీ సినీగేయాలలో మీకు నచ్చిన గేయం ఏది?
  4. మిమ్ములను కవిత్వం వైపు నడిపించినది ఎవరు?
  5. మీ రచనలకు ప్రేరణనందించిన అంశాలు ఏవి?
  6. మధ్యతరగతి మందహాసంలోని ప్రధానమైన అంశం ఏమిటి?
  7. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలకు, మీరిచ్చే సందేశం ఏమిటి?
  8. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుండి ఎలా బయటపడగలుగుతారు?
  9. నేటి యువ రచయితలకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
  10. ప్రస్తుతం మీరు ఎందుకు సినిమా పాటలు రాయడంలేదు?

ప్రశ్న 3.
డా॥ సి. నారాయణరెడ్డిగారిని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

లేఖ

ధర్మవరం,
x x x x x

ప్రియమైన మిత్రుడు అవినాష్ కు,

నీ మిత్రుడు వ్రాయునది నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన తెలుగు సాహిత్య కవులలో డా|| సి. నారాయణరెడ్డిగారు సుప్రసిద్ధులు. వీరి శైలి మధురంగాను, సృజనాత్మకంగాను ఉంటుంది. వీరు రచించిన ‘విశ్వంభర’ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. వీరు రచించిన సినీ గీతాలు ఈనాటికి ఆపాత మధురంగా ఉన్నాయి. వీరి పరిశోధనాత్మక గ్రంథం ప్రశస్తి పొంది, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. వీరి గజల్స్ తెలుగు ప్రాంతంలో ఉర్రూతగించాయి. అందుకే నాకు నారాయణరెడ్డిగారు అంటే చాలా ఇష్టం .

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x

చిరునామా :
పి. అవినాష్, 8వ తరగతి,
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,
దుగ్గిరాల, వయా తెనాలి, గుంటూరు జిల్లా.

8th Class Telugu 8th Lesson జీవన భాష్యం 1 Mark Bits

1. ఏ సిరులు పొందని సంతృప్తి ఏమిటో (వ్యతిరేకపదం రాయండి) (S.A. II – 2018-19)
ఎ) అసంతోసం
బి) అసమ్మోహం
సి) అసంతృప్తి
డి) అతృప్తి
జవాబు:
సి) అసంతృప్తి

2. పరీక్షలు బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. (S.A. II – 2018-19)
ఎ) శత్రర్థకం
బి) సంయుక్తం
సి) సంక్లిష్ట
డి) చేదర్థకం
జవాబు:
డి) చేదర్థకం

3. సరైన సమయంలో వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. (ఏ వాక్యమో గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) క్త్వార్థకం
బి) శత్రర్థకం
సి) సంశయార్థకం
డి) చేదర్థకం
జవాబు:
డి) చేదర్థకం

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

4. శత్రర్థక వాక్యమును గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) రాజు ఆటలు ఆడి ఇంటికి వచ్చాడు.
బి) రమ వంట చేస్తూ పుస్తకం చదువుతోంది.
సి) రవి రేపు సినిమాకు వెళతాడు.
డి) సత్య బాగా చదివితే వాళ్ళ నాన్నకు పేరు వస్తుంది.
జవాబు:
బి) రమ వంట చేస్తూ పుస్తకం చదువుతోంది.

5. రవి ఎన్నో గ్రంథాలు చదివాడు. వాటిలో తాటియాకు పొత్తములు కూడా ఉన్నాయి. (సమానార్థక పదాన్ని గుర్తించండి.) (S.A.III – 2016-17)
ఎ) తల
బి) మస్తకం
సి) పుస్తకం
డి) దేవాలయం
జవాబు:
సి) పుస్తకం

6. బాగా చదివితే బాగుపడతాం (గీత గీసిన పదం ఆధారంగా ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) క్వార్థకం
బి) శత్రర్థకం
సి) చేదర్థకం
డి) నిరర్థకం
జవాబు:
సి) చేదర్థకం

7. “ఆయన మాట కఠినం ; మనసు వెన్న” వాక్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) ఉపమాలంకారం
బి) అతిశయోక్తి అలంకారం
సి) రూపకాలంకారం
డి) ఉత్ప్రేక్షాలంకారం
జవాబు:
సి) రూపకాలంకారం

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

8. పదుగురు వెళ్ళారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనేకులు
బి) తక్కువమంది
సి) అల్పులు
డి) నీచులు
జవాబు:
ఎ) అనేకులు

9. మంచి నేస్తం ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వైరి
బి) విరోధి
సి) స్నేహితుడు
డి) సైనికుడు
జవాబు:
సి) స్నేహితుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

10. ఏరు ప్రవహించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంబుధి
బి) నది
సి) సముద్రం
డి) క్షీరం
జవాబు:
బి) నది

11. మబ్బు కమ్మింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) కంచుకం
బి) కెరటం
సి) మేఘం
డి) కవటం
జవాబు:
సి) మేఘం

12. విన్నాడు జంకకూడదు – గీత గీసిన పదానికి అర్థం ఏది?
ఎ) మాట్లాడకూడదు
బి) భయపడకూడదు
సి) వినకూడదు
డి) వ్రాయకూడదు
జవాబు:
బి) భయపడకూడదు

13. వ్యర్ధంగా పిలువరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనవసరం
బి) అనంతం
సి) ఆకారం
డి) చెరగని
జవాబు:
ఎ) అనవసరం

14. గిరిపై తరులు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం ఏది?
ఎ) కోరిక
బి) పర్వతం
సి) ఝరి
డి) కొన
జవాబు:
బి) పర్వతం

15. శిరస్సు ప్రధానమైంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తల
బి) నాలుక
సి) కర్ణం
డి) చరణం
జవాబు:
ఎ) తల

పర్యాయపదాలు :

16. మనసు నిర్మలం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) హృదయం, చిత్తం
బి) చీర, చేలం
సి) చీరం, గరుకు
డి) హృదయం, హేయం
జవాబు:
ఎ) హృదయం, చిత్తం

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

17. నీరు ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) జలం, వారి
బి) క్షీరం, వారి
సి) వాయువు, వర్షం
డి) పయోధరం, పయోధి
జవాబు:
ఎ) జలం, వారి

18. దారిలో వెళ్ళాలి – గీత గీసిన పదానికి పర్యాపదాలు గుర్తించండి.
ఎ) దారం, సూత్రం
బి) విల్లు, ధనువు
సి) పథం, మార్గం
డి) అంతరంగం, ఆకాశం
జవాబు:
సి) పథం, మార్గం

19. మృగం ఎక్కడుంది? – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏది?
ఎ) మెకం, ఆహారం
బి) జంతువు, పసరము
సి) పరిహారం, పరివృత్తి
డి) జనిత, జాగృతి
జవాబు:
బి) జంతువు, పసరము

20. కళ్యాణం జరిగింది? – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పెండ్లి, పరిణయం
బి) తరచు, తమరు
సి) కేలు, కీడు
డి) కార్ముకం, కారుణ్యం
జవాబు:
ఎ) పెండ్లి, పరిణయం

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

21. మంచి గుణం ఉండాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) స్వభావం, గొనము
బి) గోరు, గున్న
సి) చిన్న, చిగురు
డి) చివర, అంతిమం
జవాబు:
ఎ) స్వభావం, గొనము

ప్రకృతి – వికృతులు :

22. మనుష్యుడు ఉన్నాడు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) గరమ
బి) మనిషి
సి) మనసు
డి) మరమ
జవాబు:
బి) మనిషి

23. చాగం చేయాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) త్యేగ్యం
బి) త్యాగం
సి) త్యేగం
డి) త్యోగం
జవాబు:
బి) త్యాగం

24. శిరము నందు వెంట్రుకలు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సిరము
బి) శీరం
సి) సీసం
డి) కీరం
జవాబు:
ఎ) సిరము

25. గీములో ఉన్నాను – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) గేము
బి) గృహం
సి) గోము
డి) గృము
జవాబు:
బి) గృహం

26. సింహం ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) శింహం
బి) సీరు
సి) సీమ
డి) సింగం
జవాబు:
డి) సింగం

27. సంతోషంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సంబరం
బి) సంగరం
సి) సంతసం
డి) సంగోరం
జవాబు:
సి) సంతసం

28. కార్యం చేయాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) కారము
బి) కర్ణం
సి) కారిజం
డి) కేరియం
జవాబు:
బి) కర్ణం

నానార్థాలు :

29. కాలం చెల్లాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) మరణం, సమయం
బి) చావు, చాకిరి
సి) సమయం, సాన
డి) కాలం, కాలయాపన
జవాబు:
ఎ) మరణం, సమయం

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

30. కరంతో పనిచేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చేయి, తొండము
బి) దానము, దాపరికం
సి) దశ, దిశ
డి) ఆహారం, ఓగిరం
జవాబు:
ఎ) చేయి, తొండము

31. హరి రక్షకుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) శృగాలం, శృంగె
బి) విష్ణువు, కోతి
సి) బ్రహ్మ, ఇంద్రుడు
డి) కోతి, కృప
జవాబు:
బి) విష్ణువు, కోతి

వ్యుత్పత్త్యర్థాలు :

32. విశ్వాన్ని ధరించునది-అనే వ్యుత్పత్తి గల పదం
ఎ) ధరణి
బి) విశ్వము
సి) వారుణి
డి) వారిధి
జవాబు:
ఎ) ధరణి

33. ఆకాశంలో ఎగిరేది-అనే వ్యుత్పత్తి గల పదం
ఎ) ప్రసూనం
బి) పక్షి
సి) ప్రసూతి
డి) ప్రసన్నం
జవాబు:
బి) పక్షి

34. అమృతం – దీనికి వ్యుత్పత్తి ఏది?
ఎ) మరణాన్ని ఇచ్చేది
బి) చావును కలిగించేది
సి) అమృతమయం అయినది
డి) మరణము పొందింపనిది
జవాబు:
డి) మరణము పొందింపనిది

35. దినాన్ని కలుగజేయువాడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
ఎ) నళినీ బాంధవుడు
బి) దినకరుడు
సి) రజనీకరుడు
డి) మిత్రుడు
జవాబు:
బి) దినకరుడు

వ్యాకరణాంశాలు

సంధులు :

36. నీరందుతుంది కదా ! – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) ఉత్వసంధి
బి) ఇత్వసంధి
సి) అత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
ఎ) ఉత్వసంధి

37. బాల్యమంతా – ఇది ఏ సంధి?
ఎ) ఇత్వసంధి
బి) అత్వసంధి
సి) ఉత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
బి) అత్వసంధి

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

38. ఫలమేమి ఉంది – దీనిని విడదీయండి.
ఎ) ఫలమో + ఏమి
బి) ఫలము + ఏమి
సి) ఫలము + ఏమి
డి) ఫలమే + ఏమి
జవాబు:
బి) ఫలము + ఏమి

39. దారవుతుంది – దీనిని విడదీయండి.
ఎ) దార + అవుతుంది
బి) దారి + అవుతుంది
సి) దారె + అవుతుంది
డి) దారవు + తుంది
జవాబు:
బి) దారి + అవుతుంది

40. బాలికోన్నత పాఠశాల – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) విసర్గ సంధి
బి) ఉత్వసంధి
సి) శ్చుత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
డి) గుణసంధి

41. విలువేమి ఉంది – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) విలువె + ఏమి
బి) విలువ + ఏమి
సి) విలువు + ఏమి
డి) విలువి + ఏమి
జవాబు:
బి) విలువ + ఏమి

42. అక్కడక్కడ ఉంది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) టుగాగమ సంధి
బి) ద్విరుక్తటకారాదేశ సంధి
సి) ఆమ్రేడిత సంధి
డి) జశ్త్వసంధి
జవాబు:
సి) ఆమ్రేడిత సంధి

43. దేవాలయంలో భక్తులు ఉన్నారు – గీత గీసిన పదం వాక్యం?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) ఉత్వసంధి
సి) అత్వసంధి
డి) యణాదేశ సంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

సమాసాలు:

44. ఎడారిదిబ్బలు ఉన్నాయి-గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) కర్మధారయం
బి) సప్తమీ తత్పురుష
సి) చతుర్డీ తత్పురుష
డి) అవ్యయీభావ
జవాబు:
బి) సప్తమీ తత్పురుష

45. కన్నీరు వచ్చింది – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) కంటి యొక్క నీరు
బి) కన్ను వలన నీరు
సి) కన్ను చేత నీరు
డి) కన్నును నీరు
జవాబు:
ఎ) కంటి యొక్క నీరు

46. హిమగిరి శిఖరం ఉన్నతం – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) అవ్యయీభావం
బి) కర్మధారయం
సి) షష్ఠీ తత్పురుష
డి) బహువ్రీహి
జవాబు:
సి) షష్ఠీ తత్పురుష

47. చెరగని త్యాగం – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) చెరగని దైన త్యాగం
బి) చెరిగి యొక్క త్యాగం
సి) చెరిగిన యందు త్యాగం
డి) త్యాగం చెరిగింది
జవాబు:
ఎ) చెరగని దైన త్యాగం

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

48. నఞ్ తత్పురుషకు ఉదాహరణ గుర్తించండి.
ఎ) కారుచీకటి
బి) అసత్యం
సి) కార్మికలోకం
డి) విద్యాధికుడు
జవాబు:
బి) అసత్యం

49. దొంగభయం – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) దొంగ వలన భయం
బి) దొంగ యందు భయం
సి) దొంగచేత భయం
డి) దొంగకు భయం
జవాబు:
ఎ) దొంగ వలన భయం

వాక్యాలు :

50. అల్లరి చేస్తే దండన తప్పదు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) చేదర్థక వాక్యం
సి) అప్యర్థకవాక్యం
డి) భావార్థక వాక్యం
జవాబు:
బి) చేదర్థక వాక్యం

51. నాచే పని చేయబడింది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్తరి వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
డి) కర్మణి వాక్యం

52. నడుస్తూ తింటున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అప్యర్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) శత్రర్థక వాక్యం
జవాబు:
బి) కర్మణి వాక్యం

53. రామలక్ష్మణులు అన్నదమ్ములు – ఇది ఏ రకమైన ఏ సంధి?
ఎ) ఆశ్చర్యార్థక వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) సంక్లిష్ట వాక్యం
డి) తుమున్నర్థక వాక్యం
జవాబు:
ఎ) ఆశ్చర్యార్థక వాక్యం

54. పాలు తెల్లగా ఉంటాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్
జవాబు:
డి) తద్ధర్మార్థక వాక్

55. మీరు బాగా చదవండి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) మీరు బాగా చదవద్దు
బి) మీరు బాగా చదివి తీరాలి
సి) మీరు బాగా చదవలేకపోవచ్చు
డి) మీరు కొద్దిగా చదవాలి
జవాబు:
ఎ) మీరు బాగా చదవద్దు

56. మీరు ఆటలు ఆడవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ఆశ్చర్యార్థక వాక్యం
బి) అనుమత్యర్థకం
సి) భావార్థకం
డి) తుమున్నర్థకం
జవాబు:
బి) అనుమత్యర్థకం

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

57. ఆహా ! ఎంత బాగుందో ! – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ప్రేరణార్థక వాక్యం
బి) ఆశ్చర్యార్థక వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) కర్తరి వాక్యం
జవాబు:
బి) ఆశ్చర్యార్థక వాక్యం

గణ విభజన :

58. మైత్రేయి – ఇది ఏ గణం?
ఎ) త గణం
బి) జ గణం
సి) య గణం
డి) భ గణం
జవాబు:
ఎ) త గణం

59. మర్యాద – ఇందులోని గణాలు ఏవి?
ఎ) III
బి) UUI
సి) UUU
డి) IIU
జవాబు:
బి) UUI

60. UIU – ఇది ఏ గణం?
ఎ) భ గణం
బి) స గణం
సి) త గణం
డి) ర గణం
జవాబు:
డి) ర గణం

61. III – ఇది ఏ గణం?
ఎ) మ గణం
బి) స గణం
సి) న గణం
డి) య గణం యం
జవాబు:
సి) న గణం

అలంకారాలు :

62. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పే అలంకారం ఏది?
ఎ) ముక్తపదగ్రస్తం
బి) రూపకం
సి) అతిశయోక్తి
డి) అర్థాంతరన్యాస
జవాబు:
బి) రూపకం

63. క్రింది వానిలో అర్థాలంకారం ఏది?
ఎ) శ్లేష
బి) ముక్తపదగ్రస్తం
సి) అనన్వయం
డి) దృష్టాంతం
జవాబు:
ఎ) శ్లేష

64. సీతముఖం చంద్రునివలె మనోహరంగా ఉంది – ఇందులోని అలంకారం ఏది?
ఎ) అర్థాంతరన్యాస
బి) ఉపమ
సి) రూపక
డి) అతిశయోక్తి
జవాబు:
బి) ఉపమ

65. జర్రి మర్రి తొర్రలో దూరింది – ఇందులోని అలంకారం గుర్తించండి.
ఎ) వృత్త్యనుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) వృత్త్యనుప్రాస

66. ఈ రాజు సాక్షాత్తు ఈశ్వరుడే – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) రూపక
బి) అతిశయోక్తి
సి) అర్థాంతరన్యాస
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
ఎ) రూపక

AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం

67. రాజుకు కువలయానందకరుడు – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) ఉపమ
బి) శ్లేష
సి) అర్థాంతరన్యాస
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
డి) ముక్తపదగ్రస్తం

సొంతవాక్యాలు :

68. నేస్తం : మంచి నేస్తం వల్ల ఉపయోగాలు ఉంటాయి.

69. చెరగని : పొట్టిశ్రీరాములుగారి ఆత్మార్పణ తెలుగుజాతిపై చెరగని ముద్ర వేసింది.

70. హిమగిరి : హిమగిరి అందాలు ఆకట్టుకుంటాయి.

71. వ్యాప్తి : దేశ సంస్కృతీ వ్యాప్తికి కృషి చేయాలి.

72. త్యాగం : మహనీయుల త్యాగం వల్ల స్వాతంత్ర్యం వచ్చింది.

73. కన్నీరు : దుఃఖంతో కన్నీరు వస్తుంది.

74. ముసరడం : నీలిమేఘాలు ఆకాశమంతటా ముసురుకున్నాయి.

75. ఎడారి దిబ్బలు : ఎడారి దిబ్బలపై కూడా కష్టపడితే పంటలు పండించవచ్చు.

76. జంకని అడుగులు : గుండె బలం కలవాడు జంకని అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు.

77. చెరగని త్యాగం : పరోపకార పరాయణులు చెరగని త్యాగ గుణం కలవారుగా ఉంటారు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు.

AP State Syllabus 8th Class Telugu Important Questions 7th Lesson హరిశ్చంద్రుడు

8th Class Telugu 7th Lesson హరిశ్చంద్రుడు Important Questions and Answers

I. అవగాహన- ప్రతిస్పందన

అ) కింది అపరిచిత పద్యాలను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.

కలహపడునింట నిలువదు
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములులేక సమ్మతి
మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ !
ప్రశ్నలు :
1. కలహపడే ఇంట్లో ఏం నిలువదు?
జవాబు:
కలహపడే ఇంట్లో లక్ష్మి (సంపద) నిలువదు.

2. కలకాలం ఎలా మెలగాలి?
జవాబు:
కలకాలం ఏ విధమైన కలహాలు లేకుండా మెలగాలి.

3. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది?
జవాబు:
ఈ పద్యం కుమారిని సంబోధిస్తూ అంటే ఆడ పిల్లలను సంబోధిస్తూ చెప్పబడింది.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘కలహం – నష్టం’.

2. కింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.

తనిసిరే వేల్పు లుదధి రత్నముల చేత?
వెఱచిరే ఘోర కాకోల విషము చేత?
విడిచిరే యత్న మమృతంబు వోడుముదనుక?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.
ప్రశ్నలు :
1. ఉదధి రత్నముల చేత తృప్తి చెందని వారెవరు?
జవాబు:
వేల్పులు, ఉదధి రత్నములచేత తృప్తి చెందలేరు.

2. నిపుణమతులు ఎటువంటివారు?
జవాబు:
నిపుణమతులు తాము అనుకున్న కార్యం నెరవేరే వరకు తమ ప్రయత్నాన్ని వదలరు.

3. వేల్పులు దేన్ని చూసి భయపడలేదు?
జవాబు:
వేల్పులు ఘోర కాకోల విషాన్ని చూసి భయపడలేదు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “నిపుణమతుల పట్టుదల”.

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

3. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.

విద్యచే భూషితుండయి వెలయుచున్నఁ
దొడరి వర్జింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబయిన పన్నగము భయంకరము గాదె.
ప్రశ్నలు :
1. చదువుకున్నప్పటికీ విడువదగినవాడు ఎవరు?
జవాబు:
దుర్జనుడు చదువుకున్నప్పటికీ విడువదగినవాడు.

2. ఎటువంటి పాము భయంకరమైనది?
జవాబు:
తలపై మణులచేత అలంకరింపబడినా పాము భయంకరమైనది.

3. ఈ పద్యంలోని దుర్జనుడు దేనితో పోల్చబడ్డాడు?
జవాబు:
ఈ పద్యంలో దుర్జనుడు, పాముతో పోల్చబడ్డాడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జనుడితో స్నేహం పనికి రాదు.’

4. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.

రాజు చేతి కత్తి రక్తంబు వర్ణించు
సుకవి చేతి కలము సుధలు కురియు
ఆత డేల గలుగు యావత్ప్రపంచంబు
నీత డేల గలుగు ఇహము పరము
ప్రశ్నలు:
1. రాజు చేతి కత్తి దేన్ని వర్షిస్తుంది?
జవాబు:
రాజు చేతి కత్తి రక్తాన్ని వర్షిస్తుంది.

2. సుధలు కురిపించునది ఏది?
జవాబు:
సుకవి చేతి కలము, సుధలు కురిపిస్తుంది.

3. యావత్ప్రపంచాన్ని పరిపాలించగలిగింది ఎవరు?
జవాబు:
రాజు యావత్ప్రపంచాన్ని పరిపాలించగలడు.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి. –
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘రాజు – సుకవి’.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘హరిశ్చంద్రుడు’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
ద్విపదకు జీవంపోసిన గౌరన 15వ శతాబ్దికి చెందినవాడు. ఆయన కవిత్వం నిండా అచ్చతెలుగు పలుకుబళ్ళు జాలువారుతుంటాయి. హరిశ్చంద్రుడు అనే పాఠం రాసిన ఆయన గురించి రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
‘హరిశ్చంద్రుడు’ పాఠ్యాంశ రచయిత గౌరన. ఈయన 15వ శతాబ్దికి చెందినవాడు. వీరు హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్ర రచించాడు. సంస్కృతంలో లక్షణ దీపిక అనే గ్రంథాన్ని రచించారు. ఈయనకు ‘సరస సాహిత్య విచక్షణుడు’ అనే బిరుదు ఉంది. ఈయన శైలి మనోహరమైనది. సామెతలు, జాతీయాలతో కవిత్వం అందరిని అలరిస్తుంది. అచ్చతెలుగు పలుకుబడులు కవిత్వం నిండా పుష్కలంగా ఉంటాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

ప్రశ్న 2.
‘ద్విపద’ ప్రక్రియను వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ద్విపద ఒకటి. ఇందులో రెండు పాదాలు ఉంటాయి. ప్రతిపాదంలోను నాలుగు గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోను మూడు ఇంద్రగణాలు, ఒక సూర్య గణం ఉంటుంది. 1-4 గణాల మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతి కుదరనప్పుడు ప్రాసయతి వేయవచ్చు. ప్రాస నియమం లేని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు.

ప్రశ్న 3.
హరిశ్చంద్రుని పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
పురాణ పురుషుల్లో హరిశ్చంద్రుడు ప్రసిద్ధుడు. ఈయన షట్చక్రవర్తులలో గొప్పవాడు. ఆడినమాట తప్పని స్వభావం కలవాడు. సత్యం కోసం ఎన్నో కష్టాలను అనుభవించాడు. రాజ్యాన్ని, సంపదను కోల్పోయాడు. అయినా తాను నమ్మిన సత్యమునకే కట్టుబడి ఉన్నాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
హరిశ్చంద్రుడు పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
“బ్రహ్మ రాత మారవచ్చు ….. తూర్పున సూర్యుడు అస్తమించవచ్చు కానీ హరిశ్చంద్రుడు మాట తప్పడు” అని తెలిపే హరిశ్చంద్రుని కథను రాయండి. (S.A. II – 2017-18)
జవాబు:
సాటిలేని విజ్ఞానఖనియైన వశిష్ఠుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు. ఓ దేవేంద్రా ! ఈ ప్రపంచంలో మహా పరాక్రమవంతుడు హరిశ్చంద్రుడు. ఇతడు పదహారు రకాల దానాలు చేస్తూ ఆనందిస్తాడు. వినయమే అలంకారంగా కలవాడు. వివేకమే సంపదగా కలవాడు. మంచి కీర్తి వైభవాలు కలవాడు. ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. మేఘంలా గంభీరమైనవాడు. దయకు సముద్రుని వంటివాడు. పుణ్యాత్ముడు.

పండితులచే ప్రశంసలు పొందువాడు. సర్వశాస్త్రాలసారం తెలిసినవాడు. గర్వించిన శత్రురాజులనే ఏనుగుల పాలిట సింహం వంటివాడు. షట్చక్రవర్తులలో ఒకడు. నీతిమంతమైన పాలన చేసేవాడు. సత్యం తప్పనివాడు. మహాజ్ఞాని. సత్యవాక్పరిపాలకుడు.

సూర్యవంశస్థుడయిన త్రిశంకుని కుమారుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. సూర్యవంశమనే పాలసముద్రానికి చంద్రుని వంటివాడు. ఆడినమాట తప్పనివాడు. దేవేంద్రా ! రెండువేల నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతను సత్యస్వరూపుడు. అతని ఆలోచనలు కరుణతో నిండి ఉంటాయి. హరిశ్చంద్రుడు ధర్మతత్పరుడు. ఆయన ప్రియంగా మాట్లాడతాడు. అబద్ధమనేది ఆయనకు తెలియదు.

ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు ? బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున ఆస్తమించినా, మేరుపర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలక్రిందులైనా, సముద్రాలు ఇంకిపోయినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రమహారాజు మాత్రం ఆడిన మాట తప్పడు.

ప్రశ్న 2.
సత్యాన్ని పలుకడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
మానవులు ఎన్నో ఉత్తమ గుణాలను అలవరచుకోవాలి. వాటిలో సత్యమును మాట్లాడడం మంచిది. సత్యమును మాట్లాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని :

  • ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది.
  • నైతిక విలువలు సమున్నతంగా వృద్ధి చెందుతాయి.
  • సమాజంలో ధర్మతత్పరతకు అవకాశం కలుగుతుంది.
  • సమాజంలో ఉన్నతమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి.
  • మరణించినా శాశ్వతమైన కీర్తిని పొందుతాడు.
  • అందరికి ఆదర్శంగా నిలిచే అవకాశం కలుగుతుంది.
  • సమాజంలో మంచి గుణాలు చిరస్థాయిగా నిలుస్తాయి.

ఈ విధంగా సత్యాన్ని పలకడం వల్ల మానవులకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
నీకు నచ్చిన పురాణ పురుషుని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

శ్రీశైలం,
x x x x x

ప్రియమైన మిత్రురాలు విజయలక్ష్మికి,

నీ మిత్రురాలు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది మన పురాణ పురుషుల్లో నాకు ఎంతోమంది నచ్చారు. వారిలో హరిశ్చంద్రుడు ముఖ్యుడు. ఆయన సత్యానికి కట్టుబడి ఉన్నాడు. కార్యానికి రాజ్యాన్ని, సంపదను కోల్పోయాడు. అయినా సత్యవాక్య పరిపాలనకు కట్టుబడి ఉన్నాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు. అందుకే నాకు హరిశ్చంద్రుడు అంటే ఇష్టం. నీకు నచ్చిన పురాణ పురుషుని గురించి వివరంగా నాకు తెలియజేయి.

ఇట్లు,
నీ ప్రియ మిత్రురాలు,
x x x x x x x x.

చిరునామా :
పి.విజయలక్ష్మి,
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల,
మార్కాపురం,
ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
హరిశ్చంద్రుడు పాఠ్యభాగం ఆధారంగా కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  • సత్యం పలకండి. ఆదర్శవంతంగా జీవించండి.
  • సత్యమే జయిస్తుంది.
  • సత్యం మీరని ధర్మమే నిలబడుతుంది.
  • సత్యమే ధర్మం. సత్యమే తపస్సు.
  • భారతీయ అంతరాత్మ సత్యమే.
  • నిజం నిలకడమీద నిలుస్తుంది.
  • నిజం నిప్పులాంటిది.
  • నిజం దేవుడెరుగు. నీరు పల్లమెరుగు.
  • నిజం నిప్పులాంటిది. అది కాల్చక మానదు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

ప్రశ్న 3.
సత్యహరిశ్చంద్రుని గురించి తెలుసుకున్నారు కదా ! అతని గుణాలు తెలుసుకున్నారు కదా! తల్లిదండ్రులు, అట్లే ఉపాధ్యాయులు చెప్పే మంచి నీతి వాక్యాలను రాయండి.
జవాబు:
పిల్లలకు తల్లి చెప్పే మంచి బుద్ధులు :

  1. తోడి పిల్లలతో దెబ్బలాడవద్దు
  2. పక్క పిల్లలతో స్నేహంగా ఉండు
  3. బట్టలు మాపుకోకు
  4. పుస్తకాలు జాగ్రత్తగా చూసుకో
  5. ఉపాధ్యాయులు చెప్పేది విని శ్రద్దగా రాసుకో
  6. అసత్యం చూట్లాడకు
  7. మధ్యాహ్నం భోజనం చెయ్యి
  8. చెడ్డవారితో స్నేహం చెయ్యకు – మొదలయినవి.

ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులు :

  1. ఏ రోజు పాఠం ఆ రోజే చదువు
  2. ఇంటిపని శ్రద్ధగా పూర్తిచెయ్యి
  3. చదువుపై శ్రద్ధ పెట్టు
  4. ఆటలు ఆడుకో
  5. వ్యాయామానికై శ్రద్ధ పెట్టు
  6. తల్లిదండ్రులను, గురువులను గౌరవించు
  7. అసత్యం మాట్లాడకు
  8. తోటి బాలబాలికలను అన్నాచెల్లెళ్ళవలె, ప్రేమగా గౌరవించు – మొదలయినవి.

ప్రశ్న 4.
మీకు పద్యాలు తెలుసు కదా ! ఈ పాఠం ద్వారా ద్విపదను కూడా తెలుసుకున్నారు కదా ! ఇతర పద్యాలకూ, ద్విపదకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని వివరించి మీకు నచ్చినదాన్ని ప్రశంసిస్తూ రాయండి.
జవాబు:
‘ద్విపద’ పద్యంలో రెండే, పాదాలుంటాయి. పాదానికి నాలుగు గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ మూడేసి ఇంద్రగణాలు, ఒక సూర్య గణం ఉంటాయి. మూడవ గణం మొదటి అక్షరానికి యతి ఉంటుంది. ప్రాస నియమం ఉండాలి. ప్రాస నియమంలేని ద్విపదను ‘మంజరీ ద్విపద’ అంటారు.

‘ద్విపద’ పద్యం అచ్చమైన తెలుగు ఛందస్సు. దీనిని తెలుగులో రాసిన మొదటి దేశీయకవి ‘పాల్కురికి సోమనాథుడు’. ఈయన ద్విపదలో బసవపురాణాన్ని రాశాడు.

తెలుగులో ఇతర ఛందస్సులైన వృత్త పద్యాలలో ఒక విధమైన అందమైన నడక ఉంది. అవి చదవడానికి వినసొంపుగా ఉంటాయి. ఇక ‘సీస’ పద్యాల్లో ఒక విధమైన “తూగు” ఉంది. ఉయ్యాలలో ఊగుతున్నట్లు ఉంటుంది. ఏ ఛందస్సు అందం దానిదే. మనోహరమైన “ద్విపద” కూడా మన తెలుగు వారి ఛందస్సు. ఈ ఛందస్సుల్లో మహాకవియైన గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం రాశాడు. ద్విపద దేశీయ ఛందస్సు. వృత్తములు సంస్కృత ఛందస్సులు.

8th Class Telugu 7th Lesson హరిశ్చంద్రుడు 1 Mark Bits

1. భానుడు ప్రపంచానికి వెలుగునిస్తున్నాడు. ఆదిత్యుడు జగానికి మిత్రుడు. (సమానార్ధక పదాన్ని గుర్తించండి) (S.A.I – 2018-19)
ఎ) ఇందుడు
బి) సోముడు
సి) ఆదిత్యుడు
డి) రేరాజు
జవాబు:
సి) ఆదిత్యుడు

2. ఈ క్రిందివానిలో క్వార్థక వాక్యము గుర్తించండి. (S.A.II – 2018-19)
ఎ) హరిశ్చంద్రుడు సత్యమాడి స్వర్గమునకు వెళ్లాడు
బి) హరిశ్చంద్రుడు సత్యమాడుచున్నాడు స్వర్గానికి
సి) హరిశ్చంద్రుడు సత్యమాడితే స్వర్గానికి వెళతాడు
డి) హరిశ్చంద్రుడు సత్యముతో స్వర్గానికి వెళ్లాలి.
జవాబు:
ఎ) హరిశ్చంద్రుడు సత్యమాడి స్వర్గమునకు వెళ్లాడు

3. దేవతల రాజు సురేంద్రుడు ఐరావతంపై ఊరేగాడు. (అర్థాన్ని గుర్తించండి) (S.A.II – 2017-18)
ఎ) ఇంద్రుడు
బి) అగ్నిదేవుడు
సి) వాయుదేవుడు
డి) వరుణుడు
జవాబు:
ఎ) ఇంద్రుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

4. నాకు అడవిలో కంఠీరవాన్ని చూస్తే భయం. కానీ మా గోడమీద వాలే కంఠీరవాన్ని మాత్రం ప్రేమగా నిమురుతాను. (నానార్థాలు గుర్తించండి.) (S.A.III – 2016-17)
ఎ) పులి – కాకి
బి) ఏనుగు – దున్న
సి) సింహం – పావురం
డి) జిరాఫీ – కోకిల
జవాబు:
సి) సింహం – పావురం

5. భానుడు ప్రపంచానికి వెలుగును, వేడిని ఇస్తున్నాడు. (S.A.III – 2015-16)
ఎ) సూర్యుడు
బి) చంద్రుడు
సి) ఇంద్రుడు
డి) ధర్ముడు వెళ్లడానికి
జవాబు:
ఎ) సూర్యుడు

6. చంద్రశేఖర్ ఎప్పుడూ చిటపటలాడు తుంటాడు. (S.A.III. 2015-16)
ఎ) నవ్వుతుంటాడు
బి) కోపపడుతుంటాడు
సి) మెల్లగా నడుస్తుంటాడు
డి) పరిగెత్తుతుంటాడు
జవాబు:
బి) కోపపడుతుంటాడు

7. వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. ఆమె కడవతో వడివడి అడుగులతో గడపదాటింది. (S.A.III – 2015-16)
ఎ) లాటానుప్రాస
బి) యమకం
సి) ఛేకానుప్రాస
డి) వృత్త్యనుప్రాస
జవాబు:
డి) వృత్త్యనుప్రాస

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

8. దురితం దూరం చేసుకోవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) దుష్టం
బి) పాపం
సి) పుణ్యం
డి) దుర్మతి
జవాబు:
బి) పాపం

9. బుధులు గౌరవనీయులు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంతరంగాలు
బి) మూర్ఖులు
సి) పండితులు
డి) పామరులు
జవాబు:
సి) పండితులు

10. రిపువును దూరంగా ఉంచాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) మిత్రుడు
బి) గురువు
సి) విశ్వము
డి) శత్రువు
జవాబు:
డి) శత్రువు

11. శరధిలో జలం ఉంటుంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) కొలను
బి) ఝరి
సి) సముద్రం
డి) బావి
జవాబు:
సి) సముద్రం

12. నిత్యం సత్యం పలకాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అప్పుడు
బి) ఎల్లప్పుడు
సి) కొంత
డి) ఎప్పుడు
జవాబు:
బి) ఎల్లప్పుడు

13. తనువును రక్షించుకోవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) శరీరం
బి) జిహ్వ
సి) నాశిక
డి) కర్ణం
జవాబు:
ఎ) శరీరం

14. మదిలో మంచి ఉండాలి – గీత గీసిన పదానికి అర్ధం గుర్తించండి.
ఎ) మనసు
బి) నాలుక
సి) శరీరం
డి) తనువు
జవాబు:
ఎ) మనసు

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

15. ఎల్లప్పుడు బొంకు పలుకరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వాస్తవికం
బి) అబద్ధం
సి) నృతం
డి) నుతం
జవాబు:
బి) అబద్ధం

16. పయోనిధిలో రత్నాలు ఉంటాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఉదకం
బి) క్షీరం
సి) సముద్రం
డి) వారి
జవాబు:
సి) సముద్రం

17. ఆయన విజ్ఞానానికి నిధి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) నిలయం
బి) కొలను
సి) కోవెల
డి) మందారం
జవాబు:
ఎ) నిలయం

పర్యాయపదాలు :

18. రాజు పరిపాలించాడు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) ఉమాపతి, గురుపతి
బి) నృపతి, పృథ్వీపతి
సి) నరపతి, అసురపతి
డి) వంద్యుడు, పశుపతి
జవాబు:
బి) నృపతి, పృథ్వీపతి

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

19. నందనుడు కార్యసమరుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) కుమారుడు, సుతుడు
బి) విశ్వము, జగము
సి) జలము, పుత్రిక
డి) చామంత, చాగరిత
జవాబు:
ఎ) కుమారుడు, సుతుడు

20. వారిధిలో రత్నములు ఉండును – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సముద్రం, జలధి
బి) వారి, మధుజ
సి) వారిజం, వారుణి
డి) పయోధరం, అవనిధి
జవాబు:
ఎ) సముద్రం, జలధి

21. కంఠీరవం గుహలో ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) కుక్కురం, పంచాస్యం
బి) సింహం, కేసరి
సి) పుండరీకం, శృగాలం
డి) ఖరం, శునకం
జవాబు:
బి) సింహం, కేసరి

22. బొంకు పలుకరాదు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) బాష్పం, అనృతం
బి) శ్రుతం, వాచం
సి) అబద్ధం, అసత్యం
డి) నృతం, వాగ్మి
జవాబు:
సి) అబద్ధం, అసత్యం

23. మిన్ను విరిగి పడింది – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) ఆకాశం, నింగి
బి) నభం, నాకం
సి) గగనం, నగం
డి) నగరం, ప్రాంతం
జవాబు:
ఎ) ఆకాశం, నింగి

24. ఘనము వర్షించు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) రవం, ధరణి
బి) మేఘము, పయోధరం
సి) గిరి, నఖము
డి) నభం, ధర
జవాబు:
బి) మేఘము, పయోధరం

25. గిరి పై నదులు ఉన్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) గిరిజ, గిరిక
బి) కొండ, అది
సి) అచలం, ఆధారం
డి) అధరం, జలధరం
జవాబు:
బి) కొండ, అది

ప్రకృతి – వికృతులు

26. విద్య నేర్పాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) విద్దె
బి) విద్యా
సి) వేద్య
డి) విత్తు
జవాబు:
ఎ) విద్దె

27. మానవులకు గరువము పనికిరాదు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) అహంకారం
బి) దుర్మతి
సి) గర్వము
డి) గెర్వము
జవాబు:
సి) గర్వము

28. అబ్బురం చూపాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) అంతరంగం
బి) అద్భుతం
సి) ఆశ్చర్యం
డి) ఆహార్యం
జవాబు:
బి) అద్భుతం

29. విజ్ఞానం అర్పించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) విరుదం
బి) విజానం
సి) విజ్ఞానం
డి) విన్నానం
జవాబు:
డి) విన్నానం

30. సత్యం పలకాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) శిత్తు
బి) సత్తు
సి) సత్తె
డి) సిత్త
జవాబు:
బి) సత్తు

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

31. గుణము పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) గోరము
బి) గొనము
సి) గునము
డి) గొరము
జవాబు:
బి) గొనము

32. చట్టం తెలియాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) సస్త్రం
బి) శాస్త్రం
సి) శేస్త్రం
డి) శస్త్రం
జవాబు:
బి) శాస్త్రం

నానార్థాలు :

33. రాజు కువలయానందకరుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చంద్రుడు, ప్రభువు
బి) సింహం, కేసరి
సి) కెరటం, వీచిక
డి) చంద్రుడు, బుధుడు
జవాబు:
ఎ) చంద్రుడు, ప్రభువు

34. అందరు ధర్మం ఆచరించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పుణ్యం, న్యాయం
బి) తనువు, తరుణి
సి) తాపసి, ధరణి
డి) వసుధ, పుణ్యం
జవాబు:
ఎ) పుణ్యం, న్యాయం

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

35. గుణం పొందాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) రోదరం, గుణము
బి) గురువు, గోపురం
సి) స్వభావం, వింటినారి
డి) జలజం, జలధరం
జవాబు:
సి) స్వభావం, వింటినారి

36. బుధుడు వంద్యుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పండితుడు, బుధగ్రహం
బి) ఒకయతి, మూర్యుడు
సి) పండితుడు, పచనుడు
డి) పరవశుడు, పండితుడు
జవాబు:
ఎ) పండితుడు, బుధగ్రహం

37. పాకం రుచిగా ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జలధి, గారె
బి) వంట, కావ్యపాకం
సి) తంట, తరుణి
డి) తాపసం, పార్థుడు
జవాబు:
ఎ) జలధి, గారె

వ్యుత్పత్తర్థాలు :

38. వారిజం సుమనోహరం – గీత గీసిన పదానికి వుత్పత్తి ఏది?
ఎ) నీటి నుండి పుట్టినది
బి) క్షీరము నండి పుట్టినది
సి) పయోధరం నుండి పుట్టినది
డి) వాసన నుంచి పుట్టినది
జవాబు:
ఎ) నీటి నుండి పుట్టినది

39. శరములకు నిలయమైనది – అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) ధరణి
బి) శరధి
సి) క్షీరధి
డి) అవని
జవాబు:
బి) శరధి

40. రంజింపచేయువాడు అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) నాకము
బి) సూత్రధారుడు
సి) రాజు
డి) నారదుడు
జవాబు:
సి) రాజు

41. పద్మము నుండి పుట్టినవాడు – ఈ వ్యుత్పత్తికి తగిన పదం ఏది?
ఎ) వారిధం
బి) పయోధరం
సి) క్షీరోనిది
డి) వారిజగర్భుడు
జవాబు:
డి) వారిజగర్భుడు

42. భాస్కరుడు – ఈ పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) కాంతిని కలుగజేయువాడు
బి) చీకటిని కలుగజేయువాడు
సి) అంతరంగం చూచువాడు
డి) అవనిని దర్శించువాడు
జవాబు:
ఎ) కాంతిని కలుగజేయువాడు

వ్యాకరణాంశాలు

సంధులు :

43. తలపెల్ల – ఈ పదాన్ని విడదీసి గుర్తించండి.
ఎ) తలపో + ఎల్ల
బి) తలపె + ఎల్ల
సి) తలప + యెల్ల
డి) తలపు + ఎల్ల
జవాబు:
బి) తలపె + ఎల్ల

44. గుణసంధిలో ఏకాదేశంగా వచ్చేవి
ఎ) గ, జ, డ, ద, లు
బి) ఏ, ఓ, అర్
సి) ఐ, ఔ
డి) య, వ, ర, ల
జవాబు:
బి) ఏ, ఓ, అర్

45. గసడదవాదేశ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) తల్లిదండ్రులు
బి) శీతోష్ణములు
సి) ఎత్తుపల్లాలు
డి) మృదుమధురములు
జవాబు:
ఎ) తల్లిదండ్రులు

46. విద్యాధికుడు వర్ధిల్లాలి – గీత గీసిన పదాన్ని విడదీసి గుర్తించండి.
ఎ) విద్ది + ధికుడు
బి) విద్యా + అధికుడు
సి) విద్యే + అధికుడు
డి) విద్య + ఆధికుడు
జవాబు:
బి) విద్యా + అధికుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

47. క్రింది వానిలో సరళములు గుర్తించండి.
ఎ) గ, జ, డ, ద, బ
బి) పర్గ, స, ల
సి) క, చ, ట, త, ప
డి) జ్ఞ, ఇ, న, ణ, మ
జవాబు:
ఎ) గ, జ, డ, ద, బ

48. క్రింది వానిలో వికల్ప సంధిని గుర్తించండి.
ఎ) వృద్ధి సంధి
బి) గుణసంధి
సి) ఉత్వసంధి
డి) ఇత్వతసంధి
జవాబు:
డి) ఇత్వతసంధి

49. క్రింది వానిలో ఇత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) వానికైన
బి) ముందడుగు
సి) అత్తమ్మ
డి) అమ్మహిమ
జవాబు:
ఎ) వానికైన

50. తనువెల్ల రక్షించి – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) పడ్వాది సంధి
బి) ఉత్వ సంధి
సి) అత్వ సంధి
డి) రుగాగమ సంధి
జవాబు:
బి) ఉత్వ సంధి

51. కింది వానిలో గుణసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) వంటాముదం
బి) దేవేంద్ర
సి) దివిజాగ్రజుడు
డి) ముందడుగు
జవాబు:
సి) దివిజాగ్రజుడు

52. శాస్త్రార్థం – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) విసర్గ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) సవర్ణదీర్ఘ సంధి

సమాసాలు :

53. మహాభాగ్యం – ఈ పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
ఎ) గొప్ప యొక్క భాగ్యం
బి) గొప్పదైన భాగ్యం
సి) భాగ్యము యొక్క గొప్ప
డి) భాగ్యము నందలి గొప్పదనం
జవాబు:
బి) గొప్పదైన భాగ్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

54. సప్తమీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) విచార కోవిదుడు
బి) సత్మీర్తి
సి) వారిజగర్భుడు
డి) శాస్త్రార్ధము
జవాబు:
ఎ) విచార కోవిదుడు

55. వినయభూషితుడు – ఈ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) వినయమునందు భూషితుడు
బి) వినయము కొరకు భూషితుడు
సి) వినయము చేత భూషితుడు
డి) వినయము వలన భూషితుడు
జవాబు:
సి) వినయము చేత భూషితుడు

56. విద్యాసంపన్నుడు – ఇది ఏ సమాసము?
ఎ) కర్మధారయం
బి) ద్వంద్వ
సి) తృతీయా తత్పురుషం
డి) బహువ్రీహి
జవాబు:
సి) తృతీయా తత్పురుషం

57. వారిజగర్భుడు – ఇది ఏ సమాసమో గుర్తించండి.
ఎ) ద్విగువు
బి) బహువ్రీహి
సి) కర్మధారయం
డి) ద్వంద్వ
జవాబు:
బి) బహువ్రీహి

58. ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) తత్పురుష
బి) ద్వంద్వ
సి) బహుబ్లిహి
డి) ద్విగువు
జవాబు:
ఎ) తత్పురుష

59. విజ్ఞానమునకు నిధి – ఈ పదానికి సమాసపదం గుర్తించండి.
ఎ) ప్రతి విజ్ఞానం
బి) విజ్ఞాన నిధి
సి) నిధి విజ్ఞానం
డి) అవిజ్ఞాన నిధి
జవాబు:
బి) విజ్ఞాన నిధి

60. రిపుగణము- ఈ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) రిపువు అనెడి గణము
బి) రిపువు చేత గణము
సి) రిపువు నందలి గణము
డి) రిపువు వలన గణము
జవాబు:
ఎ) రిపువు అనెడి గణము

61. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన సమాసం గుర్తించండి.
ఎ) ద్విగువు
బి) రూపకం
సి) అవ్యయీభావం
డి) తత్పురుష
జవాబు:
ఎ) ద్విగువు

62. సత్కీర్తి – ఇది ఏ సమాసం?
ఎ) అవ్యయీభావ సమాసం
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) బహున్రీహి సమాసం
డి) ద్వంద్వ సమాసం
జవాబు:
బి) విశేషణ పూర్వపద కర్మధారయం

గణవిభజన:

63. ద్విపదలో ఎన్ని పాదాలు ఉంటాయి?
ఎ) రెండు
బి) మూడు
సి) నాలుగు
డి) ఆరు
జవాబు:
డి) ఆరు

64. ద్విపదలో పాదానికి గల గణాలు ఎన్ని?
ఎ) 3
బి) 4
సి) 8
డి) 6
జవాబు:
బి) 4

65. ద్విపదలో పాదానికి గణాలు ఏవి?
ఎ) మూడు సూర్య గణాలు, రెండు ఇంద్ర గణాలు
బి) నాలుగు ఇంద్ర గణాలు
సి) మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం
డి) నాలుగు సూర్య గణాలు
జవాబు:
సి) మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం

66. గర్విత – ఈ పదానికి గణాలు గుర్తించండి.
ఎ) UII
బి) IUU
సి) UIU
డి) III
జవాబు:
బి) IUU

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

67. IIIU – ఇది ఏ గణం?
ఎ) జ గణం
బి) ఇంద్ర గణం
సి) సూర్య గణం
డి) భ గణం
జవాబు:
సి) సూర్య గణం

వాక్యాలు :

68. రామలక్ష్మణులు అన్నదమ్ములు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) సంక్లిష్ట వాక్యం
జవాబు:
సి) సంయుక్త వాక్యం

69. చదివితే ర్యాంకు వస్తుంది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అవర్ధక వాక్యం
బి) తద్ధర్మార్థక వాక్యం
సి) చేదర్థక వాక్యం
డి) శత్రర్థక వాక్యం
జవాబు:
సి) చేదర్థక వాక్యం

70. భూతకాల అసమాపక క్రియను ఏమంటారు?
ఎ) అప్యర్థకం
బి) తద్ధర్మార్థకం
సి) శత్రర్థకం
డి) క్వార్థం
జవాబు:
డి) క్వార్థం

71. హరిశ్చంద్రునిచేత సత్యం పలుకబడింది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ధాత్వర్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) కర్మణి వాక్యం

72. ఊరికి వెళ్ళవద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుమత్యర్థక వాక్యం
బి) ఆశీర్వార్ధకం
సి) విధ్యర్థక వాక్యం
డి) నిషేధార్థక వాక్యం
జవాబు:
డి) నిషేధార్థక వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

73. నీరు పల్లంగా ప్రవహించును – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) నిశ్చయాత్మక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
డి) తద్ధర్మార్థక వాక్యం

అలంకారాలు :

74. చిటపట చినుకులు టపటప పడెను – ఇందులోని అలంకారం ఏది?
ఎ) వృత్త్యనుప్రాస
బి) లాటానుప్రాస
సి) యమకం
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
బి) లాటానుప్రాస

75. నీకు వంద వందనాలు – ఇది ఏ అలంకారం?
ఎ) వృత్త్యనుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) లాటానుప్రాస
డి) యమకం
జవాబు:
బి) ఛేకానుప్రాస

76. అర్థ భేదంతో కూడిన హల్లుల జంట వెంటవెంటనే ప్రయోగింపబడితే – అది ఏ అలంకారం?
ఎ) ఛేకానుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) ఛేకానుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు

77. నగజ గజముపై వెళ్ళింది – ఇందులోని అలంకారం ఏది?
ఎ) ముక్తపదగ్రస్తం
బి) ఛేకానుప్రాస
సి) యమకం
డి) అంత్యానుప్రాస
జవాబు:
బి) ఛేకానుప్రాస

సొంతవాక్యాలు :

78. మిన్నంటు : నిత్యావసర వస్తువుల ధరలు మిన్నంటాయి.

79. ఉన్నతుడు : మహానీయుడు ఉన్నతుడిగా జీవిస్తాడు.

80. దురితం : పుణ్యకార్యాలతో దురితం దూరం అవుతుంది.

81. గుణములు : మానవులు మంచి గుణములను అలవరచుకోవాలి.

82. పరాక్రమం : యుద్ధంలో పరాక్రమం చూపాలి.

విశేషాంశాలు

1. వజ్రాయుధము : ఇది ఇంద్రుని ఆయుధం. మిక్కిలి శక్తివంతమైంది.

2. వారిజగర్భుడు : 1. తామరపూవు జన్మస్థానము (పుట్టు నెలవు) గా కలవాడు – బ్రహ్మ
2. తామరపూవు గర్భము నందు కలవాడు – విష్ణువు వారిజగర్భుడు – కమలగర్భుడు – వనజగర్భుడు – పద్మగర్భుడు – తమ్మిచూలి – పర్యాయపదములు.

3. వారిజాప్తుడు : తామర పూలకు చుట్టము – సూర్యుడు
వారిజాప్తుడు – కమలాప్తుడు – తామరసాప్తుడు – పద్మ బాంధవుడు – తమ్మి చుట్టము – పర్యాయపదములు.

4. షట్చక్రవర్తులు : ఆరుగురు చక్రవర్తులు.
1. హరిశ్చంద్రుడు 2. నలుడు 3. పురుకుత్సుడు 4. పురూరవుడు, 5. సగరుడు, 6. కార్తవీర్యార్జునుడు.

5. సప్తమహర్షులు : ఏడుగురు మహర్షులు.
1. వశిష్ఠుడు 2. అత్రి 3. గౌతముడు 4. కశ్యపుడు 5. భరద్వాజుడు 6. జమదగ్ని 7. విశ్వామిత్రుడు.

6. సప్తసముద్రములు : ఏడు సముద్రాలు
1. లవణ, 2. ఇక్షు, 3. సురా, 4. సద్వి, 5. దధి, 6. క్షీర, 7. జల.

7. షోడశ మహాదానములు : (పదహారు గొప్పదానములు)
1. గోదానము 2. భూదానము 3. తిలదానము 4. హిరణ్యదానము 5. రత్నదానము 6. విద్యాదానము 7. కన్యాదానము 8. దాసీదానము 9. శయ్యాదానము 10. గృహదానము 11. అగ్రహారదానము 12. రథదానము 13. గజదానము 14. అశ్వదానము 15. ఛాగ (మేక) దానము 16. మహిష (దున్నపోతు) దానము

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో.

AP State Syllabus 8th Class Telugu Important Questions 6th Lesson ప్రకృతి ఒడిలో

8th Class Telugu 6th Lesson ప్రకృతి ఒడిలో Important Questions and Answers

I. అవగాహన-ప్రతిస్పందన

అ) కింది అపరిచిత గద్యాలకు అడిగిన విధంగా జవాబులు ఇవ్వండి.

1. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

నిరుద్యోగ సమస్య నిజమునకు నిరక్షరాస్యుల వలన నేర్పడినది కాదు. విద్యావంతుల విషయముననే ఇది తీరని | సమస్యగా పరిణమించినది. ఈ విద్యావంతులు కుర్చీలలో కూర్చుండి గుమాస్తా పని చేయుటకే కుతూహలపడుచున్నారు. చదివిన చదువు కూడ అందుకే ఉపకరించుచున్నది. కావున మన విద్యావిధానము కొంత మారవలయును. విద్యావంతులు వృత్తి విద్యల నభ్యసించుట మేలు. ప్రభుత్వమువారి ప్రోత్సాహముతో వారు కుటీర పరిశ్రమలను నెలకొల్పుటయే ఈ సమస్యకు తగిన పరిష్కారము. వృత్తి విద్యల నభ్యసించినవారికి ప్రభుత్వమువారి తోడ్పాటు తప్పక లభించి తీరును.
ప్రశ్నలు :
1. నిరుద్యోగ సమస్య ఎవరి వలన ఏర్పడినది?
2. చదివిన చదువు ఎందుకుపయోగపడుచున్నది?
3. నేటి విద్యావిధానములో ఎట్టి మార్పు రావలెను?
4. ప్రభుత్వమువారు ఎవరికి తోడ్పడుచున్నారు?

2. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

పరిణయవేళ పుట్టినింటి వారు ధూతాంబకు వెలలేని రత్నాలహారమును బహుకరించిరి. దానిని ఆమె వ్రతదానమను నెపమున మైత్రేయునకిచ్చెను. తన భర్తకే దానిని ఆతడిచ్చుననియు, పోయిన సువర్ణభాండమునకు బదులు దానికంటే పదిమడుంగులు ఎక్కువ వెలగల తన రత్నాలహారమును తన భర్త వసంత సేనకు పంపుననియు ధూతాంబ తలచెను. తాను స్వయముగనే తన భర్తకిచ్చుచో అది స్త్రీ ధనమని యెంచి అతడు గ్రహించకపోవచ్చును. కావున ఆమె మైత్రేయుని ద్వారా దానిని పంపుటకు ఉపాయమును పన్నెను.

సుగుణవతియగు ధూతాంబ యొక్క పవిత్రాశయము నెరింగిన మైత్రేయు డాహారమును తీసికొనిపోయి చారుదత్తునకిచ్చెను. అనుకూలవతియగు భార్య వల్ల భర్త యొక్క కీర్తి ప్రతిష్ఠలు అభివృద్ధి నొందునని పల్కి అతడు తనకు స్త్రీ విమునకు ఆశపడవలసిన దుర్గతి పట్టెనని మిక్కిలి సిగ్గుచెందెను.
ప్రశ్నలు :
1. ధూతాంబ ఎవరికేమి ఇచ్చెను?
2. ధూతాంబ భర్త పేరేమి?
3. తన భర్త దేనికి బదులు ఏమి ఇచ్చునని ధూతాంబ తలచెను?
4. తాను స్వయముగా ఇచ్చుటకు ధూతాంబ ఏల సంశయించెను?

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

3. కింది పేరా ఆధారంగా కింది వాక్యములు సరైనవో కాదో (✓), (✗) గుర్తుల ద్వారా గుర్తించండి.

ఆ ముందుగా వ్యక్తి బాగుపడవలెను. ఆ వెనుక సంఘము బాగుండును. ముందుగా సంఘమును సంస్కరించవలెననుట వెట్టిమాట. మాటలో, చేతలో, తుదకు భావనలో సంస్కారముట్టిపడవలెను. అట్టి వ్యక్తులు పెక్కుమంది ఉన్నచో తనంతట తానే సంఘము ఉద్ధరింపబడును. వ్యక్తిని, తుదకు జాతిని తీర్చిదిద్దుకునే ఈ సంస్కారములు వాని ప్రణాళికను గమనించినచో తన పొట్టకు శ్రీరామరక్ష అనురీతిలో ఉండక వ్యక్తి శ్రేయస్సు, సమాజ కళ్యాణము పరస్పరము ముడివడియున్నవని విడివిడిగా లేవని తెలియచేయును. ఉదాహరణకు ప్రతి గృహస్థు విధిగా చేయవలసిన పంచమహాయజ్ఞములను చూడుడు. దేవయజ్ఞము నందు దేవతలను, ఋషి యజ్ఞమునందు ఋషులను, వారందించిన విజ్ఞానమును, పితృ యజ్ఞము నందు పితృదేవతలను కొలుచుచున్నాడు కదా! భూత యజ్ఞము నందు కుక్కలకు, కాకులకు బలివేయుచున్నాడు కదా! పొరుగువానిని ప్రేమింపమని ఇతర మతములన్నచో, పొరుగు ప్రాణిని కూడా ప్రేమింపమని ఈ సనాతన ధర్మము చాటుచున్నది. తనకుతాను వండుకొని తినువాడు కేవలము పాపమునే తినుచున్నాడని వేదము భాషించుట లేదా? ఇట్టి సూత్రములు సంస్కారములతో ముడివడియున్నవి.
ప్రశ్నలు :
1. వ్యక్తి బాగుపడినప్పుడే సంఘము బాగుపడుతుంది. (✓)
2. మాటలు, చేతలు, భావనలతో సంస్కారముట్టిపడదు. (✗)
3. ప్రతిగృహస్థు విధిగా పంచమహాయజ్ఞములను చేయవలెను. (✓)
4. పొరుగు వానిని ప్రేమించమని, పొరుగు ప్రాణిని ద్వేషించమని సనాతన ధర్మము చెప్పుచున్నది. (✗)

4. కింది పేరా చదివి, ఖాళీలు పూరించండి.

వ్యవసాయ భూముల్ని ఎలా ఉపయోగించుకుంటామో, జీవనోపాధి కోసం బీడు భూముల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవచ్చు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలూ ఉన్నాయి. గుజరాత్ లో అముల్ ప్రయోగం మన రాష్ట్రంలోనూ చేయవచ్చు. వృత్తికులాల వాళ్ళు అనేక మంది పరిస్థితులను బట్టి వృత్తులు మార్చుకుంటారు. చిత్రమేమంటే పేదవాళ్ళు ఎప్పుడూ విద్యా, వైద్య సౌకర్యాల గురించి అడగరు. భూములు లీజుకు ఇస్తే పెత్తందారులకు, దళారులకు, కుల పెద్దలకూ లాభం వస్తుంది. ఈ విషయంలో పేదలను చైతన్యపరచవలసిన ప్రభుత్వాలు కూడా చురుకైన పాత్ర నిర్వహించకపోవడం దురదృష్టకరం!
ఖాళీలు :
1. బీడు భూములంటే ……………
2. జీవనోపాధి కోసం రైతులు ఆధారపడేది ………..
3. విద్యా, వైద్య సౌకర్యాల గురించి అడగని వాళ్ళు ……………….
4. దళారులు చేసేపని ………..
జవాబులు:
1. పంటలు పండని భూములు
2. వ్యవసాయంపై
3. పేదవాళ్ళు
4. భూములను లీజుకు తీసుకోవడం

5. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

20వ శతాబ్దపు తొలి రోజులలో కుటుంబ నియంత్రణను బూతు మాట క్రింద జమకట్టేవారు. అటువంటి సమయంలో నర్స్ గా పనిచేసే మార్గరేట్ సాంగర్ అనేక కష్టాలకోర్చి కుటుంబనియంత్రణను గూర్చి ప్రచారం చేశారు. 1914లో “ఉమన్ రెబల్” అన్న వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఆమె యూరప్ కు వలసవెళ్ళి 1916లో తిరిగి వచ్చి అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలు పెట్టారు. పోలీసులు ఆమె ప్రారంభించిన ఆస్పత్రి పై దాడి చేశారు. అయినా ఆమె చలించకుండా 1923లో కుటుంబ నియంత్రణ పరిశోధనాశాలను నెలకొల్పారు.
ప్రశ్నలు :
1. కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్
2. ఏ సంవత్సరంలో, ఏ వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు?
3. మార్గరేట్ సాంగర్ ఎప్పుడు, ఎక్కడికి వలస వెళ్ళినది?
4. 1923లో సాంగర్ దేనిని నెలకొల్పినది?

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

6. కింది పేరా చదివి, అర్థవంతమైన నాలుగు ప్రశ్నలు రూపొందించండి.

బ్రౌనును ఒక వ్యక్తిగా గాక, పెద్ద సాహిత్య సంస్థగా భావించడం అవసరం. యుగసంధిలో నిలిచిన ఈ వ్యక్తి అనేకానేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించి, అవి ఎక్కడున్నాసరే, ఎంత ధనవ్యయమైనా సరే, లెక్క పెట్టకుండా, తన ఉద్యోగుల ద్వారా సంపాదించాడు. కొందరు పండితులను సమీకరించి, వారికి జీతభత్యాలిచ్చి, శుప్రతులు వ్రాయించి, కొన్నిటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు. ‘విశ్వదాభిరామ వినురవేమ’ పద్యం తెలియని తెలుగువాడు లేడు. అయితే ఈ పద్యాలను మొదట తెలుగువాళ్ళకు పరిచయం చేసినది విదేశీయుడైన బ్రౌను. బ్రౌను పేరు స్మరించగానే మనకు ముందు స్ఫురించేది బ్రౌనుకు నిఘంటువు. ఈ కృషి 1832లో ఆరంభించబడి, 1853లో పూర్తి అయి ప్రథమ ముద్రణ అయింది. ఈ కృషిలో బ్రౌనుకు ఏనుగుల వీరాస్వామి సహాయం పొందాడు. వీరాస్వామి రచించిన కాశీయాత్ర | గురించిన పుస్తకం చారిత్రక దృష్ట్యా విలువైనది.
ప్రశ్నలు:
1. తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఎట్లా పరిగణించడం భావ్యం?
2. బ్రౌను సంపాదించిన పుస్తకాలను ఏమంటారు?
3. పండితులతో బ్రౌను చేయించిన పనులేమిటి?
4. నిఘంటువు ప్రథమ ముద్రణ ఎప్పుడు వచ్చింది?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“ప్రకృతి ఒడిలో” అనే పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
జవాబు:
‘ప్రకృతి ఒడిలో’ అనే పాఠ్యభాగ రచయిత కొడవటిగంటి కుటుంబరావు. ఈయన 1909 – 1980 మధ్యకాలంలో జీవించారు. వీరు ప్రముఖ కథారచయిత, గల్పికలను ఎన్నో రాశారు. వారి కథలో సహజత్వం గోచరిస్తుంది. వీరి రచనల్లో చదువు, అద్దెకొంప, షావుకారు సుబ్బయ్య మొదలైనవి ప్రసిద్ధి చెందాయి. వీరి రచన సరళంగాను, మనోహరంగాను ఉంటుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

ప్రశ్న 2.
శాస్త్రజ్ఞులకూ (శాస్త్రవేత్తలకూ), శాస్త్రజ్ఞానానికి గల సంబంధాన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటనకూ వెనుక ఒక భౌతిక కారణం ఉంటుందనీ, దాన్ని తెలుసుకోడానికి వీలు అవుతుందనీ శాస్త్రజ్ఞుడు నమ్ముతాడు. శాస్త్రజ్ఞుడు రుజువయ్యే అవకాశం ఉంటే ప్రతి సిద్ధాంతాన్ని పరిశోధిస్తాడు. శాస్త్రజ్ఞులు సత్యాన్వేషణకూ, విషయజ్ఞానానికి ప్రయత్నిస్తారు. శాస్త్రజ్ఞానం వల్ల మనకు ప్రకృతి రహస్యాలు తెలుస్తాయి. శాస్త్రజ్ఞుని శాస్త్రజ్ఞానం వల్ల, మన లౌకిక జీవితాలు పై అంతస్తుకు చేరతాయి.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
ప్రకృతి అందాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
ప్రకృతి ఎంతో అందమైనది. ప్రకృతి భూమాతకు ఎన్నో అందాలను తెచ్చి పెడుతుంది. ప్రకృతిలో రకరకాల చెట్లు ఉంటాయి. కొన్ని పూలమొక్కలు, కొన్ని ఔషధపు మొక్కలు ఉంటాయి. అట్లే ఎన్నో రకాల పక్షులు సంచరిస్తాయి. అవన్నీ తమ అందాలతో కనువిందు చేస్తాయి. కోయిలల కిలకిలారావాలు మనసున్న మనుషులను అలరిస్తాయి. కొన్ని రకాల పక్షులు పంటలను రక్షిస్తాయి. కొన్ని ప్రాణులు పర్యావరణాన్ని రక్షిస్తాయి. నదులు జీవకోటికి జీవనాధారం. నదులు అందరికీ నీటిని అందిస్తాయి. వాటిని మనం కలుషితం కాకుండా చెయ్యాలి.

ప్రకృతిలో లభించే కొన్ని వస్తువులను మానవుడు తన స్వార్థం కోసం వినియోగించుకుంటున్నాడు. అడవులను నరికివేస్తున్నాడు. పక్షులను వేటాడుతున్నాడు. ఇది మంచిది కాదు. మనమంతా పర్యావరణాన్ని రక్షించాలి. ఇది మన కర్తవ్యం.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
నీవు చూసిన ఒక ప్రకృతి దృశ్యాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విజయనగరం,
x x x x x

ప్రియమైన మిత్రుడు నరసింహారావుకు,

నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది నేను ఇటీవల కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రానికి వెళ్ళాను. గిద్దలూరు దాటిన తరువాత నల్లమల అడవి వస్తుంది. అంతా లోయలు, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పచ్చని చెట్లు అలరించాయి. లోయలు కనువిందు చేశాయి. మధ్యలో సొరంగమార్గం మరువలేనిది. పక్షుల కిలకిలారావాలు అలౌకిక ఆనందాన్ని పొందేలా చేశాయి. నీవు కూడా చూచిన ఒక ప్రకృతి దృశ్యాన్ని వివరిస్తూ లేఖ రాయి.. పెద్దలకు నమస్కారాలు తెలుపుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x x x

చిరునామా :
జి. నరసింహారావు,
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
వినుకొండ, ప్రకాశం జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

8th Class Telugu 6th Lesson ప్రకృతి ఒడిలో 1 Mark Bits

1. ప్రథమా విభక్తి మీది ప్రత్యయాలకు కచటతపలు పరమైతే వాటి స్థానంలో గసడదవలు ఆదేశంగా వస్తాయి. (ఇది ఏ సంధి సూత్రం) (S.A. III – 2016-17)
ఎ) సరళాదేశసంధి
బి) ద్రుతప్రకృతికసంధి
సి) గసడదవాదేశసంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
సి) గసడదవాదేశసంధి

2. జయ ఇంటికి వెళ్లింది. విజయ బడికి వెళ్లింది. (పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి.) (S.A. III – 2016-17)
ఎ) జయ, విజయ ఇంటికి వెళ్లారు.
బి) జయ ఇంటికి, విజయ బడికి వెళ్లారు.
సి) విజయ, జయ బడికి వెళ్లారు.
డి) జయ, విజయలు ఇళ్లకు వెళ్లారు.
జవాబు:
బి) జయ ఇంటికి, విజయ బడికి వెళ్లారు.

భాషాంశాలు – పదజాలం

అర్థాలు :

3. అభినందన తెలపాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పొగడ్త
బి) అగడ్త
సి) అంజన
డి) విషయం
జవాబు:
ఎ) పొగడ్త

4. ఇంటి ఆకృతి బాగుంది – గీత గీసిన పదానికి అరం గుర్తించండి.
ఎ) ఆకారం
బి) వికారం
సి) సకారం
డి) యకారం
జవాబు:
ఎ) ఆకారం

5. మనుష్యుల మధ్య సామ్యం ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆకృతి
బి) పోలిక
సి) చూపు
డి) తెలివి
జవాబు:
బి) పోలిక

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

6. రుజువు కావాలి – గీత గీసిన పదానికి అర్థం పదాలు గుర్తించండి.
ఎ) నిదర్శనం
బి) ఆకాంక్ష
సి) ఆకారం
డి) సంప్రదాయం
జవాబు:
ఎ) నిదర్శనం

7. పాలు పేరుకొనుట జరిగింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వారిధి, భూరుహం
బి) గగనం, నాశం
సి) నభం, నాకం
డి) నింగి, నభం
జవాబు:
డి) నింగి, నభం

8. పసిగట్టుట జరిగింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) గుర్తించడం
బి) పరిశీలించడం
సి) ఆదరించడం
డి) తిరస్కరించడం
జవాబు:
బి) పరిశీలించడం

9. విధిగా రావాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆకృతిగా
బి) తప్పనిసరిగా
సి) అప్పుడప్పుడు
డి) అనుకూలంగా
జవాబు:
బి) తప్పనిసరిగా

10. సాధనం అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఉపకారం
బి) ఉపకరణం
సి) ఉపన్యాసం
డి) ఉపయోగం
జవాబు:
బి) ఉపకరణం

పర్యాయపదాలు :

11. కన్ను జ్ఞానేంద్రియం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) పక్షి, నయనం
బి) చక్షువు, నయనం
సి) నాశిక, నయనం
డి) అక్షి, కుక్షి
జవాబు:
బి) చక్షువు, నయనం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

12. నీరు ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) జలం, వారి
బి) జారి, క్షీరం
సి) దుగ్ధం, దధి
డి) ఘృతం, క్షీరం
జవాబు:
ఎ) జలం, వారి

13. సముద్రం భీకరం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) క్షీరం, ధరణి
బి) జలధి, అవని
సి) అంబుధి, అంబరం
డి) సాగరం, జలధి
జవాబు:
డి) సాగరం, జలధి

14. తరంగం ఉరికింది – గీత గీసిన పదానికి పర్యాయ గుర్తించండి.
ఎ) అల, వీచిక
బి) అంతరంగం, అవని
సి) దానం, దారి
డి) పధం, తపన
జవాబు:
ఎ) అల, వీచిక

15. ఆకాశం నిర్మలంగా ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వాసన చూచుట
బి) చీల్చుట
సి) నానబెట్టుట
డి) గడ్డకట్టుట
జవాబు:
డి) గడ్డకట్టుట

16. గాలి వీచింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) తరువు, తరుణి
బి) వాయువు, పవనం
సి) నాశిక, అనంతం
డి) ఆకారం, ఆకృతి
జవాబు:
బి) వాయువు, పవనం

ప్రకృతి – వికృతులు :

17. ఆశ్చర్యం పొందాను – అనే పదానికి వికృతి పదం ఏది?
ఎ) అచ్చెరువు
బి) ఆకారం
సి) ఆచెరం
డి) అచ్చెరం
జవాబు:
బి) ఆకారం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

18. బుద్ధి ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) బుద్ధి
బి) బిద్దు
సి) బౌద్ధ
డి) బౌద్ధ
జవాబు:
ఎ) బుద్ధి

19. ఆకసంలో రవి ఉన్నాడు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) అనంతం
బి) అబ్బురం
సి) ఆకాశం
డి) ఆకారం
జవాబు:
సి) ఆకాశం

20. చట్టం గౌరవించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) శర్మ
బి) శాస్త్రం
సి) శాసనం
డి) శాస్త్రి
జవాబు:
బి) శాస్త్రం

21. ధర్మం ఆచరించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం
ఎ) దమ్మం
బి) దరమ
సి) గరమ
డి) మరద
జవాబు:
ఎ) దమ్మం

నానార్థాలు :

22. మిత్రుడు ప్రకాశించాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) సూర్యుడు, స్నేహితుడు
బి) వైరి, విరోధి
సి) పగతుడు, చిరంజీవి
డి) చినుకు, చింత
జవాబు:
ఎ) సూర్యుడు, స్నేహితుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

23. వర్షం వచ్చింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వాన, సంవత్సరం
బి) వాకిలి, వారుణి
సి) వారుణం, వారిధి
డి) కల్పం, కాంతం
జవాబు:
ఎ) వాన, సంవత్సరం

24. చరణం బాగుంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పాదం, పద్యపాదం
బి) వేదభావం, విరించి
సి) అనంతం, అనం
డి) విస్మయం, విరామం
జవాబు:
ఎ) పాదం, పద్యపాదం

25. ధర్మం పాటించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పుణ్యం, న్యాయం
బి) అధర్మం, అపకారి
సి) నృతం, అనృతం
డి) విదతి, వింజారం
జవాబు:
ఎ) పుణ్యం, న్యాయం

26. కరంతో పని చెయ్యాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చేయి, తొండము
బి) కిరణము, కాంతి
సి) కలవ, కానుగ
డి) విధి, విధానం
జవాబు:
ఎ) చేయి, తొండము

27. కాలం చెల్లాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కానుగ, కాటుక
బి) సమయం, మరణం
సి) మంచు, హిమం
డి) హేమం, కాంతి
జవాబు:
బి) సమయం, మరణం

28. దేవుడే దిక్కు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) దిశ, శరణు
బి) ధర, ధరణి
సి) దాన, విరిగి
డి) నిశ, నిద్ర
జవాబు:
ఎ) దిశ, శరణు

వ్యుత్పత్తర్థాలు :

29. పర్వత రాజు కుమార్తె – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) పార్వతి
బి) ఊర్వశి
సి) జలధి
డి) వైదేహి
జవాబు:
ఎ) పార్వతి

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

30. నీటిని ధరించునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) వాసవి
బి) కాసారం
సి) వారిధి
డి) కౌముది
జవాబు:
సి) వారిధి

31. భూజము – అనే పదానికి వ్యుత్పత్తి ఏది?
ఎ) ఆకృతి లేనిది
బి) అనంతమైనది
సి) భూమి నుండి పుట్టినది
డి) భూమిలో దొరికినది
జవాబు:
సి) భూమి నుండి పుట్టినది

32. ఉర్వి – అనే పదానికి వ్యుత్పత్తి ఏది?
ఎ) మధురమైది
బి) ఫలవంతమైనది
సి) విశాలమైనది
డి) ఆకృతిలేనిది
జవాబు:
సి) విశాలమైనది

33. అగ్ని – అనే పదానికి వ్యుత్పత్తి ఏది?
ఎ) మండెడి స్వభావం కలది
బి) మంచుతో కూడినది
సి) మారాము చేయునది
డి) ఆకలి తీర్చునది
జవాబు:
ఎ) మండెడి స్వభావం కలది

వ్యాకరణాంశాలు

సంధులు:

34. అత్తటి – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) అత్వసంధి
సి) ఉత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
ఎ) త్రికసంధి

35. సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) రాజర్షి
బి) జ్ఞానాభివృద్ధి
సి) జ్ఞానోదయం
డి) ప్రాప్రోదయం
జవాబు:
బి) జ్ఞానాభివృద్ధి

36. అప్పుడప్పుడు – ఇది ఏ సంధి?
ఎ) ఆమ్రేడిత సంధి
బి) త్రికసంధి
సి) అత్వసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
బి) త్రికసంధి

37. ద్విరుక్తము యొక్క పరరూపం గుర్తించండి.
ఎ) ఆమ్రేడితం
బి) త్రికం
సి) శబ్దపల్లవం
డి) సాధువు
జవాబు:
ఎ) ఆమ్రేడితం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

38. ఉష్ణోగ్రత పెరిగింది – ఇది ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) అత్వసంధి
సి) యణాదేశ సంధి
డి) గుణసంధి
జవాబు:
డి) గుణసంధి

39. విద్యుచ్ఛక్తి – ఇది ఏ సంధి?
ఎ) అత్వసంధి
బి) శ్చుత్వసంధి
సి) షుత్వసంధి
డి) టుగాగమ సంధి
జవాబు:
బి) శ్చుత్వసంధి

40. ప్రత్యామ్నాయం – దీనిని విడదీయండి.
ఎ) ప్రతో + ఆమ్నాయం
బి) ప్రతి + ఆమ్నాయం
సి) ప్రతె + ఆమ్నాయం
డి) ప్రత + ఆమ్నాయం
జవాబు:
బి) ప్రతి + ఆమ్నాయం

41. విద్యార్జన – ఇది ఏ సంధి?
ఎ) ఇత్వసంధి
బి) సవర్ణదీర్ఘ సంధి
సి) గుణసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) సవర్ణదీర్ఘ సంధి

సమాసాలు :

42. కళాదృష్టి – దీనికి విగ్రహవాక్యం ఏది?
ఎ) కళ యందు దృష్టి
బి) కళ చేత దృష్టి
సి) కళ కొరకు దృష్టి
డి) కళ వలన దృష్టి
జవాబు:
ఎ) కళ యందు దృష్టి

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

43. ప్రార్థనా సమావేశం – దీనికి విగ్రహవాక్యం ఏది?
ఎ) ప్రార్ధన కొరకు సమావేశం
బి) ప్రార్ధన యందు సమావేశం
సి) ప్రార్థన చేత సమావేశం
డి) ప్రార్ధనతో సమావేశం
జవాబు:
ఎ) ప్రార్ధన కొరకు సమావేశం

44. షష్ఠీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) గ్రామగతుడు
బి) ప్రకృతి ధర్మం
సి) విద్యాహీనుడు
డి) కళాతృష్ణ
జవాబు:
బి) ప్రకృతి ధర్మం

45. ద్విగు సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) మంచిమాట
బి) వంద సంవత్సరాలు
సి) సాగరసంగమం
డి) కళారాధన
జవాబు:
బి) వంద సంవత్సరాలు

46. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన సమాసం
ఎ) ద్విగు సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) అవ్యయీభావ సమాసం
డి) తత్పురుష సమాసం
జవాబు:
ఎ) ద్విగు సమాసం

47. సంసార సాగరం – ఇది ఏ సమాసం?
ఎ) రూపక సమాసం
బి) అవ్యయీభావ సమాసం
సి) కర్మధారయ సమాసం
డి) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
జవాబు:
ఎ) రూపక సమాసం

గణ విభజన:

48. IUI- ఇది ఏ గణము?
ఎ) జ గణం
బి) త గణం
సి) స గణం
డి) య గణం
జవాబు:
ఎ) జ గణం

49. త గణం – దీనికి గణాలు ఏవి?
ఎ) IUI
బి) UUU
సి) UUI
డి) UII
జవాబు:
సి) UUI

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

50. సూర్య గణాలు ఎన్ని?
ఎ) నాలుగు
బి) రెండు
సి) ఆరు
డి) ఎనిమిది
జవాబు:
బి) రెండు

51. IIUI- ఇది ఏ గణము?
ఎ) నగము
బి) సలము
సి) నలము
డి) యలము
జవాబు:
బి) సలము

52. అవ్విధం – ఇది ఏ గణము?
ఎ) IUI
బి) UIU
సి) III
డి) IIU
జవాబు:
బి) UIU

వాక్యాలు :

53. దయతో అనుమతించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) పాక్షికార్థక వాక్యం
డి) తమున్నర్థక వాక్యం
జవాబు:
సి) పాక్షికార్థక వాక్యం

54. రవి పాఠం చదువగలడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్తరి వాక్యం
బి) హేత్వర్థక వాక్యం
సి) సామర్థార్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
సి) సామర్థార్థక వాక్యం

55. తప్పక పాఠం వింటాను – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుకరణ వాక్యం
బి) నిశ్చయార్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) నిశ్చయార్థక వాక్యం

56. అందరు వెళ్ళండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కరణి వాక్యం
బి) కరరి వాక్యం
సి) ఆత్మార్థక వాక్యం
డి) విధ్యర్థక వాక్యం
జవాబు:
డి) విధ్యర్థక వాక్యం

అలంకారాలు :

57. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పండి.
ఎ) ఛేకానుప్రాసాలంకారం
బి) రూపకాలంకారం
సి) యమకాలంకారం
డి) వృత్త్యనుప్రాసాలంకారం
జవాబు:
బి) రూపకాలంకారం

AP Board 8th Class Telugu Important Questions Chapter 6 ప్రకృతి ఒడిలో

58. ఈ రాజు సాక్షాత్తు శంకరుడే – ఇందులోని అలంకారం గుర్తించండి.
ఎ) అనన్వయ
బి) రూపక
సి) అతిశయోక్తి
డి) అర్థాంతరన్యాస
జవాబు:
బి) రూపక

సొంతవాక్యాలు :

59. అభినందనలు : పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం వల్ల నాకు అభినందనలు అందాయి.

60. పసిగట్టు : పాములు మనిషి జాడను పసిగడతాయి.

61. వైపరీత్యము : సముద్ర తీరాన ఉన్నవారికి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ.

62. ప్రకంపన : ఈ మధ్య చైనాలో భూ ప్రకంపనలు తరచుగా వస్తున్నాయి.

63. ప్రతిపాదించు : మా గురువులు ప్రతిపాదించిన విషయాల్ని మేము తప్పక అంగీకరిస్తాము.

64. హడావిడిగా : నేను ఈ రోజు బడికి హడావిడిగా వచ్చాను.

65. రుజువు చేయు : శాస్త్రజ్ఞులు విషయాన్ని రుజువు చేసి చూపిస్తారు.

66. అంచనా వేయు : నా మిత్రునికి రాబోయే విషయాల్ని అంచనావేయు శక్తి ఉంది.

67. నిరూపించు : శాస్త్రజ్ఞులు విషయాన్ని నిరూపిస్తారు.

విశేషాంశాలు

1. ప్రకృతి వైపరీత్యాలు అంటే : ప్రకృతిలో ఏర్పడే విపరీత పరిస్థితులు భూకంపము, సునామీ, వరదలు, తుపానులు మొదలైనవి.

2. విశ్లేషణ శక్తి అంటే : విషయాన్ని విభజించి పరిశీలించే శక్తి.

3. శాస్త్ర దృష్టి అంటే : ప్రతి సంఘటనకూ వెనుక ఉన్న భౌతిక కారణాన్ని పరిశోధించి తెలిసికొనే దృష్టి.

4. కళాదృష్టి అంటే : సౌందర్య రసాస్వాదన దృష్టి.

5. భ్రమలు అంటే : లేనిదానిని ఉన్నట్లుగా భ్రాంతి చెందే దృష్టి.

6. ఇంద్రియ జ్ఞానం అంటే : మన ఇంద్రియాలు గ్రహించే జ్ఞానం.

7. జ్ఞానమంటే : సమాచారాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం కాదు. జ్ఞానం అంటే ఆ జ్ఞానం కల్గించిన విచక్షణాశక్తితో గ్రహించడం.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ.

AP State Syllabus 8th Class Telugu Important Questions 5th Lesson ప్రతిజ్ఞ

8th Class Telugu 5th Lesson ప్రతిజ్ఞ Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అపరిచిత పద్యాలు చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. మేడిపండు జూడ మేలిమై యుండును
పొట్టవిప్పిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగుర
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు :
1. పిరికివాడు దేనితో పోల్చబడినాడు?
జవాబు:
పిరికివాడు మేడిపండుతో పోల్చబడినాడు.

2. మేడిపండు పైకి ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
మేడిపండు పైకి చక్కగా ఉంటుంది.

3. మేడిపండు లోపల ఎలా ఉంటుంది?
జవాబు:
మేడిపండు లోపల పురుగులతో కూడి ఉంటుంది.

4. ఈ పద్యం వల్ల తెలిసిందేమిటి?
జవాబు:
ఈ పద్యంవల్ల పిరికివాని స్వభావం తెలుస్తోంది.

2. ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కీయదా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
1. తేనెటీగ తేనెను ఎవరికి ఇస్తున్నది?
జవాబు:
తేనెటీగ తేనెను తెరువరికి (బాటసారికి) ఇస్తున్నది.

2. తాను తినక, కూడబెట్టువారి నేమందురు?
జవాబు:
తాను తినక, కూడబెట్టువారిని పిసినారి అంటారు.

3. పై పద్యము నందలి భావమేమి?
జవాబు:
కూడబెట్టిన ధనం సద్వినియోగం చేయకపోతే వృథా అవుతుంది.

4. కూడబెట్టిన ధనము ఎట్లు సద్వినియోగమగును?
జవాబు:
కూడబెట్టిన ధనం దానం చేసినా లేదా తాను అనుభవించినా సద్వినియోగం అవుతుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

3. అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
1. అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది?
జవాబు:
అంటూ ఉంటే రాగం అతిశయిల్లుతుంది.

2. తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
జవాబు:
తింటూ ఉంటే వేపాకు తీయనవుతుంది.

3. సాధనతో సమకూరేవి ఏవి?
జవాబు:
సాధనతో పనులు సమకూరుతాయి.

4. ఈ పద్యానికి మకుటం ఏది?
జవాబు:
‘విశ్వదాభిరామ వినురవేమ’ అనేది ఈ పద్యానికి మకుటం.

4. మేరు నగము వంటి ధీరత కలిగియు
పరమశివుడు తనదు పదములంట
ఇంచుకంత చంచలించె పర్వతరాజు
దేవదేవుడన్న భావనమున.
ప్రశ్నలు:
1. పర్వతరాజు ఎటువంటి ధీరత గలవాడు?
జవాబు:
పర్వతరాజు మేరు నగము వంటి ధీరత గలవాడు.

2. పర్వతరాజు పాదాలకు నమస్కరించ వచ్చినదెవరు?
జవాబు:
పర్వతరాజు పాదాలకు నమస్కరించ వచ్చినది పరమ శివుడు.

3. ఇంచుకంత చలించినది ఎవరు?
జవాబు:
ఇంచుకంత చలించినది పర్వతరాజు.

4. పర్వతరాజు శివుని ఎట్లా భావించాడు?
జవాబు:
పర్వతరాజు శివుని దేవదేవుడుగా భావించాడు.

5. ఆత్మ శుద్ధి లేని ఆచారమదియేల?
భాండ శుద్ధి లేని పాకమేల?
చిత్త శుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
1. పాకమునకు దేని శుద్ధి అవసరం?
జవాబు:
పాకమునకు భాండశుద్ధి అవసరం.

2. చిత్తశుద్ధి లేకుండా దేనిని చేయకూడదు?
జవాబు:
చిత్తశుద్ధి లేకుండా శివపూజలు (దైవపూజలు) చేయకూడదు.

3. ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘శుద్ధి’ (నిర్మలత్వం) అని పెట్టవచ్చు.

4. ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు?
జవాబు:
ఈ పద్యాన్ని రాసిన కవి వేమన.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

6. మఱవవలెఁ గీడు నెన్నఁడు
మఱవంగా రాదు మేలు మర్యాదలలోఁ
దిరుగవలె సర్వజనములం
దరిఁప్రేమన్ మెలగవలయుఁ దరుణి కుమారీ !
ప్రశ్నలు :
1. దేనిని మరచిపోవాలి?
జవాబు:
కీడును మరచిపోవాలి.

2. దేనిని మరువరాదు?
జవాబు:
మేలును మరువరాదు.

3. అందరి ఎడల ఎట్లా మెలగాలి?
జవాబు:
అందరి యెడల మర్యాదలతోను, ప్రేమతోను మెలగాలి.

4. ఈ పద్యం ఏ శతకం లోనిది?
జవాబు:
ఈ పద్యం ‘కుమారీ శతకం’ లోనిది.

7. ఈ కింది పరిచిత గేయాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనే లేదని
కష్టజీవులకు, కర్మవీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తి వాక్యములు సంధానిస్తూ,
స్వర్ణ వాద్యములు సంరావిస్తూ,
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్.
ప్రశ్నలు:
1. భావివేదములు, జీవనాదములు దేనినుండి పుడతాయి?
జవాబు:
బాధచే పీడింపబడిన జీవితం.

2. భక్తి, ముక్తి, రక్తి వంటి పదాలు వాక్యం చివర ఉంటే దానిని ‘అంత్యప్రాస’ అంటారు. అటువంటి మూడు పదాలు పై గేయంలో ఉన్నాయి వెతికి రాయండి.
జవాబు:
నిర్దేశిస్తూ, సంధానిస్తూ, సంరావిస్తూ.

3. ఏ సౌందర్యం గొప్పదని కవి ఉద్దేశం?
జవాబు:
శ్రమైక జీవన సౌందర్యం

4. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై మాటలు ఎవరివి ?

8. ఈ కింది గేయం చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనే లేదని
కష్ట జీవులకు కర్మ వీరులకు
నిత్య మంగళం నిర్దేశిస్తూ
స్వస్తి వాక్యములు సంధా నిస్తూ
స్వర్ణ వాద్యములు సంరాలిస్తూ
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
ప్రశ్నలు
1. కవి ఎవరికి మంగళం నిర్దేశించారు?
జవాబు:
కష్టజీవులకు, కర్మవీరులకు

2. దేనికి సమానమైనది లేదని చెప్పినారు?
జవాబు:
శ్రమైక జీవన సౌందర్యానికి

3. ఈ గేయం రచయిత ఎవరు?
జవాబు:
శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ.శ్రీ)

4. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
‘సంరావిస్తూ’ అనగానేమి?

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

9. కింది అపరిచిత గేయం చదవండి. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి. (S.A.III-2016-17)
అడవిలేక అవని లేదు – చెట్టులేక చెలిమి లేదు
మొక్క మానై ఎదగకుంటే – జీవకోటికి బతుకు లేదు
చెట్టు చేమను రక్షించుకుంటూ – బతుకుదీపం కాపాడుకుంటూ
తోడుగుందామా అడవికి ఊపిరౌదామా – తోడుగుందామా అడవికి ఊతమౌదామా
ప్రశ్నలు
1. అవని అంటే అర్థం ఏమిటి?
జవాబు:
భూమి

2. జీవకోటి బతకాలంటే ఏమేమి కావాలి?
జవాబు:
చెట్లు, ఆహారం

3. చెట్లను రక్షించడం వల్ల ప్రయోజనాలు ఏవి?
జవాబు:
గాలి, ఆహారం దొరుకుతాయి.

4. పై గేయం ఆధారంగా ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘మాను’ అంటే ఏమిటి?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘ప్రతిజ్ఞ’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి. (S.A. I – 2019-2017)
జవాబు:
‘ప్రతిజ్ఞ’ పాఠ్యభాగ రచయిత శ్రీశ్రీ. ఈయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. వీరు 1910వ సంవత్సరంలో విశాఖపట్టణంలో జన్మించారు. తన పద్దెనిమిదవ సంవత్సరంలోనే ‘ప్రభవ’ కావ్యాన్ని రచించాడు. వీరి రచనల్లో ‘మహాప్రస్థానం’ మిక్కిలి ప్రసిద్ధి చెందింది. వీరు ఎన్నో నాటకాలు, రేడియో నాటికలు, నవలలు రచించారు. వీరి ఆత్మకథ పేరు ‘అనంతం’. కార్మికకర్షక లోకానికి ప్రతీకగా ఈ మహాకవి నిలిచారు. అభ్యుదయ కవిత్వానికి నాంది పలికారు.

ప్రశ్న 2.
శ్రీశ్రీ గారి అభ్యుదయ దృక్పథాన్ని వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీశ్రీ గారికి సమున్నతమైన స్థానం ఉంది. కార్మికకర్షక జీవితాలను, వారి బాధలను కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు. అభ్యుదయ కవిత్వానికి వారధిగా నిలిచారు. కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదని నినదించారు. అక్షరాలను ఆయుధాలుగా చేసుకున్నారు. పదునైన వాగ్భాణాలను సమాజంపై సంధించారు. ప్రజాకవిగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. భావి కవులకు మార్గదర్శకంగా నిలిచారు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
ఈ కవిత మీకు ఎందుకు నచ్చిందో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
ఈ కవితలో శ్రీశ్రీగారు కార్మికులను, కర్షకులను నాయకులుగా చూపుతూ రాయటం నాకు చాలా నచ్చింది. బాగా ఆలోచించి చూస్తే కర్షకులు, కార్మికులూ ప్రపంచ సౌభాగ్యం కోసం, ఎంత కష్టపడుతున్నారో, ఎంతగా చెమటను చిందిస్తున్నారో, ఎంతగా త్యాగం చేస్తున్నారో మనకు అర్థం అవుతుంది.

రైతులు పంటలు పండించకపోతే, మనకు తిండి దొరికేది కాదు అని అనుకున్నప్పుడు, రైతులు గొప్ప త్యాగమూర్తులనీ, నిజంగానే వారి చెమటకు విలువ కట్టలేమని అనిపిస్తుంది.

అలాగే కార్మికులు తాము కష్టించి మనకు కావలసిన వస్తువులను తయారుచేసి ఇస్తున్నారు. వారి కళ్ళల్లోని అగ్నికీ, కన్నీటికీ విలువ కట్టలేమని శ్రీశ్రీ చెప్పిన మాట, ఎంతో సత్యమనిపించింది. అందుకే ఈ కవిత నచ్చింది. తాను రాసిన కవితను శ్రీశ్రీ కార్మికలోకపు కళ్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి అంకితమివ్వడం నాకు నచ్చింది.

ఈ కవితలోని అంత్యప్రాసలూ, అనుప్రాసలూ గేయరచనకు ఎంతో అందాన్ని ఇస్తున్నాయి.

గేయంలోని కవి ఆవేశం, ఆయనకు కర్షక కార్మికులపై గల అనురాగం ఎంతో నచ్చింది. తన నవ్య కవిత్వానికి వృత్తి పనివారల చిహ్నాలే భావం, భాగ్యం, ప్రణవం అని చెప్పిన మాట, కవిగారి కార్మిక ప్రేమకు నిదర్శనం. ఈ గేయంలోని మాత్రాఛందస్సు, ఎంతో అందంగా చెవులకు ఇంపుగా, పాడుకోవడానికి వీలుగా ఉంది.

ఇ) కింది సృజనాత్మకత ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నీకు నచ్చిన కవిని గురించి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుడివాడ,
x x x x x

ప్రియమిత్రుడు రామారావు,
నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. ముఖ్యముగా వ్రాయునది. మన తెలుగు సాహిత్యంలో ఎందరో మహాకవులు ఉన్నారు. వారిలో శ్రీశ్రీ గారు. ప్రముఖులు. ఈయన ప్రజాకవి గాను, అభ్యుదయ కవిత్వానికి పితామహుడిగా గుర్తింపు పొందారు. కార్మిక కర్షక లోకానికి స్ఫూర్తిదాతగా నిలిచాడు. ప్రజల సమస్యలను తన సమస్యలనుగా? తీసుకొని రచనలు చేశారు. వీరు రచించిన మహాప్రస్థానం విశేషఖ్యాతిని పొందింది. వీరి శైలి మధురంగా ఉంటుంది అందుకే నాకు శ్రీ శ్రీ గారంటే చాలా ఇష్టం. నీకు నచ్చిన కవిని గూర్చి నాకు తెలియజేయి. పెద్దలందరికీ నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x x x x

చిరునామా :
పి. రామారావు,
8వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల,
నందిగామ,
కృష్ణాజిల్ల.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

ప్రశ్న 2.
శ్రీశ్రీ గారి కవిత్వాన్ని ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
“ఏ దేశ చరిత్ర చూచినా – ఏమున్నది గర్వకారణం !
నరజాతి చరిత్ర సమస్తం – పరపీడన పరాయణత్వం”

అని కొత్తగా గళమెత్తి సంచలనం రేకెత్తించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అనే రెండక్షరాలు తెలుగు కవిత్వంలో విప్లవం సృష్టించాయి. కలం పేరు శ్రీశ్రీ కాగా, అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. “అనితరసాధ్యం నా మార్గం” అని చాటిన ప్రకవి శ్రీశ్రీ భావకవిత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తర్వాత విప్లవ కవిత్వోద్యమానికి స్ఫూర్తినిచ్చాడు.

కాని శ్రీశ్రీ ప్రపంచాన్ని పరిశీలించిన కొద్దీ, పుస్తక పఠనం ఎక్కువైన కొద్దీ కొత్త దారులు తొక్కాలని ఉవ్విళ్ళూరాడు. తానే ప్రపంచాగ్నిగా మారాడు.

తాను కొత్త శైలిని ఎన్నుకొన్నాడు. “ఈ యుగం నాది” అని ఎలుగెత్తి చాటాడు. “సామాజిక దృక్పథాన్ని జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్ళిన నాయకుడాయనే. శ్రీశ్రీ “మహాప్రస్థానం” అనే గొప్పకావ్యం రాశాడు. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం అని అర్థం. కమ్యూనిస్టు భావాలు గల శ్రీశ్రీ ఎర్రబావుటా ఎగరేస్తూ మరో ప్రపంచానికి పదండి అని మేల్కొలుపు పాడుతూ ఇలా పాడాడు.

సామాజంలోని ఎక్కువ తక్కువల్నీ, బలవంతుల – ధనవంతుల అన్యాయాల్ని ఎదిరించిన శ్రీశ్రీ కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరించాడు.

“దేశ చరిత్రలు” అనే ఖండిక చారిత్రక వాస్తవికత స్పష్టీకరిస్తుంది. “తాజ్ మహల్ నిర్మాణానికి – రాళ్ళెత్తిన కూలీ లెవరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ – అది మోసిన బోయీలెవ్వరు?” అని మొట్టమొదటిగా శ్రామికశక్తిని గుర్తించి సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రకటించినవాడు శ్రీశ్రీ.

“కదిలేదీ కదిలించేదీ
మారేదీ మార్పించేదీ
మునుముందుకు సాగించేదీ” కవిత్వమని శ్రీశ్రీ కొత్త నిర్వచనం ఇచ్చాడు.

ఆయన సమకాలీన సమాజాన్ని హేళన చేస్తూ సిరిసిరిమువ్వా అనే శతకం రాశాడు. కథలూ, నాటికలూ, వ్యాసాలూ, పీఠికలూ… ఏది రాసినా శ్రీశ్రీ ముద్ర గాఢంగా కనిపిస్తూనే ఉంటుంది.

సమాజాన్ని చైతన్యపరిచి, అభ్యుదయ కవిత్వానికి యుగకర్తగా ఉండి, కొత్త తరానికి బాటలు వేసి, తెలుగు కవిత్వంలో – సంతకంగా నిలిచిన శ్రీశ్రీ ప్రజాకవి, సమాజకవి.

8th Class Telugu 5th Lesson ప్రతిజ్ఞ 1 Mark Bits

1. వికారినామ వర్మంలో ఆషాఢంలో మొదటి వరం కురిసింది. (నానార్థాలు గుర్తించండి) (S.A. I – 2019-20)
ఎ) వాన, జడి
బి) సంవత్సరం, వాన
సి) వయస్సు, మొదట
డి) మార్గం, దారి
జవాబు:
బి) సంవత్సరం, వాన

2. “చేసినంత” (పదాన్ని విడదీయండి) (S.A. I – 2019-20)
ఎ) చేసిన + యంత
బి) చేసి + అన్నంత
సి) చేసిన + అంత
డి) చేసినన్ + యంత
జవాబు:
సి) చేసిన + అంత

3. కోటిరత్నాలు (సమాసం పేరు గుర్తించండి) (S.A. I – 2019-20)
ఎ) ద్వంద్వ
బి) బహువ్రీహి
సి) అవ్యయీభావ
డి) ద్విగు
జవాబు:
డి) ద్విగు

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

4. నా కరములో ఉన్న అరటి పండును కరి కరముకు అందించాను. నానార్థాలు గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) చేయి, హస్తము
బి) హస్తము, కేలు
సి) చేయి, ఏనుగు
డి) చేయి, తొండము
జవాబు:
డి) చేయి, తొండము

5. ప్రాణమున్నంత వరకూ నిజాయితీగా బతకాలి (వికృతి గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) పానము
బి) ప్రానము
సి) పాణము
డి) పాణం
జవాబు:
ఎ) పానము

6. రాజు కొలువుసేసి ప్రజలతో పలికెను (పదాన్ని విడదీయండి) (S.A. I – 2018-19)
ఎ) కొలువు + జేసి
బి) కొలువు + చేసి
సి) కొలువున్ + జేసి
డి) కొలువుం + చేసెన్
జవాబు:
బి) కొలువు + చేసి

7. కింది వానిలో తృతీయా తత్పురుష సమాసపదాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) కాలుసేతులు
బి) నాలుగుదిక్కులు
సి) బుద్ధిహీనుడు
డి) షడ్రుచులు
జవాబు:
సి) బుద్ధిహీనుడు

8. శ్రామిక శక్తితో ప్రపంచం అభివృద్ధి చెందుతోంది. (వికృతి పదం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) శత్రు
బి) సత్తు
సి) సుత్తి
డి) సత్తి
జవాబు:
డి) సత్తి

9. రావణుడు తన గుణముల చేత హీనుడయ్యాడు. (విభక్తిని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ప్రథమ
బి) తృతీయా
సి) పంచమీ
డి) సప్తమీ
జవాబు:
డి) సప్తమీ

10. రామరాజ్యంలో నెలకు ఆనాడు వానలు ప్రతి సంవత్సరం కురిసేవి. గీత గీసిన పదానికి నానార్థ పదాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) ఘర్షణ
బి) కర్షకుడు
సి) హర్షం
డి) వర్షం
జవాబు:
డి) వర్షం

11. ఎప్పటికైనా దమ్మమే జయిస్తుంది. గీత గీసిన పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) శౌర్యం
బి) యుద్ధం
సి) అధర్మం
డి) ధర్మం
జవాబు:
డి) ధర్మం

12. “ఋగ్యజుస్సామ అధర్వణాలు నాలుగువేదాలు” గీత గీసిన పదం ఏ సమాసం? (S.A. III – 2015-16)
ఎ) ద్విగు సమాసం
బి) బహువ్రీహి సమాసం
సి) తత్పురుష సమాసం
డి) కర్మధారయ సమాసం
జవాబు:
ఎ) ద్విగు సమాసం

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

13. “ఆ ఊళ్లో దొంగభయం ఎక్కువ” గీత గీసిన పదానికి సరైన విగ్రహవాక్యాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) దొంగ యందు భయం
బి) దొంగ వలన భయం
సి) దొంగ యొక్క భయం
డి) దొంగ కొరకు భయం
జవాబు:
బి) దొంగ వలన భయం

14. క్రింది వాక్యాలలో గీతగీసిన పదానికి సమానార్థకం కాని పదాన్ని గుర్తించండి. సీత హేమాభరణాలు ధరించింది. (S.A. III – 2015-16)
ఎ) అంగారం
బి) బంగారం
సి) స్వర్ణం
డి) పుత్తడి
జవాబు:
ఎ) అంగారం

భాషాంశాలు – పదజాలం

15. ఘర్మజలం విలువ తెలియాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) విషాదాశ్రువులు
బి) చెమటనీరు
సి) కన్నీరు
డి) ఆనందబాష్పాలు
జవాబు:
బి) చెమటనీరు

16. ధరిత్రిపై శాంతి నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) జలధి
బి) వారిధి
సి) భూమి
డి) వనజం
జవాబు:
సి) భూమి

17. హేమంతో ఆభరణాలు చేస్తారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) రజితం
బి) కాంశ్యం
సి) అయస్సు
డి) బంగారం
జవాబు:
డి) బంగారం

18. జలం జీవనాధారం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పీయూషం
బి) నీరు
సి) క్షీరం
డి) సుధ
జవాబు:
బి) నీరు

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

19. కర్షకులు పంటలు పండిస్తారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పురోహితులు
బి) రైతులు
సి) ఆత్మజులు
డి) అనంతులు
జవాబు:
బి) రైతులు

పర్యాయపదాలు :

20. బంగారంతో ఆభరణాలు చేస్తారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) హేమం, హిమం
బి) పుత్తడి, హేమం
సి) కాంచనం, రజితం
డి) అభ్రకం, అయస్సు
జవాబు:
బి) పుత్తడి, హేమం

21. హలంతో పొలం దున్నాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) నాగలి, నీరు
బి) నాగము, నభము
సి) నరము, నారి
డి) వయము, వయసు
జవాబు:
ఎ) నాగలి, నీరు

22. ధ్వని వచ్చింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) రవం, రాగి
బి) శబ్దం, రవం
సి) రసం, రంజని
డి) రతనం, వదనం
జవాబు:
బి) శబ్దం, రవం

23. అగ్ని ప్రకాశించింది – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) చిచ్చు, నిప్పు
బి) నిబం, నింబం
సి) అగ్గి, అశనం
డి) అద్రి, సభం
జవాబు:
ఎ) చిచ్చు, నిప్పు

24. ఇలపై కొంతి వికసించాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ధరణి, వాకిలి
బి) పయస్సు, ధారుణి
సి) జగం, జలధి
డి) భూమి, వసుధ
జవాబు:
డి) భూమి, వసుధ

ప్రకృతి – వికృతులు :

25. మనం ప్రతిజ్ఞ చేయాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) ప్రయాస
బి) ప్రకాస
సి) పదెన
డి) ప్రతిన
జవాబు:
డి) ప్రతిన

26. ధరం ఆచరించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) దరమం
బి) దమ్మం
సి) దశమం
డి) దరన
జవాబు:
బి) దమ్మం

27. న్యాయం పాటించాలి – గీత గీసిన పదానికి దీనికి వికృతి పదం ఏది?
ఎ) నైయం
బి) నాయం
సి) నేయం
డి) నోయం
జవాబు:
బి) నాయం

28. ప్రాణం తిపి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) పారం
బి) పానం
సి) పాయం
డి) సాయం
జవాబు:
బి) పానం

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

29. శ్రీ వెల్లి విరియాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) శీరి
బి) సిరి
సి) శ్రీరి
డి) చిరి
జవాబు:
బి) సిరి

30. అగ్గి చల్లారింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) అగ్లో
బి) అగ్ని
సి) అగ్గి
డి) అగా
జవాబు:
బి) అగ్ని

31. బాగెము పండాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) భాగ్యము
బి) భాసము
సి) సంపద
డి) భోగ్యము
జవాబు:
ఎ) భాగ్యము

32. కరంతో పని చేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చేయి, తొండం, కిరణం
బి) హస్తం, పాదం, నఖము
సి) నది, ఝరి, సాగరం
డి) కరం, చదరం, చందనం
జవాబు:
ఎ) చేయి, తొండం, కిరణం

33. భూత కాలంలో తిరిగిరావు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జరిగిపోయినది, ప్రాణి
బి) భూమి, జలధి
సి) ధర్మం, వసుధ
డి) నీరు, ఉదధి
జవాబు:
ఎ) జరిగిపోయినది, ప్రాణి

34. ఆయన కాలం చెందాడు – గీత గీసిన పనికి నానార్థాలు గుర్తించండి.
ఎ) భరతం, భాగ్యం
బి) సమయం, మరణం
సి) సమయం, కన్ను
డి) భాగ్యం, బానిస
జవాబు:
బి) సమయం, మరణం

35. బలం చూపాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) లావు, సామర్థ్యం
బి) మరణం, జననం
సి) చక్రం, వాన
డి) అదృష్టం, పర్జన్యం
జవాబు:
ఎ) లావు, సామర్థ్యం

36. కన్ను రక్షణీయం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) బలం, సామర్థ్యం
బి) నయనం, బండిచక్రం
సి) నేత్రం, కాలం
డి) వాన, నీరు
జవాబు:
బి) నయనం, బండిచక్రం

37. భాగ్యం పండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
ఎ) వర్షం, నీరు
బి) అదృష్టం, సంపద
సి) అవకాశం, అనంతం
డి) అకాలం, అనాగరికం
జవాబు:
బి) అదృష్టం, సంపద

వ్యుత్పత్తర్థాలు :

38. దుఃఖం వల్ల కన్నుల నుండి కారే నీరు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
ఎ) అశ్రువులు
బి) ఆశ్రమం
సి) అరణి
డి) వసుధ
జవాబు:
ఎ) అశ్రువులు

39. ధర్మము – దీనికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) ధరకు లొంగేది
బి) ధరించబడేది
సి) ధరచేత కూడినది.
డి) ధరణమును పొందునది
జవాబు:
బి) ధరించబడేది

వ్యాకరణాంశాలు

సంధులు :

40. కూరగాయలు తెచ్చారు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) కూరె + కాయ
బి) కూర + కాయ
సి) కూర + గాయ
డి) కూర + ఆయ
జవాబు:
బి) కూర + కాయ

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

41. పాలుదాగి – ఇందులోని సంధిని గుర్తించండి.
ఎ) గుణసంధి
బి) గసడదవాదేశ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) పూర్వరూప సంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి

42. పరుషములు అనగా –
ఎ) క చ ట త ప
బి) గ జ డ దలు
సి) న జ బ జ న
డి ) ప ద ని స
జవాబు:
ఎ) క చ ట త ప

43. క్రింది వానిలో సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) గుళోన్నతి
బి) విలాపాగ్నులు
సి) ఏకైక
డి) తల్లిదండ్రులు
జవాబు:
సి) ఏకైక

44. శ్రమైక జీవనం – గీత గీసిన పదాన్ని విడదీసి గుర్తించండి.
ఎ) శ్రమ + ఔక
బి) శ్రమ + ఏక
సి) శ్రమ + ఐక
డి) శ్రమ + ఓక
జవాబు:
బి) శ్రమ + ఏక

సమాసాలు :

45. రాజపూజితుడు పండితుడు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) రాజుకు పూజితుడు
బి) రాజునందు పూజితుడు
సి) రాజువలన పూజితుడు
డి) రాజుచేత పూజితుడు
జవాబు:
డి) రాజుచేత పూజితుడు

46. పేదలకు అన్యాయం జరుగకూడదు – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) న్యాయం కావాలి
బి) న్యాయం కానిది
సి) న్యాయమందు కూడినది
డి) న్యాయం కొరకు కానిది
జవాబు:
బి) న్యాయం కానిది

47. శివుడు జటాధారి – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
ఎ) పంచమీ తత్పురుష
బి) షష్ఠీ తత్పురుష
సి) చతుర్డీ తత్పురుష
డి) ద్వితీయా తత్పురుష
జవాబు:
డి) ద్వితీయా తత్పురుష

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

48. రాజభటుడు వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) ప్రథమా తత్పురుష
బి) చతుర్డీ తత్పురుష
సి) షష్ఠీ తత్పురుష
డి) తృతీయా తత్పురుష
జవాబు:
సి) షష్ఠీ తత్పురుష

49. చతుర్దీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) తిండిగింజలు
బి) పాపభీతి
సి) విద్యాహీనుడు
డి) శాస్త్ర నిపుణుడు
జవాబు:
ఎ) తిండిగింజలు

50. అగ్నిభయం ఎక్కువ – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) అగ్ని కొరకు భయం
బి) అగ్ని వలన భయం
సి) అగ్నిచేత భయం
డి) అగ్నియందు భయం
జవాబు:
బి) అగ్ని వలన భయం

51. ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసం గుర్తించండి.
ఎ) ద్వంద్వం
బి) షష్ఠీ తత్పురుష
సి) అవ్యయీభావ
డి) తత్పురుష
జవాబు:
డి) తత్పురుష

52. పంచమీ విభక్తి ప్రత్యయాలను గుర్తించండి.
ఎ) డు, ము, వు, లు
బి) వలన, కంటె, పట్టు
సి) కొరకు, కై
డి) అందు, న
జవాబు:
బి) వలన, కంటె, పట్టు

ణవిభజన :

53. మాత్రా ఛందస్సు గల సాహితీ ప్రక్రియ ఏది?
ఎ) దండకం
బి) గద్యం
సి) గేయం
డి) పద్యం
జవాబు:
సి) గేయం

54. UIU- ఇది ఏ గణం?
ఎ) త గణం
బి) ర గణం
సి) న గణం
డి) మ గణం
జవాబు:
సి) న గణం

వాక్యాలు :

55. ఆయన సంస్కృతం, తెలుగు, ఆంగ్లం నేర్చుకున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) సంక్లిష్ట వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) సామాన్య వాక్యం
జవాబు:
సి) సంయుక్త వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

56. కృష్ణ బొబ్బిలి వెళ్ళి ఇల్లు కట్టాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
బి) సంక్లిష్ట వాక్యం

57. రమ అందమైనది. రమ తెలివైనది – ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా గుర్తించండి.
ఎ) రమ తెలివైనది కావడంతో అందమైనది.
బి) రమ అందమైనది, తెలివైనది.
సి) రమ తెలివైనది, అందమైనది.
డి) రమ అందమైనది కావడంతో తెలివైనది.
జవాబు:
బి) రమ అందమైనది, తెలివైనది.

58. అందరు బడికి వెళ్ళాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) కొందరు బడికి వెళ్ళలేకపోవచ్చు.
బి) అందరు బడికి వెళ్ళకూడదు.
సి) అందరు బడికి వెళ్ళియుండవచ్చు.
డి) అందరు బడికి వెళ్ళి తీరాలి.
జవాబు:
బి) అందరు బడికి వెళ్ళకూడదు.

59. దొంగతనం చేయవద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) విధ్యర్థక వాక్యం
సి) నిషేధార్థక వాక్యం
డి) అభ్యర్థక వాక్యం
జవాబు:
సి) నిషేధార్థక వాక్యం

60. భవిష్యత్కాల అసమాపక క్రియను గుర్తించండి.
ఎ) అప్యర్థకం
బి) క్యార్థకం
సి) శత్రర్థకం
డి) చేదర్థకం
జవాబు:
డి) చేదర్థకం

61. దయతో అనుమతించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) శత్రర్థక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) ప్రార్థనార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
సి) ప్రార్థనార్థక వాక్యం

62. వానలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అభ్యర్థక వాక్యం
బి) శత్రర్థక వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) చేదర్థక వాక్యం
జవాబు:
డి) చేదర్థక వాక్యం

అలంకారాలు :

63. పొలాలు దున్నీ – హలాలు దున్ని – ఇందులోని అలంకారం గుర్తించండి.
ఎ) ఉపమ
బి) వృత్త్యనుప్రాస
సి) యమకం
డి) లాటానుప్రాస
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

64. కింది అలంకారాలలో పొసగని అలంకారం గుర్తించండి.
ఎ) ముక్తప్రదగ్రస్తం
బి) రూపక
సి) అంత్యానుప్రాస
డి) యమకం
జవాబు:
బి) రూపక

సొంతవాక్యాలు :

65. కార్మిక లోకం : సమస్త కార్మిక లోకం దేశ సౌభాగ్యం కోసం కృషి చేస్తుంది.

66. నవ్యకవిత్వం : శ్రీ శ్రీ గారు నవ్య కవిత్వం రాయడానికి సిద్ధపడినారు.

67. దాస్యం : బ్రిటిషు ప్రభుత్వంలో మనం దాస్యం అనుభవించాము.

68. కర్షక వీరులు : సమాజంలో కర్షకవీరులు నిరంతరం శ్రమిస్తారు.

69. విరామం : నిరంతరం పనిచేసేవారికి విరామం పొందాలి.

70. ఖరీదు : వస్తువుల ఖరీదు అధికంగా ఉన్నది.

71. ప్రపంచ భాగ్యం : ప్రపంచ భాగ్యం వెల్లి విరియడానికి మనం కృషి చేయాలి.

72. స్వర్ణవాయిద్యములు : తిరుమలలో స్వామివారికి స్వర్ణ వాయిద్యములు మ్రోగిస్తారు.

73. చిహ్నం : ఎన్నికల్లో అభ్యర్థులకు చిహ్నం ఇస్తారు.

74. ప్రణవం : వేదాల్లో ప్రణవం అతి ప్రధానమైనది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు.

AP State Syllabus 8th Class Telugu Important Questions 4th Lesson అజంతా చిత్రాలు

8th Class Telugu 4th Lesson అజంతా చిత్రాలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఆ) కింది అపరిచిత గద్యాలను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

*ఈ క్రింది వచనాలను చదివి వాటి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ‘మన ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాలో, నరసరావుపేటకు ఏడుమైళ్ళ దూరంలో “కోటప్పకొండ” ఉంది. ఆ కొండ మీద 600 అడుగుల ఎత్తున కోటేశ్వర స్వామి గుడి ఉంది. పూర్వపు శాసన ఆధారాలను బట్టి క్రీ.శ. 11వ శతాబ్దానికే ఈ గుడి ఉందని తెలుస్తోంది. ఈ కొండ ఎత్తు 1587 అడుగులు. ఈ కొండ చుట్టూ రాళ్ళ మధ్యలో చిన్న చిన్న నీటి గుంటలున్నాయి. వీనిని “దొనలు” అంటారు. ఈ కొండ మధ్యలో “పాపనాశనము” అనే తీర్థం ఉంది. ఇది శివుడు త్రిశూలంతో కొడితే ఏర్పడింది. దీనిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం.
ప్రశ్నలు :
1. కోటప్ప కొండ ఎక్కడ ఉంది?
జవాబు:
కోటప్పకొండ గుంటూరు జిల్లాలో, నరసరావుపేటకు ఏడుమైళ్ళ దూరంలో ఉంది.

2. కోటప్పకొండపై ఎవరి గుడి ఉంది ? అది ఎంత ఎత్తు?
జవాబు:
కోటప్పకొండపై కోటేశ్వరస్వామివారి గుడి ఉంది. ఆ కొండ 1587 అడుగుల ఎత్తు.

3. కోటప్పకొండ పైనున్న గుడి యొక్క ప్రాచీనత ఎట్టిది?
జవాబు:
ఈ గుడి క్రీ.శ. 11వ శతాబ్దానికి చెందినది. కొండ మధ్యలో పాపనాశనము అనే తీర్థం ఉంది. దీనిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం.

4. దొనలు అంటే ఏమిటి?
జవాబు:
కొండ చుట్టూ రాళ్ళ మధ్యలో చిన్న చిన్న నీటి గుంటలున్నాయి. వీటిని దొనలు అంటారు.

2. శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన భావ కవిత్వం పై తిరుగుబావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తరువాత విప్లవ కవిత్వమునకు స్ఫూర్తినిచ్చాడు. “అనితర సాధ్యం నా మార్గం” అని చాటిన ప్రజాకవి. “మహాప్రస్థానం” కావ్యం, “సిరిసిరి మువ్వ శతకం” శ్రీశ్రీకి మంచి కీర్తిప్రతిష్ఠలు సంపాదించి పెట్టాయి. ఆయన సమాజాన్ని చైతన్యపరిచే రచనలెన్నో చేశాడు. అందుకే సాహిత్య విమర్శకులు ఆయనను అభ్యుదయ కవిత్వానికి యుగకర్త అంటారు.
ప్రశ్నలు :
1. శ్రీశ్రీ అసలు పేరేమి?
జవాబు:
శ్రీరంగం శ్రీనివాసరావు.

2. ఆయన అభ్యుదయ భావాలు దేనికి స్ఫూర్తినిచ్చాయి?
జవాబు:
ఆయన అభ్యుదయ భావాలు విప్లవ కవిత్వానికి స్ఫూర్తినిచ్చాయి.

3. తన రచనాశైలి విషయంలో ఆయన ఏమని చాటుకొన్నాడు?
జవాబు:
‘అనితర సాధ్యం నా మార్గం’ అని శ్రీ శ్రీ తన రచనా శైలి విషయంలో చాటుకొన్నాడు.

4. శ్రీశ్రీకి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన రచనలు ఏవి?
జవాబు:
మహాప్రస్థానం అనే కావ్యం, సిరిసిరి మువ్వ అనే శతకం శ్రీశ్రీకి కీర్తిప్రతిష్ఠలు తెచ్చి పెట్టిన రచనలు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

3. జనపదం అంటే పల్లెటూరు. జనపదాలలో ఉండేవారు జానపదులు. జానపదులు పాడే పాటలు లేక గేయాలను జానపద గేయాలంటారు. వీటిని ఆంగ్లంలో ‘ఫోక్ సాంగ్స్’ అంటారు. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను లోక్ గీత్ లేదా లోక్ సాహిత్య అంటారు. జానపద సాహిత్యం సమిష్టి సంపద. శిష్ట సాహిత్యంలాగా కాక జానపద సాహిత్యం పలువురి చేతులలో పెరిగింది. ఇది దాని మొదటి లక్షణం. గేయ రచనా కాలం స్పష్టంగా ఉండకపోవడం మరో లక్షణం. నదీ నదాలు, వాగులు, వంకలూ మనకు ఉపయోగపడక సముద్రం పాలైనట్లే జానపద గేయస్రవంతి కూడా చాలా భాగం మనకు అందలేదు. జానపద సాహిత్యాన్ని భద్రపరచవలసిన అవసరం ఉన్నది.
ప్రశ్నలు :
1. జానపదులు అంటే ఎవరు?
జవాబు:
జనపదాల్లో ఉండేవారిని జానపదులు అంటారు.

2. ఉత్తర భారతదేశంలో జానపదాలను ఏమంటారు?
జవాబు:
ఉత్తర భారతదేశంలో జానపదాలను ‘లోక్ గీత్’ (లేదా) ‘లోక్ సాహిత్య’ అని అంటారు.

3. జానపద సాహిత్యం ప్రథమ లక్షణం ఏమిటి?
జవాబు:
సమిష్టి సంపదయై, పలువురి చేతులలో పెరుగుట జానపద సాహిత్య ప్రథమ లక్షణం.

4. ఆంగ్లములో జానపద గేయాల్ని ఏమంటారు?
జవాబు:
ఆంగ్లములో జానపద గేయాలను “ఫోక్ సాంగ్స్” అని అంటారు.

4. . మేధా సంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతమవుతుంది అనేది ఎంతయినా యథార్థం. ఒక దేశం యొక్క సంస్కృతి, వికాసం, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా, కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక యుగంలో విద్య మానవునికి ఒక ముఖ్యమైన జీవితావసరంగా కూడా మారింది. నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు ఒక ప్రాథమిక అవసరంగా భావించి వాటిని రాజ్యాంగంలో పొందుపరచడమైనది.
ప్రశ్నలు :
1. యథార్థమైనది ఏది?
జవాబు:
స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతమవుతుంది.

2. ఒక దేశ సంస్కృతి, ప్రగతి దేని మీద ఆధారపడి ఉంటుంది?
జవాబు:
ఒక దేశ సంస్కృతి, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

3. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక అవసరాలేవి?
జవాబు:
నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు అనే ప్రాథమిక అవసరాలు రాజ్యాంగంలో పొందుపరచ బడ్డాయి.

4. వైజ్ఞానిక వాస్తవం ఏమిటి?
జవాబు:
మేధాసంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం.

5. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. 1 – 2018-19)

ఈ గుహలను సమీపిస్తుంటే ఇటు పచ్చనికొండ, అటు పచ్చనికొండ. ఈ రెండు కొండల మధ్య ‘వాఘోరా’ నది రాళ్ళ గుట్టల గుండా జలజలా ప్రవహిస్తూ నది పాడుకొనే పాటలను వింటూ, నది అంచు వెంట కాలినడకన, గుహలకు చేరాలి. మీ పైన నీలాకాశం, మీమ్ము అలరిస్తూ అడవి పువ్వులు, మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు. గుహలను చేరేవరకు రెండు, మూడు మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలో అడుగు పెడితే, దానికి అదే ఒక ప్రపంచం.
ప్రశ్నలు
1. గుహల సమీపంలో ప్రవహిస్తున్న నది పేరేమిటి?
జవాబు:
వా ఘోరా నది

2. కణకణ, గడగడ ఇటువంటి పదాలను ధ్వన్యనుకరణ పదాలు అంటారు. పై పేరాలో అటువంటి పదం ఉంది. వెతికి రాయండి.
జవాబు:
జలజల

3. “పువ్వుల కమ్మని నెత్తావులు” అంటే ఏమిటి?
జవాబు:
పువ్వుల కమ్మని పరిమళాలు

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘మెలిక’ అంటే ఏమిటి?

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

6. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2017-18)

అజంతా చిత్రాలలో అధిక భాగం జాతక కథలే. సిద్ధార్థుడిగా జన్మించడానికి పూర్వం గౌతమబుద్దుడు కొన్ని వందల జన్మలు ఎత్తినాడని బౌద్ధవుతస్తుల నమ్మకం. పూర్వ జన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడిగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటున్నాయి. ఈ వివిధ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాలలో చూడవచ్చు. అయితే అజంతా చిత్రాలన్నీ జాతక కథలే కావు. జాతక కథలతో ఎలాంటి సంబంధం లేనివీ ఎన్నో ఉన్నాయి. వెలితిగా కాస్త చోటు కనబడితే చాలు దానిలో ఏ ఆకునో, రెమ్మనో, ఏ పువ్వునో చిత్రించి వేశారు. అదీ. ఇదీ కాకపోతే, ఆ కళా తపస్వులు తమ కుంచెతో అటోక గీతను, ఇటోక గీతను గీయడం ద్వారానే సౌందర్య సృష్టి చేశారు.
ప్రశ్నలు :
1. అజంతా చిత్రాలలో అధిక భాగం వేటిని గురించి తెలియజేశారు?
జవాబు:
జాతక కథలు

2. సిద్ధార్థుని జన్మ విషయంలో బౌద్ధ మతస్తుల నమ్మకం ఏమిటి?
జవాబు:
పూర్వం కొన్ని వందల జన్మలు ఎత్తాడని నమ్మకం.

3. కళాతపస్వులు సౌందర్య సృష్టి ఎలా చేసేవారు?
జవాబు:
వారు తమ కుంచెతో అటొక గీతను ఇటొక గీతను గీయడం ద్వారా సౌందర్య సృష్టి చేశారు.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జాతక కథలలోని విషయం ఏమిటి?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“అజంతా చిత్రాలు” పాఠ్యభాగ రచయితను గూర్చి వివరించండి.
జవాబు:
‘అజంతా చిత్రాలు’ పాఠ్యభాగ రచయిత నార్ల వేంకటేశ్వరరావు. ఈయన 1908 లో కృష్ణాజిల్లాలోని ‘కవుతరం’ అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు (అనువాద రచన), నరకంలో హరిశ్చంద్రుడు (నాటకం), నార్లవారిమాట (పద్య కావ్యం ) మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం, సమాజ
శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి. నార్లవారి రచన, సరళమైన శబ్దాలతో, సొగసైన భావాలతో సుందరశైలిలో సాగుతుంది.

ప్రశ్న 2.
వ్యూపాయింట్ గురించి రాయండి.
జవాబు:
వాఘోరా నది పుట్టినచోట కొండ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గుహలుంటాయి. రెండవ వంపు పైన వలయాకారంలో ఏదో ఒక కట్టడం కనబడుతూ ఉంటుంది. దాన్ని ‘వ్యూపాయింట్’ అంటారు. కొన్ని శతాబ్దాలపాటు అజంతా గుహల గురించి లోకానికి తెలియదు. మేజర్ గిల్ అనే బ్రిటిష్ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి ఒక జంతువును తరుముకొంటూ కొండపైకి వెళ్ళాడు. ఎదురుగుండా చెట్ల సందులోనుంచి, ఒక చెక్కడపు పని అతనికి కనిపించింది. అతడు కొండ ఎక్కిచూస్తే అతనికి అజంతా గుహలలో పదహారవ దాని శిరోభాగం కనిపించినట్లు అర్థమయింది. లోకం మరచిపోయిన అజంతా గుహలను మేజర్ గిల్ ఏ ప్రదేశం నుంచి చూశాడో అదే “వ్యూపాయింట్”. చాలామంది సందర్శకులు వ్యూపాయింట్ కు వెళ్ళి అక్కడి నుండి అజంతా గుహలను చూస్తూ ఉంటారు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
అజంతా గుహల ద్వారా భారతీయ సాంఘిక వ్యవస్థ రూపాన్ని వివరించండి.
జవాబు:
ప్రాచీన కాలంలో భారతీయ సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేదో, అప్పటి వృత్తులు, వ్యాసంగాలు, వినోదాలు ఎలాంటివో తెలుసుకోవాలంటే అజంతా గుహలను చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు రాణ్మందిరాలు ఏ విధంగా ఉండేవి? రాజుల, రాణుల వేషభాష లేవి? రాజసభలను ఏవిధంగా తీర్చేవారు? అప్పటి సైనికబలం ఏ విధంగా ఉండేది? ఆనాటి ఆయుధాలేవి? – ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలిపేవి అజంతా గుహలే. అజంతా గుహలకు వెళితే భారత జాతీయ బలాలను సింహళం మీదకు దండయాత్రకు చేరవేసిన నౌకాదళాన్ని చూడవచ్చు. మహాసాగరాలను దాటి వెళ్ళిన భారతీయ వ్యాపారులను చూడవచ్చు. పర్ష్యన్ రాయబారులతో మాట్లాడే భారతీయ చక్రవర్తులను చూడవచ్చు. గౌతమ బుద్ధుని కారుణ్య సందేశం మానవ వికాసానికే కాక పశుపక్ష్యాదుల జీవితాన్ని సయితం ఎంత పునీతం చేసిందో, తేజోవంతం చేసిందో చూడవచ్చు. అందుచేత అజంతా గుహలను చూస్తే ఆనాటి భారతీయ సాంఘిక వ్యవస్థ ఎలాంటిదో తెలుస్తుంది.

ప్రశ్న 4.
“యాత్రా రచన” ప్రక్రియను పరిచయం చెయ్యండి. (S.A.I – 2019-20)
జవాబు:
రచయిత తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచనే యాత్రారచన. దీనిలో ఆ ప్రదేశం ప్రత్యేకత, ప్రకృతి రామణీయకత, చరిత్ర వంటి అంశాలుంటాయి. రచయిత ఆత్మాశ్రయ శైలిలో భావాలను తెలియజేస్తాడు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
అజంతా చిత్రాల్లోని బుద్ధుని జాతక కథల విశేషాలను తెల్పండి.
జవాబు:
అజంతా చిత్రాలలో అధికభాగం జాతక కథలే. గౌతమ బుద్ధుడు సిద్ధార్థునిగా జన్మించడానికి ముందు కొన్ని వందల జన్మలు ఎత్తినాడని, బౌద్ధులు నమ్ముతారు. ఆ పూర్వజన్మలలోని బుద్ధుని జీవిత చరిత్రలనే ‘జాతక కథలు’ అని పిలుస్తారు. బుద్ధుడు పూర్వజన్మలలో మానవ జన్మలనే కాకుండా, పక్షిరాజుగా, గజేంద్రునిగా ఎన్నెన్నో జన్మలు ఎత్తినట్లు జాతక కథలు తెలియజేస్తున్నాయి. ఈ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాల్లో చూడగలము.

మానవుల పట్ల బౌద్ధులకు ఎంత నిరసన పూర్వకమైన అభిప్రాయముందో, వారు చిత్రించిన జాతక కథలు తెలుపుతాయి. అటువంటి కథలలో ఇది యొకటి.

జాతక కథ :
అడవిగుండా వెడుతున్న ఒక బాటసారి, ఒక గుంటలో పడిపోతాడు. అతనిపై జాలిపడి, ఒక కోతి అతడిని రక్షిస్తుంది. వాడు ఆ కోతి తనకు చేసిన మేలు మరచిపోయి, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. వెంటనే కోతులన్నీ అతడిని ముట్టడిస్తాయి. అతడు భయపడి, తనని మన్నించుమని, ప్రాధేయపడతాడు. ఇక ముందైనా బుద్ధి కలిగియుండమని కోతులు అతడిని విడిచి పెడతాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 2.
అజంతా గుహల్లో వ్యక్తమయ్యే స్త్రీల సౌందర్యాన్ని వివరించండి.
జవాబు:
అజంతా గుహలలో బౌద్ధభిక్షువులు స్త్రీల సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రించారు. అందుకే జవహర్ లాల్ నెహ్రూ గారు ‘అజంతా’ మన మనస్సును ఏదో కలల లోకానికి తీసుకొని వెడుతుందని చెప్పారు. అజంతా అతి వాస్తవికమైన లోకమని చెప్పారు. బుద్ధుడు శిష్యులకు “స్త్రీలకు దూరంగా ఉండండి. వారిని కన్నెత్తి కూడా చూడవద్దు” అని చెప్పినా, బౌద్ధభిక్షువులు అజంతా గుహల్లో అందాలు ఒలుకుతున్న స్త్రీలు అశేషంగా ఉన్నారని నెహ్రూగారు చెప్పారు.

అక్కడ రాజకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు వంటి స్త్రీలు ఎక్కడ చూసినా ఉన్నారు.

అందులో కొందరు కూర్చున్నవారు, కొందరు నిలబడి ఉన్నవారు, కొందరు ముస్తాబు చేసేవారు, కొందరు ఊరేగింపుగా వెడుతున్నవారు ఉన్నారు. ఈ అజంతా స్త్రీలు ఎంతగానో పేరు పొందారు. సన్యసించిన వారైనా ఈ చిత్రకారులు, ఈ స్త్రీలను ఎంతో సౌందర్యవంతులుగా చిత్రించారు. అజంతా గుహలలో మహారాణులే కాక, సమస్త వర్ణాలకు చెందిన స్త్రీలూ చిత్రింపబడ్డారు. ఆనాటి రాణుల మందిరాలనూ, రాణుల వేషాలను చిత్రించిన ఆ చిత్రకారుల ప్రతిభను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ప్రశ్న 3.
వాఘోరానది పుట్టుక, విశేషాలను తెలపండి.
జవాబు:
అజంతా గుహలకు వెళ్ళే దారిలో అటొక కొండ, ఇటొక కొండ ఉంటాయి. అందులో ఒక కొండమెలికే, వాఘోరానది యొక్క జన్మస్థానం. కొండమీద ఏడుకొలనులు ఉంటాయి. ఒక కొలను నుండి నీరు మరొక కొలనుకు జాలువారుతూ, 250 అడుగుల ఎత్తునుంచి పెద్ద ధారగా, కొండ దిగువకు వాఘోరానది దూకుతుంది. అలా దూకిన తరువాత, కొండ ఎన్ని మలుపులు తిరుగుతుందో, తానూ అన్ని మలుపులు తిరుగుతూ, సమతల ప్రదేశానికి చేరి, కొన్ని వందల మైళ్ళు ప్రవహించి, వాఘోరానది తపతిలో కలిసిపోతుంది.

వాఘోరానది వెంట వెళుతుంటే, రాళ్ళగుట్టల గుండా జలజల ప్రవహిస్తూ ఆ నది పాడే పాటలు వినిపిస్తాయి. పైన నీలాకాశమూ, అలరించే అడవి పువ్వులూ, ఆ పువ్వుల కమ్మని సువాసనలూ మరొక లోకంలో మనల్ని విహరింపచేస్తాయి. ఇటుకొండ, అటుకొండ, ముందుకొండ, వెనుకకొండ, పైన కొండ – ప్రక్కన వారానది – నీలాకాశం – నీలాలనీళ్ళు — పచ్చని చెట్లు – కమ్మని సువాసనలు – అదొక భూలోక స్వర్గం అనిపిస్తుంది.

వాఘోరా నది పుట్టిన చోట, కొండ అర్ధచంద్రాకారంగా ఉంటుంది. దాని ఒక వంపులో అజంతా గుహలుంటాయి. మరొక వంపులో వలయాకారంలో ఒక కట్టడం ఉంటుంది. దానిని ‘వ్యూ పాయింట్’ అంటారు.

ప్రశ్న 4.
నార్ల వారి అనుభూతిని గురించిన వర్ణనను వివరించండి.
జవాబు:
చూచిన ఒక దృశ్యాన్ని వర్ణించడం సులభం కావచ్చు కాని ఒక అనుభూతిని వర్ణించడం సులభం కాదు.

ఇరుకుగా ఉండే ఇంటిని వదలి, ఇరుకుగా ఉండే వీధుల వెంట నడిచి, అపారమైన సముద్రపు తీరంలో నిలిచినప్పుడు పొందే అనుభూతిని, పరిమిత జీవితాలలోని పరిమిత సమస్యలతో కంటికి నిద్ర దూరమయినప్పుడు, ఆకాశంలోని అనంతమైన నక్షత్రాలను చూచినప్పుడు, పొందే అనుభూతిని వర్ణించడం సులభం కాదు.

అదేవిధంగా జీవనోపాధి కోసం పగలంతా పాట్లు పడి, విసిగి వేసారి ఇంటికి చేరినప్పుడు, గడపలోనే కేరింతలు కొడుతూ కాళ్ళకు అడ్డంపడే తన ముద్దు బిడ్డను ఎత్తుకొన్నప్పుడు పొందే అనుభూతిని, పచ్చనిచెట్టును, పచ్చికబయలును చూసే అవకాశం లేని బస్తీలో బ్రతికే మనిషి గాలికి తలలూపుతూ, దిక్కులను అంటుకుంటున్నట్లు కనిపించే వరిచేలను చూచినప్పుడు పొందే అనుభూతిని వర్ణించడం సులభం కాదు.

హృదయాన్ని ఊపివేసే ఏ అనుభూతిని గాని, జీవితాన్ని కదిలించే ఏ అనుభూతిని గాని వర్ణించడం సులభం కాదు.

ప్రశ్న 5.
అజంతా గుహలలోని చిత్రాల గురించి విదేశీయుల అభిప్రాయాలను తెలపండి.
జవాబు:
అజంతా గుహలను ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలటరీ ఆఫీసర్. వ్యూపాయింట్ నుండి చూస్తే చెక్కడపు పని కనిపించడంతో ఆయన కొండపైకి వెళ్ళి అజంతా గుహలను చూసి లోకానికి తెలియజేశాడు.

మేజర్ గిల్ ముప్పయి సంవత్సరాలపాటు కష్టపడి అజంతా చిత్రాలకు కాపీలను తయారుచేసుకొన్నాడు. వాటిలో కొన్ని అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. మిగిలిన వాటికి జాన్ గ్రిఫిల్మ్ కాపీలు తయారుచేయించాడు. కాని అవి కూడా అగ్నిప్రమాదంలో బూడిదయ్యాయి. మేజర్ గిల్ కు జాన్ గ్రిఫికు అజంతా చిత్రాలంటే అమిత మక్కువని దీనిని బట్టి అర్థమవుతుంది.

ఫెర్గుసన్ అనే విదేశీయుడు ఫైజాల్, ఆర్కాన్యాజా ఇటలీలో తలెత్తడానికి ముందు అజంతా చిత్రాలకు సాటిరాగల చిత్రాలు యూరప్లో లేవని చెప్పాడు.

గ్రీఫ్ త్న్ అనే మరో విదేశీయుడు 26 అజంతా చిత్రాలకు సాటిరాగల చిత్రాలు యూరప్ లో ఉన్నవి అన్నాడు. ఫోరె టైన్ మరింత రేఖావిన్యాసాన్ని ప్రదర్శించినా, వెనాసియన్ మరింత వర్ల వైశిష్యాన్ని చూపినా మరణం ఆసన్నమైన రాకుమారి భావాలను మరింత ప్రభావవంతంగా వారు చూపడం వారికి సాధ్యపడేది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. కొండను తొలిచి, ఆ గుహలలో మలచిన ఆ ఆలయాలలోని చిత్రాలను చూచి రోడౌన్ సైల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

విన్ సెంట్ స్మిత్ అనే విదేశీయుడు అజంతా గుహలలోని చిత్రాలను గీసినవారు పర్ష్యన్ చిత్రకారులు కావచ్చని అన్నాడు.

ప్రశ్న 6.
అజంతా గుహలలో ఎన్నో బుద్ధుడి చిత్రాలు ఉన్నాయి. అజంతా గుహలకు – జాతక కథలకు ఉన్న సంబంధం ఏమిటో వివరించండి. (S.A. III – 2015-16)
జవాబు:
అజంతా చిత్రాలలో అధికభాగం జాతక కథలే. సిద్ధార్థుడుగా జన్మించడానికి పూర్వం గౌతమ బుద్ధుడు కొన్ని వందల జన్మలెత్తాడని బౌద్ధమతస్థుల నమ్మకం. పూర్వజన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా, గజేంద్రుడుగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటాయి. ఈ వివిధ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాలలో చూడవచ్చు.

బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని, ఆయన అంత గంభీరమూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను, ఈ జగత్తును చిత్రించడంలో ఈ కుడ్య చిత్రాలను చిత్రించిన బౌద్ధభిక్షువులు చూపించారు. అజంతా గుహలు మొత్తం 29. వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే, మిగిలినవి బౌద్ధ విహారాలు. గౌతమబుద్ధుని కారుణ్య సందేశం కేవలం మానవుని వికాసానికే కాక పశు పక్ష్యాదుల జీవితాన్ని సైతం ఎంత పునీతం చేసిందో, తేజోవంతం చేసిందో ఇక్కడ చూడవచ్చు.

బుద్ధుని బోధనలకు ప్రేరేపితులైన ఆయన శిష్యులు బుద్ధుని నిర్యాణానంతరం బౌద్ధమత వ్యాప్తికై బుద్ధుని బోధనలు ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా కొందరు అజంతా గుహలను, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను లక్ష్యంగా బుద్ధుని భావాలను ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దారు. ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయత వారికి ఇంకా కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు. బుద్ధుని పట్ల ఉన్న భక్తి వారిచేత అజంతా గుహలను అంత అందంగా తీర్చిదిద్దేటట్లు చేసింది.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
శిల్పిని గురించి ఆత్మకథ రాయండి. దీన్ని ఏకపాత్రాభినయంగా రాయండి.
జవాబు:
నేను మీకు తెలుసా ! నేను రాళ్ళను బొమ్మలుగా చెక్కే శిల్పిని. నేను రాళ్ళను దేవుడి బొమ్మలుగా చెక్కితే, మీరు వాటిని పసుపు కుంకాలతో పూజిస్తున్నారు. పూర్వం మహారాజులు మాకు ఎంతో డబ్బు ఇచ్చి దేవాలయాల్లో శిల్పాలు చెక్కించేవారు. మీరు మేము చెక్కిన నంది విగ్రహాలూ, నాట్య ప్రతిమలూ లొట్టలు వేసుకుంటూ చూస్తారు. చూసినంత సేపూ ఓహో, ఆహా అని అంటారు. కానీ మీలో ఏ ఒక్కరూ నన్ను పోషించరు. మరి నన్ను ఎవరు చూస్తారు ? దేవుడు బొమ్మలు చెక్కే నాకు, ఇంక దేవుడే దిక్కు. నేను సంగీతం వచ్చే స్తంభాలు చెక్కాను. అందమైన స్త్రీమూర్తులను చెక్కాను. నా శిల్పాన్ని పోషించిన రాజులను మీరు రాజుల సొమ్ము రాళ్ళపాలన్నారు. కాని నా శిల్పాలు శాశ్వతంగా నిలుస్తాయి.

ప్రశ్న 2.
శిల్పం, సంగీతం ………. ఇలాంటి వాటికి సంబంధించిన అదనపు సమాచారం లేదా చిత్రాలు సేకరించండి. వాటిని గురించి రాయండి.
జవాబు:
కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం అనేవి లలితకళలు :

ఎ) ప్రపంచ ప్రసిద్ధుడైన చిత్రలేఖన కళాకారుల వివరాలు :

1) వడ్డాది పాపయ్య :
ఆంధ్రదేశంలో శ్రీకాకుళంలో 1921లో పుట్టాడు. ఈయన భారతదేశం గర్వించదగ్గ చిత్రకారుడు. ఈయన తొలి గురువు తండ్రి. తరువాత గురువు రవివర్మ. చందమామ, ఆంధ్రపత్రిక వంటి పత్రికల్లో చిత్రాలు గీశారు. ఈయన చిత్రాలలో తెలుగుదనం, తెలుగు సంస్కృతి ఆచారవ్యవహారాలు, పండుగలకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు.

2) లియోనార్డో డావిన్సి :
ఈయన ఇటలీ దేశస్థుడు. ఈయన ‘మొనాలిసా’ చిత్రాన్ని గీశాడు. ఈ చిత్రాన్ని ఎవరు చూసినా మంత్ర ముగ్ధులవుతారు. ఇప్పుడు ఈ చిత్రం పారిస్ నగరంలో ‘టాఫ్స్’ అనే వస్తు ప్రదర్శనశాలలో ఉంది.

3) పాబ్లో పికాసో (1881 – 1973) :
పికాసో 20వ శతాబ్దిలోని చిత్ర కళాకారులలో మిక్కిలి ప్రసిద్ధుడు. 1901లో ఈయన చిత్రించిన “తల్లి ప్రేమ (మాతా, శిశువు)” చిత్రం అద్భుత కళాఖండం. తన బుగ్గను శిశువు తలకు ఆనించి, కళ్ళు మూసి తన్మయత్వం చెందుతున్న తల్లి చిత్రం ఇది.

4) రాజా రవివర్మ :
దేవుడు మనిషిని సృష్టించాడు. ఆ మనిషి దేవుణ్ణి చిత్రించి మనుషులకు ఇచ్చాడు. గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళను తన చిత్రకళ ద్వారా ఇళ్ళకు తెచ్చిన ఘనత రాజా రవివర్మకు దక్కుతుంది. రవివర్మ చిత్రించిన దేవుళ్ళ బొమ్మలు ప్రసిద్ధి పొందాయి. ఈయన చిత్రించిన కావ్యస్త్రీలందరిలో దమయంతి గొప్ప అందాల రాశి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
విహారయాత్రను గూర్చి స్నేహితునికి / స్నేహితురాలికి లేఖ.
జవాబు:

లేఖ

నిడదవోలు,
x x x x x x x x

ప్రియమైన స్వప్నకు,

శుభాకాంక్షలతో శశిరేఖ రాయునది.
నేను గడచిన సెలవులలో హైదరాబాదు విహారయాత్ర చేసి వచ్చాను. అక్కడ చూడాల్సిన వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాలార్జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, నెహ్రూ జంతుప్రదర్శనశాల (జూ), చార్మినార్, బిర్లా మందిర్, అసెంబ్లీ హాల్, గోలకొండ మొదలైనవి చూసి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాల సౌందర్యాన్ని అందరూ తప్పక చూడవలసిందే. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యపట్టణమైన హైదరాబాదును నీవు కూడా దర్శించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
శశిరేఖ.

చిరునామా :
కె. స్వప్న,
7వ తరగతి, జిల్లా పరిషత్ హైస్కూలు,
ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా.

ప్రశ్న 4.
దర్శనీయ స్థలాలలో “అజంతా గొప్పది” అని నిరూపిస్తూ మీ పాఠం ఆధారంగా రాయండి. (S.A. II – 2018-19)
జవాబు:
దర్శనీయ స్థలాల్లో ‘అజంతా గొప్పది’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతీయ చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాలు ఎన్నో అజ్ఞానం, నిర్లక్ష్యం, స్వార్థాల వల్ల పాడైపోతున్నాయి.

మనదేశంలో దర్శనీయ స్థలాలు అనగానే మొదట గుర్తుకు వచ్చేది అజంతా గుహలే. ప్రాచీనకాలంలో భారతీయ సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేదో, అప్పటి వృత్తులు, వ్యాసాంగాలు, వినోదాలు ఎలాంటివో తెలుసుకోవాలంటే అజంతా గుహలను చూస్తే తెలుస్తుంది. ఒకప్పటి రాజుల, రాణుల వేషభాషలు, రాజసభలు, సైనికబలం, ఆయుధాలు ఇవన్నీ అజంతా గుహల ద్వారా తెలుస్తాయి. ఇంకా నౌకాదళాన్ని, సాగరాలు దాటిన భారతీయ వ్యాపారులను, పర్ష్యన్ రాయబారులతో మాట్లాడిన భారతీయ చక్రవర్తులను, గౌతమబుద్ధుని సందేశాలను చూడవచ్చు.

అజంతా గుహల్లో బౌద్ధ భిక్షువులు స్త్రీల సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అందుకే జవహర్‌లాల్ నెహ్రూ ‘అజంతా’ మన మనస్సును ఏదో కలల లోకానికి తీసుకువెళుతుందని, అజంతా అతి వాస్తవికమైన లోకమని చెప్పారు. అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతుంది.

అందుకే అజంతా దర్శనీయ స్థలాలలో గొప్పదని చెప్పవచ్చు.

8th Class Telugu 4th Lesson అజంతా చిత్రాలు 1 Mark Bits

1. అరకులోయ ప్రకృతి సౌందర్యం అద్భుతం (విగ్రహవాక్యం గుర్తించండి) (S.A. I – 2019-20)
ఎ) ప్రకృతి దైన సౌందర్యం
బి) ప్రకృతి కొఱకు సౌందర్యం
సి) ప్రకృతి యొక్క సౌందర్యం
డి) ప్రకృతి చేత సౌందర్యం
జవాబు:
సి) ప్రకృతి యొక్క సౌందర్యం

2. ప్రజలు శాంతిని కోరుతున్నారు (సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) ప్రజలు శాంతిని కోరడం లేదు
బి) ప్రజలచే శాంతి కోరబడుచున్నది
సి) శాంతిని ప్రజలు కోరుచున్నారు
డి) శాంతి చేత ప్రజలు కోరుతున్నారు.
జవాబు:
బి) ప్రజలచే శాంతి కోరబడుచున్నది

3. అజంతా చిత్రాలు అగ్నిలో బూడిద పాలైనాయి. (పర్యాయపదాలు గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) బూడిద, బుగ్గి
బి) వహ్ని, నిప్పు
సి) నీరు, జలము
డి) గృహము, ఇల్లు
జవాబు:
బి) వహ్ని, నిప్పు

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

4. అజంతాలోని గుహలగోడల పై బుద్ధుని కుడ్య చిత్రాలున్నాయి. (సమాసాన్ని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) పంచమీ
బి) షష్టీ
సి) సప్తమీ
డి) ప్రథమ
జవాబు:
బి) షష్టీ

5. ప్రజలు పుస్తకాలు చదివారు. (కర్మణి వాక్యాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) పుస్తకాలు ప్రజలను చదివాయి.
బి) చదవడం వల్ల ప్రజలు బాగుపడ్డారు.
సి) పుస్తకాలచేత ప్రజలు చదవబడ్డారు.
డి) ప్రజలచేత పుస్తకాలు చదవబడ్డాయి.
జవాబు:
డి) ప్రజలచేత పుస్తకాలు చదవబడ్డాయి.

6. సముద్రాన్ని వార్ధి అని కూడా అంటారు. గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) సంద్రం
బి) ఇంద్రం
సి) చంద్రం
డి) బృందం
జవాబు:
ఎ) సంద్రం

7. జాతీయాలకు సరిపోయే అర్థం గ్రహించి సరైన సమాధానం కింద గీత గీయండి. దొంగలు అజంతా గుహలో తలదాచుకున్నారు. (S.A. III – 2015-16)
ఎ) నివసించారు.
బి) వస్తువులు దాచుకున్నారు.
సి) తలను దాచుకున్నారు.
డి) ఆశ్రయం పొందారు.
జవాబు:
ఎ) నివసించారు.

భాషాంశాలు – పదజాలం

అర్ధాలు :

8. మేఘాలు ఆవరించాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆవరించాయి
బి) కప్పివేశాయి
సి) కనిపించాయి
డి) గోచరించాయి
జవాబు:
బి) కప్పివేశాయి

9. కొలనులో తామరలు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంబుధి
బి) జలధి
సి) సరస్సు
డి) సాగరం
జవాబు:
సి) సరస్సు

10. విహారయాత్రపై కుతూహలం ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆసక్తి
బి) అనాసక్తి
సి) గోచరించు
డి) దర్శించు
జవాబు:
ఎ) ఆసక్తి

11. రామాయణం ఆది కావ్యం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంతిమ
బి) మొదటి
సి) చివరి
డి) మధ్యకు
జవాబు:
బి) మొదటి

12. మన అస్తిత్వం కోల్పోకూడదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఉనికి
బి) ఊపిరి
సి) ఊరు
డి) ఉసురు
జవాబు:
ఎ) ఉనికి

13. స్త్రీలు ముస్తాబు అవుతున్నారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తిరస్కారం
బి) ఆస్కారం
సి) పరిష్కారం
డి) అలంకారం
జవాబు:
డి) అలంకారం

14. కుడ్యం పై చిత్రాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) గోడ
బి) ఇల్లు
సి) వాకిలి
డి) వారిధి
జవాబు:
ఎ) గోడ

పర్యాయపదాలు :

15. రాజు రాజ్యం పాలించాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పురోహితుడు, అమాత్యుడు
బి) ప్రభువు, నృపతి
సి) నరపతి, సురపతి
డి) క్షితీశుడు, జాలరి
జవాబు:
బి) ప్రభువు, నృపతి

16. ఆకాశంలో తారలు ఉన్నాయి- గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) నభం, నింగి
బి) విరులు, సుమం
సి) దివి, దానవం
డి) వరి, గది
జవాబు:
ఎ) నభం, నింగి

17. సరస్సులో జలం ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సముద్రం, క్షీరం
బి) నీరం, సుధ
సి) అవని, జలధి
డి) వారి, ఉదకం
జవాబు:
డి) వారి, ఉదకం

18. సముద్రం అనంతం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) క్షీరం, నీరం
బి) సాగరం, అంబుధి
సి) జలధి, జాగరణ
డి) అంబుధి, వారి
జవాబు:
బి) సాగరం, అంబుధి

19. పూల తావి మధురం – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) అంతరంగం, తాపత్రయం
బి) పరిమళం, సువాసన
సి) పరితపించు, తనివి
డి) ఆకాశం, అవరోధం
జవాబు:
బి) పరిమళం, సువాసన

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

20. కొండ పై నది ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పర్వతం, నగం
బి) శిఖరం, సమున్నది
సి) గాలి, మారుతం
డి) కొడవలి, కోరుడం
జవాబు:
ఎ) పర్వతం, నగం

21. సముద్రాలలోని కెరటం భయానకం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) వర్చస్సు, మేధస్సు
బి) తరంగం, అల
సి) మిత్రుడు, గోల
డి) సరస్సు, శిరస్సు
జవాబు:
బి) తరంగం, అల

ప్రకృతి – వికృతులు :

22. సంతోషంగా ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సంతసం
బి) సంబరం
సి) సంబురం
డి) సంబారం
జవాబు:
ఎ) సంతసం

23. ఇంతిని గౌరవించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) మహిళ
బి) స్త్రీ
సి) శ్రీ
డి) వనిత
జవాబు:
బి) స్త్రీ

24. తెలుగు భాష లెస్స – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) బస
బి) బాస
సి) బోస
డి) బైస
జవాబు:
బి) బాస

25. యాత్ర చేశాము – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) యాతర
బి) జేతర
సి) జోతర
డి) జైతర
జవాబు:
ఎ) యాతర

26. పక్షి ఎగిరింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) పచి
బి) పచ్చి
సి) పక్కి
డి) విహంగం
జవాబు:
సి) పక్కి

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

27. పూవు వికసించింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) పూజ
బి) పుష్పం
సి) కుసుమం
డి) జలం
జవాబు:
బి) పుష్పం

28. గోడ చిత్రాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) గహ్వర
బి) గవాక్షం
సి) కుడ్యం
డి) శిఖరం
జవాబు:
సి) కుడ్యం

29. మానవులు కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) కీరితి
బి) కిరితి
సి) కరితి
డి) కృతి
జవాబు:
ఎ) కీరితి

30. చిత్రం బాగుంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) చెత్తరువు
బి) చిత్తరువు
సి) చిక్కరువు
డి) చిత్తవు
జవాబు:
బి) చిత్తరువు

31. ప్రజ్ఞ ఇంటికి వెళ్ళింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) పగై
బి) పజ
సి) గజ
డి) జయీ
జవాబు:
ఎ) పగై

32. వేసము వేశాము – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) ధరష
బి) వేషము
సి) వషము
డి) ధృతము
జవాబు:
బి) వేషము

33. దిస్ట్రి తగిలింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) దిష్టి
బి) దృతి
సి) ధృతి
డి) దోష్టి
జవాబు:
ఎ) దిష్టి

నానార్థాలు :

34. దేవుడే దిక్కు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) దెస, దైవం, దాపరికం
బి) శరణు, రక్ష, అంబోధి
సి) శరణు, శతం, శాంకరి
డి) దిస, రక్షణ, పక్షం
జవాబు:
డి) దిస, రక్షణ, పక్షం

35. ఉత్తరం రాశాను – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ఉత్తరం, వేరుణ
బి) లేఖ, సమాధానం
సి) కాలం, విచారం
డి) ప్రశ్న, జవాబు
జవాబు:
బి) లేఖ, సమాధానం

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

36. వర్షం కురిసింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వాస, సంవత్సరం
బి) మాసం, సంవత్సరం
సి) వాన, వాగ్యుద్ధం
డి) సమరం, వాన
జవాబు:
ఎ) వాస, సంవత్సరం

37. తపస్వి వెళ్ళాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ముని, నారదుడు
బి) చంద్రుడు, చంచలం
సి) చారిత్రం, చరితం
డి) పులుగు, పయోధి
జవాబు:
బి) చంద్రుడు, చంచలం

వ్యుత్పత్త్యర్థాలు :

38. ‘పక్షి’ – దీనికి వ్యత్పత్తి ఏది?
ఎ) పక్షములు కలది
బి) పక్కములు లేనిది
సి) పయస్సు కలది
డి) పరువం కలది
జవాబు:
ఎ) పక్షములు కలది

39. సంతోషింపచేయువాడు – అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) సర్వం సహా
బి) చంద్రుడు
సి) శుక్రుడు
డి) ధరణి
జవాబు:
బి) చంద్రుడు

40. మహిని పాలించువాడు – అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) మహీపాలుడు
బి) మహాత్ముడు
సి) మహనీయుడు
డి) మహీధరము
జవాబు:
ఎ) మహీపాలుడు

41. సగరపుత్రులచే తవ్వబడినది – ఈ వ్యుత్పత్తి గల పదం గుర్తించండి.
ఎ) సారధి
బి) సాధికారత
సి) జలధి
డి) సాగరం
జవాబు:
డి) సాగరం

వ్యాకరణాంశాలు

సంధులు :

42. నీలాకాశం మనోహరం – ఇది ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) గుణసంధి
సి) త్రికసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

43. క్రింది వానిలో యడాగమ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) లేకుండెను
బి) తలయెత్తు
సి) అమ్మమ్మ
డి) ఊరెల్ల
జవాబు:
బి) తలయెత్తు

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

44. పక్ష్యాదులు ఉన్నాయి – గీత గీసిన పదానికి విడదీయడం గుర్తించండి.
ఎ) పక్షి + అదులు
బి) పక్షే + యాదులు
సి) పక్షి + ఆదులు
డి) పక్ష్మ + ఆదులు
జవాబు:
సి) పక్షి + ఆదులు

45. క్రింది వానిలో వికల్ప సంధిని గుర్తించండి.
ఎ) గుణసంధి
బి) అత్వసంధి
సి) గసడదవాదేశ సంధి
డి) ఇత్వసంధి
జవాబు:
డి) ఇత్వసంధి

46. చెట్టుగాని – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) త్రికసంధి
సి) గసడదవాదేశ సంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
సి) గసడదవాదేశ సంధి

47. క్రింది వానిలో పుంప్వాదేశ సంధికి ఉదాహరణ ఏది?
ఎ) చెక్కడపు పని
బి) చెక్కపని
సి) చిలుకజోస్యం
డి) మహోన్నతం
జవాబు:
ఎ) చెక్కడపు పని

48. సర్వోత్తమంగా ఉంది – దీనిని విడదీస్తే
ఎ) సర్వ + ఉత్తమం
బి) సర్వో + త్తమం
సి) సర్వ + ఆత్తమ
డి) సర్వే + ఉత్తమ
జవాబు:
ఎ) సర్వ + ఉత్తమం

సమాసాలు :

49. ప్రకృతి సౌందర్యం పరవసింపజేసింది – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం ఏది?
ఎ) ప్రకృతి యొక్క సౌందర్యం
బి) ప్రకృతితో సౌందర్యం
సి) ప్రకృతి కొరకు సౌందర్యం
డి) ప్రకృతియైన సౌందర్యం
జవాబు:
ఎ) ప్రకృతి యొక్క సౌందర్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

50. నది యొక్క ప్రవాహం – దీనికి సమాసపదం గుర్తించండి.
ఎ) జలనది
బి) నదీప్రవాహం
సి) నద్వజలం
డి) అమజలం
జవాబు:
బి) నదీప్రవాహం

51. భక్తి శ్రద్ధలు ఉండాలి – ఇది ఏ సమాసం?
ఎ) ద్విగు సమాసం
బి) కర్మధారయ సమాసం
సి) ద్వంద్వ సమాసం
డి) తత్పురుష సమాసం
జవాబు:
సి) ద్వంద్వ సమాసం

52. సప్తమీ తత్పురుషమునకు ఉదాహరణ గుర్తించండి.
ఎ) కుడ్య చిత్రాలు
బి) ప్రకృతి సౌందర్యం
సి) నలుదిక్కులు
డి) తల్లిదండ్రులు
జవాబు:
ఎ) కుడ్య చిత్రాలు

53. షష్ఠీ తత్పురుషమునకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) కర్మణి వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) దశకంఠుడు
డి) ముజ్జగములు
జవాబు:
ఎ) కర్మణి వాక్యం

54. అగ్ని ప్రమాదం జరిగింది – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) అగ్ని వలన ప్రమాదం
బి) అగ్నికి ప్రమాదం
సి) అగ్ని యందు ప్రమాదం
డి) అగ్ని కొరకు ప్రమాదం
జవాబు:
ఎ) అగ్ని వలన ప్రమాదం

55. సంఖ్యా శబ్దం – పూర్వంగా కలిగిన సమాసం గుర్తించండి.
ఎ) పంచమీ తత్పురుష
బి) ద్విగు సమాసం
సి) రూపకం
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
బి) ద్విగు సమాసం

56. ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం గుర్తించండి.
ఎ) తత్పురుష సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహుప్రీహి సమాసం
డి) అవ్యయీభావ సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

57. పచ్చిక బయలు – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) పచ్చిక యందు బయలు
బి) పచ్చిక వలన బయలు
సి) పచ్చిక కొరకు బయలు
డి) పచ్చికతో బయలు
జవాబు:
డి) పచ్చికతో బయలు

గణ విభజన:

58. అజంత – ఇది ఏ గణము?
ఎ) జ గణం
బి) త గణం
సి) న గణం
డి) మ గణం
జవాబు:
ఎ) జ గణం

59. చిత్తము – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UIU
బి) UII
సి) IUI
డి) III
జవాబు:
బి) UII

60. వ్యవధి – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UII
బి) IUI
సి) UUU
డి) II
జవాబు:
డి) II

61. IIUI – ఇది ఏ గణము?
ఎ) భగ
బి) సల
సి) నల
డి) గగ
జవాబు:
బి) సల

వాక్యాలు :

62. ప్రజల చేత శాంతి కోరబడింది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నీవార చరిత్ర
బి) పినాకపాణి
సి) అత్మార్థక వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
ఎ) నీవార చరిత్ర

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

63. వానలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అభ్యర్థక వాక్యం
బి) ధాత్వర్థక వాక్యం
సి) క్వార్థక వాక్యం
డి) చేదర్థక వాక్యం
జవాబు:
డి) చేదర్థక వాక్యం

64. పాలు తెల్లగా ఉండును – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) చేదర్థక వాక్యం
సి) శత్రర్థక వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
ఎ) తద్ధర్మార్థక వాక్యం

65. స్వాతంత్ర్యం పొందాలి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) అప్యర్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
ఎ) విధ్యర్థక వాక్యం

66. మీరు పాఠం విన్నారు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) మీరు పాఠం శ్రద్ధగా వినలేదు గదా !
బి) మీరు పాఠం వినలేదు.
సి) మీరు పాఠం వినకపోవచ్చు.
డి) మీరు విని తీరాలి.
జవాబు:
బి) మీరు పాఠం వినలేదు.

అలంకారాలు :

67. అర్థ భేదం లేకపోయినా తాత్పర్య భేదం కలిగిన అలంకారం ఏది?
ఎ) లాటానుప్రాస
బి) యమకం
సి) వృత్త్యనుప్రాస
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
ఎ) లాటానుప్రాస

68. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) ఉపమ
బి) వృత్త్యనుప్రాస
సి) యమకం
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 4 అజంతా చిత్రాలు

69. మానవా ! నీ ప్రయత్నం మానవా! – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) యమకం
బి) ముక్తపదగ్రస్తం
సి) అంత్యానుప్రాస
డి) పరికరం
జవాబు:
ఎ) యమకం

70. ‘ఉత్ప్రేక్ష’ అనగా
ఎ) ఊహ
బి) బింబప్రతిబింబ భావం
సి) అనన్వయం
డి) సమన్వయం
జవాబు:
ఎ) ఊహ

71. ఈ రాజు సాక్షాత్తు పరమేశ్వరుడే – ఇది ఏ అలంకారం?
ఎ) అతిశయోక్తి
బి) రూపకం
సి) అంత్యానుప్రాస
డి) లాటానుప్రాస
జవాబు:
బి) రూపకం

సొంతవాక్యాలు :

72. కుతూహలం : హిమాలయ సందర్శన కోసం మనస్సు కుతూహల పడుతున్నది.

73. శాశ్వత కీర్తి : సత్కార్యాలు చేసి శాశ్వత కీర్తిని పొందవచ్చు.

74. చెక్కుచెదరకుండ : అమరావతిలో శిల్ప సంపద చెక్కుచెదరకుండా ఉంది.

75. ప్రకృతి సౌందర్యం : హిమాలయాల్లోని ప్రకృతి సౌందర్యం పులకరింప జేస్తుంది.

76. భూతల స్వర్గం : కాశ్మీర్ భూతల స్వర్గంలా మనకు దర్శనం ఇస్తుంది.

77. ఆవరించు : నీలి మేఘాలు ఆకాశాన్ని ఆవరించి ఉన్నాయి.

78. పరిసరాలు : మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

79. తేజోవంతం : సూర్యబింబం తేజోవంతంగా వెలుగొందుతున్నది.

80. సభ్యలోకం : విద్వాంసులను సభ్యలోకం ఘనంగా సత్కరిస్తుంది.

81. పునీతం : పుణ్యక్షేత్ర దర్శనంతో పునీతం అవుతాము.

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు.

AP State Syllabus 8th Class Telugu Important Questions 3rd Lesson నీతి పరిమళాలు

8th Class Telugu 3rd Lesson నీతి పరిమళాలు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది చుక్కగుర్తు గల పద్యాలకు భావాలను రాయండి.

1) చ. తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తిఁ గోరు నా
ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను శేషుఁడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవఁడే మణి మహాభరమైన ధరిత్రి భాస్కరా ! – (భాస్కర శతకం)

భావం :
భాస్కరా ! కీర్తిని కోరే గుణవంతుడు, తనకు ఎలాంటి లాభమునూ ఆశింపడు. లోకానికి మేలు జరిగే కార్యము ఎంత భారమైనా, చేయడానికి పూనుకుంటాడు. ఆదిశేషుడు గాలిని మాత్రమే మేస్తూ, తన వేయి పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని నిత్యం మోస్తున్నాడు కదా !

2) చ. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం
బదనుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టఁగ నేర్చునటయ్య భాస్కరా ! – (భాస్కర శతకం)

భావం:
భాస్కరా ! ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని, మనోజ్ఞతనూ గ్రహింప లేనప్పుడు, ఆ చదువు వ్యర్థం. దాన్ని గుణవంతులు ఎవరూ మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి నలపాకంగా, వంట చేసినా, దానిలో తగిన ఉప్పు వేయకపోతే అది రుచించదు కదా?

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

3) ఉ. భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితుఁ జేయుఁ బవిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించు నన్నియున్ – (సుభాషిత రత్నావళి)

భావం :
మానవులకు బంగారు కేయూరాలు, ముత్యాలహారాలు అలంకారాలు కావు. జుట్టు దువ్వుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, పన్నీటితో స్నానం చేయడం మానవుడికి అలంకారాలు కావు. పవిత్రమైన వాక్కు, పురుషుని అలంకరిస్తుంది. సంస్కారవంతమైన మాటయే, నిజమైన అలంకారము. మిగిలిన అలంకారాలు, నశించి పోయేవే.

4) చ. వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికికి (జిక్కె (జిల్వ గనువేదురుఁ జెందెను లేళ్ళు, తావినో
మని నశించెఁ దేటి, తరమా యిరుమూటిని గెల్వ వైదుసా
ధనముల నీవె గావఁదగు దాశరథీ కరుణాపయోనిధీ ! – (దాశరథీ శతకం)

భావం :
దయా సముద్రుడవైన ఓ రామా ! తన దురదను పోగొట్టుకోవడానికి ఏనుగూ ; నోటి రుచిని ఆశించి చేప, సంగీతానికి లొంగి పామూ, అందానికి బానిసయై జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలూ, బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి, ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్లనే నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియములందూ చాపల్యం గల నేను, ఎలా బయటపడగలను? ఓ దశరథ పుత్రా! కరుణాసాగరా ! రామా ! నీవే నన్ను కాపాడాలి.

5) ఆ.వె. క్షమను కడఁక నెవరు గాపాడుకొందుఱో
క్షమను చిరము వారు కావ గలరు
కదలకుండ నెవరికడ క్షమయుండునో
సర్వకార్యములకు క్షములు వారు – (సభారంజన శతకం)

భావం :
ఎవరు ప్రయత్నంతో క్షమను (ఓరిమిని) కాపాడుకుంటారో, వారు క్షమను’ (భూమిని) కాపాడతారు. ఎవరిలో క్షమ (సహనం) నిశ్చలంగా ఉంటుందో, వారు అన్ని పనుల్లోనూ క్షములై (సమర్థులై) ఉంటారు.

6) శా. ఊరూరం జనులెల్ల క్షమిడరో, యుండం గుహలలవో
చీరానీకము వీధులం దొరకదో శీతామృత స్వచ్ఛ వాః
పూరం బేరుల బారదో తపసులం బ్రోవంగ నీవోపవో
చేరంబోవుదు రేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా! – (శ్రీకాళహస్తీశ్వర శతకం)

భావం :
శ్రీకాళహస్తీశ్వరా ! తినడానికి భిక్షం అడిగితే ప్రతి గ్రామంలోనూ ప్రజలు భిక్షం పెడతారు. నివసించడానికి గుహలు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతం లాంటి తియ్యని నీరు ఉంది. తపస్సు చేసుకొనే మనుష్యులను కాపాడడానికి నీవున్నావు. ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలియడం లేదు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

ఆ) కింది అపరిచిత పద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి
కం|| “ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే”
ప్రశ్నలు :
1. సర్వోపగతుండెవరు?
జవాబు:
సర్వోపగతుండు ‘చక్రి’. చక్రి అనగా చక్రమును ధరించే శ్రీమహావిష్ణువు.

2. చక్రి ఎక్కడున్నాడు?
జవాబు:
చక్రి అన్ని చోట్లా ఉంటాడు.

3. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తుంది?
జవాబు:
ఈ పద్యం, దానవాగ్రణిని అంటే రాక్షసరాజు హిరణ్యకశిపుని సంబోధిస్తుంది.

4. ఈ పద్యం ఏ గ్రంథంలోనిది .? (రామాయణం, భారతం, భాగవతం)
జవాబు:
ఈ పద్యం భాగవతం లోనిది.

2. కింది పద్యాన్ని చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ”
ప్రశ్నలు :
1. కమలములు ఎపుడు వాడిపోతాయి?
జవాబు:
కమలములు నీటిలో నుండి బయటకు వస్తే సూర్యుని కాంతి తాకి వాడిపోతాయి.

2. మిత్రులు శత్రువులు ఎపుడు అవుతారు?
జవాబు:
తమ తమ స్థానాలను కోల్పోతే మిత్రులు శత్రువులు అవుతారు.

3. ఈ పద్యానికి మకుటమేది?
జవాబు:
సుమతీ

4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
రశ్మి అనగా ఏమిటి?

3. కింది పద్యమును చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి

అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ ! వినురవేమ!
ప్రశ్నలు :
1. అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది?
జవాబు:
అంటూ ఉంటే అతిశయిల్లేది రాగము.

2. తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
జవాబు:
తింటూ ఉంటే తీయనయ్యేది వేము.

3. సాధనతో సమకూరేవి ఏవి?
జవాబు:
సాధనమున పనులు సమకూరు ధరలోన

4. ఈ పద్యానికి మకుటం ఏమిటి?
జవాబు:
విశ్వదాభిరామ ! వినురవేమ !

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

4. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించండి.
చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తినుడువడేని
దయయుసత్యంబులోనుగా దలపడేని
కలుగనేటికి తల్లులు కడుపుచేటు
ప్రశ్నలు :
1. “కడుపుచేటు” అనే మాటకు అర్థం
ఎ) చెడ్డకడుపు
బి) పుట్టుక దండగ
సి) తల్లులకు బాధ
జవాబు:
బి) పుట్టుక దండగ

2. శివపూజ ఎలా చేయమంటున్నాడు కవి?
ఎ) ఆరు చేతులతో
బి) చేతులు నొప్పి పుట్టేటట్లు
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు
జవాబు:
సి) చేతులతో తృప్తి కలిగేటట్లు

3. దయను, సత్యాన్ని రెండింటిలో మనిషి వేటిని తలచాలి?
ఎ) దయను మాత్రమే
బి) సత్యాన్ని మాత్రమే
సి) దయను, సత్యాన్ని రెండింటిని
జవాబు:
సి) దయను, సత్యాన్ని రెండింటిని

4. నోరారా హరి కీర్తిని………….
ఎ) పిలవాలి
బి) పలకాలి
సి) అరవాలి
జవాబు:
బి) పలకాలి

5. కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.
ప్రశ్నలు :
1. నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
జవాబు:
నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.

2. పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.

3. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.

4. ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.

6. ఈ కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడుదగన్
హేమంబు కూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ !
ప్రశ్నలు:
1. చీమలు పెట్టిన పుట్టలు వేటికి స్థానమవుతాయి?
జవాబు:
పాములకు

2. పై పద్యంలో కవి పామరుడిని ఎవరితో పోల్చాడు?
జవాబు:
చీమలతో

3. ‘బంగారం’ అనే అర్థం వచ్చే పదం పై పద్యంలో ఉంది. గుర్తించి రాయండి.
జవాబు:
హేమము

4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘భూమీశుడు’ అనగా ఎవరు?

7. ఈ కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు జల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ ! వినురవేమ !
ప్రశ్నలు :
1. అల్పుని మాటలు ఎలా ఉంటాయి?
జవాబు:
ఆడంబరంగా

2. ఆహ్లాదకరంగా మాట్లాడువారు ఎవరు?
జవాబు:
సజ్జనుడు

3. కవి ఈ పద్యంలో ఏ రెండు లోహాలను పోల్చారు?
జవాబు:
కంచు, బంగారం

4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
దీనిలోని మకుటం ఏది?

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

8. కింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొరనింద సేయ బోకుము కార్యా
లోచనము లొంటి జేయకు
మాచారము విడువ బోకుమయ్య ! కుమారా !
ప్రశ్నలు :
1. ఒంటరిగా చేయకూడనిది ఏది?
జవాబు:
కార్యాలోచనము.

2. వేటిని విడిచి పెట్టకూడదు?
జవాబు:
ఆచారములు.

3. “తనని పోషించిన యజమానిని నిందించరాదు” అనే భావం వచ్చే పద్యపాదాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
బ్రోచిన దొర నింద సేయబోకుము.

4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ పద్యా నికి మకుటం ఏమిటి?
(లేదా)
ఈ పద్యాన్ని రాసినది ఎవరు?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘శతకం’ అనే ప్రక్రియను వివరించండి. (S.A. I – 2018-19)
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘శతకం’ అనే ప్రక్రియ ఒకటి. ఇందులో నూరు పద్యాలు ఉంటాయి. కొన్ని శతకాల్లో నూరుకు పైగా పద్యాలు ఉంటాయి. శతకంలో మకుటం ప్రధానంగా ఉంటుంది. కొన్ని శతకాల్లో మకుటం లేకుండా పద్యాలు ఉంటాయి. నీతి, ధర్మం, భక్తి, వైరాగ్యం మొదలైన అంశాలను శతకపద్యాలు బోధిస్తాయి. శతక పద్యాలు సమాజంలో నైతిక విలువలను, ఆధ్యాత్మిక భావనను, సత్ప్రవర్తనను కల్గిస్తాయి. సమాజంలో మూఢాచారాలను. తొలగించడానికి సహకరిస్తాయి.

ప్రశ్న 2.
సంస్కారం అంటే ఏమిటి? దాని గురించి నీవు ఏమనుకున్నావో రాయండి.
జవాబు:
సంస్కారం అంటే సంస్కరించడం. అంటే చక్కజేయడం. సాంఘికం, రాజకీయం, పరిపాలన, న్యాయవ్యవస్థ వంటి రంగాల్లో ఉన్న లోపాలను సవరించి, మంచి మార్గంలో పెట్టడం “సంస్కారం”. అలా సంస్కారం చేసిన వారిని “సంస్కర్త” అంటారు. పెద్దలు చెప్పిన మంచిదారిలో నడవడం “సంస్కారం”.

వీరేశలింగం గారు తన కాలం నాటి సంఘంలోని లోపాలను ఎత్తిచూపి, ప్రజలను మంచిదారిలో పెట్టడానికి కృషి చేశాడు. అందుకే ఆయన గొప్ప “సంఘసంస్కర్త” అయ్యాడు.

రాజకీయాలలోని లోపాలను సవరించడానికి ‘అన్నాహజారే’ వంటివారు లోక్ పాల్ బిల్లుకోసం ప్రయత్నించి విజయం సాధించారు. అన్నాహజారే “రాజకీయ సంస్కర్త”.

పూర్వకాలంలో శంకరాచార్యులవారు వేదమతాచారంలోని లోపాలను సంస్కరించి, అద్వైతమతాన్ని స్థాపించారు. ఆయన “మత సంస్కర్త”.

ఇటువంటి సంస్కరణల వల్ల మనిషిలో పెంపొందే ఉత్తమ గుణమే “సంస్కారం”.

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 3.
ఏనుగు లక్ష్మణకవి “వాగ్భూషణమే సుభూషణం” అని చెప్పాడు కదా ! దీనిని మీరు సమర్థిస్తారా? ఎందుకు?
జవాబు:
ఏనుగు లక్ష్మణకవి వాగ్భూషణమే సుభూషణం అని చెప్పాడు. ఇది నిజమే. ఈ మాట అందరినీ ఆలోచింపచేసేదిగా ఉంది. మంచి మాటకున్న శక్తిని లోకానికి చాటాడు. ఇది విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మంచి వాక్కు వల్ల విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న వాక్ శక్తిని పెంపొందించుకొనగలుగుతారు. నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకుంటారు. ఈ వాక్ శక్తి వల్ల ఎంతటి వారినైనా చక్కగా ఆకట్టుకొనగలుతారు. హేతువాద దృష్టిని అలవరుచుకొనగలుగుతారు. – చక్కని విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. వాక్ శక్తి వల్ల అనేకములైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ప్రశ్న 4.
పాఠంలోని పద్యాల్లో ఉన్న నీతిని సొంతమాటల్లో రాయండి.
జవాబు:

  1. గొప్ప గుణవంతుడు, లోకానికి హితమైన కార్యాన్ని ఎంత భారమైనా చేయడానికి పూనుకుంటాడు.
  2. ఉప్పులేని కూరవలె రసజ్ఞత లేని చదువు వ్యర్థం.
  3. సంస్కారవంతమైన మాటయే నిజమైన అలంకారం.
  4. మానవులను పంచేంద్రియ చాపల్యం నుండి భగవంతుడే కాపాడాలి.
  5. క్షమాగుణం కలవాడే అన్ని కార్యములకు సమర్థుడు.
  6. మానవులు రాజులను ఆశ్రయించడం వ్యర్థం.
  7. ఎదుటి వాడి బలాన్ని తెలుసుకోకుండా అతడితో పోరాడడం అవివేకం.
  8. జీర్ణం కాని చదువూ, తిండి చెరుపు చేస్తాయి.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
‘నీతి పరిమళాలు’ పాఠ్యభాగం ఆధారంగా నీవు గ్రహించిన విషయాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
‘నీతి పరిమళాలు’ అనే పాఠ్యభాగంలో శతక కవులు చక్కని నీతులను చెప్పారు. ఆ నీతులు సమాజానికి ఎంతగానో సహకరిస్తాయి. జగతిని జాగృతం చేస్తాయి. సారం లేకుండా చదివే చదువు ఉప్పులేని కూర వంటిది. మానవునికి బంగారు ఆభరణాలు, పుష్పాలు, సుగంధద్రవ్యాలు, పన్నీటి స్నానాలు అలంకారాలు కావు. సంస్కారవంతమైన వాక్కు మాత్రమే మానవులకు నిజమైన అలంకారం.

మానవుడు పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే ఏదైనా సాధించగలడు. పంచేంద్రియాలకు బానిసలైతే పతనాన్ని పొందుతారు. మానవులకు ఓర్పు గొప్ప అలంకారం. ఓర్పుతో అసాధ్యమైన పనులను కూడా సాధించగలడు.

గొప్పవారితో తలపడడం మంచిది కాదు. శక్తిసామర్థ్యాలను గుర్తించకుండా ఎదుటివారితో తలపడితే పరాభవం కలుగక మానదు. గొప్పవారితో పోరాడటం వల్ల వారికేమీ నష్టం కలుగదనే సత్యాన్ని గ్రహించాలి. ఇలాంటి నీతులు అనేకం అనేది పాఠ్యభాగం ద్వారా గ్రహించాను.

ప్రశ్న 2.
“నోరు మంచిదైతే – ఊరు మంచిదౌతుంది” – దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
ఈ సమస్త చరాచర ప్రకృతిలో అన్నిటికన్నా అద్వితీయమైంది మానవ జన్మ. అది ఎంతో విశిష్టమైంది, విలక్షణమైంది. మమతలు పంచుకుంటూ, మంచిని పెంచుకుంటూ, మానవతకు మారాకులు తొడుగుతూ, ఇలాతలంపై చిరునవ్వుల సిరివెన్నెలలు చిలికించగల శక్తి ఒక్క మానవుడికి మాత్రమే వుంది. అయితే, ఆ మానవుడికి నిజమైన ఆభరణం ఏమిటి? పూసుకునే అత్తరులా? వేసుకునే వస్త్రాలా? చేసుకునే సింగారాలా? ఇది ఒక మహత్తరమైన ప్రశ్న. మనసుపెట్టి ఆలోచిస్తే ఇవేవీ అసలైన ఆభరణాలు కావని ఇట్టే తెలిసిపోతుంది. ఇవన్నీ చెరిగిపోయేవి, వన్నె తరిగిపోయేవి. అలా కాకుండా, మానవుడికి ఎన్నటికీ చెరగని, తరగని ఆభరణంలా నిలచేది మధురమైన వాక్కు ఒక్కటే. మృదువైన భాషణంతో మనిషి అందరినీ ఆకర్షించగలుగుతాడు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతాడు. తన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతాడు. దీనికి భిన్నంగా పరుషమైన, కఠినమైన వాక్కు కలిగివుంటే ఆత్మీయులు కూడా ఆగర్భ శత్రువులుగా మారిపోతారు. అంతేకాదు, విరసమైన వాక్కు వలన జరిగే పనులు కూడా చెడిపోతాయి.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
‘నీతి పరిమళాలు’ పాఠం ఆధారంగా ఏయే మంచి గుణాలను అలవరచుకున్నారో పట్టిక తయారు చేయండి.
జవాబు:

  • మానవులకు బంగారు ఆభరణాలు అలంకారాలు కాదు.
  • సంస్కారవంతమైన వాక్కు మాత్రమే నిజమైన అలంకారం.
  • రసజ్ఞత లేని చదువు ఉప్పులేని కూరవంటిది.
  • గుణవంతుడు లోకానికి మేలు కలిగే కార్యక్రమమంత భారమైనా చేయడానికి ప్రయత్నిస్తాడు.
  • మానవుడు పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.
  • ఓర్పును మించిన ఆభరణం మరొకటి లేదు. ఓర్పుతో అసాధ్యములైన పనులను సాధంపవచ్చు.
  • రాజులను సేవించడం కంటే దేవదేవుడిని సేవించడం మిన్న.
  • శక్తియుక్తులు తెలుసుకోకుండా తోటివారితో పోరాడకూడదు.
  • అర్థం చేసుకొని చదవాలి. అవసరమైనంత మాత్రమే భుజించాలి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 2.
నీకు నచ్చిన శతక కవిని గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

పొదిలి,
x x x x x

ప్రియమైన మిత్రుడు రాధాకృష్ణకు,

నీ మిత్రుడు రాయునది నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది మన తెలుగు సాహిత్యంలో ఎందరో శతకకవులు ఉన్నారు. వారిలో నాకు భాస్కర శతక రచయిత మారద వెంకయ్య బాగా నచ్చారు. వారు జీవిత సత్యాలను చక్కగా ఆవిష్కరించారు. ప్రతి పద్యంలోను, దృష్టాంతంలో చెప్పిన విధం ఆకట్టుకుంది, అన్ని రంగాలమీద తన అభిప్రాయాలను, ముఖ్యంగా చదువు, వినయం మొదలైన విషయాల మీద చక్కని పద్యాలను రచించారు. భాస్కరా అనే మకుటంతో పద్యాలు రచించారు. వీరి శైలి కూడా లలితంగా ఉంటుంది. అట్లే నీకు నచ్చిన శతక కవిని గురించి వివరంగా నాకు తెలియజేయి. పెద్దలందరికి నా నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ మిత్రుడు,
x x x x x x

చిరునామా :
టి. రాధాకృష్ణ, 10వ తరగతి,
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,
పెదనందిపాడు, గుంటూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 3.
పాఠంలోని పద్యభాగాల ఆధారంగా విద్యార్థులలో నైతిక విలువల పట్ల అవగాహన పెంచడానికై ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
శతకపద్యాలు చదవండి

ప్రియమైన విద్యార్థులారా ! మన తెలుగు సాహిత్యంలో శతక గ్రంథాలకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఎందరో మహాకవులు తమ జీవిత అనుభవసారాన్ని రంగరించి చిన్న చిన్న పద్యాలతో మనకు అందించారు. విలువైన అంశాలను చిన్నపద్యాల్లో చిరస్థాయిగా గుర్తుపెట్టుకోనే విధంగా అందించారు. దీన్ని మనం మరువకూడదు. వేమన, వీరబ్రహ్మం వంటి ప్రజా కవులు సమాజంలోని సాంఘిక దురాచారాలను తూర్పారబట్టారు. నైతిక విలువల్ని, మనోధైర్యాన్ని పెంచడానికి కృషి చేశారు. ఆ మహనీయుల పద్యరత్నాలను అందరూ చదవండి. వాటిని ఆచరించండి. లోకానికి ఆదర్శంగా నిలువండి.
ఇట్లు,
తెలుగు భాషా సేవా కమిటి.

ప్రశ్న 4.
పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతకకవులు వచ్చారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనలను గురించి తెలుసుకోవడానికి పిల్లలు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు ? ఇంటర్వ్యూకు అవసరమైన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:
ఇంటర్వ్యూ ప్రశ్నావళి

  1. శతక కవులకు స్వాగతం. ‘శతకాలు’ ఎన్ని రకాలు?
  2. తెలుగులో మొదటి శతకకర్త ఎవరు?
  3. శతకాల్లో ఎన్ని రకాలున్నాయి?
  4. మకుటం లేని శతకాలు ఏమైనా ఉన్నాయా?
  5. నీతి శతకాల ప్రాముఖ్యత ఏమిటి?
  6. భక్తి శతకాలు మీరు ఏమైనా రాశారా?
  7. ‘కాళహస్తీశ్వర శతకం’లో భక్తి ఎక్కువగా ఉందా? రాజదూషణ ఉందా?
  8. వసురాయకవి గారి భక్త చింతామణి శతకం గూర్చి చెప్పండి.
  9. ‘సుమతి శతకం’ ప్రత్యేకత. ఎటువంటిది?
  10. మీకు నచ్చిన శతకం ఏమిటి?
  11. ఛందోబద్ధం కాని శతకాలు ఏమైనా ఉన్నాయా?
  12. మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?

8th Class Telugu 3rd Lesson నీతి పరిమళాలు 1 Mark Bits

1. తావినికికి జిక్కెం “జిల్వ” (అర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) చేప
బి) పాము
సి) ఏనుగు
డి) తేనెటీగ
జవాబు:
బి) పాము

2. “రాముడు” ఇది ఏ గణం? (S.A. I – 2018-19)
ఎ) ర గణం
బి) జ గణం
సి) డ గణం
డి) న గణం
జవాబు:
సి) డ గణం

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

3. మూడూ లఘువులు గల గణం ఏది?
ఎ) స గణం
బి) న గణం
సి) ర గణం
డి) మ గణం
జవాబు:
బి) న గణం

4. కరుణా పయోనిధి గాంభీర్య ఘనుడు (అర్థాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) నది
బి) లోయ
సి) తటాకం
డి) సముద్రము
జవాబు:
డి) సముద్రము

5. ఏనుగుల బలము చాలా ఎక్కువ. (గురులఘువులు గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) UIU
బి) III
సి) IIU
డి) UUI
జవాబు:
బి) III

6. రాజు బడికి వెళ్ళాలని తొందర పడుతున్నాడు. (సంధి విడదీయండి) (S.A. II – 2017-18)
ఎ) వెళ్ళా + లని
బి) వెళ్ళాల + అని
సి) వెళ్ళాలి + అని
డి) వెళ్ళా + అని
జవాబు:
సి) వెళ్ళాలి + అని

7. మూడూ గురువులే ఉండే గణం ఏది? (S.A. I – 2019-20)
బి) ర గణం
ఎ) న గణం
సి) జ గణం
డి) మ గణం
జవాబు:
డి) మ గణం

భాషాంశాలు – పదజాలం

అర్ధాలు :

8. విద్యార్థులకు క్షమ అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) దారి
బి) ధనం
సి) ఓర్పు
డి) వినయం
జవాబు:
సి) ఓర్పు

9. శత్రువులకు కూడా చెఱుపు తల పెట్టకూడదు – గీత గీసిన పదానికి గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వారి
బి) కీడు
సి) అగ్ని
డి) జలధి
జవాబు:
బి) కీడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

10. సరస్సులో మీనం ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఎలుక
బి) చేప
సి) కప్పు
డి) పాము
జవాబు:
బి) చేప

11. చిరకాలం జీవించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) గతకాలం
బి) మంచి కాలం
సి) విద్యా కాలం
డి) చాలా కాలం
జవాబు:
డి) చాలా కాలం

12. ధరిత్రి పై శాంతి నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) భూమి
బి) జలధి
సి) సాగరం
డి) వనం
జవాబు:
ఎ) భూమి

13. ఇంచుక జ్ఞానం అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తపన
బి) కొంచెము
సి) అధికము
డి) చాతుర్యం
జవాబు:
బి) కొంచెము

14. పయోధిలో రత్నాలు ఉంటాయి – గీత అర్థం గుర్తించండి.
ఎ) అవని
బి) పాపము
సి) సముద్రం
డి) భూషణము
జవాబు:
సి) సముద్రం

పర్యాయపదాలు :

15. భాస్కరుడు గొప్ప కాంతివంతుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సూర్యుడు, రజనీకరుడు
బి) రవి, ప్రభాకరుడు
సి) ఆదిత్యుడు, చంద్రుడు
డి) రవి, కువలయానందకరుడు
జవాబు:
బి) రవి, ప్రభాకరుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

16. విద్యార్థులు కీర్తి పొందాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) తపస్సు, ఉషస్సు
బి) రోచస్సు, ధనుస్సు
సి) యశస్సు, ఖ్యాతి
డి) ధరణి, వర్చస్సు
జవాబు:
సి) యశస్సు, ఖ్యాతి

17. అమృతం సేవిస్తారు దేవతలు – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
ఎ) క్షీరం
బి) నారం
సి) వారి
డి) సుధ
జవాబు:
డి) సుధ

18. దివిపై తారలు ఉదయించాయి – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
ఎ) చుక్కలు, నక్షత్రాలు
బి) దినకరాలు, అరవిందాలు
సి) కుముదాలు, కలువలు
డి) నిలయాలు, కిసలయాలు
జవాబు:
ఎ) చుక్కలు, నక్షత్రాలు

19. సింహం వడిగా వెళ్ళింది – గీత గీసిన పదానికి సమానార్థకం గుర్తించండి.
ఎ) వాయువు
బి) వేగం
సి) మందం
డి) దురంతం
జవాబు:
బి) వేగం

20. రాజు ప్రజలను పాలించు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) నీరపతి, జలనిధి
బి) గతనందనుడు, దాశరథి
సి) నృపతి, క్షితిపతి
డి) అంబుధి, సచివుడు
జవాబు:
సి) నృపతి, క్షితిపతి

ప్రకృతి – వికృతులు :

21. లక్ష్మి సంపదలను ఇచ్చు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) లెచ్చి
బి) లచ్చి
సి) లచ్చ
డి) లక్కి
జవాబు:
బి) లచ్చి

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

22. గుణమును ఆశ్రయించాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) గెనము
బి) గనము
సి) గృనము
డి) గొనము
జవాబు:
డి) గొనము

23. దేశ చరిత్ర ఉన్నతమైంది – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) చోరిత
బి) చరిత
సి) చారిత్ర
డి) చెరిత్ర
జవాబు:
బి) చరిత

24. అగ్గిలో పడితే కాలుతుంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) అగ్న
బి) అగ్ని
సి) అగ్గి
డి) అగ్లీ
జవాబు:
బి) అగ్ని

25. హృదయం నిర్మలంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) ఎద
బి) హేవయం
సి) హోదయం
డి) హదయం
జవాబు:
ఎ) ఎద

26. శ్రీ కావాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) సరి
బి) సెరి
సి) శీరి
డి) సిరి
జవాబు:
డి) సిరి

27. నీకు కర్ణం చేయాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) కార్యం
బి) కర్రమ
సి) కారం
డి) పని
జవాబు:
ఎ) కార్యం

నానార్థాలు :

28. ఆకాశంలో మిత్రుడు ప్రకాశిస్తున్నాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వారిధి, వార్షికం
బి) సూర్యుడు, స్నేహితుడు
సి) రవి, శని
డి) గురువు, వారిధి
జవాబు:
బి) సూర్యుడు, స్నేహితుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

29. సుధను దేవతలు త్రాగుతారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) దధి, క్షీరం
బి) ఘృతం, వారి
సి) అమృతం, పాలు
డి) నీరు, లవణం
జవాబు:
డి) నీరు, లవణం

30. రాజు కువలయానందకరుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ఉదధి, వారిదం
బి) నృపతి, చంద్రుడు
సి) శుక్రుడు, వాచస్పతి
డి) వారిధి, అంబుధి
జవాబు:
బి) నృపతి, చంద్రుడు

31. సూర్యుని కరం కాంతివంతం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కిరణం, వాయువు
బి) జలధి, ఉదధి
సి) వారిదం, కీడు
డి) చేయి, తొండము
జవాబు:
డి) చేయి, తొండము

వ్యుత్పత్త్యర్థాలు :

32. దాశరథి రక్షించుగాక – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
ఎ) దశరథుని కుమారుడు
బి) దాశరథికి తమ్ముడు
సి) దశరథుని చేత తమ్ముడు
డి) దశరథునికి ఆత్మీయుడు
జవాబు:
ఎ) దశరథుని కుమారుడు

33. పయోధి – ఈ పదానికి వ్యుత్పత్తి గుర్తించండి.
ఎ) నీటికి చెందునది
బి) నీటిలో రత్నాలు కలది
సి) నీటిని ధరించునది
డి) నీటి కొరకు ఆనందము
జవాబు:
సి) నీటిని ధరించునది

34. విశ్వమును ధరించునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) భూషితం
బి) ధరణి
సి) జలధి
డి) వారిధి
జవాబు:
బి) ధరణి

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

35. ‘కరి’ దీనికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
ఎ) అంకుశం కలది
బి) కరము కలది
సి) నీరము కలది
డి) క్షీరము కలది
జవాబు:
బి) కరము కలది

36. సర్వభూతములయందు సమభావన కలవాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) వారి
బి) జలధి
సి) మిత్రుడు
డి) శత్రువు
జవాబు:
సి) మిత్రుడు

37. పాపములను తొలగించువాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) ఈశుడు
బి) విధాత
సి) వేంకటేశుడు
డి) శంకరుడు
జవాబు:
సి) వేంకటేశుడు

వ్యాకరణాంశాలు

సంధులు :

38. శివునికి జలాభిషేకం చేశారు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) జన + అభిషేకం
బి) జల + అభిషేకం
సి) జలే + అభిషేకం
డి) జలా + ఆభిషేకం
జవాబు:
బి) జల + అభిషేకం

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

39. వేంకటేశ నమోనమః – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) వేంకట + ఈశ
బి) వేంకట్ + ఈశు
సి) వెంకట + ఆశ
డి) వేంక + టేశ
జవాబు:
డి) వేంక + టేశ

40. వీటిలో ఆమ్రేడిత సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) పల్లెటూరు
బి) ముందడుగు
సి) ఊరూరు
డి) చిగురుటాకు
జవాబు:
సి) ఊరూరు

41. చాలకున్న – ఇది ఏ సంధి పదమో గుర్తించండి.
ఎ) ఉత్వసంధి
బి) ఇత్వసంధి
సి) అత్వసంధి
డి) ఆమ్రేడిత సంధి
జవాబు:
సి) అత్వసంధి

42. కీర్తిఁగోరుట మంచిది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) ఉత్వసంధి
బి) సరళాదేశ సంధి
సి) త్రికసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) సరళాదేశ సంధి

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

43. లక్ష్మీ నీవే నాకు రక్ష – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) త్రికసంధి
సి) ఆమ్రేడిత సంధి
బి) పడ్వాదిసంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

44. దానికేమి? ఎక్కడ ఉన్నావు? – గీత గీసిన పదానికి సంధిని గుర్తించండి.
ఎ) యడాగమ సంధి
బి) సరళాదేశ సంధి
సి) ఇత్వసంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) ఇత్వసంధి

45. శ్రీకాళహస్తీశ్వరా – దీనిని విడదీయండి.
ఎ) శ్రీ + కాళహస్తీశ్వరా
బి) శ్రీకాళహస్తి + ఈశ్వరా
సి) శ్రీకాళహస్తి + ఏశ్వరా
డి) శ్రీకాళ + హస్తీశ్వరా
జవాబు:
బి) శ్రీకాళహస్తి + ఈశ్వరా

గణ విభజన

46. ‘ఉత్పలమాల’ – దీనికి గల గణాలను గుర్తించండి.
ఎ) భ, ర, న, భ, భ, ర, వ
బి) మ, స, జ, స, త, త, గ
సి) స, భ, ర, న, మ, య, వ
డి) న, జ, భ, జ, జ, జ, ర
జవాబు:
ఎ) భ, ర, న, భ, భ, ర, వ

47. UUU – ఇది ఏ గణము?
ఎ) న గణం
బి) మ గణం
సి) త గణం
డి) భ గణం
జవాబు:
బి) మ గణం

48. చంపకమాల – వృత్తంలోని పాదానికి అక్షరాల సంఖ్య
ఎ) 21
బి) 20
సి) 19
డి) 22
జవాబు:
ఎ) 21

49. ‘భూషలు’ – ఇది ఏ గణము?
ఎ) త గణం
బి) మ గణం
సి) భ గణం
డి) య గణం
జవాబు:
సి) భ గణం

50. క్షమను చిరమువారు కావగలదు – ఇది ఏ పద్య పాదము?
ఎ) మత్తేభం
బి) ఆటవెలది
సి) తేటగీతి
డి) కందం
జవాబు:
బి) ఆటవెలది

వాక్యాలు

51. అల్లరి చేయవద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్ధక వాక్యం
బి) తద్ధర్మార్థక వాక్యం
సి) అప్యర్థక వాక్యం
డి) నిషేధార్థక వాక్యం
జవాబు:
డి) నిషేధార్థక వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

52. మీకు మేలు కలుగుగాక ! – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధాక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) ఆశీరార్థక వాక్యం
డి) విధ్యర్థక వాక్యం
జవాబు:
సి) ఆశీరార్థక వాక్యం

53. వాడు వస్తాడో రాడో? – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) సందేహార్థక వాక్యం
సి) అద్యర్థక వాక్యం
డి) ధాత్వర్థక వాక్యం
జవాబు:
బి) సందేహార్థక వాక్యం

54. తప్పక అందరు రావాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) తప్పక అందరు రాకూడదు
బి) తప్పక కొందరు రాకూడదు
సి) తప్పక కొందరు రాకపోవచ్చు
డి) అందరు తప్పక రాలేకపోవచ్చు
జవాబు:
బి) తప్పక కొందరు రాకూడదు

55. అందరు కలలు కనాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) అందరు కలలు కనలేకపోవచ్చు.
బి) అందరు కలలు కని తీరాలి.
సి) అందరు కలలు కనకూడదు.
డి) కొందరు కలలు కనాలి.
జవాబు:
సి) అందరు కలలు కనకూడదు.

56. రమ తెలివైనది, అందమైనది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) సంక్లిష్ట వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) సంయుక్త వాక్యం
జవాబు:
డి) సంయుక్త వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

57. ధూర్జటి శతకం రచించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
ఎ) ధూర్జటి యందు శతకం రాశాడు.
బి) ధూర్జటి చేత శతకం రచింపబడింది.
సి) ధూర్జటి వల్ల శతకం రాశాడు.
డి) ధూర్జటికి శతకం రాయవచ్చు.
జవాబు:
బి) ధూర్జటి చేత శతకం రచింపబడింది.

58. అల్లరి చేస్తే శిక్ష తప్పదు – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
ఎ) చేదర్థకం
బి) అప్యకం
సి) శత్రర్థకం
డి) క్వార్ధకం
జవాబు:
ఎ) చేదర్థకం

అలంకారాలు

59. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్టు – ఇందలి అలంకారాన్ని గుర్తించండి.
ఎ) ఉపమ
బి) వృత్త్యనుప్రాస
సి) లాటానుప్రాస
డి) యమకం
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 3 నీతి పరిమళాలు

60. వీరు పొమ్మనువారు కాదు పొగబెట్టువారు – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.
ఎ) అంత్యానుప్రాస
బి) వృత్త్యనుప్రాస
సి) యమకం
డి) లాటానుప్రాస
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

సొంతవాక్యాలు :

61. లోకహితం : మహనీయులు లోకహితం కోసం నిరంతరం ప్రయత్నిస్తారు.

62. సత్త్వము : పాండవులు యుద్ధంలో తమ సత్త్వమును ప్రదర్శించారు.

63. క్షమ : విద్యార్థులకు అన్ని రంగాల్లోను క్షమ మిక్కిలి అవసరం.

64. పవిత్రవాణి : సజ్జనులు సభల్లో తమ పవిత్ర వాణిని వినిపిస్తారు.

65. నలపాకము : వివాహ విందులోని వంటకాలు నలపాకమువలె రుచికరంగా ఉన్నాయి.

66. అనిశం : భారత సైనికులు సరిహద్దుల్లో అనిశం రక్షణ బాధ్యతలను చూస్తారు.

67. రసజ్ఞత : కవులు సందర్భానుగుణంగా రసజ్ఞతతో మాట్లాడుతారు.

68. భూషణము : విద్వాంసులకు వినయమే గొప్ప భూషణము.

69. నిరర్థకము : నిరర్థకంగా సంపదను, కాలాన్ని వృథా చేయకూడదు.

70. స్వచ్ఛము : మా చెరువులోని నీరు స్వచ్ఛముగా ఉన్నది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు.

AP State Syllabus 8th Class Telugu Important Questions 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు

8th Class Telugu 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది పరిచిత గద్యాంశాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. (4) నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

సమాజంలో కుటుంబమే అత్యంత కీలకమైంది. ప్రప్రథమ సమూహం కుటుంబమే. వ్యక్తి సమాజంలో ఒంటరిగా మనజాలడు. కుటుంబంతో తాను మమేకమై జీవించడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు. అందుకే పుట్టుకతోనే మనిషికి కుటుంబంతో విడదీయలేని అనుబంధం ఏర్పడుతుంది. పోషణ, భద్రత కల్పించడం కుటుంబవ్యవస్థలో మౌలికాంశాలు. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. కుటుంబంలో అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతూంటాయి. పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, విచక్షణ జ్ఞానాన్నివ్వడం, సంస్కృతిని వారసత్వంగా అందించడం కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి.
ప్రశ్నలు :
1. వ్యక్తి సమాజంలో ఎలా మనజాలడు?
జవాబు:
వ్యక్తి సమాజంలో ఒంటరిగా మనజాలడు.

2. వ్యక్తి ఎలా ఆనందాన్ని పొందగలుగుతాడు?
జవాబు:
వ్యక్తి కుటుంబంతో తాను మమేకమై జీవించడం ద్వారా ఆనందాన్ని పొందగలుగుతాడు.

3. కుటుంబ వ్యవస్థలో మౌలికాంశాలు ఏవి?
జవాబు:
పోషణ, భద్రత కల్పించడం కుటుంబ వ్యవస్థలో మౌలికాంశాలు.

4. . కుటుంబ వ్యవస్థకు ప్రాథమిక లక్షణం ఏది?
జవాబు:
కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం

2. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. (4) నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

వేదకాలంనాటికే నాగరికమైన పద్ధతుల్లో ఈ కుటుంబవ్యవస్థ ఏర్పడిందని కొందరు చరిత్రకారుల భావన. వారి రాతల వల్ల కుటుంబ జీవనవిధానం ఆ కాలంలో అత్యున్నత స్థాయిలో ఉండేదనీ, భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఉన్నతశ్రేణిలో ఉండేవని తెలుస్తూంది. వేల ఏండ్ల నుంచీ విలువలకు కట్టుబడి జీవిస్తూ విశ్వానికి ఆదర్శంగా నిలిచిన కుటుంబ వ్యవస్థ మనది. ఆనాడు కుటుంబ జీవనం చాలా వరకు సాఫీగా సుఖంగా సాగిపోయిందనీ, అది చాలా నియమబద్ధంగా ఉండేదని తెలుస్తూంది. ఆ కుటుంబంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైంది. గౌరవప్రదమైంది. అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ‘ఇంటికి దీపం ఇల్లాలు’ అనే నానుడిని బట్టి భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎంతటి ఉన్నతస్థానం ఇచ్చారో | అర్థమవుతుంది. ఆ
ప్రశ్నలు:
1. కుటుంబ వ్యవస్థ ఎప్పటి నుండి ఏర్పడిందని చరిత్రకారులు భావించారు?
జవాబు:
కుటుంబ వ్యవస్థ వేద కాలం నుండి ఏర్పడిందని చరిత్రకారులు భావించారు.

2. ఏ బాంధవ్యాలు ఉన్నత స్థాయిలో ఉండేవి?
జవాబు:
భార్యాభర్తల సంబంధ, బాంధవ్యాలు ఉన్నత స్థాయిలో ఉండేవి.

3. కుటుంబంలో ఎవరి పాత్ర కీలకమైంది?
జవాబు:
కుటుంబంలో తల్లి పాత్ర కీలకమైంది.

4. పై పేరాలో ఉన్న తెలుగు నానుడి ఏది?
జవాబు:
పై పేరాలో ఉన్న నానుడి ‘ఇంటికి దీపం ఇల్లాలు’

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

3. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. (4) నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కాలం మారింది. కుటుంబం అనే మాటకు అర్థం, దాని నమూనా మారిపోయింది. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకు ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడం, స్వార్థం పూర్తిగా పెరిగిపోవడం, వీటివల్ల ఉమ్మడి కుటుంబవ్యవస్థలో మార్పులు అనివార్యమయ్యాయి. చిన్న కుటుంబభావన బలపడింది. సమష్టి వ్యవస్థ పూర్తిగా వ్యవ వ్యవస్థగా మారింది. తత్కారణంగా జీవన సరణిలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునికతవల్ల శ్రమవిభజనలో కొత్త మార్పులు వచ్చాయి. స్త్రీ పురుష సంబంధాల్లో కొత్త ధోరణులు ఏర్పడ్డాయి. ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటిపైనే ‘వ్యష్టి’ కుటుంబం ఆధారపడింది. ఈ వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయాధికారం లభిస్తాయి. అయితే ఇలా వ్యక్తి ప్రాధాన్యత పెరిగి ఉమ్మడికుటుంబ వ్యవస్థ మరుగున పడిపోతుంది.
ప్రశ్నలు:
1. కాలంతోపాటు దేనికి అర్థం మారింది?
జవాబు:
కాలంతో పాటు కుటుంబం అనే మాటకు అర్థం మారిపోయింది.

2. ఏ కారణం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మరుగున పడిపోయింది?
జవాబు:
వ్యక్తి ప్రాధాన్యత పెరగడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మరుగున పడిపోయింది.

3. ఏ సంబంధాల్లో కొత్త ధోరణులు ఏర్పడ్డాయి?
జవాబు:
స్త్రీ, పురుష సంబంధాల్లో కొత్త ధోరణులు ఏర్పడ్డాయి.

4. వ్యష్టి కుటుంబం వేటిమీద ఆధారపడింది?
జవాబు:
ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటి పైన వృష్టి కుటుంబం ఆధారపడింది.

4. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. (4) నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చిన్ననాటి నుంచి ఇంట్లో అందరితో గడిపిన మధుర క్షణాలు, జీవితంలో జరిగిన సంఘటనలు పెద్దయిన తరవాత సినిమాలా కళ్ళముందు మెదలాలి. ఈ మధురమైన అనుభూతిని పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోవాలంటే చక్కని కుటుంబం కావాలి. గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి మహనీయులెందరికో వారి కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి. ఆ * ఉమ్మడి కుటుంబం, వ్యక్తి కుటుంబాల మేలి కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా; ఆధిపత్యాల పోరులేని, ప్రేమానురాగాలు, విలువలు, మానవసంబంధాలు అంతస్సూత్రమైన ఒక మంచి
కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. అప్పుడే సమాజం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతాయి.
ప్రశ్నలు:
1. దేన్ని పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోవాలి?
జవాబు:
మధురమైన అనుభూతిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలి.

2. కుటుంబ వ్యవస్థ ఎవరికి స్ఫూర్తినిచ్చింది?
జవాబు:
కుటుంబ వ్యవస్థ గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్, అబ్దుల్ కలాం వంటి వారికి స్ఫూర్తినిచ్చింది.

3. మనకు ఎలాంటి కుటుంబం కావాలి?
జవాబు:
మనకు కమ్మని కుటుంబం కావాలి.

4. ఈ గద్యాంశానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పై పేరాకు ‘ఉమ్మడి కుటుంబం’ అనే శీర్షిక తగింది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

5. కింది పరిచిత గద్యం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2016-17)

కాలాలు మారినా ఏళ్లు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉంది. విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు మూలస్తంభాల మీద మన కుటుంబవ్యవస్థ ఆధారపడి ఉంది. “అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారికోసమే నా జీవితం” అనే త్యాగభావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక, కుటుంబ వ్యవస్థ బాగుంటే సమాజమూ బాగుంటుంది.
ప్రశ్నలు:
1. ఎటువంటి త్యాగభావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదికగా ఉంది?
జవాబు:
“అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారి కోసమే నా జీవితం”.

2. భారతీయ కుటుంబ వ్యవస్థకు ఆధార స్తంభాలు ఏవి?
జవాబు:
విశ్వసనీయత, సమగ్రత, ఏకత

3. కుటుంబ వ్యవస్థలోని గొప్పదనమేమిటి?
జవాబు:
కాలాలు మారినా ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉండటం విశేషం.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారుచేయండి.
జవాబు:
సమాజ అభివృద్ధికి దోహదం చేసేదేది?

6. ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. III – 2015-16)

‘కలసి ఉంటే కలదు సుఖం’ అనే సూత్రం ఆధారంగా సమష్టి కుటుంబం కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చేది. కొందరి మనోభావాలు భిన్నంగా ఉన్నప్పటికీ మొత్తం కుటుంబానికి అక్కరకు వచ్చేదే అమలయ్యేది. స్వార్థపరతకు తావు తక్కువ. మన అనే భావనకు అందరూ లోనై ఉండేవారు. రైతు కుటుంబాల్లో అయితే ఇంటిల్లిపాదీ ఇంటి పనుల్లో, బయటి పనుల్లో పాలుపంచుకునేవారు. శ్రామిక వర్గం అంతా దాదాపు అలానే ఉండేది. ఊరిలో ఏదన్నా పెళ్లి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకొని ఆ కార్యక్రమం చేసేవారికి ఆనందం కలిగించేవారు. ఈ సంఘీభావమే దేశానికి వెన్నెముక అయింది. సిరిసంపదలను పోగుచేసింది. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టిందానాడు. మన ఇతిహాసాలైన రామాయణ భారతాలు ఈ సమష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి. –
ప్రశ్నలు:
1. సమష్టి కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చే మూల సూత్రం ఏది?
జవాబు:
“కలసి ఉంటే కలదు సుఖం”

2. ఏది దేశానికి వెన్నెముక?
జవాబు:
సంఘీభావం.

3. ఈ పై పేరా ఆధారంగా రెండు ప్రశ్నలు తయారు చేయండి.
జవాబు:
1) కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించేవి ఏవి?
2) ఏ భావనకు అందరూ లోనై ఉండేవారు?

ఆ) కింది అపరిచిత గద్యాంశాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ఈ కింది వచనాలను చదివి వాటి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

గాంధీజీ తన ప్రసంగాలలో సత్యం, అహింస అనే రెండు తరచుగా ఉపయోగించేవారు. అయితే ఈ రెంటిలో మొదటిదానికే ప్రాధాన్యమిచ్చారు. అతడు సత్యాన్వేషకుడే కాదు. సత్యాన్ని ఆరాధించిన భక్తుడు. తన జీవితాన్ని “సత్యమార్గంతో పరిశోధనలు”గా అభివర్ణించారు. ప్రారంభంలో భగవంతుడే సత్యమని ప్రకటించారు. కానీ, చివరకు “సత్యమే భగవంతుడు” అని ప్రకటించే స్థితికి వచ్చారు. “ఎందుకంటే భగవంతుని ఉనికిని నిరాకరించవచ్చు. కానీ, సత్యమును కాదనడం కష్టం.
ప్రశ్నలు :
1. గాంధీ తన ప్రసంగాలలో తరచుగా ఉయోగించేవి ఏవి?
జవాబు:
సత్యం, అహింస.

2. ఆయన తన జీవితాన్ని ఏమని అభివర్ణించారు?
జవాబు:
సత్యమార్గంతో పరిశోధనలు.

3. ప్రారంభంలో ఆయన దేనిని సత్యమని ప్రకటించారు?
జవాబు:
భగవంతుడే సత్యం.

4. చివరకు ఆయన దేనిని భగవంతునిగా ప్రకటించే స్థితికి వచ్చారు?
జవాబు:
సత్యమే భగవంతుడు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. భాష నేర్చుకోవడం రెండు రకాలు. భాష కోసం భాష విషయం కోసం భాష. భాషా స్వరూప స్వభావాలను సమగ్రంగా అధ్యయనం చేయడం మొదటి రకంలోనిది. శాస్త్ర సాంకేతిక విషయాలను, సాహిత్య సాంస్కృతిక విషయాల వంటి వాటిని అధ్యయనం చెయ్యడం రెండవ రకంలోనిది. అలాగే భాష కూడా రెండు రకాలుగా తయారయింది. ప్రాచీన (కావ్య) భాష, ఆధునిక (ప్రామాణిక) భాష, సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని ఆనందించడానికి ప్రాచీన భాష ఉపయోగిస్తుంది. కాని, దాన్ని గురించి చెప్పడానికీ, రాయడానికి ఆధునిక భాషే కావాలి. ఎందువల్లనంటే ఏ కాలంలో జీవించేవాడి ఆలోచన, అలవాట్లూ ఆ కాలం నాటి భాషలోనే సాగుతుంటాయి. కనుక ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం. ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం. వివిధ శాస్త్ర విషయాలను వివరించడానికే కాదు, పూర్వ భాషా సాహిత్యాలను వివరించడానికి కూడా ఆధునిక భాషే కావాలి.
ప్రశ్నలు :
1. భాషను ఏయే రకాలుగా నేర్చుకొంటాము?
జవాబు:
భాషను భాష కోసం, విషయం కోసం నేర్చు కుంటాము.

2. భాష ఎన్ని రకాలుగా తయారయింది?
జవాబు:
భాషలో ప్రాచీన (కావ్య) భాష, ఆధునిక (ప్రామాణిక) భాష అని రెండు రకాలు.

3. ప్రాచీన భాష ఎందుకు ఉపయోగపడుతుంది?
జవాబు:
ప్రాచీన భాష సాహిత్యంలోని తరతరాల వార సత్వాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది.

4. ఆధునిక భాష ఉపయోగం ఏమిటి?
జవాబు:
ఆధునిక భాష సాహిత్యంలో తరతరాల గురించి చెప్పడానికి, రాయడానికి ఉపయోగపడుతుంది.

3. పరభాషల ద్వారా కాక మాతృభాష ద్వారా విద్యాబోధన చేయుటయే సహజమైన పద్ధతి అని వాదించి వంగభాషలో బాలురకు ఉపయుక్తములగు వాచకములను, శాస్త్ర గ్రంథములను రచించిన విద్యావేత్త ఈశ్వరచంద్రుడు.

అతనివలే ఒకవైపు సంఘ సంస్కరణ చేయుచు, మరొకవైపు భాషాసేవ చేసిన మహనీయుడు మన వీరేశలింగం పంతులు గారు. పంతులుగారికి దక్షిణదేశ విద్యాసాగరుడను బిరుదు కలదు. విద్యాసాగరుడు పంతులుగారు పరస్పరం ఉత్తరములు రాసుకొనేవారు. ఈశ్వరచంద్రుని వలన వంగదేశము, పంతులుగారి వలన తెలుగుదేశము వాసిగాంచినవి.
ప్రశ్నలు :
1. విద్యాబోధన చేయుటకు సహజమైన పద్ధతి ఏది?
జవాబు:
మాతృభాష ద్వారా విద్యాబోధన చేయుట సహజమైన పద్ధతి.

2. ఈశ్వరచంద్రుడు ఏ భాషలో వాచకములను రాసెను?
జవాబు:
ఈశ్వరచంద్రుడు వంగభాషలో వాచకములను రాసెను.

3. పంతులుగారి బిరుదు ఏమిటి?
జవాబు:
‘దక్షిణ దేశ విద్యాసాగరుడు’ అనేది పంతులుగారికి గల బిరుదు.

4. ఈశ్వరచంద్రుని వలన ఏ దేశము వాసిగాంచెను?
జవాబు:
ఈశ్వరచంద్రుని వలన వంగదేశము వాసి గాంచెను.

4. మేధా సంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతమవుతుంది అనేది ఎంతయినా యథార్థం. ఒక దేశం యొక్క సంస్కృతి, వికాసం, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా, కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక యుగంలో విద్య మానవునికి ఒక ముఖ్యమైన జీవితావసరంగా కూడా మారింది. నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు ఒక ప్రాథమిక అవసరంగా భావించి వాటిని రాజ్యాంగంలో పొందుపరచడమైనది.
ప్రశ్నలు:
1. యథార్థమైనది ఏది?
జవాబు:
స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంత మవుతుంది.

2. ఒక దేశ సంస్కృతి, ప్రగతి దేని మీద ఆధారపడి ఉంటుంది?
జవాబు:
ఒక దేశ సంస్కృతి, ప్రగతి ఆ దేశంలోని స్త్రీలందరూ విద్యావంతులా కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

3. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక అవసరాలేవి?
జవాబు:
నిరక్షరాస్యతా నిర్మూలన, పేదరికం తొలగింపు అనే ప్రాథమిక అవసరాలు రాజ్యాంగంలో పొందుపరచ బడ్డాయి.

4. వైజ్ఞానిక వాస్తవం ఏమిటి?
జవాబు:
మేధాసంపత్తి విషయంలో స్త్రీలకు, పురుషులకు భేదం లేదన్నది వైజ్ఞానిక వాస్తవం.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

5. వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు ఐదువందల మంది శిష్యులతో హిమాలయాల్లో ఉండేవాడు. ఒకసారి ఎండలు బాగా కాసి అన్నిచోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి. శిష్యులలో ఒకడు వాటి దప్పిక తీర్చడం కోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టెలో పోసేవాడు. జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ నీరు తాగుతుండటంతో శిష్యుడికి పండ్లు తెచ్చుకోవడానికి గూడా తీరిక చిక్కలేదు. తనేమీ తినకుండానే ఆ జంతువులకు నీళ్ళు పోసేవాడు. ఇది చూసి జంతువులన్నీ మోయగలిగినన్ని పళ్ళు తెచ్చి ఇతనికివ్వాలని నిర్ణయించుకుంటాయి. అవన్నీ కలిపితే రెండువందల యాభై బండ్లు నిండాయి. వాటిని అక్కడి ఐదువందలమంది శిష్యులు తృప్తిగా తినేవాళ్ళు.
ప్రశ్నలు:
1. జంతువులు ఎందుకు అల్లాడిపోయాయి?
జవాబు:
జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి.

2. వాటి బాధ ఎలా తీరింది?
జవాబు:
బోధిసత్వుని శిష్యుడు ఒక తొట్టెను తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టిలో పోయటం ద్వారా వాటి బాధ తీరింది.

3. ఈ కథ ద్వారా మీరు గ్రహించిందేమిటి?
జవాబు:
అన్ని ప్రాణుల యెడల జాలి, దయ కలిగి ఉండాలనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాను.

4. జీవకారుణ్యం అంటే ఏమిటి?
జవాబు:
జీవులపట్ల జాలి, దయ కలిగి ఉండుటను జీవ కారుణ్యం అంటారు.

6. ఈ కింది వ్యవహార రూపాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. I – 2018-19)
జవాబు:

పెదపాడు,
xxx x x

ప్రియమైన మిత్రుడు శ్రీకర్ కు,

నీ మిత్రుడు వినయ్ రాయునది. ఉభయకుశలోపరి. నేను బాగానే చదువుచున్నాను. నీవు బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. నేను ఒక చిన్నకథ చదివాను. గాంధీజీ జీవితానికి సంబంధించింది. నువ్వు ఆ కథ చదువుతావని ఇక్కడ రాస్తున్నాను.

మహాత్మాగాంధీ బాలునిగా ఉన్నప్పుడు ఆయనను “మోనియా” అని పిలిచేవారు. ఒకనాడాయన ఇంటి సమీపంలో దేవాలయ ప్రాంగణంలో కొందరు పిల్లలు ఆయనను కొట్టారు. ఈ విషయం తల్లికి చెప్పాడు. “నీవు వారిని తిరిగి కొట్టలేక పోయినావా ?” అని ఆమె అన్నది. “అమ్మా ! ఆ పని చెయ్యమని నీవేల అంటున్నావు ? నేను వారి సోదరుడను కదా!” అని మోనియా తల్లితో అన్నాడు.

ఈ చిన్న కథలో తోటి వారితో ఎలా మెలగాలో, తప్పు చేసిన వారిపట్ల ఏ భావం కలిగి ఉండాలో ఉంది కదా ! ఈ కథ నీకూ నచ్చి ఉంటుందని అనుకుంటూ, దసరా సెలవులు ఎలా గడిపావో విశేషాలతో లేఖరాయి.

ఇట్లు,
నీ మిత్రుడు, కె. వినయ్,
8వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
అమరావతి, గుంటూరు జిల్లా.

చిరునామా :
డి. శ్రీకర్
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
దేవులపల్లి, పగో జిల్లా.

ప్రశ్నలు:
1. గాంధీజీని బాల్యంలో ఏ పేరుతో పిలిచేవారు?
జవాబు:
మోనియా

2. గాంధీజీ తనను కొట్టిన వారిని తిరిగి కొట్టడానికి ఎందుకు నిరాకరించాడు?
జవాబు:
వారిని సోదరులుగా భావించాడు కనుక.

3. ఈ కథ ద్వారా నీవేం తెలుసుకున్నావు?
జవాబు:
తోటివారితో ఎలా మెలగాలో తెలుసుకున్నా

4. పై లేఖ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పై పేరాలో ఎవరి కథ చెప్పబడింది?

7. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2018-19)

రామాయణం అనే మహా గ్రంథాన్ని సంస్కృత భాషలో వాల్మీకి మహర్షి రాశారు. అందులో 6 కాండలు ఉన్నాయి. తెలుగులో గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనే పేరుతో, మొల్ల రామాయణం అనే పేరుతో కవయిత్రి మొల్ల రచించారు. రామాయణంలో గురు – శిష్య, తండ్రి – కొడుకుల, అన్నదమ్ముల, భార్యభర్తల, స్నేహితుల సంబంధం బాంధవ్యాల గురించి చెప్పారు. –
ప్రశ్నలు:
1. గోనబుద్ధారెడ్డి రచించిన గ్రంథం పేరు ఏమి?
జవాబు:
రంగనాథ రామాయణం

2. సంస్కృత భాషలో రామాయణం రాసిన వారెవరు?
జవాబు:
వాల్మీకి

3. రామాయణంలో ఎన్ని కాండలున్నాయి?
జవాబు:
6 కాండలున్నాయి.

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
రామాయణం దేని గురించి చెబుతుంది?

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

8. ఈ క్రింది అపరిచిత గద్యం చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (S.A. III – 2015-16)

పాండురాజు భార్య కుంతీదేవికి ముగ్గురు కొడుకులు. వారిలో ధర్మరాజు పెద్దవాడు. రెండోవాడైన భీముడు బలవంతుడు. మూడోవాడైన అర్జునుడు విలువిద్యలో నిపుణుడు. పాండురాజు రెండో భార్య అయిన మాద్రికి నకుల, సహదేవులనే ఇద్దరు కుమారులు పుట్టారు. మొత్తం అందరూ కలిపి పాండురాజుకు ఐదుగురు కొడుకులున్నారు. ఈ ఐదుగుర్నీ పాండవులంటారు.
ప్రశ్నలు :
1. పాండురాజు కొడుకులను ఏమంటారు?
జవాబు:
పాండవులు అంటారు.

2. కుంతీదేవికి మొత్తం ఎంతమంది కొడుకులు?
జవాబు:
ముగ్గురు

3. భీముడి ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
బలవంతుడు

4. పాండవులు ఎంతమంది?
జవాబు:
ఐదుగురు

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘మన’ అనే భావన వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?
జవాబు:
‘మన’ అనే భావన ఉంటే సమష్టి కుటుంబ వ్యవస్థ అనేది సక్రమంగా ఉంటుంది. ఆ కుటుంబ సభ్యులు అందరూ, ఆ కుటుంబం అభివృద్ధికి పాటుపడతారు. ఆ కుటుంబం ‘మనది’ అనుకుంటారు. అందువల్ల భేదభావాలు ఈర్ష్యాద్వేషాలు లేకుండా అందరూ తమ శక్తికి మించి పనిచేస్తారు. ముఖ్యంగా రైతు కుటుంబాల్లో ఐతే, ఇంటిల్లిపాదీ ఇంటిపనుల్లో, బయట పనుల్లో పాలుపంచుకుంటారు. వ్యవసాయం పనులు ఇంటి వారంతా కలిసి చేసుకుంటారు. కాబట్టి వేరుగా కూలిపని వారిని పెట్టుకోనక్కరలేదు. కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కోపని చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. కాబట్టి ఆ కుటుంబం అవసరాలను, ఆ కుటుంబం వారే ఇతరుల అవసరం లేకుండా పూర్తి చేసుకోవచ్చు. వారిండ్లలో పెళ్ళిపనులు వంటి కార్యక్రమాలు వస్తే, కుటుంబ సభ్యులు అందరూ, అది తమ కార్యక్రమమని శ్రమను పంచుకొని ఆనందంగా ఆ పని పూర్తి చేస్తారు. ఈ ‘మన’ అన్న సంఘీభావం, దేశానికి వెన్నెముక వంటిది. అందరూ కుటుంబం మనది అనుకుంటే, ఆ కుటుంబం సిరిసంపదలతో వర్ధిల్లుతుంది.

ప్రశ్న 2.
‘మంచి కుటుంబ నేపథ్యంలో వచ్చిన పిల్లలే, ఈ సమాజంలో నిలదొక్కుకుంటున్నారు. ఎందుకు?
జవాబు:
మంచి కుటుంబంలో పెరిగిన పిల్లలు, తల్లిదండ్రుల నుండి క్రమశిక్షణ, ఇంట్లో పెద్దల నుండి ప్రేమానురాగాలు, నీతి, చక్కని నడవడి నేర్చుకుంటారు. వారు చక్కగా చదువుకొని, బాధ్యతతో పెరిగి పెద్దవారవుతారు. తమ తల్లిదండ్రుల పట్ల, దేశంపట్ల, సంఘం పట్ల, మంచి బాధ్యతతో క్రమశిక్షణ గలిగి, దేశభక్తితో నడచుకుంటారు. దేశ పౌరులుగా తమ విధులను నెరవేరుస్తారు.

సహజంగా పిల్లలు సమష్ఠి కుటుంబంలో పెరిగి, సంతోషాన్ని, కష్టాల్నీ, బాధల్నీ ఒకరికొకరు పంచుకోవాలి. కాని వ్యష్టి కుటుంబాల్లో పిల్లలు ‘ఎవరికివారే యమునా తీరే’ అన్నట్లు వెలుగుతున్నారు. అందువల్లే పిల్లల్లో కొందరు అనాథలుగా, సమాజ వ్యతిరేక శక్తులుగా మారిపోతున్నారు. వీరిలో కొందరు అశాంతి, హింసలకు ముఖ్యకారకులు అవుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావంతో పాటు, సమాజమూ, తోడి పిల్లలూ, ప్రసారసాధనాల ప్రభావమూ కూడా ఉంటుంది.

అందువల్లే మంచి కుటుంబం నేపథ్యం నుండి వచ్చిన పిల్లలే, సమాజంలో నిలదొక్కుకుంటున్నారు.

ప్రశ్న 3.
కుటుంబ వ్యవస్థకు మౌలికాంశాలేవి?
జవాబు:
కుటుంబ వ్యవస్థకు మౌలికాంశాలు పోషణ, భద్రత కల్పించడం. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, విచక్షణ జ్ఞానాన్నివ్వడం, సంస్కృతిని వారసత్వంగా అందించడం, కుటుంబ వ్యవస్థ ప్రధానోద్దేశాలలో ఒకటి. విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు స్తంభాల మీద మన కుటుంబవ్యవస్థ ఆధారపడియుంది. “అందరిలో నా సుఖం ఉంది. వారి కోసమే మన జీవితం” అనేది భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
తల్లిదండ్రులు ఇతరులతో పోటీపడుతూ పరుగెడుతున్న నేటి సమాజంలో పిల్లల పరిస్థితులు ఏమిటి?
జవాబు:
తల్లిదండ్రులు నేటికాలానికి అనుగుణంగా, ఆర్థిక పరిస్థితిని బట్టి ఇద్దరూ సంపాదిస్తేనే గాని కుటుంబం గడిచే పరిస్థితి ఉండటం లేదు.

వారు సమాజంలో ఒక యాంత్రికమైన జీవనాన్ని గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో పిల్లల ఆలనా పాలనా, మంచిచెడ్డలు చూసుకునే సమయం కూడా వారికి ఉండటం లేదు.

ఈ రోజుల్లో తల్లిదండ్రులు, తమ పిల్లలను బాగా చదివించాలనీ, వాళ్ళు మంచి ఉద్యోగులుగా, మంచి డబ్బు సంపాదించే వాళ్ళుగా తయారవ్వాలని పోటీపడుతున్నారు. అందుకోసం తమ సర్వస్వాన్నీ త్యాగం చేసి, పిల్లల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. ఇది ఒక రకంగా మంచి పోటీయే.

కాని ఈ పోటీలో తల్లిదండ్రులు, తమ పిల్లలకు ఏ విషయంపై అభిరుచి ఉందో, ఆసక్తి ఉందో గమనించడం లేదు.

శక్తి గల పిల్లలు, తల్లిదండ్రుల కృషి వల్ల బాగుపడుతున్నారు. కాని అందరూ ఒకే దారి తొక్కడం వల్ల పోటీ పెరుగుతోంది. నిరుద్యోగం పెరిగిపోతోంది. దానితో పిల్లలలో నిరాశా నిస్పృహలు పెరిగిపోతున్నాయి. మరి కొందరు పిల్లలకు ఆ చదువులపై ఆసక్తి, శక్తి లేక, మధ్యలోనే చదువులు మానివేసి, తప్పుడు దారులు తొక్కుతున్నారు. మరికొందరు నక్సలైట్లుగా, ఉగ్రవాదులుగా, హింసా ప్రవర్తకులుగా మారిపోతున్నారు.

బలవంతంగా పిల్లలను ఇంగ్లీషు మాధ్యమంలో చదివించడంతో, అటు ఇంగ్లీషు, ఇటు మాతృభాష రెండూ రాక, ఉభయభ్రష్టులు అవుతున్నారు. ముఖ్యంగా అందరికీ ప్రాథమిక విద్య, మాతృభాషలోనే నేర్పాలి. పదవతరగతి పూర్తి అయ్యే వరకూ, మాతృభాషను ప్రథమ భాషగా పిల్లలకు నేర్పాలి. పిల్లల అభిరుచులను తల్లిదండ్రులు తెలిసికొని, వారి ఇష్టానికి తగిన చదువులనే చదివించాలి.

పిల్లలపై తల్లిదండ్రులు, తమ అభిరుచులనూ, ఆసక్తులను అంటగట్టక, పిల్లల ఇష్టాలను గుర్తించి, వారిని సర్వతోముఖంగా అన్ని రంగాలలో సంసిద్ధులను చేయాలి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 2.
వృష్టి కుటుంబమైనా, సమష్టి కుటుంబమైనా సమాజానికి, దేశానికి పనికి వచ్చే పిల్లల్ని అందించాలంటే ఏం చేయాలి?
జవాబు:
కుటుంబ పరమైన వారసత్వభావనలు, మానవ సంబంధాలు, ఆప్యాయత, అనురాగం, జీవన సంప్రదాయాలు, సంస్కృతి తమ పిల్లలకు అందేలా చేయాలి. తల్లిదండ్రులకు పిల్లల సంక్షేమమే, మొదటి ప్రాధాన్యం కావాలి. తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, పరోపకారగుణం అందించాలి. సమస్త సద్గుణాలకూ, దుర్గుణాలకూ ఇల్లే పునాది అని తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లల్ని కేర్ టేకింగ్ సెంటర్లలో వదలి, తాము ఉద్యోగాలు చేసుకుంటూ కూర్చోరాదు.

పిల్లలకు పెద్దల పై, గురువులపై, తల్లిదండ్రులపై గౌరవం ఆదరం కలిగేలా చూసుకోవాలి. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలి. చిన్ననాటి నుండి విలువలను కాపాడే సంస్కృతిని, విద్యను నేర్పించాలి. పిల్లలకు హక్కులతో పాటు బాధ్యతలను నేర్పించాలి.

తల్లిదండ్రులు, తాము ఏ కుటుంబంలో ఉన్నప్పటికీ, కుటుంబ భావనలు పిల్లలకు వివరించి చెప్పగలగాలి. పెద్దల బలాన్ని పొందాలి. ఉమ్మడి, వ్యష్టి కుటుంబాల మేలు కలయికతో, ఆధిపత్యాల పోరులేని ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు అంతస్సూత్రంగా ఉన్న ఒక కొత్త కుటుంబవ్యవస్థను ఏర్పాటు చేసుకొని, పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి. వారికి తమ కుటుంబ వారసత్వాన్ని అందించాలి.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
ఉమ్మడి కుటుంబ ఆవశ్యకతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

అమరావతి,
x x x x x

ప్రియమైన మిత్రుడు రమేష్ కు,

నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన భారతదేశంలోని కుటుంబ వ్యవస్థకు సమున్నతమైన స్థానం ఉంది. ప్రజలందరూ ఉమ్మడి కుటుంబాన్ని గౌరవించాలి. ఉమ్మడి కుటుంబం వల్ల మానవీయ సంబంధాలు పెరుగుతాయి. నైతిక విలువలు వృద్ధి పొందుతాయి. ఆత్మీయతానురాగాలు నిత్యం ఉంటాయి. పరస్పర సహకారం కలుగుతుంది. అందువల్ల మనమంతా ఉమ్మడి కుటుంబాలనే గౌరవిద్దాం. మన కుటుంబ వ్యవస్థను చిరకాలం నిలుపుదాం. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు.

ఆత్మీయతానురాగాలు నిత్యం ఉంటాయి. పరస్పర సహకారం కలుగుతుంది. అందువల్ల మనమంతా ఉమ్మడి కుటుంబాలనే గౌరవిద్దాం. మన కుటుంబ వ్యవస్థను చిరకాలం నిలుపుదాం. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు
ఇట్లు,
x x x x x x x x

చిరునామా :
పి రమేష్,
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,
చెరువు జమ్ములపాలెం,
బాపట్ల మండలం,
గుంటూరు జిల్లా.

ప్రశ్న 2.
సహజీవన మాధుర్యం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
వ్యక్తి కుటుంబంలో సభ్యుడైనా – సమాజంలో పౌరుడుగా కొనసాగుతూ ఉంటాడు. కుటుంబాలన్నీ కలిసే సంఘ మనబడుతుంది. కానీ వ్యక్తి తన పాత్రను అటు కుటుంబంలో, ఇటు సమాజంలో బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. మంచి కుటుంబ సభ్యుడు కానప్పుడు ఆకష్టం, నష్టం కుటుంబానికే పరిమితమై ఉంటుంది. కానీ సత్పౌరుడు కాకపోతే దేశానికే సమస్యగా పరిణమిస్తాడు. అందుకే కుటుంబక్షేమం కోసం వ్యక్తినీ, సమాజశ్రేయస్సుకోసం కుటుంబాన్నీ, దేశశ్రేయస్సుకోసం సమాజాన్నీ కూడా పరిత్యజించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇక్కడ మనిషి హక్కుల్నీ, బాధ్యతల్నీ బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎదురవుతుంది. వ్యక్తి తనహక్కుల్నే అనుభవించడంలో సమాజంలోని సాటివారి ప్రాథమికహక్కుల్ని కూడా గౌరవించాల్సి ఉంది. వ్యక్తి స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛను హరించని పరిస్థితుల్లో మాత్రమే రాణిస్తుంది. అంటే నాగరిక సమాజంలో ప్రతిమనిషికీ, ఇంకొకరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహజీవనంలో వసుధైక కుటుంబ భావన పరిపూర్ణంగా పాటించాల్సి ఉంది.

ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకూ సమాజం ఒకేలా లేదు. ప్రాథమిక అవసరాల కోసం మనిషి జీవించే తీరులో మార్పు వచ్చింది. దేశ కాలపరిస్థితుల్ని బట్టి మానవుడు నియమబద్ధమైన ప్రవర్తన నియమావళిని రూపొందించుకొంటూనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో అనేక అంతరహిస్సంఘర్షణలకు లోనయ్యాడు. మానసికంగా పరిశ్రమించి, తపస్సు చేసి జీవితపరమార్థాన్ని తెలుసుకోగలిగాడు. తాను దర్శించిన సత్యాల ప్రాతిపదికగా మానవజాతికోసం, మూల్యవ్యవస్థను నిర్మించాడు. ఈ మూల్యవ్యవస్థ నిర్మాణం సమిష్టి కృషిగానే సాగింది. వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం అనే క్రమంలో సువ్యవస్థిత స్థితిని ఉంచేందుకు చేసే కృషి కూడా మూల్యం అని చెప్పబడుతుంది. వ్యక్తి తన లో నుంచి రూపొందించుకున్న విలువ, సామాజికమై, అందరి సంక్షేమం కోసం ఉద్దేశింపబడుతుంది. సత్యం చర మొదలైనవి ఇలాంటివే.

ప్రశ్న 3.
“ఉత్తమ సమాజ రూపకల్పనకు కుటుంబ వ్యవస్టే వెన్నెముక” అనడానికి కారణాలు రాయండి. (S.A. I – 2018-19)
జవాబు:
సమాజానికి కుటుంబం వెన్నెముక. మంచి కుటుంబం, మంచి సమాజం వీటి నుంచి మంచి దేశం, మంచి ప్రపంచం ఏర్పడతాయి. అందుకు అందరూ కృషి చేయాలి.

కుటుంబం అనే మాట మధురమైనది. కుటుంబం అన్న భావన తలపుకు రాగానే మనస్సులో ఏదో అనిర్వచనీయమైన హాయి కలుగుతుంది. తీపి జ్ఞాపకాలెన్నో గుర్తుకు వస్తాయి.

చిన్ననాటి నుంచి ఇంట్లో అందరితో గడిపిన మధురక్షణాలు, జీవితంలో జరిగిన సంఘటనలు పెద్దయిన తర్వాత సినిమాలా కళ్ళముందు మెదలాలి. ఈ మధురమైన అనుభూతిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే చక్కని కుటుంబం కావాలి. గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి మహనీయులెందరికో వారి కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి.

ఉమ్మడి కుటుంబం, వ్యష్టి కుటుంబాల మేలి కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగకుండా, ఆధిపత్యాల పోరులేని, ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు అంతస్సూత్రమైన ఒక మంచి కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. అప్పుడే సమాజం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతాయి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 4.
“అభివృద్ధి చెందుతున్న సమాజానికి, అనుబంధాలతో ఉన్న కుటుంబమే మూలం” ఈ వాక్యాన్ని సమర్థించే “ఇల్లు – ఆనందాల హరివిల్లు” ఎలా అవుతుందో తెల్పండి. (S.A. II – 2017-18)
జవాబు:
‘అభివృద్ధి చెందుతున్న సమాజానికి, అనుబంధాలతో ఉన్న కుటుంబమే మూలం’ అని ‘ఇల్లు – ఆనందాల హరివిల్లు’ పాఠం ద్వారా రచయిత చెప్పిన మాట అక్షరసత్యం. సమాజం అంటే మనుషులే. మనుషులంతా కలిస్తేనే సమాజం. దీనిని బట్టి సమాజం బాగుంది అంటే మనుషులు బాగున్నట్టే కదా !

ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక, సహాయ సహకారాలందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన సంబంధాలున్న స్త్రీ పురుషులు, వారి పిల్లలు ఉన్న సమూహమే కుటుంబం అని పెద్దలు నిర్వచించారు. ‘విశ్వసనీయత, సమగ్రత, ఏకత’ అనే వాటి మీద కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. “అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారి కోసమే నా జీవితము” అనే త్యాగభావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.

సమాజంలో కుటుంబమే అత్యంత కీలకం. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. తల్లిదండ్రులకు పిల్లల సంక్షేమమే తొలి ప్రాధాన్యం. మంచి కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లలు కష్టాలను అధిగమించి సమాజంలో నిలదొక్కు కుంటారు. కుటుంబం అనే హరివిల్లులో అమ్మానాన్నలు, పిల్లలు, తాతానానమ్మలు ఇలా అందరూ భాగమైతే అందం, ఆనందం వెల్లి విరుస్తుంది. ఆ ‘ఇల్లే ఇలలో స్వర్గం’ అవుతుంది. కుటుంబంలోని సభ్యుల మధ్య బంధాలు, అనురాగాలు, గౌరవం, మంచితనం అనేవి సహజంగా ఉన్నప్పుడు ఆ లక్షణాలు పిల్లలకూ వారసత్వంగా వస్తాయి.

ఈ వారసత్వ లక్షణాలున్న కుటుంబం సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది.

8th Class Telugu 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు 1 Mark Bits

1. ఇల్లు – ఆనందాల “హరివిల్లు” (అర్థాన్ని గుర్తించండి) (S.A.I – 2018-19)
ఎ) ఇంద్రధనస్సు
బి) మేఘం
సి) ఆనందం
డి) సత్కారం
జవాబు:
ఎ) ఇంద్రధనస్సు

2. మనం చట్టం అతిక్రమించకూడదు. (ప్రకృతిని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) చుట్టం
బి) శాస్త్రం
సి) క్షేమం
డి) శీర్షం
జవాబు:
బి) శాస్త్రం

3. కింది వాటిలో సరైన సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) లత, శ్రీలత అక్కా చెల్లెళ్ళు.
బి) చెట్లు చిగిర్చిపూలు పూశాయి.
సి) రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
డి) మీరు అల్లరి చేయవద్దు. కూర్చోండి.
జవాబు:
బి) చెట్లు చిగిర్చిపూలు పూశాయి.

4. సమప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడితే అది ఏ వాక్యం? (S.A.I- 2018-19)
ఎ) సంయుక్త వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సామాన్య వాక్యం
డి) సంక్లిష్ట వాక్యం
జవాబు:
ఎ) సంయుక్త వాక్యం

5. కుటుంబంతో కలిపి దేవాలయానికి వెళ్లాలి (సంధి పేరు గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) సవర్ణదీర్ఘసంధి
బి) అత్వసంధి
సి) గుణసంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘసంధి

6. ఈ కింది వానిలో సంయుక్త వాక్యం గుర్తించండి. (S.A. II – 2018-19)
ఎ) విమల తెలివైనది. విమల అందమైనది కదా
బి) విమల తెలివైనదీ, విమల అందమైన దీ
సి) విమల తెలివిగానే విమల అందమైనదే
డి) విమల తెలివైనది మరియు అందమైనది.
జవాబు:
డి) విమల తెలివైనది మరియు అందమైనది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

7. చిన్మయీ హోంవర్క్ పూర్తి చేసి నిద్రపోయింది. (ఏ రకపు వాక్యమో గుర్తించండి) (S.A. III – 2016-17)
ఎ) సంయుక్త వాక్యం
బి) సామాన్య వాక్యం
సి) సంక్లిష్ట వాక్యం
డి) విశేష వాక్యం
జవాబు:
సి) సంక్లిష్ట వాక్యం

8. అక్షర పాటలు రాస్తుందీ, పాడుతుంది. (ఏ వాక్యమో గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) సంయుక్త వాక్యం
బి) సందేహ వాక్యం
సి) విద్యర్థక వాక్యం
డి) సంక్లిష్ట వాక్యం
జవాబు:
ఎ) సంయుక్త వాక్యం

9. అమ్మ కడుపు నిండా అన్నం పెట్టింది. (ప్రకృతి పదం గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) ఉదరం
బి) గర్భం
సి) అర్భకుడు
డి) పొట్ట
జవాబు:
బి) గర్భం

10. నేను దక్షిణానికి తిరిగి దక్షిణ నిచ్చాను. (నానార్థాలు గుర్తించండి.) (S.A. II – 2017-18)
ఎ) తూర్పు – పడమర
బి) ఉత్తరం – దక్షిణం
సి) ఒక దిక్కు – సంభావన
డి) డబ్బు – దస్కం
జవాబు:
సి) ఒక దిక్కు – సంభావన

11. అనైక్యత అనర్ధానికి దారి తీస్తుంది. వాక్యంలో గీత గీసిన పదానికి వ్యతిరేకపదం గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) వాక్యం
బి) ద్వేషం
సి) ఐక్యత
డి) క్రోథం
జవాబు:
సి) ఐక్యత

12. నారాయణ అన్నం తిన్నాడు. నారాయణ నీళ్లు తాగాడు. ఈ రెండు సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మారిస్తే ఏది సరైన వాక్యమవుతుంది? (S.A. III – 2015-16)
ఎ) నారాయణ అన్నం తిని నీళ్లు తాగాడు.
బి) నారాయణ అన్నం, నీళ్లు తాగాడు
సి) నారాయణ అన్నం తిని నీళ్లు తాగలేదు.
డి) నారాయణ అన్నం తింటూ నీళ్లు తాగుతున్నాడు.
జవాబు:
ఎ) నారాయణ అన్నం తిని నీళ్లు తాగాడు.

భాషాంశాలు – పదజాలం

ఆర్థాలు :

13. ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆవేదన
బి) అంగీకారం
సి) తిరస్కారం
డి) విజయం
జవాబు:
బి) అంగీకారం

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

14. రాష్ట్రానికి తొలి రాజధాని కర్నూలు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) మొదటి
బి) చివరి
సి) మధ్యమ
డి) ప్రయోజన
జవాబు:
ఎ) మొదటి

15. పనులకు భంగం కలుగకూడదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఆటంకం
బి) ఆవేదన
సి) ఆకారం
డి) ఆకలి
జవాబు:
ఎ) ఆటంకం

16. వీరుల మధ్య పోరు జరిగింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సాగరం
బి) అంబుధి
సి) యుద్ధం
డి) తరుణం
జవాబు:
సి) యుద్ధం

17. పనిలో సామర్థ్యం కనబరచాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అయోగ్యత
బి) మోదం
సి) భేదం
డి) యోగ్యత
జవాబు:
డి) యోగ్యత

18. విద్యార్థులకు వివేచన అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) మిక్కిలి
బి) ఆలోచన
సి) ఆరాధన
డి) అపరాధం
జవాబు:
బి) ఆలోచన

19. మనిషికి స్వాతంత్ర్యం అవసరం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) మోదము
బి) స్వేచ్ఛ
సి) బంధిఖాన
డి) ప్రియము
జవాబు:
బి) స్వేచ్ఛ

20. ఇలపై నందనం విరియాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తార్కాణం
బి) భూమి
సి) సుధ
డి) వ్యధ
జవాబు:
బి) భూమి

పర్యాయపదాలు:

21. పుష్పాల్లో సౌరభం ఉంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సువాసన, తావి
బి) తరుణం, తామకం
సి) తమసం, తదనంతరం
డి) వాసన, దుర్గంధం
జవాబు:
ఎ) సువాసన, తావి

22. స్వరంలో దేవతలు ఉంటారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) మర్త్యము
బి) త్రిదివం
సి) త్రిభువనం
డి) రసాతలం
జవాబు:
బి) త్రిదివం

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

23. భార్యను గౌరవించాలి-గీత గీసిన పదానికి సమానార్థక పదాలు గుర్తించండి.
ఎ) విన్నానం
బి) వివేణం
సి) యతి, పది
డి) సతి, నది
జవాబు:
ఎ) విన్నానం

24. రాము గృహంలో ఉన్నాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
ఎ) ధూదం, ద్రవ్యం
బి) ఇల్లు, సదనం
సి) నికేతనం, నందనం
డి) నారలు, మదిలు
జవాబు:
బి) ఇల్లు, సదనం

25. తల్లి వంద్యురాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పితామహి, ప్రభావతి
బి) సతి, గాంధర్వం
సి) జనని, మాత
డి) జనని, జనకుడు
జవాబు:
సి) జనని, మాత

26. జనకుడు ఊరికి వెళ్ళాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఊరు, పేరు
బి) తండ్రి, పిత
సి) పత, జత
డి) నాకం, నరకం
జవాబు:
బి) తండ్రి, పిత

27. పెళ్ళి జరిగింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సాహచర్యం, సంతర్పణ
బి) సాయుధం, బలాత్కారం
సి) వివాహం, పరిణయం
డి) సదనం, నికేతనం
జవాబు:
సి) వివాహం, పరిణయం

28. సదనంలో ఉన్నాను – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) గతం, గేహం
బి) ఇల్లు, గృహం
సి) నికేతనం, నాటకం
డి) వీధి, రంగం
జవాబు:
బి) ఇల్లు, గృహం

29. కర్షకుడు వ్యవసాయం చేస్తాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) రైతు, భూమీశుడు
బి) కృషీవలుడు, రైతు
సి) పృథ్వి, ధరణీశ్వరుడు
డి) అవని, జలధి
జవాబు:
బి) కృషీవలుడు, రైతు

ప్రకృతి – వికృతులు :

30. పుణ్యం పొందాలి – గీత గీసిన పదానికి వికృతి రూపం గుర్తించండి.
ఎ) పొన్నెం
బి) పున్నెం
సి) పన్నెం
డి) పందెం
జవాబు:
బి) పున్నెం

31. చట్టం తెలియాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి. ఏది?
ఎ) శాస్త్రి
బి) శాస్త్రం
సి) శారం
డి) వస్త్రం
జవాబు:
బి) శాస్త్రం

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

32. మంత్రంతో పని జరగాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) చంద్రం
బి) జింతం
సి) గెంత్రం
డి) పంత్రం
జవాబు:
సి) గెంత్రం

33. విజ్ఞానం సాధించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) ఇల్లాలు, కులస్త్రీ
బి) పత్ని, గవి
సి) విన్ననం
డి) విన్నపం
జవాబు:
ఎ) ఇల్లాలు, కులస్త్రీ

34. కర్ణం సాధించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) పర్జన్యం
బి) కార్యం
సి) కార్యెం
డి) కర్యం
జవాబు:
బి) కార్యం

నానార్థాలు :

35. అకాలంలో మరణించాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ఆకాశం, అనంతం
బి) సమయం, మరణం
సి) చావు, కీర్తి
డి) యశస్సు, ఆర్తి
జవాబు:
బి) సమయం, మరణం

36. పురోహితుడు దక్షిణ పొందాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) నాగరికం, సదనం
బి) తటం, ధాన్యం
సి) ఒక దిక్కు, సంభావన
డి) నగలు, నుదురు
జవాబు:
సి) ఒక దిక్కు, సంభావన

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

37. మానవులు ధర్మం ఆచరించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ధరణి, దాపరికం
బి) మోక్షం, ముత్యం
సి) దిక్కు, శరణు
డి) పుణ్యం, న్యాయం
జవాబు:
డి) పుణ్యం, న్యాయం

వ్యుత్పత్యర్థాలు :

38. పక్షములు కలది – అనే వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
ఎ) పాక్షికం
బి) సాగరం
సి) పక్షి
డి) నది
జవాబు:
సి) పక్షి

39. ఇలా జరిగిందని చెప్పునది – అనే వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
ఎ) కావ్యం
బి) ప్రక్రియ
సి) గాథ
డి) ఇతిహాసం
జవాబు:
డి) ఇతిహాసం

40. మనువు వల్ల పుట్టినవాడు – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం గుర్తించండి.
ఎ) ఉత్తరం
బి) మానవుడు
సి) దానవుడు
డి) దక్షిణ
జవాబు:
బి) మానవుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

41. సువాసనతో కూడినది – అనే వ్యుత్పత్త్యం గల పదం
ఎ) సౌరభం
బి) దానవం
సి) దాపరికం
డి) నాకము
జవాబు:
ఎ) సౌరభం

వ్యాకరణాంశాలు

సంధులు :

42. ప్రేమానురాగాలు పెంచాలి – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) గుణసంధి
సి) వృద్ధి సంధి
డి) త్రికసంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి

43. క్రింది వానిలో పొసగని సంధి ఏది?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) అత్వసంధి
సి) గుణసంధి
డి) వృద్ధిసంధి
జవాబు:
బి) అత్వసంధి

44. భావ + ఉద్వేగాలు – దీన్ని కలిపి రాస్తే
ఎ) భావైద్వేగాలు
బి) భావోద్వేగాలు
సి) బావాద్వేగాలు
డి) భవైద్వేగాలు
జవాబు:
బి) భావోద్వేగాలు

45. లు, ల, న సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) నట్టిల్లు
బి) అమ్మలక్కలు
సి) అనుబంధాలు
డి) సూర్యోదయం
జవాబు:
సి) అనుబంధాలు

46. తెలుగులో నిత్య సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) త్రికసంధి
బి) ఇత్వసంధి
సి) ఉత్వసంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) ఉత్వసంధి

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

47. సూత్రమైన – దీన్ని విడదీస్తే
ఎ) సూత్రము + అయిన
బి) సూత్రం + ఐన
సి) సూత్రాలు + ఐన
డి) సూత్రము + ఐన
జవాబు:
డి) సూత్రము + ఐన

48. ప్రత్యక్షంగా చూడాలి – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) యణాదేశ సంధి
సి) త్రికసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
బి) యణాదేశ సంధి

49. పరోపకారం చేయాలి – దీన్ని విడదీయండి.
ఎ) పర + అపకారం
బి) పర + ఉపకారం
సి) పరె + అపకారం
డి) పరై + అపకారం
జవాబు:
బి) పర + ఉపకారం

50. నిరయాధికారం ఉండాలి – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) సవర్ణదీర్ఘ సంధి
సి) త్రికసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) సవర్ణదీర్ఘ సంధి

సమాసాలు :

51. అవ్యయీభావ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) పరోక్షం
బి) ప్రత్యక్షం
సి) ఆశ్రమధర్మం
డి) స్త్రీపురుషులు
జవాబు:
బి) ప్రత్యక్షం

52. భార్యాభర్తలు ఉన్నారు – ఇది ఏ సమాసం?
ఎ) అవ్యయీభావ సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహుహ్రీహి సమాసం
డి) కర్మధారయ సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం

53. పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏమిటి?
ఎ) తత్పురుష సమాసం
బి) బహుహ్రీహి సమాసం
సి) అవ్యయీభావ సమాసం
డి) రూపక సమాసం
జవాబు:
సి) అవ్యయీభావ సమాసం

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

54. భారతదేశము – ఏ సమాసం?
ఎ) సంభావనా పూర్వపద కర్మధారయం
బి) కర్మధారయ సమాసం
సి) ద్విగు సమాసం
డి) బహున్రీహి సమాసం
జవాబు:
ఎ) సంభావనా పూర్వపద కర్మధారయం

55. దినము దినము – దీనిని సమాసపదంగా చేస్తే
ఎ) ప్రతిదినం
బి) అనుదినం
సి) యదినం
డి) గతదినం
జవాబు:
ఎ) ప్రతిదినం

56. సమానాధికరణ తత్పురుష అని దేనిని అంటారు?
ఎ) అవ్యయీభావం
బి) బహుజొహి
సి) కర్మధారయం
డి) ద్విగు
జవాబు:
సి) కర్మధారయం

57. ఉన్నతశ్రేణి – ఇది ఏ సమాసం?
ఎ) అవ్యయీభావం
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) విశేషణ ఉత్తరపద కర్మధారయం
డి) ఉపమాన పూర్వపద కర్మధారయం
జవాబు:
బి) విశేషణ పూర్వపద కర్మధారయం

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

58. శుభమును, అశుభమును – దీన్ని సమాస పదంగా మార్చండి.
ఎ) అశుభశుభములు
బి) అశుభాశుభములు
సి) శుభాశుభములు
డి) శుభఅశుభములు
జవాబు:
బి) అశుభాశుభములు

59. షష్ఠీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) ఉన్నతశ్రేణి
బి) శ్రామికవర్గం
సి) కొత్త ధోరణులు
డి) పక్షం రోజులు
జవాబు:
బి) శ్రామికవర్గం

గణ విభజన :

60. IUU – ఇది ఏ గణము?
ఎ) న గణం
బి) య గణం
సి) త గణం
డి) మ గణం
జవాబు:
బి) య గణం

61. ‘న’ గణమును గుర్తించండి.
ఎ) UUU
బి) UIU
సి) III
డి) UII
జవాబు:
సి) III

62. భాస్కరా – ఇది ఏ గణము?
ఎ) త గణం
బి) జ గణం
సి) మ గణం
డి) ర గణం
జవాబు:
డి) ర గణం

వాక్యాలు :

63. పెండ్లి జరిగింది గాని సందడి లేదు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) సంయుక్త వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
ఎ) సంయుక్త వాక్యం

64. వాల్మీకి రామాయణం రచింపబడింది – దీన్ని కర్తరి వాక్యంగా రాస్తే
ఎ) వాల్మీకి వల్ల రామాయణం రాశాడు.
బి) వాల్మీకి రామాయణం రచించాడు.
సి) రామాయణం నందు వాల్మీకి రచించాడు.
డి) రచించాడు రామాయణం వాల్మీకి.
జవాబు:
బి) వాల్మీకి రామాయణం రచించాడు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

65. ‘నాకు చదవడం ఇష్టం’ అని రవి అన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) ప్రత్యక్ష కథన వాక్యం
డి) పరోక్ష కథన వాక్యం
జవాబు:
సి) ప్రత్యక్ష కథన వాక్యం

66. మీకు మేలు కలుగుగాక – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణివాక్యం
బి) ఆశీరార్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) అభ్యర్థక వాక్యం
జవాబు:
బి) ఆశీరార్థక వాక్యం

67. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) శత్రర్థక వాక్యం
బి) హేత్వర్ధక వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
బి) హేత్వర్ధక వాక్యం

68. నేను తప్పక వస్తాను – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అప్యర్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) నిశ్చయార్థక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
బి) కర్మణి వాక్యం

69. పెద్దలను మనం గౌరవించాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) కొందరు పెద్దలను గౌరవించవలెను.
బి) పెద్దలను మనం గౌరవించకూడదు.
సి) పెద్దలను మనం గౌరవించకపోవచ్చు.
డి) పెద్దలను మనం తప్పక గౌరవింపలేకపోవచ్చు.
జవాబు:
బి) పెద్దలను మనం గౌరవించకూడదు.

AP Board 8th Class Telugu Important Questions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

70. అందరు కలసి ఉండాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) అందరు కలసి ఉండకూడదు.
బి) అందరు కలసి ఉండవచ్చు.
సి) అందరు కలసి ఉండాలి గదా!
డి) కొందరు కలిసి ఉండకూడదు.
జవాబు:
ఎ) అందరు కలసి ఉండకూడదు.

సొంతవాక్యాలు :

71. జీవనవిధానం : భారతీయుల జీవనవిధానం అందరికీ ఆదర్శంగా నిలవాలి.

72. విశ్వసనీయత : నేటి రాజకీయ నాయకుల్లో విశ్వసనీయత తగ్గింది.

73. ప్రాతిపదిక : భారతీయులకు సహనం ఒక ప్రాతిపదికగా ఉంది.

74. సంస్కృతి : అమరావతికి ఘనమైన సంస్కృతి ఉంది.

75. అత్యున్నత స్థాయి : మన విద్యా ప్రమాణాలు అత్యున్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.

76. కీలకం : కోర్టులో సాక్ష్యాలు కీలకంగా మారుతాయి.

77. ఆచార వ్యవహారాలు : భారతీయుల ఆచార వ్యవహారాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయి.

78. నియమబద్ధజీవనం : ప్రాచీన కాలంలో ఋషులు నియమబద్ధ జీవనం గడిపేవారు.

79. చేదోడు వాదోడు : మిత్రులు ఒకరినొకరు చేదోడు వాదోడుగా ఉండాలి.

80. ఆలనా పాలనా : తల్లిదండ్రులు పిల్లల ఆలనా పాలనా శ్రద్ధగా చూస్తారు.

81. సహాయసహకారాలు : ఆపన్నులకు ధనవంతులు సహాయసహకారాలను అందించాలి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం.

AP State Syllabus 8th Class Telugu Important Questions 1st Lesson అమ్మకోసం

8th Class Telugu 1st Lesson అమ్మకోసం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది చుక్కగుర్తు గల పద్యాలకు భావాలను రాయండి.

1) ఉ. ఆయతపక్ష తుండహతి నక్కులతైలము లెల్ల నుగ్గుగాఁ
జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం
బాయక వీపునం దవడుఁబాముల మోవను, వారికిం బనుల్
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!

భావం:
పద్మం వంటి ముఖం గల తల్లీ ! విశాలమైన నా రెక్కలతో వాడి అయిన ముక్కుతో కుల పర్వతాలనన్నిటినీ పిండిగా చేయగల గొప్పబలం, కీర్తి నాకు ఉన్నాయి. అటువంటి నేను నీచమైన పాములను ఎల్లకాలం వీపు మీద మోయడానికీ, వాటికి సేవలు చేయడానికీ, గల కారణం ఏమిటో చెప్పు.

2) చ. అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు; నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జి
త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహాగేంద్రుఁడు సంతసంబునన్

భావం:
“నీవు అంతులేని విక్రమం, వేగం, బలం కలిగిన పక్షి శ్రేష్ఠుడివి. నీకు దాస్యం పోగొట్టు కోవాలనే అభిప్రాయం ఉంటే నీ భుజబలం, సామర్థ్యం తెలిసేలా, మాకు అమృతాన్ని తెచ్చి ఇయ్యి” అని పాములు చెప్పగా, గరుత్మంతుడు అప్పుడు సంతోషంతో.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

3) మ. వితతోల్కాశనిపుంజ మొక్కొ యనఁగా విన్వీథి విక్షిప్ర ప
క్షతి వాతాహతిఁ దూలి, తూల శకలాకారంబు లై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దల్పాలుర్ భయం బందఁగన్.

భావం:
పక్షిరాజు మనోవేగంతో బయలు దేరాడు. అప్పుడతడు నిప్పు కణాలతో కూడిన తోక చుక్కలా ఉన్నాడు. ఆకాశంలో కదలుతూ ఉన్నప్పుడు, అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూది పింజలై చెదరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా, గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్నచోటికి వెళ్ళాడు.

ఆ) కింది అపరిచిత పద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !
ప్రశ్నలు:
1. ఫణికి విషం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
ఫణికి విషం తలలో ఉంటుంది.

2. దేనికి విషం తోకలో ఉంటుంది?
జవాబు:
వృశ్చికానికి (తేలుకు) విషం తోకలో ఉంటుంది.

3. ఖలునకు విషం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
ఖలునకు విషం నిలువెల్లా (శరీరమంతా) ఉంటుంది.

4. ఈ పద్యం ద్వారా మనకు ఏం తెలుస్తోంది?
జవాబు:
ఈ పద్యం ద్వారా మనకు ఖలుని స్వభావం తెలుస్తోంది.

2. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.
ప్రశ్నలు :
1. నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
జవాబు:
నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.

2. పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.

3. ఈ పద్యానికి శీర్షికను సూచి.డి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.

4. ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

3. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
నక్షరంబు జిహ్వ కిక్షు రసము
అక్షరంబు తన్ను రక్షించు గావున
నక్షరంబు లోక రక్షితంబు.
ప్రశ్నలు:
1. మానవులకు ఏం కావాలి?
జవాబు:
మానవులకు అక్షరం (విద్య) కావాలి.

2. అక్షరం జిహ్వకు ఎటువంటిది?
జవాబు:
అక్షరం జిహ్వకు చెరకురసం వంటిది.

3. అక్షరము దేనిని రక్షిస్తుంది?
జవాబు:
అక్షరము తనను (చదువుకున్నవానిని) రక్షిస్తుంది.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘అక్షర మహిమ.’

4. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
మందుడు మృత్పిండమువలె
గిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.
ప్రశ్నలు:
1. సుజనుడు ఎట్లు ఉంటాడు?
జవాబు:
సుజనుడు కందుకంలా ఉంటాడు.

2. మందుడు ఎలా ఉంటాడు?
జవాబు:
మందుడు మృత్పిండంలా ఉంటాడు.

3. సుజనుని కవి దేనితో పోల్చాడు?
జవాబు:
సుజనుని కవి బంతితో పోల్చాడు.

4. ఈ పద్యంలోని అలంకారమేమి?
జవాబు:
ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘అమ్మకోసం’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
తెలుగులో ఆదికవిగా పేరుపొందిన నన్నయ గురించి పరిచయం చేయండి. (S.A.III – 2015-16)
జవాబు:
‘అమ్మకోసం’ అనే పాఠ్యభాగ రచయిత నన్నయభట్టు. ఈయన 11వ శతాబ్దికి చెందినవాడు. రాజరాజనరేంద్రుని ఆస్థానకవి. సంస్కృత మహాభారతాన్ని ఆంద్రీకరించిన కవిత్రయంలో నన్నయ మొదటివాడు. ఈయనకు ఆదికవి, శబ్దశాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. భారతంలోకి ఆది, సభా పర్వాలను పూర్తిగాను, అరణ్య పర్వంలోని సగభాగాన్ని అనువదించారు.

అక్షరమ్యత, ప్రసన్నకథా కలితార్థయుక్తి, నానారుచిరార్థ సూక్తినిధిత్వం నన్నయ కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. అనువాద పద్ధతిలో, శైలిలో తరువాతి కవులకు మార్గదర్శకుడయ్యాడు నన్నయ.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
‘ఇతిహాసం’ ప్రక్రియను వివరించండి.
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘ఇతిహాసం’ అనే ప్రక్రియ ముఖ్యమైనది. ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆశురూపంలో ఉండేవి. ఇందులో కథ, కథనానికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. రామాయణ, మహాభారతాలను ఇతిహాసాలు అని అంటారు.

ప్రశ్న 3.
గరుత్మంతుని స్వభావాన్ని వివరించండి.
జవాబు:
‘అమ్మకోసం’ అనే పాఠ్యభాగంలో గరుత్మంతుని పాత్ర ప్రముఖమైనది. తల్లి పట్ల అపరిచితమైన భక్తి విశ్వాసాలు కలవాడు. తల్లిదాస్యాన్ని గూర్చి తెలుసుకున్నాడు. ఆమె దాస్యాన్ని తొలగించడానికి ప్రయత్నించాడు. అమృతభాండాన్ని తీసుకొని వచ్చి తల్లికి దాస్యవిముక్తిని కలిగించాడు.

గరుత్మంతుని వేగం అసమానమైంది. అంతులేని పరాక్రమం, గరుత్మంతునికే సొంతం. తల్లికి దాస్యవిముక్తిని కల్గించాడు. తల్లి ఆశలను నెరవేర్చాడు. పిల్లలందరు తనలాగే ఉండాలని లోకానికి తెలియజేసిన మహనీయుడు గరుత్మంతుడు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
గరుత్మంతుడు తల్లికి దాస్య విముక్తిని కల్గించి ఉత్తమునిగా కీర్తి పొందాడు కదా ! అట్లే నీ తల్లికి నీవు ఎలా సేవలు చేస్తావు? ఆమెకు ఎలాంటి ఆనందాన్ని కల్గిస్తావు?
జవాబు:
గరుత్మంతుడు తల్లిని సేవించాడు. ఆమెకు దాస్యవిముక్తిని కలిగించాడు. సమాజానికి ఆదర్శంగా నిలిచాడు. గరుత్మంతుడినే నేను ఆదర్శంగా తీసుకున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ అని పెద్దలు అంటారు. తల్లిదండ్రుల ఋణాన్ని పిల్లలు తీర్చుకోవాలి. వారికి అండగా ఉండాలి.

తల్లిదండ్రులకు ఇంటి పనుల్లోను, బయట పనుల్లోను చేదోడువాదోడుగా ఉంటాను. తల్లిదండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడతారు. తల్లిదండ్రులకు ఇబ్బందులు కలిగినపుడు వారికి అండగా ఉంటాను. తల్లిదండ్రుల కష్టాలను తొలగించేందుకు కృషి చేస్తాను.

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు కలుగదు. ఆ పుత్రుని పదిమంది మెచ్చుకొంటున్నప్పుడు కలుగుతుంది. ధృతరాష్ట్రునకు నూరుమంది కొడుకులు పుట్టారు. వారి వల్ల ఆయనకు కష్టాలే వచ్చాయి గాని సుఖం కలుగలేదు. వారందరూ అధర్మ మార్గాన నడిచారు. పాండు పుత్రులు ఐదుగురైనా ధర్మమార్గాన నడిచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. పెద్దయిన తరువాత మా తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని మేము బాగా చదువుతున్నాము. నేను, మా చెల్లి మా తల్లిదండ్రుల్ని ప్రత్యక్షదైవాలుగా చూసుకొంటున్నాము. మా చదువులు పూర్తయ్యే వరకు మా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండి, ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల కష్టాలు తొలగిస్తాము.

ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 1.
తల్లిని గౌరవించాలని తెలియజేసే విధంగా కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  • తల్లిని గౌరవించు. ఆదర్శంగా జీవించు.
  • మాతృమూర్తి రూపమిచ్చిన అమృతమూర్తి,
  • సకల పుణ్యతీర్థాలు తల్లిలో ఉన్నాయి. ఆ తల్లిని మించిన దైవం లేదు.
  • కొట్టినా పెట్టేది తల్లి. పెట్టినా కొట్టేది కొడుకు.
  • కష్టబెట్టబోకు కన్నతల్లి మనసు.
  • కన్నతల్లి కంటే ఘనదైవంబు లేదు.
  • అంతులేని ప్రేమ తల్లి మనసు.
  • త్యాగానికి మరోరూపు తల్లి.

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
తల్లిదండ్రులను గౌరవించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

పొదిలి.
x x x x x x x

ప్రియమైన మిత్రుడు శరత్ కు,

నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన కన్న తల్లిదండ్రులు దైవంతో సమానం. వారిని గౌరవించడం మన ధర్మం. పుట్టినప్పటి నుంచి మన బాధ్యతలను తల్లిదండ్రులు చూస్తారు. వారు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పిల్లల అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులను గౌరవించాలి. వారు చెప్పినట్లు మంచి మార్గంలో నడవాలి. అందరికి ఆదర్శంగా నిలవాలి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దూరంగా విడిచిపెట్టకుండా తమ దగ్గరే ఉంచుకొని, వారి యోగక్షేమాలను చూచుకోవాలి. నీవు నా (అభిప్రాయంతో ఏకీభవిస్తావని ఆశిస్తున్నాను. పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపగలవు.)

ఇట్లు
నీ మిత్రుడు,
x x x x x x x

చిరునామా :
పి.శరత్, 8వ తరగతి,
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,
జిల్లెళ్ళమూడి, బాపట్ల మండలం,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 3.
ప్రాచీన సాహిత్యంలోని ముఖ్యమైన గ్రంథాలేమిటో మీ పాఠ్యపుస్తకం ఆధారంతో రాసి – వాటిని చదవడం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలియజేయండి. (S.A. III – 2015-16)
జవాబు:
సమాజ హితమే సాహిత్యం , సంఘంలోని ప్రజలకు మంచి చెడులను తెలియచెప్పేవి గ్రంథాలు. అందులో ప్రాచీన సాహిత్యంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రామాయణం, భారతం, భాగవతాదులు. మన పాఠ్యాంశాలలో అమ్మకోసం (ఆంధ్రమహాభారతం), హరిశ్చంద్రుడు (హరిశ్చంద్రోపాఖ్యానం) అనేవి ప్రాచీన సాహిత్య గ్రంథాలు.

ఈ గ్రంథాలు చదవడం ద్వారా ప్రజలకు అన్ని విధాల మంచి జరుగుతుంది. మాతృభక్తి, విలువలు ఒకటి చెబుతుంటే, మరొకటి వ్యక్తిత్వ విలువలు నేర్పుతుంది. తల్లిదండ్రుల పట్ల పిల్లల వైఖరి ఎలా ఉండాలో భారతం చెబుతుంది. ఇంకా ఒక సమాజానికి నిలువుటద్దంగా నిలిచింది. అందుకే ‘వింటే భారతం వినాలి’ అంటారు. అనగా సమాజంలోని వ్యక్తులకు అద్దం పట్టే విధంగా భారతం తీర్చిదిద్దబడింది. అన్ని రకాల వ్యక్తిత్వాలు భారతంలో మనం చూడవచ్చు. ధర్మం ఎవరి వైపు ఉంటుందో, వారి వైపే విజయం ఉంటుంది అని తెలుస్తుంది. హరిశ్చంద్రుడు సత్యవాక్పరిపాలన పాటించి సత్యహరిశ్చంద్రుడు అయ్యాడు. ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధం ఆడలేదు. మహాత్మగాంధీకి సత్యమార్గాన్ని చూపిన వ్యక్తి, ఈ మహనీయుడు. ఈయన కథను చదవడం ద్వారా విశ్వసనీయత, నైతిక విలువలు పెరుగుతాయి. ధర్మతత్పరతకు అవకాశం కల్గుతుంది. ‘సత్యమేవ జయతే’ అన్న సూక్తికి రూపం హరిశ్చంద్రుడు. పై గ్రంథములను చదవడం వల్ల ప్రజలకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.

8th Class Telugu 1st Lesson అమ్మకోసం 1 Mark Bits

1. అమిత పరాక్రమంబును “రయంబు”ను (అర్థాన్ని గుర్తించండి) (S.A. I. 2019-20)
ఎ) బలము
బి) వేగము
సి) దుమ్ము
డి) రజను
జవాబు:
బి) వేగము

2. మెరుపులతో పాటు కులిశములు రాలాయి (పర్యాయ పదాలు గుర్తించండి) (SA. I. 2018-19)
ఎ) పన్నగం, పిడుగు
బి) అశని, పిడుగు
సి) అశని, ఫణి
డి) గగనం, సర్పం
జవాబు:
బి) అశని, పిడుగు

3. ఆయత పక్షతుండహతి. పక్షము అనే పదానికి నానార్థాలు గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) వైపు, రెక్క
బి) రెక్క వారం
సి) పులుగు, పక్షి
డి) ఖగం , పక్షి
జవాబు:
ఎ) వైపు, రెక్క

4. “అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునపుడు సంధియగు” ఈ సూత్రం వర్తించే సంధి పదాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) నెగడెందమములు
బి) అత్యుగ్ర
సి) ఔరౌర
డి) వంటాముదం
జవాబు:
సి) ఔరౌర

5. గరుత్మంతుని పక్షములు చాలా అందమైనవి (నానార్థాలు గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) రెక్కలు, 15 రోజుల కాలం
బి) పాలు, అమృతము
సి) పృథ్వీ, ధర
డి) ఆకాశము, అంబరం
జవాబు:
ఎ) రెక్కలు, 15 రోజుల కాలం

6. గీత బజారుకు వెళ్లి కూరగాయలు కొన్నది (ఏ వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) శత్రర్థకం
బి) సంక్లిష్ట
సి) సంయుక్త
డి) సామాన్య
జవాబు:
బి) సంక్లిష్ట

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

7. మహాభారతమును తెలుగులో మొట్టమొదటగా నన్నయ రాశారు. (సంధి పేరు గుర్తించండి) (SA. II – 2017-18)
ఎ) ఆమ్రేడిత
బి) గుణ
సి) అకార
డి) త్రిక
జవాబు:
ఎ) ఆమ్రేడిత

8. అశని ధ్వని వింటే నాకు భయంగా ఉంటుంది. (సమానార్థక పదాలు గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) పిడుగు – కులిశం
బి) అల – గోల
సి) తరంగం – అల
డి) సరస్సు – శిరస్సు
జవాబు:
ఎ) పిడుగు – కులిశం

9. “నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు” ఇది ఏ రకమైన వాక్యం (S.A. III – 2015-16)
ఎ) కర్తరి వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) సామాన్య వాక్యం
డి) సంక్లిష్ట వాక్యం
జవాబు:
సి) సామాన్య వాక్యం

భాషాంశాలు – పదజాలం

ఆర్థాలు :

10. విద్యార్థులకు అభీష్టం చదువుపట్లే ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) కోరిక
బి) అమరిక
సి) తపన
డి) అంతరంగం
జవాబు:
ఎ) కోరిక

11. గగనంలో చంద్రుడు ఉదయించాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) త్రిదిపం
బి) ఆకాశం
సి) దరి
డి) దారి
జవాబు:
బి) ఆకాశం

12. ఈ సంవత్సరంలో వృష్టి కురిసింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) క్షేత్రం
బి) నింగి
సి) వాన
డి) క్షీరం
జవాబు:
సి) వాన

13. దివాకరుడు వెలుగును ఇచ్చాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) శుక్రుడు
బి) తపన
సి) పాంథము
డి) సూర్యుడు
జవాబు:
డి) సూర్యుడు

14. పుట్టలో ఉదగం ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) భుజం
బి) భుజగం
సి) శీర్షం
డి) ఉదరం
జవాబు:
బి) భుజగం

15. కుశమును కోయడం చాలా కష్టం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) దర్భ
బి) ధర
సి) ధరణి
డి) వసుధ
జవాబు:
ఎ) దర్భ

16. అనిమిషనాథుడు వయుధం ధరించాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) శని
బి) కుబేరుడు
సి) ఇంద్రుడు
డి) వాయువు
జవాబు:
సి) ఇంద్రుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

17. అమరులు అమృతం త్రాగారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) కిన్నెరులు
బి) రాక్షసులు
సి) గంధర్వులు
డి) దేవతలు
జవాబు:
డి) దేవతలు

పర్యాయపదాలు :

18. తల్లి పుత్రుని రక్షించు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) అంబ, అంబాలిక
బి) మాత, జనని
సి) అమ్మ, అమృతం
డి) వనిత, మాత
జవాబు:
బి) మాత, జనని

19. దినకరుడు అస్తమించాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) జలధి, జలజం
బి) రజనీశ్వరుడు, రాతిరి
సి) సూర్యుడు, ఆదిత్యుడు
డి) మారుతి, ఇనుడు
జవాబు:
సి) సూర్యుడు, ఆదిత్యుడు

20. ఖగము గగనంపై విహరించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పుండరీకం, శృంగాలం
బి) నక్క, కాకి
సి) బకము, వింజామరం
డి) పక్షి, పులుగు
జవాబు:
డి) పక్షి, పులుగు

21. శైలంబుపై ఝరి ప్రవహించింది – గీత గీసిన పదానికి సమానార్థక పదం గుర్తించండి.
ఎ) అది
బి) తరువు
సి) నగరం
డి) పథము
జవాబు:
ఎ) అది

22. ఆననం పై కుంకుమ బొట్టు ఉంది – గీత గీసిన పదానికి సమానార్థకం గుర్తించండి.
ఎ) కరం
బి) ముఖం
సి) నాశిక
డి) కర్ణం
జవాబు:
బి) ముఖం

ప్రకృతి – వికృతులు :

23. హృదయం నిర్మలంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) ఎద
బి) హేయం
సి) హాయం
డి) హంస
జవాబు:
ఎ) ఎద

24. శక్తి మించి పని చేయరాదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సత్తి
బి) సెత్తి
సి) సొత్తి
డి) మిత్తి
జవాబు:
ఎ) సత్తి

25. కులము కంటే గుణము మిన్న – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) కొలము
బి) గొలము
సి) కెలము
డి) కిలము
జవాబు:
ఎ) కొలము

26. అగ్ని మండును – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) అగ్గే
బి) అగ్గి
సి) అగ్గి
డి) అచ్చి
జవాబు:
బి) అగ్గి

27. ప్రజలు సంతోషం పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) సంతషం
బి) సెంతసం
సి) సొంతసం
డి) సంతసం
జవాబు:
డి) సంతసం

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

28. మానవుడు ముతి పొందాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) ముగిచె
బి) ముక్తి
సి) ముత్తె
డి) ముచ్చ
జవాబు:
బి) ముక్తి

నానార్థాలు :

29. అన్నింట అర్థం అవసరం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) కారణం, కాసర
బి) సంపద, శబ్దార్థం
సి) శ్రీ, గానుగ
డి) లక్ష్మి, అరమరిక
జవాబు:
బి) సంపద, శబ్దార్థం

30. పక్షి రయమున వెళ్ళె – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) వనము, వేగము
బి) వేదం, వెల్లువ
సి) వేగం, వేకువు
డి) వేకువ, వరద
జవాబు:
బి) వేదం, వెల్లువ

31. దేవతలు సుధను త్రాగారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) అమృతం, పాలు
బి) నీరు, నాలుక
సి) జలం, వారి
డి) క్షీరం, సున్నం
జవాబు:
ఎ) అమృతం, పాలు

32. పక్షి పక్షములతో ఎగిరింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) 15 రోజులకాలం
బి) క్షీరం
సి) జలధి
డి) ఉదధి
జవాబు:
ఎ) 15 రోజులకాలం

33. సరస్సులో వారి ఉంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) లావు
బి) సరస్వతి
సి) సామర్థ్యం
డి) లక్ష్మి
జవాబు:
బి) సరస్వతి

వ్యుత్పత్తర్థాలు :

34. దేవతలు అమృతం త్రాగారు – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
ఎ) మృతి కావాలనేది
బి) మరణము పొందింపనిది
సి) మరణం కానిది
డి) మరణం చెందేది
జవాబు:
బి) మరణము పొందింపనిది

35. పున్నామ నరకం నుండి రక్షించువాడు-అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) పుత్రుడు
బి) భూమాత
సి) జనకుడు
డి) పురం
జవాబు:
ఎ) పుత్రుడు

36. అనిమిషనాథుడు దివి యందు ఉండె – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థం గుర్తించండి.
ఎ) దేవతలకు ప్రభువు
బి) రాక్షసులకు రాజు
సి) దేవతలకు గురువు
డి) దేవతలకు సేనాని
జవాబు:
ఎ) దేవతలకు ప్రభువు

37. వెనతేయుడు బుధిమంతుడు – గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) వినత యొక్క అల్లుడు
బి) వినత యొక్క కుమారుడు
సి) వినత యొక్క మామ
డి) వినత యొక్క ఆశయం
జవాబు:
బి) వినత యొక్క కుమారుడు

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

38. భుజంగము – దీనికి వ్యుత్పత్తి ఏది?
ఎ) వేగంగా పోవునది
బి) మంధముగా పోవునది
సి) కుటిలముగా పోవునది
డి) గగనంపై వెళ్ళునది
జవాబు:
సి) కుటిలముగా పోవునది

39. ఖేచరం విహరించును – గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) సర్వత్ర తినునది
బి) ఆకాశమున సంచరించునది
సి) ఆకాశంచేత పయనించునది
డి) స్వర్గంపై తిరిగేది
జవాబు:
బి) ఆకాశమున సంచరించునది

వ్యాకరణాంశాలు

సంధులు :

40. అత్యుగ్రం – దీన్ని విడదీయడం గుర్తించండి.
ఎ) అతో + అగ్రము
బి) అతీ + అగ్రము
సి) అతే + అగ్రం
డి) అతి + ఉగ్రము
జవాబు:
డి) అతి + ఉగ్రము

41. దధ్యోదనం – ఇది ఏ సంధి?
ఎ) సునీతి పరిమళాలు
బి) నీతి పరిమళాలు
సి) పరిమళనీతులు
డి) అపరిమళనీతులు
జవాబు:
ఎ) సునీతి పరిమళాలు

42. చిట్టచివర ఉన్నాను – దీనిని విడదీయడం గుర్తించండి.
ఎ) చిట్టి + చివర
బి) చివర + చివర
సి) చిట్ట + చివర
డి) చిరు + చివర
జవాబు:
బి) చివర + చివర

43. ద్విరుక్తము యొక్క పరరూపాన్ని ఏమంటారు?
ఎ) ఆమ్రేడితం
బి) త్రికము
సి) ఉత్వ
డి) శత్రర్థకం
జవాబు:
ఎ) ఆమ్రేడితం

44. వృద్ధులు అనగా ఏవి?
ఎ) ఆ, ఈ, ఏ
బి) ఉ, ఋ, ఎ
సి) య, వ, ర, ల
డి) ఐ, ఔ
జవాబు:
డి) ఐ, ఔ

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

45. దేశోన్నత్యం పెరగాలి – ఇది ఏ సంధి?
ఎ) అత్వసంధి
బి) వృద్ధిసంధి
సి) త్రికసంధి
డి) యణాదేశ సంధి
జవాబు:
బి) వృద్ధిసంధి

46. క్రింది వానిలో పొసగని సంధి ఏది?
ఎ) ఇత్వసంధి
బి) ఉత్వసంధి
సి) త్రికసంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) త్రికసంధి

47. మనోవేగంతో వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) త్రికసంధి
బి) విసర్గసంధి
సి) గుణసంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
బి) విసర్గసంధి

సమాసాలు :

48. సంఖ్యా శబ్దం కలిగిన సమాసమును గుర్తించండి.
ఎ) ద్వంద్వ సమాసం
బి) ద్విగు సమాసం
సి) షష్ఠీ తత్పురుష
డి) తృతీయా తత్పురుష
జవాబు:
బి) ద్విగు సమాసం

49. వనకరి – ఇది ఏ సమాసము?
ఎ) ద్వితీయా తత్పురుష
బి) చతుర్థి తత్పురుష
సి) సప్తమీ తత్పురుష
డి) అవ్యయీభావ సమాసం
జవాబు:
సి) సప్తమీ తత్పురుష

50. గుణసంయుతులు – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) గుణమునందు సంయుతులు
బి) గుణము యొక్క సంయుతులు
సి) గుణములతో సంయుతులు
డి) గుణం వల్ల సంయుతులు
జవాబు:
బి) గుణము యొక్క సంయుతులు

51. నీతి యొక్క పరిమళాలు – దీనికి సమస్త పదం గుర్తించండి.
ఎ) యణాదేశ సంధి
బి) గుణసంధి
సి) త్రికసంధి
డి) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
బి) గుణసంధి

52. సూర్యుని దెస – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) దెస సూర్యుడు
బి) సూర్యదేస
సి) అసూర్యదెస
డి) సూర్యుని యొక్క దెస
జవాబు:
డి) సూర్యుని యొక్క దెస

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

53. దినము దినము – దీన్ని సమాసపదంగా గుర్తించండి.
ఎ) యథాదినం
బి) ప్రతిదినం
సి) దినంప్రతి
డి) అనుదినం
జవాబు:
బి) ప్రతిదినం

54. తల్లిదండ్రులు – ఇది ఏ సమాసం?
ఎ) ద్వంద్వ సమాసం
బి) అవ్యయీభావం
సి) కర్మధారయం
డి) ద్విగు సమాసం
జవాబు:
ఎ) ద్వంద్వ సమాసం

55. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసాన్ని గుర్తించండి.
ఎ) బహుజొహి
బి) కర్మధారయం
సి) అవ్యయీభావం
డి) తత్పురుష
జవాబు:
ఎ) బహుజొహి

గణవిభజన:

56. రగణం – దీనికి గణాలు గుర్తించండి.
ఎ) UUI
బి) UUU
సి) UIU
డి) IUU
జవాబు:
సి) UIU

57. వితతోల్కాశనిపుంజ మొక్క యనఁగా విన్వీథి విక్షిప్త ప – ఇది ఏ పద్యపాదమో గుర్తించండి?
ఎ) చంపకమాల
బి) ఉత్పలమాల
సి) మత్తేభం
డి) శార్దూలం
జవాబు:
సి) మత్తేభం

58. క్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబు లై వారిద – ఇది ఏ పద్యపాదమో తెల్పండి.
ఎ) చంపకమాల
బి) మత్తేభం
సి) శార్దూలం
డి) ఉత్పలమాల
జవాబు:
బి) మత్తేభం

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

59. ఘోరవికార సన్నిహిత కోపముఖంబులు, దీప్తవిద్యుడు – ఇది ఏ పద్యపాదమో గుర్తించండి.
ఎ) ఉత్పలమాల
బి) చంపకమాల
సి) శార్దూలం
డి) మత్తేభం
జవాబు:
ఎ) ఉత్పలమాల

60. UUU – ఇది ఏ గణం?
ఎ) మ గణం
బి) య గణం
సి) త గణం
డి) స గణం
జవాబు:
ఎ) మ గణం

61. ఆటవెలదిలోని రెండు, నాలుగు పాదాల్లో ఉండే గణాలు గుర్తించండి.
ఎ) 3 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు
బి) 5 సూర్యగణాలు
సి) 2 సూర్యగణాలు 3 ఇంద్రగణాలు
డి) 5 ఇంద్రగణాలు
జవాబు:
బి) 5 సూర్యగణాలు

వాక్య రకాలు :

62. రాము తప్పక వస్తాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) ఆనంతర్యార్థక వాక్యం
సి) నిశ్చయార్థక వాక్యం
డి) అప్యర్థక వాక్యం
జవాబు:
సి) నిశ్చయార్థక వాక్యం

63. రవి పాఠం విని నిద్రపోయాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) సామాన్య వాక్యం
జవాబు:
బి) సంక్లిష్ట వాక్యం

64. “నాకు ఆటలంటే ఇష్టం” అని రవి అన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్తరి వాక్యం
బి) ప్రత్యక్ష కథన వాక్యం
సి) పరోక్ష కథన వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
బి) ప్రత్యక్ష కథన వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

65. మీకు మేలు కలుగుగాక – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) చేదర్థకం
బి) ఆశీరార్థకం
సి) అభ్యర్థకం
డి) ధాత్వర్ధకం
జవాబు:
ఎ) చేదర్థకం

66. బాగా చదివితే మార్కులు వస్తాయి – ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) తర్థర్మార్థక వాక్యం
సి) చేదర్థక వాక్యం
డి) అభ్యర్థక వాక్యం
జవాబు:
బి) తర్థర్మార్థక వాక్యం

67. గరుత్మంతుడు దాస్యం తొలగించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
ఎ) గరుత్మంతునిచేత దాస్యం తొలగించబడింది
బి) గరుత్మంతుని వల్ల దాస్యం చేరింది
సి) గరుత్మంతునికి దాన్యం తొలగాలి
డి) దాస్యంచేత గరుత్మంతుడు తొలగించాడు
జవాబు:
ఎ) గరుత్మంతునిచేత దాస్యం తొలగించబడింది

68. రైలు వచ్చింది గాని చుట్టాలు రాలేదు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) హేత్వర్థక వాక్యం
సి) అప్యర్థక వాక్యం
డి) సంయుక్త వాక్యం
జవాబు:
డి) సంయుక్త వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 1 అమ్మకోసం

69. గరుత్మంతుడు ఎగిరి వెళ్ళాడు – దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది?
ఎ) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళియుండకూడదు
బి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళలేదు
సి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళవచ్చు
డి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళకూడదు
జవాబు:
బి) గరుత్మంతుడు ఎగిరి వెళ్ళలేదు

సొంతవాక్యాలు :

70. అన్యులు : కుటుంబ విషయాలను అన్యులకు చెప్పరాదు.

71. గుప్తము : విద్య మానవునికి గుప్తమగు ధనము.

72. ఉత్తముడు : శ్రీరాముడు మానవులలో పరమ ఉత్తముడు.

73. కరుణ : పేదప్రజలపై ధనవంతులు కరుణ చూపాలి.

74. సమర్థులు : సమర్థులు మాత్రమే అసాధ్యములైన పనులు చేస్తారు.

75. ప్రసిద్ధికెక్కు : అమరావతి చారిత్రాత్మకంగా మిక్కిలి ప్రసిద్ధికెక్కింది.

76. ఉపాయము : ఉపాయముతో అపాయాన్ని తొలగించుకోవచ్చు.

78. దాస్యము : విదేశీయుల పాలనలో భారతీయులు దాస్యము అనుభ వించారు.

79. విముక్తులు : ఖైదీలు సత్ప్రవర్తనతో జైలు నుండి విముక్తులయ్యారు.

80. దీవెనలు : తల్లిదండ్రులు తమ పిల్లలకు దీవెనలు అందజేస్తారు.

AP Board 8th Class Telugu Grammar

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions 8th Class Telugu Grammar Notes, Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Grammar

తెలుగు సంధులు

నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి.

గమనిక :
పై వాక్యంలో “చిన్నప్పుడు” అనే పదం, చిన్న + అప్పుడు అనే రెండు పదాలు కలవడం వల్ల వచ్చింది. దీనినే “సంధి పదం” అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం, రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసినప్పుడు, లేదా రాయవలసినప్పుడు, “సంధి పదం” ఏర్పడుతుంది.

* తెలుగు సంధులు: రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధులను “తెలుగు సంధులు” అంటారు.

* సంధి : వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల (అచ్చుల) కలయికను “సంధి” అని పిలుస్తారు.

* సంధి కార్యం : రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును “సంధి కార్యం” అని పిలుస్తారు.

* పూర్వ స్వరం : సంధి జరిగే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును, (స్వరాన్ని) “పూర్వ స్వరం” అని పిలుస్తారు.

* పర స్వరం : సంధి జరిగే రెండవ పదం మొదటి అక్షరంలోని అచ్చును (స్వరాన్ని) “పర స్వరం” అని పిలుస్తారు.
ఉదా :
రామ + అయ్య : ‘మ’ లో ‘అ’, పూర్వ స్వరం; ‘అయ్య’ లోని ‘అ’ పర స్వరం.

1. అత్వ సంధి సూత్రం : అత్తునకు సంధి బహుళం.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
మేనల్లుడు = మేన + అల్లుడు – (న్ +) అ + అ = అ – (అత్వ సంధి)
1) ఒకప్పుడు = ఒక + అప్పుడు – (అ + అ = అ) – (అత్వ సంధి)
2) వచ్చినందుకు = వచ్చిన + అందుకు – (అ + అ = అ) – (అత్వ సంధి)
3) రాకుంటే = రాక + ఉంటే – (అ + ఉ = ఉ) – (అత్వ సంధి)
4) లేకేమి = లేక + ఏమి = (అ + ఏ = ఏ) – (అత్వ సంధి)
5) పోవుటెట్లు = పోవుట + ఎట్లు – (అ + ఎ = ఎ) – (అత్వ సంధి)
6) చేసినంత = చేసిన + అంత – (అ + అ = అ) – (అత్వ సంధి)
7) విరిగినప్పుడు = విరిగిన + అప్పుడు – (అ + అ = అ) – (అత్వ సంధి)
8) చాలకున్న = చాలక + ఉన్న – (అ + ఉ = ఉ) – (అత్వ సంధి)
9) ఒకింత = ఒక + ఇంత = (అ + ఇ = ఇ) = (అత్వ సంధి)

గమనిక :
పై సంధి పదాలలోని పూర్వ స్వరం ‘అ’. అది పర స్వరంలోని అచ్చుతో కలిస్తే పూర్వ స్వరం ‘అ’ లోపిస్తుంది. ‘అ’ లోపించింది కాబట్టి ‘అత్వ సంధి’.

అత్వసంధి లేక ‘అకారసంధి’ అంటారు. పొట్టి ‘అ’ అనే అక్షరానికి అచ్చు పరమైతే ‘అత్వ సంధి’ వస్తుంది.

అత్వ సంధి (అకార సంధి) సూత్రం : అత్తునకు సంధి బహుళం.

AP Board 8th Class Telugu Grammar

2. ఇత్వ సంధి సూత్రం : ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) ఏమంటివి = ఏమి + అంటివి – (ఇ + అ = అ) – (ఇత్వసంధి)
సంధి జరుగనప్పుడు “య కారం” ఆగమంగా వస్తుంది. దానినే ‘యడాగమం’ అని పిలుస్తారు.

ఆ) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి – (ఇ + అ = య) – (ఇకార సంధి రాని యడాగమ రూపం)
ఇ) వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు – (ఇ + ఇ = ఇ) – ఇత్వసంధి
ఈ) వచ్చిరిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు – (ఇ + ఇ + యి) – (యడాగమం వచ్చిన రూపం)

గమనిక :
పై ఉదాహరణలలో హ్రస్వ ఇకారానికి అచ్చు కలిసినపుడు సంధి జరిగింది. దీనిని “ఇత్వసంధి” అంటారు. ఇత్వసంధి తప్పక జరగాలన్న నియమం లేదు.

* వైకల్పికం :
ఇత్వ సంధి జరగవచ్చు లేక జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని “వైకల్పికం” అని పిలుస్తారు.

అభ్యాసం :
ఉదా :
1) ఏమంటివి = ఏమి + అంటివి – (మ్ + ఇ + అ = మ)
2) పైకెత్తినారు = పైకి + ఎత్తినారు – (ఇ + ఎ = ఎ) – ఇత్వసంధి
3) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు – (ఇ + అ = అ) – ఇత్వసంధి
4) దారవుతుంది = దారి + అవుతుంది – (ఇ + అ = అ) – ఇత్వసంధి
5) పైకెత్తు = పైకి + ఎత్తు – (ఇ + ఎ = ఎ) – ఇత్వసంధి
6) జగానికంతా = జగానికి + అంతా – (ఇ + అ = ఆ) – ఇత్వసంధి
7) అదేమిటి = అది + ఏమిటి – (ఇ + ఏ = ఏ) – ఇత్వసంధి
8) వెళ్ళాలని = వెళ్ళాలి + అని – (ఇ + అ = అ) – ఇత్వ సంధి

ఇత్వసంధి సూత్రం :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.

3. ఉత్వ సంధి (ఉకారసంధి) సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
రాముడతడు = రాముడు + అతడు – (డ్ + ఉ + అ = డ) – (ఉత్వ సంధి)
1) అతడెక్కడ = అతడు + ఎక్కడ – (ఉ + ఎ = ఎ) – (ఉత్వ సంధి)
2) మనమున్నాము = మనము + ఉన్నాము – (ఉ + ఉ = ఉ) – (ఉత్వ సంధి)
3) మనసైన = మనసు + ఐన – (ఉ + ఐ = ఐ) – (ఉత్వ సంధి)
4) బాల్యమంతా = బాల్యము + అంతా – (ఉ + అ = అ) – (ఉత్వసంధి)
5) దేవతలంతా = దేవతలు + అంతా – (ఉ + అ = అ) – (ఉత్యసంధి)
6) అందమైన = అందము + ఐన – (ఉ + ఎ = ఐ) – (ఉత్వసంధి)
7) తలపెల్ల = తలపు + ఎల్ల (ఉ + ఎ = ఎ) – (ఉత్వసంధి)

గమనిక :
హ్రస్వ ఉకారానికి, అనగా ఉత్తుకు, అచ్చు కలిసినప్పుడు, పూర్వ స్వరం ఉకారం లోపించి, పర స్వరం కనిపిస్తుంది.
లోపించిన పూర్వ స్వరం ‘ఉ’ కాబట్టి, ఇది “ఉత్వ సంధి” అని పిలువబడుతుంది.

ఉత్వ సంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

నిత్యం :
నిత్యం అంటే, తప్పక సంధికార్యం జరుగుతుందని అర్థం.

4. యడాగమం :
సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అని పిలుస్తారు.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) మాయమ్మ = మా + అమ్మ = మాయమ్మ
ఆ) మాయిల్లు = మా + ఇల్లు = మాయిల్లు
ఇ) హరియతడు = హరి + అతడు = హరియతడు

గమనిక :
పై ఉదాహరణలలో సంధి జరుగలేదు. కానీ కొత్తగా ‘య్’ వచ్చి చేరింది. అలా చేరడం వల్ల ఈ కింది విధంగా మార్పు జరిగింది.
అ) మా + య్ + అమ్మ : మా ‘య’ మ్మ
ఆ) మా + య్ + ఇల్లు : మా ‘యి’ ల్లు
ఇ) హరి + య్ + అతడు = హరి ‘య’ తడు

యడాగమ సంధి
సూత్రం : సంధి లేనిచోట “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అంటారు.

AP Board 8th Class Telugu Grammar

5. ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా వస్తుంది.

ఆమ్రేడితం :
ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించగా, రెండవసారి ఉచ్చరించిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.
ఉదా :
1) ఆహాహా – ‘ఆహా + ఆహా’ ఆహా అనే పదం రెండుసార్లు వచ్చింది. అందులో రెండవ ‘ఆహా’ అనే దాన్ని ఆమ్రేడితం అని పిలవాలి.
2) అరెరె = అరె + అ = రెండవసారి వచ్చిన ‘అరె’ ఆమ్రేడితం.
3) ఔరౌర = ఔర + ఔర – రెండవసారి వచ్చిన ‘ఔర’ ఆమ్రేడితం.

గమనిక :
పై ఉదాహరణలలో ఒక్కొక్క పదం రెండుసార్లు వచ్చింది. రెండవసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.

ఆమ్రేడిత సంధికి ఉదాహరణములు :
ఔర + ఔర = ఔర్ + అ
ఆహా + ఆహా ఆహ్ + ఆ
ఓహో + ఓహో = ఓహ్ + ఓ

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వ పదం అనగా మొదటి పదం చివర, అ, ఆ, ఓ వంటి అచ్చులున్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే, సంధి వస్తుంది.

ఔర + ఔర = ఔరౌర – (అ + ఔ = ఔ)
ఆహా + ఆహా = ఆహాహా – (ఆ + ఆ = ఆ)
ఓహోహో = ఏమి + ఏమి – (ఓ + ఓ = ఓ)
ఏమి + ఏమి = ఏమేమి – (ఇ + ఏ = ఏ)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు – (ఉ + ఎ = ఎ)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి – (ఇ + ఏ = ఏ)
అరె + అరె = అరెరె – (ఎ + అ = అ)

పై విషయాలను గమనిస్తే ఆమ్రేడిత సంధి సూత్రాన్ని ఇలా తయారుచేయవచ్చు.

ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా వస్తుంది.

గమనిక :
ఆమ్రేడిత సంధి కింది ఉదాహరణలలో వికల్పంగా జరుగుతుంది. ఈ కింది ఉదాహరణలను గమనిస్తే సంధి జరిగిన రూపం, సంధిరాని రూపమూ కనబడతాయి.
ఉదా :
ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి (సంధి వైకల్పికం)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు, ఎట్లుయెట్లు (సంధి వైకల్పికం)
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత (సంధి వైకల్పికం)

6. ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి :
కింది ఉదాహరణలను గమనించండి.
1) పగలు + పగలు = పట్టపగలు
2) చివర + చివర = చిట్టచివర
3) కడ + కడ = కట్టకడ

గమనిక :
1) పగలు + పగలు = పట్టపగలు అవుతోంది. అంటే ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ అన్న అక్షరాలకు బదులుగా ‘ట్ట’ వచ్చింది. ‘ట్ట’ వచ్చి ‘పట్టపగలు’ అయింది.
2) చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘ట్ట’ వచ్చి, ‘చిట్టచివర’ అయింది.
3) కడ + కడ అన్నప్పుడు ‘డ’ స్థానంలో ‘మీ’ వచ్చి ‘కట్టకడ’ అయింది. ఇప్పుడు కింది వాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్ట యెదురు
కొన + కొన = కొట్టకొన
మొదట + మొదట = మొట్టమొదట
బయలు + బయలు = బట్ట బయలు
తుద + తుద = తుట్టతుద

గమనిక :
ఆమ్రేడితం పరంగా ఉంటే, కడ మొదలైన శబ్దాల మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలకు ‘ట్ట’ వస్తుండడం గమనించాం.

సూత్రం :
ఆమ్రేడితం పరంగా ఉంటే, కడాదుల తొలి అచ్చు మీది అగ్ని అక్షరాలకు ఆద్యంతమైన ద్విరుక్తటకారం వస్తుంది.

AP Board 8th Class Telugu Grammar

7. ద్రుతప్రకృతిక సంధి (సరళాదేశ సంధి) :
ఈ కింది పదాలు చదివి పదంలోని చివర అక్షరం కింద గీత గీయండి.
1) పూచెను 2) చూచెన్ 3) తినెను 4) ఉండెన్

గమనిక :
పై పదాలను గమనిస్తే పదాల చివర, ను, చ్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉంది. ఈ నకారాన్ని ‘ద్రుతం’ అంటారు. ద్రుతము చివరన గల పదాలను “ద్రుత ప్రకృతికములు” అంటారు.

గమనిక :
పూచెను, చూచెన్, తినెన్, ఉండెన్ – అనేవి ద్రుత ప్రకృతికములు.

కింది ఉదాహరణములను గమనించండి.
ఉదా : అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి
ఊ) చేసెను + తల్లీ = చేసెను + దల్లీ
ఋ) దెసను + చూసి = దెసను + జూసి

గమనిక :
ద్రుతప్రకృతానికి ‘క’ పరమైతే ‘గ’, ‘చ’ పరమైతే ‘జ’, ‘ట’ పరమైతే ‘డ’, ‘త’ పరమైతే ‘ద’, ‘ప’ పరమైతే ‘బ’ ఆదేశంగా వస్తాయి.
1) క – ‘గ’ గా, 2) చ – ‘జ’ గా 3) ట – ‘డ’ గా 4) త – ‘ద’ గా 5) ప – ‘బ’ గా మార్పు వచ్చింది.

ఇందులో ‘క చ ట త ప’ లకు ‘పరుషములు’ అని పేరు, ‘గ జ డ ద బ’ లకు ‘సరళములు’ అని పేరు. దీనిని బట్టి సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉంటుంది.

సూత్రం :
ద్రుతప్రకృతికము మీది పరుషాలకు సరళాలు వస్తాయి.

గమనిక :
ఇప్పుడు పై ఉదాహరణలలో మార్పు గమనించండి.
ఉదా :
పూచెఁ గలువలు ; (ద్రుతం అరసున్నగా మారింది)
పూచెను + కలువలు (పూచెం గలువలు (ద్రుతం సున్నగా మారింది) పూచెన్గలువలు (ద్రుతం మీది హల్లుతో కలిసి సంశ్లేష రూపం అయ్యింది) పూచెను గలువలు (ద్రుతము మార్పు చెందలేదు) దీనికి సూత్రం చెపితే సూత్రం ఇలా ఉంటుంది.

2వ సూత్రం :
ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.
గమనిక :
అంటే ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.

8. గసడదవాదేశ సంధి :
కింది పదాలను ఎలా విడదీశారో గమనించండి.
1) గొప్పవాడుగదా = గొప్పవాడు + కదా డు + క)
2) కొలువు సేసి = కొలువు + చేసి (వు + చే)
3) వాడుడక్కరి = వాడు + టక్కరి (డు + ట)
4) నిజముదెలిసి = నిజము + తెలిసి (ము + తె)
5) పాలువోయక = పాలు + పోయక (లు + పో)

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వపదం చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప లు ఉన్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీద, ప్రత్యయాలు క, చ, ట, త, ప లు పరమైతే, వాటి స్థానంలో గ, స, డ, ద, వ, లు ఆదేశంగా వస్తాయి. అంటే –
1) క – గ – గా మారుతుంది
2) చ – స గా మారుతుంది
3) ట – డ గా మారుతుంది.
4) త – ద – గా మారుతుంది
5) ప – వ గా మారుతుంది

అంటే క, చ, ట, త, ప లకు, గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి.

AP Board 8th Class Telugu Grammar

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గ స డ ద వ లు బహుళంగా వస్తాయి.

ద్వంద్వ సమాసంలో గ స డ ద వా దేశ సంధి :
కింది పదాలను గమనించండి.
కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి + లు
టక్కుడెక్కులు = టక్కు + టెక్కు + లు
తల్లి దండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు : ఊరు + పల్లె + లు
నల్ల గలువలు = నల్ల + కలువ + లు

గమనిక :
పై ఉదాహరణలు ద్వంద్వ సమాసపదాలు. పై ఉదాహరణలలో కూడా క చట త ప లకు గ స డ ద వ లు వచ్చాయి. దీన్నే గ స డ ద వా దేశం అంటారు.

గసడదవాదేశ సంధి
సూత్రం : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న క చ ట త ప లకు గ స డ ద వ లు క్రమంగా వస్తాయి.
కింది పదాలను కలపండి.
1) అక్క + చెల్లి = అక్కాసెల్లెండ్రు
2) అన్న + తమ్ముడు = అన్నదమ్ములు
3) నల్ల + కలువ = నల్ల కలువలు

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ అనే వర్ణాలకు అవే (స)వర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం తప్పనిసరిగా వస్తుంది.

గమనిక :
‘అ’ వర్ణానికి – ‘అ, ఆ’ లు – సవర్ణాలు
‘ఇ’ వర్ణానికి – ‘ఇ, ఈ’ లు – సవర్ణాలు
‘ఉ’ వర్ణానికి – ‘ఉ, ఊ లు’ – సవర్ణాలు
‘ఋ’ వర్ణానికి – ‘బు, ఋ’ లు – సవర్ణాలు

ఉదా :
1) రామానుజుడు = రామ + అనుజుడు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
2) రామాలయం = రామ ఆలయం – (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
3) కవీంద్రుడు = ఇంద్రుడు – (ఇ + ఇ = ఈ) = సవర్లదీర్ఘ సంధి
4) భానూదయం = భాను + ఉదయం (ఉ + ఉ = ఊ) – సవర్ణదీర్ఘ సంధి
5) వధూ పేతుడు = వధూ + ఉపేతుడు – (ఊ + ఉ = ఊ) – సవర్ణదీర్ఘ సంధి
6) పిత్రణం = పితృ + ఋణం – (ఋ + ఋ = ఋ) – సవర్ణదీర్ఘ సంధి
7) మాత్రణం = మాతృ + ఋణం – (ఋ + ఋ = ఋ) – సవర్ణదీర్ఘ సంధి
8) విద్యాధికుడు = విద్య + అధికుడు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
9) విలాపాగ్నులు = విలాప + అగ్నులు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
10) విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
11) ప్రేమానురాగాలు = ప్రేమ + అనురాగాలు – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
12) పవనాగ్ని = పవన + అగ్ని – (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Grammar

2. గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వస్తాయి.
1. ఉదా :
రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు – (ఆ + ఇ = ఏ) – గుణసంధి
మహేంద్రుడు = మహా + ఇంద్రుడు – (ఆ + ఇ = ఏ) – గుణసంధి
నరేంద్రుడు = నర + ఇంద్రుడు – (అ + ఇ = ఏ) – గుణసంధి
సురేంద్రుడు = సుర + ఇంద్రుడు – (అ + ఇ = ఏ) – గుణసంధి
నిజేచ్ఛ = నిజ + ఇచ్చ – (అ + ఇ = ఏ) – గుణసంధి

2.ఉదా :
పరోపకారం = పర + ఉపకారం – (అ + అ + ఉ) – గుణసంధి
మహోన్నతి = మహా + ఉన్నతి – (ఆ + ఉ + ఓ) – గుణసంధి
దేశోన్నతి = దేశ + ఉన్నతి – (అ + ఉ = ఓ) – గుణసంధి
గృహోపకరణం = గృహ + ఉపకరణం – (అ + ఉ = ఓ) – గుణసంధి
రజోవృష్టి = రజ + వృష్టి – (అ + ఉ = ఓ) – గుణ సంధి
గుళోన్నతి = గుణ + ఉన్నతి – (అ + ఉ = ఓ) – గుణసంధి
సూర్యోదయం = సూర్య + ఉదయం = (అ + ఉ = ఓ) = గుణసంధి

3. ఉదా :
రాజర్షి = రాజ + ఋషి – (అ + ఋ = అర్) – గుణసంధి
మహర్షి = మహా + ఋషి – (ఆ + ఋ = అర్) – గుణసంధి

గమనిక :
1) అ, ఆ లకు, ఇ, ఈ లు కలిసి ‘ఏ’ గా మారడం
2) అ, ఆ లకు, ఉ, ఊ లు కలిసి ‘ఓ’ గా మారడం
3) అ, ఆ లకు, ఋ, ౠ లు కలిసి ‘అర్’ గా మారడం.

పై మూడు సందర్భాల్లోనూ, పూర్వ స్వరం అంటే సంధి విడదీసినపుడు మొదటి పదం చివరి అచ్చు, అ, ఆ లుగా ఉంది. పర స్వరం, అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు ఇ, ఉ, ఋలుగా ఉన్నాయి.

గమనిక :
1) అ, ఆ లకు – ‘ఇ’ కలిస్తే ‘ఏ’ గా మారుతుంది.
2) అ, ఆ లకు – ‘ఉ’ కలిస్తే ‘ఓ’ గా మారుతుంది.
3) అ, ఆ లకు – ‘ఋ’ కలిస్తే ‘అర్’ గా మారుతుంది.

గమనిక :
ఏ, ఓ, అర్ అనే వాటిని గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని “గుణసంధి” అంటారు.

3. యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ, లకు అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

ఈ కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.
ఉదా :
అ) అత్యానందం = అతి + ఆనందం – (త్ + ఇ + ఆ = యా) – యణాదేశ సంధి
1) అత్యంతం = అతి + అంతం – (అత్ + ఇ + అ + య) – యణాదేశ సంధి

ఉదా :
ఆ) అణ్వస్త్రం = అణు + అస్త్రం – (ణ్ + ఉ + అ = వ) – యణాదేశ సంధి
2) గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ – (ర్ + ఉ + ఆ = వ) – యణాదేశ సంధి

ఉదా :
ఇ) పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ – (బ + ఆ = రా) – యణాదేశ సంధి
3) మాత్రంశ = మాతృ + అంశ – (ఋ + అ = ర) – యణాదేశ సంధి

గమనిక :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు (వేరే అచ్చులు) పక్కన వచ్చినపుడు, క్రమంగా వాటికి య – వ – ర లు వచ్చాయి. యవరలను ‘యణ్ణులు’ అంటారు. యణ్ణులు చేరితే వచ్చే సంధిని ‘యణాదేశ సంధి అంటారు. యణాదేశ సంధిలో, ‘ఇ’ కి బదులుగా “య్”, ‘ఉ’ కి బదులుగా ‘వ్’, ‘ఋ’ కి బదులుగా ‘ర్‌’ వచ్చాయి.

యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ లకు, అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

4. వృద్ధి సంధి
సూత్రం : అకారానికి ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారమూ, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారమూ వస్తాయి.
ఈ కింది పదాలను విడదీయండి.
1.ఉదా :
వసుధైక = వసుధా + ఏక- (అ + ఏ = ఐ) – వృద్ధి సంధి
అ) రసైక = రస + ఏక – (అ + ఏ = ఐ) – వృద్ధి సంధి
ఆ) సురైక = సుర + ఏక- (అ + ఏ = ఐ) – వృద్ధి సంధి

2. సమైక్యం = సమ + ఐక్యం = (అ + ఐ = ఇ) – వృద్ధి సంధి
అప్లైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం – (అ + ఐ = ఐ) – వృద్ధి సంధి
ఈ) దేవైశ్వర్యం = దేవ + ఐశ్వర్యం – (అ + ఐ = ఐ) – వృద్ధి సంధి

3. పాపౌఘము = పాప + ఓఘము – (అ + ఓ = ఔ) – వృద్ధి సంధి
ఉ) వనౌకసులు = వన + ఓకసులు – (అ + ఓ = ఔ) – వృద్ధి సంధి
ఊ) వనౌషధి = వన + ఓషధి – (అ + ఓ = ఔ) – వృద్ధి సంధి

4. రసౌచిత్యం = రస + ఔచిత్యం – (అ + ఔ = ఔ) – వృద్ధి సంధి
ఋ) దివ్యౌషధం = దివ్య + ఔషధం – (అ + ఔ = ఔ) – వృద్ధి సంధి
ఋ) దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం – (అ + ఔ = ఔ) – వృద్ధి సంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను విడదీసినపుడు మీరు గమనింపదగిన విషయం ఇది.
1. వృద్ధి సంధి ఏర్పడేటప్పుడు, ప్రతిసారీ పూర్వస్వరంగా ‘అ’ వచ్చింది.
2. పర స్వరం స్థానంలో వరుసగా “ఏ, ఐ, ఓ, ఔ”లు ఉన్నాయి.
3. అకారానికి ఏ, ఐ లు కలిపినపుడు ‘ఐ’ వచ్చింది.
4. అకారానికి ఓ, ఔ లు కలిపినపుడు ‘ఔ’ వచ్చింది.

వృద్ధి సంధి
సూత్రం : అకారానికి ఏ, ఐ లు పరమైనపుడు ‘ఐ’ కారమూ, ఓ, ఔ లు పరమైనపుడు ‘ఔ’ కారమూ వస్తాయి.

గమనిక :
ఐ, ఔ లను ‘వృద్దులు’ అంటారు.

AP Board 8th Class Telugu Grammar

సమాసాలు

సమాసం :
వేరు వేరు అర్థాలు గల రెండు పదాలు కలసి, ఏకపదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు.

గమనిక :
అర్థవంతమైన రెండు పదాలు కలిసి, క్రొత్తపదం ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వ పదం అంటారు. రెండవ పదాన్ని ఉత్తరపదం అంటారు.
ఉదా :
‘రామ బాణం’ అనే సమాసంలో, ‘రామ’ అనేది పూర్వపదం. ‘బాణం’ అనేది ఉత్తరపదం.

1. ద్వంద్వ సమాసం:
రెండు కాని, అంతకంటే ఎక్కువ కాని నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని “ద్వంద్వ సమాసం” అంటారు. (సమాసంలోని రెండు పదాల అర్థానికి ప్రాధాన్యం గల సమాసం ద్వంద్వ సమాసం.)

ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.
1) ఈ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు.
జవాబు:
అన్నదమ్ములు

2) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు

3) ప్రమాదంలో నా కాలుసేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలుసేతులు

I. ఈ కింది ద్వంద్వ సమాసాలను వివరించండి. విగ్రహవాక్యం రాయండి.
సమాస పదాలు – విగ్రహవాక్యాలు
1) ఎండవానలు – ఎండా, వానా
2) తల్లిదండ్రులు – తల్లి, తండ్రి
3) గంగాయమునలు – గంగ, యమున

II. ఈ కింది విగ్రహవాక్యాలను సమాసపదాలుగా మార్చండి.

విగ్రహము – సమాసపదం
1) కుజనుడూ, సజ్జనుడూ – కుజనసజ్జనులు
2) మంచి, చెడూ – మంచిచెడులు
3) కష్టమూ, సుఖమూ – కష్టసుఖములు
4) వజ్రమూ, వైడూర్యము – వజ్రవైఢూర్యాలు

2. ద్విగు సమాసం :
సమాసంలో మొదటి (పూర్వ) పదంలో సంఖ్య గల సమాసాలను ద్విగు సమాసాలు అంటారు.
అభ్యాసం :
కింది సమాస పదాలను ఉదాహరణలలో చూపిన విధంగా వివరించండి.
ఉదా :
నవ రసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
1) రెండు జడలు – రెండు (2) సంఖ్య గల జడలు
2) దశావతారాలు – దశ (10) సంఖ్య గల అవతారాలు
3) ఏడు రోజులు – ఏడు (7) సంఖ్య గల రోజులు
4) నాలుగు వేదాలు – నాలుగు (4) సంఖ్య గల వేదాలు
5) మూడు రోజులు – మూడు (3) సంఖ్య గల రోజులు
6) రెండు రోజులు – రెండు (2) సంఖ్య గల రోజులు
7) రెండు చేతులు – రెండు (2) సంఖ్య గల చేతులు
8) ముగ్గురు దేవతలు- ముగ్గురు (3) సంఖ్య గల దేవతలు

గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్యావాచకం పూర్వపదంగా ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు “ద్విగు సమాసాలు”.

3. తత్పురుష సమాసం :
విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

అభ్యాసము :
కింది పదాలను చదివి, విగ్రహ వాక్యాలు రాయండి.
సమాసం – విగ్రహవాక్యం
1) రాజభటుడు – రాజు యొక్క భటుడు
2) తిండి గింజలు – తిండి కొఱకు గింజలు
3) పాపభీతి – పాపము వల్ల భీతి

గమనిక :
‘రాజ భటుడు’ అనే సమాసంలో ‘రాజు’ పూర్వ పదం. ‘భటుడు’ ఉత్తర పదం. ‘రాజభటుడు’ కు విగ్రహవాక్యం రాస్తే; ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో యొక్క అనేది షష్ఠీవిభక్తి ప్రత్యయం. భటుడు రాజుకు చెందినవాడు అని చెప్పడానికి షష్ఠీ విభక్తి ప్రత్యయాన్ని వాడారు. ఈ విధంగా విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు “తత్పురుష సమాసాలు”.

గమనిక :
పూర్వ పదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు వస్తాయి.

తత్పురుష సమాసం రకాలు విభక్తులు ఉదాహరణ, విగ్రహవాక్యం
1) ప్రథమా తత్పురుష సమాసం డు, ము, వు, లు మధ్యాహ్నం – అహ్నం యొక్క మధ్యభాగం
2) ద్వితీయా తత్పురుష సమాసం ని, ను, ల, కూర్చి, గురించి జలధరం – జలమును ధరించినది
3) తృతీయా తత్పురుష సమాసం చేత, చే, తోడ, తో బుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు
4) చతుర్డీ తత్పురుష సమాసం కొఱకు, కై వంట కట్టెలు – వంట కొఱకు కట్టెలు
5) పంచమీ తత్పురుష సమాసం వలన, (వల్ల) కంటే, పట్టి దొంగభయం – దొంగ వల్ల భయం
6) షష్ఠీ తత్పురుష సమాసం కి, కు, యొక్క, లో, లోపల రామబాణం – రాముని యొక్క బాణం
7) సప్తమీ తత్పురుష సమాసం అందు, న దేశభక్తి – దేశము నందు భక్తి
8) నఃణ్ తత్పురుష సమాసం నఞ్ అంటే వ్యతిరేకము అసత్యం – సత్యం కానిది

అభ్యాసం :
కింది సమాసాలు చదివి, విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో తెలపండి.

సమాసం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) రాజ పూజితుడు రాజుచే పూజితుడు తృతీయా తత్పురుషము
ఆ) ధనాశ ధనము నందు ఆశ సప్తమీ తత్పురుషము
ఇ) పురజనులు పురమందు జనులు సప్తమీ తత్పురుషము
ఈ) జటాధారి జడలను ధరించినవాడు ద్వితీయా తత్పురుషము
ఉ) భుజబలం భుజముల యొక్క బలం షష్ఠీ తత్పురుషము
ఊ) అగ్నిభయం అగ్ని వల్ల భయం పంచమీ తత్పురుషము
ఋ) అక్రమం క్రమం కానిది నఞ్ తత్పురుష సమాసం

తత్పురుష సమాసాలు :
విభక్తుల ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాలను గూర్చి తెలిసికొన్నారు. కింది వాటిని కూడా పరిశీలించండి.
1) మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యము (మధ్య భాగం)
2) పూర్వకాలము – కాలము యొక్క పూర్వము (పూర్వ భాగం)

గమనిక :
పై వాటిలో మొదటి పదాలైన మధ్య, పూర్వ అనే పదాలకు ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ‘మధ్యము’, ‘పూర్వము’గా మారతాయి. ఇలా పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాము. కింది వాటిని పరిశీలించండి.
1) నఞ్ + సత్యం = అసత్యం – సత్యం కానిది
2) నఞ్ + భయం = అభయం – భయం కానిది
3) నఞ్ + అంతము = అనంతము – అంతము కానిది
4) నఞ్ + ఉచితం = అనుచితం – ఉచితము కానిది

గమనిక :
సంస్కృతంలో ‘నఃగ్’ అనే అవ్యయం వ్యతిరేకార్థక బోధకం. దీనికి బదులు తెలుగులో అ, అన్ అనే ప్రత్యయాలు వాడతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నఇస్’ అనే అవ్యయాన్ని బట్టి, దీన్ని “నఞ్ తత్పురుష సమాసం” అంటారు.

అభ్యాసం :
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామం పేర్కొనండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) అర్ధరాత్రి రాత్రి యొక్క అర్ధము ప్రథమా తత్పురుషం
ఆ) అనూహ్యము ఊహ్యము కానిది నఞ్ తత్పురుషం
ఇ) అక్రమం క్రమము కానిది నఞ్ తత్పురుషం
ఈ) అవినయం వినయం కానిది నఞ్ తత్పురుషం

సమాపక – అసమాపక క్రియలు

ఈ కింది వాక్యాలలోని క్రియలను గమనించండి.

1) ఉదయ్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.
2) వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది.
3) అరుణ్ చిత్రాలు గీసి ప్రదర్శనకు పెట్టాడు.

AP Board 8th Class Telugu Grammar

అ) సమాపక క్రియలు :
పై వాక్యాలలో ప్రతివాక్యం చివరన ఉన్న వెళ్ళాడు, పెట్టాడు వంటి క్రియలు పని పూర్తి అయ్యిందని తెలుపుతున్నాయి. వీటిని సమాపక క్రియలు అంటారు.

ఆ) అసమాపక క్రియలు :
వాక్యం మధ్యలో ఉన్న ‘చేసి’ ‘గీసి’ ‘చదివి’ – అన్న క్రియలు పని పూర్తికాలేదని తెలుపుతున్నాయి. వీటిని అసమాపక క్రియలు అంటారు.

ఇ) అసమాపక క్రియా – భేదాలు

1) క్త్వార్థకం : (భూతకాలిక అసమాపక క్రియ)
భాస్కర్ ఆట ఆడి, అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఈ వాక్యంలో భాస్కర్ ‘కర్త’. ‘వచ్చాడు’ అనేది కర్త. వాచకానికి చెందిన ప్రధాన క్రియ.

ఆడి, అలసి అనేవి కర్తృవాచక పదానికి చెందిన ఇతరక్రియలు. ఆడి, అలసి అనే పదాలు క్రియలే కాని, వాటితో పూర్తి భావం తెలియడం లేదు. ఆడి, అలసిపోయి అనే క్రియల తర్వాత, ఏం చేస్తాడు? అనే ప్రశ్న వస్తోంది. ఆడి, అలసిపోయి అనే క్రియలు, భూతకాలంలోని పనిని సూచిస్తున్నాయి. వీటిని భూతకాలిక అసమాపక క్రియలని క్వార్థకం’ అని పిలుస్తారు.

ఈ క్రియలన్నీ ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే చివరి – ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం ‘క్వార్థం’.
ఉదాహరణ :
పుష్ప అన్నం తిని నిద్రపోయింది. ఇందులో ‘తిని’ అనేది క్వార్థం (అసమాపక క్రియ)

2) శత్రర్థకం : (వర్తమాన అసమాపక క్రియ)
అఖిలేశ్ మధుకర్ తో ‘మాట్లాడుతూ’ నడుస్తున్నాడు. ఈ వాక్యంలో ‘నడుస్తున్నాడు’ అనే ప్రధానక్రియకు ‘మాట్లాడుతూ’ అనే ఉపక్రియ వర్తమాన కాలంలో ఉండి, అసమాపక క్రియను సూచిస్తుంది.

ఈ విధంగా ‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల వర్తమాన అసమాపక క్రియగా మారుతుంది. వర్తమాన అసమాపక క్రియను ‘శత్రర్థకం’ అంటారు.
ఉదా :
1) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంది.
2) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.
3) సలీమా పాడుతూ నాట్యం చేస్తుంది.

గమనిక :
పై వాక్యాలలో 1) చదువుతూ 2) ఆలోచిస్తూ 3) పాడుతూ అనేవి శత్రర్థకములు.

3) చేదర్థకం : (ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.)
కింది వాక్యం చదవండి.

“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది.”

పై వాక్యంలో ప్రధాన క్రియ ‘వస్తుంది’ – ఇది ఫలితాన్ని సూచిస్తుంది. ఈ ఫలితం రావాలంటే షరతును విధించడానికి చేర్చే అసమాపక క్రియ చేస్తే ఇది కారణం. అది కార్యం. ఈ విధంగా సంశ్లేష వాక్యాల్లో ప్రధాన క్రియ సూచించే పని జరగటానికి షరతును సూచించే క్రియ ‘చేదర్థకం’ అంటారు. చేత్ అర్థాన్ని ఇచ్చేది – చేదర్థకం. వీటిలో ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :
1. మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.
2. మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది.

అభ్యాసం :
ఈ కింది వాక్యంలోని అసమాపక క్రియలను రాయండి.
1) రమ రోడ్డు మీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి దగ్గరలో ఉన్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది.
జవాబు:
తీసి, వేసి, ఎక్కి అనేవి అసమాపక క్రియలు.

తద్ధర్మ క్రియలు :
ఒక వస్తువు స్వభావాన్నీ , ధర్మాన్ని తెలిపే క్రియలనూ, నిత్య సత్యాలను తెలిపే వాటినీ, ‘తద్దర్మ క్రియలు’ అంటారు.
ఉదా :
1) సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
2) సూర్యుడు పడమట అస్తమిస్తాడు.
3) పక్షి ఆకాశంలో ఎగురుతుంది

ప్రశ్నా వాక్యాలు :
ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఏమిటి అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారుచేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నా వాక్యంగా మార్చవచ్చు.
ఉదా :
1) మీరు బడికి వెళతారా?
2) దైన్య స్థితిని చూస్తారా?

అభ్యాసం :
కింది వాటిని జతపరచండి.

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి అ) చేదర్థకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో ఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతే ఇ) ప్రశ్నార్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా? ఈ) క్వార్థకం

జవాబు:

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి ఈ) క్వార్థకం
2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో ఆ) శత్రర్థకం
3) మానసికంగా ఎదిగినట్లైతే అ) చేదర్థకం
4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా? ఇ) ప్రశ్నార్థకం

వాక్య రకాలు

వాక్యాలు మూడు రకాలు

  1. సామాన్య వాక్యం
  2. సంక్లిష్ట వాక్యం
  3. సంయుక్త వాక్యం

1) ఉష పాఠం చదువుతున్నది.
2) మురళి మంచి బాలుడు.

1) సామాన్య వాక్యం :
గమనిక :
పై మొదటి వాక్యంలో క్రియ ఉంది. రెండో వాక్యంలో క్రియ లేదు. ఈ విధంగా క్రియ ఉన్నా, లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు.

AP Board 8th Class Telugu Grammar

2) సంక్లిష్ట వాక్యం : ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి.
ఉదా :
1) శ్రీకాంత్ అన్నం తిన్నాడు.
2) శ్రీకాంత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీకాంత్ అన్నం తిని బడికి వచ్చాడు. (సంక్లిష్ట వాక్యం)

గమనిక :
పై వాక్యాలను కలిపినపుడు ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అసమాపక క్రియలు ఉంటాయి. ఇటువంటి వాక్యాలను ‘సంక్లిష్ట వాక్యాలు’ అంటారు.

3) సంయుక్త వాక్యం :
సమ ప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను ‘సంయుక్త వాక్యాలు’ అంటారు.
ఉదా :
1) సీత చదువుతుంది, పాడుతుంది.
2) అతడు నటుడు, రచయిత.
3) అశ్విని, జ్యోతి అక్కా చెల్లెండ్రు.

సామాన్య వాక్యాలు :
అ) రాజు అన్నం తిన్నాడు.
ఆ) గోపి పరీక్ష రాశాడు.
ఇ) గీత బడికి వెళ్ళింది.

గమనిక :
పై వాక్యాల్లో తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు. ప్రతి వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంది. ఇలా ఒకే సమాపక క్రియ ఉంటే, ఆ వాక్యాలను ‘సామాన్య వాక్యాలు’ అంటారు.

కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి.
ఉదా :
హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని.

సంక్లిష్ట వాక్యాలు :
గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.

గమనిక :
పై సామాన్య వాక్యాలలో రెంటిలోనూ ‘గీత’ అనే నామవాచకం ఉంది. ఈ విధంగా తిరిగి చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి, మొదటి వాక్యంలోని క్రియ ‘వెళ్ళింది’ అనే దాన్ని ‘వెళ్ళి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.
ఉదా :
గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) 1) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు:
విమల వంట చేస్తూ, పాటలు వింటుంది. (సంక్లిష్ట వాక్యం)

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు:
అమ్మ నిద్రలేచి, ముఖం కడుక్కుంది. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
1) తాత భారతం చదివి, నిద్రపోయాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు. (సామాన్య వాక్యాలు)

2) చెట్లు పూత పూస్తే, కాయలు కాస్తాయి. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
చెట్లు పూత పూస్తాయి. చెట్లు కాయలు కాస్తాయి. (సామాన్య వాక్యాలు)

3) రాముడు నడుచుకుంటూ వెళ్ళి, తన ఊరు చేరాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు. రాముడు తన ఊరు చేరాడు. (సామాన్య వాక్యాలు)

AP Board 8th Class Telugu Grammar

అభ్యాసం :
కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది. (సంక్లిష్ట వాక్యం)

2) మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది. (సామాన్య వాక్యాలు)
జవాబు:
మహతి ఆట ఆడి, అన్నం తిన్నది. (సంక్లిష్ట వాక్యం)

3) నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు. (సామాన్య వాక్యాలు)
జవాబు:
నారాయణ అన్నం తింటూ, నీళ్లు తాగుతాడు. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :
కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
ఉదా :
1) శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు. (సామాన్య వాక్యాలు)

2) రజియా పాట పాడుతూ ఆడుకుంటున్నది. (సంక్లిష్ట వాక్యం)
జవాబు:
రజియా పాట పాడుతుంది. రజియా ఆడుకుంటున్నది. (సామాన్య వాక్యాలు)

సంయుక్త వాక్యం:

కింది వాక్యాలను గమనించండి.

విమల తెలివైనది. విమల అందమైనది – విమల తెలివైనది, అందమైనది.
ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి, ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు.

సంయుక్త వాక్యాలుగా మారేటప్పుడు వచ్చే మార్పులు :
అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది, అందమైనది. (రెండు నామపదాల్లో ఒకటి లోపించడం)

ఆ) అజిత అక్క. శైలజ చెల్లెలు.
అజిత, శైలజ అక్కా చెల్లెళ్ళు. (రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది)

ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
ఆయన డాక్టరా? ప్రొఫెసరా? (రెండు సర్వనామాల్లో ఒకటి లోపించింది)

కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు

1) కింది వాక్యాలను పరిశీలించి మార్పులను గమనించండి.
అ) సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
ఆ) సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.

గమనిక :
పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కానీ వాక్య నిర్మాణంలో తేడా ఉంది. ఈ రెండు వాక్యాల మధ్య భేదం ఇది.
1) “సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు”.

AP Board 8th Class Telugu Grammar

1) కర్తరి వాక్యం :
ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ కర్తను సూచిస్తుంది. కర్మకు ద్వితీయా విభక్తి చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం’ అంటారు.

2) సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. అనే రెండవ వాక్యంలో
1) కర్తకు తృతీయా విభక్తి ఉంది.
2) క్రియకు ‘బడు’ అనే ధాతువు చేరింది
3) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.

2) కర్మణి వాక్యం :
వాక్యంలో క్రియకు ‘బడు’ ధాతువు చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని ‘కర్మణి వాక్యం’ అంటారు.

అభ్యాసం – 1: కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాల్మీకిచే రామాయణం రచింపబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
ప్రజలచే శాంతి కోరబడుతోంది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 2 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. (కర్తరి వాక్యం)

ఆ) నాచే రచింపబడిన గ్రంథం నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను రచించిన గ్రంథం నేతాజీ చరిత్ర. (కర్తరి వాక్యం)

అభ్యాసం – 3 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా :
ఆళ్వారుస్వామి చిన్నప్పుడే కథ రాశారు (కర్తరి వాక్యం)
జవాబు:
చిన్నప్పుడే ఆళ్వారుస్వామిచే కథ రాయబడింది. (కర్మణి వాక్యం)

అ) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
ఉసిరికాయ తీసి లింగయ్య చేత నాయకునికి ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)

ఆ) నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. (కర్తరి వాక్యం)
జవాబు:
పిల్లలతో నాయకుల చేత అరగంట కాలం గడుపబడింది. (కర్మణి వాక్యం)

ఇ) వాద్యాల చప్పుడు విన్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
వాద్యాల చప్పుడు వినబడింది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 4 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని తీసుకుపోబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
గ్రామీణులు నాయకులను ఎదుర్కొని తీసుకుపోయారు. (కర్తరి వాక్యం)

ఆ) కాయలన్నీ అతని ముందర పోయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
కాయలు అతని ముందర పోశారు. (కర్తరి వాక్యం)

ఇ) బాలురచే సెలవు తీసికోబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బాలురు సెలవు తీసికొన్నారు. (కర్తరి వాక్యం)

అలంకారాలు

అలంకారం : చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.
అలంకారాలు రెండు రకాలు :
అ) శబ్దాలంకారాలు
ఆ) అర్థాలంకారాలు

అ) శబ్దాలంకారాలు :
శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి “శబ్దాలంకారాలు”.

కింది గేయాన్ని గమనించండి.
“అది గదిగో మే
మేడకున్నది గో
గోడ పక్కన నీ
నీడలో కోడె దూ
దూడ వేసింది పే

పై కవితలో ప్రతివాక్యం చివర ‘డ’ అనే అక్షరం మళ్ళీ మళ్ళీ వచ్చింది (అంటే పునరావృతమయ్యింది). ఇది ఆ కవితకు అందం తెచ్చింది. వినడానికి సొంపుగా తయారయ్యింది. ఈ అందం, వినసొంపు – ‘డ’ అనే శబ్దం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని “శబ్దాలంకారం” అంటారు.

1) అంత్యానుప్రాసాలంకారం :
ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.
ఉదా :
1) భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామకథయే రక్తి
ఓ కూనలమ్మ”

గమనిక :
పై కవితలో ప్రతి వాక్యం చివర ‘క్తి’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ కవితలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

2) ‘గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము

పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం ప్రతిపాదం చివరా వచ్చింది. కాబట్టి దీనిలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

AP Board 8th Class Telugu Grammar

1. అంత్యానుప్రాసాలంకారం : (లక్షణం) :
పాదాంతంలో, లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు, లేదా అక్షరాలు ఉంటే, దాన్ని ‘అంత్యానుప్రాసాలంకారం’ అంటారు.
కింది గేయాలు గమనించండి :
1) “వేదశాఖలు వెలసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట

గమనిక :
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర ‘ఇచ్చట’ అనీ, అలాగే రెండవ పాదం చివర కూడా ‘ఇచ్చట’ అనీ ఉంది. కాబట్టి అంత్యానుప్రాసాలంకారం దీనిలో ఉంది.
2) ‘తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుర్రపు కళ్ళెం

పై మూడు పాదాల్లోనూ చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి దీనిలో కూడా ‘అంత్యానుప్రాసాలంకారం’ ఉంది.

2. వృత్త్యనుప్రాసాలంకారం :
అక్షరం అనేక సార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. ‘వృత్తి’ అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం.
ఉదా :
నాయనా ! నేను నిన్నే మన్నా అన్నానా? నీవు నన్నేమన్నా అన్నావా?

గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం, అనేకమార్లు వచ్చింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాస’ అనే శబ్దాలంకారం.

అభ్యాసం :
1) కా కి కో కికా దు దా !
2) లచ్చి పుచ్చకాయలు తెచ్చిచ్చింది.

గమనిక :
మొదటి వాక్యంలో ‘క’, రెండో వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ‘వృత్త్యనుప్రాసాలంకారం. ఈ కింది వాక్యాలు చూడండి.
1) ఆమె కవతో వడి వడి అడుగులతో గపను దాటింది.
2) చి చినుకులు ప మని పడుతున్నవేళ

గమనిక :
మొదటివాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ట’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి.
ఈ ఉదాహరణలు కూడా చూడండి.
అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకి ఎక్కాడు.
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్షక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యంక్ష్యమా.

గమనిక :
ఈ విధంగా ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని ‘వృత్త్యనుప్రాస అలంకారం’ అంటారు.

3. ఛేకానుప్రాసాలంకారం : కింది వాక్యం చదవండి.
ఉదా :
“నీకు వంద వందనాలు”.

పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంట వెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ నూరు సంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’ వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది.

ఛేకానుప్రాస (లక్షణం):
హల్లుల జంట, అర్థభేదంతో వెంట వెంటనే వస్తే దానిని ‘ఛేకానుప్రాస’ అలంకారం అంటారు.
ఛేకానుప్రాసకు మరో ఉదాహరణ :
1) పాప సంహరుడు హరుడు

ఆ) అర్థాలంకారాలు :
అర్థ వైచిత్రిచేత అందాన్ని కలిగించేవి అర్థాలంకారాలు.

1. ఉపమాలంకారం :
1) ఆమె ముఖం అందంగా ఉంది.
2) ఆమె ముఖం చంద్రబింబం లాగా అందంగా ఉన్నది.

గమనిక :
పై వాక్యాలలోని తేడాను గమనించండి. ఆమె ముఖం చంద్రబింబం లాగా అందంగా ఉంది. అనే వాక్యం మనలను ఆకట్టుకుంది. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికిగాను అందమైన పోలికను చెప్పడాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.
ఉదా :
సోముడు భీముడి వలె బలవంతుడు.

గమనిక :
ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1) సోముడు – ఉపమేయం – (అంటే ఎవరిని గురించి చెప్పుతున్నామో ఆ పదం)
2) భీముడు – ఉపమానం – (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3) బలవంతుడు – సమానధర్మం (పోల్చడానికి వీలయిన సమాన గుణం)
4) వలె – ఉపమావాచకం – (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

ఉపమాలంకారం (లక్షణం) :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ‘ఉపమాలంకారం’.

2. ఉత్ప్రేక్షాలంకారం :
ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పడం “ఉత్ప్రేక్షాలంకారం”.
ఉదా :
ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహం ఏమో అని భయపడ్డాను.

గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం లేదా ఊహించుకోవడం కూడా అలంకారమే. ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించి చెప్పడాన్ని ‘ఉత్ప్రేక్షాలంకారం’ అంటారు.
ఉదా :
1) ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అన్నట్లు ఉన్నవి.
2) ఆ ఏనుగు నడగొండా అన్నట్లు ఉంది.
పై వాక్యంలో 1) ఉపమేయం – ఏనుగు
2) ఉపమానం – నడకొండ (నడిచే కొండ)

అంటే ఏనుగును, నడిచే కొండలా ఊహించాము. కాబట్టి “ఉత్ప్రేక్షాలంకారము”.

AP Board 8th Class Telugu Grammar

3. రూపకాలంకారం (లక్షణం) :
ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, వీటి రెంటికీ ఆ భేదాన్ని (భేదం లేదని) చెప్పడమే రూపకాలంకారం అంటారు.
ఉదా :
‘ఆయన మాట కఠినమైనా మనసు వెన్న’ ఇందులో
1) ‘మనస్సు’ – అనేది ఉపమేయము.
2) వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనస్సు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది. అంటే వెన్నకూ మనస్సుకూ భేదం లేదు. రెండూ ఒకటే అనే భావాన్ని ఇస్తోంది.

అభ్యాసం :
కింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి.
1) మా అన్న చేసే వంట నలభీమపాకం
2) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం

గమనిక :
మొదటి వాక్యంలో అన్న చేసే వంటకూ, నలభీమపాకానికీ భేదం లేనట్లు చెప్పబడింది. అలాగే రెండవ వాక్యంలో కుటుంబంలోని తండ్రికీ, హిమగిరి శిఖరానికీ భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి పై రెండు వాక్యాలు ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి. – ఈ కింది ఉదాహరణలు కూడా చూడండి.
1) లతా లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లారు.
2) రుద్రమ్మ చండీశ్వరీ దేవి జల జలా పారించె శాత్రవుల రక్తమ్ము.
3) ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.
4) మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు.
5) మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే.

గమనిక :
పై పాదాల్లో రూపకాలంకారాలు ఉన్నాయి.

4. అతిశయోక్తి అలంకారం :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని ‘అతిశయోక్తి’ అలంకారం అంటారు.
కింది వాక్యాన్ని గమనించండి.
ఉదా :
ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా, ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై వాక్యంలో గమనిస్తున్నాము.

‘అతిశయోక్తి అలంకారం : (లక్షణం) :
గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పటం.

5. స్వభావోక్తి అలంకారం :
ఏదైనా విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే దాన్ని ‘స్వభావోక్తి’ అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తరిచూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి.

స్వభావోక్తికి మరియొక ఉదాహరణము :
1) ఆ లేళ్ళు బెదురుచూపులతో, నిక్కపొడుచుకున్న చెవులతో, భయభ్రాంత చిత్తములతో అటూ ఇటూ చూస్తున్నాయి.

సమన్వయం :
ఇక్కడ లేళ్ళ యొక్క సహజగుణాన్ని ఉన్నది ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇది ‘స్వభావోక్తి’ అలంకారము.

ఛందస్సు

కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమములకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.

1) లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు). హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.

2) గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు”.

గురులఘువుల గుర్తులు

లఘువు అని తెలుపడానికి గుర్తు : 1
గురువు అని తెలుపడానికి గుర్తు : U

గురులఘువుల నిర్ణయం

ఎ) గురువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం.
AP Board 8th Class Telugu Grammar 1
AP Board 8th Class Telugu Grammar 2

బి) లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధము :
AP Board 8th Class Telugu Grammar 3
గమనిక :
గురువులు కాని అక్షరాలన్నీ లఘువులు :

AP Board 8th Class Telugu Grammar 4

గణ విభజన

1) ఒకే అక్షరం గణాలు :
ఒకే అక్షరం గణంగా ఏర్పడితే, అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణం ఉంటాయి.
AP Board 8th Class Telugu Grammar 5

2) రెండక్షరాల గణాలు :
రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువులు, లఘువులు ఉంటాయి. ఇవి నాలుగు రకాలు.
అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అని అంటారు.
AP Board 8th Class Telugu Grammar 6
ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిపి గణంగా ఏర్పడితే అది ‘లగం’, లేదా ‘వ’ గణం అని అంటారు.
AP Board 8th Class Telugu Grammar 7
ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.
AP Board 8th Class Telugu Grammar 8
ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.
AP Board 8th Class Telugu Grammar 9

అభ్యాసము :
రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.
AP Board 8th Class Telugu Grammar 10

మూడక్షరాల గణాలు

మూడక్షరాల గణాలు మొత్తం ఎనిమిది (8).
AP Board 8th Class Telugu Grammar 11 AP Board 8th Class Telugu Grammar 12

అ) మూడక్షరాల గణాలను గుర్తించే సులభ మార్గం :
AP Board 8th Class Telugu Grammar 13

య, మా, తా, రా, జ, భా, న, స అనే సూత్రాన్ని కంఠస్థం చేసి, పై విధంగా ఒక చక్రం గీయండి. మీకు కావలసిన గణం పేరు గల మొదటి అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ అక్షరాన్నుండి కుడిగా ఉన్న మూడక్షరాలలోనూ, గురు లఘువులు ఏ క్రమంగా ఉన్నాయో, మీకు కావలసిన గణానికి గురు లఘువులు ఆ క్రమంలో ఉంటాయి. ఉదా : మీకు య గణము యొక్క గురు లఘువుల క్రమం కావాలి అనుకోండి. అపుడు ‘య’ నుండి కుడివైపుగా ‘యమాతా’ అనే మూడక్షరాలను వేరుగా రాయండి.

AP Board 8th Class Telugu Grammar 14

అభ్యాసం -1:
కింది పాదాలు ఏ వృత్తాలకు సంబంధించినవో గుర్తించండి.

1) పరమ తపోని వేశన ముబంగ రుపంట లకున్ని వాసమ (బ్బు)
AP Board 8th Class Telugu Grammar 15
1) పై పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది చంపకమాల పద్యపాదం.
2) యతి 11వ అక్షరం – (ప – బ).
3) ప్రాస నియమం కలదు.
4) పద్యపాదంలో 21 అక్షరాలున్నాయి.

2) రాతరు ణమ్మిదే మరల రాదుసు నా గత కాలమెప్పుడున్
AP Board 8th Class Telugu Grammar 16
1) పై పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదం.
2) యతి 10వ అక్షరం (రా – రా).
3) ప్రాసనియమం కలదు.
4) పద్యపాదంలో 20 అక్షరాలు ఉన్నాయి.

అభ్యాసం – 2 :
కింద సూచించిన పద్యపాదాన్ని పూరించి గణ విభజన చేసి, అది ఏ పద్యపాదమో గుర్తించండి.
1. జాతి శిరస్సు నెత్తికొని ……
AP Board 8th Class Telugu Grammar 17
గమనిక :
1) పై పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదం.
2) యతి 10వ అక్షరం (జా – క్ష్మా).
3) ప్రాస నియమం కలదు.
4) పద్యపాదంలో 20 అక్షరాలున్నాయి.

ఆ) మూడక్షరాల గణాల నిర్ణయంలో మరో పద్దతి :
AP Board 8th Class Telugu Grammar 18
అని రాసుకొని, దానికి గురు లఘువులు గుర్తించండి. మీకు కావలసిన గణం పేరు గల అక్షరంతో, ప్రక్క రెండు అక్షరాలూ కలిపి, దానిలోని గురు లఘువులు ఎలా ఉన్నాయో గమనిస్తే, ఏ గణానికి ఏ అక్షరాలు ఉంటాయో తెలుస్తుంది.
ఉదా : 1) య గణం = యమాతా – IUU – ఆది లఘువు
2) మ గణం = మాతారా – UUU – సర్వ గురువులు
3) త గణం = తెరాజ – UUI – అంత్య లఘువు
4) ర గణం = రాజభా – UIU – మధ్య లఘువు
5) జ గణం = జభాన – I U I – మధ్య గురువు
6) భ గణం = భానస – U II – ఆది గురువు
7) న గణం = నసల – III – సర్వ లఘువులు
8) లగం (లేక ‘వ’ గణం = I U = లఘువు, గురువు)

నాలుగు అక్షరాల గణములు

AP Board 8th Class Telugu Grammar 19

సూర్య గణాలు – ఇంద్ర గణాలు

AP Board 8th Class Telugu Grammar 20

2) ఇంద్ర గణాలు : ఇవి ఆఱు రకాలు : నల, నగ, సల, భ, ర, త – అనేవి ఇంద్ర గణాలు.
AP Board 8th Class Telugu Grammar 21
AP Board 8th Class Telugu Grammar 22

యతి – ప్రాసలు

I. గమనిక : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు.
1. యతి : పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
2. ప్రాస : పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

II. గమనిక : నియమం చెప్పినచోట ‘యతి’, ‘ప్రాస’లు ప్రయోగించడం వల్ల చదవడానికీ, వినడానికీ, జ్ఞాపకం పెట్టుకోడానికీ సౌకర్యం కలుగుతుంది.

3. యతి మైత్రి :
పద్యపాదము యొక్క మొదటి అక్షరంతో, ఆ పద్యంలో నిర్ణయింపబడిన స్థానమందలి అక్షరం మైత్రి కలిగి ఉండడాన్ని యతిమైత్రి అంటారు. యతిమైత్రి యతిస్థానంలోని హల్లుకేకాక, అచ్చుతో కూడా మైత్రి ఉండాలి.

1. ఉత్పలమాల
కింది పద్యపాదాలను పరిశీలించండి.
AP Board 8th Class Telugu Grammar 23

గమనిక :
పై పాదాల్లో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇలా పద్యంలో నాలుగు పాదాల్లోనూ ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్త పద్యం’ అంటారు.

యతి :
పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరం గానీ, దాని వర్ణమైత్రి అక్షరం గాని ఆ పాదంలో మరొకచోట రావడాన్ని ‘యతి మైత్రి’ లేదా యతి స్థానం అంటారు.

పై పద్యపాదాల్లో పదవ అక్షరం (ఆ – న; జే – సి) యతి.

ప్రాస :
పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాల్లోనూ ‘య’ అనే అక్షరం వచ్చింది. ఈ పద్యాలలో రెండవ అక్షరంగా ఒకే గుణింతాక్షరం రావడాన్ని ‘ప్రాస’ నియమం అంటారు. పై లక్షణాలు గల పద్యాన్ని ‘ఉత్పలమాల’ పద్యం అంటారు.

ఉత్పలమాల పద్యం లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 10వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

2. చంపకమాల
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
AP Board 8th Class Telugu Grammar 24

చంపకమాల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్త పద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.

3. శార్దూలం
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP Board 8th Class Telugu Grammar 25

శార్దూల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.

4. మత్తేభం
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
AP Board 8th Class Telugu Grammar 26

మత్తేభ పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.