AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 9 సందేశం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 9th Lesson సందేశం

8th Class Telugu 9th Lesson జసందేశం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

స్వంత లాభం కొంతమానుకు
పొరుగువారికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
పాడిపంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటుపడవోయ్;
తిండి కలిగితే కండగలదోయ్
కండ కలవాడేను మనిషోయ్
చెట్టపట్టాల్ పట్టుకొని దే
శస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ములవలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్
– గురజాడ అప్పారావు

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై పంక్తులు ఏ గేయంలోవి ? ఆ గేయాన్ని ఎవరు రాసారు?
జవాబు:
పై పంక్తులు దేశభక్తి గేయంలోవి. ఆ గేయాన్ని గురజాడ అప్పారావు గారు రాసారు.

ప్రశ్న 2.
ఈ గేయంలో ఉన్న విషయాలేమిటి?
జవాబు:

  • స్వంత లాభం కొంచెం వదులుకొని, తోటివాడికి సాయం చేయాలి.
  • దేశమంటే మట్టికాదు మనుషులు.
  • దేశంలో పాడి పంటలు అభివృద్ధి అయ్యేటట్లు శ్రమించాలి.
  • కండ బలం ఉన్నవాడే మనిషి.
  • దేశ ప్రజలు కలసిమెలసి జీవించాలి.
  • జాతిమత భేదాలు విడచి, ప్రజలు సోదరులవలె మెలగాలి.

ప్రశ్న 3.
గేయ సందేశం ఏమిటి ?
జవాబు:
పరోపకారం, దేశభక్తి, ఐకమత్యం అనేవి అందరూ కలిగి ఉండాలనేదే ఈ గేయ సందేశం.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

ప్రశ్న 4.
దేశభక్తిని గురించిన గేయాలు, కవితలు, పద్యాలను కవులు ఎందుకు రాస్తారు?
జవాబు:
దేశభక్తిని గురించిన గేయాలను, కవితలను, పద్యాలను కవులు ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి రాస్తారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ పాఠంలోని పద్యాల్లో మనదేశం గొప్పతనం గురించి చదివినపుడు మీకేమనిపించింది?
జవాబు:
ఈ పాఠంలోని పద్యాల్లో మన భారతదేశం తపోభూమి అని, బంగారు పంటలకు నిలయమని, శాంతి వెన్నెలలో,
కురిపించిన దేశమని, గంగ, గోదావరి వంటి పవిత్ర నదులు ప్రవహించిన దేశమని చదివినప్పుడు, నేను ఇటువంటి గొప్ప దేశంలో పుట్టాను కదా ! అని గర్వంగా తల ఎత్తుకొని తిరగాలనిపించింది. జన్మభూమి స్వర్గం కంటే గొప్పది కదా.

మరింతగా మన దేశ సౌభాగ్యం వర్ధిల్లేలా పాటుపడాలని అనిపించింది. మన దేశంలో అన్యాయాలు, దౌర్జన్యాలు, కుల మత హింసలు లేకుండా చూడాలని అనిపించింది. అవినీతి, లంచగొండితనం, కుంభకోణాలు, పేదరికం లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. ప్రపంచ దేశాల్లో నేను జన్మించిన నా భారతమాత చాలా గొప్పది అనిపించింది.

ప్రశ్న 2.
ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు?
జవాబు:
మనం చట్టసభలకు ఎన్నుకొనేవారే ప్రజా ప్రతినిధులు. అనగా ఎం.పి.లు, ఎం.ఎల్.ఎ.లు మొదలైనవాళ్ళు ప్రజల కష్టాల్ని చట్టసభల్లో ప్రతిధ్వనింపచేసేవారు కావాలి. ప్రజల సమస్యల్ని, కష్టాల్ని ప్రభుత్వానికి తెలిపి, వాటిని పరిష్కరించేవారు. కావాలి. అవినీతి, లంచగొండితనం, దుర్మార్గం అన్న వాటికి వారు దూరంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోవాలి. వాటికి త్వరగా పరిష్కార మార్గాల్ని చూపించగలగాలి. ప్రతినిధుల ఎప్పుడూ ప్రజల పక్షంలోనే నిలబడాలి. అన్యాయానికీ, అధికారానికి బానిసలు కారాదు. సచ్ఛీలత కలిగి, సత్కార్యాలు: చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆదర్శప్రాయ జీవనం సాగించాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

ప్రశ్న 3.
లంచగొండితనం మన దేశ ప్రగతి గౌరవాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదో చర్చించండి.
జవాబు:
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మూడవ, నాలుగవ సాధారణ ఎన్నికల తర్వాత రాజకీయ నాయకులలో అవినీతి బాగా ఎక్కువైంది. రాజకీయ నాయకులలో, మంత్రులలో అవినీతి ఎక్కువైనపుడు అధికారులకి అది అనుకూలంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలలో గల సిబ్బంది ప్రతి చిన్నపనికీ లంచం తీసుకొంటున్నారు. ప్రతిపనికీ “ఒక రేటు” ఉంటోంది. చివరికి జీతాలు ఇవ్వడానికీ, పింఛను చెల్లించడానికి మాత్రమే కాదు – మరణించిన వాళ్ళకి “సర్టిఫికేట్” ఇవ్వడంలోనూ లంచం తప్పని పరిస్థితులున్నాయంటే అవినీతి ఎంతగా విలయతాండవం చేస్తోందో గ్రహించవచ్చు.

ఈ రోజు మన దేశంలో లంచగొండితనం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఈ లంచగొండితనం చిన్న ఉద్యోగుల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు మంత్రుల నుండి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ల దాకా ఈ లంచగొండితనం విస్తరించింది.

లంచం ఇవ్వనిదే ప్రభుత్వంలో ఏ పనీ కావట్లేదు. ప్రపంచంలో లంచగొండితనం ఎక్కువ ఉన్న దేశాల్లో మన భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యమంత్రులూ, వారి పుత్రులూ, అల్లుళ్ళూ వేల కోట్ల రూపాయలు లంచాలుగా మేసేస్తున్నారు.

ఇందువల్ల మన దేశంలో అభివృద్ధి జరుగడం లేదు. ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెడితే పది పైసల పని కూడా కావట్లేదు. ఏ పనీ సక్రమంగా సాగటంలేదు. కట్టిన ప్రాజెక్టులు, రోడ్లు, పరిశ్రమలు కొద్ది రోజుల్లోనే పాడయిపోతున్నాయి. దేశాన్ని రక్షింపవలసిన మిలటరీ, పోలీసు వ్యవస్థలు సైతం లంచగొండితనాన్ని మరిగి బాధితులకు అన్యాయం చేస్తున్నాయి. పెద్ద పెద్ద అధికారులు లంచగొండితనానికి అలవాటుపడి జైళ్ళలో మగ్గుతున్నారు.

అవినీతి, లంచగొండితనంల కారణంగా ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోంది. కనుక ప్రజలు యువత అవినీతి నిర్మూలనకు నడుంకట్టి ఈ దుష్ట జాడ్యాన్ని మన దేశం నుండి తరిమికొట్టాలి.

II. చదవడం – రాయడం

1. కింది పద్యం చదవండి. దాని భావంలోని ఖాళీలలో సరైన పదాలు రాయండి.
“దేశభక్తి మరియు దేశసమగ్రత
ప్రజల నాడులందు ప్రబలి ప్రబలి
కర్మభూమి యగు నఖండ భారతమహా
క్షితిని నెగురు ప్రగతి కేతనమ్ము”.

భావం :
దేశభక్తి, ………… అనే భావాలు ప్రజల్లోని నరనరాల్లో …………. కర్మభూమి అయిన మన ……….. దేశం ప్రగతి ……………….. రెపరెపలాడుతోంది.
జవాబు:
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు ప్రజల నరనరాల్లో వ్యాపించి కర్మభూమి అయిన మన అఖండ భారతదేశం ప్రగతి జెండా రెపరెపలాడుతుంది.

2. కింది ఖాళీలకు సరైన సమాధానాన్ని గుర్తించండి.

అ) మధురమైన ధర్మా నికి ………………… తగలరాదు. (రాయి / దెబ్బ)
జవాబు:
మధురమైన ధర్మానికి దెబ్బ తగలరాదు.

ఆ) భరత జాతి …………… ఆశయాలకు అనుగుణంగా లేదు. (మహాత్ముడి / బుద్ధుడి)
జవాబు:
భరత జాతి మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా లేదు.

ఇ) సకల జగతికి ………. నేర్పినట్టి మన భరతమాతను పూజించాలి. (అశాంతి / శాంతి)
జవాబు:
సకల జగతికి శాంతి నేర్పినట్టి మన భరతమాతను పూజించాలి.

ఈ) అఖండ భారతావనిలో ………….. కేతనం ఎగురవేయాలి. (ప్రగతి / తిరోగతి)
జవాబు:
అఖండ భారతావనిలో ప్రగతి కేతనం ఎగురవేయాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

3. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.

అ) భారతీయులు ఏమని ప్రతిజ్ఞ చేయాలి?
జవాబు:
“ఇది నా దేశం, ఇది నన్ను కన్నతల్లి. నాదేశ సౌభాగ్య సంపదలు, అభివృద్ధి చెందడానికి నేను సహాయపడతాను. ప్రపంచమంతా దీన్ని పూజించేటట్లుగా గొప్ప ప్రగతిని నెలకొల్పుతాను” అంటూ భారతీయులు ప్రతిజ్ఞ చేయాలి.

ఆ) మనదేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు ఏవి?
జవాబు:
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, కావేరి, గోదావరి, సింధు, నర్మద అనే జీవనదులు మనదేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు.

ఇ) ఈ పాఠంలో కవి చెప్పిన “మహామౌని” ఎవరు ? ఆయన గొప్పతనం ఏమిటి?
జవాబు:
ఈ పాఠంలో కవి చెప్పిన “మహామౌని” మహాత్మాగాంధీ. భారతమాత ముద్దుబిడ్డలలో మహాత్మాగాంధీ అగ్రగణ్యుడు. సత్యం, శాంతి, అహింస అనే సూత్రాలను పాటించి, రవి అస్తమింపని బ్రిటిషు సామ్రాజ్యం పునాదులను కదలించి, భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు. మన జాతిపిత అయిన గాంధీజీ తన బోసి నోటితో పలికిన శాంతి సందేశానికి ప్రపంచమంతా జేజేలు పలికింది. అది మన భారతదేశానికి కీర్తిని తెచ్చింది.

ఈ) మనదేశ ప్రగతి కేతనం ఎప్పుడు రెపరెపలాడుతుంది?
జవాబు:
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు ప్రజల నరనరాల్లో వ్యాపించినపుడు, పుణ్యభూమియైన అఖండ భారతదేశంలో ప్రగతి కేతనం రెపరెపలాడుతుంది.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) పాఠంలో కవి చెప్పిన విషయాలే గాక, మనదేశ కీర్తిని పెంచిన ఇతర విషయాలు రాయండి.
జవాబు:

  • మన దేశంలో బుద్ధుడు జన్మించి ప్రపంచంలోని చాలా దేశాల్లో బౌద్ధమతం విస్తరించేలా తన సందేశాన్ని అందించాడు.
  • వివేకానందుడు ప్రపంచ మత మహాసభలో పాల్గొని సర్వమత సమానత్వాన్ని చాటాడు.
  • రవీంద్రనాథ్ ఠాగూర్ తన కవితల ద్వారా, సర్ సి.వి. రామన్ శాస్త్ర పరిశోధనల ద్వారా మన దేశ కీర్తిని పెంచారు.
  • మన ఇతిహాసాలైన భారత రామాయణాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి. మన మహర్షులు, వేదాలు, ధర్మ ప్రచారా మన దేశ కీర్తిని విస్తరించాయి.
  • నెహ్రూ, ఇందిర వంటి మన నాయకులు ప్రపంచ ఖ్యాతిని సంపాదించారు.
  • మన రోదసీ విజ్ఞానం ప్రపంచ ఖ్యాతిని సంపాదించింది.
  • మన పారిశ్రామికవేత్తలలో కొందరు ప్రపంచ ప్రసిద్ధి పొందారు.
  • మన క్రికెట్టు ఆటగాడు టెండూల్కర్ ప్రపంచ ఖ్యాతి పొందాడు.

ఆ) మన జీవనదులు దేశానికి ఎటువంటి పరిపుష్టిని కలిగిస్తున్నాయి?
జవాబు:
మనదేశంలో కవి చెప్పినట్లు గంగ, సింధు, బ్రహ్మపుత్ర, కృష్ణానది, గోదావరి, కావేరి వంటి జీవనదులు ఉన్నాయి. నదులపై భాక్రానంగల్, నాగార్జునసాగర్, హీరాకుడ్ వంటి ఎన్నో బహుళార్థసాధక ప్రాజెక్టులు నిర్మించారు. వాటి నుఁ కాలువల ద్వారా వ్యవసాయానికి నీరు అందుతోంది. ఆ నీటితో బంగారు పంటలు పండుతున్నాయి. ఈ ప్రాజెక్టుల వ విద్యుదుత్పత్తి కూడా జరుగుతోంది.

మన ప్రభుత్వాలు నదులలోని పవిత్రమైన జీవజలాలను పూర్తిగా వినియోగించుకుంటే దేశం పాడిపంటల సస్యశ్యామలంగా ఉంటుంది.

ఇ) భారతీయ సంస్కృతిలో నీకు బాగా నచ్చిన విషయాలు ఏమిటి? అవి ఎందుకు బాగా నచ్చాయి?
జవాబు:
ఒక జాతి నిర్వీర్యం కాకుండా ఆత్మబలాన్ని సమకూర్చుకోవడానికి సంస్కృతి తోడ్పడుతుంది. ప్రజా జీవితం ప్రశాంతం సాగాలంటే సంస్కృతి ఇచ్చే సంస్కారమే మూలాధారం అవుతుంది. ఆత్మ సంస్కారాన్ని నేర్పి, మానవుడు సంఘజీవి అ. మానవసేవే మాధవ సేవ అని బోధించేది సంస్కృతి. మన భారతీయ సంస్కృతి ఎంతో విశిష్టమైనది.

భారతీయ సంస్కృతిలో దేవాలయాలు, పురాణాలు, రామాయణ భారత ఇతిహాసాలు, భాగవతము, భగవద్గీత వం భక్తి గ్రంథాలు, జీవనదులైన గంగ, గోదావరుల వంటి నదులు, మన ఋషులు, వారు బోధించిన ధర్మ ప్రబోధాలు నా బాగా నచ్చాయి.

మన దేశంలోని ఆచార వ్యవహారాలు, తల్లిదండ్రులను, గురువులను పిల్లలు గౌరవించడం, పెద్దల పట్ల, ఆచార్యు పట్ల ప్రజలకు గౌరవాదరాలు ఉండడం వంటి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అంటే నాకు గౌరవం.

మనకు ఉన్న దేవాలయాల వంటి గొప్ప దేవాలయాలు, పుణ్యనదులు మరి ఏ దేశానికీ లేవు. మన రామాయః భారత భాగవతాల వంటి పుణ్య గ్రంథాలు ఏ దేశానికీ లేవు. మనకు ఉన్న తత్త్వశాస్త్ర గ్రంథాలు, వేదాంత గ్రంథాల భగవద్గీత, వేదాలు వంటివి మనకే సొంతం. అవి ఏ దేశానికీ లేవు. ఇంత గొప్ప సంస్కృతి గల దేశంలో జన్మించడ నాకు గర్వకారణం.

ఈ) నీవే ప్రజాప్రతినిధివి అయితే దేశం కోసం ఏం చేస్తావు?
జవాబు:
నేనే ప్రజాప్రతినిధిని అయితే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వివరిం వాటిని పరిష్కరించేటట్లు చేస్తాను. దేశానికి హాని కలిగించే పనిని ఏదైనా జరుగకుండా అడ్డుకుంటాను. అలాగే నా పాటు ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలుస్తాను. అంటే నేను ప్రజలపట్ల చూపుతున్న సమస్యా పరిష్కారాల వారు కూడా తీర్చేటట్లు ఆదర్శంగా ఉంటాను.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) మనదేశాన్ని గురించి ప్రపంచం పొగడాలంటే, దేశంలో ఏమేమి ఉండగూడదని కవి చెప్పాడు?
జవాబు:
ఘనత గన్న మన పుణ్యదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కుల, మత హింసలనే పిశాచాలను తల ఎత్తనీయకు. నానాటికీ పెరిగిపోతున్న దుష్టులు, మోసగాళ్ళ గూండాయిజం నిలువకూడదు. బలిష్టమైన దేశ సౌభాగ్యాన్ని లంచాలనే జలగలు పట్టి పీల్చకూడదు. ప్రతినిధులైన వాళ్ళు పగలు, సెగలు రగిలించే మాటలు మాట్లాడకూడదు. “మనమంతా అన్నదమ్ములము” అనే తీయని ధర్మానికి దెబ్బ తగులనీయకూడదు. అలా జరిగినప్పుడు సమైక్యత అనే ఢంకా మోగుతుంది. మన భారతదేశాన్ని ప్రపంచం పొగడుతుంది.

ఆ) “భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను” ఈ వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
“భారతదేశం జీవనదులకు, పాడి పంటలకు నిలయమైయున్న దేశం. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను.” – ఈ వాక్యాన్ని మీ మాటల్లో రాయండి.
జవాబు:
మన భారతదేశం వేదాలు పుట్టిన దేశం. వ్యాస వాల్మీకాది మహర్షులు జన్మించిన దేశం. మన దేశం శ్రీలు పొంగిన జీవగడ్డ. పాడిపంటలు పొంగిపొర్లిన భాగ్యసీమ. ఇది వేదాంగాలూ, రామాయణం పుట్టిన దేశం. భారత భాగవతాలు పుట్టిన దేశం. ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. ఇది పవిత్ర భూమి. ఇక్కడ విస్తారమైన వృక్షసంపద ఉంది. లక్ష్మీబాయి, రుద్రమ్మ వంటి వీరవనితలకు ఇది జన్మభూమి. ప్రచండ పరాక్రమం ఉన్న రాజులు ఇక్కడ పుట్టారు. కాళిదాసు, తిక్కన వంటి మహాకవులు ఇక్కడ పుట్టారు. గాంధీ, బుద్ధుడు వంటి శాంతిదూతలు ఇక్కడే పుట్టారు. గంగా, సింధు, గోదావరి, కృష్ణా వంటి పవిత్ర నదులు ఇక్కడే పుట్టి, దేశాన్ని తమ జలాలతో సిరుల సీమగా మార్చాయి. ఇక్కడ నెహ్రూజీ, ఇందిర వంటి జాతీయ నాయకులూ, అబ్దుల్ కలామ్ వంటి శాస్త్రజ్ఞులూ ఇక్కడే పుట్టారు. ఇది కర్మభూమి. ఇది పవిత్రభూమి. అందుకే భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను.

IV. పదజాలం

1. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాసి ఆ వాక్యాలను తిరిగి రాయండి.

అ) మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ కేతనాన్ని ఎగురవేస్తాం.
జవాబు:
కేతనాన్ని = జెండాను
వాక్యం : మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగురవేస్తాం.

ఆ) ప్రతి వ్యక్తికీ మనోదార్డ్యుం ఉండాలి.
జవాబు:
మనోదార్యుం = దృఢమైన మనస్సు
వాక్యం : ప్రతి వ్యక్తికి దృఢమైన మనస్సు ఉండాలి.

ఇ) ఇతరుల సంపదలు చూసి మచ్చరికించకూడదు.
జవాబు:
మచ్చరికించ = అసూయ
వాక్యం : ఇతరుల సంపదలు చూసి అసూయపడరాదు.

ఈ) రవి చేతిరాతను చూసి అందరూ అబ్బురపడతారు.
జవాబు:
అబ్బురపడు = ఆశ్చర్యపోవు
వాక్యం : రవి చేతిరాతను చూసి అందరూ ఆశ్చర్యపోతారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

2. కింద గీత గీసిన పదాలకు వికృతి పదాలతో తిరిగి వాక్యాలు రాయండి.

అ) నాదేశ సమగ్రతను కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
జవాబు:
ప్రతిజ్ఞ (ప్ర) – ప్రతిన (వి)
నాదేశ సమగ్రతను కాపాడతానని ప్రతిన చేస్తున్నాను.

ఆ) నాది తెలుగుజాతి. నాది తెలుగు భాష.
జవాబు:
భాష (ప్ర) – బాస (వి)
నాది తెలుగు జాతి. నాది తెలుగు బాస.

ఇ) మనకు దేశంపై భక్తి ఎక్కువగా ఉండాలి.
జవాబు:
భక్తి (ప్ర) – బత్తి (వి)
మనకు దేశంపై బత్తి ఎక్కువగా ఉండాలి.

ఈ) మన కీర్తి ఖండ ఖండాంతరాలకు వ్యాపించింది.
జవాబు:
కీర్తి (ప్ర) – కీరితి (వి)
మన కీరితి ఖండ ఖండాంతరాలకు వ్యాపించింది.

3. పాఠానికి సంబంధించిన మాటలను కింది గళ్ళ నుండి వెతికి పక్క గళ్ళల్లో రాయండి. వాటితో వాక్యాలు తయారుచేయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 1

వాక్యములు :

  1. భారత ప్రభుత్వం జ్ఞానానంద కవిని పద్మశ్రీతో సత్కరించింది.
  2. హిందూదేశము జీవనదులకు పుట్టినిల్లు.
  3. దేశ యువత, దేశభక్తిని పెంపొందించుకోవాలి.
  4. ఇది నా దేశము, అనే ప్రేమ భావము దేశ పౌరులలో కలగాలి.
  5. హనుమంతుడు సీతమ్మకు సందేశమును తీసుకువెళ్ళాడు.
  6. గంగానదిని భారతీయులు మహా పుణ్యనదిగా భావించి సేవిస్తారు.
  7. బాపూజీ శాంతి సందేశానికి ప్రపంచం జోహార్లు ఆర్పించింది.
  8. గాంధీజీ, హింసను విడనాడండని దేశ ప్రజలకు సందేశం అందించాడు.
  9. సింధునది హిమాలయాల్లో పుట్టిన జీవనది.
  10. నెహ్రూ శాంతిదూత.

V. సృజనాత్మకత

* పాఠంలో మనదేశం గొప్పతనాన్ని తెలుసుకున్నారు కదా ! మన దేశ గొప్పతనాన్ని వర్ణిస్తూ భారతీయ విలువలు కాపాడటానికి అందరూ బాధ్యత తీసుకోవాలని ఒక “కరపత్రం” తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
భారతీయ విలువలను కాపాడదాం

సోదర సోదరీమణులారా ! మన భారతదేశం తపోభూమి. ఇది బంగారు పంటలకు నిలయం. శాంతి సందేశాన్ని ప్రపంచానికి అందించిన బుద్ధుడు, గాంధీజీ జన్మించిన పవిత్రదేశం మనది. గంగా, గోదావరి, కృష్ణానది, సింధు, * బ్రహ్మపుత్ర వంటి పవిత్ర నదులు ప్రవహిస్తున్న పవిత్ర భాగ్యసీమ మనది.

ఇది వేద వేదాంగాలు పుట్టిన కర్మభూమి. భారత, భాగవత, రామాయణాలు, వేదవ్యాస, వాల్మీకి, కాళిదాసుల వంటి కవులు పుట్టిన దేశం ఇది. కృష్ణదేవరాయలు వంటి మహా సాహితీ సమరాంగణ చక్రవర్తులు జన్మించిన పవిత్రభూమి ఇది. ఝాన్సీలక్ష్మీబాయి, రాణిరుద్రమ్మ వంటి వీరనారులకు జన్మభూమి ఇది. గాంధీజీ, నెహ్రూ, ఇందిర వంటి రాజకీయ దురంధరులకు ఇది పుట్టినిల్లు. శంకరాచార్యులు వంటి అద్వైతమత ప్రవక్త నడయాడిన కర్మభూమి ఇది.

మన భారతీయులందరూ న్యాయానికీ, ధర్మానికీ, శాంతికీ, సత్యాహింసలకూ ప్రాధాన్యం ఇచ్చారు. మనం పైన చెప్పిన పుణ్యాత్ములకు వారసులం. మన భారతీయ విలువలను కాపాడదాం. నిజమైన భారతీయులం అనిపించుకుందాం. భారతీయులారా ! మన భారతభూమి గౌరవాన్ని రక్షించుకుందాం.

ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడదాం. మన దేశ గౌరవాన్ని నిలబెడదాం.

VI. ప్రశంస

*మనదేశం ప్రపంచ ప్రసిద్ధి చెందటానికి ఎంతో మంది కృషి చేశారు. నేటికీ విద్య, వ్యాపారం, క్రీడలు, సాంస్కృతికం, రాజకీయం మొదలైన రంగాలలో ఎంతో మంది కృషి చేస్తున్నారు. అటువంటి వ్యక్తులలో మీకు తెలిసిన వ్యక్తిని గూర్చి వారి కృషిని గూర్చి ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
అబ్దుల్ కలామ్ ఆజాద్

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆజాద్ ఆదర్శ భారతీయుడు. ప్రముఖ శాస్త్రజ్ఞుడు. భారతదేశాన్ని స్వర్ణభారతం చేయాలని శ్రమించే నిరంతర శ్రామికుడు. వివాహానికి, వివాదానికి జీవితంలో చోటివ్వని వ్యక్తి. నేటి బాలలకు ఈయన ప్రచోదక శక్తి. ఈయన ప్రజాస్వామ్యహితైషి.

అబ్దుల్ కలామ్ ఆజాద్ తమిళనాడులోని రామేశ్వరంలో జైనులబ్లీన్, ఆషియమ్మ దంపతులకు 1931, అక్టోబరు 15న జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం రామేశ్వరం, రామనాథపురం, తిరుచురాపల్లి, మద్రాసులలో కొనసాగింది. మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ‘ఏరో ఇంజనీరింగులో డి.ఎం. ఈ.టీ’ చేసి తరువాత సైన్సులో డిప్లొమా (ఆనర్సు) చేశాడు.

ఈయన 1958వ సంవత్సరంలో డీ.ఆర్.డి.ఓ. లో జూనియర్ సైంటిస్టుగా చేరాడు. తరువాత కొద్దికాలానికే ఆ సంస్థకే డైరెక్టరు జనరల్ అయ్యాడు. మధ్యలో ఇస్రోలో సైంటిస్టుగా, డీ. ఆర్.డి.ఎల్. డైరెక్టరుగా పనిచేశాడు. 1999లో భారత ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టాడు.

అబ్దుల్ కలాంకు ‘పద్మవిభూషణ్’ వంటి పురస్కారాలతోపాటు, భారతదేశ అత్యున్నత పురస్కారమయిన ‘భారతరత్న’ లభించింది. ఈయన అగ్ని, పృథ్వి, త్రిశూల్, ఆకాశ్, నాగ్ మొదలైన క్షిపణుల రూపకల్పనకు సారథ్యం వహించి భారతదేశ క్షిపణి పితామహుడిగా పేరు పొందాడు. 1998 అణుపరీక్షలలో కలాం ముఖ్య పాత్ర పోషించాడు. అంతేగాక తేలికపాటి యుద్ధ విమానం, ప్రధాన యుద్ధ ట్యాంకు ‘అర్జున్’ ప్రాజెక్టుల రూపకల్పనకు నాయకత్వం వహించి అనేక మైలురాళ్ళను అధిగమించాడు.

అబ్దుల్ కలాం వ్యక్తిత్వం విశిష్టమయినది. ఈయన సమష్టితత్వం కలవాడు. ఈయన ఎక్కడ ఏ స్థాయిలో పనిచేసినా అందరినీ కలుపుకొని పనిచేసే మనస్తత్వం కలవాడు. కల్మషం లేని వ్యక్తిత్వం ఈయన సొంతం. ఈయన దేశం కోసం అనునిత్యం తపిస్తాడు. ఈయన ఒక శాస్త్రవేత్తగా ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం మొదలుకొని, అణుపరిజ్ఞానం ఉపయోగించడం దాకా అనేక రంగాలలో పని చేశాడు.

ఈయన ఆచరణ భగవద్గీత, ఖురాన్లు. అభిరుచి కర్ణాటక సంగీతం. ఈయన స్వప్నం అభివృద్ధి చెందిన భారతదేశం. ఈయన భారత దేశాభివృద్ధికి కలలు కనమని భారతీయులకు సందేశం ఇస్తాడు.

రాజకీయానుభవం లేకపోయినా గత రాష్ట్రపతులకు ధీటుగా ప్రత్యేక శైలిలో రాష్ట్రపతిగా పనిచేయడం కలాం విలక్షణతకు మచ్చుతునక. ఏ బాధ్యతనైనా ఈయన చక్కగా నెరవేర్చగలడు. ఈ దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళే విధానాలకు రూపకల్పన చేయగల సమర్థుడు.

కలాం గొప్ప ఆదర్శ పురుషుడు. ఎన్నికలలో ఓటువేసి, అన్ని పనులూ ప్రభుత్వమే చేయాలని అనుకోడం పొరపాటని, దేశాన్ని నిందించడం కాక దేశ వ్యవస్థను పటిష్ఠం చేసే మార్గం గురించి అందరూ ఆలోచించాలని ఈయన పలికే పలుకులు భారతీయులందరికీ ఆదర్శం.

అబ్దుల్ కలామ్ అజాద్ కు మంచితనంలో తల్లిదండ్రులు, క్రమశిక్షణలో బంధువులైన శంషుద్దీన్, అహ్మద్ జలాలుద్దీన్స్ స్ఫూర్తి. అజాద్ వంటి వ్యక్తి రాష్ట్రపతి కావడం భారతీయులందరికీ గర్వకారణము.

ప్రాజెక్టు పని

* ప్రపంచస్థాయిలో మన దేశ గౌరవం పెరగాలంటే కింద ఇవ్వబడిన అంశాలకు సంబంధించి మనమేం చేయాలో తరగతి గదిలో సమగ్రంగా చర్చించి వ్యక్తిగత నివేదిక (రిపోర్టు) ను తయారుచేయండి.
1) క్రీడలు – కళలు
2) వైజ్ఞానిక ప్రగతి
3) అవినీతి, లంచగొండితనం లేని సమాజం
4) భాషా సంస్కృతీ పరిరక్షణ
జవాబు:
1) క్రీడలు – కళలు :
121 కోట్ల జనాభా గల మన దేశం ఒలింపిక్ క్రీడల వంటి ఆటల్లో ప్రపంచస్థాయిలో ఒక్క బంగారు పతకం కూడా గెల్చుకోలేకపోతున్నది. అందుకని పాఠశాల స్థాయి నుండి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆటలలో నైపుణ్యం చూపిన వారికి ప్రత్యేక శిక్షణను ఇప్పించాలి. నగరాలన్నింటిలో మంచి క్రీడా మైదానాలు ఉండాలి. సంగీతము, చిత్రలేఖనము వంటి లలిత కళలలో ప్రతిభ చూపిన బాలురకు పోటీలు నిర్వహించి బహుమతులివ్వాలి. ప్రత్యేక్ష శిక్షణ ఇప్పించాలి.

2) వైజ్ఞానిక ప్రగతి :
మన దేశంలో విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు బాగా వ్యయం చేయాలి. అందులో ప్రతిభ చూపిన వారికి స్కాలర్ షిప్పులు ఇవ్వాలి. అవసరం అయితే విదేశాలలో శిక్షణను ఇప్పించాలి. ప్రతిభకు పట్టం కట్టాలి.

3) అవినీతి, లంచగొండితనం లేని సమాజం :
ప్రపంచంలో మనదేశం లంచగొండి, అవినీతి దేశంగా చెడ్డ పేరు తెచ్చుకొంటోంది. నిత్యం పత్రికలు ఆ విషయాలు రాస్తున్నాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణ వచ్చిన నాయకుణ్ణి ప్రజలు ఎన్నుకోరాదు. అటువంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి. సజ్జనులను ప్రోత్సహించాలి. అవినీతిపరుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.

4) భాషా సంస్కృతీ పరిరక్షణ :
మాతృభాషను ఆదరించాలి. మన సంస్కృతిని కాపాడాలి. ప్రభుత్వం దీనికి ప్రత్యేక శాఖను ఏర్పరచి, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ప్రజలు ఈ సంస్కృతిని కాపాడుకోవాలి.

అనంత కాలం ఇంకా ఆర్థిక పరిస్థను ఆస్ట్రేలు జరగా అను

VII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది పదాలకు గురువులను, లఘువులను గుర్తించండి.
UTI దేశము
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 2

2) కింది వాటిలో తప్పుగా ఉన్న గణాలను గుర్తించి సరి చేయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 3
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 4

3) ఛందస్సులో గణాల విభజన తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం.

అ) కింది పద్యపాదాలను పరిశీలించండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 5

పై పాదాల్లో “భ, ర, న, భ, భ, ర, వ” అనే గణాలు ఒకే వరుసలో వచ్చాయి కదా ! ఇలా పద్యంలో నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్తిపద్యం’ అంటారు.

పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరంగానీ, దాని వర్ణమైత్రి అక్షరంగానీ ఆపాదంలో నియమిత స్థానంలో రావటాన్ని “యతిమైత్రి” లేదా “యతిస్థానం” అంటారు.

ఈ పద్య పాదాల్లో ఆ-అ; జే (ఏ) – సి (ఇ)లకు యతిమైత్రి చెల్లింది.

పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాలలో ‘య’ అను అక్షరం వచ్చింది. ఇలా పద్య పాదాలన్నింటిలోను రెండవ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని “ప్రాసనియమం” అంటారు.

పై పద్యపాదాలు ‘ఉత్పలమాల’ పద్యానివి. పై ఉదాహరణననుసరించి ‘ఉత్పలమాల’ పద్య లక్షణాలను ఈ విధంగా పేర్కొనవచ్చు.

ఇలాంటి లక్షణాలు గల పద్యాన్ని “ఉత్పలమాల” పద్యం అంటారు. పై విషయాల ఆధారంగా ఉత్పలమాల పద్య లక్షణాలను ఎలా రాయాలో గమనించండి.

ఉత్పలమాల:

  1. ఇది వృత్తపద్యం.
  2. ఇందు నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రతిపాదంలో 10వ అక్షరం యతిస్థానం.
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతిపాదంలోను 20 అక్షరాలుంటాయి.
    ఈ లక్షణాలు గల పద్యపాదమే ఉత్పలమాల పద్యపాదం.

ఆ) ఉత్పలమాల పద్య లక్షణాలు తెలుసుకున్నారు కదా ! ఈ పద్య లక్షణాల ఆధారంగా కింద ఇవ్వబడిన చంపకమాల పద్యానికి గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి పద్యం కిందగల లక్షణాలు పూరించండి.

‘అమిత పరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముడవు, నీవు, నీదయిన దాస్యము వాపికొనంగ నీకు జి
త్తము గలదేని, భూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతము దెచ్చియి మ్మనిన నవ్విహగేంద్రుడు సంతసంబునన్

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 6

చంపకమాల :

  1. ఇది వృత్త పద్యం.
  2. పద్యంలో నాలుగు పాదాలు ఉన్నాయి.
  3. ప్రతి పాదంలోను ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలు ఉన్నాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
    (అ – య) (త – దా) (త్త – ద) (క – న) వీటికి యతి మైత్రి.
  5. ప్రాస నియమం ఉంది.
  6. ప్రతి పాదంలోను 21 అక్షరాలు ఉంటాయి.

ఇ) కింది పాదాలు ఏ వృత్తాలకు సంబంధించినవో గుర్తించండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 7

గమనిక :
పై పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ గణాలు ఉన్నాయి. కాబట్టి పై పద్యపాదము ‘చంపకమాల’ వృత్తమునకు సంబంధించినది.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 8
గమనిక :
పై పాదంలో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ వృత్తము.

ఈ)కింద సూచించిన పద్యపాదాలను పూరించి గణవిభజన చేసి అవి ఏ పద్యపాదములో గుర్తించండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం 9

గమనిక : పై పద్యపాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి (ప – బం) ‘చంపకమాల’ పద్యము. యతి 11వ అక్షరము.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

భూమి – వసుధ, ధరణి, అవని
కేతనం – జెండా, పతాకము
వికారి – ముని, తాపసి
గంగ – భాగీరథి, త్రిపథగ
ఖ్యాతి – కీర్తి, యశము
బ్రహ్మ – విధాత, ధాత, సృష్టికర్త

వ్యుత్పత్యర్థాలు

ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
బ్రహ్మ – ప్రజలను వర్థిల్ల చేయువాడు (విధాత)

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

నానార్థాలు

ధర్మము = పుణ్యం, న్యాయం, ఆచారం
జలం = నీరు, ఎర్రతామర
భావము = పుట్టుక, ప్రపంచం, సంసారం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
మహాభ్యుదయమ్ము = మహా + అభ్యుదయమ్ము – సవర్ణదీర్ఘ సంధి
కుమారాగ్రణి = కుమార + అగ్రణి – సవర్ణదీర్ఘ సంధి
నయవంచకాళి = నయవంచక + ఆళి – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
భరతోర్వర = భరత + ఉర్వర – గుణసంధి
సహోదరా = సహ + ఉదరా – గుణసంధి
నవ్యోజ్జ్వల = నవ్య + ఉజ్జ్వ ల – గుణసంధి

యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమముగా య, వ, రలు ఆదేశమగును.
అభ్యుదయము = అభి + ఉదయము – యణాదేశ సంధి

అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
సంపాదించుకొన్నట్టి = సంపాదించుకొన్న + అట్టి – అత్వసంధి
నేర్పినట్టి = నేర్పిన + అట్టి – అత్వసంధి
మొలకెత్తు = మొలక + ఎత్తు – అత్వసంధి
నాడులందు = నాడుల + అందు – అత్వసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
ఏదైనను = ఏది + ఐనను – ఇత్వ సంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
శిరమెత్తగా = శిరము + ఎత్తరా – ఉత్వసంధి
జోతలర్పించే = జోతలు + అర్పించె – ఉత్వసంధి
పాడయ్యె = పాడు + అయ్యె – ఉత్వసంధి
తరుణమ్మిదే = తరుణమ్ము + ఇదే – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి (అ)
సూత్రం (అ) : ప్రథమమీది పురుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
పట్టుగొమ్మ = పట్టు + కొమ్మ – గసడదవాదేశ సంధి

గసడదవాదేశ సంధి సూత్రం (ఆ) : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి.
అన్నదమ్ములు = అన్న + తమ్ముడు – గసడదవాదేశ సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

యడాగమ సంధి
సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం అవుతుంది.
కన్నయది = కన్న + అది – యడాగమ సంధి
నీళాదేశము = నీ + ఈదేశము – యడాగమ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
జాతి శిరస్సు జాతి యొక్క శిరస్సు షష్ఠీ తత్పురుష సమాసం
శాంతి చంద్రికలు శాంతి అనెడి చంద్రికలు రూపక సమాసం
గంగా నది గంగ అనే పేరుగల నది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
నా దేశము నా యొక్క దేశము షష్ఠీ తత్పురుష సమాసం
ప్రపంచ చరిత్ర ప్రపంచము యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం
నిఖిల ధరణి నిఖిలమైన ధరణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నవ్యభారతము నవ్యమైన భారతము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహామౌని గొప్పవాడైన మౌని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నీ తల్లి నీ యొక్క తల్లి షష్ఠీ తత్పురుష సమాసం
దేశభక్తి దేశము నందు భక్తి సప్తమీ తత్పురుష సమాసం
ప్రజలనాడులు ప్రజల యొక్క నాడులు షష్ఠీ తత్పురుష సమాసం
అఖండ భారతం అఖండమైన భారతం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
గట్టి ప్రతిజ్ఞ గట్టిదైన ప్రతిజ్ఞ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
హింసా పిశాచి హింస అనెడి పిశాచి రూపక సమాసం
అన్నదమ్ములు అన్నయును, తమ్ముడును ద్వంద్వ సమాసం
– సకల ప్రపంచము సకలమైన ప్రపంచము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ధాన్యాగారాలు ధాన్యమునకు ఆగారాలు షష్ఠీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

ప్రతిజ్ఞ – ప్రతిన
భూమి – బూమి
భాష – బాస
గౌరవం – గారవం
కీర్తి – కీరితి
భక్తి – బత్తి
హృదయం – ఎద
అద్భుతం – అబ్బురం
భృంగారం – బంగారం
మత్సరం – మచ్చరం

కవి పరిచయం

కవి : సురగాలి తిమోతి జ్ఞానానందకవి

జన్మస్థలం : బొబ్బిలి తాలూకా, ‘పెద పెంకి’ గ్రామంలో జన్మించారు.

జీవిత కాలం : 1922 – 2011

ఉద్యోగం : కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.

ప్రతిభ : ప్రాథమిక విద్యను నేర్చుకుంటున్నప్పుడే ఆశువుగా సీసపద్యాలు చెపుతూ “దీనబంధు శతకాన్ని” రాశారు.

రచనలు : 1) ఆమ్రపాలి 2) పాంచజన్యం 3) క్రీస్తు శతకం 4) నా జీవితగాథ 5) కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు 6) పర్జన్యం 7) గోల్కొండ మొ||నవి.

రచనా శైలి : సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించిన కవి.

అవార్డు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును 1975లో పొందారు.

పురస్కారం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “ఉత్తమ ఉపాధ్యాయ” పురస్కారం ఇచ్చింది. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

1వ పద్యము (కంఠస్థ పద్యం)

*చం. పరమ తపోనివేశనము బంగరుపంటలకు న్నివాస మ
బ్బురమగు శాంతిచంద్రికల భూమి ప్రపంచచరిత్రలోన బం
ధురతర కీర్తి గొన్న భరతోర్వర నా జనయిత్రియంచు పా
డర! శిరమెత్తరా! విజయఢంకను గొట్టుమురా! సహైదరా!
ప్రతిపదార్థాలు :
సహోదరా (సహ + ఉదరా) = ఓ సోదరా !
పరమ తపోనివేశనము ; పరమ = మేలైన (అధికమైన)
తపః + నివేశనము = తపస్సునకు ఉనికి పట్టు (తపో భూమి).
బంగరుపంటలకున్ = బంగారు పంటలకు
నివాసము = నిలయము
అబ్బురము + అగు = అసాధారణమైన
శాంతిచంద్రికల = శాంతివెన్నెలలు కురిసే
భూమి = ప్రదేశము
ప్రపంచచరిత్రలోనన్ = ప్రపంచదేశముల చరిత్రలో
బంధురతరకీర్తి ; బంధురతర = మిక్కిలి రమ్యమైన
కీర్తి = కీర్తిని
భరతోర్వరభ (రత + ఉర్వర) = భారత భూమి
నా జనయిత్రి + అంచు = నా తల్లియని
పాడర = కీర్తించు
శిరము + ఎత్తరా = తల ఎత్తుకోరా !
కైకొనుమురా = తీసికొనుము

భావం :
ఓ భారతకుమార శ్రేష్ఠుడా ! “ఇది నా దేశం. ఈమె నన్ను కన్నతల్లి. నా దేశ సౌభాగ్య సంపదలు అభివృద్ధి చెందడానికి నేను సహాయమందిస్తాను. ప్రపంచమంతటా దీన్ని పూజించేటట్లుగా గొప్ప అభివృద్ధిని నెలకొల్పుతాను” అంటూ నీవు నీ మనస్సులో గట్టిగా ప్రతిజ్ఞ చెయ్యి (చేయుము).

2వ పద్యము

మ. ఇది నాదేశము నన్నుఁ గన్నయది నా యీ దేశ సౌభాగ్య సం
పదలీ విశ్వమునందు వర్ధిలగఁ దోడ్పాటున్ బొనర్తున్ మహా
భ్యుదయమ్మున్ నెలకొల్పుదున్ భువనముల్ పూజింపనంచీవు నీ
యెదలో గట్టి ప్రతిజ్ఞఁ గైకొనుమురా! హిందూకుమారాగ్రణీ!
ప్రతిపదార్థాలు :
హిందూకుమార + అగ్రణీ = శ్రేష్ఠుడైన ఓ భారత కుమారా!
ఇది నా దేశము – ఇది నా దేశము
నన్నున్ = నన్ను
కన్నయది (కన్న + అది) = కన్నది (కనిన తల్లి)
నా, ఈ = ఈ నా యొక్క
దేశ సౌభాగ్య సంపదలు; దేశ = దేశము యొక్క
సౌభాగ్య = వైభవపు
సంపదలు = ఐశ్వర్యములు
ఈ విశ్వమునందు = ఈ ప్రపంచంలో
వర్దిలగన్ = వృద్ధి పొందడానికి
తోడ్పాటున్ = సాయమును
పొనర్తున్ = చేస్తాను
భువనముల్ = లోకములు (ప్రపంచములు)
పూజింపన్ = పూజించేటట్లుగా
మహాభ్యుదయమున్ (మహా + అభ్యుదయమున్) = గొప్ప అభివృద్ధిని = పొందిన
నెలకొల్పుదున్ = నిలబెడతాను
అంచున్ = అంటూ
ఈ వు = నీవు
నీ + ఎదలోన్ = నీ మనస్సులో
గట్టి = దృఢమైన ప్రతిజ్ఞను
విజయఢంకను = విజయఢంకాను
కొట్టుమురా – మ్రోగించరా ! (చాటింపుము)

భావం :
ఓ సోదరా ! మన దేశం తపోభూమి. బంగారు పంటలకు నిలయం. శాంతి వెన్నెలలు కురిసే పుణ్యభూమి. ప్రపంచంలో మనోహరమైన కీర్తిని పొందిన ఈ భరతభూమి నా తల్లి అని గర్వంగా తల ఎత్తుకొని చాటిస్తూ, విజయఢంకాను మ్రోగిస్తూ నీ దేశం గురించి కీర్తించు.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

3వ పద్యము (కంఠస్థ పద్యం )

*ఉ. జాతి శిరస్సు నెత్తికొని క్ష్మాతలవీధిని గౌరవాన హుం
తన మొప్పగాఁ దిరిగినన్ గలుగున్ గడుకీర్తి భారత
క్ష్మాతలి కట్టి భాగ్యమును గల్గగ శాంతి సముద్ధరింప లే
రా ! తరుణమ్మిదే మరల రాదు సుమీ! గతకాల మెన్నడున్
ప్రతిపదార్థాలు :
జాతి = భారతజాతి
శిరస్సున్ + ఎత్తి = తల ఎత్తుకొని
క్ష్మాతల వీధిని . = భూమండలంలో (ప్రపంచంలో)
గౌరవాన = గౌరవంగా
హుందాతనము + ఒప్పగాన్ = హుందాగా
తిర్గినన్ = తిరిగితే
కడు = మిక్కిలి
కీర్తి = కీర్తి
కలుగున్ = కలుగుతుంది
అట్టి భాగ్యమును = అటువంటి సౌభాగ్యము
కల్గగన్ = కలిగే విధంగా
శాంతిన్ = శాంతిని
సముద్ధరింపన్ = పైకి తేవడానికి (లేవనెత్తడానికి)
లేరా = లెమ్ము
తరుణము + ఇదే = ఇదే తగిన సమయము
ఎన్నడున్ = ఎప్పుడునూ
గతకాలము = జరిగిపోయిన కాలం
మరల రాదు సుమీ = తిరిగి రాదు సుమా !

భావం :
భారత జాతి తల ఎత్తుకొని ప్రపంచ వీధిలో సగౌరవంగా, హుందాగా తిరిగినప్పుడే గొప్ప కీర్తి కలుగుతుంది. మన దేశానికి అటువంటి సౌభాగ్యం కలిగే విధంగా శాంతిని పెంపొందించడానికి ఇదే సరైన సమయము. అందుకు సిద్ధం కండి. ఎందుకంటే పోయిన కాలం తిరిగి రాదు కదా !

4వ పద్యము

మ. మతమేదైనను భాషయేదయిన సంపాదించుకొన్నట్టి సం
స్కృతి యేదైనను నిండు నీ తనువులో జీర్ణించు జాతీయతా
హితనవ్యోజ్జ్వల భావబంధురత లీ హింసా ప్రపంచాన క
ద్భుత రీతిన్ గనిపింపగా వలయు బాబూ! శాంతి దీక్షారతా!
ప్రతిపదార్థాలు :
(ప్రపంచానికి) శాంతి దీక్షారతా = శాంతి దీక్షయందు ఆసక్తి గలవాడా !
మతము = నీ మతము
ఏదయినను (ఏది + అయినను) ఏమయినప్పటికీ
భాషయేదయిన = నీ భాష ఏదయినా
సంపాదించుకున్నట్టి (సంపాదించుకున్న + అట్టి) = ఆర్జించినట్టి
సంస్కృతి – నాగరికత (సంస్కారము)
ఏదైనను (ఏది + ఐనను) = ఏదయినా
నిండు = నిండైన
నీ తనువులో = నీ శరీరములో (నీ నరనరాల్లో)
జీర్ణించు = నిండిన
జాతీయతా = భారత జాతీయత అనే
హిత = మేలయిన
నవ = కొత్తయైన
ఉజ్జ్వల = ప్రకాశించే
భావబంధురతలు = ఇంపైన భావములు
ఈ హింసా ప్రపంచానకున్ = ఈ హింసతో నిండిన ప్రపంచానికి
అద్భుత రీతిన్ = అద్భుతంగా
కనిపింపగా వలయున్ = కనిపించాల్సిన అవసరం ఉంది

భావం :
శాంతి దీక్షయందు ఆసక్తి గలవాడా ! నీ మతం, భాష, సంస్కృతి ఏవయినప్పటికీ, నీ నరనరాల్లో నిండిన భారతీయ భావన హింసతో నిండిన ఈ ప్రపంచానికి అద్భుతంగా కనిపించాలి.

5వ పద్యము

తే.గీ. నిఖిల ధరణికి శాంతిని నేర్పినట్టి
భరత భువనమ్ము నీ తల్లి ప్రథితయశము
నిలువఁబెట్టుట నీవంతు నిశ్చయముగ
నీకుఁ గలదు బాధ్యతయు హిందూకుమార!
ప్రతిపదార్థాలు :
హిందూకుమార ! = ఓ భారత కుమారా !
నిఖిల ధరణికిన్ = సమస్త భూమండలానికీ
శాంతిని = శాంతి మార్గాన్ని ముందు
నేర్పినట్టి (నేర్పిన + అట్టి) = నేర్పించినట్టి
భరత భువనమ్ము = భారత భూమి (భారతదేశం)
నీ తల్లి = నీకు తల్లి
ప్రథిత యశము = ప్రసిద్ధి పొందిన కీర్తి
నిలువబెట్టుట = నిలబెట్టడం
నిశ్చయముగ = తప్పక
నీ వంతు = నీ వాటా
నీకున్ = నీకు
బాధ్యతయు = పూచీయూ
కలదు = ఉంది

భావం :
ఓ భారత కుమారా ! సమస్త భూమండలానికి శాంతిని నేర్పినది భారతదేశం. నీ తల్లియైన ఈ భారతదేశం యొక్క సముజ్జ్వల కీర్తిని నిలబెట్టాల్సిన బాధ్యత నీమీద ఉంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

6వ పద్యము

సీ. శిరమెత్తరాదు మచ్చరికించి విషపు దౌ
ర్జన్య కులమత హింసాపిశాచి
నిలవఁగారాదు పెన్ బలిసిపోయిన దుష్ట
నయవంచకాళి గూండాయిజమ్ము
తొలచఁగారాదు విద్రోహాన దేశ భా
గ్యాల దార్యతను లంచాల జలగ
వచియింపఁగారాదు ప్రతినిధి యగువాడు
పగ ననల్ మొలకెత్త పలుకుబడుల

ఆ.వె. అంద అన్నదమ్ములన్న మధురమైన
ధర్మమునకు దెబ్బతగులరాదు
నాడురా ! సమేకతా డిండిమము మ్రోగు
వసుధ పొగడ నవ్యభారతమున
ప్రతిపదార్థాలు :
మచ్చరికించి = పట్టు పట్టి
విషపు = తీవ్రంగా వ్యాపించే
దౌర్జన్య కులమత హింసాపిశాచి;
దౌర్జన్య = దుండగములు (దౌర్జన్యములు)
కులమత = కులానికి, మతానికి చెందిన
హింసా పిశాచి = హింస అనే భూతము
శిరము + ఎత్తరాదు = తల ఎత్తరాదు (చెలరేగరాదు)
పెన్ = పెద్దగా
బలిసిపోయిన = పెరిగిపోయిన
దుష్ట = దుష్టులు
నయవంచక + ఆళి = నయవంచకుల సమూహం యొక్క (మోసగాండ్ర యొక్క)
గూండాయిజమ్ము = గూండాయిజం
నిలువగా రాదు = నిలువకూడదు
దేశభాగ్యాల = దేశ సౌభాగ్యముల
దాద్యతను = సత్తువను
లంచాల జలగ = లంచములు అనే జలగ
తొలచగా రాదు = పీల్చరాదు
ప్రతినిధి + అగువాడు = ప్రజా ప్రతినిధులయిన వారు (శాసనసభ్యులు)
పగ = శత్రుత్వము
ననల్ = చివుళ్ళు
మొలకెత్తన్ = అంకురించేలా
పలుకుబడులు = మాటలు
వచియింపగారాదు = మాట్లాడరాదు
అందరు = దేశప్రజలు అందరూ
అన్నదమ్ములు = సోదరులు
అన్న = అనిన
మధురమైన = తీయని
ధర్మమునకున్ = ‘ధర్మానికి
దెబ్బ తగులనీయరాదు = దెబ్బ తగలకూడదు
నవ్య భారతమున = నూతన భారతదేశంలో
వసుధ పొగడన్ = ప్రజలు పొగిడేలా
సమేకతా = సమైక్యము అనే
డిండిమము = ఢక్కా
నాడు = ఆనాడే
మ్రోగున్ రా = ధ్వనిస్తుందిరా !

భావం :
ఇటువంటి పుణ్యదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కులమత హింసలు అనే పిశాచాలను తలయెత్తనీయకూడదు. నానాటికీ పెరిగిపోతున్న దుష్టుల, మోసగాళ్ళ యొక్క గూండాయిజం నిలువకూడదు. బలిష్ఠమైన దేశ సౌభాగ్యాన్ని లంచాలు అనే జలగలు పట్టి పీల్చకూడదు. పగలు, సెగలు రగిలించే మాటలు ప్రజా ప్రతినిధులైన వారు మాట్లాడకూడదు. మనమంతా అన్నదమ్ములం అన్న తీయనైన ధర్మానికి దెబ్బతగులనీయకూడదు. అలా జరిగినప్పుడు సమైక్యము అనే ఢక్కా నవ్యభారతంలో ప్రజలు పొగిడేలా మోగుతుంది.

7వ పద్యము (కంఠస్థ పద్యం)

*శా. ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్
ఈ గోదావరి సింధు నర్మదలు నీ యీదేశ సౌభాగ్య ధా
న్యాగారాలకు పట్టుగొమ్మలు నఖండంబైన నీ ధారుణీ
భాగ్యమ్మీ సకల ప్రపంచమునకున్ స్వామిత్వముం బూనెడిన్
ప్రతిపదార్థాలు:
ఈ గంగానది = ఈ గంగానది
బ్రహ్మపుత్రయునున్ = బ్రహ్మపుత్రా నదియును
ఈ కృష్ణమ్మ = ఈ కృష్ణా నదియు
కావేరియున్ = కావేరీ నదియు
ఈ గోదావరి = ఈ గోదావరి నదియు
సింధు నర్మదలు = సింధు నదియు, నర్మదా నదియు
నీ + ఈ దేశ = నీ యొక్క ఈ భారతదేశపు
సౌభాగ్య ధాన్యాగారాలకు = సౌభాగ్యానికీ, ధాన్యాగారాలకు
పట్టుగొమ్మలు (పట్టు + కొమ్మలు) = ఆధారములు
అఖండంబయిన = సంపూర్ణమైన
ఈ ధారుణీ భాగమ్ము = ఈ భూభాగము
ఈ సకల ప్రపంచమునకున్ = ఈ సమస్త ప్రపంచానికి
స్వామిత్వమున్ = ఆధిపత్యమును
పూనెడిన్ = వహిస్తుంది

భావం :
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, కావేరి, గోదావరి, సింధు, నార్మద అనే జీవనదులు ఈ దేశ సౌభాగ్యమైన ధాన్యాగారాలకు ముఖ్యమైన ఆధారం. అఖండమైన సౌభాగ్య సంపదలు గలిగిన ఈ దేశం ప్రపంచానికి అధిపతి అయ్యింది.

8వ పద్యము

తే.గీ. ముసలి సన్న్యాసి బాపూజీ బోసినోరు
విప్పిపలికిన పలుకుకే విశ్వజగతి
జోతలర్పించె జాతికి ఖ్యాతి యదియ
ఆ మహామౌని నేల పాడయ్యె నేడు
ప్రతిపదార్థాలు :
ముసలి సన్న్యాసి = ముసలివాడైన సన్న్యాసి వంటివాడైన
బాపూజీ = గాంధీజీ యొక్క
బోసినోరు = పళ్ళులేని నోరు
విప్పి = విప్పి
పలికిన = మాట్లాడిన
పలుకుకే = మాటకే
విశ్వజగతి = ప్రపంచము
జోతలు + అర్పించే = జోహార్లు సమర్పించింది
అదియ = అది ప్రపంచం, గాంధీజీకి జోహార్లు సమర్పించడం అన్నది
జాతికి= భారత జాతికి
ఖ్యాతి = కీర్తినిచ్చేది ఖ్యాతి
ఆ మహామౌని = ఆ గొప్ప మునివంటి గాంధీజీ పుట్టిన
నేల = భూమి (భారతదేశం)
నేడు = ఈనాడు
పాడయ్యె = చెడిపోయింది (గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నడవడం లేదు)

భావం :
గొప్ప ముసలి సన్యాసి వంటి గాంధీజీ తన బోసి నోరు విప్పి పలికిన పలుకులకు (శాంతి సందేశానికి) ప్రపంచ మంతా జేజేలు పలికింది. అందువల్ల మన భారత జాతికి ఖ్యాతి వచ్చింది. అటువంటి మహాత్ముని కన్న భూమి, నేడు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నడవడం లేదు.

AP Board 8th Class Telugu Solutions Chapter 9 సందేశం

9వ పద్యము

ఆ.వె. దేశభక్తి మఱియు దేశసమగ్రత
ప్రజల నాడులందు ప్రబలి ప్రబలి
కర్మభూమియగు నఖండ భారతమహా
క్షితిని నెగురు ప్రగతి కేతనమ్ము
ప్రతిపదార్థాలు :
దేశభక్తి = దేశమునందు భక్తి
మఱియున్ = మఱియు
దేశసమగ్రత = దేశము యొక్క సమగ్రత అనే భావాలు
ప్రజల నాడులందు = ప్రజల నరనరాలలో
ప్రబలి, ప్రబలి = బాగా వ్యాపించి
కర్మ భూమి + అగు = పుణ్యభూమియైన
అఖండ భారత మహాక్షితిని ;
అఖండ = సంపూర్ణమైన
భారత = భారతము అనే
మహాక్షితినిన్ = గొప్ప నేలపై
ప్రగతి కేతనమ్ము = అభివృద్ధి అనే జెండా
ఎగురు = ఎగురుతుంది

భావం :
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు, ప్రజల నరనరాల్లో వ్యాపించి, పుణ్యభూమియైన అఖండ భారతదేశంలో ప్రగతి జెండా రెపరెపలాడుతూ ఎగురుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 8 జీవన భాష్యం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 8th Lesson జీవన భాష్యం

8th Class Telugu 8th Lesson జీవన భాష్యం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

“శ్రద్ధగలవాడే జ్ఞానాన్ని పొందుతాడు”.
“కటిని తిడుతూ కూర్చోడం కన్నా చిన్న దీపం వెలిగించు”.
“అణుశక్తి కన్నా ఆత్మశక్తి మిన్న”.
“త్యాగగుణానికి తరువులే గురువులు”.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై వాక్యాల ద్వారా మీరేం గ్రహించారు?
జవాబు:
పై వాక్యాల ద్వారా కొన్ని సూక్తులను తెలుసుకున్నాము. కొన్ని సందేశాలను, ఉపదేశాలను గ్రహించాము.

ప్రశ్న 2.
ఇలాంటి వాక్యాలనేమంటారు?
జవాబు:
ఇలాంటి వాక్యాలను సుభాషితములని, సూక్తులని అంటారు. మంచి మాటలు, సందేశాలు అని కూడా అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

ప్రశ్న 3.
ఇలాంటి సందేశాలు, మంచిమాటలు ఇంకా ఏ ఏ రూపాలలో ఉంటాయి?
జవాబు:
ఇలాంటి సందేశాలు, మంచి మాటలు పద్యాలు, శ్లోకాలు, గేయాలు, మినీ కవితలు, గజళ్ళు మొదలైన రూపాలలో ఉంటాయి.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
‘జీవన భాష్యం’ గజలను రాగయుక్తంగా, భావయుక్తంగా పాడండి.
జవాబు:
పాడడం, మీ ఉపాధ్యాయుల సాయంతో నేర్చుకోండి.

ప్రశ్న 2.
‘జీవన భాష్యం’ అనే పేరు ఈ పాఠానికి తగిన విధంగా ఉందా? ఎందుకు? చర్చించండి.
జవాబు:
‘జీవన భాష్యం’ అంటే బ్రతుకు పై వ్యాఖ్యానం. జీవితం ఎలా నడిపించుకోవాలో వివరంగా చెప్పడమే ‘జీవన భాష్యం’. ఈ గజల్ లో నారాయణరెడ్డి గారు జీవితమును గూర్చి కొన్ని సత్యాలు చెప్పారు. మనసుకు దిగులు మబ్బు ముసిరితే కన్నీళ్ళు వస్తాయన్నారు. ఆటంకాలు వస్తాయనీ, జంకకుండా అడుగులు వేయాలనీ చెప్పారు. బీడు భూములు దున్ని విత్తితే పంటలు పండుతాయని చెప్పారు. మనుషులు అందరూ కలిసి ఉండాలని చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా జీవితంలో పరీక్షలు తప్పవన్నారు. కేవలం బిదుదులు పొందినంత మాత్రాన విలువలేదనీ, మంచి త్యాగం చేస్తేనే మనిషి పేరు నిలబడుతుందని చెప్పారు. ఈ విధంగా జీవితం గూర్చి వివరించి చెప్పినందువల్ల ‘జీవనభాష్యం’ అన్న పేరు ఈ పాఠానికి తగియుంది.

ప్రశ్న 3.
ఈ “గజల్స్” ద్వారా “సినారె” ఏం సందేశమిస్తున్నారు?
జవాబు:
లక్ష్యసాధనలో ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయనీ, అయినా జంకకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుందనీ, ఆ స్ఫూర్తె నలుగురూ అనుసరించే దారి అవుతుందని సినారె చెప్పారు.

  • ఎడారి దిబ్బలను దున్నితే ఏమి ఫలితం ఉండదని అనుకోక, వాటిని దున్నితే పంటలు పండుతాయని చెప్పారు.
  • మనుషులు తమలో తాము భేదాలు ఎంచుకోకుండా కలసిమెలిసి జీవించాలని చెప్పారు.
  • మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా పరీక్ష ఉంటుందని గుర్తు చేశారు.
  • బిరుదులు, సత్కారాలు పొందడంలో విలువ, గుర్తింపు లేవని, మానవాళికి పనికివచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని సినారె సందేశమిచ్చారు.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. అ) కరిగితే, ముసిరితే, మమత, దేవత, పెరిగి, మరిగి వంటి పదాలు గజల్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి, వాటి కింద గీత గీయండి. ఆ పాదాలు రాయండి.
జవాబు:

  1. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.
  2. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది.
  3. నిలువెల్ల మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు
  4. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు
  5. విరిగినపుడు నిలువెత్తుగా పెరిగి తెలుసుకో
  6. మౌలిక తత్వం సలసల మరిగి తెలుసుకో

ఆ) గజళ్ళలో కవి తన గురించి ప్రస్తావించిన పంక్తులు ఏవి? వాటిని రాసి భావాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
బిరుదులు పొందే వ్యాప్తికీ విలువేమి “సినారే”. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది – అనే పంక్తులు కవి తన గురించి ప్రస్తావించినవి.

భావం :
ఓ సినారే! గొప్ప బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికొచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. కింది పేరాను చదివి, ఐదేసి ప్రశ్నలు తయారుచేయండి.

చైనా తత్త్వవేత్త కన్ఫ్యూషియస్. ఆయన చాలా తెలివైనవాడు. ఒక రాజుగారు అతణ్ణి గురించి విని తన సభకు పిలిపించుకున్నాడు. మూడు పంజరాలు చూపించాడు. మొదటి పంజరంలో ఒక ఎలుక, దాని ఎదురుగా తినే పదార్థాలు ఉన్నాయి. రెండో పంజరంలో పిల్లి ఉంది. దాని ఎదురుగా పళ్ళెంలో పాలు ఉన్నాయి. మూడో పంజరంలో ఒక గద్ద ఉంది. దాని ఎదురుగా తాజా మాంసం ఉంది. కానీ ఎలుక ఏ పదార్థం తినటం లేదు; పిల్లి పాలు ముట్టుకోవడం లేదు; గద్ద కూడా మాంసం ముట్టడం లేదు. దీనికి కారణమేమిటి? అని అడిగాడు రాజు. తత్త్వవేత్త ఇలా సమాధానం ఇచ్చాడు- “పిల్లిని చూసి భయపడి ఎలుక ఆహారం తీసుకోలేదు. పిల్లి ఎలుకమీద ఆశతో పాలు ముట్టుకోలేదు. పిల్లిని, ఎలుకను ఒకేసారి తినాలనే ఆశతో గద్ద మాంసం ముట్టుకోలేదు. అలాగే భవిష్యత్తు మీద ఆశతో ప్రజలు వర్తమానాన్ని విస్మరిస్తున్నారు. సుఖానికి దూరమవుతున్నారు. ఈ సమాధానానికి సంతృప్తిపడి రాజు కన్ఫ్యూషియకు విలువైన బహుమానాన్ని ఇచ్చాడు.
జవాబు:
ప్రశ్నలు:

  1. కన్ఫ్యూషియస్ ఎవరు? ఆయన ఎలాంటివాడు?
  2. మొదటి, రెండు, మూడు పంజరాలలో ఏమేమి ఉన్నాయి?
  3. మూడో పంజరం ఎదురుగా ఏమి ఉంది?
  4. రాజు ఏమని ప్రశ్నించాడు?
  5. రాజు అడిగిన ప్రశ్నకు తత్త్వవేత్త ఏమి సమాధానమిచ్చాడు?

3) కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.

అ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యంలో మీరేమి గ్రహించారు?
జవాబు:
ఎడారిలో ఇసుకదిబ్బలు ఉంటాయి. అక్కడ నీళ్ళు దొరకవు. ఇసుక నేలల్లో పంటలు పండవు. అందువల్ల నీళ్ళు దొరకని ఎడారులలోని ఇసుక దిబ్బలను దున్నితే ఫలితము ఏముంటుంది? అవి వ్యవసాయానికి పనికిరావు కదా ! అని నిరాశపడరాదని కవి చెప్పాడు. సేద్యానికి పనికిరావు కదా అని బంజరు బీడులను దున్నకుండా విడిచి పెట్టవద్దనీ, వాటిని దున్ని విత్తులు చల్లితే చక్కని పైరుపంటలు పండుతాయనీ, నిరాశ పనికిరాదనీ, ఆశావహ దృక్పథంతో ముందుకు నడిస్తే తప్పక ఫలితాలు వస్తాయనీ కవి ఈ వాక్యాల ద్వారా సందేశం అందించాడు.

ఆ) నిలువెల్లా మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు – అంటే మీకేమి అర్థమైంది?
జవాబు:
సి. నారాయణరెడ్డిగారు తల్లిని చక్కగా అభివర్ణించారు. మాతృత్వ మధురిమలను సుమనోహరంగా ఆవిష్కరించారు. మానవునికి తొలి గురువు తల్లి. చేతులను పట్టుకొని నడిపిస్తుంది. అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. మమతానురాగాలను అందిస్తుంది. మూర్తీభవించిన శాంతమూర్తి తల్లి. మమతను అందిస్తుంది. మనలో దుఃఖాన్ని తొలగిస్తుంది. సుఖాన్ని కల్గిస్తుంది. వెలుగులా దారి చూపిస్తుంది. అందుకే సి.నా.రె. గారు తల్లిని ఉద్దేశించి, నిలువెల్ల మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు – అని ప్రశంసాత్మకంగా అన్నాడు.

ఇ) సమైక్య సంఘర్షణ అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు:
పచ్చదనమంటే అది వృక్ష సంపదకు చిరునామా. చినుకులు కురవాలంటే మేఘం రూపుదిద్దుకోవాలి. కేవలం ప్రభుత్వాలు, చట్టాల వలన సమాజం బాగుపడదు. ఎవరికి వారు స్వీయక్రమశిక్షణను, నైతిక నియమాలను అలవరచుకోవాలి. రాశికన్నా వాసి ముఖ్యం. పుక్కిటి పురాణాలు ఎన్ని రాసినా ప్రయోజనం శూన్యం. సమైక్యతతోనే సంఘం వర్థిల్లుతుంది గానీ, వ్యక్తిగతంగా పోరాడి సాధించేది ఏమీ ఉండదు. మానవతను మేలుకొలిపేదే నిజమైన సాహిత్యమవుతుంది. అలాగే తోటి మనిషికి సేవచేసే దయగల మనుషుల్లోనే దైవం దాగి ఉందనే భావాన్ని కవి వ్యక్తపరిచారు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) ఈ పాఠంలో గజల్ ప్రక్రియను గూర్చి తెలుసుకున్నారు కదా ! మీకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియల పేర తెలపండి. వాటిని గురించి రాయండి.
జవాబు:
నాకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియలు :
1. ప్రబంధం
2. కథానిక
3. ఆత్మకథ
4. ఇతిహాసం

1. ప్రబంధం :
పురాణేతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి స్వతంత్ర కావ్యంగా వ్రాస్తే దాన్ని “ప్రబంధం” అంటారు. మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్తమాల్యద మొ||నవి ప్రబంధాలు.

2. కథానిక :
ఒక వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్నీ, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించ సాహిత్య ప్రక్రియను “కథానిక” అంటారు. ఇది వచన ప్రక్రియ. మరీ చిన్నదిగాను, మరీ పెద్దది గాను లేకుండా ఉండటం కథానిక లక్షణం.

3. ఆత్మకథ :
ఆత్మకథ అంటే తనను గురించి తాను రాసుకొన్న కథ. ఎవరైనా తమ ఆత్మకథను రాసుకోవచ్చు. అవి ఆత్మకథలే అయినా సమాజ జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ప్రముఖ వ్యక్తులు తమ జీవితాల గురించి రాసుకొన్న విషయాలు సమకాలిక సమాజానికి వ్యాఖ్యానాలుగా ఉపయోగపడతాయి.

4. ఇతిహాసం :
ఇతిహాసం అంటే పూర్వ కథ అని అర్థం. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆశురూపంలో ఉండేవి. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, భారతం మొ||నవి ఇతిహాసాలు.

ఆ) మంచి పంటలు పండడానికి రైతు చేసే శ్రమ ఎలాంటిదో వివరించండి.
(లేదా)
విరామము లేకుండా శ్రమిస్తూ మనకు అన్నం పెడుతున్న కర్షకుల శ్రమను గురించి వివరించండి.
జవాబు:
మంచి పంటలు పండించాలంటే రైతులు పొలాల్ని చక్కగా దున్నాలి. తరువాత నీరు పెట్టాలి. మంచి విత్తనాలు తెచ్చి, నారుమళ్ళు వేయాలి. సేంద్రియ ఎరువుల్ని వేయాలి. పశువుల పేడను ఎరువులుగా వేస్తే మంచిది. పురుగుమందులు ఎక్కువగా వాడరాదు. సకాలంలో చేనుకు నీరు పెట్టాలి. కలుపు మొక్కలను తీసిపారవేయాలి. చేనును ఆరబెట్టి, సకాలంలో చేనుకు నీరందించాలి. ఎలుకల బెడద లేకుండా చూసుకోవాలి. రైతులు నిత్యం చేనును గమనించాలి. ఏదైనా పురుగుపడితే వేప పిండి వగైరా చల్లి వాటిని అరికట్టాలి. వర్షాధారంగా పండే పంట అయితే, నీరు కావలసినపుడు ఇంజన్ల ద్వారా తోడి నీరు పెట్టాలి. రైతు ఇంతగా శ్రమిస్తేనే మంచిపంటలు పండుతాయి.

ఇ) ఓటమి కలిగినపుడు మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది? వివరించండి.
జవాబు:
సాధారణంగా ఓటమి మానవుని కుంగదీస్తుంది. నీరసింపజేస్తుంది. శూన్యుడిగా మారుస్తుంది. అయితే మానవుడు ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలని బోధించాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఉపదేశించాడు.

పరమాణువులో దాగిన లక్షణాలను విశ్లేషించడం ద్వారా భూమి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. సముద్రంలోతు తెలియాలంటే కారే కన్నీటి బిందువుల వెనుక దాగున్న కష్టాల కడలిని అర్థం చేసుకోవాలి. సంతృప్తి గురించి తెలియాలంటే, ఎంత సంపద ఉన్నా సంపన్నులు పొందలేకపోతున్న సంతృప్తిని తమ కళారాధనతో పొందుతున్న కళాకారులను పరిశీలించాలి. గుండెలోతుల్లో నుండి ప్రేమతో పలకరించే వారూ, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారూ ఉంటారు. ఎవరి మాట వెనుక ఏ ఏ అర్థాలున్నాయో తెలుసుకోగలగాలి. కెరటం నాకు ఆదర్శం. పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నట్లుగా ఓటమిని జయించాలంటే కెరటంలా కిందపడినా పైకి లేవగలగాలి. పండిన చెట్టు వంగడానికి కారణం ఉపకార గుణం. అలా ఎంత ఎదిగినా ఒదిగి ఉపకరించడం నేర్చుకోవాలి. అనాయాసంగా ఏదీ పట్టుబడదు. విజయం సాధించాలంటే కష్టపడడం తప్ప మరొక దొడ్డిదారి ఏదీ లేదు. దాని మూలాలను బాగా శోధించి తెలుసుకోవాలనే భావనను ఈ గజల్ ద్వారా సి.నా.రె గారు తెలిపారు.

ఈ) అమ్మను జ్ఞానపీఠంగా కవి ఎందుకు వర్ణించాడు?
జవాబు:
‘జీవన భాష్యం’ అనే పాఠ్యభాగంలో నారాయణరెడ్డిగారు మాతృత్వాన్ని, అమ్మ గొప్పతనాన్ని చక్కని మాటలతో ఆవిష్కరించారు. అమ్మ గొప్పతనాన్ని చక్కగా తెలియజేశారు. అమ్మ మనకందరికి తొలి గురువు.

పెరిగే సినారె బ్రతుకులో దొరికింది అమ్మ ప్రాపు.

చిన్నప్పుడు ఆ బొమ్మ కావాలి ! ఈ మిఠాయి కావాలి ! అని మొండికేసి ఇప్పుడే కొని పెట్టమని మంకుపట్టు పట్టి అమ్మ చంకనెక్కి ఇదుగో ఈ బండి చూడు ఎంత బాగుందీ అదుగో ఆ గుర్రం చూడు అది నీకే అంటూ బుజ్జగించినా అమ్మ చంక దిగలేదు. నేనెంత అల్లరి చేసినా, చిరునవ్వుతో భరించింది. దెబ్బతగిలి ఏడుస్తున్నప్పుడు ఓర్చుకోవాలని, మిత్రులతో దెబ్బలాడినపుడు సర్దుకోవడం నేర్చుకోవాలనీ జ్ఞాన బోధచేస్తూ నా బాల్యమంతా వేలుపట్టి నడిపించింది. చీకటిలో ఏమీ కనిపించనపుడు తన వెన్నెల వెలుగులతో దారిని చూపే చంద్రునిలా, ఆకలైనపుడు ఆకలికి తీర్చే నిండుకుండలా తన ప్రేమానురాగాలతో వెలుగులా నిలిచింది అమ్మ. మెరిసే సూర్యోదయకాలపు సూర్యకిరణంలా వసంత ఋతువులో పూచే పూవులా పెరిగిన నాకు అమ్మ అండ దొరికిందని ఈ గజల్ ద్వారా కవి అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) సంతకం యొక్క ప్రాధాన్యం ఏమిటి ? సంతకం గురించి సినారె ఏమి చెప్పారు?
జవాబు:
ఆధునిక సమాజంలో సంతకానికి తరగని విలువ ఉంది. సంతకం లేని ఏ ఉత్తరువు చెల్లనేరదు. ఒక్క సంతకం జీవితాన్నే మారుస్తుంది. కవి సంతకం యొక్క గొప్పదనాన్ని తన పరిభాషలో చక్కగా వ్యక్తపరిచారు.
పచ్చదనమంటే అది వృక్ష సంపదకు చిరునామా. చినుకులు కురవాలంటే మేఘం రూపుదిద్దుకోవాలి. కేవలం ప్రభుత్వాలు, చట్టాల వలన సమాజం బాగుపడదు. ఎవరికి వారు స్వీయక్రమశిక్షణను, నైతిక
నియమాలను అలవరచుకోవాలి. రాశికన్నా వాసి ముఖ్యం. పుక్కిటి పురాణాలు ఎన్ని రాసినా ప్రయోజనం శూన్యం. సమైక్యతతోనే సంఘం వర్ధిల్లుతుంది గానీ, వ్యక్తిగతంగా పోరాడి సాధించేది ఏమీ ఉండదు. మానవతను మేలుకొలిపేదే నిజమైన సాహిత్యమవుతుంది. అలాగే తోటి
మనిషికి సేవచేసే దయగల మనుషుల్లోనే దైవం దాగి ఉందనే భావాన్ని ఈ గజల్ ద్వారా కవి వ్యక్తపరిచారు.

ఆ) తెలుసుకోడం వల్ల ప్రయోజనం ఏమిటి ? కవి ఏమేమి తెలుసుకోమన్నాడు?
(లేదా)
సి.నా.రె గారు గజల్ అనే ప్రక్రియ ద్వారా తెలుసుకోవడం వల్ల ప్రయోజనాలు చెప్పారు. అవి మీ మాటల్లో రాయండి.
జవాబు:
పరమాణువులో దాగిన లక్షణాలను విశ్లేషించడం ద్వారా భూమి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. సముద్రంలోతు తెలియాలంటే కారే కన్నీటి బిందువుల వెనక దాగున్న కష్టాల కడలిని అర్థం చేసుకోవాలి. సంతృప్తి గురించి తెలియాలంటే, ఎంత సంపద ఉన్నా సంపన్నులు పొందలేకపోతున్న సంతృప్తిని తమ కళారాధనతో పొందుతున్న కళాకారులను పరిశీలించాలి. గుండెలోతుల్లో నుండి ప్రేమతో పలకరించే వారూ, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారూ ఉంటారు. ఎవరి మాట వెనుక ఏ ఏ అర్థాలున్నాయో తెలుసుకోగలగాలి. కెరటం నాకు ఆదర్శం. పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నట్లుగా ఓటమిని జయించాలంటే కెరటంలా కిందపడినా పైకి లేవగలగాలి. పండిన చెట్టు వంగడానికి కారణం ఉపకార గుణం. అలా ఎంత ఎదిగినా ఒదిగి ఉపకరించడం నేర్చుకోవాలి. అనాయాసంగా ఏదీ పట్టుబడదు. విజయం సాధించాలంటే కష్టపడడం తప్ప మరొక దొడ్డిదారి ఏదీ లేదు. దాని మూలాలను బాగా శోధించి తెలుసుకోవాలనే భావనను ఈ గజల్ ద్వారా సి.నా.రె గారు తెలిపారు.

IV. పదజాలం

1. కింది పదాలకు అర్థాలు తెలుసుకోండి. ఆ పదాల్ని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) ముసరడం = క్రమ్ముకోవడం, చుట్టుముట్టడం, వ్యాపించడం
సొంతవాక్యం : ఆకాశంలో నీలిమేఘాలు ముసరడంతో చీకటిగా ఉంది.

ఆ) అలవోకగా = అతి సులువుగా, తేలికగా
సొంతవాక్యం : కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో అలవోకగా బరువును ఎత్తింది.

ఇ) పూర్ణకుంభం = నిండినది, సమస్తము
సొంతవాక్యం : అధికారులకు దేవాలయాలలో పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు.

ఈ)హృదయం = మనసు, ఎద
సొంతవాక్యం : సజ్జనుల హృదయం ఎప్పుడూ మంచి ఆలోచనతోనే ఉంటుంది.

V. సృజనాత్మకత

* ‘జీవన భాష్యం’ గజల్ లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
జవాబు:
……………. నీరవుతుంది.
…………….దారవుతుంది.
……………. పైరవుతుంది.
……………. ఊరవుతుంది.
……………. ఏరవుతుంది.
……………. పేరవుతుంది.
జవాబు:
సొంత వచన కవిత :
1) శాంతి, మంచు కూడితే కోపాగ్ని నీరవుతుంది.
2) పదిమందీ అట్లానే నడిస్తే అదే నీ దారవుతుంది.
3) సకాలంలో విత్తులు చల్లితే ఆ విత్తే పైరవుతుంది.
4) కులమత భేదాలే కూలితే ఉన్నదే ఊరవుతుంది.
5) శక్తికి మించని త్యాగం నీ ఈవికి ఏరవుతుంది.
6) పదిమందీ నిను పొగిడితే నీ కీర్తికి పేరవుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

(లేదా)

*ఆచార్య సి.నారాయణరెడ్డిగారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి దగ్గర ఏం తెలుసుకోవాలనుకొంటున్నా! ప్రశ్నలు రాయండి.
జవాబు:
ప్రశ్నలు : 1) సినారె గారూ ! మీరు సాహిత్య రచనలు ఎప్పటి నుంచి ప్రారంభించారు?
2) మీరు వ్రాసిన సినిమా పాటలు మీరు వింటున్నపుడు మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది?
3) మీరు ఇంత గొప్ప రచయితగా మారటానికి ప్రేరణ ఎవరు?
4) మీరు “పద్మభూషణ్” బిరుదును పొందినపుడు మీరు ఎలా స్పందించారు?
5) సినీ గేయ రచయితగా మీకు నచ్చిన సినిమా పాట ఏది?
6) వేటూరిని గొప్ప సినీ గేయ రచయిత అంటారు కదా ! వారి రచనలపై మీ అభిప్రాయం ఏమిటి?
7) తెలుగులో పాండిత్యం రావాలంటే ఏమి చేయాలి?

VI. ప్రశంస

* చదువులో వెనకబడిన ఒక విద్యార్థి తనలో కలిగిన మార్పు వల్ల కొద్దికాలంలోనే గతంలో కన్నా మెరుగైన ఫలితాల: పొందాడు. అతనిలో వచ్చిన మార్పును గురించి తెలుపుతూ వాళ్ళ అమ్మానాన్నలకి ఉత్తరం రాయండి.
జవాబు:

లేఖ

ప్రొద్దుటూరు,
x x x x x x x x

పూజ్యులు, ఆనందరావు గారికి,

మీకు నమస్కారములు. నేను మీ అబ్బాయి సురేష్ సహ విద్యార్థిని. మేము కూడా ప్రొద్దుటూరు జి పరిషత్ ఉన్నత పాఠశాలలోనే చదువుతున్నాము. ఈ మధ్య మీ సురేష్ అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడ తరగతిలో శ్రద్ధగా పాఠాలు వింటున్నాడు. సాయంత్రం మాతో ఆటలు కూడా ఆడుతున్నాడు.

రాత్రివేళ హాస్టలులో 10 గంటల వరకూ చదువుతున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకే లేచి, 6 గంటల వరక చదువుతున్నాడు. ఏ రోజు ఇంటిపని ఆ రోజే పూర్తిచేస్తున్నాడు. రోజూ ఉదయం పండ్లరసం, సాయంత్రం హార్లి! తాగుతున్నాడు. అందువల్ల సురేష్ అలసిపోకుండా చదువుపై మంచి దృష్టి పెడుతున్నాడు. ప్రత్యేకంగా లెదులు, సామాన్యశాస్త్రములలో మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. సురేశ్, ప్రతిభకు కారణం అతను చూపే శ్రద్ధ, ఆహారపు .. అలవాట్లలో మార్పు, చదువుతో పాటు ఆటలపై చూపే ఆదరము అని నా అభిప్రాయం.

నా సహవిద్యార్థి, మీ అబ్బాయి సురేష్ కు మా తరగతి విద్యార్థుల తరఫున అభినందనలు. మీకు మా నమస్కారాలు. సెలవు.

ఇట్లు,
మీ విశ్వసనీయురాలు,
x x x x x x,
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ప్రొద్దుటూరు.

చిరునామా :
బి. ఆనందరావుగారు,
8/23-6, సంతబజార్,
శివాలయం వీధి,
బద్వేలు.

ప్రాజెక్టు పని

*ఆచార్య సి.నారాయణరెడ్డిగారి రచనలు, పాటల వివరాలను సేకరించి ఒక పట్టికను తయారుచేయండి. దాన్ని తరగతిలో చదివి వినిపించండి. ప్రదర్శించండి.
జవాబు:
రచనలు:

1) ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు – ప్రయోగములు 2) ‘విశ్వంభర’ (జ్ఞానపీఠ అవార్డు గెలుచుకుంది)
3) నాగార్జున సాగరం 4) కర్పూర వసంతరాయలు
5) మధ్యతరగతి మందహాసం 6) ప్రపంచపదులు
7) విశ్వనాథనాయకుడు 8) నారాయణరెడ్డి గేయాలు
9) దివ్వెల మువ్వలు 10) అజంతా సుందరి
11) రామప్ప 12) నవ్వని పువ్వు
13) వెన్నెలవాడ 14) ఋతుచిత్రం
15) స్వప్నభంగం 16) విశ్వగీతి
17) జలపాతం 18) సినీగేయాలు
19) జాతిరత్నం 20) తరతరాల వెలుగు (గేయ రూపకాలు)
21) అక్షరాల గవాక్షాలు 22) మంటలు – మానవుడు
23) ఉదయం నా హృదయం 24) మార్పు నా తీర్పు
25) ఇంటిపేరు చైతన్యం 26) రెక్కలు
27) నడక నా తల్లి 28) కాలం అంచుమీద
29) కవిత నా చిరునామా 30) కలం సాక్షిగా
31) భూమిక, మట్టీ – మనిషి (దీర్ఘ కావ్యాలు) 32) తెలుగు గజళ్ళు
33) వ్యాసవాహిని, సమీక్షణం 34) పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు (యాత్రా సాహిత్యం)
35) పాటలో ఏముంది – నా మాటలో ఏముంది (సినిమా పాటల విశ్లేషణ)

ఈ పాఠం ‘జీవన భాష్యం’ వలెనే సినారే గారి ‘ప్రపంచ పదులు’ కావ్యం కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి, మానవ జీవితానికి ఉపకరించే అమూల్యమైన సందేశాలను అందిస్తుంది.

ప్రపంచ పదులు

1. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది?
ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది?
నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి
ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది?
ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది?

2. చీకటికి చురకపెడుతుందిలే చిన్న మిణుగురు పురుగు
మొండివానను ఆపుతుందిలే రెండు మూరల గొడుగు
మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే
దూరాన్ని చెరిపివేస్తుందిలే బారుచీమల పరుగు
పాపాన్ని కడిగివేస్తుందిలే పాలనవ్వుల నురుగు

3. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది?
చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది?
ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా
మరగనిదే నీరు ఎలా మబ్బురూపు కడుతుంది?
నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది?

4. ఒక్క చినుకు చాలు మట్టి గుక్కను పలికించాలంటే
ఒక్క చెణుకు చాలు నవ్వు చుక్కలు మొలిపించాలంటే
ఊహల్లో గీసుకున్న వ్యూహాలకు విలువేముంది?
ఒక్క మెరుపు చాలు నింగి పక్కను దొరలించాలంటే
ఒక్క చరుపు చాలు పుడమి రెక్క ఎగిరించాలంటే

మరికొన్ని సినారె విరచిత గేయాలు :
1) “నా పేరు కవి
ఇంటి పేరు చైతన్యం
ఊరు సహజీవనం
తీరు సమభావనం.”

2) “నా వచనం బహువచనం
నా వాదం సామ్యవాదం
కవిత్వం నా మాతృభాష
ఇతివృత్తం మానవత్వం”

3) “ఊపిరాడడం లేదు
ఉక్కపోస్తుంది, ఎ.సీ గదిలో
కారణం తెలిసిపోయింది.
కవిత రాయలేదు ఇవాళ”.

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. క్వార్థకం
భాషాభాగాల్లో ఒకటైన ‘క్రియ’ను గురించి కింది తరగతుల్లో తెలుసుకున్నారు. క్రియలను బట్టి వచ్చే వాక్య భేదాలను కొన్నింటిని చూద్దాం.

కింది వాక్యం చదవండి.

భాస్కర్ ఆటలు ఆడి ఆలసిపోయి ఇంటికి వచ్చాడు.
భాస్కర్ – కర్త
వచ్చాడు – కర్తృవాచక పదానికి సంబంధించిన ప్రధాన క్రియ.
ఆడి, అలసి – కర్తృవాచక పదానికి సంబంధించిన ఇతర క్రియలు.
ఆడి, అలసిపోయి అనే పదాలు క్రియలే కానీ, వాటితో పూర్తిభావం తెలియడం లేదు.
‘ఆడి’ అనే క్రియకు ‘ఆడి’ తర్వాత ఏం చేశాడు ? ఏం జరిగింది ? అనే ప్రశ్న ఉదయిస్తోంది.
పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు. ఇంకా, జరిగిపోయిన విషయాన్ని అంటే భూతకాలంలోని పనిని సూచిస్తుంది.
‘ఆలసిపోయి’ అనే క్రియ కూడా అలాంటిదే.

వీటిని భూతకాలిక అసమాపక క్రియలని, క్వార్థం అనీ అంటారు.

ఈ క్రియలన్నీ కూడా ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే భూతకాలిక అసమాపక క్రియ అయి, చివర ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం క్వార్థక క్రియ అన్నమాట.

కొన్ని ఉదాహరణలు చూడండి. కింది వాక్యాల్లోని క్త్వార్థక క్రియలను గుర్తించండి.

1. రాముడు లంకకు వెళ్ళి, రావణునితో యుద్ధం చేసి, జయించి, సీతను తీసుకొని అయోధ్యకు వచ్చాడు.
2. పుష్ప అన్నం తిని, నిద్రపోయింది.

2. శత్రర్థకం
కింది వాక్యం చదవండి.

“అఖిలేశ్ మధుకరుడితో మాట్లాడుతూ నడుస్తున్నాడు”.
ఈ వాక్యంలో –
‘నడుస్తున్నాడు’ అనే ప్రధాన క్రియకు ‘మాట్లాడుతూ’ అనే ఉపక్రియ వర్తమానకాలంలో ఉండి అసమాపక క్రియను సూచిస్తున్నది.

ఈ విధంగా,
‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘-తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల, వర్తమానకాలిక అసమాపక క్రియగా మారుతున్నది. వర్తమానకాలిక అసమాపక క్రియను శత్రర్థకం’ అంటారు.

కింది వాక్యాలు చదవండి. వీటిలో ‘శత్రర్థకం’ పదాల కింద గీత గీయండి.

అ) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంటున్నది.
ఆ) సౌజన్య పడుతూ లేస్తూ సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నది.
ఇ) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.
ఈ) ఫల్గుణ్ పేపరు చదువుతూ టీ.వి చూస్తున్నాడు.
ఉ) సలీమా పాడుతూ నాట్యం చేస్తున్నది.

పైన తెలిపిన విధంగా మరికొన్ని వాక్యాలు రాయండి.

1. లత అన్నం తింటూ చదువుతున్నది.
2. రవి పాఠం వింటూ రాస్తున్నాడు.
3. అమ్మ వంట చేస్తూ పాటలు వింటున్నది.
4. పరీక్ష రాస్తూ, ఆలోచిస్తున్నాడు.

3. చేదర్థకం
కింది వాక్యం చదవండి.

“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుంది”.
కింది ప్రశ్నకున్న జవాబు గురించి ఆలోచించండి.
ప్ర|| ఫలితం దానంతటదే ఎప్పుడు వస్తుంది?
జవాబు:
కష్టపడి పనిచేస్తే –
కష్టపడడం – కారణం
ఫలితం – కార్యం

కార్యం ఫలించడానికి కారణం అవసరం. కార్యకారణ సంబంధ వాక్యమే చేదర్థక వాక్యం.

అంటే పై వాక్యం కార్యకారణ సంబంధాన్ని సూచిస్తున్నది. ఇలా కార్యకారణ సంబంధాలను సూచించే వాక్యాల్లో తే/ ఇతే| ఐతే/ అనే ప్రత్యయాలు చేరుతాయి. (ప్రాచీన వ్యాకరణం ప్రకారం ఇన / ఇనన్ అనే ప్రత్యయాలు). దీన్ని బట్టి వీటిని ‘చేత్’ అనే అర్థం ఇచ్చే ప్రత్యయాలు అని అంటాం. (ఇదే చేతే అనే ఇచ్చేవి)

సంక్లిష్ట వాక్యాల్లో చేత్ అనే ప్రత్యయం చేరి కార్యకారణ సంబంధం తెలిపే వాక్యాలను చేదర్థక వాక్యాలని అంటాం.

కింది వాక్యాలు పరిశీలించండి. చేదర్థక పదాల కింద గీత గీయండి.

అ) మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.
ఆ) జీవ వైవిధ్యాన్ని కాపాడితే ప్రకృతి సమతులితమవుతుంది.
ఇ) మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది.

1. కింది పదాలు విడదీసి, సంధుల పేర్లను పేర్కొనండి.
అ) బాల్యమంతా – బాల్యము + అంతా – ఉత్వసంధి
ఆ) దేవతలంతా = దేవతలు + అంతా – ఉత్వసంధి
ఇ) దారవుతుంది = దారి + అవుతుంది – ఇత్వసంధి
ఈ) విరిగినప్పుడు = విరిగిన + అప్పుడు – అత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. రూపకాలంకారం :
కింది వాక్యాన్ని చదవండి.
“ఆయన మాట కఠినమైనా మనసు వెన్న”.
పై వాక్యంలో
మనసు – ఉపమేయం (పోల్చబడేది)
వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనసు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది.

అంటే, వెన్నకు, మనసుకు భేదం లేదు. రెండూ ఒకటే (మెత్తనివే) అనే భావాన్ని ఇస్తున్నది.

ఇలా,
ఉపమానానికి ఉపమేయానికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడాన్ని “రూపకాలంకారం” అంటారు.
ఉదా :
(అ) లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లినారు.

సమన్వయం :
ఉపమానమైన లతలను, ఉపమేయమైన లలనలను, అట్లే ఉపమానమైన కుసుమములను, ఉపమేయమైన అక్షతలకు అభేదం తెలుపుతుంది. అందువల్ల ఇది రూపకాలంకారం.

(ఆ) మౌనిక తేనెపలుకులు అందరికీ ఇష్టమే.
సమన్వయం :
ఇక్కడ ఉపమానమైన తేనెకు, ఉపమేయమైన పలుకులకు అభేదం తెల్పబడింది. అందువల్ల ఇది రూపకాలంకారం.

3. కింది వాక్యాలను పరిశీలించండి. అలంకారాన్ని గుర్తించండి.
అ) మా అన్నచేసే వంట నలభీమపాకం.
అన్న చేసే వంట – ఉపమేయం (పోల్చబడేది)
నలభీమపాకం – ఉపమానం (పోల్చినది)

ఇక్కడ ‘అన్న చేసే వంట’ అనే ఉపమేయానికి, ‘నలభీమపాకం’ అనే ఉపమానానికి అభేదం చెప్పినందున రూపకాలంకారము.

ఆ) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం.
తండ్రి – ఉపమేయం (పోల్చబడేది)
హిమగిరి శిఖరం – ఉపమానం (పోల్చినది)

ఇక్కడ ఉపమేయమైన తండ్రికి, ఉపమానమైన హిమగిరి శిఖరానికి అభేదం చెప్పినందున రూపకాలంకారము.

ఇ) నందనందనుడు ఆనందంగా నర్తించెను.
ఈ వాక్యంలో నంద అనే హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగింపబడింది. అందునల్ల ఇది ఛేకానుప్రాసాలంకారం.

ఈ) నల్లపిల్లి మెల్లగా ఇల్లు చొచ్చి చల్లని పాలు తాగింది.
ఈ పై ఉదాహరణలో ‘ల్ల’ కారం పలుమార్లు ఆవృత్తం అయ్యింది. అందువల్ల ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

అడుగు : పాదము, చరణము
మనసు : చిత్తము, ఉల్లము, హృదయము
నేస్తము : మిత్రుడు, స్నేహితుడు
గిరి : పర్వతం, అది
కన్ను : చక్షువు, నయనం, అక్షి
హిమగిరి : హిమాలయం, శీతాద్రి, తుహినాద్రి
మనిషి : మానవుడు, నరుడు
దారి : బాట, మార్గము, పథము

వ్యుత్పత్తరాలు

పక్షి – పక్షములు గలది (పిట్ట)
ధరణి – విశ్వాన్ని ధరించునది (భూమి)
భూజము – భూమి నుండి పుట్టినది (చెట్టు)

నానార్థాలు

ఫలము – పండు, ప్రయోజనం
గుణం – స్వభావం, వింటినారి
కన్ను – నేత్రం, బండిచక్రం

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

సంధులు

అ) సంధి పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.

నీరవుతుంది = నీరు + అవుతుంది – ఉత్వసంధి
కన్నీరవుతుంది = కన్నీరు + అవుతుంది – ఉత్వసంధి
దారవుతుంది = దారి + అవుతుంది – ఉత్వసంధి
ఫలమేమి = ఫలము + ఏమి – ఉత్వసంధి
ఎత్తులకెగిరినా = ఎత్తులకు + ఎగిరినా – ఉత్వసంధి
విలువేమి = విలువ + ఏమి – ఉత్వసంధి

ఆ) సంధికార్యాలు.
అవ్వసంది
సూత్రం : అత్తునకు సంధి బహుళము.
విలువేమి = విలువ + ఏమి – అత్వసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
దారవుతుంది = దారి + అవుతుంది – ఇత్వసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
నీరవుతుంది = నీరు + అవుతుంది – ఉత్వసంధి
ఫలమేమి = ఫలము + ఏమి – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
ఇసుక గుండెలు ఇసుక యొక్క గుండెలు షష్ఠీ తత్పురుష సమాసం
కన్నీరు కంటి యొక్క నీరు షష్ఠీ తత్పురుష సమాసం
హిమగిరి శిరసు హిమగిరి యొక్క శిరసు షష్ఠీ తత్పురుష సమాసం
ఎడారి దిబ్బలు ఎడారి యందలి దిబ్బలు షష్ఠీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

హృదయం – ఎద, ఎడద
త్యాగం – చాగం
మనిషి – మనిసి
సుఖం – సుకం
నీరము – నీరు
మృగము – మెకము

కవి పరిచయం

కవి : ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి

జననం : 1931

స్థలం : కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామం.

నిర్వహించిన పదవులు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా ఉన్నారు.

రచనలు : నాగార్జునసాగరం, కర్పూరవసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంభర, ప్రపంచపదులు మొ॥న నలభైకి పైగా కావ్యాలు, అద్భుతమైన సినిమా పాటలు రాశారు. ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు’ అనే సిద్ధాంత గ్రంథం ! ప్రసిద్ధి పొందింది.

పురస్కారాలు : జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ’ అవార్డు, భారత ప్రభుత్వ ‘పద్మభూషణ్’ అవార్డు.

గజల్ పాదాలు – భావాలు

1, 2 పాదాలు :
మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది

భావం : నీటితో నింపుకున్న మబ్బులు తడితో బరువెక్కిపోతే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది. భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు అడుగులు

3, 4 పాదాలు:
వంకలు దొంకలు కలవని జడిపించకు నేస్తం
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.

భావం :
ఓ నేస్తమా ! మనం ఒక లక్ష్యాన్ని సాధించటానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు వేస్తే నీవు అనుకున్న విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తె నలుగురు అనుసరించే దారిగా మారుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

5, 6 పాదాలు :
ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది

భావం :
నేల అంతా బీటలు పడి, ఎందుకూ పనికి రాకుండా ఉన్నదని, ఏ పంటలూ పండవనీ, ఏ ప్రయత్నం చేయకుండానే నిరాశపడకూడదు. కష్టపడి శ్రమతో ఆ నేలనే దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

7, 8 పాదాలు :
మృగమూ ఒకటనే అనుకుంటే వ్యర్థం
మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది

భావం :
మనం మనిషీ, మృగమూ ఒకటి అని భావించ కూడదు. మృగం ఏ అరణ్య ప్రాంతంలోనైనా ఒంటరిగా నివసించగలదు. కానీ మనిషి అలాకాదు. నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించటమే ఉత్తమ సాంఘిక జీవనం అవుతుంది. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథం ఉండాలి. అప్పుడే అందరూ కలసిమెలసి ఆనందంగా జీవించ గలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

9, 10 పాదాలు :
ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష
హిమగిరి శిరసే మాడితే అది యేరవుతుంది

భావం :
మనం ఎంత సమర్థులం అయినా, అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా. ఇక మనకు ఎలాంటి కష్టాలూ, బాధలూ రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచ వలసిందే. ఉన్నతమైన హిమాలయ శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషికైనా గర్వం నీరు కారిపోవలసిందే.

11,12 పాదాలు :
బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి “సినారే”
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.

భావం :
మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపు లేదు. మానవాళికి మనిషీ పనికి వచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 7 హరిశ్చంద్రుడు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 7th Lesson హరిశ్చంద్రుడు

8th Class Telugu 7th Lesson హరిశ్చంద్రుడు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

బలి చక్రవర్తి గొప్పదాత. అతడు ఒకసారి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞవేదిక దగ్గర దానధర్మాలు చేస్తున్నాడు. వామనుడు దానం స్వీకరించడానికి వచ్చాడు.
బలి : ఏం కావాలి ?

వామనుడు : మూడడుగుల నేల.

బలి : తప్పక ఇస్తాను.

శుక్రాచార్యుడు : బలీ ! వద్దు ! వద్దు ! వచ్చినవాడు రాక్షసవిరోధి ! అతనికి దానం ఇస్తే నీకీ ప్రమాదం !

బలి : గురువర్యా ! నేను ఆడినమాట తప్పను. వామనా ! మూడడుగుల నేల గ్రహించు.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
బలిని దానం ఇవ్వవద్దని ఎవరన్నారు? ఎందుకన్నారు?
జవాబు:
బలిని దానం ఇవ్వవద్దని శుక్రాచార్యుడు అన్నాడు. వచ్చినవాడు రాక్షసవిరోధి కాబట్టి దానం ఇవ్వవద్దని చెప్పాడు.

ప్రశ్న 2.
దానం ఇస్తే ఎవరికి ప్రమాదం?
జవాబు:
దానం ఇస్తే బలి చక్రవర్తికి ప్రమాదం.

ప్రశ్న 3.
బలి చక్రవర్తి గొప్పదనం ఏమిటి?
జవాబు:
బలి చక్రవర్తి తాను ఆడినమాట తప్పను అని చెప్పాడు. తాను అన్న మాటకు కట్టుబడి మూడడుగుల నేలను వామనునికి ధారపోశాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

ప్రశ్న 4.
ఆడినమాట తప్పనివారి గురించి మీకు తెలుసా?
జవాబు:
బలి, శిబి చక్రవర్తి, హరిశ్చంద్రుడు మొదలగువారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

అ) హరిశ్చంద్రుని గొప్పదనం గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
హరిశ్చంద్రుడు అయోధ్య రాజధానిగా పాలించిన సూర్యవంశ చక్రవర్తి. సూర్యవంశానికి గొప్ప పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టినవాడు. గొప్పదాత. వివేకమే సంపదగా కలవాడు. మంచి కీర్తి వైభవాలు కలవాడు. ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. సముద్రమంత దయగలవాడు. సర్వశాస్త్రాలు తెలిసినవాడు. సత్యవాక్పరిపాలకుడు. ఆడినమాట తప్పనివాడు. వశిష్ఠుడు చెప్పినట్లు బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతము కుంగిపోయినా, ఆకాశం ఊడి కింద పడినా, సముద్రం ఎండినా, భూగోళం తలకిందులయినా హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు.

ఆ) ద్విపద రూపంలోని ఈ పాఠాన్ని లయబద్ధంగా రాగంతో పాడండి.
జవాబు:
విద్యార్థి కృత్యము

ఇ) సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
ఒకసారి దేవేంద్రుడు కొలువుదీర్చి “ముల్లోకాలలో బొంకనివారు ఎవరైనా ఉన్నారా ? ఇప్పుడు జీవించి ఉన్నవారిలో కానీ, గతకాలం వారిలో కానీ అసత్యమాడని వారున్నారా ? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారా ?” అని త్రికాలజ్ఞులైన మునీశ్వరులను అడిగాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. కొంతమంది విన్నా విననట్లు ఊరుకున్నారు. అప్పుడు వశిష్ఠుడు అటువంటి ఉత్తమ లక్షణాలు కలవాడు హరిశ్చంద్రుడని సభలో ప్రకటించాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుని గొప్పదనం, గుణగణాలను గురించి దేవేంద్రునితో ఇలా చెప్పాడు.

“దేవేంద్రా ! హరిశ్చంద్ర మహారాజు ఈ ప్రపంచంలో మహా పరాక్రమవంతుడు. షోడశమహాదానాలు చేసినవాడు. వినయ వివేకాలు గలవాడు. విద్యావంతుడు. కీర్తిశాలి. దయాసముద్రుడు. గాంభీర్యము గలవాడు. పుణ్యాత్ముడు. పండితులచే పొగడదగ్గవాడు. సర్వశాస్త్ర పండితుడు. శత్రుభయంకరుడు. షట్చక్రవర్తులలో పేరుపొందినవాడు. త్రిశంకుని పుత్రుడు. సత్యసంధుడు. సూర్యవంశీయుడు. అతడు ఆడి బొంకనివాడు. ఆదిశేషువు కూడా హరిశ్చంద్రుని గుణగణాలను కీర్తింపలేడు. అబద్ధం ఆయన నాలుక నుండి రాదు.

బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరువు కుంగినా, ఆకాశం ఊడి కింద పడినా, భూగోళం తలకిందైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రమహారాజు మాత్రం ఆడినమాట తప్పడు.”

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. కింది భావాలున్న ద్విపద పాదాలను పాఠంలో వెతికి రాయండి.

అ) హరిశ్చంద్రుడు వినయమే అలంకారంగా గలవాడు. వివేకం సంపదగా గలవాడు.
జవాబు:
వినయభూషణుఁడు వివేకసంపన్నుడు

ఆ) హరిశ్చంద్రుడు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంటాడు. నీతిగా పరిపాలన చేస్తాడు.
జవాబు:
నిత్యప్రసన్నుండు నీతిపాలకుడు.

ఇ) త్రిశంకుని కుమారుడు సత్యాన్నే పలికేవాడు.
జవాబు:
సత్యసంధుండు త్రిశంకునందనుఁడు

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది పద్యం చదవండి. భావంలో ఖాళీలు ఉన్నాయి. పూరించండి.
నుతజల పూరితంబులగు నూతులు నూటిటికంటె సూనృత
వ్రత! యొక బావివేలు, మరి బావులు నూటిటికంటె నొక్క స
త్క్రతువది మేలు, తత్రతు శతంబున కంటె సుతుండుమేలు, త
త్సుతశతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్

పై పద్యం శకుంతల దుష్యంతునితో చెప్పింది. సత్యవ్రతం యొక్క గొప్పదనాన్ని తెలిపే పద్యం ఇది.
భావం :
స్వచ్ఛమైన జలం ఉన్న నూరునూతులకన్నా ఒక …………….. మేలు. అలాంటి వందబావులకన్నా ఒక ……….. మేలు. అలాంటి వంద ………..ల కన్నా ఒక ………….. ఉండటం మేలు. అలాంటి వందమంది ……………… ఉండటం కన్నా ఒక ……….. మేలు.
జవాబు:
భావం :
స్వచ్ఛమైన జలం ఉన్న నూరునూతులకన్నా ఒక బావి మేలు. అలాంటి వందబావులకన్నా ఒక మంచియజ్ఞం మేలు. అలాంటి వంద మంచియజ్ఞముల కన్నా ఒక కుమారుడు ఉండటము మేలు. అలాంటి వందమంది కుమారులు ఉండటం కన్నా ఒక సత్యవాక్యం మేలు.

3. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.

అ) హరిశ్చంద్రుని గుణగణాలను కవి ఏ విధంగా వర్ణించాడు?
జవాబు:
హరిశ్చంద్రుడు సూర్యవంశస్థుడు. నీతిపాలకుడు. నిత్య ప్రసన్నుడు. మహా పరాక్రమవంతుడు. షోడశమహాదానాలు చేస్తూ ఆనందించేవాడు. వినయ వివేక సంపన్నుడు. కీర్తిమంతుడు. ధనుర్విద్యావేత్త. కరుణాపయోనిధి. గంభీరుడు. పుణ్యాత్ముడు. సర్వశాస్త్రాలసారం తెలిసినవాడు. పండితుల స్తోత్రములకు పాత్రుడు. శత్రుజన భయంకరుడు. షట్చక్రవర్తులలో ఒకడు. సత్యసంధుడు. త్రిశంకు మహారాజు యొక్క కుమారుడు. విజ్ఞాన నిధి. అబద్ధం ఎరుగనివాడు. రెండువేల నాలుకలు ఉన్న ఆదిశేషుడికి కూడా హరిశ్చంద్రుని గుణములను కీర్తించడం అసాధ్యము.

ఆ) హరిశ్చంద్రుని గొప్పతనం గురించి వశిష్ఠుడు ఎవరితో చెప్పాడు? ఎందుకు చెప్పాడు?
జవాబు:
ఒకసారి దేవేంద్రుడు కొలువుదీర్చి ఉన్న సమయంలో మూడులోకాలలో ఎవరైనా బొంకని వారున్నారా? ఇప్పుడు జీవించి ఉన్నవారిలో కాని, గతకాలం వారిలో కాని, అసత్యమాడని వారున్నారా? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారా? అని అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వశిష్ఠుడు దేవేంద్రునితో హరిశ్చంద్రుని గొప్పతనం గురించి చెప్పాడు.

ఇ) హరిశ్చంద్రునికి ఉన్న విశిష్టతలు ఏవి?
జవాబు:
హరిశ్చంద్రుడు సూర్యవంశుడైన త్రిశంకుని కుమారుడు. సూర్యవంశమనే పాలసముద్రంలో పుట్టిన చంద్రుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. రెండు వేల నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతడు సత్యస్వరూపుడు. బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలకిందులైనా హరిశ్చంద్రుడు మాత్రం ఆడినమాట తప్పడు- ఇవి అతనిలోని విశిష్టతలు.

ఈ) అసాధారణాలైనవి కూడా సంభవించవచ్చని కవి వేటిని పేర్కొన్నాడు? వీటిని ఏ సందర్భంలో పేర్కొన్నాడు?
జవాబు:
అసాధారణాలైనవి కూడా సంభవించవచ్చునని కవి ఈ కింది వాటిని పేర్కొన్నాడు.

బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం కింద ఊడిపడినా, భూగోళం తలకిందులైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్ర మహారాజు మాత్రం అబద్దమాడడని కవి చెప్పాడు.

ఎంతటి వైపరీత్యాలూ, అసాధారణాలు సంభవించినా హరిశ్చంద్రుడు అబద్ధమాడడని చెప్పే సందర్భంలో కవి వాటిని పేర్కొన్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

4. కింది వాక్యాలకు సమానార్థాన్నిచ్చే వాక్యాలు గుర్తించండి.

అ) హరిశ్చంద్రుడు వివేకసంపన్నుడు, వినయభూషణుడు.
i) హరిశ్చంద్రుడు కేవలం వివేకసంపన్నుడు.
ii) హరిశ్చంద్రుడు వినయభూషణుడే.
iii) హరిశ్చంద్రునికి వివేకసంపదకన్న వినయభూషణం అధికం.
iv) హరిశ్చంద్రునిలో వివేకసంపద, వినయభూషణం రెండూ సమానమే.
జవాబు:
iv) హరిశ్చంద్రునిలో వివేకసంపద, వినయభూషణం రెండూ సమానమే.

ఆ) మేరువు గ్రుంకినా, మిన్ను వ్రాలినా హరిశ్చంద్రుడు అసత్యం పలకడు.
i) మేరువు కుంగినా, ఆకాశం ఊడిపడ్డా హరిశ్చంద్రుడు అబద్దం ఆడడు.
ii) మేరువు కుంగి, మిన్ను వాలినా, సత్యం పలుకుతాడు హరిశ్చంద్రుడు.
iii) మేరువు కుంగినా, మిన్ను వాలకున్నా హరిశ్చంద్రుడు అబద్ధం ఆడడు.
iv) మేరువు కుంగినా మిన్ను వాలినా హరిశ్చంద్రుడు సత్యం పలకడు.
జవాబు:
i) మేరువు కుంగినా, ఆకాశం ఊడిపడ్డా హరిశ్చంద్రుడు అబద్దం ఆడడు.

III. స్వీయరచన

1) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “హరిశ్చంద్రుణ్ణి షోడశ మహాదాన వినోది” అని వశిష్ఠుడు ఎందుకు అన్నాడు?
జవాబు:
పదహారు రకాల దానాలను చేస్తూ ఆనందించేవాడు షోడశ మహాదాన వినోది. హరిశ్చంద్రునికి ఇతరులకు దానం చేయడం వినోదం అన్నమాట. గో-భూ-తిల-హిరణ్య-రత్న-కన్యా-దాసీ-శయ్యా-గృహ-అగ్రహార-రథ-గజ-అశ్వభాగ-మహిషీ దానాలను షోడశ మహాదానాలు అంటారు. హరిశ్చంద్రుడు ఎవరికైనా, ఏదైనా ఇస్తానంటే తప్పక ఇస్తాడనీ, ఆడినమాట తప్పడనీ, దానగుణం అన్నది ఆయనకు ఒక వినోదక్రీడ వంటిదనీ చెప్పడానికే వశిష్ఠుడు హరిశ్చంద్రుని “షోడశ మహాదాన వినోది” అని చెప్పాడు.

ఆ) హరిశ్చంద్రునిలో మిమ్మల్ని ఆకట్టుకునే అంశాలేవి?
జవాబు:
హరిశ్చంద్రునిలోని షోడశ మహాదాన వినోదిత్వం, వినయభూషణత్వం, వివేక సంపన్నత, అపారమైన కరుణ, మహాజ్ఞాని కావడం, ధనుర్వేద విద్యాధికత, ధర్మతత్పరత, సత్యసంధత, ప్రియభాషణ, నిత్యప్రసన్నత, నీతిపాలకత అనే గుణాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

ఇ) ‘హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు’ అని తెలుసుకున్నారు కదా ! ఆడినమాట తప్పనివారు ఎలా ఉంటారో రాయండి.
జవాబు:
ఆడిన మాట తప్పనివారు అంటే సత్యసంధులు. వారు ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడరు. సత్యవాక్యం గొప్పతనాన్ని వారు గుర్తించినవారు. భార్యను అమ్మవలసి వచ్చినా, తానే అమ్ముడుపోయినా హరిశ్చంద్రుడు అబద్ధమాడలేదు. వామనునికి మూడు అడుగుల నేల దానం చేస్తే బలిచక్రవర్తికే ప్రమాదం వస్తుంది అని ఆయన గురువు శుక్రుడు చెప్పినా బలి తాను అన్నమాటను తప్పలేదు. శిబి చక్రవర్తి తన శరీరంలోని మాంసాన్నే కోసి ఇచ్చి పావురాన్ని రక్షించాడు. ఆడినమాట తప్పనివారు బలి చక్రవర్తిలా, హరిశ్చంద్రునిలా, శిబిచక్రవర్తిలా ఉంటారు.

ఈ) ‘మిన్ను వ్రాలినా’ అని వశిష్ఠుడు హరిశ్చంద్రుని పరంగా ఉపయోగించాడు కదా ! ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?
జవాబు:
‘మిన్ను వ్రాలటం’ అంటే ఆకాశం వంగిపోవటం అని అర్థం. ఆకాశం వంగిపోవటం అనేది సృష్టిలో ఎప్పుడూ జరగనిది. అందువలన ఎన్నటికీ జరగని విషయం అని చెప్పే సందర్భంలో ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) ‘హరిశ్చంద్రుడు’ పాఠ్యభాగ సారాంశం సొంతమాటల్లో రాయండి.
(లేదా)
వశిష్ఠుడు వివరించిన ‘హరిశ్చంద్రుని సద్గుణాలేమిటో’ రాయండి.
(లేదా)
పర్వతాలు కుంగిన, ఆకాశం నేలమీద పడినా మాట తప్పనివాడైన హరిశ్చంద్రుడి గురించి కవి ఏ విధంగా వ్యక్తపరచారో రాయండి.
జవాబు:
దేవేంద్రుడు ఒక రోజు కొలువుదీర్చి ఉన్నాడు. ఆ సభలో వశిష్ఠ మహాముని హరిశ్చంద్రుని గుణగణాలను వర్ణించాడు.

“ఓ దేవేంద్రా! ఈ ప్రపంచంలో హరిశ్చంద్రుడు గొప్ప పరాక్రమవంతుడు. పదహారు రకాల దానాలు చేస్తూ వినోదిస్తూ ఉంటాడు. వినయం, వివేకం ఉన్నవాడు. గొప్ప కీర్తి, భాగ్యం కలవాడు. విలువిద్యా పండితుడు. దయాసముద్రుడు. పాపం చేయనివాడు. సర్వశాస్త్రార్థములు తెలిసినవాడు. మహాజ్ఞాని. శత్రుభయంకరుడు. షట్చక్రవర్తులలో మొదటివాడు. నీతిగలవాడు. త్రిశంకుని కుమారుడు. సూర్యవంశంలో పుట్టినవాడు. సత్యవాక్పరిపాలకుడు.

హరిశ్చంద్రుని గుణగణాలను ఆదిశేషుడు సైతం వర్ణించలేడు. హరిశ్చంద్రుడు సత్యసంధుడు. ఆయన పనులు ధర్మము. ఆయన మాట ప్రియము. బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పు వాలినా, మేరువు కుంగినా, భూమి తలకిందులయినా, ఆకాశం కిందపడినా, సముద్రాలు ఇంకినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు.” అని వశిష్ఠుడు చెప్పాడు.

ఆ) వివేక సంపన్నుడు, సత్యసంధుడు, విద్యాధికుడు, కరుణాపయోనిధి, విజ్ఞాననిధి అని హరిశ్చంద్రుణ్ణి కీర్తించారు కదా ! మన సమాజంలోని వ్యక్తులు అందరూ ఈ గుణాలతో ఉంటే ఈ సమాజం ఎలా ఉంటుందో ఊహించి రాయండి.
(లేదా)
సమాజంలో ఉన్న అందరూ హరిశ్చంద్రుడిలా ఉంటే మన సమాజం ఎలా ఉంటుందో ఊహించి రాయండి.
జవాబు:
సమాజం. అంటే ‘సంఘం’. మన సంఘంలో హరిశ్చంద్రుని వంటి గుణగణాలు గల వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారు. అందరూ హరిశ్చంద్రునిలా వివేకం కలిగి ఉండి, నిజమే మాట్లాడుతూ, దయ గలిగి, అందరూ విద్యావిజ్ఞానములు కలిగి ఉంటే చాలా బాగుంటుంది. అందరూ వివేకం గలవారు కాబట్టి తగవులూ, యుద్ధాలూ ఉండవు. అధర్మ ప్రవర్తనలూ, వాటికి శిక్షలూ, కోర్టులూ ఉండవు. అందరూ చదువుకున్నవారే కాబట్టి ప్రజలు సంస్కారం కలిగి న్యాయధర్మాలతో ఉంటారు.

మళ్ళీ కృతయుగం వచ్చినట్లు అవుతుంది. మనం అంతా స్వర్గంలో ఉన్నట్లు ఉంటుంది. అటువంటి మంచి కాలం రావాలని అందరూ కోరుకోవాలి. అందరూ హరిశ్చంద్రునివంటి గుణాలు గలవారు అయితే విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు అకారణంగా వారిని హింసించే ప్రమాదం లేకపోలేదు. కానీ చివరకు న్యాయం, ధర్మం జయిస్తాయి.

IV. పదజాలం

1. కింది పట్టికను పరిశీలించండి. అందులో హరిశ్చంద్రుని గుణగణాలకు సంబంధించిన పదాలున్నాయి. అయితే . ఒక్కొక్క పదం రెండుగా విడిపోయింది. వాటిని కలిపి రాయండి. ఆ పదాల ఆధారంగా సొంతవాక్యాలు రాయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు 1

ఉదా : నీతినిధి – నీతికి నిధియైన సర్పంచ్ వల్ల గ్రామానికి మేలు జరుగుతుంది.
జవాబు:
పై పట్టికలోని పదాలు ఇవి :

  1. భాగ్యశాలి
  2. విజ్ఞాన నిధి
  3. బొంకనివాడు
  4. శరధిచంద్రుడు
  5. వినయభూషణుడు
  6. వివేక సంపన్నుడు
  7. కరుణాపయోనిధి
  8. నీతిపాలకుడు
  9. దాన వినోది
  10. సత్యసంధుడు

వాక్యప్రయోగములు:

1) భాగ్యశాలి : దానధర్మములు చేస్తే భాగ్యశాలి కీర్తి మరింత వృద్ధి అవుతుంది.

2) విజ్ఞాన నిధి : అబ్దుల్ కలాం గొప్ప ‘విజ్ఞాన నిధి’.

3) బొంకనివాడు : ప్రాణం పోయినా బొంకనివాడే యోగ్యుడు.

4) శరధిచంద్రుడు : శ్రీరాముడు సూర్యవంశ శరథి చంద్రుడు.

5) వినయభూషణుడు : ధర్మరాజు చక్రవర్తులలో వినయ భూషణుడు.

6) వివేక సంపన్నుడు : ఎంత విజ్ఞానం ఉన్నా వివేక సంపన్నుడు అయి ఉండాలి.

7) కరుణాపయోనిధి : శ్రీరాముడిని ‘కరుణాపయోనిధి’ అని రామదాసు కీర్తించాడు.

8) నీతిపాలకుడు : నీతిపాలకుడైన రాజు కీర్తి విస్తరిస్తుంది.

9) దాన వినోది : కర్ణుడు దానవినోదిగా పేరుపొందాడు.

10) సత్యసంధుడు : శిబి చక్రవర్తి సత్యసంధుడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

2. కింది పదాలు చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాక్యంలో ప్రయోగించండి.

అ) అడవికి కంఠీరవం రాజు.
జవాబు:
కంఠీరవం = సింహము
వాక్యం :
మృగరాజు అయిన కంఠీరవం మిగిలిన జంతువులు చేసిన ప్రతిపాదనకు అంగీకరించింది.

ఆ) త్రిశంకు నందనుడు హరిశ్చంద్రుడు.
జవాబు:
నందనుడు = కుమారుడు
వాక్యం :
శ్రీరాముడు దశరథ నందనుడు.

ఇ) ఆంజనేయుడు శరధి దాటాడు.
జవాబు:
శరధి = సముద్రము
వాక్యం :
శ్రీరాముడు వానరుల సాయంతో శరధిపై సేతువు నిర్మించాడు.

ఈ) దేవతలకు రాజు సురేంద్రుడు.
జవాబు:
సురేంద్రుడు = దేవేంద్రుడు
వాక్యం :
గౌతముడు సురేంద్రుని శపించాడు.

ఉ) భానుడు ప్రపంచానికి వెలుగును, వేడిని ఇస్తున్నాడు.
జవాబు:
భానుడు = సూర్యుడు
వాక్యం :
భానుడు నిత్యము తూర్పున ఉదయిస్తాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3. కింది వాక్యాలు పరిశీలించండి. పర్యాయపదాలతో ఇలాంటి వాక్యాలు రాయండి.

అ) భానుకిరణాలు చీకట్లు పోగొడతాయి. ఆదిత్యుడు వెలుగుతో పాటు వేడిమినిస్తాడు. రవి మొక్కలకూ, జంతువులకూ ప్రాణాధారం. సూర్యుడు లేకపోతే ఈ సమస్తజీవులు ఉండవు.
జవాబు:
భానుడు – ఆదిత్యుడు, రవి, సూర్యుడు

ఆ) వానరులు లంకను చేరడానికి సముద్రాన్ని దాటాలి. ఇందుకోసం ఆ శరధి పై వారధి కట్టాలి. దీనికి నలుణ్ణి వినియోగించారు. నలుని నేతృత్వంలో వానరవీరుల సహాయంతో. అంబుధిపై వారధి తయారయింది. శ్రీరాముని వెంట వానరులు కడలి దాటి వెళ్ళారు. సంద్రంలో ఆ వారధి ఈనాటికీ కనిపిస్తుంది.
జవాబు:
సముద్రం – శరధి, అంబుధి, కడలి, సంద్రం

పై వాక్యాలను పోలిన మరికొన్ని వాక్యాలు :
జవాబు:
1) తల్లిదండ్రులు తమకు కొడుకు పుట్టినప్పుడు సంతోషిస్తారు. ‘పుత్రుడు‘ పున్నామ నరకం పోగొడతాడని, వృద్ధాప్యంలో సుతుడు ఆదుకుంటాడనీ అనుకుంటారు. కానీ ఈనాడు తనయుడు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. కుమారుడు తన భార్య చుట్టూ తిరుగుతున్నాడు.

2) నీవు కుక్కను పెంచుతావు. నాకు జాగిలము అంటే ఇష్టము కాదు. మా ఇంట్లో వెనుక శునకము ఉండేది. ఆ శ్వానము బిస్కట్లు తినేదికాదు.

3) నేను ఈశ్వరుడు అంటే ఇష్టపడతాను. మహేశ్వరుడు దయగలవాడు. శివుడు పార్వతిని పెళ్ళాడాడు. పార్వతికి కూడా శంకరుడు అంటే మక్కువ ఎక్కువ. ఈశ్వరుడు చంద్రశేఖరుడు. ఆయన త్రిలోచనుడు. గంగను ధరించి గంగాధరుడు అయ్యాడు.

4) ఈ రోజు మన ఉపాధ్యాయుడు రాడు. మన గురువు నగరానికి వెళ్ళాడు. మన అధ్యాపకుడు రేపు రావచ్చు. ఒజ్జ పాఠం విననిదే నాకు నిద్ర పట్టదు.

V. సృజనాత్మకత

* మహాభాగ్యశాలి, ధనుర్వేద విద్యాధికుడు, సర్వశాస్త్రార్థ కోవిదుడు, నీతిపాలకుడు, ధర్మపరాయణుడు, మహా సత్యవంతుడు అయిన హరిశ్చంద్రుని పాత్రకు ఏకపాత్రాభినయం తయారుచేయండి. ప్రదర్శించండి.
జవాబు:
ఏకపాత్రాభినయం

హరిశ్చంద్రుడు :
అయ్యో ! హతవిధీ ! ఎంత కష్టము ! ఆడినమాట తప్పనివాడనే ! అయోధ్యాపతినే ! త్రిశంకునందనుడినే! ధర్మమూ, సత్యమూ నాలుగు పాదాలా నడిపిస్తూ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నందుకా ఇంత కష్టము ! దైవమా! నీ లీలలు ఎవరికీ అర్థం కావు కదా !

(భార్యను అమ్మడానికి వేలం పెడుతూ)
అయ్యలారా ! ఈ దౌర్భాగ్యుడు హరిశ్చంద్రుడు, భార్యను అమ్ముకుంటున్నాడు. క్షమించండి. ఈమె పరమ పతివ్రతా శిరోమణి. ఎండ కన్నెరుగని ఇల్లాలు. ఆడి తప్పని హరిశ్చంద్ర మహారాజు భార్య. అయోధ్యా నగర చక్రవర్తి హరిశ్చంద్రుని సతీమణి. పూజ్య విశ్వామిత్రులకు బాకీపడిన సొమ్ముకై ఈ చంద్రమతిని వేలానికి పెడుతున్నా. కన్న తండ్రులారా ! ఈ అసూర్యం పశ్యను, మీ సొంతం చేసుకోండి.

(భార్యను అమ్మాడు. కాటికాపరిగా మారాడు)
అయ్యో ! చివరకు హరిశ్చంద్రుడు కాటికాపరి అయ్యాడు. ఎంత దౌర్భాగ్యము ? షోడశ మహాదానములు చేసిన చేయి. మహాపరాక్రమంతో శత్రువులను చీల్చి చెండాడిన చేతులివి – నేను దశదిశలా మారుమ్రోగిన కీర్తికెక్కిన చరిత్ర కలవాడిని. ధనుర్వేద పండితుడిని. పండిత స్తోత్రపాఠములు అందుకున్నవాడిని. షట్చక్రవర్తులలో గొప్పవాడిగా కీర్తికెక్కిన వాడిని. ఏమి నాకీ దుర్గతి ! హతవిధీ ! ఏమయ్యా ! నీ లీలలు !

ఏమైన నేమి ? ఈ హరిశ్చంద్రుడు ఆడినమాట తప్పడు. బ్రహ్మ తలరాత తప్పుగాక ! ఆ సూర్యుడు తూర్పున అస్తమించుగాక ! మేరువే నేల కుంగిన కుంగుగాక ! ఆకాశం ఊడిపడుగాక ! భూమి తలక్రిందులగు గాక ! సప్త సముద్రములూ ఇంకుగాక ! నక్షత్రములు నేల రాలు గాక ! ఆడను గాక ఆడను. అబద్ధమాడను. దైవమా ! త్రికరణ
శుద్ధిగా నేను చెపుతున్న మాట ఇది. (కింద కూలి పడతాడు)

(లేదా)

* హరిశ్చంద్రుని గుణగణాలను తెలిపే విశేషణాలను తెలుసుకున్నారు కదా ! ఇలాంటి విశేషణాలను ఉపయోగించి ఎవరైనా ఒక గొప్ప నాయకుడి గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
(అటల్ బిహారీ వాజపేయి)
మన మాజీ భారత ప్రధానులలో “వాజపేయి” భారతీయ జనతా పార్టీ ప్రాభవానికీ, దేశ సౌభాగ్యానికి కృషి చేసిన మహోన్నతుడు. ఈయన నిత్య ప్రసన్నుడు. ముఖాన చెరగని చిరునవ్వు ఈయనకు అలంకారము. ఈయన నీతిపాలకుడు. నిరుపమ విజ్ఞాన నిధి. మహాకవి. అతులసత్కీర్తి. దురిత దూరుడు. బుధస్తోత్ర పాత్రుడు.

గొప్ప రాజకీయవేత్త. ఆడి తప్పనివాడు. అన్యాయాన్నీ, దుర్మార్గాన్ని సహింపనివాడు కళంక రహితుడు. వినయ భూషణుడు. వివేక సంపన్నుడు. భారతదేశ కీర్తిని దశదిశలా చాటిన మహోన్నత గుణశీలుడు.

ఈయన విద్యాధికుడు. సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు. విశ్వనాయకులలో వినుతి కెక్కినవాడు. ఇతడు కరుణాపయోనిధి. గాంభీర్యఘనుడు. సత్యసంధుడు. ఆడి తప్పని నాయకుడు. ఈయన తనువెల్లా సత్యము. ఈయన తలపెల్లా కరుణ. ఈయన పలుకెల్లా ప్రియము. ఈయన పనులెల్లా ధర్మము.

మన దేశ ప్రధానులలో చెరిగిపోని, వాడిపోని, సత్కీర్తిని సంపాదించిన న్యాయ ధర్మవేత్త ఈయనయే.

VI. ప్రశంస

* ఆడినమాట తప్పకుండా తను చేస్తున్న వృత్తిలో నిజాయితీపరులైన వారివల్ల ప్రజలకు కలిగే మేలును ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి.
జవాబు:

రాజమహేంద్రవరం,
x x x x x x x

పత్రికా సంపాదకులు,
సాక్షి,
లబ్బీపేట,
విజయవాడ.
ఆర్యా,
విషయం : ప్రజల మేలు కోరే వారి పట్ల ప్రశంస.

నమస్కారములు.
నేను ఇటీవల కాలంలో కొంతమంది నిజాయితీపరులైన నాయకులను చూశాను. వారు ప్రజలకు తమవంతు సాయం చేస్తున్నారు. ప్రజలు వారి వద్ద తమ సమస్యలను విన్నవించుకుంటారు. నాయకులు వెంటనే పరిష్కరిస్తామని మాట ఇస్తున్నారు. అలాగే నిజాయితీగా, ధర్మబద్ధంగా ఆ పనులను చేస్తున్నారు. అదే విధంగా దేశంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఇలాగే స్పందించి అందరికీ సహాయ సహకారాలు అందిస్తే దేశం బాగుపడుతుందని భావిస్తున్నాను. ఆడినమాట తప్పకుండా వృత్తిలో నిజాయితీపరులైన వారికి ఈ పత్రికా ముఖంగా అభినందనలను తెలుపకోరుచున్నాను.

మీ విశ్వసనీయుడు,
xxxxxx,
8వ తరగతి,
టాగూర్ ఉన్నత పాఠశాల,
రాజమహేంద్రవరం.
తూ.గో. జిల్లా.

చిరునామా :
సంపాదకులు,
సాక్షి, దిన పత్రిక,
లబ్బీపేట,
విజయవాడ.

VII. ప్రాజెక్టు పని

* సత్యం గొప్పతనం తెలుసుకున్నారు కదా ! సత్యాన్ని తెలిపే కథలను, పద్యాలను సేకరించండి. మీ పాఠశాలలో ప్రదర్శించండి.
జవాబు:
కథ :
( సత్యమేవ జయతే)
ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కలహించుకోకుండా, యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది.

ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైనది. అది గమనించిన ఆవు భయపడక “పులిరాజా ! కొంచెం ఆగు. నేను చెప్పే మాటలు విను ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేతదూడ పుట్టి రెండు వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు” అన్నది దీనంగా ఆవు.

ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి “ఆహా ! ఏమి, మాయమాటలు. ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా ? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనకు నేం వెర్రిబాగుల నుంచి అనుమతులు అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికే చాసను కాను. ఒక చచ్చి తను కు బయలు ! ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలి గొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే గదా ! ఉపకారం చేసిన దానినవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి, ఆకలి తీర్చి రావాలని నా ఆశ” అన్నది ఆవు.

ఈ ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకొందామని ‘సరే’ అన్నది పులి. ఆవు ఇంటికిపోయి దూడకు కడుపునిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ “నాయనా ! బుద్ధిమంతురాలుగా మంచితనంతో జీవించు. తోటి వారితో స్నేహంగా ఉండు. ఎట్టి పరిస్థితులలోను అబద్దాలాడకు. మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో” అని బిడ్డకు. మంచిబుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవుని చూసిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది ! దీనిని చంపితే తనకే పాపం అనుకొని ఆవును వదిలివేసింది పులి.

నీతి : ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.

పద్యాలు :

1. అసువినాశమైన నానంద సుఖకేళి
సత్యనిష్ఠవరుని సంతరించు
సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు
విశ్వదాభిరామ ! వినురవేమ !

2. రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించురాజుఁ గొల్వకు
పాపపుదేశంబు సొరకు, పదిలము సుమతీ !

3. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద
సమధి గమము, సత్యంబుతో సరియుఁగావు
ఎఱుగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు
భారత – ఆది – 4 ఆ. 96 ప.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

(లేదా)

*హరిశ్చంద్రుని కథను చదివి అతని గొప్పతనాన్ని వర్ణించే వాక్యాలను చార్ట్ పై రాసి ప్రదర్శించండి.
జవాబు:
హరిశ్చంద్రుడు గుణగణాలు
హరిశ్చంద్రుడు – మహావిక్రమోన్నతుడు
హరిశ్చంద్రుడు – షోడశమహాదాన వినోది
హరిశ్చంద్రుడు – సత్యసంధుడు
హరిశ్చంద్రుడు – వినయ వివేక సంపన్నుడు
హరిశ్చంద్రుడు – సత్కీర్తి మహాభాగ్యశాలి
హరిశ్చంద్రుడు – ధనుర్వేద విద్యావిశారదుడు
హరిశ్చంద్రుడు – గాంభీర్యఘనుడు
హరిశ్చంద్రుడు – కరుణాపయోనిధి
హరిశ్చంద్రుడు – సర్వశాస్త్రార్థ విచారకోవిదుడు
హరిశ్చంద్రుడు – షట్చక్రవర్తులలో మేటి
హరిశ్చంద్రుడు – నిరుపమ విజ్ఞాన నిధి
హరిశ్చంద్రుడు – గుణగణాలను ఆదిశేషుడు సైతం, ప్రశంసింపలేడు
హరిశ్చంద్రుడు – ఆడి తప్పనివాడు
హరిశ్చంద్రుడు – మేరువు క్రుంగినా, ధారుణి తలక్రిందయినా మాట తప్పని మహారాజు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది వాటిని పూరించండి.

సంధిపదం విసంధి సంధి పేరు
అ) అన్నదమ్ములు అన్న + తమ్ముడు + లు గసడదవాదేశ సంధి
ఆ) గుణములు వొగడ గుణములు + పొగడ గసడదవాదేశ సంధి
ఇ) విద్యాధికుడు విద్య + అధికుడు సవర్ణదీర్ఘ సంధి
ఈ) సురేంద్ర సుర + ఇంద్ర గుణసంధి
ఉ) తలపెల్ల తలపు + ఎల్ల గుణసంధి
ఊ) నల్ల గలువ నల్ల + కలువ గసడదవాదేశ సంధి
ఋ) వీడుదడి వీడు + తడిసె గసడదవాదేశ సంధి
ఋ) కొలుసేతులు కాలు + చేయి + లు గసడదవాదేశ సంధి

2) కింది పేరాలోని సంధి పదాలను గుర్తించి అవి ఏ సంధులో రాయండి.

విద్యార్థులందరూ ఆడుకుంటూండగా ఎగురుతున్న పక్షి కింద పడింది. ఆ పక్కనే ఉన్న వాళ్ళంతా దానివైపు పరుగెత్తారు. కాని పురుషోత్తముడనే పిల్లవాడు నీళ్ళు తీసుకువెళ్ళి ఆ పక్షి పైన చల్లాడు. అది తేరుకొని లేచి పైకెగిరి వెళ్ళింది. అందరూ అతన్ని మెచ్చుకున్నారు.
పై పేరాలోని సంధులు :
విద్యార్థులు = విద్య + అర్థులు – సవర్ణదీర్ఘ సంధి
వాళ్ళంతా = వాళ్ళు + అంతా – ఉకారసంధి
పురుషోత్తముడు = పురుష + ఉత్తముడు – గుణసంధి
పైకెగిరి = పైకి + ఎగిరి – ఇత్వసంధి
విద్యార్థులందరూ = విద్యార్థులు + అందరూ – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3) అలంకారాలు :
అ) వృత్త్యనుప్రాసాలంకారం :
అలంకారాలు ప్రధానంగా రెండు రకాలు.
1) అర్థాలంకారాలు
2) శబ్దాలంకారాలు

ఉపమాది అలంకారాలు అర్థాలంకారాలు. వీటి గురించి కింది తరగతులలో తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు కొన్ని శబ్దాలంకారాలను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలను చదవండి.
1) “ఆమె కవతో వడిడి అడుగులతో గపను దాటింది”.
2) “చి చినుకులు పమని పడుతున్న వేళ”

మొదటి వాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ట’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి.
ఈ విధంగా

ఒక హల్లును మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తే వినసొంపుగా ఉంటుంది. శబ్దం ద్వారా సౌందర్యం ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఈ విధంగా శబ్దానికి ప్రాముఖ్యం ఇచ్చే అలంకారాలలో వృత్త్యనుప్రాసాలంకారం ఒకటి.

మరికొన్ని ఉదాహరణలు చూడండి.
అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకెళ్ళాడు.
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్షభక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా!

ఒక హల్లుగాని, రెండు, మూడు హల్లులు గాని, వేరుగా నైనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని “వ్యత్యనుప్రాస అలంకారం” అంటారు. “ప్రతిజ్ఞ” పాఠం చదవండి. వృత్త్యనుప్రాస అలంకారానికి చెందిన పదాలు/ వాక్యాలు గుర్తించండి.
జవాబు:
‘ప్రతిజ్ఞ’ పాఠంలోని వృత్త్యనుప్రాసాలంకారానికి చెందిన పదాలు / వాక్యాలు :

  1. పొలాల నన్నీ హలాల దున్నీ ఇలా తలంలో
  2. హేమం పిండగ – సౌఖ్యం నిండగ
  3. ఘర్మజలానికి, ధర్మజలానికి
  4. నిలో వనిలో కార్యానాలో
  5. నా వినిపించే నా విరుతించే నా వినిపించే నా విరచించే
  6. త్రిలోకాలలో త్రికాలాలలో
  7. బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ
  8. విలాపాగ్నులకు విషాదాశ్రులకు
  9. పరిష్కరించే, బహిష్కరించే – మొ||వి.

ఆ) ఛేకానుప్రాసాలంకారం :
కింది వాక్యం చదవండి.
నీకు వంద వందనాలు

పై వాక్యంలో ‘వంద’ అనే హల్లుల జంట వెంటవెంటనే అర్థభేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ సంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’నాలు – నమస్కారాలు అనే అర్థాన్నిస్తుంది. ఈ విధంగా – హల్లుల జంట అర్థభేదంతో వెంటవెంటనే వస్తే దానిని ‘ఛేకానుప్రాస అలంకారం’ అంటారు. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు రాయండి.
జవాబు:

  1. పాప సంహరుడు “హరుడు”
  2. మహాహీ భరము
  3. కందర్పదర్పము
  4. కానఁగాననమున ఘనము ఘనము

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

వారిధి : సముద్రం, అంబుధి, ఉదధి
భానుడు : సూర్యుడు, రవి, ప్రభాకరుడు\
ఘనము : మేఘము, పయోధరం
గిరి : పర్వతం, కొండ, అది
జిహ్వ : నాలుక, రసన, కకుత్తు
మిన్ను : ఆకాశం, గగనము, నభము
నందనుడు : కుమారుడు, పుత్రుడు, ఆత్మజుడు
కంఠీరవం : సింహం, కేసరి, పంచాస్యం
సురలు : దేవతలు, అనిమిషులు, నిర్జరులు
ధరణి : భూమి, వసుధ, అవని
బొంకు : అబద్దం, అసత్యం
రాజు : నృపతి, నరపతి, క్షితిపతి
నుతి : పొగడ్త, స్తోత్రము, స్తుతి
వారిజగర్భుడు : బ్రహ్మ, విధాత, విరించి

వ్యుత్పత్యర్థాలు

భానుడు – కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
వారిజగర్భుడు – పద్మము గర్భముగా కలవాడు (బ్రహ్మ)
వారిజము – నీటి నుండి పుట్టినది (పద్మం)
నందనుడు – సంతోషమును కలుగజేయువాడు (కుమారుడు)
ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
శరధి – శరములకు (నీళ్ళకు) నిధి (సముద్రం)
రాజు – రంజింపచేయువాడు (నరపతి)
కంఠీరవం – కంఠంలో ధ్వని కలది (సింహం)

నానార్థాలు

రాజు = ప్రభువు, చంద్రుడు
బుద్ధుడు = పండితుడు, బుధగ్రహం, వేల్పు, వృద్ధుడు
గుణము = స్వభావం, దారము, వింటినారి
పాకం = వంట, పంట, కార్యపాకాలు
జిహ్వ = నాలుక, వాక్కు జ్వాల
నందనుడు = కొడుకు, సంతోష పెట్టువాడు
ధర్మం = పుణ్యం, న్యాయం, ఆచారం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.
విద్యాధికుండు = విద్యా + అధికుండు – సవర్ణదీర్ఘ సంధి
శాస్త్రార్థం = శాస్త్ర + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
వారిజాప్తుడు = వారిజ + ఆప్తుడు – సవర్ణదీర్ఘ సంధి
వజ్రాయుధంబు = వజ్ర + ఆయుధంబు – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైన వానికి క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.
సురేంద్ర = సుర + ఇంద్ర – గుణసంధి
విక్రమోన్నతుడు = విక్రమ + ఉన్నతుడు – గుణసంధి
దేవేంద్ర = దేవ + ఇంద్ర – గుణసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
వానికైన = వానికిన్ + ఐన – ఇత్వసంధి
వినుతికెక్కిన = వినుతికిన్ + ఎక్కిన – ఇత్వసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
తరమిడి = తరము + ఇడి – ఉత్వసంధి
తనువెల్ల = తనువు + ఎల్ల – ఉత్వసంధి
తలపెల్ల = తలపు + ఎల్ల – ఉత్వసంధి
మున్నెన్నన్ = మున్ను + ఎన్నన్ – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పురుషములకు గసడదవలు బహుళంబుగానుగు.
ధారదప్పిన = ధార + తప్పిన – గసడదవాదేశ సంధి
కాలుసేతులు = కాలు + చేతులు – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
మహాదానం గొప్పదైన దానం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాభాగ్యం గొప్పదైన భాగ్యం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విద్యధికుండు విద్యచేత అధికుండు తృతీయా తత్పురుష సమాసం
వినయభూషణుడు వినయము చేత భూషణుడు తృతీయా తత్పురుష సమాసం
వివేక సంపన్నుడు వివేకము చేత సంపన్నుడు తృతీయా తత్పురుష సమాసం
బుధస్తోత్ర పాత్రుండు బుధస్తోత్రమునకు పాత్రుండు షష్ఠీ తత్పురుష సమాసం
శాస్త్రార్థము శాస్త్రముల యొక్క అర్థము షష్ఠీ తత్పురుష సమాసం
భానువంశం భానువు యొక్క వంశం షష్ఠీ తత్పురుష సమాసం
విజ్ఞాననిధి విజ్ఞానమునకు నిధి షష్ఠీ తత్పురుష సమాసం
రెండువేల నాల్కలు రెండు వేల సంఖ్య గల నాలుకలు ద్విగు సమాసం
సత్కీర్తి గొప్పదైన కీర్తి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విచారకోవిదుడు విచారమునందు కోవిదుడు సప్తమీ తత్పురుష సమాసం
వారిజగర్భుడు వారిజము గర్భము నందు కలవాడు బహున్రీహి సమాసం
రిపుగజము రిపువు అనే గజము రూపక సమాసం
వారిజాప్తుడు వారిజములకు ఆప్తుడు షష్ఠీ తత్పురుష సమాసం
దేవేంద్రుడు దేవతలకు ఇంద్రుడు షష్ఠీ తత్పురుష సమాసం
దురితదూరుడు దురితములను దూరం చేయువాడు తృతీయా తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

నిత్యము – నిచ్చలు
వంశము – వంగడము
అద్భుతము – అబ్బురము
విజ్ఞానము – విన్నానము
సత్యము – సత్తు
భాగ్యము – బాగేము
రాట్టు – ఱేడు
గుణము – గొనము
విద్య – విద్దె / విద్దియ
గర్వము – గరువము
శాస్త్రము – చట్టము
కీర్తి – కీరితి

కవి పరిచయం

పాఠము : ‘హరిశ్చంద్రుడు’

కవి : గౌరన

నివాసస్థలం : నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం

దేని నుండి గ్రహించబడింది : గౌరన కవి రచించిన “హరిశ్చంద్రోపాఖ్యానం” అనే ద్విపద కావ్యం నుండి గ్రహించబడింది.

కవి కాలము : 15వ శతాబ్దానికి చెందినవాడు.

రచనలు :
1) హరిశ్చంద్రోపాఖ్యానం
2) నవనాథ చరిత్ర
3) సంస్కృతంలో ‘లక్షణ దీపిక’ రచించాడు.

బిరుదు :
సరస సాహిత్య విచక్షణుడు.

రచనాశైలి : మనోహరమైనది. సామెతలు, జాతీయాలతో కవిత్వం అలరారుతుంది. అచ్చతెలుగు పలుకుబళ్ళు కవిత్వం నిండా రసగుళికల్లా జాలువారుతాయి. పదప్రయోగాలలో నైపుణ్యం అడుగడుగునా కనబడుతుంది.

ద్విపద పద్యాలు – ప్రతి పదార్థాలు-భావాలు

1-2 పంక్తులు
నిరుపమ విజ్ఞాననిధి వశిష్ఠుండు
పురుహూతు తోడ నద్భుతముగాఁ బలికె
ప్రతిపదార్ధం :
నిరుపమ విజ్ఞాననిధి; నిరుపమ = సాటిలేని
విజ్ఞాన = విజ్ఞానానికి
నిధి = పాతర (ఆశ్రయమైన) ;
వశిష్ఠుండు = వశిష్ఠ మహర్షి
పురుహూతుతోడన్ = దేవేంద్రునితో (పెక్కు మందిచే పిలువబడువాడు పురుహూతుడు)
అద్భుతముగాన్ = ఆశ్చర్యకరముగా (వింతగా)
పలికెన్ = ఇలా చెప్పాడు

భావం :
సాటిలేని విజ్ఞాన నిధియైన వశిష్ఠ మహర్షి, ఆశ్చర్యం కలిగే విధంగా దేవేంద్రునితో ఇలా చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

3వ పంక్తి నుండి 10వ పంక్తి వరకు
వినుము సురేంద్ర యీ విశ్వంబునందు
వినుతి కెక్కిన మహావిక్రమోన్నతుఁడు
వినయభూషణుఁడు వివేకసంపన్నుఁ
డతుల సత్కీర్తి మహాభాగ్యశాలి
వితత ధనుర్వేద విద్యాధికుండు
కరుణాపయోనిధి గాంభీర్యఘనుఁడు
దురితదూరుఁడు బుధస్తోత్రపాత్రుండు
ప్రతిపదార్ధం :
సురేంద్ర = ఓ దేవేంద్రా
వినుము = విను
ఈ విశ్వంబునందు = ఈ ప్రపంచంలో
వినుతికెక్కిన ; (వినుతికిన్ + ఎక్కిన) = ప్రసిద్ధి కెక్కిన
మహావిక్రమోన్నతుడు ; మహా = గొప్ప
విక్రమ = పరాక్రమం చేత
ఉన్నతుడు = గొప్పవాడు
తనరు = ప్రసిద్ధి పొందిన
షోడశ మహాదాన = పదహారు గొప్పదానములచే
వినోది = వినోదంగా ప్రొద్దుపుచ్చేవాడు
వినయ భూషణుడు = వినయమే అలంకారంగా గలవాడు
వివేక సంపన్నుడు = “మంచి చెడ్డలు తెలిసికోడం” అనే వివేకముతో కూడినవాడు
అతుల = పోలిక చెప్పడానికి వీలుకాని
సత్మీర్తి = మంచి కీర్తి గలవాడు
మహాభాగ్యశాలి = గొప్ప ఐశ్వర్యంచే ప్రకాశించేవాడు తనరు షోడశమహాదాన వినోది
వితత = విరివియైన (విస్తారమైన)
ధనుర్వేద విద్యా = ధనుర్వేద విద్య యందు (విలు విద్యలో)
అధికుండు = గొప్పవాడు
కరుణాపయోనిధి = దయకు సముద్రుని వంటివాడు
గాంభీర్యఘనుడు = మేఘము వలె గంభీరుడు
దురితదూరుడు = పాపానికి దూరంగా ఉండేవాడు (పుణ్యాత్ముడు)
బుధస్తోత్ర పాత్రుండు = పండితుల యొక్క ప్రశంసలకు యోగ్యుడు

భావం :
ఓ దేవేంద్రా ! ఈ ప్రపంచంలో మహా పరాక్రమ వంతుడు హరిశ్చంద్రుడు. అతడు పదహారు రకాల దానాలు చేస్తూ ఆనందిస్తాడు. వినయమే అలంకారంగా కలవాడు. వివేకమే సంపదగా కలవాడు. సాటిలేని కీర్తి కలవాడు. గొప్ప భాగ్యవంతుడు. విస్తారమైన ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. దయకు సముద్రుని వంటివాడు. పుణ్యాత్ముడు పండితులను గౌరవించేవాడు.

విశేషాంశం :
షోడశమహాదానములు :
1. గోదానము 2. భూదానము 3. తిలదానము 4. హిరణ్యదానము 5. రత్నదానము 6. విద్యాదానము 7. కన్యాదానము 8. దాసీదానము 9. శయ్యాదానము 10. గృహదానము 11. అగ్రహార దానము 12. రథదానము 13. గజదానము నిధి 14. అశ్వదానము 15. ఛాగ (మేక) దానము 16. మహిష (దున్నపోతు) దానము.

11వ పంక్తి నుండి 18వ పంక్తి వరకు
సర్వ శాస్త్రా విచారకోవిదుఁడు
గర్వితరిపుగజ కంఠీరవుండు
వరుస నార్వురు చక్రవర్తులలోనఁ
దరమిడి మున్నెన్నఁదగు చక్రవర్తి
నిత్యప్రసన్నుండు నీతిపాలకుఁడు
సత్యసంధుండు త్రిశంకు నందనుఁడు
నిరుపమ విజ్ఞాననిధి భానువంశ
శరధిచంద్రుఁడు హరిశ్చంద్రుఁడా రాజు
ప్రతిపదార్థం :
సర్వ శాస్త్రార్థ విచారకోవిదుఁడు; సర్వశాస్త్ర = అన్ని శాస్త్రముల
అర్థ = అర్థాన్ని
విచార = పరిశీలించడంలో
కోవిదుడు = పండితుడు
గర్వితరిపుగజ కంఠీరవుండు ; గర్విత = గర్వించిన
రిపు = శత్రువులు అనే
గజ = ఏనుగులకు
కంఠీరవుండు – సింహము వంటివాడు (శత్రువులను మర్ధించేవాడు)
వరుసన్ = వరుసగా
ఆర్వురు చక్రవర్తులలోన్ = ప్రసిద్ధులైన షట్ చక్రవర్తులలో
తరమిడి = తారతమ్యము ఎంచి
మున్ను = ముందుగా
ఎన్నదగు = లెక్కింపదగిన (గ్రహింపదగిన)
చక్రవర్తి = మహారాజు
నిత్య, ప్రసన్నుండు = ఎల్లప్పుడు నిర్మలమైనవాడు (నిత్య సంతుష్టుడు)
నీతిపాలకుఁడు = నీతివంతమైన పాలన చేసేవాడు
సత్యసంధుడు = సత్యమును పాటించేవాడు
త్రిశంకునందనుడు = త్రిశంకుమహారాజు కుమారుడు
నిరుపమ విజ్ఞాన నిధి ; నిరుపమ = పోలిక చెప్పరాని
విజ్ఞాన = విజ్ఞానానికి
నిధి = రాశి (సాటిలేని విజ్ఞానం కలవాడు)
భానువంశ శరధి చంద్రుడు ;
భానువంశ = సూర్య వంశము అనే
శరధి = సముద్రములో పుట్టిన
చంద్రుడు = చంద్రుని వంటివాడు
హరిశ్చంద్రుఁడా రాజు = హరిశ్చంద్రుడు అనే రాజు

భావం :
అన్ని శాస్త్రాల సారం తెలిసినవాడు. గర్వించిన శత్రురాజులనే ఏనుగుల పాలిటి సింహం వంటివాడు. షట్చక్ర వర్తులలో ఒకడు. సత్యం వదలనివాడు. నీతిమంతమైన పాలన చేసేవాడు. గొప్ప జ్ఞాని. సత్యవాక్పరిపాలకుడు. సూర్యవంశస్థుడైన త్రిశంకుని కుమారుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. సూర్య వంశమనే సముద్రంలో పుట్టిన చంద్రుడు.

విశేషాంశం :
షట్చక్రవర్తులు :
1) హరిశ్చంద్రుడు 2) నలుడు 3) పురుకుత్సుడు 4) పురూరవుడు 5) సగరుడు 6) కార్తవీర్యార్జునుడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

19వ పంక్తి నుండి 26వ పంక్తి వరకు
పోండిమి మదిఁ దలపోసి చూచినను
వాఁడెపో బొంకనివాఁడు దేవేంద్ర
అల రెండువేల జిహ్వల వానికైనఁ
గొలఁదె హరిశ్చంద్రు గుణములు వొగడఁ
దను వెల్ల సత్యంబు తలఁ పెల్లఁగరుణ
పను లెల్ల ధర్మంబు పలు కెల్లఁ బ్రియము
బొంకు నాలుకకుఁ జేర్పుట కాని వావి
ప్రతిపదార్థం :
పోడిమిన్ = చక్కగా
మదిన్ = మనస్సులో
తలపోసి చూచినను = ఆలోచించి చూసినట్లయితే
దేవేంద్ర = ఓ దేవేంద్రా
బొంకనివాడు = అబద్దం ఆడనివాడు
వాడెపో = వాడే సుమా (ఆ హరిశ్చంద్రుడే)
అల = ప్రసిద్ధమైన
రెండువేల జిహ్వలవానికైనన్; = రెండువేల నాలుకలు గల ఆదిశేషునికైనా
హరిశ్చంద్రు = హరిశ్చంద్రుని యొక్క
గుణములు + పొగడన్ = గుణాలను పొగడుటకు
కొలదె; (కొలది + ఎ) = శక్యమా (కాదు)
తనువు + ఎల్లన్ = ఆయన శరీరమంతా
సత్యంబు = సత్యము
తలపు + ఎల్లన్ = హృదయము అంతా
కరుణ = జాలి, దయ
పనులు + ఎల్లన్ = ఆయన పనులు అన్నీ
ధర్మంబు = ధర్మము
పలుకు + ఎల్లన్ = మాట అంతయూ
ప్రియము = ఇంపుగా ఉంటుంది
బొంకు = అబద్ధము
నాలుకకున్ = నాలికవద్దకు
చేర్పుట = చేర్చడం
కాని = లేని
వాయి = నోరు

భావం :
ఓ దేవేంద్రా ! చక్కగా మనస్సులో ఆలోచించి ఆ రాజు చూస్తే హరిశ్చంద్రుడే అబద్ధం ఆడనివాడు. రెండువేలు నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతడు సత్యస్వరూపుడు. అతని ఆలోచనలు కరుణతో నిండి ఉంటాయి. హరిశ్చంద్రుడు ధర్మగుణం కలవాడు. ఆయన ఎప్పుడూ నిజాలే మాట్లాడతాడు. ఆబద్ధమనేది అతనికి తెలియదు.

AP Board 8th Class Telugu Solutions Chapter 7 హరిశ్చంద్రుడు

27వ పంక్తి నుండి 33వ పంక్తి వరకు
యింక నన్నియుఁ జెప్ప నేమి కారణము
వారిజ గర్భుని వ్రాంత దప్పినను
వారిజాప్తుఁడు దూర్పువంకఁ గ్రుంకినను
మేరువు గ్రుంగిన మిన్ను వ్రాలినను
ధారుణీ చక్రంబు తలక్రిందు వడిన
వారిధు లింకిన వజ్రాయుధంబు
ధార దప్పిన మాటతప్పఁడా రాజు.
ప్రతిపదార్థం :
ఇంకన్ = ఇంకా
అన్నియున్ = అన్ని గుణాలనూ
చెప్పడన్ = చెప్పడానికి
ఏమి కారణము = కారణము ఏముంది (చెప్పడం ఎందుకు)
వారిజ గర్భుని = పద్మమున పుట్టిన బ్రహ్మ యొక్క
వ్రాత + తప్పి న = రాత తప్పినా
వారిజాప్తుడు = పద్మబంధువైన సూర్యుడు
తూర్పు వంకన్ = తూర్పు దిక్కున
క్రుంకినను = అస్తమించినా
మేరువు = మేరు పర్వతము
క్రుంగినన్ = భూమిలోకి దిగిపోయినా
మిన్ను = ఆకాశము
వ్రాలినను = ఊడి కిందపడినా
ధారుణీ చక్రంబు = భూమండలము
తలక్రిందు + పడినన్ = తలక్రిందులుగా పడినా
వారిధులు = సముద్రములు
ఇంకినన్ = ఎండిపోయినా
వజ్రాయుధంబు = దేవేంద్రుని వజ్రాయుధము
ధారతప్పినిన్ = పదును తగ్గినా
ఆరాజు = ఆ హరిశ్చంద్ర మహారాజు
మాట తప్పడు = ఆడిన మాట తప్పడు

భావం : ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు? బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించినా, మేరు పర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలక్రిందులైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రుడు మాత్రము ఆడినమాట తప్పడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 6th Lesson ప్రకృతి ఒడిలో

8th Class Telugu 6th Lesson ప్రకృతి ఒడిలో Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 1

ప్రశ్న 1.
చిత్రంలో ఏమేమి ఉన్నాయి?
జవాబు:

  1. చిత్రంలో ఒక చెట్టు ఉంది. చెట్టు కింద పిల్లలు ఆడుతున్నారు.
  2. ఇద్దరు పిల్లలు కాలువలో కాగితం పడవలు వదలి పెడుతున్నారు.
  3. ఇద్దరు స్త్రీలు ఇంటికి కడవలతో నీరు తీసుకువెడుతున్నారు.
  4. పక్షులు గూళ్ళకు ఎగిరి వస్తున్నాయి.
  5. మూడు గుడిసెలు ఉన్నాయి.
  6. కాలువపై వంతెన ఉంది.
  7. ఆవులు, కుక్క పరుగు పెడుతున్నాయి.

ప్రశ్న 2.
ఏం జరుగుతూంది?
జవాబు:
చిత్రంలో వర్షం పడుతూ ఉంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

ప్రశ్న 3.
చిత్రంలోని పిల్లలు ఏం మాట్లాడుతుండవచ్చు? ఊహించి చెప్పండి.
జవాబు:

  1. చిత్రంలో పిల్లలు కొందరు కాగితపు పడవలు కాలువలో వేస్తూ, ఎదుటివారి పడవ కంటె తమ పడవ ముందుకు వేగంగా వెడుతూందని మాట్లాడుతూ ఉండవచ్చు.
  2. వర్షం వస్తుంది. ఇంటికి వేగంగా వెడదాం రండి అని ఒక బాలిక పక్కవారిని పిలుస్తూ ఉండవచ్చు.
  3. చెమ్మ చెక్క ఆడదాం రమ్మని బాలబాలికలు ఒకరిని ఒకరు పిలుస్తూ ఉండవచ్చు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
మనం చేయలేనివి జంతువులు చేయగలిగేవి ఏవి? మాట్లాడండి.
జవాబు:

  1. మనిషి వినలేని ధ్వనులు కూడా కుక్కలకు వినిపిస్తాయి.
  2. చీకట్లో గాలిలోకి విసరిన వస్తువులలో, అది పురుగో, బంతో, కర్రో సులువుగా గ్రహించేశక్తి గబ్బిలాలకు ఉంది.
  3. ఆకారాలను బట్టి ఒకే పరిమాణంలో ఉన్న ఆకులూ, పురుగులు వంటి వాటిని, గబ్బిలాలు గుర్తించగలవు.
  4. తిమింగలాలకు, గబ్బిలాలకన్నా ఎక్కువగా ఇకోలొకేషన్ శక్తి, విశ్లేషణ శక్తి ఉన్నాయి.
  5. పాములూ, ఎలుకలూ మన కంటే ముందుగా భూకంపాలను గుర్తించగలవు.
  6. ఏనుగులు సునామీని 250 కి||మీ దూరంలో ఉండగానే గుర్తిస్తాయి.

ప్రశ్న 2.
శాస్త్రజ్ఞానం అభివృద్ధి చెందడం అంటే ఏమిటి? దీనివల్ల గతంతో పోలిస్తే, నేడు దేంట్లో ఏమి మార్పులు వచ్చాయి?
జవాబు:
శాస్త్రజ్ఞానం అన్ని రంగాలలోనూ అభివృద్ధి అయ్యింది. ముఖ్యంగా సమాచార రంగంలో, అణుశక్తి రంగంలో, విద్యుచ్ఛక్తి సాధనాల తయారీలో, కంప్యూటర్ రంగంలో, ఇంటర్నెట్ రంగంలో, ప్రయాణ సాధనాల్లో, ఎన్నో మార్పులు వచ్చాయి. వైద్య రంగంలో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందడం వల్ల కేన్సర్, గుండెపోటు, మోకాలు మార్పిడి వంటి అసాధ్యమైన రోగాలకు చికిత్సలు సాధ్యమవుతున్నాయి. శాస్త్రజ్ఞులు నిత్యం పరిశోధనలు చేస్తున్నారు. రోదసీ విజ్ఞానంలో చంద్రుడి వద్దకు మనిషిని పంపగలుగుతున్నాము. విమానాలు, రైళ్ళు, బస్సులు, మోటారు సైకిళ్ళు వచ్చాయి.

ప్రశ్న 3.
నిత్యజీవితంలో మీరు గమనించిన ప్రకృతి వింతలను గురించి చెప్పండి.
జవాబు:
నేను గమనించిన ప్రకృతి వింతలు ఇవి.

  1. నిప్పు ఎప్పుడు తాకినా కాలుతుంది.
  2. నీరు పల్లానికే ఎప్పుడూ ప్రవహిస్తుంది.
  3. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది.
  4. చలికి నీరు గడ్డకడుతుంది.
  5. చలికి నెయ్యి, నూనె పేరుకుంటాయి.
  6. గోడ మీద బల్లి జారిపోకుండా పాకుతుంది. ఇవన్నీ నేను గమనించిన ప్రకృతి వింతలు.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

ప్రశ్న 1.
పాఠం చదవండి. కింది భావం వచ్చే పేరాలను గుర్తించండి. వాటికి పేరు పెట్టండి.
అ) ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. దీన్ని చూస్తే చాలా ఆనందం కలుగుతుంది.
జవాబు:
పాఠంలో మొదటి పేరా ఈ భావాన్ని ఇస్తుంది. “కాటారం బడిలో ………….. ప్రకృతిలో ఎన్ని రహస్యాలున్నాయో” ……… ఈ పేరాకు “ప్రకృతి అందాలు” అని పేరు పెట్టవచ్చు.

ఆ) మనం ఎన్నో విషయాలను తెలుసుకోడానికీ, పరిశీలించడానికి మనకున్న జ్ఞానేంద్రియాలు ఉపయోగపడుతున్నాయి.
జవాబు:
పాఠంలో 2వ పేరా పై భావాన్ని ఇస్తుంది. “ప్రకృతి రహస్యాలను …………. నీటిని మళ్ళించవచ్చు. ……… అనే పేరా, జ్ఞానేంద్రియాల గురించి చెపుతోంది. ఈ పేరాకు “ప్రకృతి ధర్మాలు – మానవుని గుర్తింపు” అని పేరు పెట్టవచ్చు.

ఇ) మానవుడు తనకున్న బలాలను, బలహీనతలను తెలుసుకున్నాడు. కాబట్టి ఉన్నదానితో తృప్తి చెందక, ఎన్నో విషయాలను కనుక్కున్నాడు.
జవాబు:
పాఠంలో 66వ పేజీలోని 12వ పంక్తి నుండి 18వ పంక్తి వరకు ఉన్న పేరా పై భావాన్ని ఇస్తుంది. “ఇంద్రియ జ్ఞానం మీదనే …………. రాడార్ వగైరాలు” – అనే పేరా పై భావాన్ని తెలుపుతుంది. ఈ పేరాకు “శాస్త్రజ్ఞులు – నూతన ఆవిష్కరణలు” – అని పేరు పెట్టవచ్చు.

ప్రశ్న 2.
జట్లు జట్లుగా కూర్చొని పాఠంలోని పేరాలను చదవండి. ఒక్కొక్క పేరాకు ఒక ప్రశ్నను తయారుచేయండి. అంటే అదే ప్రశ్నకు, పేరాలోని విషయం జవాబుగా రావాలి.
జవాబు:
1వ పేరా : “కాటారం బడిలో ………….. ఇలాంటివి కొన్ని చూద్దామా ?”
ప్రశ్న : ప్రకృతిలో కనిపించే అందాలను పేర్కొనండి.

2వ పేరా : “ప్రకృతి రహస్యాలను ……….. మళ్ళించవచ్చు”.
ప్రశ్న : ప్రకృతి ధర్మాలను మానవుడు తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నాడు?

3వ పేరా : “ఆధునిక శాస్త్రవేత్త ………… తరంగాలు అంటారు”.
ప్రశ్న : శాస్త్రవేత్తలు కనుగొన్న జ్ఞాన సంపాదన గూర్చి తెలపండి.

4వ పేరా : కొన్ని పరిస్థితులలో ………. జిల్లు మంటుంది.
ప్రశ్న : శాస్త్రవేత్తలు జ్ఞానేంద్రియ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు?

5వ పేరా : “ఇంద్రియ జ్ఞానం మీదనే …………. రాడార్ వగైరాలు”
ప్రశ్న : శాస్త్రజ్ఞులు జ్ఞాన సంపాదనకు కనుగొన్న సాధనాలను తెలపండి.

6వ పేరా : శాస్త్రజ్ఞానం …………. సిద్ధాంతంగా ఆమోదం పొందుతుంది.
ప్రశ్న : శాస్త్రజ్ఞానం ఎప్పుడు సిద్ధాంతంగా రూపొందుతుంది?

7వ పేరా : “దృష్టి, వినికిడి ………. గబ్బిలాల కన్నా ఎక్కువ”.
ప్రశ్న : “ఇంద్రియ జ్ఞానంలో కొన్ని జంతువులు మానవులను మించాయి” వివరించండి.

8వ పేరా : “ప్రకృతి వైపరీత్యాలను ……….. శాస్త్రజ్ఞులు నిరూపించారు”.
ప్రశ్న : ప్రకృతి వైపరీత్యాలను కనిపెట్టడంలో జంతువులలో గల ప్రత్యేకత ఎట్టిది?

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి ? వాటివల్ల మనం ఏం చేయగలుగుతున్నాం?
జవాబు:
ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి, మనిషికి ఉన్న మూలసాధనాలు జ్ఞానేంద్రియాలు. మనకు జ్ఞానం కలిగించే ఐదు ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలు అంటాము.

  1. కన్ను దృశ్య జ్ఞానాన్ని ఇస్తోంది.
  2. చెవి శ్రవణ జ్ఞానాన్ని కల్గిస్తుంది.
  3. చర్మం స్పర్శ జ్ఞానాన్ని కల్గిస్తుంది.
  4. ముక్కు వాసనను తెలియజేస్తుంది.
  5. నాలుక రుచిని తెలుపుతుంది.

ఆ) ఇంద్రియజ్ఞానానికే పరిమితం కాకపోవడం వల్ల ఏం జరిగింది?
జవాబు:
మనం ఇంద్రియ జ్ఞానానికే పరిమితం కాకపోవడం వల్లనే, మనకు నేడు రేడియోలు వచ్చాయి. విద్యుచ్ఛక్తి వచ్చింది. ఆకాశంలోని నక్షత్రాలలో ఏ పదార్థాలు ఉన్నాయో తెలిశాయి. ఇంద్రియ జ్ఞానాన్ని విస్తరించడానికి శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు. టెలిస్కోపులు, మైక్రోస్కోపులు, ఫోటోగ్రఫీ, ఎక్స్ రేలు, చీకట్లో చూడటానికి వీలైన సాధనాలూ, రాడార్ వంటి వాటిని కల్పించారు.

ఇ) చూపు, వినికిడి, వాసనలను తెలుసుకోవడం అన్నవాటి విషయంలో మనకు, జంతువులకు ఉండే తేడాలు ఏమిటి? దీని వలన మీరు ఏం గ్రహించారు?
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 2 AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 3

ఈ) ఈ పాఠంలోని మొదటి పేరాకు, మిగతా పేరాలకు మధ్య ఉన్న భేదమేమిటి?
జవాబు:
ఈ పాఠంలో మొదటి పేరా ప్రకృతిని వర్ణిస్తూ సాగింది. అది వర్ణనాత్మకంగా ఉంది. చిన్న సైజు అక్షరాలలో ఉంది. రెండవ పేరా నుండి శాస్త్ర విజ్ఞానం గురించి విశ్లేషణ ఉంది. కాబట్టి మిగిలిన పేరాలు విశ్లేషణాత్మకంగా సాగాయి. అవి పెద్ద టైపు అక్షరాలలో అచ్చయ్యా యి.

III. స్వీయరచన

1. ఈ కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో మీ సొంతమాటలలో జవాబులు రాయండి.

అ) “ప్రకృతి రహస్యాలు అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు” దీని మీద మీ అభిప్రాయం ఐదు వాక్యాలలో రాయండి.
జవాబు:
మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అన్నవి జ్ఞానేంద్రియాలు. మనము ఏ విషయాన్ని గురించి తెలిసికోవాలని ఉన్నా, ఈ ఐదు ఇంద్రియాల వల్లనే సాధ్యం అవుతుంది. మనం కంటికి కనబడే కాంతి తరంగాల ద్వారానే వస్తువులను చూడగలం. చెవికి వినబడే ధ్వని తరంగాల ద్వారానే శబ్దాలు వినగలం. చర్మానికి తగిలిన స్పర్శ వల్లే అది వేడో, చలో గుర్తించగలం. నాలుకతో రుచి చూస్తేనే, పదార్థం రుచి తెలుస్తుంది. ముక్కుతో వాసన చూస్తేనే పరిమళం తెలు ,కోగలం.

ఆ) శాస్త్రజ్ఞులు జ్ఞానేంద్రియాల హద్దులను తెలుసుకోవడం వల్ల ఏం జరిగింది?
జవాబు:
శాస్త్రజ్ఞులు జ్ఞానేంద్రియాలు గుర్తించలేని విషయాలను తెలుసుకోడానికి, సాధనాలు తయారుచేశారు. వారు మైక్రోస్కోపులు, టెలిస్కోపులు, రాడార్లు , ఎక్స్ రేలు, ఫొటోగ్రఫీ, చీకట్లో చూడగల సాధనాలు తయారుచేశారు. గామా కిరణాలు, రేడియోతరంగాలు వంటి వాటిని తయారుచేశారు.

2. ఈ కింది ప్రశ్నలకు పదివాక్యాలలో సొంతమాటలలో జవాబులు రాయండి.

అ) సాధారణ దృష్టి, శాస్త్ర దృష్టి రెండూ ఒకటేనా? కాదా? ఎందుకు?
జవాబు:
సాధారణ దృష్టి, శాస్త్ర దృష్టి ఒకటి కాదు. సాధారణ దృష్టి కలవాడు ప్రతి సంఘటనకూ వెనుక ఉన్న కారణాన్ని గూర్చి ఆలోచించడు. సూర్యుడు తూర్పు దిక్కులోనే ఎందుకు ఉదయిస్తున్నాడు ? ఆటలమ్మ ఎందుకు వచ్చింది ? అని శాస్త్ర దృష్టి కలవాడు ఆలోచిస్తాడు. వేంకటేశ్వరస్వామి కోపం వల్ల తలనొప్పి వచ్చిందంటే, శాస్త్ర దృష్టి కలవాడు అంగీకరించడు. శాస్త్ర దృష్టి కలవాడు మూఢనమ్మకాలను నమ్మడు. శాస్త్ర దృష్టితో విషయాన్ని పరీక్షించి చూచి, సత్యాన్నే నమ్ముతాడు.

ఆ) ప్రకృతి అందాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ప్రకృతి అందాలు :
భగవంతుడు ప్రకృతిలో ఎన్నో అందాలు సమకూర్చాడు. అందమైన సూర్యోదయం, ఆకాశంలో ఎర్రని సంధ్యారాగం, కోయిలల కూతలు, ఆకాశంలో పక్షుల బారులు, కొండలు, కోనలు, పచ్చని వనాలు, పూలతోటలు, ఆవులు, గేదెలు, అనేక రకాల జంతువులు ప్రకృతిలో ఉంటాయి.

వర్షం వచ్చే ముందు ఇంద్రధనుస్సు ఆకాశంలో కనబడుతుంది. వసంతం వస్తే చెట్లు అన్నీ చిగిర్చి పూలు పూస్తాయి. గాలికి కొమ్మలు రెపరెపలాడుతూ మనలను దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉంటాయి. కోకిలలు కుహూకుహూ అంటూ కూస్తాయి. చిలుకలు మాట్లాడుతాయి. సాయం సంధ్యలో ఆకాశంలో కుంకుమ అరబోసినట్లు ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను అందించిన దైవానికి మనం కృతజ్ఞతగా ఉండాలి.

IV. పదజాలం – వినియోగం

1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.

అ) శాస్త్ర దృష్టి మానవుడి కృషికి ఒక మార్గం చూపిస్తుంది. (త్రోవ)
ఆ) కొండలను పగలగొట్టినప్పుడు భూప్రకంపనలు వస్తాయి. (ఎక్కువ కదలికలు)
ఇ) ఎండమావులను చూసి నీరు అని భ్రమపడతాము. (భ్రాంతి)

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను ఎంపిక చేసుకొని వాటితో వాక్యాలు రాయండి.
ఉదా :
పార్వతికి అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు.
i) కొందరికి పొగడ్తలు ఇష్టం ఉండవు.
ii) ప్రశంసలకు లొంగకపోవడం గొప్పవారి లక్షణం.

అ) బొమ్మలలో రకరకాల ఆకృతులు ఉంటాయి.
జవాబు:
i) నగరంలో పలురకాల ఆకారాల ఇండ్లు ఉంటాయి.
ii) మానవుల్లో రకరకాల రూపాలు గలవాళ్ళు ఉంటారు.

ఆ) బుద్ధి కొన్ని సత్యాలను ప్రతిపాదిస్తుంది.
జవాబు:
i) విద్యార్థులు ఎల్లప్పుడు నిజం పలకాలి.
ii) మహాత్ములు సదా యథార్థం పలికి తీరుతారు.

ఇ) మన కన్ను చూసే కాంతి తరంగాలు చాలా తక్కువ.
జవాబు:
i) జ్ఞానేంద్రియాల్లో నయనం ప్రధానం.
ii) మనం ఎల్లప్పుడు చక్షువును రక్షించుకోవాలి.

ఈ) మానవుని కంటే జంతువులు తొందరగా వాసనలను పసిగడతాయి.
జవాబు:
i) పశువులు మానవులకు ఉపకారం చేస్తాయి.
ii) మృగాలు అరణ్యంలో సంచరిస్తాయి.

ఉ) చైనాలో ఒకసారి కలుగులలోంచి ఎన్నో పాములు బయటకు వచ్చాయి.
జవాబు:
i) ఇంటిలోని రంధ్రం నుంచి సర్పము వచ్చింది.
ii) పొలంలోని బిలంలో ఫణి చేరింది.

3. కింద గీత గీసిన పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.
అ) పుష్పాలు సున్నితమైనవి.
ఆ) మన దమ్మం మనం పాటించాలి.
ఇ) శాస్త్రాన్ని అతిక్రమించగూడదు.
ఈ) కొందరికి చిత్తరువులు గీయడంలో నైపుణ్యం ఉంటుంది.
ఉ) ఎవరి ప్రాణం వారికి తీపి.

ప్రకృతి – వికృతి

పుష్పం – పూవు
శాస్త్రం – చట్టం
ప్రాణం – పానం
ధర్మం – దమ్మం
చిత్రము – చిత్తరువు

V. సృజనాత్మకత

ఈ కింది వాక్యాలు చదవండి.

1) “చప్పట్ల చప్పుడు విని, సీతాకోక చిలుకలు పైకి లేచాయి” – సాధారణ వాక్యం.

“ఆ చప్పట్ల ప్రకంపనలకు, ఆ పరిసరాలలో చెట్ల మీద ఉన్న రంగురంగుల సీతాకోకచిలకలు గుంపులు గుంపులుగా రెక్కలు రెపరెపలాడిస్తూ పైకి లేచాయి” – పై వాక్యాన్నే వర్ణిస్తూ రాసిన వాక్యం ఇది. వాక్యంలోని కర్త, కర్మ, క్రియ పదాలలో దేన్ని గురించి అయినా గొప్పగా / అందంగా వివరించేలా సరైన పదాలను జోడిస్తూ రాస్తే మామూలు వాక్యాలు కూడా వర్ణనాత్మక వాక్యాలుగా మారుతాయి. మీరు కూడా మీకు నచ్చిన కథను / సన్నివేశాన్ని / సంఘటనను లేదా ఏదైనా ఒక అంశాన్ని గురించి వర్ణిస్తూ రాయండి.
జవాబు:
ఆ గ్రామంలో అందం మాట వస్తే, అంతా వసంతసేన గురించే చెప్పుకొనేవారు. వసంతసేన ముఖం ముందు, చంద్రుడు వెలవెల పోయేవాడు. తోటలో పువ్వులు వసంతసేన ముఖాన్ని చూసి తెల్లపోయేవి. వసంతసేన ఆకుపచ్చ పట్టుచీర కట్టుకొని గుడికి రాజహంసలా వెడుతూంటే, ఆ గ్రామంలో పెద్దలూ, చిన్నలూ ఆమె కేసే కళ్ళు తిప్పకుండా చూసేవారు. వసంతసేన అందం ముందు అప్సరసలు కూడా దిగదుడుపే.

ఆ ఊరిలో హరిహరస్వామి ఆలయం ఉంది. వసంతసేనకు అమ్మమ్మ నృత్యగానాలలో మంచి శిక్షణను ఇప్పించింది. వసంతసేనకు వయస్సు రాగానే ఆమె అమ్మమ్మ రాగమాలిక దేవాలయంలో అరంగేట్రం చేయించింది. ఆ రోజు కోడెగారు పిల్లలంతా వసంత సేన కనుసన్నల కోసం పడిగాపులు కాశారు. ఆ సమయంలోనే దేవాలయానికి వచ్చిన ఆ దేశపు రాజు మదనసింహుడి దృష్టి వసంతసేన మీద పడింది. రాజు తన దృష్టిని వసంతసేన నుండి మరలించుకోలేకపోయాడు. వసంత సేన కూడా రాజును కన్ను ఆర్పకుండా చూసింది. ఆ తొలిచూపుల సమ్మేళన ముహూర్తం, వారి వివాహానికి నాంది పలికింది.

VI. ప్రశంస

1) భూమిమీద ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, మానవులు ……….. ఇలా ప్రతి ఒక్కదాంట్లో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. మీ మిత్రులతో చర్చించి దేంట్లో ఏ ఏ గొప్పదనాలున్నాయో రాయండి.
జవాబు:
1) చెట్లు గొప్పదనం :
మనకు పనికిరాని కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గుపులుసు) వాయువును గ్రహించి, మనకు ప్రాణవాయువును ఇస్తాయి.

2) పక్షులు గొప్పదనం :
పక్షులకు గొప్ప దిశా జ్ఞానం ఉంటుంది. అవి ఎక్కడకు ఎగిరి వెళ్ళినా, తిరిగి తమ గూటికి అవి వస్తాయి.

3) జంతువులు :
కొన్ని జంతువులు ప్రకృతి వైపరీత్యాలను మానవుల కంటే ముందే గుర్తిస్తాయి. దృష్టి, వినికిడి, వాసనలను పసిగట్టే విషయంలో జంతువులు మానవుని కన్నా ముందున్నాయి.

4) మానవులు :
మానవులు బుద్ధిజీవులు, మానవులకు ఆలోచనా శక్తి, వివేచనా శక్తి, నిర్ణయాత్మక శక్తి ఉంటాయి. జంతువులకు వివేచనా శక్తి ఉండదు.

ప్రాజెక్టు పని

* ప్రకృతిని గురించిన చిత్రాలను సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో 4

VII. భాషను గురించి తెలుసుకుందాం !

1) కింది పదాలను విడదీయండి. సంధి పేరు రాయండి.
ఉదా :
అందమైన = అందము + ఐన – ఉత్వ సంధి
(అ) సూక్ష్మమైన – సూక్ష్మము + ఐన – ఉత్వ సంధి
(ఆ) పైకెత్తు = పైకి + ఎత్తు – ఇత్వ సంధి
(ఇ) అయిందంటే = అయింది + అంటే – ఇత్వ సంధి

2) క్రింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.
ఉదా :
మూడయిన రోజులు మూడు రోజులు
(అ) రెండయిన రోజులు – రెండు రోజులు
(ఆ) వజ్రమూ, వైఢూర్యమూ – వజ్రవైఢూర్యాలు
(ఇ) తల్లీ, బిడ్డా – తల్లీబిడ్డలు

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

3) కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా :
పార్వతికి అభినందనలను తెలుపుతూ అందరూ చప్పట్లు కొట్టారు.
పార్వతికి అభినందనలు తెలుపుతూ అందరిచేతా చప్పట్లు కొట్టబడ్డాయి.

అ) కర్తరి : జ్ఞానేంద్రియాలు మనిషికి అనుభవాలను కలిగిస్తాయి.
కర్మణి : జ్ఞానేంద్రియాలచేత మనిషికి అనుభవాలను కలిగింపజేస్తాయి.

ఆ) కర్తరి : చలికి నెయ్యి, నూనె పేరుకుంటాయి.
కర్మణి : చలిచేత నెయ్యి, నూనె పేరుకొనబడతాయి.

ఇ) కర్తరి : శాస్త్రజ్ఞానము కొన్ని ప్రతిపాదనలను చేస్తుంది.
కర్మణి : శాస్త్రజ్ఞానముచేత కొన్ని ప్రతిపాదనలు చేయబడుతుంది.

4) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) కర్మణి : శాస్త్రజ్ఞులచేత అనేక వేల సాధనాలు కల్పించబడినవి.
కర్తరి : శాస్త్రజ్ఞులు అనేక సాధనాలను కల్పించారు.

ఆ) కర్మణి : ఈ ప్రతిపాదన శాస్త్రముచేత పరమ సత్యంగా పరిగణింపబడదు.
కర్తరి : ఈ ప్రతిపాదనను శాస్త్రము పరమసత్యంగా పరిగణిస్తుంది.

ఇ) కర్మ : అది సిద్ధాంతముగా ఆమోదము పొందబడుతుంది.
కర్తరి : అది సిద్ధాంతంగా ఆమోదం పొందింది.

5) తత్పురుష సమాసం.

1. మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా! కింది వాటిలో గీత గీసిన విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి.

అ) విద్యను అర్థించేవాళ్ళు = విద్యార్థులు – ద్వితీయా తత్పురుష సమాసం
ఆ) గుణాల చేత హీనుడు = గుణహీనుడు – తృతీయా తత్పురుష సమాసం
ఇ) సభ కొరకు భవనం = సభాభవనం – చతుర్థి తత్పురుష సమాసం
ఈ) దొంగ వల్ల భయం = దొంగభయము – పంచమీ తత్పురుష సమాసం
ఉ) రాముని యొక్క బాణం = రామబాణం – షష్ఠీ తత్పురుష సమాసం
ఊ) గురువులలో శ్రేష్ఠుడు = గురుశ్రేష్ఠుడు – షష్ఠీ తత్పురుష సమాసం
ఋ) దేశము నందు భక్తి = దేశభక్తి – సప్తమీ తత్పురుష సమాసం

(పై వాక్యాల్లో వేర్వేరు విభక్తులను గమనించారు కదా!)
పై విగ్రహవాక్యాలకు సమాస పదాలు రాయండి.

2. కింది సమాస పదాలను పరిశీలించి విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లను రాయండి.
ఉదా :
విద్యార్థి – విద్యను అర్థించేవాడు – ద్వితీయా తత్పురుష సమాసం

పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. ధనహీనుడు ధనము చేత హీనుడు ద్వితీయా తత్పురుష సమాసం
2. పొట్టకూడు పొట్ట కొరకు కూడు చతుర్థి తత్పురుష సమాసం
3. రాక్షసభయం రాక్షసుల వలన భయం పంచమీ తత్పురుష సమాసం
4. నాపుస్తకం నా యొక్క పుస్తకం షష్ఠీ తత్పురుష సమాసం
5. రాజశ్రేష్ఠుడు రాజుల యందు శ్రేష్ఠుడు సప్తమీ తత్పురుష సమాసం

3. అతిశయోక్తి అలంకారం
కింది వాక్యాన్ని చదవండి.

ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై వాక్యంలో గమనిస్తున్నాం.

ఈ విధంగా గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని ‘అతిశయోక్తి అలంకార’మంటారు.

అతిశయోక్తి అలంకారానికి సంబంధించిన కొన్ని వాక్యాలు రాయండి.
1) మా ఊర్లో పంటలు బంగారంలా పండుతాయి.
2) మా తోటలోని మామిడిపండ్లు అమృతం వలె ఉంటాయి.
3) మా అన్నయ్య తాటిచెట్టంత పొడవున్నాడు.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

ప్రశంస : పొగడ్త, అభినందన
కలుగు : రంధ్రం, బిలం
నిప్పు : అగ్ని, చిచ్చు
పార్వతి : గౌరి, ఉమ
ఆకాశం : నింగి, నభం
సముద్రం : జలధి, వారిధి
ఆమోదం : అంగీకారం, సమ్మతి
లోకం : విశ్వం, జగము
గాలి : వాయువు, మారుతం
తరంగము : భంగము, అల
నక్షత్రం : తార, చుక్క

వ్యుత్పత్యర్థాలు

అగ్ని : మండెడి స్వభావం కలది
జలధి : నీటిని ధరించునది
సాగరం : సగర కుమారుల చేత త్రవ్వబడినది
ఉదధి : నీటిని ధరించునది

నానార్థాలు

అంబరం = గగనం, వస్త్రం, శూన్యం
వర్షం = వాన, సంవత్సరం
కన్ను = నేత్రం, బండి చక్రం
శక్తి = సామర్థ్యం, పార్వతి

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
జ్ఞానాభివృద్ధి = జ్ఞాన + అభివృద్ధి – సవర్ణదీర్ఘ సంధి
ధనాశ = ధన + ఆశ – సవర్ణదీర్ఘ సంధి
నిజానందం = నిజ + ఆనందం – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
జ్ఞానేంద్రియం = జ్ఞాన + ఇంద్రియం – గుణసంధి
సర్వోన్నత = సర్వ + ఉన్నత – గుణసంధి

ఆమ్రేడిత సంధి :
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితంబు పరమగునపుడు సంధి తరచుగానగు.
అప్పుడప్పుడు = అప్పుడు + అప్పుడు = ఆమ్రేడిత సంధి
ఔరౌర = ఔర + ఔర = ఆమ్రేడిత సంధి

లులనల సంధి :
సూత్రం : లు, ల, న లు పరమగునపుడు మువర్ణమునకు లోపమును, తత్పూర్వ స్వరమునకు దీర్ఘమును, బహుళముగా వచ్చును.
తరంగాలు = తరంగము + లు – లులనల సంధి
సముద్రాలు = సముద్రము + లు – లులనల సంధి
భూకంపాలు = భూకంపము + లు – లులనల సంధి
రహస్యాలు = రహస్యము + లు – లులనల సంధి

ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
ఊరెల్ల = ఊరు + ఎల్ల – ఉత్వసంధి
ముందున్నాయి = ముందు + ఉన్నాయి – ఉత్వసంధి
పరుగెత్తి = పరుగు + ఎత్తి – ఉత్వసంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
ప్రార్థనా సమావేశం ప్రార్థన కొఱకు సమావేశం చతుర్థీ తత్పురుష సమాసం
భూకంపాలు భూమి యొక్క కంపాలు షష్ఠీ తత్పురుష సమాసం
ప్రకృతి రహస్యాలు ప్రకృతి యొక్క రహస్యాలు షష్ఠీ తత్పురుష సమాసం
ప్రకృతి ధర్మము ప్రకృతి యొక్క ధర్మము షష్ఠీ తత్పురుష సమాసం
శాస్త్ర ప్రతిపాదనలు శాస్త్రము నందు ప్రతిపాదనలు సప్తమీ తత్పురుష మాసం
కళాదృష్టి కళయందు దృష్టి సప్తమీ తత్పురుష సమాసం
ఇంద్రియజ్ఞానము ఇంద్రియముల యొక్క జ్ఞానము షష్ఠీ తత్పురుష సమాసం
కాంతి తరంగాలు కాంతి యొక్క తరంగాలు షష్ఠీ తత్పురుష సమాసం
అద్భుత ప్రాణులు అద్భుతమైన ప్రాణులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
వంద సంవత్సరాలు వంద (100) సంఖ్యగల సంవత్సరాలు ద్విగు సమాసం
ఐదు కిలోమీటర్లు ఐదు (5) సంఖ్యగల కిలోమీటర్లు ద్విగు సమాసం
మూడు గంటలు మూడు (3) సంఖ్యగల గంటలు ద్విగు సమాసం

రచయిత పరిచయం

పాఠము పేరు : ‘ప్రకృతి ఒడిలో

రచయిత పేరు : కొడవటిగంటి కుటుంబరావుగారు

దేని నుండి గ్రహింపబడింది : రచయిత రాసిన “తాత్త్విక వ్యాసాల నుండి”

రచయిత జననం : అక్టోబరు 28, 1909 (28.10.1909)

మరణం : ఆగస్టు 17, 1980 (17.08.1980)

జన్మస్థలం : తెనాలి, గుంటూరు జిల్లా

రచనలు :
1) ‘జీవితం’, ‘చదువు’ – అనే నవలలు
2) ‘అద్దెకొంప’, ‘షావుకారు సుబ్బయ్య’ మొదలైన కథానికలు
3) సినిమా వ్యాసాలు
4) సైన్సు వ్యాసాలు, సంస్కృతి వ్యాసాలు, తాత్త్విక వ్యాసాలు మొ||నవి.

కొత్త పదాలు – అర్థాలు

అంశము = విషయము
అభినందన = ప్రశంస, పొగడ్త
అన్వేషించు = వెదకు, పరిశీలించు
అక్కఱ = అవసరమైన పని
ఆమోదం = అంగీకారం
ఆస్వాదించు = అనుభవించు
ఆకృతులు = రూపాలు
ఆధునికము = క్రొత్తది
కలుగు = రంధ్రం, బొరియ
గండి = రంధ్రము, సందు
చలన చిత్రాలు = సినిమాలు
జ్ఞానేంద్రియాలు = జ్ఞానమును కల్గించే అవయవాలు. ఇవి ఐదు. 1) కన్ను 2) ముక్కు 3) చెవి 4) నాలుక 5) చర్మం

AP Board 8th Class Telugu Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో

దృశ్యము = చూడదగినది, కనబడు వస్తువు
నిరూపించు = నిర్ణయించు
పసిగట్టుట = వాసన ద్వారా గుర్తించుట
పాటించు = ఆదరించు, కావించు
ప్రతిపాదించు = నిరూపించి తెలుపు
పరిమాణము = కొలత
ప్రకంపన = కదలిక
భ్రమలు = భ్రాంతి; లేనిది ఉన్నట్లుగా తోచడం
ఋజువు చేయు = నిరూపించు
విశ్లేషించు = విషయాన్ని విభజించి చూచు
వైపరీత్యము = విపరీతము
విధిగా = ఏర్పాటుగా (తప్పనిసరిగా)
సామ్యము = సాటి, పోలిక
శాస్త్రవేత్త = శాస్త్రం తెలిసినవాడు

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 5 ప్రతిజ్ఞ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 5th Lesson ప్రతిజ్ఞ

8th Class Telugu 5th Lesson ప్రతిజ్ఞ Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ 1

ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి.
జవాబు:
పై చిత్రంలో కుమ్మరివాడు కుండలను తయారుచేస్తున్నాడు. కమ్మరి కొలిమిలో ఇనుప పనిముట్లు తయారుచేస్తున్నాడు. రైతు ఎద్దులతో పొలం దున్నుతున్నాడు. చేనేత కార్మికుడు మగ్గం నేస్తున్నాడు. ఒకామె కడవతో నీరు పట్టుకెడుతోంది. మరొకామె గంపతో సరుకులు తీసుకువెడుతోంది. పాలేరు గడ్డిమోపు మోస్తున్నాడు. కార్మికులు మరమ్మతుపని చేస్తున్నారు. జాలరి చెరువులో వల విసురుతున్నాడు.

ప్రశ్న 2.
ఆహారోత్పత్తి వెనుక ఉన్న కష్టాన్ని గురించి చెప్పండి.
జవాబు:
పంటలు పండించాలంటే, రైతులు ఎంతో కష్టపడాలి. ముందుగా పొలాల్ని నాగలితో దున్నాలి. చేనుకు నీరు పెట్టాలి. నారుమడి వేయాలి. నారును పెంచాలి. నారు తీసి పొలంలో నాటాలి. నీరు పెట్టాలి. కలుపు తీయాలి. పురుగు మందులు కొట్టాలి. ఎరువులు వేయాలి. చేను కోయాలి. ఆరబెట్టాలి. ధాన్యాన్ని నూర్చాలి. ధాన్యం ఎగురపోయాలి. సంచులలో ధాన్యం పోసి అమ్మాలి. దాన్ని మరల ద్వారా ఆడించాలి. ఇంత చేస్తే కాని బియ్యం, గోధుమ పిండి వంటివి మనకు లభించవు.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ప్రశ్న 3.
మనం వాడే ప్రతి వస్తువు తయారీ వెనుక ఉన్న శ్రమను గురించి చెప్పండి.
జవాబు:
మనం అనేక రకాల పనిముట్లు ఉపయోగిస్తాం. వాటి వెనుక ఎందరో కష్టజీవుల శ్రమ ఉంది. కమ్మరి కొలిమిలో ఇనుమును కాల్చి సమ్మెటపై బాది సాగదీసి కత్తి, కొడవలి, గొడ్డలి, గునపం, పార, నాగలి కొట్టు వగైరా తయారుచేస్తాడు. కుమ్మరి కుండలు, వంట పాత్రలు చేస్తాడు. సాలె మగ్గంపై మనకు బట్టలు వేస్తాడు. వడ్రంగి, ఇళ్ళకు గుమ్మాలూ, తలుపులూ వగైరా చేస్తాడు. ఇంకా ఎందరో కార్మికులు కార్యానాలలో, యంత్రాల దగ్గర పనిచేసి మనం వాడుకొనే వస్తువులు తయారుచేస్తున్నారు. ఇలా మనం వాడుకొనే ప్రతి వస్తువు వెనుక కార్మికుల శ్రమ, కష్టం, కృషి ఉంది.

ప్రశ్న 4.
కర్షకుడు, కార్మికుడు లేకపోతే ఏమౌతుందో ఆలోచించి చెప్పండి.
జవాబు:
కర్షకుడు, కార్మికుడు వీరిద్దరూ దేశానికి వెన్నెముకలాంటివారు. కర్షకుడు లేకపోతే మనకు తిండిలేదు. కార్మికుడు లేకపోతే, మనం వాడుకోవడానికి ఏ రకమైన పనిముట్లు, నిత్యావసర వస్తువులు, సైకిళ్ళు, కార్లు, విమానాలు, రైళ్ళు కూడా ఉండవు. ప్రతి వస్తువు వెనుక కార్మికుని కష్టం దాగి ఉంది.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
కార్మికుల, కర్షకుల సౌభాగ్యం అంటే ఏమిటి ? మాట్లాడండి.
జవాబు:
కార్మికులు వారి శ్రమకు తగినట్టుగా ప్రతిఫలాన్ని పొందలేక బాధపడుతున్నారు. కర్షకులు కూడా ఎంతో శ్రమతో, చమటోడ్చి పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలవుతున్నాడు.

వీరికి ‘సౌభాగ్యం’ అంటే వారికి చేతినిండా పని ఉండి వారు, వారి భార్యాబిడ్డలతో సుఖంగా జీవించగలగడం. పారిశ్రామిక కార్మికులకు యజమానులు శ్రమకు తగిన జీతాలు ఇవ్వడం, కార్మికుల పిల్లలకు విద్యాసదుపాయాలు కలుగజేయడం, కార్మికులకు వైద్యసదుపాయాలు కలుగజేయడం వంటి వాటిని వారి సౌభాగ్యంగా భావించాలి.

ఇక వ్యవసాయ కార్మికులకు సంవత్సరమంతటా పని ఉండదు. ఆ పని లేని రోజుల్లో కూడా వారి జీవితం సుఖంగా నడిచే ఏర్పాట్లు అనగా ‘పనికి ఆహార పథకం, రోజ్ గార్ పథకం’ వంటివి ఏర్పాటు చేయడం జరగాలి.

ప్రశ్న 2.
‘కర్షకుడు, కార్మికుడు’ చేస్తున్న సేవను గురించి చర్చించండి.
జవాబు:
కర్షకులు, విరామ మెరుగని కష్టజీవులు. మూడువందల అరవై రోజులూ శ్రమించి వ్యవసాయం పనులు చేసి, మనకు ఆహారానికి కావలసిన ఆహార ధాన్యాలను పండిస్తున్నారు. వారు పశువులను మేమే, మనకు కావలసిన పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక కార్మికులు, మనకు కావలసిన నిత్యావసర వస్తువుల్నీ వ్యవసాయ పనిముట్లనూ ఉత్పత్తి చేస్తున్నారు. యంత్రాల ద్వారా వస్తువులు తయారవుతున్నా, అక్కడ కార్మికులు లేనిదే యంత్రాలు నడవవు. వస్తువులు ఉత్పత్తి కావు.

కార్మికులు, కర్షకులు తమ పనిని మానివేస్తే, మనకు తిండి ఉండదు. వాడుకోవడానికి వస్తువులు ఉండవు. మన సుఖజీవనానికి వారే ప్రాణాధారం అని గుర్తించాలి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదరి, తాపీమేస్త్రీ ఇలా వీరందరూ పని చేయకపోతే ప్రపంచమే స్తంభించిపోతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ప్రశ్న 3.
శ్రీశ్రీ రాసిన కవిత విన్నారు కదా ! ఇలాంటి కవితను ఆయన ఎందుకు రాసి ఉంటారు ? ఊహించి చెప్పండి.
జవాబు:
మానవ సుఖజీవనానికి కార్మికులు, కర్షకులే ప్రాణాధారమని, దేశ సౌభాగ్యం కోసం వారు ఎనలేని సేవలందిస్తున్నారని, సకల వృత్తులకు సమ ప్రాధాన్యం గలదని, శ్రమైక జీవనంలోనే మాధుర్యం నిండి ఉందని తెలపడానికి శ్రీశ్రీ ఈ కవిత రాశాడు. కార్మికులూ, కర్షకులూ మానవ జీవిత గమనానికి అతిముఖ్యులని, వారు సౌఖ్యంగా జీవించేలా చూడవలసిన బాధ్యత ధనిక స్వాములపై ఉందనీ, సమాజంపై ఉందని చెప్పడానికే శ్రీశ్రీ ఈ కవిత రాశాడు. రష్యాలో వచ్చిన కార్మిక విప్లవం ప్రభావంతో, స్పందించిన శ్రీశ్రీ ఈ కవిత రాశాడు.

కేవలం రాజులూ, రాణులూ వారి ప్రేమ పురాణాలూ మాత్రమే కవితా వస్తువులు కావనీ, శరీర కష్టాన్ని తెలిపే గొడ్డలి, రంపం వంటి పనిముట్లు, వాటితో పనిచేసే కర్షక, కార్మికులు కూడా కవితా వస్తువులే అని, చెప్పడానికి అభ్యుదయ భావాలతో శ్రీశ్రీ ఈ కవిత రాశాడు.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. పాఠం చదవండి. కింది పట్టికను పూరించండి. వృత్తులు

వృత్తులు వాడే పనిముట్లు
ఉదా : జాలరి పగ్గం
1. …………………… ……………………
2. …………………… ……………………
3. …………………… ……………………
4. …………………… ……………………

జవాబు:

వృత్తులు వాడే పనిముట్లు
ఉదా : జాలరి పగ్గం
1. సాలెలు మగ్గం
2. కుమ్మరి చక్రం
3. కమ్మరి కొలిమి
4. కంసాలి సుత్తి

2. కింది కవితను చదివి, నాలుగు ప్రశ్నలు తయారుచేయండి.
పర్వతం ఎవడికీ వంగి సలాం చేయదు
సముద్రం ఎవడికాళ్ళకిందా మొరగదు
నేనింతా పిడికెడు మట్టే కావచ్చు
కానీ కలమెత్తితే నాకు
ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.
జవాబు:
ప్రశ్నలు:
1) ఎవరికీ వంగి సలాం చేయనిది ఏది?
2) ఎవడి కాళ్ళ కిందా మొరగనిది ఏది?
3) చివరికి నేను ఏమవుతాను?
4) కలమెత్తితే నాకు ఏమవుతుంది?

3. పాఠం చదవండి. పాఠంలో కొన్ని ప్రాసపదాలు ఉన్నాయి. వాటి కింద గీత గీయండి. చదవండి.
ఉదా : పొలాలనన్నీ – హలాలదున్నీ – హేమం పిండగ – సౌఖ్యం నిండగ
జవాబు:
పరిశ్రమించే – బలికావించే
కురిపించాలని – వర్ధిల్లాలని
కళ్యాణానికి – సౌభాగ్యానికి
వినుతించే విరుతించే
ఘర్మజలానికి – ధర్మజలానికి
పరిక్లమిస్తూపరిప్లవిస్తూ
సంధానిస్తూ – సంరావిస్తూ
నవీనగీతికి – నవీనరీతికి

4. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.
అ) రైతు తన జీవితాన్ని ఎందుకు ధారపోస్తున్నాడు?
జవాబు:
రైతు నాగలిని నమ్ముకొన్నవాడు. అతడు పొలాలకు తన జీవితాన్ని ధారపోసి భూమిలో బంగారుపంటలు పండించాలనీ, లోకానికి అంతా సౌఖ్యం నిండుగా ఉండాలనీ, పొలాలను నాగళ్ళతో దున్నుతున్నాడు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాడు. తన బలాన్ని అంతా, నేల తల్లికి ధారపోస్తున్నాడు.

ఆ) శ్రీశ్రీ తన నవ్య కవిత్వాన్ని ఎవరికి సమర్పిస్తానన్నాడు?
జవాబు:
శ్రీశ్రీ తన నవ్య కవిత్వాన్ని, కార్మికుల కల్యాణానికీ, శ్రామికుల సౌభాగ్యానికి సమర్పిస్తానన్నాడు. ముల్లోకాలలో, మూడు కాలాల్లో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని, తెలుపుతానన్నాడు. కష్టజీవులూ, కర్మవీరులూ అయిన కార్మికులకు, నిత్యమంగళం నిర్దేశిస్తానన్నాడు. వారికి స్వస్తి వాక్యములు పలుకుతానన్నాడు. స్వర్ణ వాద్యములు మ్రోగిస్తూ, ఆర్త జీవుల వేదనలే పునాదిగా, భావివేదములు లోకానికి వినిపిస్తానన్నాడు.

ఇ) శ్రీశ్రీ దేనికి ఖరీదు కట్టలేమన్నాడు?
జవాబు:
ఆరుగాలం శ్రమించి తమ బలాన్ని భూమికి ధారపోసే కర్షక వీరుల శరీరంపై ప్రవహించే ఘర్మజలానికి, ఖరీదు కట్టలేమన్నాడు. గనుల్లో, అడవుల్లో, కార్యానాల్లో పనిచేస్తూ, ధనవంతులైన యజమానులకు దాస్యం చేస్తూ, యంత్రాలతో పనిచేసే కార్మికుల కళ్ళల్లో కణ కణ మండే విలాపాగ్నులకూ, గల గలా తొణకే విషాదపు కన్నీళ్లకూ ఖరీదు కట్టలేమన్నాడు.

ఈ) కార్మిక వీరుల కన్నులను కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
కార్మిక వీరుల కన్నుల నిండా, కణ కణ మండే విలాపాగ్నులు ఉంటాయనీ, గల గలా ప్రవహించే దుఃఖపు కన్నీళ్ళు ఉంటాయనీ కవి వర్ణించాడు.

ఉ) శ్రీశ్రీ వేటిని పాటలుగా రాస్తానన్నాడు?
జవాబు:
లోకంలో జరిగే అన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యములు, దౌర్జన్యములు, పరిష్కరించే, బహిష్కరించే – దారులు తీస్తాననీ, ఆ విషయాన్ని పాటలుగా రాస్తాననీ శ్రీ శ్రీ అన్నాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) కర్షకుల శ్రమను గురించి రాయండి.
జవాబు:
విరామమంటే తెలియని కష్టజీవి కర్షకుడు. నాగలిని నమ్ముకొని బతికేవాడు. పంటపొలాలకే తన జీవితాన్ని ధారపోసి పంటను పండిస్తాడు. చేలు దున్నడం, నీరు పెట్టడం, గట్టు లంకలు కొట్టడం, తొరేలు వేయడం, నారుమళ్ళు పోయడం, నారు తీయడం, ఊడ్చడం, ఎరువులు వేయడం, పంట పండాక కోత కోయడం, మోపులు కట్టడం, ధాన్యం నూర్చడం, ఎగుర పోయడం, బస్తాలకు కట్టడం, బళ్ళపై ఇళ్ళకు చేర్చడం, వాటిని అమ్మడం – ఇలా కర్షకులు నిత్యం ఎంతో శ్రమపడతారు.

ఆ) కార్మికులంటే ఎవరు? వారి జీవన విధానం ఎలా ఉంటుందో ఆలోచించి రాయండి.
జవాబు:
కార్మికులు అంటే చేతివృత్తుల వారు. అలాగే పరిశ్రమలలో యంత్రాల వద్ద పనిచేసే సహాయకులు. ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే వారు రోజుకు 8 గంటలు పనిచేయాలి. భోజనానికి మాత్రం విరామం ఇస్తారు. వీరు పరిశ్రమల్లో రసాయనిక పదార్థాల గాలులను పీలుస్తూ, పరిశ్రమల ముడిపదార్థాలను యంత్రాల వద్దకు చేరుస్తూ, వాటిని ఎత్తుతూ కష్టపడాలి. సామాన్యంగా వీరికి ఆ వాతావరణం పడక అనారోగ్యం వస్తూ ఉంటుంది.

ఇళ్ళ వద్ద పనిచేసే కమ్మరి, కుమ్మరి, మేదరి వంటి వారు తమకు పని ఉన్నంత సేపూ పని చేస్తారు. తాపీ, వడ్రంగి, ఇనుప పనివారలు రోజుకు ఏడు, ఎనిమిది గంటలు ఎండల్లో నిలబడి పనిచేయాలి.

ఇ) ప్రపంచమంతా భాగ్యంతో ఎప్పుడు వర్ధిల్లుతుంది?
జవాబు:
కర్షకులు, కార్మికులు సుఖసంతోషాలతో ఉంటే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది. సకాలంలో వర్షాలు కురిసి, వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.

పరిశ్రమలలో కార్మికులు సమ్మెలు, బండ్లు లేకుండా యజమానులతో సామరస్యంగా ఉండి మంచి ఉత్పత్తిని సాధిస్తే, ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.

ప్రభుత్వమూ, పారిశ్రామికవేత్తలూ, కర్షకుల, కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి. వ్యవసాయ కూలీలకు 365 రోజులూ పని చూపించాలి. కార్మికులకూ, కర్షకులకూ పెన్షనులు ఏర్పాటు చేయాలి. కార్మిక, కర్షకుల పిల్లలకు విద్యా, వైద్య సదుపాయాలు, స్కాలర్ షిప్పులూ ఇవ్వాలి. అప్పుడే ప్రపంచ భాగ్యం వర్ధిల్లుతుంది.

ఈ) అభాగ్యులను, అనాథలను చూస్తే మీకేమనిపిస్తుందో రాయండి.
జవాబు:
అభాగ్యులను, అనాథలను చూస్తే, నాకు బాధ కలుగుతుంది. నా మిత్రులతో, నా తల్లిదండ్రులతో చెప్పి, వారికి సాయం చేద్దామనిపిస్తుంది. అభాగ్యులకు, అనాథలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తే బాగుండుననిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయంలో చొరవ చూపితే మేలనిపిస్తుంది. ధనవంతులు అభాగ్యులు, అనాథల కన్నీళ్ళు తుడవాలనీ, వారికి అండగా నిలిచి ఆదుకోవాలని అనిపిస్తుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటలలో రాయండి.
జవాబు:
‘రైతు విరామ మెరుగని కష్టజీవి. ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని కోరేవాడు అతను. నాగలిని చేతపట్టి పొలాలను దున్ని బంగారాన్ని పండిస్తాడు. తన శరీరంలోని ప్రతి చెమట బొట్టును దేశానికే ధారపోయాలనుకుంటాడు. లోకానికి సుఖం కలిగేందుకు విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న రైతుల చెమటకు విలువ కట్టలేము.

కార్మికుడు ప్రపంచమంతా సంపదలతో తులతూగాలని కోరుకుంటాడు. తమ నరాల చేతుల సత్తువతో, వరహాల వర్షం కురిపించాలని, ప్రపంచ సౌభాగ్యం కోసం, గనుల్లో, అడవుల్లో, కార్యానాల్లో కష్టపడుతూ, ధనవంతులకు దాస్యం చేసే కార్మికుల కళ్ళల్లో మండే దుఃఖాగ్నికి, కారే కన్నీళ్ళకూ ఖరీదు కట్టలేము.

కాబట్టి లోకంలో అన్యాయాలు, ఆకలి, బాధ, దరిద్రం, దౌర్జన్యం పోయే విధంగా పాటలు రాస్తాను. నా కొత్త కవిత్వం కార్మికుల, శ్రామికుల సౌభాగ్యానికి సమర్పిస్తాను. ముల్లోకాల్లో శ్రమైక జీవన సౌందర్యానికి సాటిలేదని చెపుతూ కార్మికులకు స్వస్తి వాక్యాలు పలుకుతాను. బంగారు వాద్యాలు మ్రోగిస్తాను. ఆర్తుల జీవితం పునాదిగా, భావి వేదాలు లోకానికి చవిచూపిస్తాను.

వేలకొలదీ వృత్తుల చిహ్నాలే, నేను పలికే కొత్త పాటకూ, కొత్త రీతికీ, భావం, భాగ్యం, ప్రాణం, ఓంకారం” అంటున్నాడు శ్రీశ్రీ.

ఆ) మీ పరిసరాల్లో ఉన్న కష్టజీవుల జీవన విధానాన్ని రాయండి.
(లేదా)
మీ పరిసరాల్లో ఉన్న ఎవరైనా ఇద్దరి కష్టజీవుల జీవన విధానాన్ని రాయండి.
జవాబు:
మా పరిసరాలలో చాలా మంది కష్టజీవులు ఉన్నారు. వారు ఉదయం వేకువజామునే లేచి తమతమ వృత్తులలోనికి వెళతారు. వారు ప్రతిరోజూ ఎటువంటి. అవరోధాలు వచ్చినా తమ బ్రతుకును వెళ్ళదీస్తుంటారు. వారిలో కొందరు ఆటోరిక్షాలు నడుపుతూ జీవిస్తారు. కొందరు అద్దె టాక్సీలు నడుపుతారు. కొందరు దుకాణాల్లో పనిచేస్తారు. వారి ఆడవాళ్ళు పాచిపని, అంట్లు తోమడం వగైరా పనులు చేసి జీవిస్తారు.

అందులో మగవారు పగలంతా కష్టపడి పని చేయడంవల్ల, ఆ శ్రమ పోతుందనే భ్రాంతితో తాగుడుకు అలవాటు, పడ్డారు. తాగి చిందులు తొక్కుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు తిండి తిప్పలు లేక, పస్తులు పడుకుంటారు. ఇందులో కొందరు పొరుగూరు వెళ్ళి వ్యవసాయం పనులు చేస్తారు. ఆ పనులు అన్ని రోజులూ ఉండవు. కాబట్టి పనులు దొరకని రోజుల్లో వీరికి జీవితం నడవడం కష్టమవుతోంది.

వీరి పిల్లలు చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారు. కొద్దిమంది కాన్వెంట్ లో చదువుతారు. అక్కడ ఫీజులు కట్టలేక బాధపడుతూ ఉంటారు. వీరు అప్పులు తెచ్చుకొంటూ ఉంటారు. అప్పులు ఇచ్చినవాళ్ళు బాకీ తీర్చలేని వార్ని తిడుతూ ఉంటారు. దాంతో తగవులు వస్తూ ఉంటాయి.

3. విత్తు నాటింది మొదలు పంట చేతికందే వరకు రైతు పడే కష్టాలు అనేకం. అటువంటి రైతుపడే కష్టాన్ని గురించి సొంత మాటల్లో రాయండి.
జవాబు:
విత్తు నాటింది మొదలు పంట చేతికందే వరకు రైతు పడే కష్టాలు ఇన్నీ అన్నీ అని చెప్పలేము. రైతు కష్టజీవి. విరామమంటే తెలియని శ్రామికుడు కర్షకుడు. నాగలిని నమ్ముకొని బతికేవాడు. పంట పొలాలకే తన జీవితాన్ని ధారపోసి పంటను పండిస్తాడు. చేను దున్ని, నీరు పెట్టి, నారుమళ్ళు పోసి, నారు తీసి, నాటు వేసి, ఎరువులు చల్లి, కోత కోసి, మోపులు కట్టి, కుప్పవేసి, పంట నూర్చి, తూర్పార పట్టి, బస్తాల కెత్తి, ధాన్యం బస్తాల కెత్తి ఇంటికి చేర్చి, అమ్మడం మొదలైన పనులు కర్షకుల శ్రమను తెలుపుతాయి.

అందుకే శ్రీ.శ్రీ. “ఆరుగాలం శ్రమించి భూమికి ధారపోసే కర్షక వీరుల శరీరంపై ప్రవహించే ఘర్మ జలానికి ఖరీదు కట్టలేమ”న్నాడు.

రైతు నాగలిని నమ్ముకొన్నాడు. పొలాలకే తన జీవితాన్ని ధారపోసి, భూమిలో బంగారు పంటలు పండించాలనీ కోరుకుంటున్నాడు. లోకమంతా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే పొలాలను నాగళ్ళతో దున్నుతున్నాడు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాడు.

IV పదజాలం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అ) మనం కష్టపడితే గాని ఘర్మజలం విలువ తెలియదు.
జవాబు:
ఘర్మజలం = చెమట
పరుగు పెడితే శరీరం అంతా ఘర్మజలంతో నిండుతుంది.

ఆ) జీవులెన్నో ధరిత్రి మీద జీవిస్తున్నాయి.
జవాబు:
ధరిత్రి = భూమి
ఈ పుణ్యధరిత్రి ఎందరో మహామహులకు కన్నతల్లి.

ఇ) సీత హేమా భరణాలు ధరించింది.
జవాబు:
హేమం = బంగారు
ఇటీవల కాలంలో హేమం ధర చుక్కలనంటుతోంది.

ఈ) జలం తాగితేనే దాహం తీరుతుంది.
జవాబు:
జలం = నీరు
కృష్ణానదిలోని జలం మురికి అయిపోతున్నది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

2. కింది వాక్యాలు పరిశీలించండి.
అ) ఉగాది తెలుగువారి నూతన వర్మం.
ఆ) వర్షం పడుతుందని గొడుగు తీసుకువచ్చాను.

పై వాక్యాల్లో వర్షం అనే పదానికి సంవత్సరం, వాన అనే రెండు అర్థాలు ఉన్నట్లు తెలుస్తోంది కదా ! ఇలా ఒక మాటకు అనేక అర్థాలు వస్తే వాటిని నానార్థాలు అంటారు.

కింది పదాలకు నానార్థాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.

ఇ) భూతం :
జవాబు:
భూతం (నానార్థాలు) : పిశాచము, జరిగిపోయిన కాలం, ప్రాణి

వాక్యప్రయోగములు :

  • నిన్ను బహుశః భూతం పట్టుకొంది. (పిశాచము)
  • ఈ విషయము నేటిది కాదు భూతమునకు సంబంధించినది. (జరిగిపోయిన కాలం)
  • పంచ భూతములలో వాయువు ముఖ్యమైనది.

ఈ) కరం :
జవాబు:
కరం : చెయ్యి, తొండము, మిక్కిలి, కిరణము

వాక్యప్రయోగములు :

  • నీ కరములు మురికిగా ఉన్నాయి. (చేతులు) .
  • ఏనుగు కరము సహాయంతో నీరు త్రాగుతుంది. (తొండము)
  • సూర్య కరములు నేడు తీక్షణముగా ఉన్నాయి. (కిరణములు)
  • వానికి తల్లిదండ్రులపై కరము ప్రియము. (మిక్కిలి)

3. కింది వాక్యాలను చదవండి.

బంగారం ధర బాగా పెరిగింది. అయినా ఆ పుత్తడి అంటే అందరికీ మక్కువే. కానీ మనసు బంగారమైతే ఈ స్వర్ణ మెందుకు?

పై వాక్యాల్లో బంగారం, పుత్తడి, స్వర్ణం అనే పదాలకు ఒకటే అర్థం అని గ్రహించారు కదా ! ఇలా ఒకే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయపదాలు అంటారు. కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.
అ) హలం ఆ) జగం ఇ) జలం – ఈ) ధ్వని ఉ) అగ్ని
జవాబు:
అ) హలం : నాగలి, లాంగలము, సీరము

వాక్యప్రయోగములు :

  • కర్షకుడు ఎప్పుడూ హలంను నమ్ముకుంటాడు.
  • నాగలితో పొలమును దున్ని పంటలను పండిస్తాడు.
  • రైతుకు అతిముఖ్యమైన పనిముట్టు సీరము.
  • ఇప్పుడు రైతులు లాంగలముతో దున్నడం మాని, ట్రాక్టర్లతో పొలాలను దున్నుతున్నారు.

ఆ) జగం : లోకము, జగత్తు, భువనము
వాక్యప్రయోగములు :

  • జగం అంతా మోసాల మయం.
  • లోకములో దైవభక్తులు ఎందరో ఉన్నారు.
  • జగత్తులో జిత్తులమారులు ఎక్కువయ్యారు.
  • ఈ విశ్వములో చతుర్దశ భువనములూ ఉన్నాయి.

ఇ) జలం : నీరు, ఉదకము, తోయము
వాక్యప్రయోగములు :

  • వేసవి రాగానే జలానికి కొరత ఏర్పడింది.
  • ఎక్కువగా నీరు తాగితే ఆరోగ్యం బాగుంటుంది.
  • గంగ ఉదకము మహాపవిత్రమైనది.
  • నీవు పాలల్లో తోయము ఎక్కువగా కలుపుతున్నావు.

ఈ) ధ్వని : శబ్దము, చప్పుడు, నాదము, నినాదము

వాక్యప్రయోగములు :

  • తరగతిలో పిల్లల ధ్వని వినబడడం లేదు.
  • నీ మోటారు సైకిలు ఎక్కువ శబ్దము చేస్తోంది.
  • నీవు చప్పుడు చేయకుండా కూర్చో.
  • గాన విద్వాంసుని నాదము మారుమ్రోగుతోంది.
  • కార్మికులు వ్యతిరేక నినాదములు ఇస్తున్నారు.

ఉ) అగ్ని : పావకుడు, వహ్ని, అనలము, దహనుడు

వాక్యప్రయోగములు :

  • పంచభూతాలలో అగ్ని ఒకటి.
  • ఇళ్ళన్నీ పావకుని విజృంభణంతో దగ్ధమయ్యాయి.
  • వహ్ని శిఖలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
  • అనిలుని ప్రేరేపణతో అనలము పెచ్చుమీరుతోంది.
  • పొయ్యిలో దహనుడు మండకపోతే, వంట పూర్తి కాదు.

4. గీత గీసిన పదాలకు వికృతులు రాసి, వాక్యాల్లో ప్రయోగించండి.
అ) శారీరకమైన పనులు చేయడానికి శక్తి అవసరం.
ఆ) కష్టపడితే జీవితంలో మంచి ఫలితాలు పొందవచ్చు.
ఇ) ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది.
ఈ) ప్రాణమున్నంత వరకూ నిజాయితీగా బతకాలి.
జవాబు:
అ) ఆహారం మనకు సత్తి నిస్తుంది. శక్తి (ప్ర) – సత్తి (వి)
ఆ) ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో పేదల జీతాలు అతలాకుతలమవుతున్నాయి. జీవితం (ప్ర) – జీతం (వి)
ఇ) రాములవారి పాలనలో దమ్మం నాలుగుపాదాల నడిచింది. ధర్మం (ప్ర) – దమ్మం (వి)
ఈ) నేను పానం పోయినా అసత్యమాడను. ప్రాణము (ప్ర) – పానం (వి)

V. సృజనాత్మకత

* రైతు / కార్మికుడు ఏ విధంగా కష్టపడుతున్నారో తెలుసుకొని అతని జీవనశైలిని ఆత్మకథగా రాయండి.
జవాబు:
నేను చిన్నరైతుని. నా పేరు రామయ్య. నాకు రెండు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. నాకు పెళ్ళాం, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాకు పొలం మీద వచ్చే ఆదాయం ఏ మూలకూ చాలదు. నా పిల్లలను చదివించలేకపోతున్నా. మా ఆవిడికి సరైన బట్టలు కొనలేకపోతున్నా. కడుపునిండా సరిపడ తిండి లేదు.

పక్క రైతు దగ్గర 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయాయి. అప్పులు దొరకటల్లేదు. తెచ్చిన అప్పులు తీర్చలేకపోతున్నా. ఇల్లంతా వర్షం. నేయించుకోవడానికి డబ్బులు లేవు. పండిన ధాన్యం, కౌలు రైతుకు ఇచ్చాను. బాకీలు మిగిలాయి. నా పిల్లకూ, పిల్లవాడికీ పెళ్ళిళ్ళు చేయాలి. కట్నాలు ఇవ్వలేను. నా పిల్లవాడికి రైతుబిడ్డ అని, ఎవరూ పిల్లను ఇవ్వడంలేదు. కట్నం ఇవ్వలేనని మా పిల్లను ఎవరూ పెళ్ళి చేసుకోవడం లేదు.

రైతు గొప్పవాడని అందరూ అంటారు. చూస్తే నా బ్రతుకు ఇలా ఉంది. ఇవన్నీ చూశాక, నాతోటి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో అర్థం అవుతోంది. ప్రభుత్వమే మా రైతులను ఆదుకోవాలి.

(లేదా)

* తన కవితలో శ్రీశ్రీ కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి అనే వాటిని ఆయా వృత్తులకు చిహ్నాలుగా పేర్కొన్నారు. వీటిలో మీకు నచ్చిన వస్తువును ఎన్నుకొని చిత్రం గీయండి. దాన్ని గురించి రాయండి.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ 2
ప్రక్క చిత్రంలో కుమ్మరి తన దగ్గర ఉన్న చక్రం(ఆవం)తో అందమైన కుండలను తయారుచేస్తున్నాడు. మొదట బంకమట్టి లేక ఎర్రమట్టిని తెచ్చి వాటిని బాగా కలిపి ముద్దగా చేస్తాడు. ఆ ముద్దను చక్రంపై పెట్టి తిప్పుతాడు. అప్పుడు ఆ మట్టిముద్ద అతని హస్తకళా నైపుణ్యంతో చక్కటి ఆకృతులను సంతరించుకుంటుంది. కుమ్మరి ఈ విధంగా కుండలు, ప్రమిదలు, పాలికలు, పూలకుండీలు మొదలగునవి తయారుచేస్తాడు. కానీ ప్రస్తుత కాలంలో ప్రజలు ఆధునిక పరికరాలు వాడకం వైపు మొగ్గు చూపుతుండటంతో కుమ్మరి జీవితం ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.

VI. ప్రశంస

* శ్రీశ్రీ కవితా శైలి ఎలాంటిది ? ఆయన చేసిన పద ప్రయోగం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
“ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం”

అని కొత్తగా గళమెత్తి సంచలనం రేకెత్తించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అనే రెండక్షరాలు తెలుగు కవిత్వంలో విప్లవం సృష్టించాయి. కలం పేరు శ్రీశ్రీ కాగా, అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. “కష్టజీవి”కి ఇరువైపులా నిల్చేవాడే కవి అని కొత్త నిర్వచనం ఇచ్చిన కవి శ్రీశ్రీ. ఆకాశమార్గాన పయనించే తెలుగు కవితారథాన్ని భూమార్గం పట్టించి, భూకంపం పుట్టించి “అనితరసాధ్యం నా మార్గం” అని చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. భావకవిత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తర్వాత విప్లవ కవిత్వోద్యమానికి స్ఫూర్తినిచ్చాడు.

కవితా శిల్పరచనలో ప్రవీణుడు శ్రీశ్రీ. ఈయన సారవంతమైన మహాభావ తరంగాల సంగమ స్థానము. శ్రీశ్రీ అక్షరాక్షర శిల్పి. ఈయన గేయరచనలో ఒక నవ్యత, పరాకాష్ట పొందిన లయ ఉన్నాయి. శ్రీశ్రీ యొక్క శబ్దాలంకారాలు, పదప్రయోగం విశిష్టమైనవి.

శ్రీశ్రీ కవితలో అంత్యానుప్రాసలు, అలవోకగా, అర్థవంతంగా సాగుతాయి. “హేమం పిండగ – సౌఖ్యం నిండగ”, “గనిలో, వనిలో, కార్యానాలో”, “పరిక్లమిస్తూ – పరిప్లవిస్తూ”, “విలాపాగ్నులకు – విషాదాశ్రులకు”, “బాటలు తీస్తూ – పాటలు వ్రాస్తూ”, “సంధానిస్తూ – సంరావిస్తూ”, “జాలరి పగ్గం – సాలెల మగ్గం”, “నా వినుతించే – నా విరుతించే, నా వినిపించే – నా విరచించే వంటి అనుప్రాసలు, పదప్రయోగం అర్థవంతంగా ఈ కవితలో ఉన్నాయి. అవి అద్భుతమైన లయతో, శ్రుతి మనోహరంగా ఉన్నాయి.

కార్మికుల శ్రమైక జీవన సౌందర్యానికి, వారి ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడని శ్రీశ్రీ యథార్థాన్ని చెప్పాడు. శ్రీశ్రీ ఆవేశంగా చెప్పేటప్పుడు సంస్కృత సమాసబంధుర శబ్దాలు ప్రయోగిస్తాడు. స్వస్తి వాక్యములు సంధానిస్తూ, స్వర్ణ వాద్యములు సంరావిస్తూ, వ్యధార జీవిత యథార్ధ దృశ్యం, శ్రామిక లోకపు సౌభాగ్యానికి” వంటి సంస్కృత సమాసాలు అందుకు ఉదాహరణం.

శ్రీశ్రీ పదాలతో బంతులాటలాడతాడు. “దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ”, “త్రిలోకాలలో, త్రికాలాలలో,” “భావివేదముల, జీవనాదములు” వంటివి ఇందుకు ఉదాహరణలు.

శ్రీశ్రీ అన్యాయాలు, ఆకలి, వేదన, దరిద్రము పోయే మార్గంలో నవ్యకవిత్వం రాస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కార్మికుల వృత్తుల చిహ్నాలను తన కవితకు భావంగా, ప్రాణంగా, ప్రణవంగా స్వీకరించాడు.

సమాజాన్ని చైతన్యపరిచి, అభ్యుదయ కవిత్వానికి యుగకర్తగా వుండి, కొత్త తరానికి బాటలు వేసి, తనవాణిని జాతి జనులు పఠించే మంత్రంగా విరచించి, ప్రపంచ పీడిత జనానికి బాటసగా నిల్చి, వేమన, గురజాడల బాటలో నడిచి, తెలుగు కవిత్వంలో నిలువెత్తు సంతకంగా నిలిచిన శ్రీశ్రీ ప్రజాకవి. సమాజకవి.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

(లేదా)

* మన గ్రామాల్లో, పట్టణాల్లో రకరకాల వృత్తుల వాళ్ళుంటారు. వాళ్ళంతా రెక్కల కష్టం మీద ఆధారపడ్డవాళ్ళే. వాళ్ళ దగ్గరకు వెళ్ళండి. తాము చేస్తున్న పనిలో వాళ్ళు పొందే ఆనందాన్ని గమనించండి. వాళ్ళను ప్రశంసించండి. వాళ్ళను ఏ విధంగా అభినందించారో రాయండి.
జవాబు:
వృత్తి పని చేసే పెద్దలారా ! మీరు నిజంగా మన సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. మీకు ఈ వృత్తుల వల్ల వచ్చే సంపాదన మీ భార్యాబిడ్డలను పోషించడానికి సరిపోదు. అయినా మీరు మీ కులవృత్తులను కొనసాగిస్తున్నారు. గ్రామ, నగర సంస్కృతిని మీరు రక్షిస్తున్నారు.

మీ వడ్రంగులు వారి పని చేయకపోతే, ఇళ్ళకు తలుపులు, కిటికిలూ లేవు. మీ తాపీవారు ఇళ్ళు కట్టకపోతే, మాకు ఇళ్ళే లేవు. మీ రైతులు పంటలు పండించకపోతే మాకు తిండి లేదు.

మీ కమ్మర్లు కత్తులు, కొడవళ్ళు చేయకపోతే మాకు ఆ సాధనాలే ఉండేవి కావు. మీ కుమ్మర్లు ప్రమిదలు, కుండలు, పాలికలు తయారుచేయకపోతే దీపావళికి దీపాలు లేవు. పెళ్ళిళ్ళలో అయిరేణికుండలు లేవు. అంకురార్పణలకు పాలికలు లేవు.

మీరు కడుపులు మాడ్చుకుని, అర్ధాకలితో మీ తోటివారికి సాయం చేస్తున్నారు. మీకు నా అభినందనలు. మీరు మన దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు. పెద్దలారా ! సెలవు.

ప్రాజెక్టు పని

* శ్రీశ్రీ రాసిన కవితలను / గీతాలను సేకరించండి.
వాటిలో ఏదైనా ఒకదాన్ని రాసి రాగ భావయుక్తంగా పాడి వినిపించండి
జవాబు:
శ్రీశ్రీ గేయము :
మహాప్రస్థానం

1. మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి

2. కదం తొక్కుతూ
పదం పాడుతూ
హృదంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం

3. దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు
బాటలు నడచీ
పేటలు కడచీ
కోటలన్నిటిని దాటండి
నదీనదాలూ
అడవులు, కొండలు,
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి

4. ఎముకలు క్రుళ్ళిన
వయస్సు మళ్ళిన
సోమరులారా ! చావండి
నెత్తురు మండే
శక్తులు నిండే
సైనికులారా ! రారండి
హరోం హరోం హర
హరహర హరహర
హరహర హరహర
హరోం హరా అని కదలండి
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది.

VII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది పదాలను విడదీసి, సంధుల పేర్లను రాయండి.

అ) విరామమెరుగక = విరామము + ఎరుగక – ఉత్వసంధి
ఆ) జగానికంతా = జగానికి + అంతా – ఇకారసంధి
ఇ) విలాపాగ్నులు = విలాప + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
ఈ) అనేకులింకా = అనేకులు + ఇంకా = ఉత్వసంధి
ఉ) విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు = సవర్ణదీర్ఘ సంధి

2) కింది విగ్రహవాక్యాలను సమాసపదాలుగా కూర్చండి. సమాసాల పేర్లను రాయండి.

అ) ముగ్గురైన దేవతలు = ముగ్గురు దేవతలు – ద్విగు సమాసం
ఆ) రెండైన గంటలు = రెండు గంటలు – ద్విగు సమాసం

3) కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి. ఏ సమాసమో రాసి కారణాలు చర్చించండి.

అ) నాలుగు వేదాలు = నాలుగైన వేదాలు – ద్విగు సమాసం
ఆ) రెండు చేతులు = రెండైన చేతులు – ద్విగు సమాసం
ఇ) త్రికరణాలు = మూడైన కరణాలు – ద్విగు సమాసం
ఈ) కోటిరత్నాలు = కోటి సంఖ్య గల రత్నాలు – ద్విగు సమాసం
ఉ) ముప్ఫైరోజులు = ముప్ఫై అయిన రోజులు – ద్విగు సమాసం
ఊ) మూడు జిల్లాలు = మూడైన జిల్లాలు – ద్విగు సమాసం
ఋ) నూరుపద్యాలు = నూరైన పద్యాలు – ద్విగు సమాసం

పైన తెలిపిన విగ్రహవాక్యాలకు అన్నింటికి సంఖ్యావాచక విశేషణాలు పూర్వపదంలో ఉన్నాయి. కాబట్టి వీటిని ద్విగు సమాసాలు అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

4) ఈ కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) రుకియా బజారుకు వెళ్ళింది. రుకియా కూరగాయలు కొన్నది.
జవాబు:
రుకియా బజారుకి వెళ్ళి, కూరగాయలు కొన్నది.

ఆ) కృష్ణ బొబ్బిలి వెళ్ళాడు. కృష్ణ ఇల్లు కట్టాడు.
జవాబు:
కృష్ణ బొబ్బిలి వెళ్ళి, ఇల్లు కట్టాడు.

ఇ) తాతగారు ఇంటికి వచ్చారు. తాతగారు కాఫీ తాగారు.
జవాబు:
తాతగారు ఇంటికి వచ్చి, కాఫీ తాగారు.

ఈ) మాధురి తోటకి వెళ్ళింది. మాధురి పువ్వులు కోసింది.
జవాబు:
మాధురి తోటకి వెళ్ళి, పువ్వులు కోసింది.

ఉ) చిన్నా సినిమాకి వెళ్ళాడు. చిన్నా ఐస్ క్రీమ్ తిన్నాడు.
జవాబు:
చిన్నా సినిమాకి వెళ్ళి, ఐస్ క్రీమ్ తిన్నాడు.

5) కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా ? ఆజాద్ డేవిడ్ కంటే చిన్నవాడా?
జవాబు:
ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా? చిన్నవాడా?

ఆ) జయ ఇంటికి వెళ్ళింది. విజయ బడికి వెళ్ళింది.
జవాబు:
జయ ఇంటికి, విజయ బడికి వెళ్ళారు.

ఇ) స్వప్న అన్నం తిన్నది. పద్మ పండ్లు తిన్నది.
జవాబు:
స్వప్న అన్నం, పద్మ పండ్లు తిన్నారు.

ఈ) రమ అందమైనది. రమ తెలివైనది.
జవాబు:
రమ అందమైనదీ, తెలివైనది.

ఉ) పావని సంగీతం నేర్చుకుంది. పావని నృత్యం నేర్చుకుంది.
జవాబు:
పావని సంగీతమూ, నృత్యమూ నేర్చుకుంది.

ఊ) రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
జవాబు:
రైలు వచ్చింది కాని చుట్టాలు రాలేదు.

6) కింది పేరా చదవండి. సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాలను గుర్తించండి. రాయండి.

ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పశ్చిమబెంగాల్ లో జన్మించాడు. ఈయన సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నేర్చుకున్నారు. చదువు పూర్తయింది. ఈశ్వరచంద్రుడు ఉద్యోగంలో చేరాడు. ఈయన ప్రధానోపాధ్యాయునిగా, ప్రత్యేక తనిఖీ అధికారిగా పనిచేశాడు. ఈ ఉద్యోగం అతనికి రుచించలేదు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి, అనేక బాలికా పాఠశాలలు స్థాపించాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. అంతేగాక తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించి, సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడయ్యాడు.
సామాన్య వాక్యాలు :

  • ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పశ్చిమ బెంగాల్ లో జన్మించాడు.
  • విద్య పూర్తయింది.
  • ఈశ్వరచంద్రుడు ఉద్యోగంలో చేరాడు.
  • ఈ ఉద్యోగం అతనికి రుచించలేదు.
  • ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
  • వితంతు వివాహాలు ప్రోత్సహించాడు.

సంక్లిష్ట వాక్యాలు :

  • స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి, అనేక బాలికా పాఠశాలలను స్థాపించాడు.
  • అంతేగాక తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించి, సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడైనాడు.

సంయుక్త వాక్యాలు :

  • ఈయన సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నేర్చుకున్నాడు.
  • ఈయన ప్రధానోపాధ్యాయునిగా, ప్రత్యేక తనిఖీ అధికారిగా పనిచేశాడు.

7) గసడదవాదేశ సంధి :
అ) కింది పదాలను ఏ విధంగా విడదీశారో గమనించండి.
గొప్పవాడుగదా = గొప్పవాడు + కదా (డు + క)
కొలువుసేసి = కొలువు + చేసి (వు + చే)
వాడుడక్కరి = వాడు + టక్కరి (డు + ట)
నిజముదెలిసి = నిజము + తెలిసి (ము + తె)
పొలువోయక = పాలు + పోయక (లు + పో)

పై ఉదాహరణలు గమనించారు కదా ! పూర్వపదం చివర ప్రథమావిభక్తి ప్రత్యయాలున్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప లున్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీది ప్రత్యయాలకు క, చ, ట, త, పలు పరమైతే వాటిస్థానంలో గ, స, డ, ద, వలు ఆదేశంగా వస్తాయి. అంటే –
క → ‘గ’ గా మారుతుంది
చ → ‘స’ గా మారుతుంది
ట → ‘డ’ గా మారుతుంది
త → ‘ద’ గా మారుతుంది
ప → ‘వ’ గా మారుతుంది.
(క చ ట త ప లకు గ స డ ద వలు ఆదేశంగా వస్తాయి.)
పాలు

కింది పదాలను విడదీసి రాయండి. వివరించండి.

అ) నిక్కముదప్పదు
నిక్కము + తప్పదు = నిక్కము దప్పదు (ము + త)

పూర్వ పదం చివర ‘ము’ అనే ప్రథమావిభక్తి ప్రత్యయము ఉన్నది. పరపదము మొదట ‘త’ అనేది పరమైనపుడు ‘ద’ అనే పదం వచ్చింది. త, దగా మారింది.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ఆ) ప్రాణములుగల్లి – ప్రాణములు + కల్గి
ఇ) పొడగానరాక – పొడ + కానరాక
ఈ) నోరసూపు – నోరు + చూపు
ఉ) నీరుద్రావి – నీరు + త్రావి
ఊ) పాలుదాగి + తాగి

ద్వంద్వ సమాస పదాల విషయంలో కూడా గసడదవాదేశసంధి కనిపిస్తుంది.

ఆ) కింది పదాలను గమనించండి.

కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి → చేతు + లు
టక్కుడెక్కులు టక్కు + టెక్కు + లు
తల్లిదండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు = ఊరు + పల్లె + లు

పై పదాలు ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు.

ద్వంద్వ సమాసంలో కూర + కాయ అన్నప్పుడు ‘క’ స్థానంలో ‘గ’ వచ్చింది. ఈ విధంగా కచటతపలకు, గసడదవలు రావడాన్నే గసడదవాదేశం అంటారు. సూత్రం : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి. కింది పదాలను కలపండి.

అ) అక్క + చెల్లెలు = అక్కాచెల్లెలు
ఆ) అన్న + తమ్ముడు = అన్నాదమ్ములు

8. తత్పురుష సమాసం :
అ) కింది పదాలు చదవండి. వాటికి విగ్రహవాక్యాలు చూడండి.
అ) రాజభటుడు
ఆ) తిండిగింజలు
ఇ) పాపభీతి

‘రాజభటుడు’ లో ‘రాజు’ పూర్వపదం, “భటుడు” ఉత్తరపదం. అట్లే తిండిగింజలు – తిండి కొఱకు గింజలు – ‘తిండి’ పూర్వపదం ‘గింజలు’ ఉత్తరపదం. పాపభీతి – పాపం వల్ల భీతి – ‘పాపం’ పూర్వపదం, ‘భీతి’ ఉత్తర పదం.

రాజభటుడుకు విగ్రహవాక్యం రాస్తే ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో ‘యొక్క’ అనేది షష్ఠీవిభక్తి ప్రత్యయం. భటుడు రాజుకు చెందినవాడని చెప్పడానికి షష్ఠీవిభక్తి ప్రత్యయాన్ని వాడాం. ఇలా విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు :

తత్పురుష సమాసం రకాలు విభక్తులు ఉదాహరణ
ప్రథమా తత్పురుష సమాసం డు,ము,వు, లు మధ్యాహ్నం – అహ్నము మధ్య భాగం
ద్వితీయా తత్పురుష సమాసం ని,ను,ల,కూర్చి, గుఱించి జలధరము – జలమును ధరించినది
తృతీయా తత్పురుష సమాసం చేత,చే, తోడ,తో బుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు
చతుర్టీ తత్పురుష సమాసం కొఱకు, కై వంటకట్టెలు వంట కొఱకు కట్టెలు
పంచమీ తత్పురుష సమాసం వలన, కంటె, పట్టి దొంగభయం – దొంగ వలన భయం
షష్ఠీ తత్పురుష సమాసం కి,కు, యొక్కలో, లోపల రామబాణం – రాముని యొక్క బాణం
సప్తమీ తత్పురుష సమాసం అందు,న దేశభక్తి – దేశమునందు భక్తి
నఞ్ తత్పురుష సమాసం నఞ్ అంటే వ్యతిరేకార్థం అసత్యం – సత్యం కానిది

ఆ) కింది పదాలు చదవండి. విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో రాయండి.
అ) రాజపూజితుడు = రాజు చేత పూజితుడు (తృతీయా తత్పురుషం)
ఆ) ధనాశ = ధనము నందు ఆశ (సప్తమీ తత్పురుషం)
ఇ) పురజనులు = పురము నందలి జనులు (సప్తమీ తత్పురుషం)
ఈ) జటాధారి = జడలను ధరించువాడు (ద్వితీయా తత్పురుషం)
ఉ) భుజబలం = భుజము యొక్క బలం (షష్ఠీ తత్పురుషం)
ఊ) అగ్నిభయం = అగ్ని వలన భయం (పంచమీ తత్పురుషం)
ఋ) అన్యాయం న్యాయం కానిది. (నః తత్పురుషం)

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

బాట : దారి, మార్గం, పథం
స్వామి : ప్రభువు, దొర, యజమాని
కళ్యాణం : పెండ్లి, పరిణయం, ఉద్వాహం
హేమం : బంగారం, సువర్ణం, కాంచనం
జగం : లోకం, ప్రపంచం
ఖరీదు : మూల్యం , వెల
పాట : గీతం, గేయం
కాయం : శరీరం, దేహం, తనువు, మేను
దాస్యం : సేవ, ఊడిగం
ఇల : భూమి, ధరిత్రి, ధరణి

వ్యుత్పత్యర్థాలు

ధర్మము – ధరించబడేది.
అశ్రువులు – దుఃఖంతో కన్నుల నుండి కారే నీరు

నానార్థాలు

బలం – తావు, సామర్థ్యం, శక్యం
కాలం – సమయం, మరణం
భాగ్యం – అదృష్టం, సంపద
వర్షం – వాన, సంవత్సరం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.
విలాపాగ్నులు = విలాప + అగ్నులు – సవర్ణదీర్ఘ సంధి
విషాదాశ్రువులు = విషాద + అశ్రువులు – సవర్ణదీర్ఘ సంధి
వృధార్తి = వృధ + ఆర్తి – సవర్ణదీర్ఘ సంధి

వృద్ధి సంధి
సూత్రం : ఆకారమునకు ఏ, ఐ లు పరమగునుపుడు ‘ఐ’ కారమును; ఓ, ఔలు పరమగునపుడు ‘ఔ కారమును ఏకాదేశమగును.
శ్రమైక – శ్రమ + ఏక – వృద్ధి సంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి యగును.
సమానమైనది = సమానము + ఐనది – ఉత్వసంధి
జగత్తు అంతా = జగత్తుకు + అంతా – ఉత్వసంధి
చవులిస్తాను = చవులు + ఇస్తాను – ఉత్వసంధి
విరామమెరుగక = విరామము + ఎరుగక – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

ఇత్వసంథి
సూత్రం : మధ్యమ పురుష క్రియలయందు ఇత్తునకు సంధియగు.
జగానికంత = జగానికి + అంతా – ఇత్వసంధి
వర్ధిల్లాలని = వర్ధిల్లాలి + అని – ఇత్వసంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
విషాదాశ్రువులు విషాదం అనే అశ్రువులు రూపక సమాసం
విలాపాగ్నులు విలాపం అనెడి అగ్నులు రూపక సమాసం
యంత్రభూతములు యంత్రములు అనెడి భూతములు రూపక సమాసం
ఘర్మజలము ఘర్మము అనెడి జలము రూపక సమాసం
సహస్రవృత్తులు సహస్త్ర సంఖ్య గల వృత్తులు ద్విగు సమాసం
నరాల బిగువు నరాల యొక్క బిగువు షష్ఠీ తత్పురుష సమాసం
కరాల నృత్యం కరాల యొక్క నృత్యం షష్ఠీ తత్పురుష సమాసం
కుమ్మరి చక్రం కుమ్మరి యొక్క చక్రం షష్ఠీ తత్పురుష సమాసం
సాలె మగ్గం సాలెల యొక్క మగ్గం షష్ఠీ తత్పురుష సమాసం
కార్మిక లోకం కార్మికుల యొక్క లోకం షష్ఠీ తత్పురుష సమాసం
వ్యధార్తి వ్యధతో ఆర్తి తృతీయా తత్పురుష సమాసం
నవ్యకవిత్వం నవ్యమైన కవిత్వం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
భావివేదం భావియైన వేదం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సమస్త చిహ్నాలు సమస్తమైన చిహ్నాలు విశేషణ పూర్వనద కర్మధారయ సమాసం
నవీన గీతి నవీనమైన గీతి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నవీనరీతి నవీనమైన రీతి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జీవన సౌందర్యం జీవనమందలి సౌందర్యం సప్తమీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

కష్టం – కస్తి
ప్రాణం – పానం
భాగ్యము – బాగెము
మంత్రం – జంత్రము
ఆకాశం – ఆకసం
అగ్ని – అగ్గి
రత్నము – రతనము
ప్రతిజ్ఞ – ప్రతిన
శ్రీ – సిరి
ధర్మము – దమ్మము

కవి పరిచయం

పూర్తి పేరు : శ్రీరంగం శ్రీనివాసరావు

జననం : 1910 వ సం||

జన్మస్థలం : విశాఖపట్టణం

తొలి రచన : పద్దెనిమిదేళ్ళ నాటికే “ప్రభవ” అనే భావకవితా సంపుటి.

మహాకవిగా : ఈయన రచించిన అభ్యుదయ కవితా సంపుటి ‘మహాప్రస్థానం’తో మహాకవి అయ్యారు.

విప్లవకవిగా : ఖడ్గసృష్టి, మరోప్రస్థానం గీతాలు రాశారు.

ఇతర రచనలు : మూడు యాభైలు పేరిట వ్యంగ్య కవితలు, కార్టూను కవితలు, 1+1= 1 లేక డిసెంబరు 31, 1999 పేరిట రేడియో నాటికలు.

రచనా శైలి : ‘చరమరాత్రి’ కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు. సృజనకు, ప్రతిభకు, తాత్త్విక మార్గాన్వేషణకు పేరుగన్నవాడు. నూతన పదప్రయోగాల మార్గదర్శకుడు.

కవితా వస్తువులు : కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలే శ్రీశ్రీ కవితావస్తువులు.

మరణం : 15-6-1983 వ సంవత్సరం

గేయాలు- అర్ధాలు- భావాలు

1వ గేయం

పొలాల నన్నీ,
హలాల దున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం. ధరిత్రికి బలి కావించే,
కర్షకవీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ !
అర్థాలు :
పొలాల నన్నీ = అన్ని పొలాలనూ ; (భూములనూ)
హలాల దున్నీ = నాగళ్ళతో దున్ని
ఇలా, తలంలో = భూమి ప్రదేశంలో (భూమిపై)
హేమం, పిండగ = బంగారాన్ని పిండడానికి (బంగారు పంటలు పండించడానికి)
జగానికంతా = లోకాని కంతా
సౌఖ్యం నిండగ = నిండుగా సౌఖ్యం కలగడానికి
విరామ మెరుగక = విశ్రాంతి లేకుండా
పరిశ్రమించే = ఎక్కువగా శ్రమించి అలసిపోయే
బలం ధరిత్రికి = తన బలాన్ని భూమికి (ధారపోసే)
బలి కావించే = బలి ఇచ్చే
కర్షకవీరుల = రైతు వీరుల
కాయం నిండా = శరీరం నిండా
కాలువకట్టే = కాలువలా ప్రవహించే
ఘర్మజలానికి = చెమటకు
ఘర్మజలానికి = చెమట నీటికి
ఖరీదు లేదోయ్ – విలువ కట్టలేము

భావం :
విరామమే తెలియని కష్టజీవి రైతన్న. ప్రపంచమంతా సుఖంగా ఉండాలని కోరేవాడు అతను. నాగలిని నమ్ముకొని జీవించే కష్టజీవి. పొలాలకు జీవితాన్ని ధారపోసి బంగారాన్ని పండిస్తాడు. ఈ రైతు శరీరమంతటినుంచి అంతటా స్రవించే చెమట ధర్మజలం. ఆ ధర్మజలానికి ఖరీదు కట్టలేము.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

2వ గేయం

నరాల బిగువూ,
కరాల సత్తువ
వరాలవర్షం కురిపించాలని,
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని –
గనిలో, వనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ,
పరిప్లవిస్తూ,
ధనికస్వామికి దాస్యం చేసే,
యంత్రభూతముల కోరలు తోమే,
కార్మికవీరుల కన్నుల నిండా
కణకణ మండే,
గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబు లేడోయ్ !
అర్థాలు :
నరాల బిగువూ = (తన) నరముల బింకాన్నీ (సత్తువను)
కరాల సత్తువ = (తన) చేతుల బలమునూ
వరాలవర్షం కురిపించాలని = వరహాలు వర్షంగా కురిపించాలని (సిరులు కురిపించాలని)
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని = (తాను పండించిన పంటలతో) ప్రపంచంలో ఐశ్వర్యం వృద్ధి చెందాలని
గనిలో = గనులలో
వనిలో = అడవులలో
కార్ఖానాలో = కర్మాగారాలలో
పరిక్లమిస్తూ – ఎక్కువగా శ్రమిస్తూ
పరిప్లవిస్తూ = తేలియాడుతూ (గంతులు వేస్తూ) (పనిలో గాఢంగా నిమగ్నమవుతూ)
ధనికస్వామికి = ధనవంతుడైన యజమానికి
దాస్యం చేసే = బానిసత్వాన్ని చేసే
యంత్రభూతముల = దయ్యాలవంటి పరిశ్రమలలోని యంత్రముల
కోరలు తోమే = పళ్ళు తోమే (యంత్రముల మధ్య పనిచేసే)
కార్మిక వీరుల = వీరులైన కార్మికుల
కన్నుల నిండా = కండ్ల నిండుగా
కణకణ మండే = నిప్పుల్లా కణ కణమని మండే
విలాపాగ్నులకు (విలాప + అగ్నులకు) = దుఃఖముతో కూడిన మాటలనే అగ్నులకు
విషాదాశ్రులకు (విషాద + అశ్రులకు) = దుఃఖపుకన్నీళ్ళకు
ఖరీదు కట్టే = విలువను నిర్ణయింప గల
షరాబు లేడోయ్ = బంగారపు వ్యాపారి లేడు

భావం :
కార్మికుడు ఎప్పుడూ ప్రపంచమంతా సంపదలతో తులతూగాలని కోరుకుంటాడు. దానికోసం తన శక్తినంతా పణంగా పెడుతున్నాడు. గనులలో కాని, అడవులలో కాని, కర్మాగారాలలో కాని అడుగడుగునా యజమానులకు సేవ చేయటానికి అంకితము అవుతున్నాడు. కార్మికుని జీవితం యంత్రాలలో చిక్కుకుపోయింది. కార్మిక వీరుల కష్టసుఖాలలో పాలు పంచుకునేవారు ఎవరూ లేరు. కార్మికుని దుఃఖానికి, అగ్నిగోళాల వంటి కళ్ళనుండి కారుతున్న కన్నీటికి ఖరీదు కట్టలేము.

3వ గేయం

కావున – లోకపుటన్యాయాలూ,
కాల్చే ఆకలి, కూల్చే వేదన,
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ
నాలో కదలే నవ్యకవిత్వం
కార్మికలోకపు కళ్యాణానికి,
శ్రామికలోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని
అర్ధాలు :
కావున = కాబట్టి
లోకపుటన్యాయాలు (లోకము + అన్యాయాలు) = లోకంలో జరిగే అన్యాయాలు
కాల్చే ఆకలి = కడుపును మండించే ఆకలి
గలగల తొణకే – గల గల మని ధ్వని చేస్తూ పొంగే
కూల్చే వేదన = మనిషిని పడగొట్టే మానసిక బాధ
దారిద్య్రాలూ – దరిద్రములూ
దౌర్జన్యాలూ = దుర్మార్గాలూ
పరిష్కరించే = చక్కపెట్టే (పోగొట్టే)
బహిష్కరించే = వెలివేసే (పై చెప్పిన అన్యాయాలను దూరం చేసే)
బాటలు తీస్తూ = దారులు తొక్కుతూ
పాటలు వ్రాస్తూ = గేయాలు రాస్తూ
నాలో కదలే నవ్య కవిత్వం = నాలో నుండి వచ్చే కొత్త కవిత్వం
కార్మికలోకము + కల్యాణానికి = కార్మికుల శుభానికి
శ్రామికలోకము + సౌభాగ్యానికి = శ్రమించే రైతుల, కార్మికుల, పనివారల, మంగళానికి (వైభవానికి)
సమర్పణంగా = భక్తితో అర్పించడానికి
సమర్చనంగా = విశేషమైన పూజగా అందించడానికి
త్రిలోకాలలో = మూల్లోకాలలో (స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలలో)
త్రికాలలో = భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో
శ్రమైక జీవన సౌందర్యానికి = శ్రమించి బ్రతకడంలో గల అందానికి
సమానమైనది = సమానమైనది
లేనేలేదని = లేదని

భావం :
“ఈ లోకంలో జరిగే అన్యాయాలను, ఆకలిని వేదనను, దారిద్ర్యాన్ని, దౌర్జన్యాలను నిరసిస్తున్నాను. వాటిని పరిష్కరించాలని, బహిష్కరించాలని ఈ పాటలను రాస్తున్నాను. నాలో కదిలేది కొత్త కవితావేశం. ఇది కార్మికుల కళ్యాణానికి, శ్రామికుల సౌభాగ్యానికి అంకితం. ఎందుకంటే ముల్లోకాలలో ఈ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదు.” అని శ్రీశ్రీ చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 5 ప్రతిజ్ఞ

4వ గేయం

కష్టజీవులకు కర్మ వీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తివాక్యములు సంధానిస్తూ,
స్వర్ణవాద్యములు సంరావిస్తూ –
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్ !
అర్థాలు :
కష్టజీవులకు = కష్టపడి జీవించే రైతులకూ, కార్మికులకూ, చేతివృత్తుల వారికీ
కర్మవీరులకు = కష్టపడి పట్టుదలతో పని చేసేవారికి
నిత్యమంగళం = నిత్యమూ శుభాన్ని
నిర్దేశిస్తూ = చూపిస్తూ
స్వస్తి వాక్యములు = మంగళ వాక్యములు (శుభము కలగాలని ఆశీర్వదించే వాక్యములు)
సంధానిస్తూ = కూరుస్తూ
స్వర్ణవాద్యములు = బంగారు వాయిద్యములు
సంరావిస్తూ = మ్రోగిస్తూ
వ్యధార జీవిత (వ్యధా + ఆర్త, జీవిత) = బాధచే పీడింపబడిన జీవితము యొక్క
యథార్థ దృశ్యం = నిజమైన దృశ్యము
పునాదిగా = మూలంగా
జనించబోయే = పుట్టబోయే
భావివేదముల = రాబోయే కాలంలోని వేదాల
జీవనాదములు = జీవధ్వనులు
జగత్తుకంతా = ప్రపంచానికంతా
చవులిస్తానోయ్ = రుచి చూపిస్తాను

భావం :
బంగారు వాద్యాలతో, స్వస్తి మంత్రాలతో, కష్ట జీవులకూ, కర్మవీరులకూ హారతులిస్తాను. శ్రామికుల బాధలు కళ్ళకు కట్టినట్లుగా రాబోయే తరాలవారికి చెప్తాను. నా మాటలు భావిభారత తరాలకు వేదాలు, జీవనాదాలు అంటాడు శ్రీశ్రీ.

5వ గేయం

కమ్మరి కొలిమి, కుమ్మరిచక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల, సమస్త చిహ్నలు-
నా వినుతించే పునాదిగా ఇక జనించబోయే
నా విరుతించే,
నా వినిపించే నవీనగీతికి,
నా విరచించే నవీనరీతికి,
భావం
భాగ్యం !
ప్రాణం !
ప్రణవం !
అర్థాలు :
కమ్మరి కొలిమి = ఇనుప పనిచేసే కమ్మరివాని కొలిమి (నిప్పు గుంట)
కుమ్మరి చక్రం = కుమ్మరి కుండల తయారీకి వాడే చక్రం
జాలరి పగ్గం = చేపలు పట్టేవాని వలతాడు
సాలెల మగ్గం = బట్టలు నేసేవాని మగ్గం
శరీర కష్టం స్ఫురింపజేసే = శరీర కష్టాన్ని తెలిపే
గొడ్డలి, రంపం = గొడ్డలి, రంపం
కొడవలి, నాగలి = కొడవలి, నాగలి వంటి
సహస్ర వృత్తుల = వేలకొలదీ వృత్తి పనివారల
సమస్త చిహ్నాలు = అన్ని గుర్తులూ
నా వినుతించే = నేను కొనియాడే
నా విరుతించే – నేను ధ్వనించే
నా వినిపించే నవీనగీతికి = నేను వినిపించే కొత్త పాటకు
నా విరచించే : నేను రచించే
నవీన రీతికి = కొత్త పద్ధతికి
భావం = భావము
భాగ్యం = భాగ్యము
ప్రాణం = ప్రాణము
ప్రణవం = ఓంకార నాదము

భావం :
ఈ దేశంలో శరీర కష్టం చేసేవారు చాలామంది ఉన్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి మొదలైన పనిముట్లు వివిధ వృత్తులకు గుర్తులు. ఆ గుర్తులే నా కవితా వస్తువులు. నేను వారి కొరకే గీతాలు రాస్తాను. ఆ శ్రామికులు, కార్మికులు నా కవిత్వంలో నాయకులు. అదే భావం, భాగ్యం, నా కవితకు ప్రాణం, ఓంకారం.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 4 అజంతా చిత్రాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 4th Lesson అజంతా చిత్రాలు

8th Class Telugu 4th Lesson అజంతా చిత్రాలు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు 1

ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
పై చిత్రంలో అంబర్ పేట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు బస్సులో విహారయాత్రకు వెళ్ళడానికి బస్సు ఎక్కుతున్నారు. కొందరు పిల్లలు బస్సు ఎక్కారు. మరి కొందరు ఎక్కుతున్నారు. వారి ఉపాధ్యాయులూ, ఉపాధ్యాయినులూ దగ్గరుండి, పిల్లలను బస్సు ఎక్కిస్తున్నారు.

ప్రశ్న 2.
విహారయాత్ర అంటే ఏమిటి? ఎందుకు వెళతారు?
(లేదా)
యాత్రల వల్ల దేశాన్ని చూడవచ్చు, విజ్ఞానాన్ని సంపాదించవచ్చు – అని రచయిత అన్నారు కదా ! యాత్రల వల్ల ఇంకా ఇతర ప్రయోజనాలేమిటి ?
జవాబు:
వినోదం ప్రధానంగా చేసుకొని, చేసే యాత్రను విహారయాత్ర అంటారు. పుస్తక పఠనం వల్ల పుస్తక జ్ఞానం మాత్రమే లభిస్తుంది. లోకానుభవం, ప్రజల ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవాలంటే యాత్రలు చేయవలసి ఉంది. విజ్ఞానయాత్రల వలన మానసికోల్లాసంతోపాటు, విజ్ఞానం పెరుగుతుంది. ప్రసిద్ధమైన పరిశ్రమలు, ప్రాజెక్టులు, తీర్థయాత్ర స్థలములు, అందమైన దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ విహారాలు, శిల్పకళా క్షేత్రములు మొదలయిన వాటిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
ఒక అందమైన ప్రదేశాన్నో, దృశ్యాన్నో చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది?
జవాబు:
ఒక అందమైన ప్రదేశాన్నో, దృశ్యాన్ని చూసినపుడు మనసుకు ఆనందం కలుగుతుంది. ఆ దృశ్యము ఎప్పటికీ మరవకూడదని మన వెంట తెచ్చుకున్న కెమేరాలలో బంధిస్తాము. తరువాత అప్పుడప్పుడు వాటిని చూస్తూ ఉంటే మన , తిరిగిన ఆ ప్రదేశాలు అన్నీ గుర్తుకు వచ్చి, మనసుకు మధురానుభూతి కలుగుతుంది.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
మీరు ఏదైనా ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళారా? ఆ ప్రదేశాన్ని గురించి చెప్పండి.
జవాబు:
మేము సంక్రాంతి సెలవులలో మా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మా తరగతిలోని విద్యార్థులమంతా కలసి ‘నాగార్జున సాగర్’ విహారయాత్రకు వెళ్ళాం. నాగార్జున సాగర్ చేరాక స్టీమర్ ద్వారా నాగార్జున కొండకు బయలుదేరాము. స్టీమర్ లో ప్రయాణిస్తున్నంత సేపు చల్లని గాలి, కనుచూపు మేర కృష్ణా నది, దూరంగా కొండలు మాలో సంతోషాన్ని నింపాయి. ఆ నాగార్జున కొండలో పూర్వం ఒక గొప్ప విశ్వవిద్యాలయం ఉన్నట్లుగా ఇప్పటికీ ఆధారాలు కన్పిస్తున్నాయి. అక్కడ ఆచార్య నాగార్జునుడనే ఒక గొప్ప తత్త్వవేత్త, ఆయుర్వేద పండితుడు ఉండేవాడని మా ఉపాధ్యాయులు చెప్పారు. అంతేగాక అక్కడి మ్యూజియంలో ఉన్న బుద్ధుని పాలరాతి శిల్పాలను చూశాం. బౌద్ధమత విశిష్టతను గురించి తెలుసుకున్నాం. తర్వాత మేము నాగార్జున సాగర్ ఆనకట్ట వద్దకు చేరాం. జల విద్యుత్ తయారయ్యే విధానాన్ని స్వయంగా చూసి తెలుసుకున్నాం. తిరుగు ప్రయాణంలో ఎత్తిపోతల జలపాతాన్ని, మాచర్ల చెన్నకేశవాలయాన్ని, వీరభద్రాలయాన్ని చూశాం.
ఈ విహారయాత్ర మాలో ఆనందంతో పాటు విజ్ఞానాన్ని కూడా నింపింది.

ప్రశ్న 2.
పాఠంలోని ఒక అంశాన్ని గ్రహించి అది మీకు ఎందుకు నచ్చిందో చెప్పండి.
జవాబు:
ఈ పాఠంలో ఏడవ పేరా నాకు నచ్చింది. ఆ పేరాలో అజంతా గుహలలోకి ప్రవేశించే దారిని నార్లవారు వర్ణించారు. అక్కడ ప్రకృతి వర్ణన నాకు నచ్చింది. అక్కడ నాలుగువైపులా కొండలే ఉన్నాయట. ఇక కొండ పక్కన నది. ఆ నదిలో నీళ్ళు నీలంగా ఉన్నాయి. పైన ఆకాశము నీలమే. ఆ పక్కనే పచ్చని చెట్లు ఉన్నాయట. ఆ చెట్ల పూలు కమ్మని వాసనలను ఇస్తున్నాయి. నిజంగానే అక్కడికి వెళ్ళి చూస్తున్నట్లు నార్లవారు వర్ణించారు. వారు చెప్పినట్లు అది ఒక కలల లోకం. అది నిజంగానే భూలోకంలోని స్వర్గం. వారు చెప్పినట్లు అది నిజంగా మరో ప్రపంచం – అందుకే నాకు ఆ అంశం నచ్చింది.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రశ్న 3.
పాఠం చదువుతుంటే మీకు వచ్చిన ఆలోచనలను, అనుభూతిని వివరించండి.
జవాబు:
అజంతా గుహలు పాఠం చదువుతూ ఉంటే, పెద్ద అయ్యాక తప్పకుండా వెళ్ళి ఒకసారి ఆ గుహల అందాన్ని చూసి రావాలనిపించింది. అక్కడ బుద్ధుని చిత్రాలను, నెహ్రూగారిని సైతం ఆకర్షించిన అక్కడి అందమైన స్త్రీల చిత్రాలనూ చూడాలని అనిపించింది. ఆ కొండల వరుస గూర్చి చదువుతూ ఉంటే, నిజంగానే ఏదో కలలో కొండలమీద నేను తిరుగుతున్నట్టు అనిపించింది. అజంతా గుహల సౌందర్యాన్నీ, అక్కడి చిత్రాలనూ, తప్పక వీలయినంత త్వరలో మా కుటుంబ సభ్యులతో కలిసి చూద్దామని ఉంది.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

ప్రశ్న 1.
పాఠం చదవండి. వర్ణనతో కూడి ఉన్న ఐదు వాక్యాలను గుర్తించండి. వాటి కింద గీత గీయండి. చదివి వినిపించండి.
జవాబు:
1. మీ పైన నీలాకాశం, మిమ్ము అలరిస్తూ అడవి పువ్వులు, మిమ్ము ఆవరిస్తూ ఆ పువ్వుల కమ్మని నెత్తావులు. గుహలను చేరే వరకు రెండు, మూడు మెలికలను కాబోలు మీరు తిరుగుతారు. ఏ మెలికలో అడుగుపెడితే, దానికి అదే ఒక ప్రపంచం.

2. ఇటు కొండ-అటు కొండ, ముందు కొండ వెనుక కొండ-పైన కొండ, పక్కనే నది – నీలాకాశం – నీలాల నీళ్ళు – పచ్చని చెట్లు – కమ్మని తావులు, అది వేరే ప్రపంచం – అదొక స్వాప్నిక జగత్తు. భూలోక స్వర్గము.

3. రాళ్ళ గుట్టల గుండా జలజల ప్రవహిస్తూ, నది పాడుకొనే పాటలను వింటూ, నది అంచు వెంట కాలినడకన, గుహలకు చేరాలి.

4. గుహలను సమీపిస్తూంటే ఇటు పచ్చని కొండ, అటు పచ్చని కొండ ఈ రెండు కొండల మధ్య వాఘోరా నది.

5. కొలను నుంచి కొలనుకు జాలువారుతూ, 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది.

ప్రశ్న 2.
కింద సూచించిన పదాలతో మొదలయ్యే పేరాలు చదివి, సరిపోయే శీర్షికలను సూచించండి.

పేరా శీర్షిక
ఇటీవలనే …….. అవ్యక్తానుభూతి
వాఘోరానది పుట్టి ………. వ్యూపాయింట్ – మేజర్ గిల్
గుహల గోడలకు ………… శిథిలావస్థలో అజంతా చిత్రాలు
అజంతా గుహల నిర్మాణం ……….. సర్వోత్తమ కృషి
ఇక్కడ అందాలొలుకు ……….. అందాలొలుకు అజంతా స్త్రీలు

ప్రశ్న 3.
కింది పేరా చదివి పట్టికను పూరించండి.
అజంతా గుహలు మొత్తం 29. వాటిలో 5 బౌద్ధ చైత్యాలైతే మిగిలిన బౌద్ధ విహారాలు. మొత్తం 29లో మూడింటిని ప్రారంభించి పూర్తి చేయకుండానే ఆపివేశారు. ఇవి తప్ప మిగిలిన అన్నింటినీ చిత్రాలతో నింపివేశారు. కాని ఈనాడు పదమూడు గుహలలో మాత్రమే ఆ చిత్రాల శిథిలాలు కానవస్తున్నాయి. చెక్కు చెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలు మిగిలింది ఒకటవ, రెండవ, తొమ్మిదవ, పదవ, పదహారవ, పదిహేడవ గుహలలోనే. అజంతా గుహలలోని కొన్ని చిత్రాలకు నకళ్ళు వేయించి హైదరాబాదు పబ్లిక్ గార్డెన్స్ లోని అజంతా పెవిలియన్లో భద్రపరిచారు.
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు 2

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అ) నార్ల వేంకటేశ్వరరావు గురించి రాయండి.
(లేదా)
అజంతా చిత్రాలు పాఠ్యభాగ రచయిత గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
నార్ల వేంకటేశ్వరరావు 1908 డిసెంబర్ 1వ తేదీన కృష్ణా జిల్లాలోని ‘కవుతరం’ అనే గ్రామంలో జన్మించారు. ఈయన రష్యన్ కథలు (అనువాద రచన), నరకంలో హరిశ్చంద్రుడు (నాటకం), నార్లవారి మాట (పద్య కావ్యం) మొదలైన గ్రంథాలను రచించారు. ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం కృషిచేసిన మేధావి. ఈయన రచన సరళంగా సొగసైన భావాలతో సుందర శైలిలో నడుస్తుంది.

ఆ) అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి ? వాటి విశిష్టతను తెలపండి.
జవాబు:
అజంతా గుహలు జల్గామ్ కు దక్షిణంగా 35 మైళ్ళ దూరంలో, ఔరంగాబాదు ఉత్తరంగా 55 మైళ్ళ దూరాన ఉన్నాయి. అజంతా గుహలలోని భారతీయ చిత్రకళ, అంతకు ముందుగాని, ఆ తర్వాత గాని అందుకోనంతటి మహోన్నత శిఖరాలను అందుకొంది. వాఘోరా నది పుట్టిన చోటుననే అజంతా గుహలున్నాయి. బౌద్ధభిక్షువులు అక్కడ చిత్రాలను చిత్రించారు. అజంతా గుహలు మనల్ని స్వాప్నిక జగత్తులోకి తీసుకొని వెడతాయని చెప్పి నెహ్రూ గారు అజంతా చిత్రకళను మెచ్చుకోవడం వాటి విశిష్టతను వెల్లడిస్తోంది.

ఇ) వాఘోరానది గురించి రాయండి.
జవాబు:
అజంతా గుహలు వాఘోరానది పుట్టిన చోటనే ఉన్నాయి. అజంతా గుహలను సమీపిస్తుంటే, రెండు వైపులా పచ్చని కొండలుంటాయి. ఆ రెండు కొండల మధ్య వాఘోరానది ఉంది. కొండలు అక్కడ ఎన్ని కనిపించినా, అవన్నీ ఒకే కొండ, ఆ కొండ చివర మెలికే వాఘోరానది జన్మస్థానం. కొండపైన ఏడు కొలనులు ఉన్నాయి. ఒక కొలను నుండి మరో కొలనులోకి ప్రవహిస్తూ 250 అడుగుల ఎత్తు నుంచి పెద్ద ధారగా వాఘోరా నది కొండ దిగువకు దూకుతుంది. దూకిన తరువాత కొండతో పాటు తాను కూడా మెలికలు తిరిగి, సమతల ప్రదేశానికి చేరి, కొన్ని వందల మైళ్ళు ప్రవహించి, ‘తపతి’ నదిలో కలుస్తుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ఈ) నేడు అజంతా గుహలు ఏ స్థితిలో ఉన్నాయి?
జవాబు:
నేడు అజంతా గుహల గోడలు శిథిలావస్థలో ఉన్నాయి. గుహల గోడలకు మట్టి గిలాబా వేసి, దానిపై పలుచగా సున్నం పూసి తడి ఆరకముందే చిత్రాలను వేసినందువలన, అవి వానతేమకు పొడిపొడిగా వూడిపోయాయి. బందిపోటు దొంగలు పెట్టిన పొగకు కొన్ని చిత్రాలు మసిబారాయి. ఇటీవల కాలంలో కొంతమంది తమ కీర్తి సంపాదన కోసం గోళ్ళతో బొమ్మలపై తమ పేర్లను వ్రాసినారు. మరికొన్ని చిత్రాలు శిథిలావస్థలో ఉన్నాయి. అజంతా గుహలు మొత్తం 29. వీటిలో మూడింటిని ప్రారంభించి, పూర్తిచేయకుండానే ఆపివేశారు. ఈనాడు 13 గుహల్లోనే చిత్రాల శిథిలాలు కనిపిస్తున్నాయి. 1, 2, 9, 10, 11, 17 గుహల్లోనే చెక్కుచెదరకుండా ఎన్నో కొన్ని చిత్రాలున్నాయి. మొత్తం మీద నూటికి ఒకటవ వంతో, రెండవ వంతో చిత్రాలు మాత్రమే అజంతా గుహలలో నేడు మిగిలాయి.

ఉ) అజంతా శిల్పాలలో ఏమేమి ప్రతిబింబిస్తాయి?
జవాబు:
అజంతా చిత్రాలు భారతీయ జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఇవి ఒక విశాల ప్రపంచాన్ని, ఆశ నిరాశలతో, రాగ విద్వేషాలతో, ప్రేమ ద్వేషాలతో, సంతోష విషాదాలతో, కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. గౌతమ బుద్ధుని కారుణ్య సందేశం, మనుష్యులకే కాక, పశుపక్ష్యాదుల జీవితాన్ని సయితం ఎంత పవిత్రం చేసిందో, తేజోవంతం చేసిందో అనేదాన్ని, ఈ అజంతా శిల్పాలు ప్రతిబింబిస్తాయి. ప్రాచీన కాలంలోని భారత సాంఘిక వ్యవస్థ, ఏ రూపంలో ఉండేదో, ఆనాటి వృత్తులేవో, వ్యాసంగాలేవో, వినోదాలేవో తెలిసికోవాలనుకునేవారు అజంతా గుహలకు వెళ్ళి దర్శించాలి.

III. స్వీయరచన

1) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) మేజర్ గిల్ వేటకు వెళ్ళి తొలిసారిగా అజంతా గుహలను దర్శించినట్టు చదివారు కదా ! దీనివలన మనదేశానికి జరిగిన మేలు ఏమని భావిస్తున్నారో రాయండి.
జవాబు:
మేజర్ గిల్ అనే బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ 1819లో వేటకు వెళ్ళి ఒక జంతువును తరుముకుంటూ కొండపైకి పోయి, ఎదురుగుండా గుబురు చెట్ల సందు నుంచి సాహసించి కొండ దిగాడు. వాఘోరా నదిని దాటి కొండలపై నుంచి చూశాడు. అల్లంత దూరంలో మేజర్ గిల్, వ్యూపాయింట్ ని చూశాడు.

ఆనాడు మేజర్ గిల్ అజంతా గుహలను దర్శించి మనకు వాటిని గూర్చి తెలపడం వల్ల మనకు ఎంతో మేలు జరిగింది. ప్రాచీనకాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది ? అప్పటి వృత్తులేవి ? వ్యాసంగాలేవి ? ఇలాంటి ప్రశ్నలన్నిటికి సమాధానాలు ఈ చిత్రాల వల్ల లభిస్తున్నాయి. ఒకప్పుడు మనదేశంలో రాణ్మందిరాలు, రాణులు, రాజులు వారి వేషభాషలూ ఎలా ఉండేవో, వారు రాజసభలను ఎలా తీర్చేవారో అజంతా చిత్రాల వలన మనం తెలుసుకోగలుగుతున్నాము.

ఆ) జవహర్ లాల్ నెహ్రూ “అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళుతుంది” అన్నాడు. ఆయన ఈ మాట ఎందుకు అన్నాడో రాయండి.
జవాబు:
అజంతా గుహలను, మన తొలి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు దర్శించి, ఆ చిత్రాలను చూస్తే మన మనస్సు కలల ప్రపంచంలోకి వెడుతుంది అన్నారు.

అజంతా గుహల్లో అందమైన స్త్రీల చిత్రాలు అనేకం ఉన్నాయి. రాకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు మొదలయిన అనేక స్త్రీల చిత్రాలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్న స్త్రీల చిత్రాలలో కొందరు స్త్రీలు కూర్చున్నారు. కొందరు నిలబడి ఉన్నారు. మరి కొందరు ముస్తాబు చేస్తున్నారు. కొందరు ఊరేగింపుగా వెడుతున్నారు. ఈ అజంతా స్త్రీల చిత్రాలు, ఎంతో పేరు పొందాయి. అలాగే అక్కడ బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాలు ఉన్నాయి. అక్కడ చిత్రకారులు బుద్ధుని చిత్రాలను ఎంత శ్రద్ధతో అందంగా తీర్చిదిద్దారో, అంతే శ్రద్ధతో స్త్రీల చిత్రాలను సైతం, అందాలొలికేలా గీశారు.

అటువంటి అపురూప చిత్రాలను మనం కేవలం కలల్లోనే చూడగలం. వాస్తవిక లోకంలో చూడలేం. అందుకే నెహ్రూగారు, ఆ చిత్రాలు మనల్ని స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడతాయి అని ప్రశంసించారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ఇ) “ప్రాచీన కాలంలో భారత సాంఘిక వ్యవస్థ ఏ రూపంలో ఉండేది? అప్పటి వృత్తులేవి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కోరితే అజంతా గుహలకు వెళ్ళాలి” ఇలా అనడం వెనుక నార్ల వేంకటేశ్వరరావు గారి భావం ఏమై ఉంటుందో రాయండి.
జవాబు:
అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతున్నాయి. వాటి ద్వారా వివిధ భారతీయ జీవితాల్ని గురించి, సంస్కృతి గురించి, వారి వృత్తులు మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలుగుతున్నాం. అజంతా చిత్రాల ద్వారా మన ప్రాచీన సాంఘిక వ్యవస్థ గురించి తెలుసుకోవచ్చు.

ఆ అజంతా చిత్రాలలో ఒకప్పుడు మనదేశంలో రాజమందిరాలు ఏ విధంగా ఉండేవో, రాజులు, రాణులు వేషభాషలు ఎలా ఉండేవో, వారు రాజసభలను ఎలా తీర్చుకొనేవారో తెలుస్తుంది. రాజుల సైనిక బల నిర్మాణం, వారి ఆయుధాలు, ఎలా ఉండేవో ఆ చిత్రాల వల్ల తెలుసుకోవచ్చు. అక్కడ చిత్రాలలో మన భారత సాయుధ దళాలు సింహళ దండయాత్ర చేసిన నౌకాదళ చిత్రాలున్నాయి. వీరశివాజీ, రాజ్యానికై సముద్రాలు దాటి వెళ్ళిన భారతదేశ వ్యక్తుల చిత్రాలున్నాయి. పర్ష్యన్ రాయబారులకు దర్శనం ఇచ్చిన మన భారతీయ రాజుల చిత్రాలు ఉన్నాయి. అందువల్లనే, నార్లవారు అజంతా చిత్రాల ద్వారా ఆనాటి భారత సాంఘిక వ్యవస్థ రూపం వెల్లడి అవుతుందని చెప్పారు.

ఈ) “అజంతా గుహలను చూడడానికి రెండు కళ్ళు చాలవు” అని రచయిత అన్నాడు కదా ! ఇలా “రెండు కళ్ళు చాలవు” అనే మాటను ఇంకా ఏయే సందర్భాలలో వాడతారు? కొన్నింటిని తెలపండి.
జవాబు:
ఎంత గొప్ప అందాన్ని అయినా, మనం మన రెండు కళ్ళతోనే చూడగలం. బాగా అందమైన వస్తువును ఎంత చూచినా, ఎంతగా చూచినా తృప్తి కలగదు. అలాంటప్పుడు ఆ అందాలను చూడ్డానికి రెండు కళ్ళూ చాలలేదు అని అంటారు.

నార్ల వేంకటేశ్వరరావుగారు అజంతా చిత్రాల అందం చూడ్డానికి మనకు ఉన్న రెండు కళ్ళూ చాలవు అన్నారు. అలాగే కింది సందర్భాల్లో కూడా రెండు కళ్ళూ చాలలేదు అంటూ ఉంటాము.

1. వేంకటేశ్వరస్వామిని గుడిలో ఆభరణాలతో అలంకరించినపుడు ఆ సొగసులను చూడ్డానికి మన రెండు కళ్ళూ చాలలేదని అంటాము.

2. చంటి పిల్లవాడిని చక్కగా అలంకరించి, తొట్టెలో వేసి ఊపుతాము. ఆ పిల్లవాడు బోసినవ్వులు నవ్వుతాడు. అప్పుడు కూడా, ఆ పిల్లవాడి బోసి నవ్వుల అందాలను చూడ్డానికి రెండు కళ్ళూ చాలలేదని అంటాము.

3. పెళ్ళి దుస్తులలో ఆకర్షణీయమైన అలంకరణలతో ధగధగా మెరిసిపోయే వధూవరులను చూడటానికి రెండు కళ్ళూ చాలవు అంటాము.

4. అతిలోక సౌందర్యరాశి అయిన స్త్రీని వర్ణించే సందర్భాల్లో ఆమె అందం చూసేందుకు రెండు కళ్ళూ చాలవు అంటాము.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

2. కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

అ) ప్రస్తుత పాఠ్యభాగం ద్వారా అజంతా గొప్పతనాన్ని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
“అజంతా, మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెళుతుంది” అన్న నెహ్రూ మాటలను సమర్థిస్తూ అజంతా గొప్పదనాన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
అజంతా గుహలు “జల్గామ్”కు దక్షిణంగా, 35 మైళ్ళదూరంలో, “ఔరంగాబాద్’కు ఉత్తరంగా 55 మైళ్ళ దూరంలో ఉన్నాయి. ఈ గుహలు వాఘోరా నది పుట్టిన చోటుననే ఉన్నాయి. నాల్గు పక్కలా కొండలు, పచ్చని చెట్లు, నీలాకాశం, అదొక కలలలోకం, భూలోక స్వర్గం. ‘మేజర్ గిల్’ అనే మిలటరీ ఆఫీసర్, 1819లో వేటకు వెళ్ళి, ఈ గుహలను మొదటగా చూశాడు. 30 సంవత్సరాలు కష్టపడి ఎన్నో చిత్రాలను కాపీ చేసుకొని వాటిని అతడు ‘లండన్ క్రిస్టల్ ప్యాలెస్’లో పెట్టాడు.

ఈనాడు మిగిలిన అజంతా చిత్రాలు, నూటికి రెండు మాత్రమే. అన్ని చిత్రాలూ మిగిలి ఉంటే, అజంతా గుహలు చూడ్డానికి మన రెండు కళ్ళూ చాలేవి కావు. అజంతా చిత్రాలలో సిద్ధార్థుని జాతక కథలే ఎక్కువ. జాతక కథలతో సంబంధం లేనివి కూడా ఉన్నాయి. ఆ కళా తపస్వులు, తమ కుంచెతో సౌందర్య సృష్టిని చేశారు.

అజంతా గుహలు మొత్తం 29. గుహల నిర్మాణం ప్రథమ శతాబ్దిలో మొదలై, ఏడవ శతాబ్ది వరకూ సాగింది. 14వ శతాబ్ది నాటి వరకూ మన అజంతా చిత్రాలంత అందమైన చిత్రాలు యూరప్ ఖండంలో లేనే లేవట. అజంతాలో ఎన్నో స్త్రీల అందమైన చిత్రాలున్నాయి. బుద్ధుని సుందర చిత్రాలున్నాయి.

అజంతా చిత్రాలలో భారతీయ జీవితం, సంస్కృతి తొణికిసలాడుతుంది. ఇంత అందమైన చిత్రాలు, ఏ విదేశీ చిత్రకారుడూ గీయలేడు. ఈ అజంతా చిత్రాలు ప్రాచీన కాలంలో మన భారతీయ సాంఘిక వ్యవస్థ స్వరూపాన్ని తెలుపుతాయి. ఆనాటి రాజుల మందిరాలు, వారి వేషభాషలూ, సైనిక వ్యవస్థను గూర్చి తెలుపుతాయి.

“అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకువెడుతుంది” అని నెహ్రుగారిచే ప్రశంసించబడిన అజంతా గుహలను చిత్రకారులే కాదు భారతీయ సంస్కృతి, చరిత్ర, విజ్ఞానం మొదలైన విషయాల పట్ల శ్రద్ధాభక్తులు ఉన్న వారందరూ తప్పక దర్శించాలి.

ఆ) రచయిత అజంతా చూసి అక్కడి విశేషాలు రాశాడు కదా ! అలాగే మీరు చూసిన లేదా తెలుసుకొన్న ఒక దర్శనీయ స్థలానికి సంబంధించిన విషయాలు రాయండి.
(లేదా)
మనం కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో చాలా ప్రదేశాలకు వెళుతుంటాం. మీరు చూసిన / తెలుసుకొన్న పర్యాటక స్థలం గురించి రాయండి.
జవాబు:
నేను ఇటీవల మా కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌లో పర్యటించాను. రాజస్థాన్ రాజధాని జైపూర్. తొలుత డబుల్ డెక్కర్ బస్సులో బయలుదేరి నగరాన్ని సందర్శించాం.

ముందుగా 1799లో మహారాజు సవాయి ప్రతాప్ సింగ్ కట్టించిన హవామహల్ కు వెళ్లాం. నెమలిపింఛంలా కనిపించే ఈ భవనాన్ని పునాదులు లేకుండా నిర్మించారు. పగలు గులాబీ రంగులోనూ రాత్రి బంగారు వర్ణంలోనూ శోభిల్లే ఈ ఐదంతస్తుల భవనంలో 300 గదులు, 953 కిటికీలు ఉన్నాయి. తరవాత బిర్లాలు నిర్మించిన లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్లాం. దీనికి ఓ పక్కనే జైపూర్ కోట కనిపిస్తుంటుంది.

తరవాత రాజస్థాన్ సాంస్కృతిక వైభవాన్ని జీవన విధానాన్ని ప్రతిబింబించే సిటీ మ్యూజియానికి వెళ్లాం. విశాలమైన జైపూర్ నగరంలో అన్ని కట్టడాలకూ గులాబీరంగే. అందుకే దీన్ని ‘పింక్ సిటీ’ అని పిలుస్తారు. జైపూర్ కోటలోపల భవంతులు, గదులు…. నాటి రాజవైభవాన్ని కళ్ళకు కడతాయి. బలమైన శత్రుదాడుల్ని ఎదుర్కొన్నప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఆ ప్రాచీన కట్టడాల నిర్మాణశైలిని మెచ్చుకోకుండా ఉండలేం.

జలమహల్ గా ప్రాచుర్యం పొందిన చమేలీ బాగ్ ను కూడా సందర్శించాం. జైపూర్ నుంచి రాజస్థాన్ లో అతి పెద్ద రెండో పట్టణంగా పేరొందిన జోధ్ పూర్ కి వెళ్ళాం. నగరం నవీన రాజప్రాసాదాలకు నిలయం. కళాఖండాలకూ, తోలు వస్తువులకూ ప్రసిద్ధిచెందిన ఈ నగరం మొత్తం నీలం రంగులో ఉన్న భవంతులే. అందుకే దీనికి ‘బ్లూ సిటీ’ అని పేరు.

మేము జైసల్మేర్ ను కూడా సందర్శించాం. మహారాజ్ జైసాల్ సింగ్ 1156లో నిర్మించిన ఈ నగరం, మనదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం. పాకిస్థాన్ కి మనకీ మధ్య గీతలు గీసుకున్న పట్టణం ఇదే. ఈ నగరంలో ఎటు చూసినా బంగారు వర్ణంలో మెరిసే భవంతులే. అందుకే దీన్ని ‘గోల్డెన్ సిటీ’ అంటారు. ఈ రోజుకీ రాజప్రాసాదం ప్రాంగణంలో 400 కుటుంబాలు నివసించడం ఈ కోట ప్రత్యేకత.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలున్నాయి. రాజస్థాన్ యాత్ర ఒక గొప్ప అనుభవం. నాకు ఎన్నో అవ్యక్త మధురానుభూతులను కలిగించింది. ఈ యాత్ర ద్వారా నేను అనేక విజ్ఞానదాయకమైన విషయాలను తెలుసుకున్నాను.

IV. పదజాలం

1. కింది వాక్యాలలోని జాతీయాలకు సరిపోయే అర్థం గ్రహించి సరైన సమాధానం కింద గీత గీయండి.

అ) అజంతా గుహలోని కుడ్యచిత్రాలు నేటికీ చెక్కుచెదరలేదు. .
i) చెదిరిపోలేదు
ii) ఏమీ పాడుకాలేదు
iii) చెక్కబడలేదు
iv) శిథిలం కాలేదు
జవాబు:
ii) ఏమీ పాడుకాలేదు

ఆ) దొంగలు అజంతా గుహల్లో తలదాచుకున్నారు.
i) తలను దాచుకున్నారు
ii) వస్తువులను దాచుకున్నారు
iii) ఆశ్రయం పొందారు
iv) నివసించారు
జవాబు:
iii) ఆశ్రయం పొందారు

ఇ) అజంతా చిత్రాలు భారతీయ సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.
i) కళ్ళకు కట్టుకున్నట్టు చూపుతున్నాయి
ii) కళ్ళముందు నిజంగా ఉన్నట్టు చూపుతున్నాయి
iii) చాలా మంచి విషయాలు చూపుతున్నాయి
iv) కళ్ళు చెదిరేట్టుగా ఉన్నాయి.
జవాబు:
iii) చాలా మంచి విషయాలు చూపుతున్నాయి

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాన్ని మరో సందర్భానికి అన్వయించి వాక్యాలు తిరిగి రాయండి.

1. ఉదా : అనంతాకాశంలోని నక్షత్రాలను పరిశీలించి ఆ అనుభూతిని చెప్పగలమా?
మంచి కథను చదివితే గొప్ప అనుభూతి కలుగుతుంది.
జవాబు:
తాజ్ మహల్ ను సందర్శించినప్పుడు కలిగిన అనుభూతిని నేనెన్నటికీ మరువలేను.

అ. భారతీయ చిత్రకళ మహోన్నత శిఖరాలను అధిరోహించింది.
జవాబు:
సంగీతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రతిభ, మహోన్నత శిఖరాలను తాకింది.

ఆ. చెక్కడపు పని మేజర్ గిల్ దృష్టిని ఆకర్షించింది.
జవాబు:
అనాథశరణాలయ విద్యార్థుల ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇ. కాలగతిలో కొన్ని చిత్రాలు నశించాయి.
జవాబు:
అతడు తనకు కల్గిన దుఃఖాన్ని, కాలగతిలో మరచిపోయాడు.

ఈ. ఈ కుడ్యచిత్రాలను చిత్రించిన వారు బౌద్ధ భిక్షువులు.
జవాబు:
విజయనగర చక్రవర్తుల గృహాలలోని కుడ్యచిత్రాలలో లక్ష్మీనారాయణుల విగ్రహాలున్నాయి.

3. కింది వాక్యాలలోని పర్యాయపదాలను గుర్తించి వాటి కింద గీత గీయండి.
అ) హృదయాన్ని కదిలించే అనుభూతిని, ఆ ఎదలోని భావాలను సులభంగా వర్ణించలేం.
జవాబు:
హృదయం – ఎద

ఆ) వాఘోరానది కొండల చుట్టూ తిరుగుతూ ప్రవహించింది. ఆ వాహిని ప్రవహించే దృశ్యం మనోహరం.
జవాబు:
నది – వాహిని

ఇ) పడమటి గాలి సన్నగా వీస్తూంది. పశ్చిమ దిశ వైపు ఒక సుందరమైన తోట ఉంది.
జవాబు:
పడమర – పశ్చిమము

V. సృజనాత్మకత

* అజంతా చిత్రాల పాఠంలో అజంతా గుహల చరిత్ర, దాని విశేషాలూ చదివారు కదా ! అలాగే ప్రతి గ్రామానికీ ఒక చరిత్ర కానీ, విశేషం కానీ ఉండవచ్చు. మీ గ్రామానికి గల ప్రత్యేకతను లేదా మీకు దగ్గరలోని ఇతర గ్రామాల ప్రత్యేకతను వర్ణిస్తూ రాయండి. ఆ వివరాలతో ఒక బ్రోచర్ తయారుచేయండి.
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లాలో అల్లవరంలోని ‘కొంగరగిరిపట్టణం’ – ఇది కోరుకొండ రాజధానిగా ‘కుమారగిరి రాయలు’ పరిపాలించినపుడు ఆయన పేర వెలసిన గ్రామం. ఇది సముద్ర తీరంలోని గ్రామం. ప్రక్కన బంగాళాఖాతం ఉంది. పూర్వం సముద్రంలో ప్రయాణించే ఓడలు ఇక్కడ ఆగేవి. ఇప్పటికీ దాన్ని ‘ఓడలరేవు’ అంటారు. ఈ గ్రామం గుండా రామలక్ష్మణులు ప్రయాణించారు. అందులో రాముడు ‘నత్తా రామేశ్వరం’ అనే ప్రాంతంలో ఈశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట. రాముడు ప్రతిష్ఠించడం వల్ల దాన్ని రామేశ్వరం అని పిలుస్తారు. మహాశివరాత్రికి మా చుట్టుపట్ల పల్లె గ్రామాల ప్రజలు సముద్రంలో స్నానం చేసి రామేశ్వరునికి అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.

అలాగే లక్ష్మణుడు మా గ్రామంలోనే ఒక ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దాన్ని ‘లక్ష్మణేశ్వరం’ అని పిలుస్తారు. సంక్రాంతికి ధనుస్సమయంలో ప్రజలు లక్ష్మణేశ్వరునికి అభిషేకాదులు చేస్తారు. ఇక్కడ సంక్రాంతి, కనుమనాడు ప్రభలతీర్థం చాలా వేడుకగా జరుగుతుంది. మా గ్రామ ప్రజలంతా వేడుకగా ఆ తీర్థంలో పాల్గొంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు
(లేదా)
* చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల నుండి జలజల జాలువారే జలపాతాలు, పచ్చని ప్రకృతి శోభ, పక్షుల కిలకిలా రావాలతో ఆ ప్రదేశం ఎంతో సుమనోహరంగా ఉంది …….. ఇలా ఏదైనా ఒక ప్రాంతాన్ని వర్ణిస్తూ రాయండి.
జవాబు:
కోస్తా ప్రాంతములోని నెల్లూరు జిల్లాలో రావూరు ఒక చెప్పుకోదగిన తాలూకా. ఈ రావూరుకు సమీపంలో ఎత్తైన కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్య నుంచి ఒక దారి ఉంది. కొండల మధ్యదారి మలుపులు తిరిగి మెలికలుగా ఉంటుంది. కొండల పైకి వెళ్ళిన తరువాత ఒక సుప్రసిద్ధమైన క్షేత్రం ఉంటుంది. దీనినే “పెంచలకోన” అని కూడా అంటారు. ఈ కోనలో కొండల మధ్య నుండి ఒక జలపాతం జాలువారుతూ ఉంటుంది. చుట్టూ కంటికింపైన పచ్చదనం, పక్షుల కిలకిల రావాలతో ఆ కొండ ప్రాంతమంతా చాలా ఆహ్లాదంగా, రమణీయంగా ఉంటుంది. ఇక్కడి పెంచలకోనలో నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయానికి సందర్శకుల సందడి ఎక్కువగా ఉంటుంది.

VI. ప్రశంస

* మీరు చూసిన ఒక దర్శనీయ స్థలాన్ని కొనియాడుతూ ‘నీవు కూడా తప్పక చూడవలసింది’గా తెలుపుతూ మీ మిత్రుడికి లేఖ రాయండి.
జవాబు:

శ్రీకాకుళం,
x x x x x x x

ప్రియమైన స్నేహితుడు శ్రీనాథ్ కు,

నీ మిత్రుడు భరత్ సింహా వ్రాయునది. ఇక్కడ క్షేమము, అక్కడ క్షేమమని తలుస్తున్నాను. మేము ఇటీవల తీర్థయాత్రలకు వెళ్ళాము. అనేక ప్రదేశాలను దర్శించుకున్నాము. వాటిలో నాకు నచ్చినది కాణిపాక వరసిద్ధి వినాయకుల వారి ఆలయం. దాని గురించి ఈ లేఖలో వివరిస్తున్నాను.

ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని తిరుపతికి దగ్గరగా రేణిగుంట సమీపాన ఉన్నది. ఇందు గణపతి శిల ఆకారంలో ఉంటాడు. ఈ వినాయకుడు మొదట ఒక రాయేనట. ఊరికి దగ్గరలోని ఒక పాడుబడిన బావిలో వినాయకుని ఆకారంలో వెలిసినాడట. తరువాత ఆ శిలావిగ్రహం కొంచెం పెద్దదిగా అయిందట. అప్పుడే ఆ గ్రామ ప్రజలు అందరూ ఆ విగ్రహానికి ఒక గుడి కట్టించి పూజలు చేయటం ప్రారంభించారట. అప్పటి నుండి కాణిపాకం చాలా ప్రసిద్ధి చెందినదట. ఇక్కడ ఎవరైనా కోరికలు కోరినట్లయితే తప్పక నెరవేరుతాయని ఇక్కడి ప్రజల యొక్క నమ్మకం. మా కుటుంబంలోని వారందరమూ ఈ ఆలయాన్ని దర్శించుకున్నాము. చాలా ఆనందించాము. నీవు కూడా తప్పకుండా ఇటువంటి దర్శనీయ ప్రాంతాన్ని దర్శించవలెను. తిరిగి లేఖ వ్రాయుము. మీ అమ్మా, నాన్నగార్లకు నా నమస్కారాలు.

ఇట్లు
మీ మిత్రుడు,
భరత్ సింహా.

చిరునామా :
కె. శ్రీనాథ్,
S/O కె. వెంకటేశ్వర్లు,
డోర్ నెం. 8/64-7,
బ్రాడీపేట,
గుంటూరు.

ప్రాజెక్టు పని

1. మీ జిల్లాలోని దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రదేశాల చిత్రాలు సేకరించండి. వీటి వివరాలు రాయండి. వీటన్నిటితో ఒక సంకలనం తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లా.
దర్శనీయ స్థలాలు :

  1. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయము.
  2. ద్రాక్షారామం , సామర్లకోట భీమేశ్వరాలయాలు.
  3. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయము.
  4. రాజమండ్రి “గోదావరి కమ్ రైల్ బ్రిడ్జి”.
  5. కోనసీమ ప్రకృతి దృశ్యాలు.
  6. సముద్ర తీరం బీచు.
  7. రాజోలు తాలూకా ‘ఆదుర్రు’ బౌద్ధ స్తూపం – మొ||నవి.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు 3

VII. భాషను గురించి తెలుసుకుందాం!

1) కింది వాక్యాలను పరిశీలించి, మార్పులను గమనించండి.
అ) సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
ఆ) సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.
పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కాని వాక్య నిర్మాణంలో భేదం ఉందని గమనించారు కదా !
రెండు వాక్యాల మధ్య భేదం ఏమిటి?

అ) సంఘసంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు – అనే ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ కర్తను సూచిస్తుంది. కర్మకు ద్వితీయా విభక్తి ప్రత్యయం చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం’ అంటారు.

ఆ) ఇక సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. – అనే రెండవ వాక్యంలో (i) కర్తకు తృతీయా విభక్తి ప్రత్యయం ఉంది. (ii) క్రియకు “బడు” చేరింది. (iii) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.

వాక్యంలో క్రియకు ‘బడు’ చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని “కర్మణి వాక్యం” అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

2) కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
రామాయణం వాల్మీకి చేత రచించబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
జవాబు:
శాంతి ప్రజలచేత కోరబడింది. (కర్మణి వాక్యం)

3) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నాచేత చదువబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాన్ని చదివాను. (కర్తరి వాక్యం)

ఆ) నాచే రచించబడిన గ్రంథం నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
జవాబు:
నేను నేతాజీ చరిత్ర గ్రంథాన్ని రచించాను. (కర్తరి వాక్యం)

4) కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు తెలపండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
ఉదా : నదిగట్టు నది యొక్క గట్టు షష్ఠీ తత్పురుష
అ) అజంతా స్త్రీలు అజంతా యొక్క స్త్రీలు షష్ఠీ తత్పురుష
ఆ) ప్రకృతి సౌందర్యం ప్రకృతి యొక్క సౌందర్యం షష్ఠీ తత్పురుష
ఇ) నదీ ప్రవాహం నది యొక్క ప్రవాహం షష్ఠీ తత్పురుష
ఈ) మానవ సమాజం మానవుల యొక్క సమాజం షష్ఠీ తత్పురుష

5) కింది విగ్రహవాక్యాలకు సమాస పదాలు రాసి దాని పేరును తెలపండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) గుహల యొక్క గోడ గుహల గోడ షష్ఠీ తత్పురుష
ఆ) కొండ యొక్క మలుపు కొండ మలుపు షష్ఠీ తత్పురుష

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

సముద్రం : సాగరం, జలధి
నక్షత్రం : తార, చుక్క
పువ్వు : కుసుమం, సుమం
కెరటం : అల, తరంగం, భంగం
కన్ను : నేత్రం, నయనం, చక్షువు
స్త్రీ : మహిళ, వనిత, మగువ
తావి: పరిమళం, సువాసన, సుగంధం
ఆకాశం : గగనం, నింగి
పాట : గీతం, గేయం
కొండ : అద్రి, పర్వతం
నది : వాహిని, స్రవంతి, కూలంకష
చంద్రుడు : సోముడు, అమృతాంశుడు
నీరు : జలం, వారి, ఉదకం

వ్యుత్పత్యర్థాలు

మిత్రుడు : అన్ని ప్రాణుల యందు సమభావన కలవాడు (సూర్యుడు)
తార : దీనిచే నావికులు తరింతురు (చుక్క)
పక్షి : పక్షములు గలది (పిట్ట)
సాగరం : సగర కుమారుల చేత త్రవ్వబడినది (సముద్రం)
మహీపాలుడు : భూమిని పాలించువాడు (రాజు)

నానార్థాలు

కోటి : నూరులక్షలు, అంచు, గుంపు
వర్షం : వాన, సంవత్సరం, మబ్బు
కన్ను : నేత్రం, బండి చక్రం
చిత్రం : బొమ్మ, ఆశ్చర్యం
దక్షిణ : దిక్కు సంభావన
తార : నక్షత్రం, వాలి భార్య, కంటిపాప, ఓంకారం
కుడ్యం : గోడ, పుంత
ఉత్తరం : జాబు, సమాధానం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు దాని దీర్ఘము ఏకదేశమగును.
నీలాకాశం = నీల + ఆకాశం – సవర్ణదీర్ఘ సంధి
కళాభిజ్ఞులు = కళ + అభిజ్ఞులు – సవర్ణదీర్ఘ సంధి
చంద్రాకారం = చంద్ర ఆకారం – సవర్ణదీర్ఘ సంధి
శతాబ్దం = శత + అబ్దం – సవర్ణదీర్ఘ సంధి
సిద్ధార్థ = సిద్ధ + అర్థ – సవర్ణదీర్ఘ సంధి
న్యత్యాంగన = నృత్య + అంగన – సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
మహోన్నత = మహా + ఉన్నత – గుణసంధి
గజేంద్రుడు = గజ + ఇంద్రుడు – గుణసంధి
సర్వోత్తమం = సర్వ + ఉత్తమం – గుణసంధి

ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
సులభమేమో = సులభము + ఏమో – ఉత్వ సంధి
అపారమైన = అపారము + ఐన – ఉత్వ సంధి
వచ్చినావని = వచ్చినావు + అని – ఉత్వ సంధి
మలుపులన్నీ = మలుపులు + అన్ని – ఉత్వ సంధి
లోతైనా = లోతు + ఐనా – ఉత్వ సంధి
చైత్యా లైతే = చైత్యాలు + ఐనా – ఉత్వ సంధి
అటొక = అటు + ఒక – ఉత్వ సంధి
పేరొందు = పేరు + ఒందు – ఉత్వ సంధి

ఆత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
నిలిచినప్పుడు = నిలిచిన + అప్పుడు – అత్వ సంధి
పోయినందున = పోయిన + అందున – అత్వ సంధి
అల్లంత = అల్ల + అంత – అత్వ సంధి
దక్కకుండు = దక్కక + ఉండు – అత్వ సంధి

ఇత్వగుంధి (అ):
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
దారైనా = దారి + ఐనా – ఇత్వ సంధి
అదొక = అది + ఒక – ఇత్వ సంధి

ఇత్వసంధి (ఆ) :
సూత్రం : క్రియా పదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
లేనట్టు = లేని + అట్టు – ఇత్వ సంధి
వచ్చేదట = వచ్చేది + అట – ఇత్వ సంధి
ఉండేదేమో = ఉండేది + ఏమో – ఇత్వ సంధి

యణాదేశ సంధి :
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా య, వ, రలు ఆదేశమవుతాయి.
పక్ష్యాదులు = పక్షి + ఆదులు – యణాదేశ సంధి
ప్రత్యుత్తరం = ప్రతి + ఉత్తరం – యణాదేశ సంధి

పుంప్వాదేశ సంధి :
సూత్రం : కర్మధాయంలో మువర్ణకానికి పుంపులు అవుతాయి.
సముద్రపు అంచు = సముద్రపు + అంచు – పుంప్వాదేశ సంధి
చెక్కడపుపని = చెక్కడము + పని – పుంప్వాదేశ సంధి

గసడదవాదేశ సంధి :
సూత్రం : ప్రథమమీది పురుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
చెట్టుగాని = చెట్టు + కాని – గసడదవాదేశ సంధి
చరిత్రలుగా = చరిత్రలు + కా – గసడదవాదేశ సంధి
సరిగదా = సరి + కదా – గసడదవాదేశ సంధి

యడాగమ సంధి :
సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం అవుతుంది.
ఆయన యెత్తినట్లు = ఆయన + ఎత్తినట్లు – యడాగమ సంధి
తలయెత్తు = తల + ఎత్తు – యడాగమ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
వేషభాషలు వేషమును, భాషయును ద్వంద్వ సమాసం
భక్తిశ్రద్ధలు భక్తియును, శ్రద్ధయును ద్వంద్వ సమాసం
శ్రద్ధాభక్తులు శ్రద్ధయును, భక్తియును ద్వంద్వ సమాసం
ఆశనిరాశలు ఆశయును, నిరాశయును ద్వంద్వ సమాసం
ప్రకృతి సౌందర్యం ప్రకృతి యందలి గల సౌందర్యం సప్తమీ తత్పురుష సమాసం
అజంతా గుహలు అజంతా యొక్క గుహలు షష్ఠీ తత్పురుష సమాసం
రాణ్మందిరాలు రాణుల యొక్క మందిరాలు షష్ఠీ తత్పురుష సమాసం
రాజసభ రాజు యొక్క సభ షష్ఠీ తత్పురుష సమాసం
జీవిత చరిత్ర జీవితము యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం
చంద్రాకారం చంద్రుని యొక్క ఆకారం షష్ఠీ తత్పురుష సమాసం
– నదిగట్టు నది యొక్క గట్టు – షష్ఠీ తత్పురుష సమాసం
అగ్నిప్రమాదం అగ్ని వలన ప్రమాదం పంచమీ తుత్పురుష సమాసం
పచ్చని చెట్లు పచ్చనైన చెట్లు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
శాశ్వత కీర్తి శాశ్వతమైన కీర్తి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అనంతాకాశం అనంతమైన ఆకాశం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ముప్పది సంవత్సరాలు ముప్పదైన సంవత్సరాలు ద్విగు సమాసం
పదమూడు గుహలు పదమూడైన గుహలు ద్విగు సమాసం
వాఘోరానది వాఘోర అను పేరుగల నది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

ప్రకృతి – వికృతులు

హృదయం – ఎద, డెందము
ఆకాశం – ఆకసం
యాత్ర – జాతర
కథ – కత
పుష్పం – పూవు
చంద్రుడు – చందురుడు
దూరం – దవ్వు
సముద్రము – సంద్రము
రూపం – రూపు
గృహము – గీము
స్త్రీ – ఇంతి
దక్షిణం – దక్కినం

రచయిత పరిచయం

పాఠం పేరు : “అజంతా చిత్రాలు”

వ్యాస రచయిత : “నార్ల వేంకటేశ్వరరావు”

జననం, జన్మస్థలం : నార్ల వారు, 1908 డిశంబరు ఒకటవ తేదీన (1-12- 1908)న కృష్ణా జిల్లాలోని “కవుతరం” అనే గ్రామంలో జన్మించారు.

రచనలు :
1. “రష్యన్ కథలు” (అనువాద రచన)
2. “నరకంలో హరిశ్చంద్రుడు” (నాటకం)
3. “నార్లవారి మాట” (పద్యకావ్యం) మొదలయిన గ్రంథాలు రాశారు.

మేధావి : ఈయన పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు. నిరంతరం, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన మేధావి.

రచనాశైలి : నార్లవారి రచన సరళమైన శబ్దాలతో సొగసైన భావాలతో సుందరశైలిలో సాగుతుంది.

కఠిన పదాలకు – అర్థాలు

దృశ్యము = కంటికి ఇంపయినది (చూడదగినది)
అనుభూతి = సుఖ దుఃఖాదులను పొందడం (ప్రత్యక్షజ్ఞానం)
అపారము = అధికమైనది (అవధిలేనిది)
బస్తీ = పట్టణము
దిశ్చక్రాన్ని = దిక్కుల యొక్క చక్రమును
నెత్తావులు (నెలు + తావులు) = నిండు పరిమళములు
తావులు = సువాసనలు
జగత్తు = లోకము
ఆదిలో = మొదటిలో
శిరోభాగము (శిరః + భాగము) = పై భాగము
వ్యవధి = గడువు
ఘట్టం = సమయం
పరికించు = చూచు
బయలు = స్థలము
అస్తిత్వాన్ని = ఉనికిని
సభ్యలోకం = ఉత్తమ సమాజం

AP Board 8th Class Telugu Solutions Chapter 4 అజంతా చిత్రాలు

విస్మరించింది = మరచింది
కుడ్యచిత్రాలు = గోడ బొమ్మలు
స్వాప్నిక జగత్తు = కలల లోకము
గాయనీమణులు = శ్రేష్ఠులైన పాటకత్తెలు
నృత్యాంగనలు = నాట్యం చేసే స్త్రీలు
అలౌకిక సుందర విగ్రహము = లోక సహజం కాని, అందమైన విగ్రహము
బౌద్ధచైత్యాలు = బౌద్ధస్తూపములు
కుడ్యాన్ని = గోడను
మట్టిగిలాబా = మట్టితో పూత
దగ్గము = కాలినది
రాగవిరాగాలు = అనురాగము, అనురాగం లేకపోవడం
కళాతపస్వులు = ఉత్తమ కళాకారులు
సౌందర్యసృష్టి = అందాన్ని సృష్టించడం
కళాభిజ్ఞులు (కళా + అభిజ్ఞులు) = కళలలో నేర్పరులు
తొణికిసలాడుతున్న = చిందుతున్న
విజాతీయ చిత్రకారులు = ఇతర జాతి చిత్రలేఖకులు
ప్రజాసాధకులు = ప్రజ్ఞను సాధించినవారు
వ్యాసంగము = ఎక్కువ కృషి
రాణ్మందిరాలు రాట్ + మందిరాలు = రాజమందిరాలు
వణిక్కులు = వర్తకులు
మహీపాలకులు = రాజులు
కారుణ్య సందేశం = దయతో కూడిన ఆజ్ఞ
పునీతం = పవిత్రము

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 3 నీతి పరిమళాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 3rd Lesson నీతి పరిమళాలు

8th Class Telugu 3rd Lesson నీతి పరిమళాలు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

1. మీకు తెలిసిన నీతి వాక్యా లు తెలపండి.
2. నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి?
3. వందకుపైగా పద్యాలుండే ప్రక్రియను ఏమంటారు?
4. మకుటం అంటే ఏమిటి?
5. మకుటం ఏ రకంగా ఉండవచ్చు?
6. మీకు తెలిసిన నీతిశతకాల పేర్లు చెప్పండి.
7. మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి.
8. శతకాలలో కేవలం నీతిని బోధించేలే ఉంటాయా? వివరించండి.
9. ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాల్లో ఏయే శతకాల పద్యాలున్నాయి?

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మీకు తెలిసిన నీతివాక్యాలు తెల్పండి.
జవాబు:
1) ఖలునకు నిలువెల్ల విషము ఉంటుంది.
2) విద్యలేనివాడు వింతపశువు.
3) కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగదు.
4) సదౌష్టియె పాపములను చెఱచును.
5) పడతులు మర్యాదలేటిగి బ్రతుకవలెను.
6) చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
7) ఆలస్యంగా తింటే అమృతం కూడా విషం అవుతుంది.
8) ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.

ప్రశ్న 2.
నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి?
జవాబు:
నీతులను భర్తృహరి పది రకాలుగా విభజించారు –
1) మూర్ఖ పద్ధతి
2) విద్వత్పద్ధతి
3) మానశౌర్య పద్ధతి
4) అర్థ పద్ధతి
5) దుర్జన పద్ధతి
6) సుజన పద్ధతి
7) పరోపకార పద్ధతి
8) ధైర్య పద్ధతి
9) దైవ పద్ధతి
10) కర్మ పద్ధతి.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 3.
వందకు పైగా పద్యాలుండే ప్రక్రియను ఏమంటారు?
జవాబు:
వందకు పైగా పద్యాలుండే ప్రక్రియను శతకం అంటారు.

ప్రశ్న 4.
మకుటం అంటే ఏమిటి?
జవాబు:
మకుటం అనగా పద్యం చివర ఉండేది. ఇది పదంగా కాని, అర్ధపాదంగా కాని, పాదంగా కాని, పాద ద్వయంగా కాని ఉండవచ్చు.

ప్రశ్న 5.
మకుటం ఏ రకంగా ఉండవచ్చు?
జవాబు:
మకుటం పద్యరూపంలోగాని, గద్యరూపంలోగాని ఏ రకంగానైనా ఉండవచ్చు.

ప్రశ్న 6.
మీకు తెలిసిన నీతిశతకాల పేర్లు చెప్పండి.
జవాబు:
తెలుగులో పెక్కు నీతిశతకాలు ఉన్నాయి. తెలుగులో మొదటి నీతి శతకం బద్దెన రచించిన సుమతి శతకం. మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం చక్కని నీతి శతకం. అట్లే వేమన రచించిన ‘వేమన శతకం’ చక్కని నీతి పద్యాల సంకలనం. ఏనుగు లక్ష్మణకవి రచించిన సుభాషిత రత్నావళిలో చక్కని నీతిపద్యాలున్నాయి. ఇంకా ఫక్కి అప్పల నరసయ్య రచించిన కుమారీ శతకం, కుమార శతకం, జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి తెలుగుబాల పద్యాలు, నార్లవారి పద్యాలు, నాళం కృష్ణారావుగారి పద్యాలు మొదలైన అనేక నీతి శతకాలు తెలుగులో వచ్చాయి.

ప్రశ్న 7.
మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి.
జవాబు:

1) బద్దెన సుమతి శతకం
2) ఫక్కి అప్పల నరసయ్య కుమారీ శతకం, కుమార శతకం
3) వేమన వేమన శతకం
4) ఏనుగు లక్ష్మణకవి సుభాషిత రత్నావళి
5) గువ్వల చెన్నడు/పట్టాభిరామకవి గువ్వల చెన్న శతకం
6) మారద వెంకయ్య భాస్కర శతకం
7) కంచర్ల గోపన్న దాశరథీ శతకం

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 8.
శతకాలలో కేవలం నీతిని బోధించేవే ఉంటాయా? వివరించండి.
జవాబు:
శతకాలలో కేవలం నీతిని బోధించేవే కాకుండా భక్తిని బోధించేవి, వైరాగ్యాన్ని బోధించేవి, ధర్మాలను బోధించేవి, శృంగారాన్ని తెలిపేవి కూడా ఉంటాయి. తత్త్వ శతకాలు, అధిక్షేప శతకాలు, వ్యాజోక్తి శతకాలు మొదలైనవి కూడా ఉంటాయి.

ప్రశ్న 9.
ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాల్లో ఏయే శతకాల పద్యాలున్నాయి?
జవాబు:

  1. గువ్వల చెన్న శతకం
  2. కుమార శతకం
  3. తెలుగు పూలు శతకం
  4. వేమన శతకం
  5. సుమతి శతకం
  6. నరసింహ శతకం
  7. కృష్ణ శతకం
  8. దాశరథీ శతకం
  9. కాళహస్తీశ్వర శతకం
  10. సుభాషిత రత్నావళి.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను అర్థవంతంగా, రాగయుక్తంగా చదవండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

ప్రశ్న 2.
పద్యాల్లోని నీతిని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
1. గుణవంతుడు లోకానికి మేలు చేకూర్చే కార్యము ఎంత భారమైనా చేయడానికి సిద్ధపడతాడు.
2. ఉప్పులేని వంటలూ, రసజ్ఞత లేని చదువు వ్యర్థం.
3. సంస్కారవంతమైన మాటయే మనిషికి నిజమైన అలంకారం.
4. మానవుణ్ణి ఇంద్రియ చాపల్యం నుండి భగవంతుడే కాపాడాలి.
5. ఓర్పు కలవారు అన్ని పనుల్లోనూ సమర్థులు అవుతారు.
6. మానవులు రాజును ఆశ్రయించడం వ్యర్థం.
7. ఎదుటి వాడి బలాన్ని గుర్తించకుండా పోరాటం చేసేవాడు అవివేకి.
8. జీర్ణం కాని చదువు, తిండి చెరుపు చేస్తాయి.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ప్రశ్న 3.
‘చదువు జీర్ణం’ కావటాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారో చెప్పండి.
జవాబు:
చదువు జీర్ణం అవడం అంటే చదివిన దాన్ని గ్రహించి ఆచరణలో పెట్టగలగడం. చదివిన విషయాన్ని ఆధారంగా చేసికొని దాని తరువాత విషయాలను నేర్చుకోగలగడం, చదివిన విషయం జ్ఞప్తిలో ఉంచుకోవడం – అని అర్థం చేసుకున్నాను.

II చదవడం, అవగాహన చేసుకోవడం

1. పాఠంలోని పదాల ఆధారంగా కింద తెలిపిన వాటిని వేటితో పోల్చారో రాయండి.
అ) రసజ్ఞత ఆ) అవివేకం ఇ) వాక్కు
జవాబు:
అ) రసజ్ఞత : కూరలో వేసే ‘ఉప్పు’ తో పోల్చారు.
ఆ) అవివేకం : ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగడం ‘అవివేకం’ అని చెప్పారు.
ఇ) వాక్కు : సంస్కారవంతమైన మాటను అలంకారంతో పోల్చారు.

2. కింద ఇచ్చిన భావానికి తగిన పద్యపాదం గుర్తించి రాయండి.
అ) గొప్పవారు లోకానికి మేలు జరిగే పనులను ఎంత కష్టమైనా చేస్తారు.
జవాబు:
ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మేలనుకొని పూను

ఆ) పొట్టేలు కొండతో ఢీకొంటే, దాని తల పగులుతుంది.
జవాబు:
కొండతోఁ దగరు ఢీకొని యెంత తాఁకినఁ దల ప్రక్కలగుఁగాక దాని కేమి

ఇ) తిన్నతిండి జీర్ణమైతే బలం కలుగుతుంది.
జవాబు:
తిండి జీర్ణమైన నిండు బలము

ఈ) రసజ్ఞత లేకపోతే గొప్పవాళ్ళు మెచ్చుకోరు.
జవాబు:
రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

3. సభారంజన శతకం’లో క్షమ అనే పదాన్ని ప్రతి పాదంలోనూ వాడటం కనిపిస్తున్నది కదా ! క్షమను ఏ ఏ అర్థాలలో ఉపయోగించారో చెప్పండి.
జవాబు:
మొదటి పాదంలో క్షమను “ఓరిమి” అనే అర్థంలోను,
రెండవ పాదంలో క్షమను “భూమి” అనే అర్థంలోను,
మూడవ పాదంలో క్షమను “సహనం” అనే అర్థంలోను
నాలుగవ పాదంలో క్షమను “సమర్థత” అనే అర్థంలోను వాడారు.

4. పాఠంలోని పద్యాలు ఆధారంగా తప్పు-ఒప్పులు గుర్తించండి.
అ) రత్నహారాలు మనిషికి నిజమైన అలంకారం. (తప్పు)
ఆ) ఉప్పులేని కూరైనా రుచిగా ఉంటుంది. (తప్పు)
ఇ) సూర్యుని పైకి దుమ్ము ఎత్తి పోస్తే అది పోసినవాడి మీదే పడుతుంది. (ఒప్పు)
ఈ) తిండి జీర్ణం కాకపోతే మనకు ఆరోగ్యం. (తప్పు)

5. పాఠం ఆధారంగా జవాబులు రాయండి.

అ) గొప్పవారి వల్ల ప్రజలకు కలిగే మేలు ఏమిటి?
జవాబు:
గొప్పవారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేటందుకే ప్రయత్నం చేస్తారు. ఎదుటివారి నుండి ఎటువంటి లాభాలను ఆశించరు. లోకానికి మేలు కలిగించే పని ఎంతటి భారమైనప్పటికీ చేయడానికి పూనుకుంటారు.

ఆ) రాజులను ఎందుకు ఆశ్రయించకూడదని కవి భావించాడు?
జవాబు:
రాజులను ఆశ్రయించవలసిన పనిలేదని ధూర్జటి కవి, తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఇలా చెప్పాడు
1) తినడానికి తిండి కావాలని అడిగితే ఎవరైనా భిక్షం పెడతారు.
2) నివసించడానికి కావలసివస్తే గుహలు ఉన్నాయి.
3) వస్త్రాలు కావాలంటే వీధుల్లో దొరుకుతాయి.
4) త్రాగడానికి నదుల్లో తియ్యని నీరు ఉంది.

కాబట్టి రాజులను కూటికీ, ఇంటికీ, బట్టకూ ఆశ్రయించనక్కరలేదని కవి చెప్పాడు.

ఇ) “ఎలాంటి చదువు వ్యర్థమని” మీరు తెలుసుకున్నారు?
జవాబు:
ఎంత చదువు చదివినా దానిలోని అంతరార్థాన్ని, రసజ్ఞతను గ్రహించలేని చదువు వ్యర్థమని తెలుసుకున్నాను.

ఈ) ఏవేవి అవివేకమైన పనులని ఈ పాఠం ద్వారా తెలుసుకున్నారు? వీటివల్ల కలిగే ఫలితాలు ఏమిటి?
జవాబు:
సూర్యుని మీద దుమ్మెత్తి పోయడం, పొట్టేలు కొండతో ఢీకొనడం, మిడతలు మంటపైకి ఎగిసిపడడం, వలలో చిక్కుకున్న చేప పొరలాడడం, అలాగే ఎదుటివాడి బలం తెలియకుండా వాడితో యుద్ధానికి దిగడం – అనే పనులు అవివేకమైన పనులని నేను తెలిసికొన్నాను.

వీటి వల్ల కలిగే ఫలితాలు :
సూర్యుడి మీద దుమ్మెత్తి పోస్తే, పోసినవాడి నెత్తిమీదే పడుతుంది. పొట్టేలు కొండతో ఢీకొంటే పొట్టేలు తల బద్దలౌతుంది. మిడతలు మంటపైకి దూకితో అవే మాడిపోతాయి. వలలో చిక్కిన చేప పొరలాడితే అది మరింతగా బందీ అవుతుంది. ఎదుటివాడి బలం తెలియకుండా పోరాటానికి దిగితే దిగినవాడే ఓడిపోతాడు.

ఉ) నిజమైన అలంకారం ఏది?
జవాబు:
బంగారు హారాలు ధరించడం, సిగలో పువ్వులు అలంకరించుకోవడం, సుగంధ ద్రవ్యాలు వాడటం, పన్నీటి ‘స్నానం, మొదలైనవి మానవుడికి అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటయే, పురుషుడికి నిజమైన అలంకారం.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ఊ) ఏ ఏ బలహీనతల వల్ల ఏవేవి ఎలా నశిస్తాయి?
జవాబు:
మానవుడు ఎన్నో బలహీనతలకు లోను అవుతున్నాడు. ఏనుగు తన దురదను పోగొట్టుకొనడానికి, చేప నోటి రుచిని ఆశించి, పాము రాగానికి వశపడి, జింక అందానికి బానిస అయి, తుమ్మెదలు పూల వాసనలకు మైమరచి బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క బలహీనత వల్ల నశించిపోతున్నాయి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో మీరు ఊహించి రాయండి.
జవాబు:
‘పరోపకారార్థం ఇదం శరీరం’ అనగా ఇతరులకు మేలు చేయడం కోసమే ఈ శరీరం అని అర్థం. గొప్పవాళ్ళు అంటే, స్వార్థం విడిచి ఇతరులకు మేలు చేసేవారు. గొప్పవాళ్ళు కీర్తిని కోరుకుంటారు. స్వలాభాన్ని ఆశించరు. అటువంటి గొప్పవారు లోకానికి మేలు కలిగించే పని, అది ఎంత భారమైనా చేయడానికి పూనుకుంటారు. ఆదిశేషుడు తాను గాలిని మాత్రమే పీలుస్తాడు. కానీ తన వేయిపడగల మీద పెద్ద భూభారాన్ని ఏ మాత్రం కదలకుండా మోస్తాడు. స్వార్థ రాహిత్యం , కీర్తికాంక్ష కారణంగా, గొప్పవాళ్ళు లోకహిత కార్యాలు చేస్తారు.

ఆ) వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు?
జవాబు:
సంస్కారవంతమైన వాక్కే, మనిషికి నిజమైన అలంకారం. బంగారు హారాలు ధరించడం, సిగలో పూలు పెట్టుకోవడం, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించడం, పన్నీటితో స్నానం చెయ్యడం మొదలైన పనులు, మానవుడికి అలంకారాలు కావు. ఒక్క పవిత్రమైన వాక్కే, మానవుని అలంకరిస్తుంది. వాక్కు అనే అలంకారమే నిజమైన మంచి అలంకారము. మిగిలిన కేయూరములు వంటి భూషణాలు అన్నీ నశించేవే.

ఇ) సమర్థులు అంటే ఎవరు ? సామర్థ్యం ఎలా వస్తుంది?
జవాబు:
ఎవరైతే ఓర్పుతో, సహనంతో అన్ని పనులను తమంత తాము నిర్వర్తించగలుగుతారో వారిని “సమర్థులు” అంటారు. ఎవరు ప్రయత్నం చేసి ఓరిమిని కాపాడుకుంటారో, వారే భూమిని కాపాడగలరు. అంటే క్షమాగుణం గల ప్రభువులే, రాజ్యమును రక్షింపగలరు. ఎవరిలో సహనగుణం నిశ్చలంగా ఉంటుందో వారే అన్ని పనుల్లోనూ సమర్థులై ఉంటారు. క్షమాగుణం గలవారే సమర్థులు. క్షమాగుణం వల్లనే సామర్థ్యం వస్తుంది.

ఈ) చదువును మంచికూరతో కవి ఎందుకు పోల్చాడు?
జవాబు:
చాలామంది చదువుకుంటారు. ఎంతో పాండిత్యాన్ని సంపాదిస్తారు. ఎంత చదువు చదివినా వారిలో కొంచెం రసజ్ఞత లేకపోతే ఆ చదువు వ్యర్థం. చదువును మంచికూరతో కవి పోల్చాడు. కూరలో తక్కిన దినుసులు అన్నీ వేసి చక్కగా నలభీమపాకం చేసినా, అందులో కొంచెం ఉప్పు వేయకపోతే ఆ కూర రుచిగా ఉండదు. అందుకే రసజ్ఞత లేని చదువుకు దృష్టాంతంగా ఉప్పులేని కూరను, కవి చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) మంచితనమంటే ఏమిటి? కొంతమందిలో మీరు గమనించిన మంచితనాన్ని గూర్చి రాయండి.
జవాబు:
ఎదుటివారిని నొప్పించకుండా, బాధ పెట్టకుండా, ఇతరులకు తన చేతనైన సహాయం చేస్తూ, సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా జీవించటాన్నే ‘మంచితనం’ అంటారు.

భారతంలో “సక్తుప్రస్థుడి” కథ ఉంది. కురుక్షేత్రంలో ‘సక్తుప్రస్థుడు’ అనే గృహస్థుడు ఉండేవాడు. ఆయనకు భార్య, కొడుకు, కోడలు ఉండేవారు. వారు ఆ పరిసరాల్లోని చేలల్లో తిరిగి, అక్కడ రాలిన ధాన్యం గింజలను ఏరి తెచ్చుకొని, వాటిని దంచి పిండి చేసికొని, దాన్ని వండుకొని సమంగా పంచుకొని తినేవారు.

ఒక రోజు వాళ్ళు తినడానికి సిద్ధంగా ఉండగా, ఒక ముసలివాడు ఆకలి అంటూ వచ్చాడు. వారు తమకు ఉన్నదంతా ఆ ముసలివాడికి తృప్తిగా పెట్టారు. ఆ వృద్దుడు సంతోషించాడు. సక్తుప్రస్తుడి కుటుంబం ఆకలితో ఉన్నా అతిథి ఆకలి తీర్చడమే ముఖ్యమని వారు భావించారు. అదే మంచితనం అని నా అభిప్రాయం.

ప్రస్తుత సమాజంలో నేను చాలా మందిలో ఈ మంచితనాన్ని గమనించాను. కొందరు తమ మంచితనంతో ఎదుటివారికి ధనరూపంలో సాయం చేస్తారు, వస్తురూపంలో సాయం చేస్తారు. కొందరు అనాథలైన పిల్లలను చేరదీసి వారి కోసం ఒక ట్రస్టును ఏర్పాటుచేసి దానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. కొందరు వృద్ధులకు, పెద్దవారికి ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారిని చేరదీస్తున్నారు. ఇంకా అనేక మంది తమ మంచితనంతో పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శప్రాయమైన జీవనం సాగిస్తున్నారు.

ఆ) ‘సమర్థులకు క్షమ అవసరం’ వివరించండి.
జవాబు:
సమర్థులకు ‘ఓర్పు’ చాలా అవసరం. దీనికి భారత కథలో ధర్మరాజు చక్కని ఉదాహరణ. ధర్మరాజు గొప్ప పరాక్రమం గలవాడు. ఆయనకు కోపం వస్తే సప్త సముద్రాలూ ఏకం అవుతాయని కృష్ణుడు చెప్పాడు. ధర్మరాజుకు భీమార్జునుల వంటి తమ్ముళ్ళు ఉన్నారు. దుర్యోధనుడు ధర్మరాజుకు ఎన్నో ఆపదలు కల్గించాడు. ద్రౌపదిని అవమానించాడు. పాండవులను లక్క ఇంటిలో పెట్టి దహనం చేయాలని చూశాడు. వారిని అడవులకు పంపాడు. ఘోషయాత్ర పేరుతో వారిని అవమానించాలని చూశాడు. పాండవుల అజ్ఞాతవాసాన్ని భంగం చేయాలని విరాటుడి గోవులను పట్టించాడు. ఇన్ని చేసినా ధర్మరాజు క్షమాగుణంతో సహించాడు. కృష్ణుణ్ణి రాయబారిగా పంపాడు. విధిలేక యుద్ధం చేశాడు. జయించాడు. ఏకచ్ఛత్రాధిపతిగా రాజ్యం పాలించాడు.

దీనంతటికీ ధర్మరాజు క్షమాగుణమే కారణం.

IV. పదజాలం

1. కింది వాక్యాల్లో సమానమైన అర్థాన్నిచ్చే పదాలున్నాయి. వాటిని గుర్తించి, వాటి కింద గీతలు గీయండి.

అ) హృదయం మంచిదైతే అతడు మంచి మనిషి. అతని డెందములో అందరి పట్ల అభిమానమే ఉంటుంది. ఎదలో కల్మషం లేకుండా మాట్లాడితే అందరి చిత్రాలు సంతోషిస్తాయి.
జవాబు:
హృదయం మంచిదైతే అతడు మంచి మనిషి. అతని డెందములో అందరి పట్ల అభిమానమే ఉంటుంది. ఎదలో కల్మషం లేకుండా మాట్లాడిన అతని మాటలకి అందరి చిత్తాలు సంతోషిస్తాయి.
హృదయం, డెందము, ఎద, చిత్తము

ఆ) మిడుతలు చిచ్చుపైకి ఎగిసిపడ్డాయి. అడవిలో వహ్ని రగులుకొన్నది. అగ్నిలో చేయిపెడితే కాలుతుంది.
జవాబు:
మిడుతలు చిచ్చు పైకి ఎగిసిపడ్డాయి. అడవిలో వహ్ని రగులుకొన్నది. అగ్నిలో చేయిపెడితే కాలుతుంది.
చిచ్చు, వహ్ని, అగ్ని

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2. కింది పదాలకు వ్యతిరేకార్థకం రాసి, ఈ రెండు పదాలతోనూ సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
కీర్తి – అపకీర్తి
మంచిపనులు చేస్తే కీర్తి వస్తుంది. చెడ్డపనులు చేస్తే అపకీర్తి వస్తుంది.

అ) అహితం – హితం
అహితం చేకూర్చే మాటలు వినకూడదు. హితం చేకూర్చే మాటలే వినాలి.

ఆ) బాగుపడు – చెడిపోవు
కొందరు బాగా చదువుకొని బాగుపడతారు. మరికొందరు పెద్దల మాటలు వినకుండా చెడిపోతున్నారు.

ఇ) నిస్సారం – సారం
నా సారం గల మాటలు, నీకు నిస్సారంగా తోచాయి.

ఈ) ఫలం – నిష్ఫలం
మంచివానికి నీతి చెపితే ఫలం ఉంటుంది. కాని మూర్ఖునికి ఎన్ని నీతులు ఉపదేశించినా అది నిష్ఫలం అవుతుంది.

3. కింది పదాలు చదవండి. ఏవైనా రెండేసి పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.
అ) చదువు
ఆ) చెడిపోవు
ఇ) హారాలు
ఈ) ధనం
ఉ) దుష్టుడు
ఊ) బలం
ఎ) మార్గం
ఏ) చంచల స్వభావం
ఉదా :
చదువు జీవితానికి మార్గం చూపుతుంది.
జవాబు:

  1. చదువు మనకు మార్గం చూపుతుంది.
  2. ధనం చంచల స్వభావం కలది.
  3. దుష్టుడు చెడిపోవుట తథ్యము.
  4. మనిషికి చదువు ధనంతో సమానం.
  5. దుష్టుడు మంచి మార్గంలో సంచరించడు.
  6. హారాలు, ధనం ఎప్పటికైనా పోయేవే.
  7. దుష్టుడు చంచల స్వభావం కలవాడు.
  8. ధనం, బలం ఉన్నవాడికి గర్వం వస్తుంది.

V. సృజనాత్మకత

* పాఠశాలలో పిల్లలకు ‘పద్యాలతోరణం’ అనే పోటీ పెట్టారు. ఈ పోటీలో పిల్లలందరూ పాల్గొనాలని తెలియజేయడానికి ప్రకటన రాయండి. ప్రకటనలో నిర్వహించే తేదీ, స్థలం, సమయం మొదలగు వివరాలు ఉండాలి.
జవాబు:

ప్రకటన

విజయవాడ నగరంలోని ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులందరకూ ఒక శుభవార్త. దివి. xxxxxవ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సత్యనారాయణపురం, మహాత్మాగాంధీ మునిసిపల్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో ‘పద్యాలతోరణం’ పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో నగరంలోని విద్యార్థినీ విద్యార్థులందరూ పాల్గొనవచ్చు. తెలుగు పద్యాలు మాత్రమే చదవాలి. విజేతలకు ‘ఆంధ్ర మహాభారతం’ పూర్తి సెట్ బహుమతిగా ఇవ్వబడుతుంది. పాల్గొనే బాలబాలికలు తాము ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నట్లు తమ ప్రధానోపాధ్యాయుల నుండి ధృవీకరణ పత్రం దాఖలు చేయాలి. పోటీలో పాల్గొనేందుకు రుసుము లేదు. పోటీ నియమాలు గంట ముందు తెలుపుతారు.

ఇట్లు,
రసభారతి కళాపీఠం, విజయవాడ.

x x x x x,
విజయవాడ.

VI. ప్రశంస

* పాఠంలోని పద్యాలలో మీ మనసుకు హత్తుకున్న పద్యాలను గురించి, మీ మిత్రులతో చర్చించండి. మీరు చర్చించిన విషయాలు పది వాక్యాల్లో రాయండి.
జవాబు:
నేను, నా మిత్రులతో నేను చదివిన పద్యాలలో నుంచి కొన్నింటిని గూర్చి చర్చించాను. నాకు ‘చదువది ఎంత గలిగిన ….’ అనే పద్యంలోని విషయాలు, నీతి బాగా నచ్చాయని చెప్పాను. అలాగే ‘క్షమను కడఁక …..’ అనే పద్య సారము కూడా నాకు బాగా నచ్చిందని చెప్పాను. నా మిత్రుడు సాయి తనకు ‘ఊరూరం జనులెల్ల ….’ అనే పద్యం, దాని భావం బాగా నచ్చిందని చెప్పాడు. ఇంకొక మిత్రుడు ‘వనకరి చిక్కె ….’ అను పద్యసారం, ‘చదువు జీర్ణమైన …’ అను పద్యసారం బాగా నచ్చాయని చెప్పాడు. మేము ముగ్గురము ఈ పద్యాలలోని సారాన్ని, నీతిని ఎప్పటికీ మరువకుండా పాటించాలని నిర్ణయించుకున్నాము.

నాకు నచ్చిన పద్యములో చదువుకున్న విషయంలో ‘చదువది యెంతగల్గిన’ పద్యం ఎందుకు నచ్చిందంటే కవి చదువుకు వున్న ప్రాధాన్యతను చక్కగా చెప్పారు.

నా స్నేహితుడు సాయి తనకు ఊరూరం జనులెల్ల పద్యంలో కవి చెప్పిన నీతివాక్యాలు బాగా నచ్చాయని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తీర్చడానికి భగవంతుడు ఉన్నాడని చెప్పిన మాటలు బాగా నచ్చాయని చెప్పాడు.

ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క పద్యాన్ని గురించి వివరంగా ‘చర్చించుకున్నాము.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

(లేదా)

* చక్కని నీతులు చెప్పిన శతకకవుల గొప్పతనాన్ని వర్ణిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
‘శతకం’ అంటే నూరు పద్యాల చిన్న గ్రంథం. శతక పద్యాలకు సామాన్యంగా చివర మకుటం ఉంటుంది. శతకాలలో సుమతీ శతకం, వేమన శతకం, భాస్కర శతకం, దాశరథీ శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, కృష్ణ శతకం మొదలయిన శతకాలున్నాయి.

శతకకవులు నీతిని, భక్తిని, వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ గొప్ప శతకాలు రాశారు. వేమన శతకం, సుమతీ శతకాలలోని పద్యాలు రాని, తెలుగువాడుండడు. వేమన చెప్పిన “గంగిగోవుపాలు”, ‘ఉప్పు కప్పురంబు’, “తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు”, “నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు” వంటి పద్యాలు, గొప్ప జ్ఞానాన్ని బోధిస్తాయి. ఇక సుమతీ శతకకారుడు బద్దెన చెప్పిన ‘కనకపు సింహాసనమున’, “తన కోపమె తన శత్రువు”, “ఎప్పుడు సంపద కలిగిన”, “వినదగు నెవ్వరు సెప్పిన” మొదలైన కంద పద్యాలు, జీవితం అంతా గుర్తుంచుకోదగినవి. కృష్ణ శతకం, దాశరథీ శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం భక్తిని ప్రబోధించి వైరాగ్యాన్ని కల్గిస్తాయి. శేషప్పకవి రచించిన నరసింహ శతకం కూడా భక్తినీ, నీతిని బోధిస్తుంది. కుమార కుమారీ శతకాలు బాలబాలికలకు చక్కని నీతులనూ, ధర్మాలనూ, కర్తవ్యాన్ని బోధిస్తాయి. ఏనుగు లక్ష్మణకవి భర్తృహరి సుభాషితాలను అనువదించి, మూడు గొప్ప శతకాలను తెలుగువారికి అందించాడు.

మన తెలుగు శతకకర్తలు మన తెలుగువారికీ తెలుగుభాషకూ మహోన్నతమైన సేవచేసి ధన్యులయ్యారు.

ప్రాజెక్టు పని

* శతకపద్యాలలో చెప్పిన నీతులకు సరిపోయే కథలను సేకరించి, వాటికి నీతిపద్యాలను జోడించి ఆల్బమ్ తయారుచేయండి.
జవాబు:
ఉదా :
(నీతిపద్యాలు – కథలు)
1. సీ. దుష్టు సూర్యుని దెస దుమ్మెత్తి జల్లినఁ
దనపైనె పడుఁగాక దానికేమి
కొండతోఁ దగరు ఢీకొని యెంత తాఁకినఁ
దల ప్రక్కలగుఁగాక దాని కేమి
మిడతలు చిచ్చుపై వడి నెంతయెగసినఁ
దామె పొక్కెడుఁ గాక దానికేమి
వలఁ బడ్డ మీ నెంత వడి దాఁక బొరలిన
దనుఁజుట్టు కొనుఁగాక దానికేమి

తే.గీ. యెదిరి సత్త్వంబు తన సత్త్వమెఱుఁగలేక
పోరువాఁడెందున వివేకబుద్ధి యండ్రు
కలిత లక్ష్మీశ, సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ ! (వేంకటేశ శతకం)

2. బలవంతులకు గుణపాఠం

అనగనగా ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో చాలా చీమలు నివసిస్తూ ఉండేవి. వాటిల్లో కొన్ని చీమలు కలిసి పెద్ద పుట్టను నిర్మించుకున్నాయి. అందులోనే జీవించసాగాయి. కొన్నాళ్ళకు ఆ పుట్టలో పెద్దపాము ప్రవేశించింది. దానితో చీమలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చీమలు కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుని ఆ పుట్టలో దాచి పెట్టుకున్నాయి. అదంతా ఆ పామువలన పాడైపోతున్నది. తనకు బలం ఉన్నది గదా ! అని పాము గర్వంతో ప్రవర్తిస్తున్నది.

చీమలు ఆలోచించాయి. “తాము కలిసికట్టుగా దాడిచేస్తే పాము ఏమీ చేయలేదు” అని అనుకున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న తమతోటి చీమలకు తమ బాధను తెలుపుకున్నాయి. దానితో అవి అన్నీ కలసి వచ్చాయి. పెద్ద దండు తయారయ్యింది. అదను చూసి అన్నీ కలిసి పాము మీద దాడి చేశాయి. చీమల గుంపులో పాము కూరుకుపోయింది. ఏమీ చేయలేని నిస్సహాయురాలయ్యింది పాము. ఊపిరాడక కొంత సేపటికి ప్రాణాలు కోల్పోయింది. చీమలకు పాము పీడ విరగడయ్యింది.

నీతి : బలహీనులు అందరూ కలిస్తే బలవంతుల గర్వం అణగక తప్పదు.

VII. భాషను గురించి తెలుసుకుందాం!

1) కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
అ) చాలకున్న = చాలక + ఉన్న – (అ + ఉ) – (ఉత్వసంధి)
ఆ) అదేమిటి = అది + ఏమిటి – (ఇ + ఏ) – (ఇత్వసంధి)
ఇ) వెళ్ళాలని = వెళ్ళాలి + అని – (ఇ + అ) – (ఇత్వసంధి)
ఈ) ఒకింత = ఒక + ఇంత -(అ + ఇ) – (అత్వసంధి)

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2) కింది పదాలు చదవండి. పదంలోని చివరి అక్షరం కింద గీత గీయండి.
పూచెను, వచ్చెను, తినెను, చూచెన్, ఉండెన్

పై పదాలను గమనిస్తే, పదాల చివర ‘ను’, ‘న్’లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉన్నది.

ఈ ‘న’ కారాన్ని ద్రుతం అంటారు. ఈ చివరన ‘న’ కారం గల పదాలను ద్రుతప్రకృతికాలు అంటారు. పూచేను, వచ్చెను, చూచెన్ మొదలైనవి ద్రుతప్రకృతికాలే.

మరికొన్ని ద్రుతప్రకృతికాలను రాయండి.
కాచెను, వ్రాసెను, తినెను, త్రాగెన్, చదివెన్ మొదలగునవి.

3) కింది వాటిని గమనించండి.
ఉదా :
అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు

అభ్యాసం :
పైన తెల్పిన ఉదాహరణల్లాగా కింది వాటిని వివరించండి.
1) చేసెను + తల్లీ : చేసెను + దల్లీ
2) దెసను + చూసి = దెసను + జూసి

గమనిక :
మొదటి ఉదాహరణలో ద్రుత ప్రకృతికానికి ‘క’ పరమైతే, దానికి ఆదేశం (దాని స్థానంలో) ‘గ’ వచ్చింది.

రెండవ ఉదాహరణలో ద్రుత ప్రకృతికానికి ‘చూ’ పరమైతే దానికి ఆదేశంగా ‘జూ’ వచ్చింది. అలాగే ‘ట’ కు ‘డ’, ‘క’ కు ‘గ’, ‘చ’ కు ‘జ’ ఆదేశంగా వచ్చా యి.
అంటే
‘క’ కు – గ ; ‘చ’ కు + జ ; ‘ట’ కు – డ;

గమనిక :
1) ‘క, చ, ట, త, ప’ లకు ‘పరుషాలు’ అని పేరు.
2) ‘గ, జ, డ, ద, బ, లకు ‘సరళాలు ‘ అని పేరు.
పై ఉదాహరణలలోని భావాన్ని బట్టి సూత్రీకరిస్తే, ద్రుత ప్రకృతిక సంధి లేక సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉండాలి.

1. సూత్రం :
ద్రుత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి.
గమనిక :
కింది ఉదాహరణలు చూడండి.

పూచెఁగలువలు – ద్రుతం అరసున్న (C) గా మారింది.
ఉదా :
పూచెను + కలువలు
1) పూచెంగలువలు – ద్రుతం పూర్ణబిందువుగా (0) గా మారింది.
2) పూచెన్గలువలు – ద్రుతం సంశ్లేషగా మారింది అంటే ద్రుతం మీది హల్లుతో కలిసింది.
3) పూచెనుగలువలు – ద్రుతం ఏ మార్పూ చెందకుండా ఉంది.

పై ఉదాహరణల ఆధారంగా, ద్రుత ప్రకృతిక సంధి జరిగిన తీరును సూత్రీకరిస్తే ఇలా ఉంటుంది.

2. సూత్రం :
ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. అనగా ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.

ఛందస్సు :

1) ఒకే అక్షర గణాలు :
ఒకే అక్షరం గణంగా ఏర్పడితే అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.

2) రెండు అక్షరాల గణాలు :
రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువు, లఘువులుంటాయి. ఇవి నాలుగు రకాలు
అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అని అంటారు.

ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిసి గణంగా ఏర్పడితే, అది ‘లగం’ లేదా ‘వ’ గణం అని అంటారు.

ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.

ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.

అభ్యాసం :
రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.

3) మూడు అక్షరాల గణాలు :
మూడేసి అక్షరాలు గల గణాలు ఎనిమిది. పట్టికలో చూడండి, మరికొన్ని పదాలు రాయండి.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

కరి : ఏనుగు, హస్తి, గజము, ఇభము
భూరి : బంగారం, హేమం, సువర్ణం
మిత్రుడు : స్నేహితుడు, సఖుడు, చెలికాడు
పుష్పము : పూవు, సుమము, కుసుమము
ధనము : సంపద, ఐశ్వర్యము, డబ్బు
కొండ : అద్రి, పర్వతం, నగము
భాస్కరుడు : రవి, సూర్యుడు, ప్రభాకరుడు
మర్త్యుడు : మానవుడు, నరుడు
వాణి : వాక్కు మాట
జలము : నీరు, వారి, ఉదకము
లక్ష్మి : శ్రీ, రమ, కమలాలయ

వ్యుత్పత్యర్థాలు

కేశము – శిరస్సున ఉండేది. (వెంట్రుక)
ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
భాస్కరుడు – కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
కరి – తొండము గలది (ఏనుగు)
దాశరథి – దశరథుని కుమారుడు (శ్రీరాముడు)
మిత్రుడు – సర్వప్రాణులందు సమభావన కలవాడు (సూర్యుడు)
మర్త్యుడు – మరమున (భూ లోకమున) పుట్టినవాడు (నరుడు)

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

నానార్థాలు

ఎద = హృదయం, భయం
ఫలము = పండు, ప్రయోజనం
గుణము = స్వభావము, అల్లెత్రాడు
అమృతం = పాలు, నీరు, సుధ
మిత్రుడు = సూర్యుడు, స్నేహితుడు
సుధ = అమృతం, పాలు, నీరు
చీరము = వస్త్రము, గోచి, రేఖ
రాజు = ప్రభువు, చంద్రుడు
శ్రీ = సంపద, లక్ష్మి, సాలెపురుగు
సత్త్వము = బలము, సామర్థ్యము, శక్యము
ఇనుడు = సూర్యుడు, ప్రభువు, పోషకుడు
కోటి = సమూహం, వందలక్షలు, అగ్రభాగం
చవి = రుచి, సౌఖ్యము, దీవి

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.
భూరిమయాంగద = భూరిమయ + అంగద – సవర్ణదీర్ఘ సంధి
లక్ష్మీశ = లక్ష్మి + ఈశ – సవర్ణదీర్ఘ సంధి
జలాభిషేకం = జల + అభిషేకం – సవర్ణదీర్ఘ సంధి
శీతామృత = శీత + అమృత – సవర్ణదీర్ఘ సంధి
కాళహస్తిశ్వర = కాళహస్తి + ఈశ్వర – సవర్ణదీర్ఘ సంధి
చీరానీకం = చీర + నీకం – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును.
వేంకటేశ = వేంకట + ఈశ – గుణసంధి
వీధులందు = వీధులు + అందు -గుణసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి.
సంయుతులెవ్వరు = సంయుతులు + ఎవ్వరు – ఉత్వసంధి
భారమైన = భారము + ఐన – ఉత్వసంధి
జనులెల్ల = జనులు + ఎల్ల – ఉత్వసంధి

సరళాదేశ సంధి
సూత్రం :1) ద్రుతప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందుసంశ్లేషలు విభాషనగు.
తనఁజుట్టు = తనన్ + చుట్టు – సరళాదేశ సంధి
కీర్తిఁగోరు = కీర్తిన్ + గోరు – సరళాదేశ సంధి

ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.
ఊరూర = ఊరు + ఊరు – ఆమ్రేడిత సంధి

అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
చాలకున్న = చాలక + ఉన్న – అత్వసంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
ఘనగుణము ఘనమైన గుణము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పవిత్రవాణి పవిత్రమైన వాణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సుభూషణము మంచిదైన భూషణము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సర్వ కార్యములు సమస్తములైన కార్యములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మంచికూర మంచిదైన కూర విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మృదు పుష్పము మృదువైన పుష్పము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
లోకహితం లోకము కొరకు హితం చతుర్థి తత్పురుష సమాసం
గుణసంయుతుడు గుణములతో సంయుతుడు తృతీయా తత్పురుష సమాసం
జలాభిషేకము జలముతో అభిషేకము తృతీయా తత్పురుష సమాసం
లక్ష్మిశ లక్ష్మికి ఈశుడు షష్ఠీ తత్పురుష సమాసం
సహస్ర ముఖములు సహస్ర సంఖ్యగల ముఖములు ద్విగు సమాసం
వాగ్భూషణము వాక్కు అనెడి భూషణము రూపక సమాసం
కేశపాశము కేశముల యొక్క పాశము షష్ఠీ తత్పురుష సమాసం
నలపాకము నలుని యొక్క పాకము షష్ఠీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

పుష్పం – పూవు
కార్యం – కర్జం
శ్రీ – సిరి
లక్ష్మి – లచ్చి
రాజు – రాట్టు
కార్యం – కర్జము
గుణము – గొనము
చరిత్ర – చరిత
గౌరవం – గారవం
ముఖం – మొగము
వీధి – వీది
కీర్తి – కీరితి

శతక కవుల పరిచయం

కవుల పేర్లు కాలం శతకం
మారద వెంకయ్య 17వ శతాబ్ది భాస్కర శతకం
మూలం – భర్తృహరి 7వ శతాబ్ది సుభాషిత త్రిశతి
అనువాదం-ఏనుగు లక్ష్మణకవి 18వ శతాబ్ది సుభాషిత రత్నావళి
కంచర్ల గోపన్న (రామదాసు) 17వ శతాబ్ది దాశరథీ శతకం
మూలం – నీలకంఠ దీక్షితులు 17వ శతాబ్ది సభారంజన శతకం
అనువాదం -ఏలూరిపాటి అనంతరామయ్య 20వ శతాబ్ది
ధూర్జటి 16వ శతాబ్ది శ్రీకాళహస్తీశ్వర శతకం
తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు 16వ శతాబ్ది వేంకటేశ శతకం
కొండూరు వీర రాఘవాచార్యులు 20వ శతాబ్ది మిత్ర సాహఠి

పద్యాలు – ప్రతి పదార్థాలు – భావాలు

1వ పద్యము (కంఠస్థ పద్యం)

*చ. తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తిఁ గోరు నా
ఘనగుణశాలి లోకహితకార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను శేషుఁడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవఁడే మణి మహాభరమైన ధరిత్రి భాస్కరా !
(భాస్కర శతకం)
ప్రతిపదార్థాలు:
భాస్క రా = సూర్య భగవానుడా !
కీర్తిన్ = యశమును
కోరు = అపేక్షించునట్టి
ఆ ఘనగుణశాలి = ఆ గొప్ప గుణములచే ఒప్పువాడు
తనకున్ = తనకు
ఫలంబు = లాభము
లేదు + అని = లేదని
ఎదన్ = మనస్సులో
తలపోయడు = ఆలోచింపడు
లోకహిత కార్యము; లోక = లోకమునకు
హిత = మేలయిన
కార్యము = పని
మిక్కిలి భారము + ఐనన్ = చాలా కష్టమైనా
మేలు = మంచిది అని
అనుకొని = భావించి
పూనున్ = ప్రయత్నిస్తాడు
శేషుడు = ఆదిశేషుడు
సహస్రముఖంబులన్ = (తన) వేయినోళ్ళతోనూ
గాలి = గాలిని
క్రోలి = పీల్చి (మేసి)
తాన్ = తాను
మహాభరము = మిక్కిలి బరువు
ఐన = అయిన
ధరిత్రిన్ = భూమిని
అనిశమున్ = ఎల్ల కాలమును
మోవడే (మోవడు + ఏ) : మోయడం లేదా ! (మోస్తున్నాడు)

భావం :
భాస్కరా ! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని, మనోజ్ఞతను గ్రహించే శక్తి లేనప్పుడు ఆ చదువు వ్యర్ధము. దాన్ని గుణవంతులు ఎవరూ మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి నలపాకంగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా !

నీతి : గుణవంతుడు ఎపుడూ లోకానికి మేలు జరిగే పనులు చేస్తాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

2వ పద్యము – (కంఠస్థ పద్యం)

*చ. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం
బదనుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టఁగ నేర్చునటయ్య భాస్కరా!
(భాస్కర శతకం)
ప్రతిపదార్థాలు:
భాస్కరా = ఓ సూర్య భగవానుడా !
చదువు = చదువు
అది = అది
ఎంత కల్గినన్ = ఎంత ఉన్నప్పటికీ
రసజ్ఞత = అందులోని సారాన్నీ, మనోజ్ఞతనూ గ్రహించే నేర్పు
ఇంచుక = కొంచెము
చాలకున్నన్ (చాలక + ఉన్నన్) : లేకపోతే
ఆ చదువు = ఆ పాండిత్యము
నిరర్ధకంబు = పనికిమాలినది అవుతుంది
ఎచ్చటన్ = ఎక్కడైనా
గుణసంయుతులు = మంచి గుణములు గలవారు
ఎవ్వరు = ఎవరూ
మెచ్చరు = ఆ చదువును మెచ్చుకోరు
(ఎట్లన) = (అదెలా గంటే)
మంచికూరన్ = మంచి కూరను
నలపాకము = నల చక్రవర్తి చేసే పాకము వంటి పాకమును
చేసినన్ = చేసినప్పటికీ
అందున్ = ఆ కూరలో
ఇంపు + ఒదవెడు = చక్కని రుచిని పుట్టించే
ఉప్పు లేక = ఉప్పు లేకపోతే
రుచి = (ఆ కూరకు) రుచి
పుట్టగన్ + నేర్చును + అటయ్య = కలుగుతుందా ? (కలుగదు)

భావం :
భాస్కరా ! కీర్తిని కోరే గుణవంతుడు తనకు ఎలాంటి లాభాలు కావాలని ఆశించడు. లోకానికి మేలు జరిగే పని ఎంత భారమైనా ఆ పనిని చేయడానికి పూనుకుంటాడు. సర్పరాజయిన ఆదిశేషుడు తన వేయి పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని ఎప్పుడూ మోస్తున్నాడు కదా !

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

3వ పద్యము (కంఠస్థ పద్యం)

*ఉ. భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితుఁ జేయుఁ బవిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించు నన్నియున్
(సుభాషిత రత్నావళి)
ప్రతిపదార్థాలు:
మర్త్యులకున్ = మానవులకు
భూరిమయాంగద తారహారముల్ ; భూరిమయ = బంగారు వికారమైన
అంగద = కేయూరములునూ
తారహారముల్ = ముత్యాల హారాలునూ
భూషలు + కావు = అలంకారములు కావు
భూషిత కేశపాశ ………. జలాభిషేకముల్; భూషిత = అలంకరింపబడిన
కేశపాశ = వెంట్రుకల సమూహమునూ
మృదుపుష్ప = మంచి పుష్పములునూ
సుగంధ, జల + అభిషేకముల్ సుగంధ జల = మంచి వాసనగల నీటితో (పన్నీటితో)
అభిషేకముల్ = స్నానములునూ
భూషలు + గావు = అలంకారములు కావు
పూరుషునిన్ = మనుష్యుని
పవిత్రవాణి = పవిత్రమైన వాక్కు
భూషితున్ + చేయున్ = అలంకరిస్తుంది
వాగ్భూషణమే ; వాక్ + భూషణము + ఏ= వాక్కు అనెడి అలంకారమే
సుభూషణము = మంచి అలంకారము
భూషణముల్ = మిగిలిన అలంకారములు
అన్నియున్ = అన్నీ
నశియించున్ = నశిస్తాయి.

భావం :
బంగారు ఆభరణాలు ధరించడం, కొప్పులో పువ్వులు పెట్టుకోవటం, సుగంధ ద్రవ్యాలను వాడటం, పన్నీరుతో స్నానాలు చేయటం మొదలైనవి మానవులకు నిజమైన అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటయే నిజమైన అలంకారం. మిగిలిన అలంకారాలు అన్నీ నశించిపోయేవే.

4వ పద్యము (కంఠస్థ పద్యం)

*చ. వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికికిఁజిక్కెఁజిల్వ గనువేదురుఁ జెందెను లేళ్ళు, తావినో
మనికి నశించెఁ దేటి, తరమా యిరుమూటిని గెల్వ వైదుసా
ధనముల నీవె గావఁదగు దాశరథీ కరుణాపయోనిధీ ! (దాశరథీ శతకం)
ప్రతిపదార్థాలు :
దాశరథీ = దశరథుని పుత్రుడవైన రామా!
కరుణాపయోనిధీ ! = కరుణకు సముద్రము వంటివాడా!
వనకరి = అడవి ఏనుగు
మైనసకున్ = శరీరపు దురదకు (దేహము నందలి చాపల్యమునకు)
చిక్కెన్ = చిక్కుపడింది
మీను = చేప
వాచవికిన్ = నోటివాపిరితనమునకు ; (నోటి రుచికి) గాలమునందు గుచ్చిన ఎఱ్ఱ రుచికి
బిల్వ = పాము
తాన్ = తాను
వినికికిన్ = వినడానికి (పాములవాడు ఊదే స్వరాన్ని వినడానికి)
చిక్కెన్ = చిక్కుపడుతుంది
లేళ్ళు = లేళ్ళు
కనువేదురున్ = కంటి పిచ్చిని
చెందున్ = పొందుతాయి (చక్షురింద్రియానికి లోనయి చిక్కువడుతాయి)
తేటి = తుమ్మెద
తావిలో = వాసనలో
మనికిన్ = ఉండడం చేత
నశించెన్ = నశించింది
ఇరుమూటిని = ఐదింటినీ (ఐదు ఇంద్రియాలనూ)
గెల్వన్ = జయించడానికి
తరమా = శక్యమా
ఐదు సాధనములన్ = పంచవిధములైన ఉపాయాల చేత
నీవె = నీవే
కావదగున్ = రక్షించాలి

భావం :
తన దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటి రుచిని ఆశించి చేప, రాగానికి లొంగి పాము, అందానికి బానిసయై జింక, పూల వాసనలకు మైమరచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణీ ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్లనే నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను ఎలా బయటపడగలను? ఓ రామా ! కరుణా సాగరా ! నీవే నన్ను కాపాడాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

5వ పద్యము – (కంఠస్థ పద్యం)

*ఆ.వె. క్షమను కడఁక నెవరు గాపాడుకొందులో
క్షమను చిరము వారు కావ గలరు
కదలకుండ నెవరికడ క్షమయుండునో
సర్వకార్యములకు క్షములు వారు
(సభారంజన శతకం)
ప్రతిపదార్థాలు :
ఎవరు = ఎవరు
కడకన్ = ప్రయత్నంతో
క్షమను = ఓర్పును (ఓరిమిని)
కాపాడుకుందురో = కాపాడుకుంటారో
వారు = వారు
క్షమను = భూమిని
చిరము = చాలాకాలము
కావగలరు = రక్షింపగలరు
కదలకుండ = నిశ్చలంగా
దుమ్ము = ధూళిని (దుమ్మును)
ఎత్తి = పైకి ఎత్తి
చల్లినన్ = చల్లితే
తనపైనే = తన మీదనే
పడుగాక = పడుతుంది కాని
దానికేమి = దానికిన్ + ఏమి = సూర్యునికి ఏమవుతుంది?
కొండతోన్ = కొండతో (పర్వతంతో)
తగరు = పొట్టేలు
ఢీకొని = ఎదుర్కొని
ఎంత తాకినన్ = ఎంతగా పోరాడినా
తల = పొట్టేలు తల
ప్రక్కలు + అగున్ + కాక = ముక్కలు ఔతుంది కాని
దానికిన్ + ఏమి = ఆ కొండకు ఏమవుతుంది? (ఏమీకాదు)
మిడతలు = ‘మిడతలు’ అనే ఎగిరే పురుగులు
చిచ్చుపై = నిప్పుపై
వడిన్ = వేగంగా
ఎంత + ఎగసినన్ = ఎంతగా ఎగిరినా (వ్యాపించినా)
తామె (తాము + ఎ) = తామే (మిడతవే మాడిపోతాయి)
పొక్కెడున్ + కాక = పరితపిస్తాయి కాని
దానికిన్ + ఏమి = ఆ నిప్పుకు ఏమి బాధ ఉంటుంది?
వలన్ + పడ్డ = వలలో చిక్కుపడిన
మీను = చేప
ఎంత వడిదాక = ఎంత సేపటి వరకు
పొరలిన = అటునిటూ దొర్లినా
చుట్టుకొనున్ + కాక = చుట్టుకుపోతుంది కాని
దానికేమి (దానికిన్ + ఏమి) : ఆవలకు ఏమౌతుంది? (ఏమీకాదు)
ఎదిరిసత్త్వంబు = ఎదుటి వాడి బలము
తన సత్త్వము = తన బలము
ఎఱుగలేక = తెలిసికోలేక
పోరువాడు = యుద్ధానికి దిగేవాడు
అవివేకబుద్ధి = వివేకములేని బుద్ధిగలవాడని
= అంటారు

భావం :
ఓ వేంకటేశ్వరా ! నీవు లక్ష్మీ సమేతుడవు. లోకమంతటా నిండియున్నవాడవు. కోటి సూర్యుల తేజస్సు కలవాడవు. లోకంలో ఎవరైనా దుర్మార్గుడై సూర్యుని మీద దుమ్మెత్తి పోస్తే అది వాడి మీదే పడుతుంది. కొండతో పొట్టేలు ఢీకొంటే దాని తలే బద్దలౌతుంది. మిడతల గుంపు మంటలపైకి ఎగిసిపడితే అవే మాడిపోతాయి. వలలో చిక్కుకున్న చేప ఎంత పొరలాడినా మరింతగా బందీ అవుతుంది. ఇలా ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగితే వాడిని అవివేకి అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 3 నీతి పరిమళాలు

8వ పద్యము

ఆ.వె. చదువు జీర్ణమైన స్వాంతంబు పండును
తిండి జీర్ణమైన నిండు బలము
చెఱుపు గూర్చు రెండు జీర్ణముల్ గాకున్న
విశ్వహితచరిత్ర వినర మిత్ర -(మిత్ర సాహఠి)
ప్రతిపదార్థాలు :
మిత్ర = లోకక్షేమాన్ని కోరే మిత్రమా ! (స్నేహితుడా !)
విను = ఒక మాట విను
చదువు = చదువు
జీర్ణమైన (జీర్ణము + ఐన) = జీర్ణించుకుంటే (ఆకళింపు చేసుకుంటే)
స్వాంతంబు = మనస్సు
పండును = పరిపక్వము అవుతుంది
తిండి = తిన్న తిండి
జీర్ణమైన (జీర్ణము + ఐన)= జీర్ణించుకుంటే = తనను
బలము, నిండున్ = బలం, అతిశయిస్తుంది
జీర్ణముల్ + కాకున్నన్ = జీర్ణములు కాకపోతే (ఒంట బట్టకపోతే)
రెండు = చదివిన చదువు, తిన్న తిండి అనే రెండూ కూడా
చెఱుపు = కీడు
కూర్చున్ = కలిగిస్తాయి

భావం :
లోకక్షేమాన్ని కోరే మిత్రమా ! ఒక మాట విను. చదివిన చదువును జీర్ణించుకుంటే మనస్సు పరిపక్వమవుతుంది. తిన్న తిండి జీర్ణమైతే బలం కలుగుతుంది. ఆ రెండూ జీర్ణం కాకపోతే చెరుపు చేస్తాయి.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు

8th Class Telugu 2nd Lesson ఇల్లు – ఆనందాల హరివిల్లు Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మొదటి చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం జరుగుతున్నది? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
ఇంట్లో తాతగారు, మనవరాలికి పుస్తకం చూసి, పాఠం చెబుతున్నారు. మనవడు తాతగారితో ఆడుకుంటున్నాడు. తాతగారి అబ్బాయి, తాతగారి కోడలికి ఇంటి పనులలో సాయం చేస్తున్నాడు. వాళ్ళు తమ ఇంటి విశేషాల గురించి మాట్లాడుతున్నారు.

ప్రశ్న 2.
రెండవ చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం జరుగుతున్నది? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
రెండవ చిత్రంలో ఇంటి యజమాని లోపలకు వచ్చే వేళకు, అతని భార్య సోఫాలో కూర్చుని, టి.వి. చూస్తోంది. వారి పిల్లవాడు కంప్యూటర్ లో ఆటలు ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడు పుస్తకాల సంచి ఒక ప్రక్కన పడవేశాడు. వాళ్ళు టి.వి.లో చూస్తున్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 3.
మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు?
జవాబు:
మా కుటుంబంలో నేను, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య ఉంటాము.

ప్రశ్న 4.
మీ ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది?
జవాబు:
మా ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంటి ముందు పూలమొక్కలు, ఆకుకూరలు, కూరగాయల మొక్కలు ఉన్నాయి. మా నాన్నగారు హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు. మా అమ్మగారు గృహిణి. నేను జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని. మా అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మా నాన్నగారు పొరుగూరు స్కూలుకు బండిమీద వెళ్ళాలి. మా అమ్మ మా అందరికీ వంట చేసి పెట్టాలి. నేనూ అన్నయ్యా ఇంటి పనులలో సహాయం చేస్తాము.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
కుటుంబం ఎలా ఉండాలి? మీ కుటుంబం గురించి చెప్పండి.
జవాబు:
“ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన సంబంధాలు ఉన్న స్త్రీ, పురుషులు, వారి పిల్లలూ ఉన్న ఈ సమూహాన్నే “కుటుంబం” అంటారు.

కుటుంబం ఒక హరివిల్లులా, అంటే ఇంద్రధనుస్సులా ఉండాలి. ఆ హరివిల్లులో తల్లి, తండ్రి, పిల్లలు, తాతయ్య నాన్నమ్మలు ఒక భాగం. అప్పుడు ఆనందం తాండవిస్తుంది. కుటుంబం అనే భావన తియ్యనిది. ఆ మాట గుర్తుకు రాగానే, ఏదో తియ్యని, తెలియని హాయి కలగాలి. తీపి జ్ఞాపకాలు గుర్తుకు రావాలి.

మా ఇంట్లో అమ్మా, నాన్న, నేనూ, మా అన్నయ్య కలిసి ఉంటాము.

ప్రశ్న 2.
మీకు తెలిసిన సమష్టి కుటుంబాన్ని గురించి మాట్లాడండి.
జవాబు:
మా చిన్న తాతగారు పల్లెటూళ్ళో ఉంటారు. వారి ఇంట్లో తాతగారు, మామ్మ, బాబాయి, పిన్ని ఉంటారు. మా బాబాయికి ఒక ఆడపిల్ల, ఒక అబ్బాయి ఉన్నారు. ఆడపిల్ల ఇంటరు చదువుతోంది. పిల్లవాడు 8వ తరగతి చదువుతున్నాడు.

వాళ్ళు ఆరుగురే కలిసి ఉంటారు. వారికి వ్యవసాయం ఉంది. పాడి పశువులు ఉన్నాయి. కొబ్బరి తోటలున్నాయి. – మా తాతగారు, బాబాయి పౌరోహిత్యం చేసి సంపాదిస్తారు. అందరూ కలిసి అన్ని పనులూ చేసుకుంటారు.

వారిది పెద్ద ఇల్లు, పెద్ద ఖాళీస్థలం. వారి ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలు పండిస్తారు. నాలుగు గేదెలను పెంచుతారు. కావలసిన పాలు వాడుకొని, మిగిలినవి అమ్ముతారు. వారి జీవితం ఆనందంగా సాగుతోంది.

ఒకరి అవసరానికి మరొకరు సంతోషంగా సాయపడతారు. వారిది చక్కని సమష్టి కుటుంబం.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ప్రశ్న 3.
కుటుంబంలో ‘మన’ అనే భావన లేకపోతే ఎలా ఉంటుంది?
జవాబు:
కుటుంబంలో ‘మన’ అనే భావన కుటుంబ సభ్యులందరికీ ఉండాలి. అప్పుడే అందరూ కలసిమెలసి, కుటుంబం అభివృద్ధికి పాటుపడతారు. అందరూ సంపాదిస్తారు. ఒకరి అవసరాలకు మరొకరు సాయపడతారు.

‘మన’ అనే భావన లేకపోతే సమష్టి కుటుంబం అనేది సక్రమంగా నడువదు. స్వార్థపరత్వం పెరుగుతుంది. పరస్పరం పోటీ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, తగవులు వస్తాయి. అప్పుడు అందరూ కలసిమెలసి ఉండలేరు. ఎవరిమట్టుకు వార్కి తమకు, తమ పిల్లలకు అనే భావనలు వస్తాయి.

II. చవదవడం, అవగాహన చేసుకోవడం

1. కింది పదాలను పాఠంలో గుర్తించండి. ఆ వాక్యాలను చదవండి. వాటి గురించి చెప్పండి.

ఆశ్రమధర్మాలు, గృహస్థాశ్రమం, జీవితపథం, గార్హస్య జీవితం, సమాజ స్థితిగతులు, సంఘీభావం, సమష్టి వ్యవస్థ, ఆర్థిక స్వాతంత్ర్యం, విశ్వసనీయత, సమగ్రత.
జవాబు:
ఆశ్రమధర్మాలు :
‘గృహస్థాశ్రమ ధర్మం ద్వారా ఇతర ఆశ్రమధర్మాలు సక్రమంగా కొనసాగుతాయి. ” ఆశ్రమాలు నాలుగు రకాలు –
1. బ్రహ్మచర్యాశ్రమం
2. గృహస్థాశ్రమం
3. వాసప్రస్థాశ్రమం
4. సన్యాసాశ్రమం

గృహస్థాశ్రమం :- “అంతేగాక, ఆనాటి సమాజంలో ఉన్న నాలుగు ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.”

గృహస్థాశ్రమం అంటే పెళ్ళి చేసుకొని భార్యాబిడ్డలతో సంసారం చేసుకుంటూ, సుఖంగా జీవించే కాలం.

జీవితపథం :
“ఈ విధమైన జీవన విధానం వల్ల జీవితపథ నిర్దేశం జరిగేది”

జీవితపథం అంటే జీవనమార్గం. అంటే ఎలా జీవించాలో తెలిపే పూర్గం. పెద్దలను చూసి వారిలాగే పిల్లలు జీవించే పద్ధతి.

గార్హస్య జీవితం :
“అందుకే ‘గార్హస్థ జీవితం’ అతిసుందరమని వారి భావన.”

గార్హస్య జీవితం అంటే, పెళ్ళి చేసుకొని పిల్లలతో సుఖంగా జీవించడం. అతిథులకు, అభ్యాగతులకు కావలసిన సదుపాయాలు చేయడం, తల్లిదండ్రులను సేవించుకుంటూ దైవారాధన చేయడం.

సమాజ స్థితిగతులు :
“సమాజ స్థితిగతులనూ, ఆచారవ్యవహారాలనూ, సంస్కృతి సంప్రదాయాలనూ పిల్లలు ప్రత్యక్షంగా విని ఆకళింపు చేసుకోనేవారు.”

సమాజ స్థితిగతులు అంటే, సంఘంలోని నేటి పరిస్థితులు, మంచి చెడ్డలు.

సంఘీభావం :
“ఈ సంఘీభావమే, దేశానికి వెన్నెముక అయ్యింది. ”

సంఘీభావం అంటే సంఘంలో ఉండే ప్రజలంతా ఏకమై తామంతా ఒకటే అన్న భావం. కలిసిమెలసి కష్టసుఖాలు పంచుకోవడం.

సమష్టి వ్యవస్థ :
“మన ఇతిహాసాలైన రామాయణ భారతాలు ఈ సమష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి.”

‘సమష్టివ్యవస్థ’ అంటే కలసిమెలసి జీవించడం. – రామాయణంలో రాముని సోదరులు, లక్ష్మణభరతశత్రుఘ్నులు రామునితోనే కలసి ఉన్నారు. అలాగే పాండవులూ, కౌరవులూ సోదరులంతా సమష్టి కుటుంబంగానే జీవించారు.

ఆర్థిక స్వాతంత్ర్యం :
“ఉమ్మడి కుటుంబం, వ్యష్టి కుటుంబాల మేలు కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛలకు భంగం కలగకుండా … ఒక కొత్త కుటుంబవ్యవస్థ రూపుదిద్దుకోవాలి.”

‘ఆర్థిక స్వాతంత్ర్యం’ అంటే డబ్బును స్వేచ్ఛగా వాడుకొనే హక్కు కలిగియుండడం, తనకు కావలసిన ధనాన్ని తాను ఇతరులను అడగకుండానే ఖర్చు పెట్టుకోగలగడం.

విశ్వసనీయత :
“విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది.”

‘విశ్వసనీయత’ అంటే ఒకరిపై మరొకరికి నమ్మకం. కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం చాలా ముఖ్యం. కుటుంబం చక్కగా నడవడానికి కావలసిన వాటిలో విశ్వసనీయత ఒకటి.

సమగ్రత :
“విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూల స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది.”

‘సమగ్రత’ అంటే ‘సంపూర్ణత’ – సమష్టి కుటుంబానికి కావలసిన మూడింటిలో ‘సమగ్రత’ ఒకటి.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. పాఠం చదివి సరైన సమాధానాలను గుర్తించండి.
1) ఇల్లు అంటే ఇలా ఉండాలి.
అ) అందమైన భవనం
ఆ) అంతస్తుల భవనం
ఇ) ప్రేమానురాగాల నిలయం
ఈ) ఇవేవీ లేనిది
జవాబు:
ఇ) ప్రేమానురాగాల నిలయం

2) వేదకాలం అంటే
అ) రామాయణ భారతాల తరువాతికాలం
ఆ) రామాయణ భారతాల మధ్యకాలం
ఇ) రామాయణ భారతాల ముందుకాలం
ఈ) కలియుగ కాలం
జవాబు:
ఆ) రామాయణ భారతాల మధ్యకాలం

3) ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఉండాల్సింది.
అ) భార్యాభర్తలకు సమప్రాధాన్యం
ఆ) భార్యకే ఎక్కువ ప్రాధాన్యం
ఇ) భర్తకే ఎక్కువ ప్రాధాన్యం
ఈ) పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యం
జవాబు:
అ) భార్యాభర్తలకు సమప్రాధాన్యం

4) సంస్కృతి సంప్రదాయాలు ఎలా అలవడతాయి?
అ) కుటుంబం ద్వారా
ఆ) సమాజం ద్వారా
ఇ) పాఠశాల ద్వారా
ఈ) వీటన్నిటి ద్వారా
జవాబు:
అ) కుటుంబం ద్వారా

5) “అందరి సుఖంలో నా సుఖం ఉంది” దీనిలో ఏ భావన ఉంది?
అ) స్వార్థ భావన
ఆ) నిస్స్వా ర్థ భావన
ఇ) విశాల భావన
ఈ) సంకుచిత భావన
జవాబు:
ఆ) నిస్స్వా ర్థ భావన

3. కింది ప్రశ్నలకు పాఠం చదివి జవాబులు రాయండి.

అ) కుటుంబమంటే ఏమిటి?
జవాబు:
ఒకే గొడుగు నీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన ‘ సంబంధాలు ఉన్న స్త్రీ, పురుషులు, వారి పిల్లలూ ఉన్న ఈ సమూహాన్నే “కుటుంబం” అంటారు.

కుటుంబం అనేది ఒక హరివిల్లు. ఆ హరివిల్లులో అమ్మానాన్నలు, పిల్లలతో పాటు తాతయ్య నానమ్మలు ఒక భాగం. అలాంటి కుటుంబం అందంగా ఉండి ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఇల్లే ఇలలో స్వర్గం అవుతుంది. సమాజానికి కుటుంబం వెన్నెముక వంటిది.

ఆ) భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చారు? ఎందుకు?
జవాబు:
కుటుంబంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైనది. గౌరవప్రదమైనది. అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. “ఇంటికి దీపం ఇల్లాలు” అనే నానుడిని బట్టి భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చారు.

పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణ, సంతానాన్ని కనడం, గృహస్థాశ్రమ నిర్వహణ అనే వాటిలో స్త్రీకే ప్రాధాన్యం. అందువల్లే మన సంస్కృతిలో స్త్రీకి ప్రాధాన్యం ఇచ్చారు.

ఇ) వృష్టి కుటుంబం అంటే ఏమిటి? ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి?
జవాబు:
‘వ్యష్టి కుటుంబం’ అంటే భార్యాభర్తలూ, పిల్లలు మాత్రమే ఉన్న చిన్న కుటుంబం. ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటి పైనే, ‘వ్యష్టి కుటుంబం’ ఆధారపడి వుంటుంది. వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయించుకొనే అధికారం లభిస్తాయి.

ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకూ, ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడంవల్ల, స్వార్థం పెరిగిపోవడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. చిన్న కుటుంబం అనే భావం బలపడింది. అందువల్లనే వ్యష్టి కుటుంబాలు ఏర్పడుతున్నాయి.

ఈ) కుటుంబ వ్యవస్థకు మూల స్తంభాలేమిటి?
జవాబు:
1) విశ్వసనీయత 2) సమగ్రత 3) ఏకత అనే మూడు మూల స్తంభాల మీదనే మన కుటుంబవ్యవస్థ ఆధారపడి ఉంది. ‘అందరి సుఖంలో నా సుఖం ఉంది. వారి కోసమే మన జీవితం’ అనే త్యాగ భావన, భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.

ఉ) తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సిందేమిటి?
జవాబు:
తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా పిల్లల సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా, ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, పరోపకారం వంటి గుణాలు ఇవ్వాలి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక” అనడానికి కారణాలు రాయండి.
జవాబు:
దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక. మంచి కుటుంబం, మంచి సమాజం నుంచి మంచి దేశం ఏర్పడుతుంది. దేశం అంటే చక్కని కుటుంబాల సమాహారమే. కుటుంబాలు అన్నీ చక్కగా సిరిసంపదలతో ఉంటే, దేశం బాగా ఉన్నట్లే. కుటుంబ వ్యవస్థ వల్లే, దేశీయ జీవన సంస్కృతులు నిలుస్తున్నాయి. కాబట్టి దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక.

ఆ) “అసలు కంటే వడ్డీయే ముద్దు” ఈ సామెతను పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
ఉమ్మడి కుటుంబాలలో ఎప్పుడూ ఒకరి కష్టాలను ఒకరు పంచుకోవటం జరుగుతుంది. శుభకార్యాలకు ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా ఉంటారు. అందరూ పెద్దవారి పట్ల భయభక్తులతో ఉంటారు. పిల్లలు ఏదైనా అల్లరి చేసినపుడు తల్లిదండ్రులు మందలించిన వెంటనే వారు తమ అమ్మమ్మ, నాయనమ్మల చెంత చేరతారు. వారు పిల్లలను ప్రేమతో దగ్గరకు తీసుకొని ముద్దాడతారు.

అందుకే “అసలు కంటె వడ్డీ ముద్దు” అనే సామెత పుట్టింది. అసలు అంటే తమకు పుట్టిన పిల్లలు, వడ్డీ అంటే తమ పిల్లలకు పుట్టిన పిల్లలన్నమాట. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కూడా, ఎక్కువ వడ్డీ ఇచ్చేవాళ్ళకే అప్పునిస్తారు. వాళ్ళకు అసలు కంటే వడ్డీయే ముద్దు ” తాము ఇచ్చిన అసలు అప్పు తీసుకున్నవాడు తీర్చగలడా? లేదా? అని కూడా చూడకుండా, వడ్డీపై ప్రేమతో వడ్డీ ఎక్కువ ఇస్తానన్నవాడికే వాళ్ళు అప్పు ఇస్తారు. అలాగే కుటుంబంలో పెద్దలు, కన్న పిల్లల కంటె, మనవల్నే ఎక్కువగా లాలిస్తారు అని భావం.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

ఇ) ‘కలిసి ఉంటే కలదు సుఖం’ దీన్ని వివరించండి.
జవాబు:
ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం చిన్న కుటుంబాలలో ఉండదు. చిన్న కుటుంబంలో సభ్యులందరూ సంతోషాలను, బాధలను ఒకరివి ఒకరు పరస్పరం పంచుకోలేరు. కుటుంబం అనే హరివిల్లులో అమ్మా నాన్నలు, పిల్లలతోపాటు తాతయ్య, నాన్నమ్మ కూడా కలిసి ఉంటే ఆనందం వెల్లివిరుస్తుంది. కలిసి ఉంటే పిల్లలకు మన సమాజ స్థితిగతులు, ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. వారు కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థనే కోరుకుంటారు. కలసిమెలసి తిరిగినపుడే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోగలరు. అలాగే ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా, సందడిగా ఉంటుంది. మన అనే బంధం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు సంఘీభావంతో మెలుగుతారు. స్వార్థపరతకు తావు తక్కువగా ఉంటుంది. సత్ సాంప్రదాయాలు, కుటుంబపరమైన వారసత్వ భావనలు తరువాతి తరం వారికి అందుతాయి.

ఈ) యాంత్రిక జీవనం అంటే ఏమిటి?
జవాబు:
‘యాంత్రిక జీవనం’ అంటే మన జీవన విధానంలో మనం నిత్యం చేసుకొనే పనులకు యంత్రాలను ఉపయోగించడం. ఇప్పుడు వ్యష్టి కుటుంబ పద్దతిలో తమ పనులు తామొక్కరే పూర్తి చేసుకోలేకపోతున్నారు. అందువల్ల యంత్రశక్తి వినియోగం రోజు రోజుకీ పెరుగుతోంది.

నేడు బట్టలు నేయడం, నూనెలు తీయడం వంటివి లేవు. బట్టలు ఉతకటానికి, పిండి రుబ్బటానికి, నగల తయారీకి, నీళ్ళు తోడడానికి, పొలం దున్నటానికి, చెప్పులు కుట్టడానికి, గిన్నెలు కడగటానికి, కడిగిన చేతులు ఆరటానికి కూడా యంత్రశక్తినే వాడుతున్నారు. యంత్రశక్తి వాడటం వల్ల మనిషి బద్ధకస్తుడౌతున్నాడు. చలాకీతనాన్ని పోగొట్టుకొని రోగాలపాలు అవుతున్నాడు. ఈ యాంత్రిక జీవన విధానం వల్ల అందాలు, ఆనందాలు హరించిపోతున్నాయి.

ఉ) పిల్లలు సమాజంలో నిలదొక్కుకోవడానికి కుటుంబ నేపథ్యం ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
మంచి కుటుంబంలో పెరిగిన పిల్లలు, తల్లిదండ్రుల నుండి క్రమశిక్షణ, ఇంట్లో పెద్దల నుండి ప్రేమానురాగాలు, నీతి, చక్కని నడవడి నేర్చుకుంటారు. వారు చక్కగా చదువుకొని, బాధ్యతతో పెరిగి పెద్దవారవుతారు. దేశ పౌరులుగా తమ తల్లిదండ్రుల పట్ల, దేశంపట్ల, సంఘం పట్ల, మంచి బాధ్యతతో క్రమశిక్షణ గలిగి, దేశభక్తితో నడచుకుంటారు. దేశపౌరులుగా తమ విధులను నెరవేరుస్తారు. ఈ విధంగా పిల్లలు సమాజంలో నిలదొక్కుకోవడానికి కుటుంబ నేపథ్యం ఉపయోగపడుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) సమష్టి కుటుంబానికీ, వ్యష్టి కుటుంబానికీ మధ్య వ్యత్యాసమేమిటి? దాని పరిణామాలెలా ఉన్నాయి?
జవాబు:
సమష్టి కుటుంబంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇంట్లో సభ్యులందరూ కలిసి ఉంటారు. సమష్టి కుటుంబంలో కష్టసుఖాల్ని అందరితో పంచుకొంటారు. ఆ విధంగా వారికి ఓదార్పు లభిస్తుంది.

ప్రతి పనిలోనూ సహాయ సహకారాలు, సూచనలూ లభిస్తాయి. ఒకరికి ఒకరు, చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఆనందాలను అందరూ పంచుకొంటారు. పిల్లలు పెద్దల ఆలనాపాలనలో వాళ్ళ కమ్మని కబుర్లతో, కథలతో ఆరోగ్యంగా పెరుగుతారు. ఇంట్లో అందరికీ పెద్దలపట్ల భయభక్తులుంటాయి. తల్లిదండ్రుల సేవ, భగవంతుని సేవగా భావిస్తారు. ఈ జీవన విధానం వల్ల జీవిత మార్గం నిర్దేశింపబడుతుంది. పిల్లలు సమాజ స్థితిగతులనూ, ఆచార వ్యవహారాలనూ సంస్కృతీ సంప్రదాయాలనూ ప్రత్యక్షంగా ఏని, అర్థం చేసుకుంటారు.

కాని, ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకూ, ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికి ప్రాధాన్యం ఉండదు. స్వార్థం పెరిగిపోతుంది. అందువల్ల మార్పులు వచ్చాయి. చిన్నకుటుంబం అన్న భావన బలపడి వ్యష్టి కుటుంబవ్యవస్థగా మారింది.

ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటిపైనే, వృష్టి కుటుంబం ఆధారపడింది. ఈ వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయాధికారం లభిస్తాయి. ఈ

కాని వ్యష్టి కుటుంబంవల్ల, వారసత్వ భావనలు అందవు. దేశీయ సాంస్కృతిక జీవన సంప్రదాయాలు నిలువవు. పిల్లలకు కంప్యూటర్లే ఆటపాటలవుతాయి. భావాలు సంకుచితమై, అనుభూతులు లోపిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై తగిన శ్రద్ధ చూపడం లేదు. అది, పిల్లల మనస్తత్వంపై విపరీత ప్రభావాన్ని చూపుతోంది. పెద్దవారు, వృద్ధాశ్రమాల్లో చేరవలసి వస్తోంది. యంత్రశక్తి వినియోగం పెరిగిపోతోంది. కుటుంబ సభ్యులు ఎవరికి వారే యమునా తీరేగా మెలుగుతున్నారు.

ఆ) కుటుంబవ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి?
జవాబు:
ఉమ్మడి కుటుంబం, వృష్టి కుటుంబం మేలు కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం రాని ఏడంగా, ఆధిపత్యాల పోరులేని విధంగా, ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు అంతస్సూత్రంగా గల ఒక కొత్త కుటుంబ వ్యవస్థను తీర్చిదిద్దుకోవాలి.

ఏ కుటుంబంలో ఉన్నప్పటికీ కుటుంబ భావనలు, పిల్లలకు వివరించి చెప్పాలి. పెద్దల బలాన్ని పొందాలి. బలగాన్ని పెంపొందించుకోవాలి. యాంత్రికత తగ్గాలి. మానవ శక్తి, యుక్తి నైపుణ్యాలు మన వారసత్వ సంపదను పెంచేలా ఉపయోగపడాలి. సమస్యలను పరస్పరం ఆలోచించుకొని పరిష్కరించుకోవాలి. బాధ్యతలు పంచుకోవడం వల్ల యజమాని భారం తగ్గుతుంది. యంత్రశక్తి మీద ఆధారపడి బద్ధకస్తులు కాకూడదు.

కుటుంబ సభ్యులు సుఖాల్నీ, సంతోషాల్నీ, కష్టాల్నీ, బాధల్నీ పరస్పరం పంచుకోవాలి. ఆర్థిక సంబంధాలు, వ్యక్తిగత స్వార్థం, హక్కులు కంటె, మన బాధ్యతలు, మానవ సంబంధాలు ముఖ్యమనీ, అవి మన మనుగడకు ఆధారమనీ తెలుసుకోవాలి.

మనం చేసే పని ఏదయినా, మన సంస్కృతిని, వారసత్వాన్ని, దేశ ఔన్నత్యాన్నీ, ఇబ్బడి ముబ్బడిగా పెంచి, వారసులను ఉత్తేజితులను చేసే విధంగా ఉండాలి. అందుకు సమష్టి లేదా వ్యష్టి కుటుంబ వ్యవస్థలు దోహదం చేయాలి. ‘ఇల్లే ఇలలో స్వర్గం’ అని గుర్తించాలి. సమాజానికి కుటుంబం వెన్నెముక. మంచి కుటుంబ వ్యవస్థకై అందరూ కృషి చేయాలి.

IV. పదజాలం

1. కింది పదాలకు సాధారణ అర్థాలు ఉంటాయి. కాని పాఠంలో ఏ అర్థంలో ఉపయోగించారో వివరించండి.
( అ) పునాది ఆ) పెద్దమలుపు ఇ) అవధానం ఈ) మరుగునపడిపోవడం ఉ) కనుమరుగవడం )

ఆ) పునాది :
పిల్లల సమస్త సద్గుణాలకూ, గుర్గుణాలకూ ఇల్లే పునాది అన్నారు. అంటే ఇక్కడ మూలస్తంభం అనే అర్థంలో ఈ పునాడి పదాన్ని ఉపయోగించారు.

ఆ) పెద్దమలుపు :
నాగరికత మారిన తరువాత మానవుడు గుహల నుంచి గృహంలోకి మారాడు. అదే ఒక పెద్ద మలుపు అనే సందర్భంలో ఇది వాడారు. పెద్ద మలుపు అంటే పెద్ద మార్పు.

ఇ) అవధానం :
ఉమ్మడి కుటుంబాలలో పిల్లలందరికి ఒకేసారి భోజనాలు వడ్డించటం స్త్రీలకు అవధానం అవుతున్నది అని చెప్పు సందర్భంలో వాడతారు.
అవధానం = ఒకేసారి అన్నిటికి సమాధానాలు చెప్పటం

ఈ) మరుగునపడిపోవడం :
వ్యక్తి ప్రాధాన్యత పెరిగి సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది మరుగున పడిపోయింది అని చెప్పు సందర్భంలో వాడారు.
మరుగునపడిపోవడం = కనిపించకుండా మాయమైపోవడం

ఉ) కనుమరుగవడం :
సద్గుణాలకూ, దుర్గుణాలకూ ఇల్లే పునాది, కాని ఈ ఇల్లే ఇప్పుడు కనపడకుండా పోతోంది అనే సందర్భంలో వాడారు.
కనుమరుగవటం = కనిపించకుండా పోవడం

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2. కింది జంట పదాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) తల్లి-తండ్రి
జవాబు:
తల్లిదండ్రులు మనకు దైవాంశ సంభూతులు.

ఆ) ప్రేమ-అనురాగం
జవాబు:
వృద్ధాప్యంలో మనము పెద్దవారిపట్ల ప్రేమ-అనురాగాలు కలిగి ఉండాలి.

ఇ) అమ్మమ్మ-నాన్నమ్మ
జవాబు:
మేము ప్రతి పండుగరోజు అమ్మమ్మ-నాన్నమ్మలతో కలిసి ఆనందంగా గడుపుతాము.

ఈ) అందం – ఆనందం
జవాబు:
ఇంటి పెరట్లో పూల మొక్కలు పూస్తూ ఉంటే, అదే ‘అందం – ఆనందం’.

ఉ) అవస్థ – వ్యవస్థ
జవాబు:
మన అవస్థలు మారాలంటే, మన కుటుంబ వ్యవస్థలో మార్పులు రావాలి.

ఊ) హక్కులు – బాధ్యతలు
జవాబు:
ప్రతివ్యక్తి, తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలిసికోవాలి.

3. కింది మాటలకు వ్యతిరేక అర్థాన్నిచ్చే పదాలు గళ్ళల్లో ఉన్నాయి. వాటిని వెతికి, వాటినుపయోగించి వాక్యాలు రాయండి.
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 2
జవాబు:
AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు 3

అ. సహాయత × నిస్సహాయత
ఎందరో అనాథలు తమను పట్టించుకొనేవారు లేక నిస్సహాయతతో కాలం గడుపుచున్నారు.

ఆ. ఐక్యత × అనైక్యత
భారతీయ రాజుల అనైక్యత వల్లనే బ్రిటిష్ వారు మనదేశాన్ని స్వాధీనం చేసుకోగలిగారు.

ఇ. సమానత్వం × అసమానత్వం
ప్రపంచ దేశాల మధ్య ఆర్థికంగా అసమానత్వం ఉంది.

ఈ. ఉత్సాహం × నిరుత్సాహం
కొంతమంది ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటారు.

ఉ. ప్రాధాన్యం × అప్రాధాన్యం
మనం అప్రాధాన్య విషయాలపై సమయాన్ని వృథా చేయరాదు.

V. సృజనాత్మకత

* వేసవి సెలవుల్లో మీరు మీ స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబం మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇంటికి తిరిగి వచ్చాక మీ స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు అఖిల్ కు,

నీ స్నేహితుడు వ్రాయు ఉత్తరం. ఇక్కడ నేను క్షేమం. అక్కడ నీవు కూడా అలాగే ఉంటావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా ఉత్తరం వ్రాయుట ఏమనగా నేను ఇటీవల వేసవి సెలవులలో మీ ఇంటికి వచ్చాను కదా ! అప్పుడు మీ కుటుంబంలోని వారందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నన్ను మీలో ఒకరిగా చూశారు. ముఖ్యంగా మీ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు నన్ను ఆదరించిన విధానం నాకు చాలా నచ్చింది. నన్ను దిగుడు బావి దగ్గరకు తీసుకువెళ్ళి మీ మామయ్య చక్కగా 15 రోజులు ఈత నేర్పించారు. అలాగే మీ మామయ్య వాళ్ళ పిల్లలు, మనం కలిసి క్రికెట్, కబడ్డీ మొదలగు ఆటలు చక్కగా ఆడుకున్నాము. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియచేయవలసినదిగా కోరుకుంటున్నాను. ఈసారి వేసవి సెలవులకు నీవు మా ఊరికి తప్పక రావాలి.

ఇట్లు,
మీ మిత్రుడు,
అఖిలేశ్వర్.

చిరునామా :
బి. అఖిల్,
S/0 బి. రంగనాథం,
7-8-63, 8/4,
నైనవరం, పశ్చిమగోదావరి జిల్లా.

(లేదా)
* తాతయ్య, నాన్నమ్మ, అమ్మానాన్నలు, పిల్లలూ అంతా కలిసి ఉంటేనే కుటుంబం అంటారు. కాని నేటికాలంలో ఎంతోమంది వృద్ధులను, వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఇది సరికాదని ప్రజలందరికీ తెలియజేయడానికి కరపత్రం తయారుచేయండి.
(లేదా)
వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం మంచిది కాదని తెలియజేస్తూ ప్రజలందరికీ తెలియజేయడానికి “కరపత్రం” తయారు చేయండి.
జవాబు:
కన్నవారిని కళ్ళల్లో పెట్టి చూసుకుందాం

సోదరసోదరీమణులారా! ఒక చిన్న విన్నపం. మనం ఇలా పెరిగి పెద్దవారమై, విద్యాబుద్ధులు నేర్చుకొని, ఉద్యోగాలు చేస్తూ, ఆస్తిపాస్తులు సంపాదించుకొని, సుఖంగా ఉండడానికి వెనుక కారణం ఎవరో, ఒకసారి ఆలోచించండి. గట్టిగా ఆలోచిస్తే, మనలను చేతులు పట్టుకు నడిపించి, బడిలో చేర్పించి, చదువులు చెప్పించి, గోరుముద్దలు తినిపించి, అవసరానికి ఆదుకొని, మనకోసం వారి సుఖ సంతోషాలన్నీ త్యాగం చేసిన, మన తల్లిదండ్రులే అని, మీకు గుర్తు వస్తుంది.

ఈ మధ్య చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. అక్కడ తిండి పెడతారు. వినోదాలు కూడా ఉండవచ్చు. కానీ అక్కడ తమ పిల్లలతో మనవలతో, కోడళ్ళతో తిరిగిన సుఖ సంతోషాలు, మమతానురాగాలు మన తల్లిదండ్రులకు దొరకవు. తమ పిల్లలు తమను పట్టించుకోవడంలేదనే బెంగతో, వారు క్రుంగిపోతారు.

మీ పిల్లలకు మంచి పురాణ కథలు చెప్పి ఆదరంగా చేరదీసే తాతామామ్మలు వారికి దొరకరు. కనుక మిమ్మల్ని కనిపెంచిన తల్లిదండ్రుల్ని ఆదరించండి. మీ ఇంట్లోనే వీరిని ఉంచుకోండి. నిరాదరణకు గురిచేసి, వృద్ధాశ్రమాలకు పంపకండి. మరువకండి. లేదా మీకు మీ పెద్దల గతే, అని గుర్తుంచుకోండి.
ఇట్లు,
జె.ఎమ్.ఎస్.యువజన చైతన్య సమితి.

VI. ప్రశంస

మీరు చూసిన లేదా మీకు తెలిసిన ఒక మంచి కుటుంబాన్ని గురించి మీ భావనలను తెలుపుతూ మీ స్నేహితుడికి/ తాతయ్యకు ఉత్తరం రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు రాకేష్ కు,

నేను క్షేమం, నీవు కూడా క్షేమమని తలుస్తాను. నేను ఇటీవల సెలవులలో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ మా అమ్మమ్మ కుటుంబం మొత్తం ఉమ్మడి కుటుంబం. నాకు అలాగే అందరూ కలిసి ఉండటం చాలా నచ్చింది. అక్కడ అందరూ పెద్దవారి మాటను అనుసరించి నడచుకుంటున్నారు. పెద్దల మాటలకు బాగా గౌరవం ఇస్తున్నారు. అలాగే పిల్లలపై పెద్దవారు చూపే ప్రేమాభిమానాలు, వారి మధ్యగల అనురాగాలు నాకు బాగా నచ్చాయి. అక్కడ నేను వారందరి మధ్య సంతోషంగా గడిపాను. నీవు కూడా మీ తాతయ్య వాళ్ళింటికి వెళ్ళావు కదా ! అక్కడి విషయాలు వివరిస్తూ లేఖ వ్రాయవలెను. ఉమ్మడి కుటుంబం వలన కలిగే ప్రయోజనాలు మనము మన స్నేహితులందరికి తెలియజేయాలి. అమ్మ, నాన్నగార్లకు నా నమస్కారాలు తెలుపవలెను.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజేష్,

చిరునామా :
కె.రాకేష్,
S/o కె. రామ్మూర్తి,
9/83-78-6,
తోట్లవారి వీధి,
వైజాగ్.

ప్రాజెక్టు పని

* ఈనాటి మానవ సంబంధాలపై వార్తా పత్రికల్లో అనేక వార్తలు, కథనాలు వస్తుంటాయి. వాటిని సేకరించి తరగతిలో వినిపించండి.
జవాబు:
వార్తలు :
1. 90 ఏళ్ళ వయస్సున్న అన్నపూర్ణమ్మను ఇద్దరు కొడుకులు ఇంటి నుండి పంపివేశారు. అన్నపూర్ణమ్మ చెట్టు కింద ఉంటోంది. గ్రామస్థులు పెట్టింది తింటోంది.

2. భుజంగరావు తన తలిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఆ తల్లిదండ్రులు మనమల కోసం బెంగపెట్టుకున్నారు. అతని భార్య మాత్రం అత్తామామల రాకకు ఒప్పుకోలేదు.

VII. భాషాంశాలు

1) కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.
ఉదా :
శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది.
శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది.

అ. మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది.
జవాబు:
మహతి ఆట ఆడి, అన్నం తిన్నది.

ఆ. శ్రీనిధి జడవేసుకుంది. శ్రీనిధి పూలు పెట్టుకుంది.
జవాబు:
శ్రీనిధి జడవేసుకుని, పూలు పెట్టుకుంది.

ఇ. మాధవి పాఠం చదివింది. మాధవి పద్యం చెప్పింది.
జవాబు:
మాధవి పాఠం చదివి, పద్యం చెప్పింది.

ఈ. శివాని కళాశాలకు వెళ్ళింది. శివాని పాటల పోటీలో పాల్గొన్నది.
జవాబు:
శివాని కళాశాలకు వెళ్ళి, పాటల పోటీలో పాల్గొన్నది.

ఉ. నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు.
జవాబు:
నారాయణ అన్నం తిని, నీళ్ళు తాగుతాడు.

ఊ. సుమంత్ పోటీలకు వెళ్ళాడు. సుమంత్ మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు.
జవాబు:
సుమంత్ పోటీలకు వెళ్ళి, మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

2) కింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా రాయండి.
ఉదా :
శరత్ ఇంటికి వచ్చి, అన్నం తిన్నాడు.
శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు.

అ. కందుకూరి రచనలు చేసి సంఘ సంస్కరణ చేశాడు.
జవాబు:
కందుకూరి రచనలు చేశాడు. కందుకూరి సంఘ సంస్కరణ చేశాడు.

ఆ. రంగడు అడవికి వెళ్ళి కట్టెలు తెస్తాడు.
జవాబు:
రంగడు అడవికి వెళ్తాడు. రంగడు కట్టెలు తెస్తాడు.

ఇ. నీలిమ టి.వి. చూసి నిద్రపోయింది.
జవాబు:
నీలిమ టి.వి. చూసింది. నీలిమ నిద్రపోయింది.

ఈ. రజియా పాటపాడుతూ ఆడుకుంటున్నది.
జవాబు:
రజియా పాట పాడుతున్నది. రజియా ఆడుకుంటున్నది.

3) సంయుక్త వాక్యం
కింది వాక్యాలను గమనించండి.
విమల తెలివైనది. విమల అందమైనది.
విమల తెలివైనది, అందమైనది.
“ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం” అంటారు.

4) సంయుక్త వాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మార్పులను గమనించండి.
అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది, అందమైనది – రెండు నామపదాల్లో ఒకటి లోపించడం.

ఆ) అజిత అక్క శైలజ చెల్లెలు.
అజిత, శైలజ అక్కాచెల్లెళ్ళు – రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది.

ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
ఆయన డాక్టరా, ప్రొఫెసరా? – రెండు సర్వనామాలలో ఒకటి లోపించడం.

మరికొన్ని సంయుక్త వాక్యాలను రాయండి.

  1. ఆయనా, ఈయనా పెద్దవాళ్ళు.
  2. రవి కవిత్వమూ, కథలూ రాస్తాడు.
  3. అంబేద్కర్ కార్యవాది, క్రియాశీలి.
  4. శ్రీనిధి, రామూ బుద్ధిమంతులు.
  5. రాజా, గోపాలు అన్నాదమ్ములు.
  6. సీత యోగ్యురాలు, బుద్ధిమంతురాలు.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

అమ్మ : మాత, జనని, తల్లి
వివాహం : వివాహం, పరిణయం, ఉద్వాహం
స్వర్గం : త్రిదివం, నాకం, దివి
స్త్రీ : పడతి, స్త్రీ, ఇంతి
పక్షి : పిట్ట, పులుగు, విహంగం
వ్యవసాయం : సేద్యం, కృషి
సౌరభం : సువాసన, పరిమళం, తావి
నాన్న : జనకుడు, పిత, తండ్రి
ఇల : భూమి, వసుధ, ధరణి
పథం : దారి, మార్గం, త్రోవ
గృహం : ఇల్లు, సదనం, నికేతనం
భార్య : ఇల్లాలు, సతి, కులస్త్రీ

వ్యుత్పత్యర్థాలు

ఇతిహాసం – ఇలా జరిగిందని చెప్పేది (చరిత్ర)
మానవుడు – మనువు వల్ల పుట్టినవాడు (నరుడు)
పక్షి – పక్షములు కలది (పిట్ట)

నానార్థాలు

తాత = తండ్రి, తండ్రి తండ్రి, తల్లితండ్రి, బ్రహ్మ
గుణం = స్వభావం, అల్లెత్రాడు, ప్రయోజనం
వేదం = వెలివి, వివరణం
పాలు = క్షీరం, భాగం, సమీపం
సౌరభం = సువాసన, కుంకుమ, పువ్వు
వ్యవసాయం = కృషి, ప్రయత్నం , పరిశ్రమ
కాలం = సమయం, మరణం, నలుపు
దక్షిణం = ఒక దిక్కు సంభావన
ధర్మం = న్యాయం, ఆచారం, యజ్ఞం

సంధులు

సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకదేశమగును.

గృహస్థాశ్రమం = గృహస్థ + ఆశ్రమం – సవర్ణదీర్ఘ సంధి
స్వావలంబన = స్వ + అవలంబన – సవర్ణదీర్ఘ సంధి
దేవాలయం = దేవ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
వృద్ధాశ్రమం = వృద + ఆశ్రమం – సవర్ణదీర్ఘ సంధి
నిర్ణయాధికారం = నిర్ణయ + అధికారం – సవర్ణదీర్ఘ సంధి
కాలానుగుణం = కాల + అనుగుణం – సవర్ణదీర్ఘ సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
పరోపకారం = పర + ఉపకారం – గుణసంధి
భావోద్వేగాలు = భావ + ఉద్వేగాలు – గుణసంధి

యణాదేశ సంధి :
సూత్రం : ఇ, ఉ, ఋలకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు య, వ, ర లు ఆదేశమగును.
అత్యంత = అతి + అంత – యణాదేశ సంధి
అత్యున్నత = అతి + ఉన్నత – యణాదేశ సంధి
ప్రత్యక్షం = ప్రతి + అక్షం – యణాదేశ సంధి

వృద్ధి సంధి :
సూత్రం : అకారమునకు ఏ, ఐలు పరమగునపుడు ఐ కారమును, ఓ, ఔలు పరమగునపుడు ఔ కొరమును ఏకాదేశమగును.
మమైక = మమ + ఏక = వృద్ధి సంధి
దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం – వృద్ధిసంధి

అత్వసంధి :
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
అమ్మమ్మ = అమ్మ + అమ్మ – అత్వసంధి
నాన్నమ్మ = . నాన్న + అమ్మ – అత్వసంధి
తాతయ్య = – తాత + అయ్య – అత్వసంధి
పెద్దయిన = పెద్ద + అయిన = అత్వసంధి

ఇత్వసంధి (అ) :
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
మరెక్కడ = మరి + ఎక్కడ – ఇత్వసంధి
మనయ్యేది = పని + అయ్యేది – ఇత్వసంధి
ఏదైనా = ఏది + ఐనా – ఇత్వసంధి

ఇత్వసంధి (ఆ) :
సూత్రం : క్రియాపదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
సాగిపోయిందని = సాగిపోయింది + అని – ఇత్వసంధి
ఉండేవని = ఉండేవి + అని – ఇత్వసంధి
ఉండేదని = ఉండేది + అని – ఇత్వసంధి

ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
ఆకాశమంత =ఆకాశము + అంత – ఉత్వ సంధి
ఇల్లు + అంటే – ఉత్వసంధి
ఇల్లంటే = ఇల్లాలు = ఇల్లు – ఉత్వసంధి
వెన్నెముక = వెన్ను + ఎముక – ఉత్వసంధి

గసడదవాదేశ సంధి :
సూత్రం : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి.
తల్లిదండ్రులు = తల్లి + తండ్రి – గసడదవాదేశ సంధి
అన్నదమ్ములు = అన్న + తమ్ముడు – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అక్కాచెల్లెళ్ళు అక్కయును, చెల్లెలును ద్వంద్వ సమాసం
తల్లిదండ్రులు తల్లియును, తండ్రియును ద్వంద్వ సమాసం
రామాయణ భారతాలు రామాయణమును, భారతమును ద్వంద్వ సమాసం
ప్రేమానురాగాలు ప్రేమయును, అనురాగమును ద్వంద్వ సమాసం
సిరిసంపదలు సిరియును, సంపదయును ద్వంద్వ సమాసం
స్త్రీ, పురుషులు స్త్రీయును, పురుషుడును ద్వంద్వ సమాసం
సహాయసహకారాలు సహాయమును, సహకారమును ద్వంద్వ సమాసం
ఆచార వ్యవహారాలు ఆచారమును, వ్యవహారమును ద్వంద్వ సమాసం
భారతదేశం భారతము అను పేరుగల దేశము సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ఆశ్రమధర్మాలు ఆశ్రమము యొక్క ధర్మాలు షష్ఠీ తత్పురుష సమాసం
కుటుంబ వ్యవస్థ కుటుంబము యొక్క వ్యవస్థ షష్ఠీ తత్పురుష సమాసం
జీవనవిధానం జీవనము యొక్క విధానం షష్ఠీ తత్పురుష సమాసం
కుటుంబ జీవనం కుటుంబము యొక్క జీవనం షష్ఠీ తత్పురుష సమాసం
మంత్రశక్తి మంత్రము యొక్క శక్తి షష్ఠీ తత్పురుష సమాసం
మనోభావాలు మనస్సు యొక్క భావాలు షష్ఠీ తత్పురుష సమాసం
రైతు కుటుంబాలు రైతుల యొక్క కుటుంబాలు షష్ఠీ తత్పురుష సమాసం
మంచి సమాజం మంచిదైన సమాజం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
చిన్నపిల్లలు చిన్నవైన పిల్లలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఉన్నతశ్రేణి ఉన్నతమైన శ్రేణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మధురక్షణాలు మధురమైన క్షణాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రాథమిక లక్షణం ప్రాథమికమైన లక్షణం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రత్యక్షము అక్షము యొక్క సమూహము అవ్యయీభావ సమాసం
శ్రామికవర్గం శ్రామికుల యొక్క వర్గం షష్ఠీ తత్పురుష సమాసం
దుర్గుణములు దుష్టములైన గుణములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సద్గుణములు మంచివైన గుణములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆత్మీయబంధం ఆత్మీయమైన బంధము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
కొత్తధోరణులు కొత్తవైన ధోరణులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నాలుగు గోడలు నాలుగు సంఖ్య గల గోడలు ద్విగు సమాసం

ప్రకృతి – వికృతులు

పక్షి – పక్కి
ఆకాశం – ఆకసం
కార్యం – కర్ణం
సహజం – సాజము
వృద్ధ – పెద్ద
గర్వం – గరువము
శాస్త్రము – చట్టము
మర్యాద – మరియాద
నియమం – నేమం
గుణం – గొనం
విజ్ఞానం – విన్నానం
యంత్రం – జంత్రము
స్తంభము – కంబము
దీపము – దివ్వె
చరిత్ర – చారిత
స్త్రీ – ఇంతి
శాస్త్రం – చట్టం
రూపం – రూపు
అద్భుతము – అబ్బురము
గృహము – గీము
సంతోషం – సంతసము
ధర్మము – దమ్మము
దక్షిణం – దక్కనం
సుఖం – సుకం
త్యాగం – చాగం
స్తంభం – కంబం
భాష – బాస

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

పదాలు – అర్దాలు

లోగిలి = ಇಲ್ಲು
ఆమోదయోగ్యము = అంగీకారమునకు తగినది
వ్యవస్థ = ఏర్పాటు
ప్రాతిపదిక = మూలము
త్యాగభావన = విడిచిపెడుతున్నామనే ఊహ
కీలకము = ప్రధాన మర్మము
పునరుత్పత్తి = తిరిగి పుట్టించుట
విచక్షణ = మంచిచెడుల బేరీజు
సంస్కృతి = నాగరికత
సౌరభం = సువాసన
మక్కువ = ఇష్టము
వివేచన = మంచి చెడులను విమర్శించి తెలిసికోవడం
ఆదర్శం = ఇతరులు చూసి నేర్చుకోదగిన గుణం
నియమబద్ధం = నియమములతో కూడినది
నానుడి = సామెత
గృహస్థ + ఆశ్రమం = భార్యాభర్తలు పిల్లలతో తల్లిదండ్రులతో నివాసం
గార్హస్థ్య జీవితం = గృహస్తుగా జీవించడం
ఆలనా పాలనా = వినడం, కాపాడడం
జీవితపథ నిర్దేశం = జీవించే మార్గాన్ని చెప్పడం
ఆకళింపుచేసుకొను = అర్ధం చేసికొను
అవధానం = ఏకాగ్రత
అక్కర = అవసరం
స్వార్థపరత = తన బాగే చూసుకోవడం
తావు = స్థలము

AP Board 8th Class Telugu Solutions Chapter 2 ఇల్లు – ఆనందాల హరివిల్లు

సంఘీభావం = ఐకమత్యం
ఇతిహాసాలు = భారత రామాయణాలు (పరంపరగా చెప్పుకొనే పూర్వకథలు)
నమూనా = మాదిరి
స్వార్థం = స్వప్రయోజనం
అనివార్యము = నివారింపశక్యము కానిది
జీవన సరణి = జీవించే పద్ధతి
అనూహ్యము = ఊహింపరానిది
ధోరణులు = పద్దతులు
స్వావలంబన = తనపై తాను ఆధారపడడం
సంకుచితము = ముడుచుకున్నది
అనుభూతి = సుఖదుఃఖాదులను పొందడం
కనుమరుగు = కంటికి కనబడకుండా పోవుట
కేర్ టేకింగ్ సెంటర్లు = జాగ్రత్త తీసికొనే కేంద్రాలు
నేపథ్యం = తెరవెనుక ఉన్నది
అధిగమించి = దాటి
మనుగడ = జీవనం
విచ్ఛిన్నం = నాశనం
ఇబ్బడి ముబ్బడి = రెట్టింపు, మూడురెట్లు

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 1 అమ్మకోసం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 1st Lesson అమ్మకోసం

8th Class Telugu 1st Lesson అమ్మకోసం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

ఆ.వె. తల్లి దండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా? గిట్టదా?
విశ్వదాభిరామ! వినురవేమ !

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కవి ఈ పద్యాన్ని ఎవరి గురించి చెప్పారు?
జవాబు:
కవి ఈ పద్యాన్ని తల్లిదండ్రులపై దయలేని కొడుకుల గురించి చెప్పారు.

ప్రశ్న 2.
చెదలతో ఎవరిని పోల్చారు?
జవాబు:
చెదలతో తల్లిదండ్రులపై దయలేని కొడుకులను పోల్చారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 3.
మన ప్రాచీన కథలలో తల్లిదండ్రులకు సేవచేసిన వారి గురించి మీకు తెలుసా?
జవాబు:
మన ప్రాచీన కథలలో తల్లిదండ్రులకు సేవచేసిన వారు యజ్ఞదత్తుడు, పాండురంగడు మొ||గువారు. రామాయణంలో ‘యజ్ఞదత్తుడు’ అనే మునికుమారుడు గుడ్డివారైన తన తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఉండేవాడు. వారిని కావడిలో పెట్టి మోసుకుంటూ తీర్థయాత్రలకు తీసుకొని వెళ్ళేవాడు. వారికి కందమూల ఫలాలు తెచ్చి ఇచ్చి వారి కడుపు నింపేవాడు. అతని తండ్రి వైశ్యుడు. తల్లి శూద్ర స్త్రీ. వారు ఋషిదంపతులు. వారికి ఒకసారి నదీజలాన్ని తెచ్చి వారి దాహాన్ని తీర్చడానికి, యజ్ఞదత్తుడు, సరయూ నదికి వెళ్ళి, కలశాన్ని నదిలో ముంచాడు. నదిలో కలశం ముంచిన చప్పుడు విని, ఏనుగు నీరు త్రాగడానికి వచ్చిందని భావించి దశరథుడు ‘శబ్దభేది’
బాణంతో కొట్టాడు. ఆ బాణం దెబ్బతిని, యజ్ఞదత్తుడు మరణించాడు. తల్లిదండ్రులకు సేవచేసిన వారిలో ఈ యజ్ఞదత్తుడు ప్రసిద్ధుడు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేయాలి? ఎందుకు?
జవాబు:
“మాతృదేవోభవ, పితృదేవోభవ” అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు దైవ సమానులు. వారు మనకు జన్మనిచ్చినవారు. తల్లిదండ్రులు కష్టాల్లో ఉంటే పిల్లలు తమ సమస్తాన్ని సమర్పించి, వారిని ఆదుకోవాలి. వారికి సేవచేయాలి. వారు మనలను పెంచి పెద్దచేసి చదువు చెప్పిస్తారు. మన అభివృద్ధికై వారు ఎంతో కష్టపడ్డారు. మనకు కావలసినవి సమకూరుస్తారు. వారు వృద్ధులయినపుడు వారిని పిల్లలు చక్కగా సేవించాలి. తల్లిదండ్రులను ఆదరించడం, దైవ సేవచేయడం వంటిది అని గుర్తించాలి.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
నేటికాలంలో తల్లిదండ్రులపట్ల పిల్లల వైఖరి ఎలా వుంది? దీనికి కారణాలు ఏమిటి?
జవాబు:
నేటి కాలంలో మానవ సంబంధాలు సరిగా ఉండడం లేదు. అందరిలోనూ స్వార్థం పెరిగిపోయింది. కని, పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రుల్ని కొంతమంది పిల్లలు ఆదరించడం లేదు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని మాత్రం అనుభవిస్తున్నారు. వారు కట్టించిన ఇళ్ళల్లో హాయిగా నివసిస్తున్నారు. కాని శక్తి ఉడిగి, మూలనపడిన తల్లిదండ్రులను ఆదరంగా చూడడంలేదు. తిండి పెట్టడం లేదు. వారి మాటకు గౌరవం ఇవ్వడం లేదు. కనీసం తమ పిల్లలను, తాతామామ్మల వద్దకు పంపడం లేదు. తాము తమ తల్లిదండ్రులను ఆదరించకపోతే, తిరిగి తమ పిల్లలు తమను అలాగే చూస్తారని వారు గ్రహించడం లేదు. . తల్లిదండ్రుల పట్ల, పిల్లల వైఖరికి వారి స్వార్థమే కారణం. తాము సంపాదించినదంతా, తమ భార్యాబిడ్డల సౌఖ్యానికే ఖర్చు చేయాలనే తాపత్రయమే, దీనికి ముఖ్య కారణం.

ప్రశ్న 3.
పాఠంలో ఏయే పద్యాలు మీకు నచ్చాయి? ఎందువల్ల?
జవాబు:
నాకు ఈ పాఠంలో మొదటి పద్యం, తొమ్మిదవ పద్యం, పదమూడవ పద్యం బాగా నచ్చాయి.

మొదటి పద్యంలో గరుత్మంతుడు తల్లితో తనకు గల బలాన్ని వివరించి చెప్పాడు. తాను దాస్యవృత్తిని ఎందుకు చేయవలసి వచ్చిందని తల్లిని అడిగాడు. తన దాస్యాన్ని వదిలించుకొని, స్వేచ్ఛగా జీవించాలనే గరుడుని కోరిక, నాకు నచ్చింది.

తొమ్మిదవ పద్యంలో, గరుత్మంతుడు నిప్పుల తోకచుక్కల సమూహంలా, తన రెక్కల గాలితో మేఘాల్ని చెదరగొట్టి, అమృతాన్ని రక్షించేవారు భయపడేటట్లు మనోవేగంతో వెళ్ళాడని, నన్నయ కవి చెప్పినది అక్షరరమ్యతతో చెవికి ఇంపుగా ఉంది. గరుత్మంతుని శక్తియుక్తులు నాకు ఆశ్చర్యం కల్గించాయి. దాస్యం నుండి స్వాతంత్ర్యం పొందాలనే కోరిక, నాకెంతగానో ఆనందాన్ని ఇచ్చింది.

అమృతాన్ని నాగులకు తెచ్చి ఇచ్చి, సూర్య, వాయు, చంద్రాగ్నుల సాక్షిగా, తల్లి దాస్యం తీరిందని చెప్పిన గరుడుని మాటను, తల్లి దాస్యం తొలగిపోవడంతో అతనికి కల్గిన ఆనందాన్ని పదమూడవ పద్యం ఎంతో చక్కగా తెలుపుతోంది.

II చదవడం, అవగాహన చేసుకోడం

ప్రశ్న 1.
అమృతం తేవడానికి వెళుతున్న గరుత్మంతుణ్ణి వర్ణించిన పద్యం ఏది? ఆ పద్యాన్ని, దాని భావాన్ని రాయండి.
పద్యం :
వితతోల్కాశనిపుంజ మొక్కొ యనఁగా విన్వీథి విక్షిప్త ప
క్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబులై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం ఖైదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.

భావం :
పక్షిరాజు మనో వేగంతో బయలుదేరాడు. అప్పుడతడు నిప్పుకణాలతో కూడిన తోకచుక్కలా ఉన్నాడు. ఆకాశంలో కదులుతూ ఉన్నప్పుడు అతని రెక్కల గాలివల్ల మేఘాలు దూదిపింజలై చెదరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా గరుత్మంతుడు మనోవేగంతో అమృతమున్న చోటుకు వెళ్ళాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రశ్న 2.
1, 9 పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి. ప్రతిపదార్థం అంటే పద్యంలోని ప్రతి ఒక్క పదానికి అర్థం రాయడం. ప్రతిపదార్థం రాయడంలో అన్వయక్రమం సాధించేందుకు పదాలవరస మార్చి రాయడం, పదాల మధ్య సంబంధం కోసం అక్కడక్కడా ప్రత్యయాలు చేర్చడం జరుగుతుంది.

ఉదాహరణ
చ. ‘అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు; నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జి
త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహగేంద్రుఁడు – సంతసంబునన్
ప్రతిపదార్థం :
నీవు = గరుత్మంతుడివైన నీవు
అమిత = అధికమైన
పరాక్రమంబును = శౌర్యమూ
రయంబును = వేగమూ,
లావును = బలమూ
కల్గు = ఉన్న
ఖేచర + ఉత్తముడవు = పక్షి శ్రేష్ఠుడివి;
నీది + అయిన = నీ (యొక్క)
దాస్యము = బానిసత్వాన్ని
పాపికొనంగ = పోగొట్టుకునేందుకు
నీకున్ = నీకు
చిత్తము = ఇష్టము (కోరిక)
కలదు + ఏని = ఉన్నట్లైతే
మాకున్ = ఉరగులమైన మాకు
భూరి = గొప్పదైన
భుజదర్పము = భుజగర్వము
శక్తియున్ = బలము
ఏర్పడంగ = ప్రకటితమయ్యేటట్లు
అమృతమున్ = అమృతాన్ని
తెచ్చి +ఇమ్ము = తెచ్చి ఇయ్యి
అనినన్ = అని పలుకగా,
ఆ+విహగ+ఇంద్రుడు = పక్షి శ్రేష్ఠుడైన ఆ గరుత్మంతుడు
సంతసంబునన్ = సంతోషంతో (ఇలా అన్నాడు……..)

1వ పద్యము

ఉ. ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాఁ
జేయు మహాబలంబును బ్రసిద్దియునుం గల నాకు నీపనిం
బాయక వీఁపునం దవడుఁబాముల మోవను, వారికిం బనుల్
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!
ప్రతిపదార్థం :
పయోరుహాననా (పయోరుహ + ఆననా) = పద్మము వంటి ముఖము కలదానా !
ఆయత క్షతుండహతిన్;
ఆయత = పెద్దవయిన
పక్ష = టెక్కలయొక్కయు
తుండ = ముక్కు యొక్కయు
హతిన్ = దెబ్బలచేత
అక్కులశైలము లెల్లన్;
ఆ + కులశైలములు + ఎల్లన్ = ఆ కులపర్వతాలు అన్నింటినీ
నుగ్గుగాన్ + చేయు = పొడిగా చేయగల
మహాబలంబును (మహత్ + బలంబును) = గొప్ప బలాన్నీ
ప్రసిద్ధియున్ = ప్రఖ్యాతియూ
కల, నాకున్ = పొందిన నాకు
ఈ పనిన్ = ఈ పనిని (ఈ దాస్యాన్ని)
పాయక = మానకుండా
వీపునందున్ = వీపు మీద
అవడు + పాములన్ = నీచములయిన పాములను
మోవను = మోయడానికిన్నీ
వారికిన్ = ఆ పాములకు
పనుల్ + చేయను = పనులు చేయడానికి (సేవలు చేయడానికిన్నీ)
ఏమి, కారణము = కారణము ఏమిటో
నాకున్ = నాకు
చెప్పుము = చెప్పుము

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

9వ పద్యము

మ. వితతోల్కాశనిపుంజ మొక్క యనఁగా విన్వీథి విక్షిప్త ప
క్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబులై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.
ప్రతిపదార్థం :
వితతోల్కాశనిపుంజము + ఒక్కొ
వితత = విరివిగా గల
ఉల్క = మండే నిప్పుకణాల యొక్కయు,
అశని = పిడుగుల యొక్కయు
పుంజము + ఒక్కొ = సమూహమా
అనగా = అనేటట్లుగా
విన్వీథి (విన్ + వీథి) = ఆకాశమార్గంలో
విక్షిప్తపక్షతివాతాహతిన్; విక్షిప్త = విదల్చబడిన
పక్షతి = రెక్కల యొక్క
వాత = గాలి యొక్క
ఆహతిన్ = దెబ్బల చేత
తూలి = అటునిటు కదలి
పాఱెన్ = పరుగెత్తాడు.
వారిద, ప్రతతుల్ : మబ్బుల యొక్క సముదాయాలు
తూలశకలాకారంబులు + ఐ; తూల = దూది యొక్క
శకల = పింజల యొక్క
ఆకారంబులు + ఐ = రూపములు కలవై
చాల్పడి = వరుసకట్టి
నల్గడన్ (నల్ + కడన్) – = నాల్గువైపులా
చెదరగా = చెదరిపోగా
మనోవేగుడై (మనః + వేగుడు + ఐ) = మనస్సు యొక్క వేగం వంటి వేగం కలవాడై
పతగేంద్రుండు (పతగ + ఇంద్రుండు) – పక్షులకు ఇంద్రుడయిన గరుత్మంతుడు
అమృతాంతికంబునకున్ (అమృత + అంతికంబునకున్) = అమృతం దగ్గరకు
తత్ పాలుర్ = ఆ అమృత రక్షకులు
భయంబు + అందగన్ = భయపడగా

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

3. పాఠంలోని కింది పద్యపాదాలకు సమానార్థక వాక్యాంశాలను గుర్తించండి.
i) అనిమిషనాథ సుగుప్తమయిన యమృతము
అ) అనిమిషనాథునికి ఇష్టమైన అమృతం
ఆ) ఇంద్రుడు దాచిపెట్టిన అమృతం
ఇ) ఇంద్రునికి అయిష్టమైన అమృతం
ఈ) ఇంద్రుడు దాచి కాపాడుతూ ఉంచిన అమృతం
జవాబు:
ఈ) ఇంద్రుడు దాచి కాపాడుతూ ఉంచిన అమృతం

ii) ఆయత పక్షతుండ
అ) ఆయన పక్షి శ్రేష్ఠుడు
ఆ) ఆయన పక్షపాతి
ఇ) పెద్ద రెక్కలున్న వాణ్ణి
ఈ) పెద్ద పక్షిని నేను
జవాబు:
ఇ) పెద్ద రెక్కలున్న వాణ్ణి

iii) నీయట్టి సత్పుత్రుం బడసియు దాసినై యుండుదాననే?
అ) నీవంటి ఉత్తమకుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉండనా?
ఆ) నీవంటి ఉత్తమకుమారుణ్ణి పొందాను కనుక ఇక దాసిగా ఉంటాను.
ఇ) నీవంటి గొప్పకుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉన్నాను.
ఈ) నీ వంటి గొప్పకుమారుణ్ణి పొందినా దాసిగానే ఉంటాను.
జవాబు:
అ) నీవంటి ఉత్తమకుమారుణ్ణి పొంది కూడా దాసిగానే ఉండనా?

4. కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో ఏ సందర్భంలో అన్నారో రాయండి.
అ) మా యీ దాస్యము వాయు నుపాయము సేయుండు.
జవాబు:
ఈ మాటలు గరుడుడు కద్రువ పుత్రులతో అన్నాడు.

గరుత్మంతుడు తమ దాస్యమునకు కారణాన్ని తల్లి వల్ల తెలిసికొన్నాడు. తరువాత గరుత్మంతుడు కద్రువ పుత్రుల వద్దకు వచ్చి, వారికి ఏమి కావాలన్నా తెచ్చి యిస్తానని చెప్పి తమ దాస్యము పోయే ఉపాయం చెప్పమని వారిని అడిగిన సందర్భంలోనిది.

ఆ) నీ కతమున నా దాస్యము ప్రాకటముగఁ బాయునని
జవాబు:
ఈ మాటలు వినత తన కుమారుడు గరుత్మంతునితో అన్నది.

మనం ఎందుకు కద్రువకూ, ఆమె పుత్రులకూ దాస్యం చేయవలసి వచ్చిందని గరుత్మంతుడు తల్లి వినతను అగిగాడు. అప్పుడు వినత తాను కద్రువతో వేసిన పందెములో ఓడిపోవడం వల్ల దాసీత్వము వచ్చిందని చెప్పింది. ఆ దాసీత్వము గరుత్మంతుని కారణంగానే పోతుందని వినత గరుత్మంతుడికి చెప్పిన సందర్భంలోనిది.

ఇ) నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జిత్తము గలదేని
జవాబు:
ఈ మాటలు కద్రువ పుత్రులు గరుత్మంతునితో అన్నారు.

తనకూ తన తల్లికీ దాస్యం పోయే ఉపాయం చెప్పండని గరుత్మంతుడు కద్రువ పుత్రులను అడిగినప్పుడు, కద్రువ పుత్రులు గరుత్మంతునికి చెప్పిన మాటల సందర్భంలోనిది.

ఈ) దినకరపవనాగ్ని తుహినదీప్తుల కరిగాన్
జవాబు:
ఈ మాటలు గరుత్మంతుడు, కద్రువ పుత్రులతో అన్నాడు.

గరుత్మంతుడు దేవతలను జయించి, అమృతాన్ని తెచ్చి కద్రువ పుత్రులకు ఇచ్చాడు. ఆ తరువాత సూర్యుడు, వాయువు, అగ్ని, చంద్రుడు సాక్షిగా తమ దాస్యము పోయిందని, గరుత్మంతుడు కద్రువ పుత్రులతో చెప్పాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

5. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.
అ) గరుడుడు తల్లిని ఏమని ప్రశ్నించాడు?
జవాబు:
ఓ తల్లీ ! విశాలమైన నా రెక్కలతో, వాడి అయిన ముక్కుతో కులపర్వతాలు అన్నింటిని పిండిగా చేయగలిగిన గొప్ప బలం, కీర్తి గలిగిన నేను, ఈ నీచులైన పాములను ఎప్పుడూ వీపు మీద మోయడానికి, వాటికి సేవలు చేయటానికి కారణము ఏమిటో చెప్పమని ప్రశ్నించాడు.

ఆ) కద్రువ కుమారులను గరుడుడు ఏమడిగాడు? దానికి వాళ్ళేమన్నారు?
జవాబు:
కద్రువ కుమారులను గరుడుడు నా తల్లికి, నాకు దాస్యం పోవడానికి ఆలోచన చేయండి, దీనికోసం మీకు ఇష్టమైనదేదో ఆజ్ఞాపించండి. దేవతలను లోబరుచుకొని అయినా దాన్ని సాధిస్తాను అని అడిగాడు.

“నీవు అంతులేని పరాక్రమం, వేగం, బలం కలిగిన పక్షి శ్రేష్ఠుడివి. నీకు దాస్యం పోగొట్టుకోవాలనే అభిప్రాయం ఉంటే, నీ భుజబలం సామర్థ్యమూ తెలిసేలా, మాకు అమృతాన్ని తెచ్చి ఇయ్యి” – అని కద్రువపుత్రులు, గరుత్మంతునితో చెప్పారు.

ఇ) అమృతాన్ని ఎవరు, ఎలా రక్షిస్తున్నారు?
జవాబు:
అమృతం దేవేంద్రుడి రక్షణలో ఉంది. కాపలాదార్లు అమృతాన్ని రక్షిస్తున్నారు. ఇంకా అమృతాన్ని భయంకరమైన రెండు సర్పాలు రక్షిస్తున్నాయి. ఆ పాములు ఆ సమీపానికి ఎవరినీ రానీయడం లేదు. వాటి ముఖాలు కోపాన్ని వెలిగ్రక్కుతున్నాయి. ఆ పాముల చూపులు విషము అనే అగ్నిని చిమ్ముతున్నాయి.

ఈ) అమృతం తెచ్చిన గరుడుడు కద్రువ కుమారులతో ఏమని చెప్పాడు?
జవాబు:
అమృతం తెచ్చిన గరుడుడు కద్రువ కుమారులతో “నేను దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. దీనికి సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు, సాక్షులు. దీనితో నా తల్లి దాస్యం తొలగిపోయింది” అన్నాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఎంతో కష్టమైనప్పటికీ, దాస్యవిముక్తి కోసం గరుడుడు అమృతం తెచ్చాడు కదా ! అయితే దాస్యవిముక్తికి లేదా స్వేచ్ఛకు ఉన్న గొప్పతనం ఏమిటో వివరించండి.
జవాబు:
బానిసత్వం నుండి విడిపించుకొని స్వేచ్ఛగా జీవించడమే దాస్యవిముక్తి. గరుత్మంతుడు తన తల్లికీ, తనకూ దాస్యం పోడానికి ఎంతో కష్టపడి, దేవేంద్రుని ఎదిరించి, అమృతం తెచ్చియిచ్చాడు. మన భారతమాత దాస్య బంధాన్ని విడిపించి, స్వతంత్రం పొందడానికి, మన దేశ నాయకులు ఎందరో ప్రాణాలు విడిచారు. జైళ్ళలో మగ్గిపోయారు. ఒకరికి సేవచేస్తూ, బానిసత్వంలో పడి ఉండడం, నరకంతో సమానం. స్వేచ్ఛా జీవితం అనుభవిస్తూ, తనకు లభ్యమయిన అన్న పానీయాలను తీసుకొని, కడుపునింపుకోవడం స్వర్గంతో సమానం.

ఆ) వినత తన విముక్తి కోసం కొడుకు మీద ఆశపెట్టుకుంది కదా ! నేటి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల వల్ల ఏమి ఆశిస్తున్నారు?
జవాబు:
నేటి తల్లిదండ్రులు తమ పిల్లలు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుంటూ, బాగా సంపాదించాలని కోరుకుంటున్నారు. తమ పిల్లలకు చక్కని పెళ్ళి సంబంధాలు రావాలనీ మంచి కోడళ్ళూ, అల్లుళ్ళూ తమకు దొరకాలనీ కోరుకుంటున్నారు.

తమకు వృద్ధాప్యం వచ్చాక, తమ పిల్లలు తమను ప్రేమగా ఆదరంగా చూడాలని కోరుకుంటున్నారు. చివరి రోజులో పిల్లలు తమకు ఆసరాగా నిలిచి, తమకు దగ్గరగా ఉండి, కావలసిన సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నారు.

ఇ) మీరు మీ తల్లిదండ్రులకు ఏ విధంగా సహాయపడుతున్నారు? ఇంకా వాళ్ళకు ఏ విధంగా సహకారం అందించాలని అనుకుంటున్నారు?
జవాబు:
నేను మా తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నాను. నా సెలవు రోజుల్లో మా నాన్నగారితో పొలం పనులకు వెడతాను. సాయం చేస్తాను. మా అమ్మగారికి ఇంట్లో పనుల్లో సాయం చేస్తాను. కిరాణాకొట్టు నుండి సరకులు తెచ్చిపెడతాను. రేషను సరకులు తెస్తాను. విద్యుచ్ఛక్తి బిల్లులు కడతాను. వారం వారం, ఇల్లు శుభ్రం చేస్తాను.

నేను పెద్దయ్యాక మా తల్లిదండ్రులను మా ఇంటిలో మాతోనే ఉంచుకొని వారిని కంటికి రెప్పలా చూసుకుంటాను.

వృద్ధాప్యదశలో కలిగే కోరికలను నా శక్తిమేర తీర్చాలనుకుంటున్నాను. వారికి కావలసిన సదుపాయాలను అన్నింటిని సమకూరుస్తాను.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ఈ) యోగ్యులైన పిల్లల వల్ల తల్లిదండ్రులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
(లేదా)
గరుత్మంతుడి లాంటి గొప్ప కొడుకులు ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
గరుత్మంతుడి లాంటి గొప్ప కుమారులున్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. సమర్థులైన కొడుకులు తల్లిదండ్రుల కష్టాలు తొలగిస్తారు. గరుత్మంతుడు సమర్థుడు. బలవంతుడు. కొండల్ని పిండి చేయగలడు. అందువల్లనే తమ దాస్య కారణాన్ని తల్లి నుండి అడిగి తెలుసుకొన్నాడు. అంతేకాక కద్రువ పుత్రుల వద్దకు వెళ్ళి తన తల్లి దాస్య విముక్తి కోసం వారడిగినది తెచ్చి ఇచ్చాడు.

పిల్లలు యోగ్యులైతే వారు తల్లిదండ్రులకు, అన్ని విధాలా సాయం చేస్తారు. తమ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉండి, వారికి కావలసిన సమస్త సదుపాయాలు, తమ శక్తిమేరకు సమకూరుస్తారు. తల్లిదండ్రులకు వైద్యసదుపాయాలు ఏర్పాటు చేస్తారు. తమకు తీరిక దొరికినప్పుడు తల్లిదండ్రుల వద్ద కూర్చుండి, ఇష్టాగోష్టిగా మాట్లాడి, వారి కష్టసుఖాల్ని తెలుసుకుంటారు. తల్లిదండ్రులు హాయిగా మనవలతో కాలక్షేపం చేసేలా ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రుల సలహాలను తాము తీసుకొని, సంసారాన్ని చక్కగా నడుపుకుంటారు. యోగ్యులైన పిల్లల వలన తల్లిదండ్రులు సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవనం గడుపుతారు.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “సమర్థులైన కొడుకులు తల్లిదండ్రుల కష్టాలు తొలగిస్తారు”- ఈ వాక్యాన్ని సమర్థిస్తూ సొంతమాటలలో రాయండి.
(లేదా)
“సమర్ధులైన కొడుకులు తల్లిదండ్రుల కష్టాలను తొలగిస్తారు” ఈ మాటలను గరుత్మంతుడు ఎలా నిజం చేశాడో రాయండి. (S.A. I – 2019-207)
జవాబు:
కొన్ని పేద, మధ్య తరగతి కుటుంబాలలో తల్లిదండ్రులు తమకు ఆర్థికస్తోమత లేకపోయినా తమ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం కావాలని ఆశిస్తారు. తామెన్ని వ్యయప్రయాసలు, కష్టనష్టాలకు అయినా ఓర్చి వారికి పెద్ద చదువులు చెప్పిస్తారు. అటువంటి కుటుంబాలకు చెందిన కొందరు సమర్థులైన పిల్లలు తమ శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని, తాపత్రయాన్ని గుర్తించి, చక్కగా చదువుకొని ఉన్నత స్థానానికెదిగి, మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. వారు తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరాగా నిలవడమే కాక, వారికి అన్ని విధాలా తోడ్పాటు నందిస్తూ, శ్రద్ధాసక్తులతో గౌరవిస్తూ, వారి సలహాలను పాటిస్తూ, వారి కోర్కెలను తీరుస్తూ ఉత్తమ జీవనం సాగిస్తారు. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవడానికి వారు శాయశక్తులా కృషి చేస్తారు.

మన పాఠంలో గరుత్మంతుడు సమర్థుడు. బలవంతుడు. కొండల్ని పిండి చేయగలడు. అందువల్లనే తమ దాస్య కారణాన్ని తల్లి నుండి అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు. కద్రువ పుత్రుల వద్దకు వెళ్ళి “మీకు ఇష్టమైనదేదో చెప్పండి. దేవతలనైనా జయించి తెస్తాను’ అని అన్నాడు. అలా అనడానికి అతనికి గల సమర్థత, శక్తి సామర్థ్యాలు కారణం.

మాట అనడమేకాదు, తన రెక్కల గాలితో దుమ్మును రేపి అమృతాన్ని రక్షించే పాములకు కళ్ళు కనబడకుండా చేశాడు. వాటి తలలను తొక్కి అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. అమృతాన్ని కద్రూ పుత్రులకు తెచ్చి ఇచ్చి తమ దాస్యాన్ని పోగొట్టుకున్నాడు.

దీనిని బట్టి సమర్థులైన కొడుకులు, తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తారని చెప్పగలం.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ఆ) ఈ పాఠం సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
గరుత్మంతుడు తన తల్లి దాస్యాన్ని ఏ విధంగా పోగొట్టాడో రాయండి. (S.A. I – 2018-19)
జవాబు:
కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అని ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య కద్రువకు కశ్యపుని వరం వలన వేయిమంది కుమారులు కలిగారు. వారే కర్కోటకాది సర్పాలు. వినతకు అనూరుడు, గరుత్మంతుడు పుట్టారు. అనూరుడు, సూర్యుని రథసారథి. వినత ఒక పందెంలో ఓడిపోయి కద్రువకు దాసి అయింది. తల్లితో పాటు గరుత్మంతుడు కద్రువ కుమారులకు సేవలు చేస్తూ ఉండేవాడు.

మహాశక్తిమంతుడైన గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరకు వెళ్ళాడు. తన తల్లిని మనము ఎల్లపుడూ నీచమైన పాములను వీపు మీద మోయడానికి కారణం చెప్పమని అడిగాడు.

వినత తన సనతి అయిన కద్రువతో పందెంలో ఓడిపోయి దాసీతనం పొందిన విషయాన్ని కొడుకుతో స్పష్టంగా చెప్పింది. గరుడుని వంటి యోగ్యుడైన పుత్రుని పొంది దాసీగానే ఉండాలా అని ప్రశ్నించింది.

తల్లికి దాస్యవిముక్తి చేయటం కోసం గరుత్మంతుడు పాములతో ‘మీకు ఇష్టమైనది ఆజ్ఞాపించండి, దాన్ని సాధిస్తాను’ అని చెప్పాడు.

అప్పుడు కద్రువ కుమారులు జాలిపడి గరుత్మంతుడితో ‘నీ భుజబలం, సామర్థ్యం తెలిసేలా మాకు దేవేంద్రుని వద్ద వున్న అమృతాన్ని తెచ్చి ఇవ్వు” అన్నారు.

గరుడుడు తల్లి ఆశీస్సులతో అమృతం తేనటానికి వెళ్ళాడు. తన రాకతో అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్న చోటుకు వెళ్ళాడు.

అమృతాన్ని రక్షిస్తున్న భయంకరమైన రెండు సర్పాలు ఆ సమీపానికి ఎవరినీ రానీయడం లేదు. గరుడుడు తన రెక్కలవల్ల రేగిన దుమ్ముతో వాటి కళ్ళు కనబడకుండా చేశాడు. వాటి తలలను తొక్కిపట్టాడు. అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు.

దాన్ని పాములకు చూపించి “దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. దీనికి సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు సాక్షులు – దీనితో నా తల్లి దాస్యం తొలగిపోయింది” అన్నాడు.

IV. పదజాలం – వినియోగం

1. కింది పేరా చదవండి. పేరాలో గీత గీసిన పదాలకు ఒక్కొక్క దానికి మూడు సమానార్థక పదాలు పేరా కింద ఉన్నాయి. వాటిలో నుంచి సరైన పదాలను ఎంపిక చేసి రాయండి.

నభమున దట్టమైన వారిదములు విస్తరించాయి. ఉరుములు మెరుపులతో పాటు కులిశములు రాలాయి. దీనితో విపినంలో ఉండే వృక్షాలు కూలిపోయాయి. పన్నగాలన్నీ పుట్టలలోనికి దూరాయి. మబ్బులు వీడగానే పతంగుడు మళ్ళీ దర్శన మిచ్చాడు.

(ఆకాశం, పాము, పిడుగు, మేఘం, సూర్యుడు, అడవి, అరణ్యం, రవి, మబ్బు, అశని, ఫణి, గగనం, వనం, సర్పము, నిర్ఘాతము, అభ్రము, భానుడు, అంబరం.)
సమానార్థక పదాలు :
1. నభము = ఆకాశం, గగనం, అంబరం
2. వారిదము = మేఘం, మబ్బు, అభ్రము
3. కులిశము = పిడుగు, అశని, నిర్ఘాతం
4. వివినము = అడవి, అరణ్యం, వనం
5. పన్నగము = పాము, సర్పం, ఫణి
6. పతంగుడు = భానుడు, సూర్యుడు, రవి

2. కింది పదాలకు అర్థాలు రాయండి, సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అమితం, పరాక్రమం, దాస్యం, సత్పుత్రుడు, ప్రసిద్ధి, విముక్తి

1) అమితము = అంతులేని
సముద్రంలో అమితమైన జలరాశులు ఉన్నాయి.

2) పరాక్రమం = గొప్పశక్తి
అశోకుడు కళింగయుద్ధంలో గొప్ప పరాక్రమం చూపాడు.

3) దాస్యం = బానిసత్వం
ఆంగ్లేయుల పాలనలో భారతీయులు దాస్యంలో నలిగిపోయారు.

4) సత్పుత్రుడు = మంచి కుమారుడు
దశరథునికి శ్రీరాముడు సత్పుత్రుడు.

5) ప్రసిద్ధి = ఖ్యాతి
కొండపల్లి కొయ్యబొమ్మలకు ప్రసిద్ధిగాంచింది.

6) విముక్తి = స్వేచ్ఛ
భారతీయులకు ఆంగ్లేయుల నుంచి 1947లో విముక్తి లభించింది.

V. సృజనాత్మకత

* పాఠం ఆధారంగా గరుడునికీ, కద్రువ కుమారులకూ మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
గరుత్మంతుడు : అన్నలారా! మీరు నాకు ఒక ఉపకారం చేయండి.

కద్రువ కుమారులు : గరుత్మంతుడా! నీవు దాసీపుత్రుడవు. మాకు బానిసవు.

గరుత్మంతుడు : అవును. నా తల్లికీ, నాకూ దాస్యం పోవడానికి, ఏదైనా మీరు ఉపాయం చెప్పండి.

కద్రువ కుమారులు : మరి మాకు ఇష్టమైన పని చేస్తావా?

గరుత్మంతుడు : సరే! తప్పక చేస్తాను, మీకు ఇష్టమైన పని ఏమిటో ఆజ్ఞాపించండి.

కద్రువ కుమారులు : నీవు శక్తికలవాడవే, కాని, దేవతలను లొంగదీయగలవా?

గరుత్మంతుడు : లొంగదీసుకొని మీ కిష్టమైనది తప్పక తెస్తా!

కద్రువ కుమారులు : నీవు అంతులేని పరాక్రమం, వేగం కల పక్షి రాజువి. మరి మీ దాస్యం పోవాలంటే ఓ పని చేయాలి.

గరుత్మంతుడు : తప్పక చేస్తా. అదేమిటో చెప్పండి. నేను మాటతప్పను.

కద్రువ కుమారులు : అయితే నీ భుజబలం, సామర్థ్యం తెలిసేలా దేవతలను జయించి మాకు అమృతాన్ని తెచ్చి ఇవ్వు.

గరుత్మంతుడు : సరే, అన్నలారా! నేను తప్పక స్వర్గం నుంచి అమృతం తెచ్చి, మీ కిచ్చి దాస్య విముక్తి పొందుతా. (గరుడుడు అమృతం తెచ్చాడు.)

గరుత్మంతుడు : అన్నలారా! ఇదిగో అమృతం. దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చాను. సూర్యచంద్రాగ్నులు సాక్షిగా మా తల్లి దాస్యం పోయింది.

కద్రువ కుమారులు : సరే, నీవూ, నీతల్లి దాస్య విముక్తులయ్యారు. వెళ్ళండి.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

VI. ప్రశంస

* పొరుగూరిలో మీకు మంచి స్నేహితుడున్నాడు. ఆ మిత్రుడు అనారోగ్యంతో ఉన్న తండ్రికి సేవలు చేస్తూ తల్లిదండ్రుల అభిమానం పొందాడని తెలుసుకున్నారు. అతణ్ణి ప్రశంసిస్తూ లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు నిరంజన్‌కు,

నీ మిత్రుడు రాయు లేఖ ఏమనగా ఇక్కడ నేను క్షేమము. అక్కడ నీవు ఎలా ఉన్నావు ? నిన్న నీవు వ్రాసిన ఉత్తరం అందింది. అది చదివి నేను చాలా సంతోషించాను. మీ నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేదని, నీవు మీ నాన్నగారికి ఇంటివద్ద సేవలు చేస్తున్నావని తెలిపావు. ఇది చాలా ఆనందించవలసిన విషయం. తల్లిదండ్రులు మనకు దైవ సమానులు. వారికి సేవచేయటం మన బాధ్యత. “తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టలోని చెదలు” వంటి వాడని, వేమన్న అన్నాడు. నీవంటి పుత్రుని కన్నందుకు మీ తల్లిదండ్రులు ధన్యులు. నీకు అభినందనలు.

ఇట్లు,
నీ మిత్రుడు,
ఎస్. శశికాంత్,
8వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
విజయవాడ.

చిరునామా :
జి. నిరంజన్,
S/o జి.వెంకటేశ్వర్లు,
డోర్.నెం. 4/87,
రామాలయం వీధి,
గుంటూరు.

ప్రాజెక్టు పని

* “కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్నపనులు” వంటి పద్యాలు “అమ్మను మించిన దైవం లేదు” వంటి సూక్తులు కొన్నింటిని సేకరించి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
పద్యాలు :
1. పుత్రోత్సాహంబు తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జను లా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !

2. ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబుఁ దెలుప నేరకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్నఁ బడెడు మాడ్కిఁ దిరుగు మేలమిఁ గుమారా!

3. తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్న మాట సత్యమెఱుఁగుం గా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా !

సూక్తులు :
1. తల్లిదండ్రులు ప్రత్యక్షదైవాలు.
2. అమ్మ ప్రేమకు మారుపేరు – అమ్మ మనసు పూలతేరు.
3. తల్లిదండ్రులను పూజింపుము.
4. తల్లిదండ్రులు తమ సంతానానికి అందించిన వాటికి ప్రతిఫలం ఈ సృష్టిలోనే లేదు. – వాల్మీకి

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. సమాపక, అసమాపక క్రియలు

(అ) కింది క్రియాపదాలను చదవండి.
తిని, చూసి, వండి, విని, చూస్తే, చేస్తూ, వింటే, ఆడుతూ

పై క్రియలలో పని పూర్తికాలేదని తెలుస్తుంది. ఇలా పని పూర్తికాని క్రియలను అసమాపక క్రియలని అంటారు. అట్లే తిన్నాడు, చదివాడు, చూశాడు, వండింది, విన్నది, చేస్తాడు మొదలగు క్రియాపదాల వల్ల పని పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఇలా పూర్తి అయిన క్రియలను సమాపక క్రియలు అంటారు.

(ఆ) కింది వాక్యాలు చదవండి. సమాపక, అసమాపక క్రియాపదాల కింద గీత గీయండి.
* రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు.
* గీత వంట చేసి అందరికి వడ్డించి తాను తిని నిద్రపోయింది.
* రజని నిద్ర లేచి స్నానంచేసి పూజచేసి అన్నం తిని బడికి వచ్చింది.

సమాపక క్రియలు అసమాపక క్రియలు
వెళ్ళాడు తిని
నిద్రపోయింది చేసి
వచ్చింది వడ్డించి
లేచి

2. సామాన్య వాక్యాలు
అ) రాజు అన్నం తిన్నాడు.
ఆ) గోపి పరీక్ష రాశాడు.
ఇ) గీత బడికి వెళ్ళింది.

పై వాక్యాలు గమనించండి. ఆ వాక్యాల్లోని తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు.

ప్రతి వాక్యంలో ఒకే ఒక సమాపక క్రియ ఉంది. అలా ఒకే ఒక సమాపకక్రియ ఉంటే ఆ వాక్యాలను సామాన్య వాక్యాలు అని అంటారు. కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి.
ఉదా :
ఢిల్లీ దేశ రాజధాని

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

3. సంక్లిష్ట వాక్యాలు

గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
పై వాక్యాలలో గీత నామవాచకం. గీత మొదటి వాక్యంలో ఉన్నందువల్ల రెండో వాక్యంలో పునరుక్తమైన నామవాచకం తొలగించి, మొదటి వాక్యంలోని క్రియ ‘వెళ్ళింది’ని ‘వెళ్ళి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.

గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది.
కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు:
విమల వంట చేస్తూ, పాటలు వింటుంది.

ఆ) అమ్మ నిద్రలేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు:
అమ్మ నిద్రలేచి, ముఖం కడుక్కుంది.

ఇ) రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడిపండ్లు తెచ్చాడు.
జవాబు:
రవి ఊరికి వెళ్ళి, మామిడిపండ్లు తెచ్చాడు.

కింది సంక్లిష్ట వాక్యాల్ని సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
అ) తాత భారతం చదివి నిద్రపోయాడు.
జవాబు:
తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు.

ఆ) చెట్లు పూతపూసి కాయలు కాస్తాయి.
జవాబు:
చెట్లు పూత పూసాయి. చెట్లు కాయలు కాస్తాయి.

ఇ) రాము నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు.
జవాబు:
రాము నడుచుకుంటూ వెళ్ళాడు. రాము తన ఊరు చేరుకున్నాడు.

4. కింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి.

అ) ఔరౌర = ఔర + ఔర – ఆమ్రేడిత సంధి
ఆ) దధ్యోదనము = దధి + ఓదనము – యణాదేశ సంధి
ఇ) ప్రథమైక – ప్రథమ + ఏక – వృద్ధి సంధి
ఈ) చిట్టచివర = చివర + చివర – ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
ఉ) అత్యుగము = అతి + ఉగ్రము – యణాదేశ సంధి

5. కింద పదాలను కలిపి సంధుల పేర్లను రాయండి. సంధి సూత్రాలు తెల్పండి.

అ) మొదట + మొదట = మొట్టమొదట = ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
సూత్రము :
ఆమ్రేడితం పరంగా ఉంటే, ‘కడ’ మొదలైన శబ్దాల మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలకూ ‘ట్ట’ వస్తుంది.

ఆ) దేవ + ఐశ్వర్యం = దేవైశ్వర్యం = వృద్ధిసంధి
సూత్రము :
అకారమునకు ఏ, ఐలు పరమైనపుడు ఐ కారమూ, ఓ, ఔ లు పరమయితే ఔ కారమూ ఏకాదేశంగా వస్తాయి.

ఇ) దేశ + ఔన్నత్యం = దేశాన్నత్యం = వృద్ధి సంధి
సూత్రము :
అకారమునకు ఏ, ఐలు పరమైనపుడు ఐ కారమూ, ఓ, ఔ లు పరమయితే ఔఔ కారమూ ఏకాదేశంగా వస్తాయి.

ఈ) కడ + కడ . = కట్టకడ – ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
సూత్రము :
ఆమ్రేడితం పరంబగునపుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణంబులకు ద్విరుక్తటకారంబగు.

ఉ) అతి + ఉగ్ర = అత్యుగ్ర = యణాదేశ సంధి
సూత్రము :
ఇ, ఉ, ఋ లకు అవసవర్ణమైన అచ్చులు పరమైతే, య, వ రలు ఆదేశంబగు.

6. ఆమ్రేడిత సంధి :
ఏడో తరగతిలో ఆమ్రేడిత సంధిని గురించి కొంత నేర్చుకొన్నాం గదా ! ఆమ్రేడిత సంధికి సంబంధించిన మరో సూత్రాన్ని తెలుసుకుందాం.
ఔర + ఔర = ఔరౌర (ఆమ్రేడిత సంధి)
ఆహా + ఆహా = ఆహాహా (ఆమ్రేడిత సంధి)
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది. అయితే –
1. పగలు + పగలు = పట్టపగలు
2. చివర + చివర = చిట్టచివర
3. కడ + కడ = కట్టకడ

పై పదాలు పరిశీలిస్తే ఇవీ ఆమ్రేడితమున్న రూపాలే. కాని పై సూత్రం ఇక్కడ వర్తించడం లేదు.

పగలు + పగలు = పట్టపగలు అవుతుంది. అంటే “ప” తర్వాత ఉన్న ‘గలు’ ఉన్న అక్షరాలకు బదులుగా ‘ట్ట” వచ్చింది. ‘మీ’ వచ్చి పట్టపగలు అయింది.

చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘ఋ’ వచ్చి చిట్టచివర అయింది.
కడ + కడ అన్నపుడు ‘డ’ స్థానంలో ‘మీ’ వచ్చి కట్టకడ అయింది.

ఇప్పుడు కింది వాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్టయెదురు
కొన + కొన = కొట్టకొన
మొదట + మొదట = మొట్టమొదట

ఆమ్రేడితం పరంగా ఉంటే కడ మొదలైన శబ్దాలు మొదటి అచ్చుమీద అన్ని అక్షరాలకు ‘మీ’ వస్తుండడం గమనించాం కదా ! అలానే మరిన్ని ఉదాహరణలను గమనించండి.
బయలు + బయలు = బట్టబయలు – మొదటి ‘యలు’ స్థానంలో ‘మీ’ వచ్చి, బట్టబయలు అయింది.
తుద + తుద = తుట్టతుద – మొదటి ‘ద’ స్థానంలో ‘ఓ’ వచ్చి, తుట్టతుద అయింది.
నడుమ + నడుమ = నట్టనడుమ – మొదటి ‘డుమ’ స్థానంలో ‘మీ’ వచ్చి, నట్టనడుమగా మారింది.

పై ఉదాహరణల ఆధారంగా సూత్రం తయారుచేద్దాం.

ఆమ్రేడితం పరంగా ఉంటే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు అదంతమైన ద్విరుక్తటకారం వస్తుంది. కింది పదాలను కలిపి రాయండి. ఏం మార్పు జరిగిందో రాయండి.
పిడుగు + పిడుగు = పిట్టపిడుగు – మొదటి ‘డుగు’ స్థానంలో ‘ఋ’ వచ్చి, పిట్టపిడుగు అయింది.
బయలు + బయలు = బట్టబయలు – మొదటి ‘యలు’ స్థానంలో ‘మీ’ వచ్చి బట్టబయలుగా మారింది.

చదవండి – ఆనందించండి

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం 1

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

తల్లి : మాత, జనని, అంబ
కొడుకు : వస్త్రము, కుమారుడు, తనయుడు
అభీష్టం : కోరిక, వాంఛ, ఈప్సితం
గుప్తము : రహస్యం, గోప్యము, గుట్టుగ
అమరులు : దేవతలు, సురలు, నిర్దరులు
శైలం : పర్వతం, కొంగ, అద్రి, నగము
వృష్టి : వాన, వృద్ధి
ఖగము : పక్షి, పులుగు, విహంగము
పాము : పవనాశనము, పన్నగము, భుజంగము
అగ్ని : వహ్ని, జ్వలనము, చిచ్చు
అమృతం : పీయుషం, సుధ, కంజము
గగనం : ఆకాశం, నింగి, నభము
పవనాశం : పాము, సర్పం, ఫణి
దినకరుడు : సూర్యుడు, రవి, ఆదిత్యుడు

వ్యుత్పత్యరాలు

ఉరగము – పొట్టతో పాకేది (పాము)
ఇతిహాసం – ఇలా జరిగిందని చెప్పేది (చరిత్ర)
అనిమిషులు – రెప్పపాటు లేనివారు (దేవతలు)
అమృతం – మరణమును పొందిపనిది (సుధ)
దినకరుడు – దినాన్ని ఏర్పరిచేవాడు (సూర్యుడు)
నందనుడు – సంతోషమును కలిగించువాడు (పుత్రుడు)
పుత్రుడు – పున్నామ నరకం నుండి రక్షించువాడు (కుమారుడు)
వైనతేయుడు – వినత యొక్క కొడుకు (గరుత్మంతుడు)
అనిమిషనాథుడు – అనిమిషులకు నాథుడు (ఇంద్రుడు)
భేఛరము – ఆకాశమున సంచరించునది (పక్షి)

నానార్థాలు

పక్షము = రెక్క పదిహేను రోజులకాలం, ఒకభాగం, వరుస
తుండము = పక్షి ముక్కు, నోరు, ఖండం
ఖగము = పక్షి, బాణం, సూర్యుడు, గాలి
కుశ = తాడు, దర్భ, ఒక ద్వీపం
ఉల్క = నిప్పుకణం, బూడిద
లావు = బలము, సామర్థ్యము, శక్యము
అర్థం = ధనం, శబ్దార్థము సగభాగం
రయము = వేగము, వెల్లువ
అనలం = అగ్ని, కృత్తిక, నల్లకోడి, మూడు అంకె
అనిమిషం = చేప, దేవత
అరుణం = ఎరువు, కాంతి, కుష్ఠురోగం, బంగారం
అశని = వజ్రము, పిడుగు
గగనం = ఆకాశం, శస్త్రం, శూన్యము
వారి = నీరు, సరస్వతి, కుండ

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

ప్రకృతి – వికృతులు

పక్షి – పక్కి
అగ్ని – అగ్గి
శక్తి – సత్తి
దృష్ఠి – దిస్టి
ముక్తి – ముత్తి
హృదయం – ఎద
దాస్యము – దాసము
సంతోషం – సంతసం
దుఃఖము – దూకల
వీధి – వీది
పుత్రుడు – బొద్దె
పక్షం – పక్కం
కులము – కొలము
ముఖము – మొగము
కథ – కత

సంధులు

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకదేశమగును.

అమృతాంశుడు = అమృత + అంశుడు – సవర్ణదీర్ఘ సంధి
అభీష్టములు = అభి = ఇష్టములు – సవర్ణదీర్ఘ సంధి
విషాగ్ని = విష + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
పవనాగ్ని = పవన + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
కుంశాభిరక్ష = కులశ – అభిరక్ష – సవర్ణదీర్ఘ సంధి
దారుణాక్షములు = దారుణ + అక్షములు – సవర్ణదీర్ఘ సంధి
అమృతాంతికము = అమృత + అంతికము – సవర్ణదీర్ఘ సంధి

గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును.

ఖగేంద్ర = ఖగ + ఇంద్ర – గుణసంధి
ఖేచరోత్తమ = ఖేచర + ఉత్తమ – గుణసంధి
వితతోల్కాశ = వితత + ఉల్కాస – గుణసంధి
గగనోన్ముఖుడు = గగన + ఉన్ముఖుడు – గుణసంధి
పతాగేంద్రుడు = పతాగ + ఇంద్రుడు – గుణసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి.

పనులెల్ల = పనులు + ఎల్ల – ఉత్వసంధి
ముఖ్యులెల్ల = ముఖ్యులు + ఎల్ల – ఉత్వసంధి ఇట్లని
ఇట్లునియె = ఇట్లు + అనియె – ఉత్వసంధి
శైలములెల్ల = శైలములు + ఎల్ల – ఉత్వసంధి

యడాగమ సంధి
సూత్రం : సంధి లేనిచోట సర్వంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.

అనియడిగిన = అని + అడిగిన – యడాగమ సంధి
నీయట్టి = నీ + అట్టి – యడాగమ సంధి
చేకొనియైన = చేకొని + ఐన – యడాగమ సంధి
ఏయది = ఏ + అది – యడాగమ సంధి
తెచ్చియిమ్ము = తెచ్చి + ఇమ్ము – యడాగమ సంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగును.
తల్లికిట్లనియె = తల్లికి + ఇట్లనియె – ఇత్వసంధి

అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
ఉన్నంత = ఉన్న + అంత – అత్వసంధి

త్రికసంధి
సూత్రం : 1. ఆ, ఈ, ఏ అను సర్వనామములు త్రికములనబడును.
2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
3. ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు ఆచ్ఛికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు.

అవ్విహగేంద్రుడు = ఆ + విహగేంద్రుడు – త్రికసంధి
అమ్మారుండు = ఆ + మారుండు – త్రికసంధి

అత్మసంది
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
ఉన్నంత = ఉన్న + అంత -అత్వసంధి

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.

కారణము సెప్పుడు = కారణము + చెప్పుము -గసడదవాదేశ సంధి
దాస్యమువాయు = దాస్యము + పాయు – గసడదవాదేశ సంధి
అమృతంబుదెచ్చి = అమృతంబు + తెచ్చి – గసడదవాదేశ సంధి
ఉపాయము సేయంగ = ఉపాయము + చేయంగ – గసడదవాదేశ సంధి

సరళాదేశ సంధి
సూత్రం :
1. ద్రుతప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.
2. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందుసంశ్లేషలు విభాషనగు.
నుగ్గుగాఁజేయు = నుగ్గుగాన్ + చేయు – సరళాదేశ సంధి
గరుడునింబదరి = గరుడునిన్ + పదరి – సరళాదేశ సంధి

ఆమ్రేడిత సంధి
సూత్రం : 1) అచ్చునకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.
పట్టపగలు = పగలు + పగలు – ఆమ్రేడిత సంధి
చిట్టచివర = చివర + చివర – ఆమ్రేడిత సంధి
కట్టకడ = కడ + కడ . – ఆమ్రేడిత సంధి

2) ఆమ్రేడితం పరంగా ఉంటే కడాదుల తొలి అచ్చు మీది అన్ని వర్ణాలకు ద్విరుక్తటకారం వస్తుంది.
నట్టనడుమ = నడుమ + నడుమ – ఆమ్రేడిత సంధి
బట్టబయలు = బయలు + బయలు – ఆమ్రేడిత సంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
వినతాసుతుడు వినత యొక్క సుతుడు షష్ఠీ తత్పురుష సమాసం
పయోరుహానన పయోరుహము వంటి ఆననము కలది బహుప్రీహి సమాసం
భుజదర్పము భుజముల యొక్క దర్పము షష్ఠీ తత్పురుష సమాసం
జననీదాస్యము జనని యొక్క దాస్యము షష్ఠీ తత్పురుష సమాసం
కులిశక్షతి కులిశము యొక్క క్షతి షష్ఠీ తత్పురుష సమాసం
మారుతజవము మారుతము యొక్క జవము షష్ఠీ తత్పురుష సమాసం
ఖగేంద్రుడు ఖగములలో ఇంద్రుడు షష్ఠీ తత్పురుష సమాసం
ఖేచరోత్తముడు ఖేచరులలో ఉత్తముడు షష్ఠీ తత్పురుష సమాసం
విహగేంద్రుడు విహగములలో ఇంద్రుడు షష్ఠీ తత్పురుష సమాసం
అమృతహరణము అమృతము యొక్క హరణము షష్ఠీ తత్పురుష సమాసం
పక్ష్మయుగ్మము పక్ష్మముల యొక్క యుగ్మము షష్ఠీ తత్పురుష సమాసం
గగనోన్ముఖుడు గగనమునకు ఉన్ముఖుడు షష్ఠీ తత్పురుష సమాసం
తల్లిదీవెనలు తల్లి యొక్క దీవెనలు షష్ఠీ తత్పురుష సమాసం
శోక స్థితి శోకము యొక్క స్థితి షష్ఠీ తత్పురుష సమాసం
అనిమిషనాథుడు అనిమిషులకు నాథుడు షష్ఠీ తత్పురుష సమాసం
ఉగ్రభుంజగములు ఉగ్రములైన భుజంగములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహావృష్టి గొప్పదైన వృష్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాబలము గొప్పదైన బలము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అమితపరాక్రమము అమితమైన పరాక్రమము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అమృతాంశుడు అమృతమయమైన కిరణములు కలవాడు బహుబ్లిహి సమాసం
గగనగది గగనము నందు గది సప్తమీ తత్పురుష సమాసం
తల్లిదండ్రులు తల్లియును, తండ్రియును ద్వంద్వ సమాసం
సత్పుత్రుడు ఉత్తముడైన పుత్రుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విషాగ్ని విషము అనెడి అగ్ని రూపక సమాసం
దాస్యవిముక్తులు దాస్యము నుందు విముక్తులు పంచమీ తత్పురుష సమాసం

8th Class Telugu 1st Lesson అమ్మకోసం కవి పరిచయం

కవి : నన్నయ.

కాలం : 11వ శతాబ్దం

బిరుదులు : ఆదికవి, వాగనుశాసనుడు

నన్నయ కవితాలక్షణాలు : అక్షరరమ్యత, ప్రసన్నకథా కలితార్థయుక్తి, నానారుచిరార్థ సూక్తినిధిత్వం నన్నయ కవిత్వంలోని ప్రధాన లక్షణాలు.

ఎవరి ఆస్థాన కవి : తూర్పు చాళుక్యరాజు రాజరాజనరేంద్రుని ఆస్థానకవి.

కవిత్రయకవి : సంస్కృతంలో వేదవ్యాసుడు రచించిన మహాభారతాన్ని తెనిగించిన ముగ్గురు కవులనూ ‘కవిత్రయము’ అంటారు. వారిలో ‘నన్నయ’ మొదటివాడు.

వ్యాకరణ రచన ఆ: నన్నయ, ‘ఆంధ్రశబ్దచింతామణి’ అనే తెలుగు వ్యాకరణ గ్రంథం రచించాడు.

భారత రచన : నన్నయ, ఆంధ్రమహాభారతంలో ఆదిపర్వము, సభాపర్వము, అరణ్యపర్వము 4వ ఆశ్వాసంలోని 142 వ పద్యం వరకు ఆంద్రీకరించాడు.

ఇతర రచనలు : చాముండికా విలాసము, ఇంద్ర విజయము.

పద్యాలు – ప్రతిపదార్థాలు-భావాలు

1వ పద్యము – (కంఠస్థ పద్యం)

*ఉ. ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాఁ
జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం
బాయక వీఁపునం దవడుఁబాముల మోవను, వారికిం బనుల్
సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా!
ప్రతిపదార్థాలు:
పయోరుహాననా (పయోరుహ + ఆననా) = పద్మము వంటి ముఖము కలదానా !
ఆయత పక్షతుండతుండహతిన్; ఆయత = పెద్దవయిన
పక్ష = ఱెక్కల యొక్కయు
తుండ = ముక్కు యొక్కయు
హతిన్ = దెబ్బలచేత
అక్కులశైలము లెల్లన్, ఆ + కులశైలములు + ఎల్లన్ = ఆ కులపర్వతాలు అన్నింటినీ,
నుగ్గుగాన్ + చేయు = పొడిగా చేయగల
మహాబలంబును (మహత్ + బలంబును) = గొప్ప బలాన్నీ
ప్రసిద్ధియున్ = ప్రఖ్యాతియూ
కల నాకున్ = పొందిన నాకు
ఈ పనిన్ = ఈ పనిని (ఈ దాస్యాన్ని)
పాయక = మానకుండా
వీపునందున్ = వీపు మీద
అవడు + పాములన్ = నీచములయిన పాములను
మోవను = మోయడానికిన్నీ
వారికిన్ = ఆ పాములకు
పనుల్ + చేయను = పనులు చేయడానికి (సేవలు చేయడానికిన్నీ)
ఏమి, కారణము = కారణము ఏమిటో
నాకున్ = నాకు
చెప్పుము = చెప్పుము

భావం :
పద్మము వంటి ముఖము కల ఓ తల్లీ ! కులపర్వతాలను అన్నింటినీ నా విశాలమైన టెక్కలతోనూ వాడియైన ముక్కుతోనూ దెబ్బతీసి వాటిని పొడిగా చేయగల గొప్పబలమూ, ప్రసిద్ధి నాకు ఉన్నాయి. అటువంటి నాకు మానకుండా దాస్యము చేస్తూ, ఈ నీచమైన పాములను నా వీపుపై మోస్తూ వీటికి సేవలు చేయడానికి గల కారణము ఏమిటో చెప్పు.

విశేషాంశాలు :
కులపర్వతాలు ఏడు –
1) మహేంద్రం
2) మలయం
3) సహ్యం
4) శుక్తిమంతం
5) గంధమాదనం
6) వింధ్యం
7) పారియాత్రం

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

2 వచనము

వ. అని యడిగిన వినత తనకుం గద్రువతోడి పన్నిదంబున నైన
దాసీత్వంబును, జెప్పి యిట్లనియె.
ప్రతిపదార్థాలు :
అని = అనిన
అడిగిన = గరుత్మంతుడు అడుగగ
వినత = గరుత్మంతుని తల్లి వినత
తనకున్ = తనకు
కద్రువతోడ = తన సవితియైన కద్రువతో
పన్నిదంబునన్ = పందెమువల్ల
ఐన = ఏర్పడిన
దాసీత్వంబును = దాసీతనాన్ని గూర్చి
చెప్పి = కుమారుడైన గరుత్మంతు నకు చెప్పి
ఇట్లు + అనియె = ఇలా అన్నది

భావం :
అని గరుడుడు అడుగగా, వినత తన సవతియైన కద్రువతో పందెంలో తాను ఓడిపోయినందువల్ల కలిగిన దాసీతనాన్ని గురించి కొడుకుతో చెప్పి ఇలా అంది.

3వ పద్యము

కం. నీ కతమున నా దాస్యము
ప్రాకటముగఁ బాయు ననిన పలు కెడలోనం
జేకొని, యూఐడి నిర్గత
శోక స్థితి నున్నదానఁ జూనె ఖగేంద్రా !
ప్రతిపదార్థాలు :
ఖగేంద్రా (ఖగ + ఇంద్రా!) = ఓ పక్షిరాజా ! (గరుత్మంతుడా !)
నీ కతమునన్ = నీ కారణంగా
నా దాస్యము = నా దాసీతనము
ప్రాకటముగన్ = ప్రసిద్ధముగా (అందరికీ తెలిసేటట్లుగా)
పాయున్ = పోతుంది
అనిన = అని అనూరుడు చెప్పిన
పలుకు = మాట
ఎదలోనన్ = (నా) మనస్సులో
చేకొని = గ్రహించి (ఉంచుకొని)
ఊఱడి = ఓదార్పును పొంది
నిర్గతశోక స్థితిన్ = పోయిన దుఃఖముగల స్థితిలో (దుఃఖం లేకుండా)
ఉన్నదానన్ + చూవె = ఉన్నాను సుమా !

భావం :
ఓ పక్షి శ్రేష్ఠుడా ! కుమారా ! నీ కారణంగా నా దాసీతనము పోతుందని అనూరుడు చెప్పిన మాటను మనస్సులో ఉంచుకొని, బాధను విడచి, దుఃఖము లేనిదాననై ఉన్నాను సుమా !

4 వచనము

వ. ‘కొడుకులు సమర్థులైనం దల్లిదండ్రుల యిడుములు వాయుట యెందునుం గలయది గావున నీయట్టి సత్పుత్రుం బడసియు దాసినై యుండుదాననే,’ యనిన విని వైనతేయుండు దద్దయు దుఃఖితుండై, యొక్కనాఁడు కాద్రవేయుల కిట్లనియె.
ప్రతిపదార్థాలు:
కొడుకులు = కుమారులు
సమర్థులు + ఐనన్ = శక్తి కలవారయితే
తల్లిదండ్రుల = తల్లిదండ్రుల యొక్క
ఇడుములు = కష్టాలు
పాయుట = పోవటం
ఎందునున్ + కల + అది = ఎక్కడనైనా ఉన్నదే
కావునన్ = అందువల్ల
నీయట్టి (నీ + అట్టి) = నీవంటి
సత్పుత్రున్ (సత్ + పుత్రన్) = మంచి కుమారుణ్ణి
పడసియున్ = పొందికూడా
దాసినై (దాసిని + ఐ) = దాస్యము చేసే దానినై
ఉండుదానను + ఏ = ఉంటానా?
అనినన్ = అని వినత చెప్పగా
విని = విని
వైనతేయుండు = వినత కుమారుడైన గరుత్మంతుడు
తద్దయున్ = మిక్కిలి (ఎక్కువగా)
దుఃఖితుండు + ఐ = దుఃఖం పొందినవాడై
కాద్రవేయులకున్ = కద్రువ కుమారులయిన పాములకు
ఇట్లు + అనియె = ఇలా చెప్పాడు

భావం :
“కొడుకులు శక్తిమంతులైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగిపోవడం సహజమే. కాబట్టి నీవంటి యోగ్యుడైన కుమారుణ్ణి పొంది, నేను ఇంకా దాసీగానే ఉండలా?” అనగానే గరుడుడు దుఃఖించి, కద్రువ పుత్రులైన పాములతో ఇలా అన్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

5వ పద్యము

కం. మా యీ దాస్యము వాయు ను
పాయము సేయుండు, నన్నుఁ బనుపుం డిష్టం
బేయది దానిన తెత్తు న
జేయుఁడనై యమరవరులఁ జేకొనియైనన్.
ప్రతిపదార్థాలు:
మా + ఈ, దాస్యము = మా తల్లియైన వినతకూ, నాకూ గల ఈ బానిసతనము
పాయు + ఉపాయము = పోయే ఆలోచనను (ఉపాయాన్ని)
చేయుండు = చెయ్యండి; (చెప్పండి)
నన్నున్ = నన్ను
పనుపుండు = ఆజ్ఞాపించండి (పంపించండి)
ఇష్టంబు + ఏ + అది = మీరు ఏది కోరుకుంటారో
దానిన్ + అ = దాన్నే
అమరవరులన్ = శ్రేష్ఠులయిన దేవతలను
చేకొని + ఐనన్ = లోబరచుకొనియైనా
అజేయుడనై = జయింపబడనివాడనై (ఓడింపబడనివాడనై)
తెత్తున్ = తెస్తాను (తెచ్చి ఇస్తాను)

భావం :
నా తల్లి యొక్క, నా యొక్క దాస్యము పోవటానికి ఉపాయము చెప్పండి. నన్ను ఆజ్ఞాపించండి. శ్రేష్ఠులయిన దేవతలను లోబరచుకొని అయినా మీకు ఇష్టమైన దానిని అజేయుడనై తెస్తాను.

6 వచనము

వ. అనిన నయ్యురగులు కరుణించి గరుడుని కిట్లనిరి.
ప్రతిపదార్థాలు:
అనినన్ = అట్లు గరుత్మంతుడు చెప్పగా
అయ్యురగులు; (ఆ + ఉరగులు) = ఆ పాములు
కరుణించి = జాలిపడి
గరుడునకున్ + ఇట్లు + అనిరి = గరుత్మంతునితో ఇలా చెప్పారు.

భావం :
అని గరుడుడు అడుగగా, ఆ నాగులు జాలిపడి గరుత్మంతునితో ఇలా చెప్పారు.

7వ పద్యము (కంఠస్థ పద్యం)

*చ. ‘అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు; నీదయిన దాస్యము వాపికొనంగ నీకుఁ జి
త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహగేంద్రుఁడు సంతసంబునన్
ప్రతిపదార్థాలు :
నీవు = నీవు
అమిత పరాక్రమంబును = అంతులేని విక్రమాన్ని
రయంబును = వేగాన్నీ
లావునూ = బలాన్నీ
కల్గు = కలిగిన (ఉన్న)
ఖేచరోత్తముడవు (ఖేచర + ఉత్తముడవు) = పక్షులలో గొప్పవాడవు (పక్షి శ్రేష్ఠుడవు)
నీదయిన (నీది + అయిన) = నీకు కలిగిన
దాస్యమున్ = బానిసత్వమును
పాపికొనంగన్ = పోగొట్టుకొనటానికి
నీకున్ = నీకు
చిత్తము = మనస్సు (అభిప్రాయము)
కలదు + ఏనిన్ = ఉన్నట్లయితే
భూరి = అధికమైన
భుజదర్పము = నీ భుజాల యొక్క గర్వమున్నూ
శక్తియున్ = నీ సామర్థ్యమునూ
ఏర్పడంగన్ = స్పష్టమయ్యేటట్లు
మాకున్ = మాకు
అమృతమున్ = అమృతమును
తెచ్చి, ఇమ్ము + అనినన్ = తీసుకొనివచ్చి ఇమ్మని పాములు చెప్పగా
అవ్విహ గేంద్రుడు (ఆ + విహగ + ఇంద్రుడు) = ఆ పక్షిశ్రేష్ఠుడైన గరుత్మంతుడు
సంతసంబునన్ = సంతోషముతో (తెలిసేటట్లు)

భావం :
“నీవు అంతులేని పరాక్రమాన్నీ, వేగాన్నీ, బలాన్ని కలిగిన పక్షి శ్రేష్ఠుడవు. నీకు కలిగిన దాస్యము పొగొట్టుకొనాలనే అభిప్రాయము నీకు ఉన్నట్లయితే, నీ యొక్క గొప్ప భుజబలగర్వమునూ, శక్తియూ తెలిసేటట్లు
మాకు అమృతాన్ని తెచ్చి ఇమ్ము” అని పాములు చెప్పగా, ఆ పక్షి శ్రేష్ఠుడు సంతోషించాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

8 వచనము

వ. ‘అట్ల చేయుదు, నమృతంబు దెచ్చి మీ కిచ్చి, యేనునుం,
దల్లియు దాస్యంబువలన విముక్తుల మగువార’ మని నొడివి,
తద్వృత్తాంతం బంతయుం దల్లికిం జెప్పి ‘యమృతహరణార్థం బరిగెద
నని మ్రొక్కి, తల్లి దీవనలు గైకొని గమనోన్ముఖుండై ….
ప్రతిపదార్థాలు:
అట్ల (అట్ల + అ) = ఆ విధంగానే
చేయుదన్ = చేస్తాను
తెచ్చి = తీసుకొని వచ్చి
మీకిచ్చి (మీకున్ + ఇచ్చి) = నాకు ఇచ్చి
ఏనునున్ = నేనూ
తల్లియున్ = మా అమ్మ వినతయూ
దాస్యమువలనన్ = బానిసత్వము నుండి
విముక్తులము + అగువారము = విడువబడిన వారము అవుతాము
అని, నొడివి = అని చెప్పి
తద్వృత్తాంతము (తత్ + వృత్తాంతము) = ఆ విషయం
అంతయున్ = అంతయు
తల్లికిన్ = తల్లియైన వినతకు
చెప్పి = చెప్పి
అమృతహరణ + అర్థంబు = అమృతాన్ని హరించే నిమిత్తం
అరిగెదన్ = వెడలుతాను
అని = అని
మ్రొక్కి = నమస్కరించి
తల్లి దీవనలు = తల్లి ఆశీస్సులు
కైకొని = స్వీకరించి
అమృతంబు = అమృతము
గమనోన్ముఖుండై గమన = వెళ్ళడానికి
ఉన్ముఖుండు + ఐ = సిద్ధమైనవాడై

భావం :
“అలాగే చేస్తాను. స్వర్గం నుంచి అమృతం తెచ్చి, మీకు ఇచ్చి, నేనూ, మా తల్లి వినతా, దాస్యం నుంచి విముక్తి పొందుతాం” అని పలికి, ఆ విషయమంతా తల్లికి చెప్పి, “అమృతం తేవడానికి వెడుతున్నాను” అని చెప్పి నమస్కరించి, తల్లి ఆశీస్సులు పొంది, వెళ్ళడానికి సిద్ధమై……

9వ పద్యము (కంఠస్థ పద్యం)

*మ. వితతోల్కాశనిపుంజ మొక్క యనఁగా విన్వీథి విక్షిప్త ప
క్షతి వాతాహతిఁదూలి, తూల శకలాకారంబుఁ లై వారిద
ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై
పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.
ప్రతిపదార్థాలు :
వితతోల్కాశనిపుంజము + ఒక్కొ వితత = విరివిగా గల
ఉల్క = మండే నిప్పుకణాల యొక్కయు
అశని = పిడుగుల యొక్కయు
పుంజము + ఒక్కొ = సమూహమా
అనగా = అనేటట్లుగా
విన్వీథి (విన్ + వీథి) = ఆకాశమార్గంలో
విక్షిప్తపక్షతివాతాహతిన్; విక్షిప్త = విదల్చబడిన
పక్షతి = రెక్కలయొక్క
వాత = గాలియొక్క
ఆహతిన్ = దెబ్బల చేత
తూలి = అటునిటు కదలి
వారిద, ప్రతతుల్ = మబ్బుల యొక్క సముదాయాలు
తూలశకలాకారంబులు + ఐ; తూల = దూదియొక్క
శకల = పింజల యొక్క
ఆకారంబులు + ఐ = రూపములు కలవై
చాల్పడి = వరుసకట్టి
నల్గడన్ (నల్ + కడన్) = నాల్గువైపులా
చెదరగా = చెదరిపోగా
మనోవేగుడై (మనః + వేగుడు + ఐ) = మనస్సు యొక్క వేగం వంటి వేగం కలవాడై
పతగేంద్రుండు (పతగ + ఇంద్రుండు) = పక్షులకు ఇంద్రుడయిన గరుత్మంతుడు
అమృతాంతికంబునకున్ (అమృత + అంతికంబునకున్) = అమృతం దగ్గరకు
తత్ పాలుర్ = ఆ అమృత రక్షకులు
భయంబు + అందగన్ = భయపడగా
పాఱెన్ = పరుగెత్తాడు

భావం :
పక్షి రాజు మనోవేగంతో బయలుదేరాడు. అప్పుడతడు నిప్పు కణాలతో కూడిన తోక చుక్కలా ఉన్నాడు. ఆకాశంలో కదలుతూ ఉన్నప్పుడు, అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూది పింజలై చెదరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా, గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్నచోటికి వెళ్ళాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

10వచనము
వ. అంత,
అప్పుడు

11వ పద్యము

ఉ. ఘోరవికార సన్నిహిత కోపముఖంబులు, దీప్తవిద్యుదు
ల్కారుణ దారుణాక్షములునై, నిజదృష్టి విషాగ్ని నన్యులం
జేరఁగనీక యేర్చుచుఁ బ్రసిద్ధముగా నమృతంబు చుట్టు ర
క్షారతి నున్న యుగభుజగంబుల రెంటిని గాంచి చెచ్చెరన్.
ప్రతిపదార్థాలు:
ఘోర, వికార, సన్నిహిత, కోపముఖంబులు; ఘోర = భయంకరాలయి
వికార = వికారంతో
సన్నిహిత = కూడిన
కోప = కోపము కల
ముఖంబులు = నోళ్ళు కలవీ
దీప్త విద్యుదుల్కారుణ దారుణాక్షములునై; దీప్త = వెలుగుతున్న
విద్యుత్ = మెఱపులవలె
ఉల్క = నిప్పులవలె
అరుణ = ఎఱ్ఱనైన
దారుణ = భయంకరాలయిన
అక్షములును + ఐ = కన్నులు కలవై
నిజదృష్టి విషాగ్నిన్; నిజ = తనయొక్క
దృష్ఠి = చూపుల నుండి ప్రసరించే
విష = విషము అనే
అగ్నిన్ = అగ్నితో
అన్యులన్ = ఇతరులను
చేరగన్ + ఈక = దగ్గరకు రానీయకుండా
ఏర్చుచున్ = దహిస్తూ (మండిస్తూ)
ప్రసిద్ధముగాన్ = ప్రకటమయ్యేటట్లు
అమృతంబు = అమృతము యొక్క
చుట్టు = చుట్టునూ
రక్షారతిన్; రక్షా = రక్షించడంలోని
రతిన్ = ఆసక్తితో
ఉన్న = ఉన్నటువంటి
ఉగ్ర భుజగంబులన్; ఉగ్ర = భయంకరమైన
భుజగంబులన్ = పాములను
రెంటిని = రెండింటిని
కాంచి = చూచి
చెచ్చెరన్ = వెంటనే

భావం :
అమృతాన్ని రక్షిస్తున్న భయంకరమైన రెండు పాములను గరుత్మంతుడు చూశాడు. అవి ఆ సమీపానికి ఎవరినీ రానీయడం లేదు. ఆ పాముల ముఖాలు కోపాన్ని వెలిగ్రక్కు తున్నాయి. వాటి చూపులు విషము అనే అగ్నిని చిమ్ముతున్నాయి.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

12 వచనము

వ. అయ్యురగంబులం దనపక్షరజోవృష్టి నంధంబులం జేసి, వాని శిరంబులు దొక్కి, పరాక్రమం బెసంగ నమృతంబు గొని, గరుడుండు గగనంబున కెగసి…. యురగుల యొద్దకు వచ్చి, మరకతహరితం బైన కుశాస్తరణంబున నమృతకలశంబు నిలిపి, యురగులకుం జూపి యిట్లనియె.
ప్రతిపదార్థాలు:
అయ్యురగంబులన్ (ఆ + ఉరగంబులన్) = ఆ అమృతాన్ని రక్షిస్తున్న పాములు రెంటినీ
తన = తన యొక్క
పక్షరజోవృష్టిన్; పక్ష = రెక్కల వలన ఏర్పడిన
రజః + వృష్టిన్ = దుమ్ము యొక్క వర్షంతో
అంధంబులన్ = గ్రుడ్డివాటినిగ చేసి
వాని = ఆ పాముల
శిరంబులు = తలలు
తొక్కి = తొక్కి
పరాక్రమంబు = పరాక్రమం
ఎసంగన్ = ఎక్కువకాగా
అమృతంబు = అమృతం
కొని = తీసుకొని
గరుడుండు = గరుత్మంతుడు
గగనంబునకున్ = ఆకాశానికి
ఎగసి = ఎగిరి
ఉరగుల + యొద్దకున్ = పాముల వద్దకు
వచ్చి = వచ్చి
మరకతహరితంబు + ఐన మరకత = మరకత మణులవలె
హరితంబు + ఐన = ఆకుపచ్చనైన
కుశాస్తరణంబునన్ (కుశ + ఆస్తరణంబునన్) – దర్భల పరుపు మీద
అమృతకలశంబు = అమృత కలశపాత్రను
నిలిపి = ఉంచి
ఉరగులకున్ = పాములకు
చూపి = చూపించి
ఇట్లు + అనియెన్ = ఇలా అన్నాడు

భావం :
గరుడుడు తన రెక్కల వల్ల రేగిన దుమ్ముతో వాటి కళ్ళు కనబడకుండా చేశాడు. వాటి తలలను తొక్కి పట్టాడు. అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. కద్రువ కుమారుల దగ్గరకు వచ్చాడు. మరకత మణుల వలె పచ్చగా ఉన్న దర్భల పరుపుపై అమృతం ఉన్న పాత్రను పెట్టాడు. దాన్ని పాములకు చూపించి ఇట్లా పలికాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 1 అమ్మకోసం

13వ పద్యము

కం. అనిమిషనాథ సుగుప్త మ
యిన యమృతము దెచ్చి మీకు నిచ్చితి, నస్మ
జ్జననీదాస్యము వాసెను,
దినకరపవనాగ్నితుహినదీప్తుల కరిగాన్
ప్రతిపదార్థాలు:
అనిమిషనాథసుగుప్తము + అయిన; అనిమిష = దేవతలకు
నాథ = రాజయిన ఇంద్రుడిచేత
సుగుప్తము + ఐన = బాగుగా రక్షింపబడిన
అమృతము = అమృతము
తెచ్చి = తీసుకువచ్చి
మీకున్ = మీకు
ఇచ్చితిన్ = ఇచ్చాను
అస్మజ్జననీ దాస్యము అస్మత్ = నా యొక్క
జననీ = తల్లి అయిన వినత యొక్క
దాస్యము = దాసితనం
దినకరపవనాగ్ని తుహినదీప్తులు + అ; దినకర = సూర్యుడు
పవన = వాయువు
అగ్ని = అగ్నిదేవుడు
తుహిన దీప్తులు + అ = మంచు కిరణాలు గల చంద్రుడు అనే వారు
కరిగాన్ (కరి + కాన్) = సాక్షిగా
పాసెన్ = తొలగింది (పోయింది)

భావం :
దేవేంద్రుడి చేత బాగా రక్షింపబడిన అమృతాన్ని తెచ్చి, మీకు ఇచ్చివేశాను. సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు అనే వాళ్ళు సాక్షులుగా, నా తల్లి అయిన వినత యొక్క దాసీతనం పోయింది.

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష.

AP State Syllabus 9th Class Telugu Important Questions 11th Lesson ధర్మదీక్ష

9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది పరిచిత గద్యాలను చదివి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. బాగా చీకటి పడింది. అయినా ఇంకా ఆవు తిరిగి రాలేదు. గోశాలలో గోవత్సాలన్నీ తోకలెత్తి పెట్టి ఎంతో సంతోషంగా పాలు కుడుచుకుంటున్నాయి. కాని ఆ ఒక్క ఆవుదూడ మాత్రం ‘అంబా’ ‘అంబా’ అని అదేపనిగా అరవడం మొదలు పెట్టింది. ఆ దూడ పుట్టినప్పటి నుంచీ నందగోపాలుని ఇల్లంతా పాడి పంటలతో కలకలలాడింది. అందుచేత ఆ ఆవన్నా, ఆ దూడన్నా నందగోపాలుని కెంతో ఇష్టం. అది అదే పనిగా అరవడం మొదలు పెట్టేసరికి అతని కారాత్రి మరి అన్నం సయించలేదు.
ప్రశ్నలు:
1. గోశాలలో ఆవుదూడలు ఎలా ఉన్నాయి?
2. ‘నందగోపాలుడికి ఆ దూడ అంటే ఎంతో ఇష్టం’ ఎందుకు?
3. నందగోపాలుడికి ఆ రాత్రి అన్నం ఎందుకు సయించలేదు?
4. పై పేరాపై మీరు ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. గోశాలలో ఆవుదూడలు అన్నీ తోకలు ఎత్తిపెట్టి, ఎంతో సంతోషంగా పాలు తాగుతున్నాయి.
2. ఆ దూడ పుట్టినప్పటి నుండి నందగోపాలుడి ఇల్లంతా పాడిపంటలతో కలకలలాడింది. అందుకే ఆ దూడ అంటే నందగోపాలుడికి ఎంతో ఇష్టం.
3. నందగోపాలుడికి ఇష్టమైన ఆవు ఇంటికి రాలేదు. అందువల్ల దాని దూడ ‘అంబా’ అంటూ అరవడం మొదలు పెట్టింది. అందుకే నందగోపాలుడికి ఆ రాత్రి అన్నం సయించలేదు.
4. ఆవుదూడ ‘అంబా’ ‘అంబా’ అని ఎందుకు అరుస్తోంది?

2. “నందుడంతలో గోవును వటవృక్షచ్ఛాయలో నిలిపి నురుగులు గక్కుకుంటూ పరుగెత్తుకు వచ్చి బుద్ధదేవుని పాదాలపై సాగిలపడ్డాడు. కొంత సేపటికి లేచి అతివినయంగా దోసిలి ఒగ్గి నిలబడ్డాడు. చివరికెలాగైనా దర్శన భాగ్యమైనా లభించింది గదా ! అని ఎంతో సంతోషించాడు. వెంటనే గౌతముడు లేచి నిలబడ్డాడు. వెనువెంటనే భిక్షువులందరూ లేచి నిలుచున్నారు! బుద్ధదేవుడెంతో ఆత్రంగా పక్కనే నిలబడిన భిక్షువులతో “ఇంకా భోజన పదార్థాలేమైనా మిగిలి ఉన్నాయా ?” అన్నాడు.
ప్రశ్నలు:
1. అవును నందుడు ఎక్కడ నిలబెట్టాడు?
2. నందుడు ఎందుకు సంతోషించాడు?
3. “ఇంకా భోజన పదార్థాలు మిగిలి ఉన్నాయా?” అని ఎవరు, ఎవరిని అడిగారు?
4. పై పేరా పై మీరు ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. ఆవును నందుడు వటవృక్షచ్ఛాయలో నిలబెట్టాడు.
2. తాను ఆలస్యంగా వచ్చినా, తనకు గౌతమబుద్ధుని దర్శన భాగ్యం లభించింది కదా అని నందుడు సంతోషించాడు.
3. బుద్ధుడు తన శిష్యులను “ఇంకా భోజన పదార్థాలు మిగిలి ఉన్నాయా?” అని అడిగాడు.
4. నందుడు బుద్ధుని పాదాలపై పడిన తర్వాత ఏమి జరిగింది?

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

3. “నందగోపుని భోజనానంతరం బుద్ధదేవుడతనిని వెంటబెట్టుకొని నెమ్మదిగా వటవృక్షచ్ఛాయకు తిరిగివచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మ ప్రవచనం ప్రారంభమైంది. అమృతవర్ష ప్రాయమైన ఆ ప్రసంగం ఆలకిస్తూ, భిక్షువులు, ఆళవీ గ్రామస్థులు ఆనంద తరంగాలలో తలమునకలైనారు. ధర్మప్రవచనం చేస్తూన్నంత సేపు బుద్ధదేవుడు చిరునవ్వులతో నందగోపాలుని వైపలవోకగా తిలకిస్తూనే ఉన్నాడు.
ప్రశ్నలు:
1. బుద్ధుడు భోజనానంతరం నందుడిని ఎక్కడకు తీసుకువచ్చాడు?
2. బుద్ధుని ధర్మప్రవచనం ఎలా ఉంది?
3. ఆనంద తరంగాలలో ఎవరు తలమునకలయ్యారు? ఎందుకు?
4. పై పేరాపై మీరు ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. భోజనానంతరం బుధుడు నందుని వెంటబెట్టుకొని వటవృక్షచ్చాయకు వచ్చాడు.
2. బుద్ధుని ధర్మప్రవచనం, అమృతవర్ష ప్రాయంగా ఉంది.
3. అమృత వర్షం వంటి బుుడి ధర్మప్రవచనం విని భిక్షువులు, ఆళవీ గ్రామస్తులు ఆనంద తరంగాలలో తలమునకలయ్యారు.
4. ధర్మప్రవచనం చేస్తునప్పుడు బుద్ధుడు ఏమి చేశాడు?

4. ఈ క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (S.A. II – 2018-19)

“మీదే వూరు నాయనా”
“అళవీగ్రామమే”

“అలాగా ! అయితే పొరుగూళ్ళ జనం అంతా తీర్థ ప్రజలాగ ఇక్కడకే వస్తూంటే నీవు ఉన్న గ్రామం విడిచి పెట్టి పోతాలేమయ్యా” ! అని ఒక చిరునవ్వు విసిరాడా ముసలి తాత నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేసాడు. అడవిలో ఆ ఆవు ఏ పులివాత పడిందోనని భయపడుతున్నానని కూడా అన్నాడు. ఆ మాట విన్న తరువాత ముసలి తాత మరి అతని మాటకడ్డు చెప్పలేక తన దారిని వెళ్ళిపోయాడు. అతని వెంట ఇంకా ఎందరెందరో పరిసర గ్రామస్థులు అళవీగ్రామం వైపు నడిచి వెళ్ళాడు.

అది చూడగానే నందగోపాలుని హృదయంలో ఆరాటం ప్రారంభమయింది. గోవు గొడవ విడిచి పెట్టి తాను కూడా వారి వెంటపడి పోవాలని అనుకున్నాడు. ఇక ఈ సమయంలో కాకపోతే మరింక తథాగతుని దర్శన భాగ్యమే కలగదేమో అని అతనికొక భయం పట్టుకుంది. వెంటనే వెనక్కి తిరిగి రెండు మూడడుగులు వేశాడు.
ప్రశ్నలు:
1. పొరుగూళ్ళ నుండి జనం అళవీ గ్రామానికి ఎవరిని దర్శించడానికి వెళుతున్నారు?
2. నందుడు తాతతో తానే విషయంలో భయపడుతున్నానన్నాడు?
3. నందుడు ఏ ఊరి నందు నివసించేవాడు?
4. పై పేరాననుసరించి సరైన ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. తథాగతుని
2. ఆవు
3. అళవీ
4. పై పేరాలో ద్విగు సమాసానికి చెందిన ఉదాహరణను గుర్తించండి.

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

5. క్రీ.శ. 7వ శతాబ్దారంభం నుంచీ తెలుగు పదం శాసనాలలో కనబడుతున్నదని సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకలు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు చెబుతారు. ఒక శాసనంలో “తెలుంగునాడు” అనే ప్రయోగం కూడ ఉంది. అప్పటికే ఆంధ్ర, తెలింగ, తెలుంగ శబ్దాలు ఒక జాతిని, దేశాన్ని తెలిపేందుకు వాడారని తెలుస్తోంది. తొలుత ఏర్పడిన తెలుగు పదం త్రిలింగ, త్రైలింగ ఐనట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
ప్రశ్నలు – జవాబులు:
1. తెలుగు పదం శాసనాలలో ఎప్పటి నుండి కనబడుతున్నది?
జవాబు:
7వ శతాబ్దం

2. దీనిలో సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు ఎవరు?
జవాబు:
మల్లంపల్లి సోమశేఖర శర్మ

3. శాసనంలో ఉన్న ప్రయోగం ఏది?
జవాబు:
తెలుంగనాడు

4. జాతిని, దేశాన్ని తెలిపేందుకు వాడిన పదాలేవి?
జవాబు:
ఆంధ్ర, తెలింగ, తెలుంగ

6. గంగానది వరద రోజులలో తప్ప – మిగిలిన రోజులలో ప్రశాంతంగా ఉంటుంది. మురుగుకాలువ మోతతో ప్రవహిస్తుంది. అలాగే పెద్దలు హుందాగా ప్రవర్తిస్తారు. అల్పులు ఆవేశానికి లోనై, దురుసుతనంతో ప్రవర్తిస్తారు.
ప్రశ్నలు – జవాబులు:
1. ప్రశాంతంగా ప్రవహించేది?
జవాబు:
గంగానది

2. మోతతో ప్రవహించేది?
జవాబు:
మురుగు కాలువ

3. హుందాగా ప్రవర్తించేది ఎవరు?
జవాబు:
పెద్దలు

4. అల్పులు ఎలా ప్రవర్తిస్తారు?
జవాబు:
ఆవేశానికిలోనై, దురుసుతనంతో

7. అయిపోయిన పనిని గురించి చింతింపవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేక పోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.
ప్రశ్నలు – జవాబులు:
1. దేని గూర్చి చింతింపకూడదు?
జవాబు:
అయిపోయిన పని గూర్చి

2. ఎవరిని మెచ్చుకోకూడదు?
జవాబు:
దుష్టులను

3. భగవంతుడు ఇచ్చినదానితో ఏమి చెందాలి?
జవాబు:
తృప్తి

4. ‘సాధ్యము’ వ్యతిరేకపదం?
జవాబు:
అసాధ్యం

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘ధర్మదీక్ష’ ప్రక్రియను గూర్చి రాయండి.
జవాబు:
ధర్మదీక్ష పాఠం పిలకా గణపతి శాస్త్రిగారు రాసిన “ప్రాచీన గాథాలహరి” అనే పుస్తకంలోనిది. ఇది కథా ప్రక్రియకు చెందినది. కథాంశం ప్రాచీనమైన, రచన ఆధునిక వచనంలో సాగింది. “కథ్యతే ఇతి కథా” అని వ్యుత్పత్తి. కథ పిల్లల్లో సున్నిత భావాలు పెంపొందిస్తుంది. ధర్మ ప్రబోధాన్ని, ఉత్తమ గుణాలను పెంపొందించడంలో కథ ఉపకరిస్తుంది.

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

ప్రశ్న 2.
భోజన సమయంలో నందగోపుడు బుద్ధునికి చెప్పిన విషయాలేవి?
జవాబు:
బుద్ధుడు నందగోపుని భోజనం పూర్తి అయ్యేవరకు అతని ప్రక్కనే కూర్చున్నాడు. ఎంతో ఆప్యాయంగా అతని గోవును గూర్చి, కోడె దూడను గూర్చి ఎన్నో కుశల ప్రశ్నలు వేశాడు. నందగోపుడు తన కోడెదూడ నుదుటి మీది నల్లని మచ్చలను గురించీ, ఒంటిమీది సుడులను గురించి ఎవరికీ తెలియని రహస్య సాముద్రిక విషయాలెన్నో చెప్పాడు. ప్రత్యేకంగా వంశపారంపర్యంగా తెలుసుకొన్న గోసాముద్రిక రహస్యాలు బుద్ధునికి చెప్పాడు.

ప్రశ్న 3.
బౌద్ధ భిక్షకులు (కొందరు అసూయ చెందడానికి కారణమేమిటి?
జవాబు:
ఆళవీ గ్రామం పరిసర గ్రామాలు బుద్ధుని దర్శనం కోసం, ధర్మబోధ వినడం కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ గౌతమ దేవుని విశాల నేత్రాలు అప్పుడు ఎవరికోసమో నిరీక్షించడం శ్రమణకులు గమనించారు. ఆ తర్వాత వచ్చిన నందగోపునికి తానే దగ్గరుండి భోజనం వడ్డించడం వారికి ఆశ్చర్యం కల్గించింది. చుట్టూరా నిలిచిన కొందరు భిక్షకులకు వారి ప్రసంగాలు విడ్డూరాన్ని కలిగించాయి. ఆ తర్వాత ధర్మ ప్రవచనం చేస్తున్నంత సేపు బుద్ధదేవుడు చిరునవ్వుతో నందగోపాలుని వైపు అలవోకగా చూస్తూనే ఉన్నాడు. బుద్ధుని ఈ చర్య భిక్షకులకు అసూయ కలగడానికి కారణమైంది.

ఆ) క్రింది ప్రశ్నలకు పది పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
అష్టాంగ ధర్మాలు/ మార్గాలు ఏవి?
జవాబు:
కేశములను పూర్తిగా నశింపజేయుటకు గల మార్గమేది? అను ప్రశ్నకు బుద్ధుడు ఇట్లు పల్కెను – ఆర్య ! అష్టాంగ మార్గమే క్లేశ క్షయానికి దారితీయును. అవి :
అష్టాంగ మార్గాలు.
1. సమ్యక్ దృష్టి – అసమంజసములైన భావములతో కాక విషయమును ఉన్నది ఉన్నట్లుగా తెలిసికొనుట.
2. సమ్యక్ వాక్కు – సౌమ్యముగా, సత్యమును, కరుణతో చెప్పుట.
– సామ్యముగా, సత్యములు తమ
3. సమ్యక్ కర్మ – శాంతం, శుద్ధం, ధార్మికము అగు కర్మలను ఆచరించుట.
4. సమ్యక్ సంకల్పం లక్ష్యం – ఉన్నతములు, గంభీరములు అగు భావాలతో ఉండుట.
5. సమ్యక్ చేతన మనస్తత్వం – జీవహింస చేయకుండ సచ్చీలమున జీవించుట
6. సమ్యక్ జీవనం – సునిశితమైన పరిశీలన, తీక్షణమైన బుద్ధి కలిగియుండుట
7. సమ్యక్ వ్యాయామం – యమ నియమాది సాధనములను ఆచరణలోకి తెచ్చుట.
8. సమ్యక్ భావన – జీవితానికి లక్ష్యాలగు తాత్త్విక విషయాలపై మననం, ధ్యాననం కలిగి ఉండుట.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నకు సమాధానము రాయండి. మీ ఊరిలో జరిగిన / నీవు చూసిన ఆధ్యాత్మిక ప్రసంగాన్ని గూర్చి మిత్రునికి లేఖ రాయండి. మిత్రునికి లేఖ
జవాబు:

ఒంగోలు,
x x x x x

ప్రియమిత్రుడు విష్ణుదత్తకు,
నేను క్షేమం. నీవు క్షేమమే కదా ! ఇటీవల మా ఊరిలో గొప్ప ఆధ్యాత్మిక ప్రసంగం జరిగింది. ‘రామాయణం మన జీవన పారాయణం’ అంశం మీద చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్పారు. ఎంత బాగుందో ! రామాయణం కుటుంబ బాంధవ్యాలను మనం ఆదర్శంగా తీసుకోవాలని, గౌరవాన్ని, అనురాగాన్ని పంచాలని వివరించారు. మన ఇల్లు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. ఇలా ఎన్నో విషయాలను ఆ వేదికపై నుండి చక్కగా తెలియజేసారు. నీవు కూడా ఇటువంటి ప్రసంగాన్ని వినమని కోరుతూ …….

నీ ప్రియ మిత్రుడు,
కె. లీలాకృష్ణ సాయిశ్రీ ప్రసాద్.

చిరునామా :
యస్. విష్ణుదత్త,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
బాపట్ల.

III. భాషాంశాలు (పదజాలం , వ్యాకరణం)

1. పర్యాయపదాలు:

ఆవు : గోవు, ధేనువు
పులి : శార్దూలం, వ్యాఘ్రం, పుండరీకం
నేత్రం : కన్ను, చక్షువు
నిర్వాణం : మోక్షం, కైవల్యం
ఉద్రేకం : ఆవేశం, కోపం
సూర్యుడు : భానుడు, భాస్కరుడు, ఆదిత్యుడు
శ్రమణకులు : సన్యాసులు, భిక్షువులు
ఆచార్యుడు : గురువు, ఉపాధ్యాయుడు
ఆరాటం : తొందర, ఆత్రం

2. వ్యుత్పత్యర్థాలు :

అదృష్టం : దృష్టము కానిది (భ్యాగం)
అతిథి : తిథివార నక్షత్రములు చూడకుండా వచ్చేవాడు (చుట్టం, స్నేహితుడు)
ఆచార్యుడు : వేదవ్యాఖ్యానము చేయువాడు (గురువు)
నిర్వాణము : సుఖదుఃఖాలు లేనిది (మోక్షం)
హృదయం : హరింపబడునది (గుండె, మనస్సు)
అమృతం : మృతం లేనిది (సుధ)
అసూయ : గుణములందు దోషారోపాణ చేయుట (ఓర్వలేనితనం)
దీక్ష : యజ్ఞాది క్రియారంభమున అనుష్ఠింపబూనుకొనెడు (ఆచార నియమం)

3. నానార్థాలు :

భాగ్యం : అదృష్టం, సంపద
పక్షం : పగ, ప్రక్క రెక్క, 15 రోజులు, బలం
జ్యోతి : ప్రకాశం, ధనం, కొడుకు, చంద్రుడు
నేత్రం : కన్ను, పేరు, ఏఱు, పట్టువస్త్రం
ప్రసంగం : విషయ విస్తరం, ప్రస్తావం, భక్తి, సంభాషణ
వంశం : తండ్రి తాతల పరంపర, వెన్నెముక, వెదురు, కులము, పిల్లనగ్రోవి.
గోవు : ఆవు, కన్ను, బాణం, దిక్కు
అహ్నం : పగలు, రోజు, కాలము
భానువు : సూర్యుడు, శివుడు, వృద్ధుడు
బుద్ధుడు : పండితుడు, బుద్ధదేవుడు

4. ప్రకృతి – వికృతులు :

భాగ్యం – బాగెము
ప్రశ్న – పన్నము
ప్రాణం – పానం
బిక్ష – బిచ్చము
రాత్రి – రాతిరి, రేయి, రేతిరి
ఆశ్చర్యం – అచ్చెరువు
దృష్టి – దిస్టి
గౌరవం – గారవం
విడ్డూరం – విడ్వరం
ధర్మం – దమ్మము
హృదయం – ఎద, ఎడద
భోజనం – బోనం
అంబా – అమ్మా
సంతోషం – సంతసం
వంశం – వంగడం
ముఖము – మొగము

5. సంధులు :

అరుణ + ఉదయ = అరుణోదయ – గుణసంధి
నూతన + ఆనంద + ఆవేశాలు = నూతనానందావేశాలు – సవర్ణదీర్ఘ సంధి
మధ్య + అహ్నం = మధ్యాహ్నం – సవర్ణదీర్ఘ సంధి
నిడు + ఊర్పు = నిట్టూర్పు – ద్విరుక్తటకరాదేశ సంధి
కాషాయ + అంబరధారులు = కాషాయాంబరధారులు – సవర్ణదీర్ఘ సంధి
ప్రతి + అక్షము = ప్రత్యక్షము – యణాదేశ సంధి
ఆసన్నము + అగు = ఆసన్నమగు – ఉత్వసంధి
సుఖ + ఆసనం = సుఖాసనం – సవర్ణదీర్ఘ సంధి
నేత్రము + లు = నేత్రాలు – లు,ల, నల సంధి
క్షుధ + ఆరుడు = క్షుధార్తుడు – సవర్ణదీర్ఘ సంధి
సమ్యక్ + బుద్ధి = సమ్యగ్బుద్ధి – జశ్త్వసంధి
దుః+ సహము = దుస్సహము – విసర్గ సంధి
శ్రమ + ఆర్జితం = శ్రమార్జితం – విసర్గ సంధి
ఆరాటము + పడు = ఆరాటపడు – పడ్వాది సంధి
ప్రతి + ఏకం = ప్రత్యేకం – యణాదేశ సంధి
నెఱు + మది = నెమ్మది – ప్రాతాది సంధి
సూత్రం : అన్యంబులకు సహితమిక్కార్యంబు కొండకచో కానంబడియెడు.
భోజన + అనంతరం = భోజనానంతరం – సవర్ణదీర్ఘ సంధి
మహా + ఆత్ముడు = మహాత్ముడు – సవర్ణదీర్ఘ సంధి

6. సమాసాలు :

గోశాల = గోవుల యొక్క శాల లో – షష్ఠీ తత్పురుష సమాసం
శిష్య సమూహం = శిష్యుల యొక్క సమూహం – షష్ఠీ తత్పురుష సమాసం
పెన్నిధి = పెద్ద (గొప్ప) దైననిధి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సుఖాసనం = సుఖమైన ఆసనం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
వటవృక్షం = మట్టి అను పేరుగల వృక్షం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
మధ్యాహ్నం = అహ్నము మధ్య భాగం – ప్రథమా తత్పురుష సమాసం.
దుస్సహము = సహింపరానిది – అవ్యయీభావ సమాసం
చిరునవ్వు = చిన్నదైన నవ్వు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
శ్రావస్తీనగరం = శ్రావస్తి అనే పేరుగల నగరం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ముఖజ్యోతి = ముఖమనెడి జ్యోతి – రూపక సమాసం
ధర్మప్రవచనం = ధర్మమును గూర్చి ప్రవచనం – ద్వితీయా తత్పురుష సమాసం
సందర్శన భాగ్యం = సందర్శనమనెడి భాగ్యం – రూపక సమాసం
ఆకటి చిచ్చు = ఆకలి అనెడి చిచ్చు – రూపక సమాసం
మహాత్మ = గొప్పదైన ఆత్మ – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష 1 Mark Bits

1. కందర్ప దర్పదములగు సుందర దరహాసములు – ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) వృత్త్యనుప్రాస
బి) లాటానుప్రాస
సి) ఛేకానుప్రాస
డి) అర్థాంతరన్యాస
జవాబు:
సి) ఛేకానుప్రాస

2. నా హృదయంలో వాగ్గేవి కొలువై ఉంది. – (వికృతి పదం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఎదయం
బి) సదయం
సి) ఎద
డి) ఎదడ
జవాబు:
సి) ఎద

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

3. ఓ కుమారా ! నీకు వంద వందనాలు – ఏ అలంకారమో గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) లాటానుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) అంత్యానుప్రాస
డి) అర్థాంతరన్యాస
జవాబు:
బి) ఛేకానుప్రాస

4. నందగోపుడు భోజనం చేశాడు. (గీత గీసిన పదానికి గణాన్ని గుర్తించండి) (S.A. III – 2016-17)
ఎ) త గణము
బి) మ గణము
సి) ర గణము
డి) భ గణము
జవాబు:
ఎ) త గణము

5. “ఏమిటి విశేషం” అని నందగోపుడు అడిగాడు. (ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి. ) (S.A. III – 2016-17)
ఎ) “ఏమిటి విశేషమని” నందగోపుడు అడగలేదు.
బి) ఏమిటి విశేషమని నందగోపుడు అడిగాడు.
సి) “విశేషం ఏంటి” అని నందగోపుడు అడిగాడు.
డి) ఏమి విశేషం లేదా అని నందగోపుడు అడిగాడు.
జవాబు:
బి) ఏమిటి విశేషమని నందగోపుడు అడిగాడు.

6. ఆయన దర్శన భాగ్యం కలుగుతుందో ! కలగదో ! (ఏ రకమైన వాక్యమో గుర్తించండి. ) (S.A. III – 2016-17)
ఎ) హేత్వర్ణకం
బి) సామర్థ్యార్థకం
సి) సందేహాహాకం
డి) ఆశీరర్థకం
జవాబు:
సి) సందేహాహాకం

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

7. మార్కుల కోసం ఆరాటపడడం కాదు. శ్రద్ధ ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కోపం
B) ఆత్రపడు
C) సంతోషం
D) కష్టం
జవాబు:
B) ఆత్రపడు

8. భిక్షవులు బుద్ధుని వెంట నడిచారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) బిచ్చగాళ్ళు
B) మునులు
C) సన్యాసులు
D) జనులు
జవాబు:
C) సన్యాసులు

9. ప్రతి ఒక్కరు వ్యసనాలను విసర్జించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) విడుచు
B) పొందు
C) దగ్గర
D) దూరం
జవాబు:
A) విడుచు

10. పెద్దల మాట ఆలకించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) చూడు
B) విను
C) శ్రద్ధ
D) మాట్లాడు
జవాబు:
B) విను

11. చిన్నపిల్లల ముద్దుమాటలు చూసి పెద్దలు మురిసిపోతారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) గంతులు
B) బాధ
C) సంతోషం
D) ఎగతాళి
జవాబు:
C) సంతోషం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

12. అపరిచితులతో చనువుగా ఉండరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కోపం
B) ద్వేషం
C) ఇష్టం
D) స్నేహం
జవాబు:
D) స్నేహం

13. నందుని హృదయంలో జిజ్ఞాస రేకెత్తింది – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి ?
A) కోపము
B) తెలుసుకోవాలనే కోరిక
C) ఆనందము
D) ఆసక్తి
జవాబు:
B) తెలుసుకోవాలనే కోరిక

14. భిక్షువులను అతిథి సత్కారాలతో ఎంతో ఆప్యాయంగా ఆదరించారు – గీత గీసిన పదం అర్థం గుర్తించండి.
A) ప్రేమగా
B) గౌరవంగా
C) ఇష్టంగా
D) కోపంగా
జవాబు:
A) ప్రేమగా

15. కొంత సేపటికి శ్రవణకులు అందరూ వటవృక్షచ్ఛాయలో సమాసీనులయ్యారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) గ్రామ ప్రజలు
B) శిష్యులు
C) బౌద్ధ భిక్షువులు
D) సన్యాసులు
జవాబు:
C) బౌద్ధ భిక్షువులు

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

16. అవగాహన చేసికొన్న వారికి నిర్వాణం కరతలామలకం – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి ?
A) బాగా తెలిసినది
B) చేయి
C) ఉసిరికాయ
D) సంపాదింపబడేది
జవాబు:
A) బాగా తెలిసినది

2. పర్యాయపదాలు :

17. గోవు దేవతల ప్రతిరూపంగా పూజలందుకుంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఆవు దూడ
B) ధేనువు, ఆవు
C) గిడ్డి, గరుడ
D) మొదవు, మేగము
జవాబు:
B) ధేనువు, ఆవు

18. మన జాతీయ జంతువు పులి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) వ్యాఘ్రం, కరి
B) శార్దూలం, సారంగి
C) పుండరీకం, శార్దూలం
D) సింహం, నక్క
జవాబు:
C) పుండరీకం, శార్దూలం

19. బుద్ధుని వెంట శ్రవణుకులు నడిచారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) జనులు, ప్రజలు
B) రైతులు, కూలీలు
C) మునులు, ఋషులు
D) సన్యాసులు, భిక్షువులు
జవాబు:
D) సన్యాసులు, భిక్షువులు

20. ‘నిర్వాణం’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) మోక్షం, కైవల్యం
B) మోక్షం, శుభం
C) ముక్తి, విముక్తి
D) స్వర్గం, నరకం
జవాబు:
A) మోక్షం, కైవల్యం

21. సర్వలోకాలకు కాంతి ప్రదాత సూర్యుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) భానుడు, చంద్రుడు
B) భాస్కరుడు, తస్కరుడు
C) ఆదిత్యుడు, రవి
D) రవి, రాము
జవాబు:
C) ఆదిత్యుడు, రవి

22. కన్నులతో వినే శక్తి పాముకు కలదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) నేత్రం, ఆత్రం
B) చక్షువు, దృష్టి
C) అక్షి, పక్షి
D) నయనం, నయం
జవాబు:
B) చక్షువు, దృష్టి

23. అది నందుడు పెంచి పెద్దచేసిన ఆవు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) హయము, తురగము
B) గిడ్డి, ధేనువు
C) మొదవు, హరి
D) కపిల, హస్తి
జవాబు:
B) గిడ్డి, ధేనువు

3. వ్యుత్పత్త్యర్థాలు :

24. ‘దృష్టము కానిది‘ భాగ్యం – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) దురదృష్టం
B) అదృష్టం
C) భోగం
D) శుభం
జవాబు:
B) అదృష్టం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

25. దుఃఖాదులు లేనిదే జీవితం లేదు – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) నిర్వాకం
B) నిర్వహణ
C) నిర్వాణం
D) బాధ
జవాబు:
C) నిర్వాణం

26. ‘హృదయం’ దీనికి వ్యుత్పత్తి గుర్తించండి.
A) హరింపబడునది
B) ద్వేషించునది
C) ప్రేమించునది
D) దయలేనిది
జవాబు:
A) హరింపబడునది

27. ‘గుణములందు దోషారోపణ చేయుట’ హీనుల పని – వ్యుత్పత్త్యర్థం తగినది గుర్తించండి.
A) మదం
B) కోపం
C) అసూయ
D) ద్వేషం
జవాబు:
C) అసూయ

28. యజ్ఞాది క్రియారంభమున అనుష్ఠింప పూనుకొనెడు ఆచారనియమం – సరైనది గుర్తించండి.
A) కంకణ బద్దులు
B) దీక్ష
C) నడుం కట్టుట
D) పట్టుదల
జవాబు:
B) దీక్ష

29. “తిథి, వార నియమాలు లేకుండా వచ్చేవాడు” – ఈ పదానికి వ్యుత్పత్యర్థం ఏది?
A) బంధువు
B) అతిథి
C) అభ్యాగతి
D) సోదరుడు
జవాబు:
B) అతిథి

4. నానార్థాలు :

30. పక్షములు రెండు. శుక్లపక్షం, కృష్ణపక్షం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) రెక్క ముక్క
B) ప్రక్క సందు
C) 15 రోజులు, రెక్క
D) బలం, శక్తి
జవాబు:
C) 15 రోజులు, రెక్క

31. అహ్మము యొక్క మధ్యభాగం మధ్యాహ్నం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పగలు, రాత్రి
B) రోజు, కాలం
C) కాలం, సమయం
D) రోజు, దినం
జవాబు:
B) రోజు, కాలం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

32. వంశం నిలబెట్టేది వివాహమే కదా ! – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) కులం, కలం
B) వెదురు, బెదురు
C) వెన్నెముక, ఎముక
D) తండ్రితాతలపరంపర, పిల్లనగ్రోవి
జవాబు:
D) తండ్రితాతలపరంపర, పిల్లనగ్రోవి

33. బుద్ధుడు మానవాళికి ఒక కొత్త దారి చూపాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) తెలియనివాడు, అమాయకుడు
B) మేధావి, తెలివి
C) పండితుడు, పామరుడు
D) బుద్ధదేవుడు, పండితుడు
జవాబు:
C) పండితుడు, పామరుడు

34. జ్యోతులు వెలిగించే కార్తీకమాసం పవిత్రమైంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) చంద్రుడు, బుధుడు
B) ప్రకాశం, కొడుకు
C) ధనం, డబ్బు
D) కొడుకు, పుత్రుడు
జవాబు:
B) ప్రకాశం, కొడుకు

35. నేత్రదానంతో మరొకరికి చూపు నివ్వండి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) కన్ను, పేరు
B) ఏరు, పారు
C) పట్టువస్త్రం, గుడ్డ
D) పేరు, నామం
జవాబు:
B) ఏరు, పారు

36. పెద్దల ప్రసంగాలు అమృతతుల్యాలు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) విషయవిస్తారం, కథ
B) మాటలు, పాటలు
C) భక్తి, ముక్తి
D) సంభాషణ, ప్రస్తావం
జవాబు:
D) సంభాషణ, ప్రస్తావం

37. ‘ఒక చిరునవ్వు విసిరాదా ముసలి తాత” – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) తండ్రి తండ్రి, ముసలి
B) తండ్రి, బ్రహ్మ
C) బ్రహ్మ, ముసలిది
D) రక్షకుడు, తల్లి తండ్రి
జవాబు:
B) తండ్రి, బ్రహ్మ

5. ప్రకృతి – వికృతులు :

38. లేగదూడలు తల్లులకై ‘అంబా‘ అని అరుస్తున్నాయి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) అంబ
B) అమ్మా
C) అబ్బా
D) అయ్యా
జవాబు:
B) అమ్మా

39. చిన్నపిల్లలకు ఎవరి కన్ను పడకుండా దిస్టి చుక్క పెడతారు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) దోషం
B) చూపు
C) దృష్టి
D) కన్ను
జవాబు:
C) దృష్టి

40. వ్యాసుడు భిక్ష పాత్రను పగులగొట్టాడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బిచ్చము
B) బిక్ష
C) భిచ్చం
D) బికష
జవాబు:
A) బిచ్చము

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

41. భోజనం చేసేటప్పుడు మెతుకులు చుట్టూ పడకూడదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బువ్వ
B) అన్నం
C) సద్ది
D) బోనం
జవాబు:
D) బోనం

42. దమ్మము తప్పి ప్రవర్తించకూడదు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) న్యాయం
B) ధర్మం
C) అహింస
D) సత్యం
జవాబు:
B) ధర్మం

43. తాను చేసుకున్న పూర్వ పుణ్యం అంతే కదా! – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
A) పుణ్యము
B) పున్నెం
C) పున్యము
D) పూర్వము
జవాబు:
B) పున్నెం

44. ఆకటి చిచ్చు వేధించినా, అతడు గోపాలక ధర్మం వీడలేదు – గీత గీసిన పదానికి ప్రకృతి ఏది?
A) చిచ్చి
B) శుచి
C) అగ్ని
D) చిత్తు
జవాబు:
C) అగ్ని

6. సంధులు :

45. అరుణోదయ కాంతులతో తూర్పు దిక్కు మెరుస్తోంది – గీత గీసిన పదానికి సంధిని గుర్తించండి.
A) సవర్ణదీర్ఘ
B) వృద్ధి
C) గుణ
D) యణాదేశ
జవాబు:
C) గుణ

46. ‘నిడు + ఊర్పు’ – సంధి పేరేమిటి?
A) టుగాగమ
B) ద్విరుక్తటకారం
C) ప్రాతాది
D) జశ్త్వ
జవాబు:
B) ద్విరుక్తటకారం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

47. ‘సమ్యగ్బుద్ధి’ విడదీయము.
A) సమ్యక్ + బుద్ధి
B) సమ్య + బుద్ధి
C) సమ్య + కుబుద్ధి
D) సమయక్ + బుద్ధి
జవాబు:
A) సమ్యక్ + బుద్ధి

48. కింది వానిలో విసర్గసంధి ఉదాహరణను గుర్తించండి.
A) నేత్రాలు
B) సుఖాసనం
C) మధ్యాహ్నం
D) దుస్సహం
జవాబు:
D) దుస్సహం

49. ‘నెఱ + మది’ – సంధి పేరేమిటి?
A) ఆమ్రేడిత సంధి
B) ప్రాతాది
C) పడ్వాది
D) యణాదేశ
జవాబు:
B) ప్రాతాది

50. ప్రతి + ఏకం – సంధి చేయండి.
A) ప్రతేకం
B) ప్రతియేకం
C) ప్రత్యేకం
D) ప్రతిఏకం
జవాబు:
C) ప్రత్యేకం

51. యణాదేశ సంధికి ఉదాహరణను గుర్తించండి.
A) ప్రత్యక్షం
B) అరుణోదయం
C) ఆరాటపడు
D) నేత్రాలు
జవాబు:
A) ప్రత్యక్షం

52. ‘సుఖాసనం’ – సంధిని గుర్తించండి.
A) గుణ
B) యణాదేశ
C) వృద్ధి
D) సవర్ణదీర్ఘ
జవాబు:
D) సవర్ణదీర్ఘ

53. ‘నిట్టూర్పు’ పదాన్ని విడదీయండి.
A) నిట్ట + ఊర్పు
B) నిట్టు + ఊర్పు
C) నిడు + ఊర్పు
D) నిట + టూర్పు
జవాబు:
C) నిడు + ఊర్పు

54. ‘పొరుగూళ్ళు’ – ఈ పదంలో గల సంధి ఏది?
A) అత్వసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) ఉత్వసంధి
D) ఇత్వసంధి
జవాబు:
C) ఉత్వసంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

55. ‘హృదయాంతరాళంలో ప్రేమ లేదు’ – గీత గీసిన పదం ఏ సంధి?
A) గుణ సంధి
B) వృద్ధి సంధి
C) అత్వ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
D) సవర్ణదీర్ఘ సంధి

7. సమాసాలు:

56. నేడు ప్రభుత్వం గోశాలలపై శ్రద్ధ పెట్టాలి – గీత గీసిన పదానికి విభక్తిని గుర్తించండి.
A) కంటె
B) వలన
C) యొక్క
D) అందు
జవాబు:
D) అందు

57. ‘సహింపరానిది’ – సమాసపదం గుర్తించండి.
A) స్వభావోక్త
B) ఉత్ప్రేక్ష
C) ఉపమా
D) యమకం
జవాబు:
D) యమకం

58. ‘ముఖ జ్యోతి’ దీనిలోని విభక్తిని గుర్తించండి.
A) కొఱకు
B) యొక్క
C) చేత
D) అనెడి
జవాబు:
D) అనెడి

59. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) శ్రావస్తీ నగరం
B) చిరునవ్వు
C) ఆకటిచిచ్చు
D) మహాత్మ
జవాబు:
A) శ్రావస్తీ నగరం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

60. ‘మధ్యాహ్నం’ సమాసం గుర్తించండి.
A) రూపక
B) అవ్యయిభావ
C) ప్రథమా తత్పురుష
D) చతుర్టీ
జవాబు:
C) ప్రథమా తత్పురుష

61. ధర్మమును గూర్చి ప్రవచనం – గీత గీసిన పదానికి విభక్తిని గుర్తించండి.
A) ప్రథమా
B) ద్వితీయా
C) తృతీయా
D) చతుర్థి
జవాబు:
D) చతుర్థి

62. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) శ్రావస్తీ నగరం
B) సందర్శన భాగ్యం
C) మధ్యాహ్నం
D) పెన్నిధి
జవాబు:
B) సందర్శన భాగ్యం

63. ‘భిక్షాపాత్రము’-ఇది ఏ సమాసమో గుర్తించండి.
A) తృతీయా తత్పురుష
B) చతుర్దీ తత్పురుష
C) దంద్వము
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
B) చతుర్దీ తత్పురుష

64. ‘మధ్యాహ్నము’ – ఈ సమాసానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
A) అహ్నము యొక్క మధ్య భాగం
B) అహ్నము మరియు మధ్యము
C) మధ్యముగా ఉన్న అహ్నము
D) మధ్యమును, అహ్నమును
జవాబు:
A) అహ్నము యొక్క మధ్య భాగం

65. ‘అతిదూరము కానిది’ – సమాసపదంగా కూర్చండి.
A) అతి దూరము
B) అనతి దూరము
C) అభ్యంతరము
D) అదూరము
జవాబు:
B) అనతి దూరము

8. అలంకారాలు :

66. “గౌతముని ముఖజ్యోతి ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉంది” – గీత గీసిన పదంలోని అలంకారాన్ని గుర్తించండి.
A) ఉపమా
B) రూపక
C) అతిశయోక్తి
D) శ్లేష
జవాబు:
B) రూపక

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

67. “గౌతముని ముఖ వర్చస్సు ఉదయించే సూర్యబింబంలా ఉంది” – దీనిలో అలంకారాన్ని గుర్తించండి.
A) సాససం
B) దుస్సహం
C) అసహ్యం
D) అసహనం
జవాబు:
C) అసహ్యం

68. “ఎండ నెత్తి మాడ్చింది. ఆకలి దహిస్తోంది. నాలుక పిడచ గట్టింది” – దీనిలోని అలంకారం గుర్తించండి.
A) స్వభావోక్తి
B) శ్లేష
C) అతిశయోక్తి
D) ముక్తపదగ్రస్తం
జవాబు:
A) స్వభావోక్తి

69. ఒకే అక్షరం, లేదా రెండు మూడక్షరాలు, వాక్యం చివర మాటిమాటికీ వస్తే, దాన్ని ఏ అలంకారం అంటారు?
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) అంత్యానుప్రాస
D) ఉపమాలంకారం
జవాబు:
C) అంత్యానుప్రాస

70. ‘గ్రామస్తులు ఆనంద తరంగాలలో తలమునకలయ్యారు’ – ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి.
A) రూపకము
B) ఉపమా
C) ఉత్ప్రేక్ష
D) వృత్త్యనుప్రాస
జవాబు:
A) రూపకము

71. ‘ఫలము’ – ఈ పదం ఏ గణము?
A) భ గణం
B) ర గణము
C) త గణము
D) న గణము
జవాబు:
D) న గణము

9. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

72. ‘మీ సభా కార్యక్రమము నంతయుఁ జెడఁ గొట్టితిని’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (S.A. II – 2018-19)
A) మీ సభా కార్యక్రమాన్నంతా చెడగొట్టాను
B) మీ సభా కార్యక్రమాన్ని అంతా చెడగొట్టితిని
C) మీ సభా కార్యక్రమం చెడగొట్టాము
D) మీ సభలో కార్యక్రమాన్ని అంతా చెడగొట్టారు
జవాబు:
A) మీ సభా కార్యక్రమాన్నంతా చెడగొట్టాను

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

73. ‘జపించు వేదమటవీ మధ్యంబులో నేద్పగున్’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) జపించే వేదం, అడవి మధ్యలో ఏడ్పవుతుంది
B) జపించే వేదము, అటవీ మధ్యంలో ఏడుపు
C) జపించే వేదము అటవీ మధ్యలో ఏడ్పు
D) జపించే వేదం అటవి మధ్యమంలో ఏడ్పవుతుంది
జవాబు:
A) జపించే వేదం, అడవి మధ్యలో ఏడ్పవుతుంది

10. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం :

74. గౌతముడు ఎన్ని ప్రశ్నలు వేసాడు – కర్మణి వాక్యం గుర్తించండి.
A) ఎన్నో ప్రశ్నలు వేశాడు గౌతముడు
B) గౌతముడు వేసాడ ఎన్నో ప్రశ్నలు
C) గౌతమునిచే ఎన్నో ప్రశ్నలు వేయబడ్డాయి
D) ప్రశ్నలు ఎన్నో గౌతముడు వేసాడు
జవాబు:
C) గౌతమునిచే ఎన్నో ప్రశ్నలు వేయబడ్డాయి

75. అటువైపు చూడబడ్డారు – కర్తరి వాక్యం గుర్తించండి.
A) చూడబడ్డారు అటువైపు
B) అటువైపు చూచారు
C) వైపు అటు చూడబడ్డారు
D) అటు చూసి
జవాబు:
B) అటువైపు చూచారు

76. బుద్ధుడు ప్రవచనం ముగించాడు – కర్మణి వాక్యం గుర్తించండి.
A) బుద్ధునిచే ప్రవచనం ముగించబడింది
B) బుద్దునిచే ప్రవచనం ముగించాడు
C) బుద్ధుడు ప్రవచనం ముగించబడింది.
D) ప్రవచనంచే బుద్దుడు ముగించబడింది.
జవాబు:
A) బుద్ధునిచే ప్రవచనం ముగించబడింది

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

77. పెక్కు విషయములను ఉపన్యసించారు – ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) పెక్కు విషయాలు ఉపన్యసిస్తారు
B) పెక్కు విషయాలు ఉపన్యసింపబడ్డాయి
C) పెక్కు విషయములు ఉపన్యసింపబడతాయి
D) పెక్కు విషయాలు ఉపన్యసింపబడును
జవాబు:
B) పెక్కు విషయాలు ఉపన్యసింపబడ్డాయి

78. ‘ఎన్నో విషయాలు కృష్ణారావుగారిచే వివరింపబడ్డాయి – ఈ కర్మణి వాక్యానికి కర్తరి వాక్యాన్ని
A) ఎన్నో విషయాలను కృష్ణారావుగారు వివరిస్తారు అవుతుంది
B) ఎన్నో విషయాలను కృష్ణారావుగారు వివరించారు
C) ఎన్నో విషయాలు కృష్ణారావుగారు వివరింపగలరు
D) ఎన్నో విషయాలు కృష్ణారావుగారు తెలిపారు
జవాబు:
B) ఎన్నో విషయాలను కృష్ణారావుగారు వివరించారు

11. ప్రత్యక్ష, పరోక్ష కథనాలను గుర్తించడం :

79. “నేనేమి ఎరగని వట్టి అమాయకుణ్ణి” అని అన్నాడు – పరోక్ష కథనం గుర్తించండి.
A) నేను ఏమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.
B) తానేమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.
C) అతను ఏమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.
D) తానేమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.
జవాబు:
D) తానేమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.

80. “నాయనా ! నీ లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది. నీవు భోజనం చేయి” అని అన్నాడు – పరోక్ష కథనం గుర్తించండి.
A) (అతనితో) లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది. భోజనం చేయి అని అన్నాడు.
B) అతనిని సంబోధిస్తూ లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది, భోజనం చేయని అన్నాడు.
C) బాబూ లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది భోజనం చేయని అన్నాడు.
D) అతనితో తమ లేగదూడ తల్లివద్ద పాలు తాగుతోంది. భోజనం చేయని అన్నాడు.
జవాబు:
B) అతనిని సంబోధిస్తూ లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది, భోజనం చేయని అన్నాడు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

81. “మా అన్నయ్య ముస్తఫాకమల్ కి ఒక కిరాణా దుకాణం ఉంది” అన్నారు కలామ్ – ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) తమ అన్నయ్య ముస్తఫాకమల్ కి, ఒక కిరాణా దుకాణం ఉందని కలామ్ అన్నారు.
B) మా అన్నయ్య ముస్తఫాకమలకు కిరాణా దుకాణం ఉందని కలామ్ అన్నారు.
C) వారి అన్నయ్య ముస్తఫాకమల్ కి కిరాణ దుకాణం ఉందని కలామ్ చెప్పారు.
D) నా అన్నయ్య ముస్తఫాకమల్ కి కిరాణా దుకాణం ఉండేదని కలామ్ అన్నారు.
జవాబు:
A) తమ అన్నయ్య ముస్తఫాకమల్ కి, ఒక కిరాణా దుకాణం ఉందని కలామ్ అన్నారు.

12. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

82. సమృద్ధిగా ఉన్నాయి.
A) సమృద్ధిగా ఉండవచ్చు
B) సమృద్ధిగా ఉంటాయి
C) సమృద్ధిగా లేవు
D) సమృద్ధిగా ఉంటున్నాయి
జవాబు:
C) సమృద్ధిగా లేవు

83. కుశల ప్రశ్నలు వేశాడు.
A) కుశల ప్రశ్నలు వేస్తాడు
B) కుశల ప్రశ్నలు వేయలేదు
C) కుశల ప్రశ్నలు వేయవచ్చు
D) కుశల ప్రశ్నలు వేస్తుంటాడు
జవాబు:
B) కుశల ప్రశ్నలు వేయలేదు

84. ‘సన్యాసులందరితో కలిసి భోజనం చేశారు’ – ఈ వాక్యానికి వ్యతిరేకార్థ వాక్యాన్ని గుర్తించండి.
A) సన్యాసులందరితో కలిసి భోజనం చేయలేదు
B) సన్యాసులు భోజనం చేస్తారు
C) సన్యాసులు భోజనం చేయరు
D) సన్యాసులు భోజనం తినగలరు
జవాబు:
A) సన్యాసులందరితో కలిసి భోజనం చేయలేదు

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

85. ‘నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు’ – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
A) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలుపలేదు
B) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు
C) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలుపడు
D) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలుపరు
జవాబు:
B) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు

13. వాక్యరకాలను గుర్తించడం :

86. ఎంతో భయభక్తులతో సాగిలపడి, లేచి నిలబడ్డాడు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంయుక్త
B) సంక్లిష్ట
C) సామాన్య
D) మహావాక్యం
జవాబు:
B) సంక్లిష్ట

87. గౌతముడు నిలబడ్డాడు, శిష్యులు నిలబడ్డారు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంక్లిష్ట
B) మహావాక్యం
C) సంయుక్త
D) సామాన్య
జవాబు:
C) సంయుక్త

88. ‘ఆచార్యుని కెదిరింపకు’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) ఆశీరర్ధకం
B) విద్యర్థకం
C) నిషేధార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు:
C) నిషేధార్థకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

89. ‘రాముడు చెట్టు ఎక్కి కాయలు కోశాడు’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) సామాన్య వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) మహావాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

14. ప్రక్రియలను గుర్తించడం:

90. చిరునవ్వు చూసి ఆనందం కలిగింది – గీత గీసిన పదం ఏ ప్రక్రియ?
A) చేదరకం
B) క్వార్థకం
C) శత్రర్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
B) క్వార్థకం

91. ఈ గ్రామానికెందుకు వచ్చానో ఎరుగుదురా? – గీత గీసిన పదం ఏ ప్రక్రియ?
A) ధాత్వార్ధం
B) తద్ధర్మార్థకం
C) ప్రశ్నార్థకం
D) నిశ్చయార్థకం
జవాబు:
C) ప్రశ్నార్థకం

92. ‘వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి’ – గీత గీసిన పదాలు, ఏ రకం అసమాపక క్రియకు చెందును?
A) చేదర్థకం
B) క్వార్ధకం
C) ప్రశ్నార్థకం
D) శత్రర్థకం
జవాబు:
B) క్వార్ధకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష

93. వర్తమానకాల అసమాపక క్రియను ఏమంటారు?
A) చేదర్థకం
B) క్వార్థకం
C) శత్రర్థకం
D) అద్యర్థకం
జవాబు:
C) శత్రర్థకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 10 భూమి పుత్రుడు.

AP State Syllabus 9th Class Telugu Important Questions 10th Lesson బతుకు పుస్తకం

9th Class Telugu 10th Lesson బతుకు పుస్తకం Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది పరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. “తాతగారూ మీరసలు దేవుణ్ణి చూశారా?” అని అడిగిన పసివాడైన మనవణ్ణి కసరకుండా ఎంతో హాయిగా ‘నేను చూడలేదురా? ఉన్నాడో లేడో చెప్పలేను. కష్టాలు పంచుకొనే వాడొకడున్నాడనుకుంటే బావుంటుంది కదా ! అందుకని ప్రార్థిస్తున్నాను.” అన్నారట. అదీ శిశువు ముందు శిరసొర్లే నిరహంకారమంటే !
ప్రశ్నలు:
1. ఇక్కడ సంభాషణ ఎవరి మధ్య జరిగింది?
2. పసివాడు ఏమని అడిగాడు?
3. దేవుణ్ణి ప్రార్థించటం దేనికోసం?
4. “అదీ శిశువు ముందు శిరసొగ్గే నిరహంకారమంటే” దీని భావం ఏమిటి?
జవాబులు:
1. తాత-మనవడు
2. మీరసలు దేవుణ్ణి చూశారా?
3. ఆత్మ సంతృప్తి కోసం
4. సరైన జవాబు ఇవ్వలేకపోతున్నా అని, వినయంగా / నిజాయితీగా చెప్పడం

2. మెల్లీని లక్ష్మణరావుగారు మొదట చూసింది కరుణగల విజ్ఞానిగానే ! మెడిసిన్ చదివే ఆ ఇరవై నాలుగేళ్ళ యువతి పాలమీగడ లాంటి తెల్లని ఫ్రాకులో విందుకు వెళ్తూ దారిలో పెంటబండిని ఈడ్వలేకపోతున్న వృద్ధుని అగచాట్లు చూసి సహించలేక బండిని వెనక నుంచి తోసి సహాయపడి విందుకు ఆ నల్లని మరకలతోనే ఆలస్యంగా వెళ్తూ నిస్సంకోచంగా పాల్గొనడం ఆ దారినే ఆ విందుకే వెళ్ళిన లక్ష్మణరావుగారు చూడడం జరిగింది.
ప్రశ్నలు – జవాబులు:
1. ఇక్కడ మెడిసిన్ చదువుతున్నదెవరు?
జవాబు:
మెల్లీ

2. అగచాట్లు పడుతున్నదెవరు?
జవాబు:
వృద్ధుడు

3. విందుకు ఎవరెవరు వెళ్ళారు?
జవాబు:
మెల్లీ, లక్ష్మణరావు

4. ఇక్కడ ఎవరూ సహజంగా చేయలేని పనులు ఏవి?
జవాబు:
పెంటబండిని తోయడానికి వెళ్ళడం (ఫంక్షన్ కు వెళ్తూ కూడా), మరకలతోనే నిస్సంకోచంగా (బిడియపడకుండా) విందుకెళ్ళడం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

3. బెజవాడ సిమెంట్ కంపెనీ కొత్త మేనేజింగ్ డైరెక్టరు నారాయణ గణపతిరాజు గారొకసారి లక్ష్మణరావుగారు తయారు చేసి తెచ్చిన స్టాకిస్టుల జాబితాలో తనకిష్టులైన వారికి హెచ్చుకోటాలు పడలేదనే కోపంతో కాగితాన్ని కింద పడేస్తే “అయ్యా ! దాన్ని ముందు తీసి బల్లమీద పెడతారా? నన్నిప్పుడే రాజీనామా ఇచ్చి పొమ్మంటారా?” అని అడిగారట.
ప్రశ్నలు:
1. ఈ పేరాలోని వ్యక్తుల పేర్లేమిటి?
2. డైరెక్టరుకు ఎందుకు కోపం వచ్చింది?
3. దానికి రెండవ వ్యక్తి ఏమన్నాడు?
4. ఇక్కడ ఏ కంపెనీ పేరు ఉంది?
జవాబులు:
1. నారాయణ గణపతిరాజు, లక్ష్మణరావు
2. స్టాకిస్టు జాబితాలో తన వారికి హెచ్చుకోటా పడలేదని
3. అయ్యా ! దాన్ని ముందు తీసి బల్ల మీద పెడతారా? నన్నిప్పుడే రాజీనామా ఇచ్చి పొమ్మంటారా?
4. బెజవాడ సిమెంట్,

4. నిరుత్సాహికి ఉత్సాహాన్ని, రికానికి బాధ్యతనీ, అజ్ఞానికైనా జిజ్ఞాసువుకైనా విజ్ఞానాన్ని, తగు మాత్రపు ఆర్ధతనూ, తప్పక అందించగలగాలి పుస్తకం. అమ్మో ! మనకెక్కడ అర్థమవుతుంది అనిపించకుండ ఒక డైరీలా, ఒక నేస్తం రాసిన ఉత్తరంలా సన్నిహితంగా ఉండాలి. నాకోసమే ఇంత శ్రమ పడి ఇంత రాసేడు ఓపిక తెచ్చుకుని అనిపించాలి. తన బాధేదో దాచుకోకుండా చెప్తున్నాడు విందాం! అనిపించేంత నిరహంకారంగా, ఆత్మీయంగా ఉండాలి. చదువుతున్నంత సేపు ఎంత చక్కని విషయాలు తెలుసుకుంటున్నామో అనే హాయి కలగాలి. చదివిన తర్వాత ‘నయం’ ‘ఇన్నాళ్ళకైనా దీన్ని చదవగలిగాను’ అనిపించాలి. విషయం క్లిష్టమైనా వివరణ స్పష్టంగా ఉండాలి.
ప్రశ్నలు – జవాబులు:
1. పుస్తకం ఎలా ఉండాలి?
జవాబు:
ఒక డైరీలా, ఒక నేస్తం రాసిన ఉత్తరంలా

2. పుస్తకం ఏమేమి అందించగలగాలి?
జవాబు:
ఉత్సాహం, బాధ్యత, విజ్ఞానం, అర్ధత అందించాలి.

3. స్పష్టంగా ఉండవలసినదేది?
జవాబు:
వివరణ

4. పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
చదివిన తర్వాత ఏమని అనిపించాలి?

5. శబ్దాలకు అర్థాలను తెలిపే గ్రంథాలను నిఘంటువు అంటారు. అనుశాసనం, అభిధానము, కోశము అనేవి దీనికి పర్యాయపదాలు. వీటిల్లో నిఘంటు పదమే అతి ప్రాచీనంగా కనిపిస్తుంది. ఈ పదాలన్నింటిని ఒకచోట కూర్చి పర్యాయములను చూపి, అర్థములను వివరించేవే గ్రంథాలు. భాషకు నిశ్చయముగాను, లెస్సగాను శబ్ద స్వరూపములను, అర్థ విశేషమును తెలుపునది అని వ్యుత్పత్త్యర్ధము.
ప్రశ్నలు:
1. నిఘంటువు అనగా అర్థం?
2. నిఘంటువుకు ఉన్న పర్యాయపదాలేవి?
3. నిఘంటువుకు ఉన్న వ్యుత్పత్త్యమేమి?
4. ‘గ్రంథాలు’ విడదీయుము.
జవాబులు:
1. శబ్దాలకు అర్థాలను తెలుపు గ్రంథం.
2. అనుశాసనం, అభిధానం, కోశం
3. భాషకు నిశ్చయముగాను, లెస్సగాను శబ్ద స్వరూపములను అర్థ విశేషాలను తెలుపునది.
4. గ్రంథ + ఆలు

6. సంక్రాంతి కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పెద్ద పండుగ. వాస్తవానికి ఇదీ పంటల పండుగ. పల్లెటూళ్ళలో అప్పుడు పంటలు ఇంటికి చేరి, ప్రతి ఇల్లు ధాన్యలక్ష్మితో కళకళలాడుతూ ఉంటుంది. రైతులు ఉత్సాహంగా || ఉంటారు. సంక్రాంతి అంటే సంక్రమణం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడాన్ని సంక్రమణం అంటారు. సంక్రాంతి నుండి సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. కనుకనే ‘మకర సంక్రాంతి’ అని పేరు వచ్చింది. ఆనాటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా రోజూ కొందరు సంకల్పం చెప్పుకుంటారు. ఎండాకాలం సమీపిస్తుందని
సంక్రాంతి హెచ్చరిస్తుంది. అందరూ కొత్త బట్టలు ధరించడం ఒక ఆచారం.
ప్రశ్నలు – జవాబులు:
1. కొత్త సంవత్సరంలో తొలి పెద్ద పండుగ ?
జవాబు:
సంక్రాంతి

2. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడాన్ని ఏమంటారు?
జవాబు:
సంక్రమణం

3. సంక్రాంతి ఏమని హెచ్చరిస్తుంది?
జవాబు:
ఎండాకాలం సమీపిస్తుందని

4. ఈ పండుగ ఏ పుణ్యకాలాన్ని తెలుపుతుంది?
జవాబు:
ఉత్తరాయణ పుణ్యకాలం

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

ఈ కింది సమీక్ష చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. I – 2018-19)

7. వాల్మీకి రామాయణం ప్రాతిపదికగా తెలుగులో ఎన్నో రామాయణాలు వచ్చాయి. ఆ పరంపరలోనిదే టంగుటూరి మహలక్ష్మి రచించిన సుమధుర రామాయణం. పద్నాలుగు వందల తేటగీతులలో తేట తెలుగులో శబ్దశక్తి, అర్థయుక్తితో సరళసుందరంగా ఆవిష్కరించారు. పఠనయోగ్యత, కల్పనాచాతుర్యం ఈ గ్రంథం ప్రత్యేకతలు.
సుమధుర రామాయణం రచన – టంగుటూరి మహలక్ష్మి
పేజీలు – 248, వెల రూ. 180 సమీక్షకులు డా. విద్వత్ శ్రీనిధి.
ప్రశ్నలు:
1. సుమధుర రామాయణాన్ని సమీక్షించింది ఎవరు?
2. రచయిత్రి రామాయణాన్ని ఏ ఛందస్సులో రాశారు?
3. ఈ గ్రంథం ప్రత్యేకత ఏమిటి?
4. పై సమీక్ష ఆధారంగా ఒక ప్రశ్న తయారుచెయ్యండి.
జవాబులు:
1. డా|| విద్వత్ శ్రీనిధి
2. తేటగీతి
3. పఠనయోగ్యత, కల్పనాచాతుర్యం
4. సుమధుర రామాయణంలోని పద్యాల సంఖ్య ఎంత?

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
లక్ష్మణరావుగారు తను రాసిన పుస్తకాన్ని వాళ్ళమ్మగారికి ఇచ్చినపుడు ఆమె చెప్పిన మాటలేమిటి?
జవాబు:
లక్ష్మణరావుగారు తొలుత రాసిన ‘అతడు – ఆమె’ పుస్తకంగా ప్రచురిస్తూ బైండు చేయించడానికి ముందు అచ్చుప్రతిని వాళ్ళమ్మగారికి, పిన్నులకు ఇచ్చారు. అది చదివిన వాళ్ళమ్మగారు మొగుడూ – పెళ్ళాల కీచులాట ఏమీ బాగాలేదు. దేశంలో స్వాతంత్ర్యం యజ్ఞం జరుగుతోంది. ఈ మహా సంగ్రామం పూర్వరంగంగా మలి నవల చిత్రించి ఉంటే బాగుండేది. నవలకు కొంత విలువ ఉండేది. ఇప్పటి రూపంలో నవల అతి సామాన్యంగా ఉంది” అన్నారు.

ప్రశ్న 2.
“సహృదయుడైన రచయిత అంటే లక్ష్మణరావులా ఉండాలి” – దీనిపై మీ అభిప్రాయం.
జవాబు:
నూటికి నూరుపాళ్ళు ఈ మాటతో నేను ఏకీభవిస్తాను. ‘సామాన్యంగా ఉంది నవల’ అని విమర్శించిన తల్లి మాటను గౌరవిస్తూ, ప్రచురణ ఆపు చేయించి, మళ్ళీ కొత్తగా వాళ్ళమ్మ గారి విమర్శను దృష్టిలో ఉంచుకొని అనేక చోట్ల బాగా మార్చి తిరగరాసిన లక్ష్మణరావు నిజంగా సహృదయుడైన రచయిత అని చెప్పవచ్చు.

ప్రశ్న 3.
“అతడు ఆమె”, “బతుకు పుస్తకం” రచనలు సావిత్రిలో ఎలాంటి భావాలు కల్గించాయి?
జవాబు:
సమాజానికి ఉప్పల లక్ష్మణరావుగారి వంటి నిజాయితీ గల సాహితీమూర్తుల ఆవిర్భావం ఒక చారిత్రక అవసరం అనే చెప్పాలి. వారి “అతడు – ఆమె” చదివినప్పుడు దశాబ్దాలుగా నాలో ఉన్న నీరసం పటా పంచలై ఎక్కడాలేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. తనతో సమంగా ప్రతి ఒక్కరూ జీవించాలనే సదాశయం గల వ్యక్తి తప్పించి మరొకరు రాయలేరు ఆ పుస్తకం అన్పించింది. ‘బతుకు పుస్తకం’ నా ఆశ నిజమేనని నిరూపించింది. ‘అతడు – ఆమె’ వంటి పుస్తకం రాయగలిగే అర్హత వారికే ఉన్నదని నిరూపించింది ఈ బతుకు పుస్తకం. అని సావిత్రి తనలోని భావాలు ఇలా పంచుకొంది.

ప్రశ్న 4.
ఉప్పల లక్ష్మణరావు గారి గూర్చి రాయండి.
జవాబు:
రచయితగా ‘అతడు – ఆమె’ నవలతో ప్రసిద్ధులైన ఉప్పల లక్ష్మణరావుగారు 1898 ఆగస్టు 11న బరంపురంలో జన్మించారు. కలకత్తాలో బి.ఎస్.సి. వృక్షశాస్త్రం చదివి, పై చదువుల కోసం ఎడిన్‌బరోకు, జర్మనీకి వెళ్ళి వృక్షశాస్త్ర పరిశోధనలో డాక్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసారు. కాకినాడ కళాశాలలో, ఆలీఘడ్ యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేసారు. “ప్రాచీన భారతంలో బానిసలు” అనే రచనను జర్మనీ నుండి తెలుగులోకి అనువదించారు. ‘అతడు – ఆమె’ నవలతో ప్రసిద్ధులయ్యారు. ‘బతుకు పుస్తకం’ వీరి ఆత్మకథ. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా వెలువడినప్పుడే ఇది ఎందరినో ఆకర్షించింది. రాసిన రెండు పుస్తకాలతోనే సాహిత్యంలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. సాంఘిక, రాజకీయ, విద్యా, పారిశ్రామిక రంగాలలోనూ సేవ చేసారు.

ప్రశ్న 5.
‘పుస్తక పరిచయం’ ప్రక్రియ గూర్చి రాయండి. ఈ (S.A.II 2018-19)
జవాబు:
ఏదైనా ఒక పుస్తకాన్ని సమగ్రంగా చదివి అందులోని విషయాల్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తూ, గుణదోషాల్ని తెలియజేయడమే పుస్తక పరిచయం. ఇది చదవగానే ఆ పుస్తకం మీద ప్రాథమిక అవగాహన, చదవాలనే ఆసక్తి కల్గుతాయి. దీనికే ముందుమాట, పీఠిక, తొలిపలుకు, మున్నుడి, అవతారిక అను నామాంతరాలు.

III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1: పర్యాయపదాలు :

కరుణ : దయ, జాలి
నిదర్శనం : దృష్టాంతం, ఉదాహరణ
ఏకీభవించు : ఒక్కటియగు, కలిసిపోవు
సన్నిహితం : చేరువ, సమీపం
స్వస్తిచెప్పు : చాలించు, ముగించు
ఇల్లాలు : భార్య, అర్ధాంగి
నేస్తం : స్నేహితుడు, మిత్రుడు
అబ్దం : సంవత్సరం, ఏడాది
దాస్యం : సేవ, బానిసం
యజ్ఞం : యాగం, హోమం
సౌజన్యం : సుజనత్వం, మంచితనం
జైలు : చెరసాల, కారాగారం

2. నానార్థాలు :

ఆశ్రమం : పర్ణశాల, మునిపల్లె, మఠం, గుడిసె
విమర్శ : పరామర్శ, తిట్టు
వృద్ధుడు : ముసలివాడు, తెలిసినవాడు
అర్థం : శబ్దార్థం, కారణం, ధనం
స్వస్తి : శుభం, ముగింపు
అబ్దం : సంవత్సరం, అద్దం, మేఘం

3. ప్రకృతి – వికృతులు :

పుస్తకం – పొత్తం
స్త్రీ – ఇంతి
ఉత్తరం – ఉత్తరువు (జవాబు)
శ్రమ – చెమట, సొమ్ము
యజ్ఞం – జన్నం
సౌందర్యం – చందు
స్నేహం – నేస్తం, నెయ్యం
విజ్ఞానం – విన్నాణం
ప్రజా – పజ
మూర్ఖ – మంకు
అమావాస్య – అమవస, అమాస
రాత్రి – రాతిరి, రేయి, రేతిరి
ఆశ – ఆస

4. సంధులు :

సత్ + ఆశయం = సదాశయం – జత్త్వసంధి
దశ + అబాలు = దశాబ్దాలు – సవర్ణదీర్ఘ సంధి
స్వాతంత్ర్య + ఉద్యమం = స్వాతంత్ర్యోద్యమం – గుణసంధి
నిః + అహంకారం = నిరహంకారం – విసర్జరేఫాదేశ సంధి
అభి + అంతరం = అభ్యంతరం – యణాదేశ సంధి
అతి + అంత = అత్యంత – యణాదేశ సంధి
అభి + ఉదయం = అభ్యుదయం – యణాదేశ సంధి
ని + సంకోచం = నిస్సంకోచం – విసర్గసంధి
నిః + శబ్దం = నిశ్శబ్దం – విసర్గ సంధి
శత + అబ్దం = శతాబ్దం – సవర్ణదీర్ఘ సంధి
శ్రమము + పడి = శ్రమపడి – పడ్వాదిసంధి
దుసు + సాహసం = దుస్సాహసం – విసర్గ సంధి
ఇష్టులు + ఐన = ఇష్టులైన – ఉత్వసంధి
శిరసు + ఒగై = శిరసొగ్గా – ఉత్వసంధి
సు + అస్తి = స్వస్తి – యణాదేశ సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

5. సమాసాలు :

దశాబ్దం = దశ సంఖ్య గల అబ్దం – ద్విగు సమాసం
శతాబ్దం = శత సంఖ్య గల అబ్దం – ద్విగు సమాసం
సదాశయం = మంచిదైన ఆశయం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
దాస్య శృంఖాలు = దాస్యమనెడి శృంఖలాలు – రూపక సమాసం
మహాగ్రంథం = గొప్పదైన గ్రంథం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
రెండురోజులు = రెండు సంఖ్య గల రోజులు – ద్విగు సమాసం
మెగుడు పెళ్ళాలు = మెగుడు మరియు పెళ్ళాము – ద్వంద్వ సమాసం
ప్రతిరోజు = రోజూ, రోజూ – అవ్యయీభావ సమాసం
స్త్రీల అభ్యుదయం = స్త్రీల యొక్క అభ్యుదయం – షష్ఠీ తత్పురుష సమాసం
వృద్ధుని అగచాట్లు = వృద్ధుని యొక్క అగచాట్లు – షష్ఠీ తత్పురుష సమాసం
సబర్మతి ఆశ్రమం = సబర్మతి అను పేరుగల ఆశ్రమం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
దేశచరిత్ర = దేశము యొక్క చరిత్ర – షష్ఠీ తత్పురుష సమాసం

9th Class Telugu 10th Lesson బతుకు పుస్తకం 1 Mark Bits

1. రమేశ్ నిన్న చదివాడు (వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) రమేశ్ రేపు చదవడు
బి) రమేశ్ నిన్నట్నుంచీ చదువుతున్నాడు
సి) రమేశ్ నిన్న చదవలేదు.
డి) రమేశ్ నేడు చదవలేదు.
జవాబు:
సి) రమేశ్ నిన్న చదవలేదు.

2. రాము ఎక్కడ ఉన్నాడు ? (ఇది ఏ రకమైన వాక్యం) (S.A.I-2018-19)
ఎ) హేత్వర్థక వాక్యం
బి) చేదర్థక వాక్యం
సి) ఆశ్చర్యార్థక వాక్యం
డి) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
డి) ప్రశ్నార్థక వాక్యం

3. కింది వానిలో ప్రశ్నార్థకం గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) మోహన్ వస్తాడా?
బి) మోహన్ వస్తాడో ! రాడో !
సి) మోహన్ రావచ్చు.
డి) మోహన్ రావద్దు.
జవాబు:
ఎ) మోహన్ వస్తాడా?

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

4. ఆమె రాత్రి వేళ గేటు దూకి, గస్తీ కాసింది. (ఈ సంక్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా మార్చినది గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) ఆమె రాత్రి వేళ గేటు దూకి, గస్తీ కాయలేదు.
బి) ఆమె రాత్రి వేళ గేటు దూకలేదు, గస్తీ కాయలేదు.
సి) ఆమె రాత్రి వేళ గేటు దూకినా, గస్తీ కాయలేదు.
డి) ఆమె రాత్రి వేళ గేటు దూకింది, ఆమె రాత్రి వేళ గస్తీ కాసింది.
జవాబు:
డి) ఆమె రాత్రి వేళ గేటు దూకింది, ఆమె రాత్రి వేళ గస్తీ కాసింది.

భాషాంశాలు (పదజాలం , వ్యాకరణం)

1. అర్థాలు :

5. మహాత్ముల ఆవిర్భావం సమాజ శ్రేయస్సు కొరకు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కలయిక
B) పుట్టుక
C) నడక
D) ప్రయాణం
జవాబు:
B) పుట్టుక

6. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) స్త్రీ
B) మహిళ
C) భార్య
D) యువతి
జవాబు:
C) భార్య

7. నాకు డైరీ రాసే అలవాటు ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) పుస్తకం
B) పేపరు
C) రోజు
D) దినచర్య
జవాబు:
D) దినచర్య

8. అనాలోచితమైన పనులు అగచాట్లు పాలు చేస్తాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఆపదలు
B) ఆకలి
C) ఆనందం
D) కోపం
జవాబు:
A) ఆపదలు

9. దేశ సరిహద్దుల్లో సిపాయిలు ప్రాణాలు పణంగా పెట్టి గస్తీ తిరుగుతారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కాలక్షేపం
B) కాపలా
C) కులాసా
D) నిర్లక్ష్యం
జవాబు:
B) కాపలా

10. పుస్తకం, నిరుత్సాహికి ఉత్సాహాన్ని, రికామికి బాధ్యతనీ అందించగలగాలి – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) చురుకైన
B) పనిలేనివాడు
C) తెలివైనవాడు
D) అజ్ఞాని
జవాబు:
B) పనిలేనివాడు

11. నాలో పేరుకుపోయిన నీరసం పటాపంచలై పోయింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఎక్కువ
B) తక్కువ
C) చెల్లాచెదురు
D) ముక్కముక్కలు
జవాబు:
C) చెల్లాచెదురు

12. లక్ష్మణరావు గారు బోటనీ పరిశోధనలకు స్వస్తి చెప్పారు – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) మంగళము
B) శుభము
C) ముగింపు
D) కొనసాగించు
జవాబు:
C) ముగింపు

2. పర్యాయపదాలు :

13. చదువును యజ్ఞంలా భావించాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఆగం, యాగం
B) హోమం, యాగం
C) హోమం, హూనం
D) యూపం, పాపం
జవాబు:
B) హోమం, యాగం

14. భరతమాత దాస్య శృంఖలాలు మహాత్ముల త్యాగాలతో తొలగాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ధనిక, పేద
B) పరిచర్య, పని
C) సేవ, బానిసత్వం
D) సాయం, పని
జవాబు:
C) సేవ, బానిసత్వం

15. చెడు అలవాట్లకు స్వస్తి పలకాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ముగింపు, చాలించు
B) ఆపు, మొదలు
C) తొలి, మలి
D) శుభం, జైహింద్
జవాబు:
A) ముగింపు, చాలించు

16. మా ఊరిలో నేను మిత్రుల సౌజన్యంతో కిరాణాషాపు పెట్టాను – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) స్నేహం, మిత్రుడు
B) చుట్టం, బంధువు
C) మంచి, చెడు
D) మంచితనం, సుజనత్వం
జవాబు:
D) మంచితనం, సుజనత్వం

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

17. దేశద్రోహులను పట్టి, జైలులో బంధించాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఇల్లు, నివాసం
B) చెరసాల, కారాగారం
C) బందిఖానా, గృహం
D) నిలయం, ఆవాసం
జవాబు:
B) చెరసాల, కారాగారం

14. భగవంతుని సృష్టి గొప్పదని చెప్పడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) కారణం, హేతువు
B) లక్ష్యం, గమ్యం
C) దృష్టాంతం, ఉదాహరణ
D) ఋజువు, మూలం
జవాబు:
C) దృష్టాంతం, ఉదాహరణ

18. మెల్లీ స్విట్జర్లాండు మహిళ. ఈమె లక్ష్మణరావు గారి ఇల్లాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) స్త్రీ, యువతి
B) నారి, వనిత
C) పడతి, ఇల్లాలు
D) ఉవిద, విజ్ఞాని
జవాబు:
B) నారి, వనిత

19. లక్ష్మణరావుగారి తల్లి మంచి విమర్శకురాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) అమ్మ, మాత
B) జనని, తండ్రి
C) మహిళ, యువతి
D) జనయిత్రి, స్త్రీ
జవాబు:
A) అమ్మ, మాత

20. పుస్తకం జిజ్ఞాసువుకు విజ్ఞానాన్ని అందివ్వాలి – గీత గీసిన పదానికి సమానార్థక పదం ఏది?
A) జ్ఞాని
B) విజ్ఞాని
C) తెలిసికోగోరువాడు
D) అజ్ఞాని
జవాబు:
C) తెలిసికోగోరువాడు

3. నానార్థాలు :

21. పూర్వం మునులు ఆశ్రమ ధర్మాలు పాటించి, ధర్మాన్ని నిలిపారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పర్ణశాల, మఠం
B) గుడిసె, పూరిల్లు
C) మదం, ముదం
D) కుటీరం, ఇల్లు
జవాబు:
A) పర్ణశాల, మఠం

22. బాధ్యతగా పని చేసేటప్పుడు విమర్శలు సహజం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) తిట్టు, పొగడ్త
B) పరామర్శ, తిట్టు
C) పరామర్శ, విసుగు
D) దూషణ, భీషణ
జవాబు:
B) పరామర్శ, తిట్టు

23. వయసు పెరిగినవాడు వృద్ధుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ముదుసలి, తాత
B) పెద్ద, చిన్న
C) ముసలివాడు, తెలిసినవాడు
D) తెలిసినవాడు, కుర్రాడు
జవాబు:
C) ముసలివాడు, తెలిసినవాడు

24. పరీక్షల సమయంలో ఆటలకు స్వస్తి పలకాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ప్రారంభం, ముగింపు
B) మొదలు, చివర
C) శుభం, అశుభం
D) శుభం, ముగింపు
జవాబు:
D) శుభం, ముగింపు

25. మనం మాట్లాడే మాటకు అర్థం ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ధనం, సంపద
B) శబ్దార్ధం, కారణము
C) కారణం, హేతువు
D) శబ్దార్ధం, భావం
జవాబు:
B) శబ్దార్ధం, కారణము

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

26. నారీమణులను విస్మరించకూడదు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పట్టణం, ఇల్లు
B) స్త్రీ, వింటి త్రాడు
C) స్వేచ్ఛ, భిన్నం
D) కలశం, కమలం
జవాబు:
B) స్త్రీ, వింటి త్రాడు

4. ప్రకృతి – వికృతులు :

27. ఆశ్వియుజ అమావాస్య నాడు దీపావళి పండుగ – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ఆమాసా
B) అమావాస
C) అమవస
D) అవమస
జవాబు:
C) అమవస

28. శ్రమను నమ్మి బ్రతికేవారు శ్రామికులు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) సొమ్మ
B) శమ
C) సమ
D) ప్రేమ
జవాబు:
A) సొమ్మ

29. మూర్ఖుల మనసును రంజింపలేము – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) మూడుడు
B) మంకు
C) మూర్కు
D) మెట్ట
జవాబు:
B) మంకు

30. పుస్తకం హస్త భూషణం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) పుసకం
B) పుసతకం
C) పుస్కం
D) పొత్తం
జవాబు:
D) పొత్తం

31. యజ్ఞ యాగాదులు దేవతల ప్రీతికై చేస్తారు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) జతనం
B) జన్నం
C) మగ్గం
D) యెగ్గం
జవాబు:
B) జన్నం

32. ఇంతుల అందాలు మేలు బంతులు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) స్త్రీ
B) యువతి
C) కన్య
D) మహిళ
జవాబు:
A) స్త్రీ

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

33. దాస్య శృంఖలములను ట్రెంచడానికి స్వాతంత్ర్యోద్యమం సాగింది – గీత గీసిన పదానికి వికృతి ఏది?
A) సంకెల
B) సంఖల
C) జంకులు
D) గొలుసు
జవాబు:
A) సంకెల

5. సంధులు :

34. సదాశయాలతో నాయకులు దేశాన్ని ముందుకు నడిపించాలి – గీత గీసిన పదాన్ని విడదీయుము.
A) సద + ఆశయం
B) సత్ + ఆశయం
C) సదా + అశయం
D) సత్ + ఆశయం
జవాబు:
B) సత్ + ఆశయం

35. ‘నిః + అహంకారం’ – పదాన్ని కలపండి.
A) నిహహంకారం
B) ని అహంకారం
C) నిరహంకారం
D) నీ అహంకారం
జవాబు:
C) నిరహంకారం

36. ‘అత్యంత’ – సంధి పేరేమిటి?
A) యణాదేశ సంధి
B) యడాగమ సంధి
C) గుణసంధి
D) త్రికసంధి
జవాబు:
A) యణాదేశ సంధి

37. ‘నిశ్శబ్దం’ – పదాన్ని విడదీయండి.
A) నిర్ + శబ్దం
B) ని + శబ్దం
C) అన్ + శబ్దం
D) నిః + శబ్దం
జవాబు:
D) నిః + శబ్దం

38. ‘స్వస్తి’ – పదాన్ని విడదీయండి.
A) స్వ + అస్తి
B) సు + అస్తి
C) సస్ + అస్తి
D) స్వస్ + అస్తి
జవాబు:
B) సు + అస్తి

39. శ్రమము + పడి – సంధి పేరేమిటి?
A) పుంప్వాదేశ సంధి
B) ఆమేడిత సంధి
C) పడ్వాది సంధి
D) ప్రాతాదిసంధి
జవాబు:
C) పడ్వాది సంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

40. ‘దుష్టులైన’ – సంధి పేరేమిటి?
A) ఉత్వసంధి
B) ఇత్వసంధి
C) అత్వసంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) ఉత్వసంధి

41. ‘శతాబ్దం’ – విడదీసి రాయండి.
A) శత్ + అబ్దం
B) శత + బ్దం
C) శః + అబ్దం
D) శత + అబ్దం
జవాబు:
D) శత + అబ్దం

42. మెల్లి స్విట్జర్లాండు దేశస్థురాలు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
A) దేశస్థు + రాదు
B) దేశస్థ + రాలు
C) దేశస్థ + ఆలు
D) దేశస్థు + ఆలు
జవాబు:
A) దేశస్థు + రాదు

43. ‘దేశపు దాస్యము’ లో గల సంధి ఏది?
A) రుగాగమ సంధి
B) పుంప్వాదేశ సంధి
C) టుగాగమ సంధి
D) ఇత్వ సంధి
జవాబు:
B) పుంప్వాదేశ సంధి

44. ‘దుడుకు + దుడుకు’ – సంధి కలిపిన పదాన్ని గుర్తించండి.
A) దుడుకుదుడుకు
B) దుందుడుకు
C) తుందుడుకు
D) దుడుస్టుడుకు
జవాబు:
B) దుందుడుకు

45. ‘అభ్యుదయము’ సంధి పదాన్ని విడదీయండి.
A) అభ్యు + దయము
B) అభి + యుదయము
C) అభి + ఉదయము
D) అభ్యుద + యము
జవాబు:
C) అభి + ఉదయము

6. సమాసాలు :

46. దశాబ్దాల నుండి పేదవాడు పేదవానిగానే ఉన్నాడు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
A) దశమైన అబ్దం
B) దశ సంఖ్యగల అబ్దం
C) దశమనెడి అబ్దం
D) దశము, అర్ధము
జవాబు:
B) దశ సంఖ్యగల అబ్దం

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

47. ‘దాస్య శృంఖలాలు’ – విగ్రహవాక్యంలోని పదాన్ని గుర్తించండి.
A) యొక్క
B) కొఱకు
C) అనెడి
D) వలన
జవాబు:
C) అనెడి

48. ‘రోజూ, రోజూ’ సమాస పదం గుర్తించండి.
A) ప్రతిరోజు
B) రోరోజూ
C) రోజూ రోజూ
D) అన్ని రోజు
జవాబు:
A) ప్రతిరోజు

49. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ గుర్తించండి.
A) మహాగ్రంథం
B) సదాశయం
C) శతాబ్దం
D) సబర్మతి ఆశ్రమం
జవాబు:
D) సబర్మతి ఆశ్రమం

50. ‘మొగుడు పెళ్ళాలు’ – సమాసం పేరేమిటి?
A) ద్విగు
B) ద్వంద్వం
C) రూపకం
D) బహువ్రీహి
జవాబు:
B) ద్వంద్వం

51. ‘స్త్రీల అభ్యుదయం’ – విగ్రహవాక్యంలోని విభక్తిని గుర్తించండి.
A) గూర్చి
B) వలన
C) యొక్క
D) అందు
జవాబు:
C) యొక్క

52. “దాస్యమనెడి శృంఖలాలు’ – సమాస పదంగా కూర్చండి.
A) దాస్య శృంఖలాలు
B) దాస్యం శృంఖలాలు
C) దాస్యపు శృంఖలాలు
D) శృంఖలా దాస్యం
జవాబు:
A) దాస్య శృంఖలాలు

53. ‘స్వాతంత్ర్య యజ్ఞము’ – దీని విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
A) స్వాతంత్ర్యము కొఱకు యజ్ఞము
B) స్వాతంత్ర్యము యొక్క యజ్ఞము
C) స్వాతంత్ర్యమనే యజ్ఞము
D) స్వాతంత్ర్యమును, యజ్ఞమును
జవాబు:
C) స్వాతంత్ర్యమనే యజ్ఞము

54. ‘స్త్రీల పత్రికలు’ – ఇది ఏ సమాసమో గుర్తించండి.
A) తృతీయా తత్పురుష
B) బహు బీహి
C) ద్వంద్వ
D) చతుర్థి తత్పురుషము
జవాబు:
D) చతుర్థి తత్పురుషము

7. గణాలు :

55. మ, స, జ, స, త, త, గ గణాలు గల వృత్తము ఏది?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) శార్దూలము
D) తేటగీతి
జవాబు:
C) శార్దూలము

56. ఉపమానోపమేయములకు భేదం లేనట్లు చెప్పే అలంకారము ఏది?
A) ఉపమా
B) రూపకము
C) ఉత్ప్రేక్ష
D) శ్లేష
జవాబు:
B) రూపకము

8. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

57. ‘ఈతరాని కప్ప యే దేశమందైన నుండునా ?’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ఈతరాని కప్ప ఏ దేశంలోనూ ఉండదు
B) ఈతరాని కప్ప ఎక్కడేనా ఉంటుందా?
C) ఈతరాని కప్ప ఏ దేశము నందూ ఉండదు
D) ఈతరాని కప్ప ఎక్కడా ఉండదు కదా !
జవాబు:
B) ఈతరాని కప్ప ఎక్కడేనా ఉంటుందా?

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

58. ‘ఏమి గతిందలంచినం పగకు మేలిమి లేమి ధ్రువంబు’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ఏ విధంగా తలచినా పగ మంచిది కాదు
B) ఏ విధంగా చూసినా పగ నిశ్చయంగా మంచిది
C) ఏమి గతిని చూచినా నిశ్చితంగా శత్రుత్వము మంచిది కాదు
D) ఏమి గతి తలచినా ధ్రువముగా పగ మంచి కాదు
జవాబు:
B) ఏ విధంగా చూసినా పగ నిశ్చయంగా మంచిది

9. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం:

59. లక్ష్మణరావు బతుకు పుస్తకం రాసారు – కర్మణి వాక్యం గుర్తించండి.
A) లక్ష్మణరావుచే బతుకు పుస్తకం రాయబడింది
B) లక్ష్మణరావుచే రాయబడింది
C) లక్ష్మణరావు బతుకు పుస్తకం రాస్తారు
D) లక్ష్మణరావు బతుకు పుస్తకం రాస్తున్నారు
జవాబు:
A) లక్ష్మణరావుచే బతుకు పుస్తకం రాయబడింది

60. మెల్లీ లక్ష్మణరావుచే చూడబడింది – కర్తరి వాక్యం?
A) మెల్లీ లక్ష్మణరావును చూసింది.
B) లక్ష్మణరావును చూసింది మెల్లీ.
C) మెల్లీని లక్ష్మణరావు చూశారు కాదు
D) లక్ష్మణరావుచే మెల్లీ చూడబడింది
జవాబు:
A) మెల్లీ లక్ష్మణరావును చూసింది.

61. ‘రమేష్ భారతాన్ని చదివాడు’ – ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) రమేష్ చే భారతం చదవబడింది
B) రమేష్ చే భారతాన్ని చదువుతాడు
C) రమేష్ భారతాన్ని చదువుతాడు
D) రమేష్ భారతం చదువగలడు
జవాబు:
A) రమేష్ చే భారతం చదవబడింది

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

62. ‘వారిచే విషయం గమనింపబడుతుంది’ – ఈ వాక్యానికి కర్తరి వాక్యాన్ని గుర్తించండి.
A) వారు విషయం గమనిస్తారు
B) వారు విషయాన్ని గమనిస్తారు
C) వారివల్ల విషయము గమనింపబడుతుంది
D) వారు తప్పక విషయం చూస్తారు
జవాబు:
B) వారు విషయాన్ని గమనిస్తారు

3. ప్రత్యక్ష, పరోక్ష కథనాలను గుర్తించడం :

63. ‘ఇది అంతర్జాతీయ సమస్య అవుతుంది’ అని మెల్లీ బెదిరించింది – ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) ఇది అంతర్జాతీయ సమస్య అవుతుందని మెల్లీ బెదిరించింది
B) అది అంతర్జాతీయ సమస్య కాగలదు
C) అది అంతర్జాతీయ సమస్య అవుతుందని మెల్లీ బెదిరించింది
D) అది అంతర్జాతీయ సమస్య అని మెల్లీ చెప్పింది
జవాబు:
C) అది అంతర్జాతీయ సమస్య అవుతుందని మెల్లీ బెదిరించింది

4. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

64. ఆయన ఆవేదన పడలేదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) ఆవేదన పడ్డారు
B) ఆయన పడ్డారు
C) ఆయన ఆవేదన పడ్డారు
D) పడిరి
జవాబు:
C) ఆయన ఆవేదన పడ్డారు

65. ఆమె బెదిరించింది – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) బెదిరించలేదు
B) ఆమె బెదిరించలేదు
C) అతణ్ణి బెదిరంచలేదు
D) లేదు
జవాబు:
B) ఆమె బెదిరించలేదు

66. మనశ్శాంతి కలిగించాలి – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) మనశ్శాంతి కలిగించకూడదు
B) మనశ్శాంతి లేదు
C) మనశాంతి రాదు
D) కల్గించకూడదు
జవాబు:
A) మనశ్శాంతి కలిగించకూడదు

AP Board 9th Class Telugu Important Questions Chapter 10 బతుకు పుస్తకం

67. ‘ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడలేదు’ – దీని వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి.
A) ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడింది
B) ఒక్క పలుకే ఆయన నోటి నుండి వెలువరించాడు
C) ఒక్క పలుకు ఆయన నోట వచ్చింది
D) ఒక్క పలుకు ఆయన వెలువరించాడు
జవాబు:
A) ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడింది

5. వాక్య రకాలను గుర్తించడం :

68. ‘మానసికంగా ఎదిగినట్లైతే’ విజయం కల్గుతుంది – గీత గీసిన వాక్యం ఏ రకమైన వాక్యం?
A) క్వార్థకము
B) శత్రర్థకము
C) చేదర్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
C) చేదర్థకం

69. ‘అతడి దైన్య స్థితిని చూశారా?’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) ఆశీరర్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశ్నార్థకం
D) విధ్యర్థకం
జవాబు:
C) ప్రశ్నార్థకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు.

AP State Syllabus 9th Class Telugu Important Questions 9th Lesson భూమి పుత్రుడు

9th Class Telugu 9th Lesson భూమి పుత్రుడు Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ.
ప్రశ్నలు – జవాబులు:
1. శత్రువు ఎవరు?
జవాబు:
కోపం

2. ఏది రక్ష?
జవాబు:
శాంతం

3. దయ ఎలాంటిది?
జవాబు:
చుట్టము

4. స్వర్గ నరకాలు అంటే ఏవి?
జవాబు:
సంతోషం, దుఃఖం

2. లావు గల వాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంటును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ.
ప్రశ్నలు – జవాబులు:
1. బలవంతుడు ఎవరు?
జవాబు:
నీతిపరుడు

2. ఏనుగు నడిపేవాడు?
జవాబు:
మావటివాడు

3. సుమతీ శతక కర్త?
జవాబు:
బద్దెన

4. ‘గ్రావం’ అర్థం?
జవాబు:
కొండరాయి

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

3. ఈ కింది సమీక్షనుచదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2017-18)

మిద్దెతోటల పెంపకం ఇలా

మిద్దెతోటల పెంపకం సాగులో సేంద్రియ పద్ధతుల్ని ప్రోత్సహిస్తున్న రైతు నేస్తం ఫౌండేషన్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని మిద్దెతోట సాగుచేస్తున్న తుమ్మేటి రఘోత్తమరెడ్డి తమ అనుభవాన్ని రంగరించి రాశారు. దీనిలో మిద్దెతోటల పెంపకం గురించి సూచనలిచ్చారు. అటువంటి రైతులకు మంచిసూచనలిచ్చారు. మిద్దెతోట పుస్తకం వెల రూ. 349/-
ప్రశ్నలు:
1. ‘మిద్దెతోట’ అనేది ఏమిటి ?
2. ‘మిద్దెతోట’ను ఎవరు ప్రచురించారు?
3. ‘మిద్దెతోట’ ఖరీదెంత?
4. పై సమీక్ష వలన ఎవరికి ప్రయోజనం?
జవాబులు:
1. భవనం పైన గల ఖాళీస్థలంలో ఏర్పాటు చేసుకున్న కుండీల మొదలైన వాటిలో చేసే మినీ వ్యవసాయం.
2. రైతు నేస్తం ఫౌండేషన్
3. రూ. 349/
4. మిద్దెతోట రైతులకు.

II. స్వీయరచన

క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
తన కష్టంతో లోకానికి భుక్తిని పంచే భూమి పుత్రుని గూర్చి విశదపరచిన కవిని గూర్చి రాయండి. (S.A. II – 2017-18)
(లేదా)
అన్నదాతయైన భూమి పుత్రుడు’ ఔన్నత్యాన్ని అభివర్ణించిన కవిని పరిచయం చేయండి. (S.A. II – 2015-16)
జవాబు:
కవి : శ్రీ దువ్వూరి రామిరెడ్డి
కాలం : 9. 11. 1895 నుండి 11.9.1947
జన్మస్థలం : నెల్లూరు
రచనలు : నలజారమ్మ, వనకుమారి, కృషీవలుడు, జలదాంగన, యువక స్వప్నం, కడపటి వీడ్కోలు, పానశాల, నక్షత్రశాల, నైవేద్యం, భగ్న హృదయం, పరిశిష్టం, ప్రథమ కవిత్వం.
బిరుదు : కవికోకిల
శైలి : సరళ సుందరంగా ఉంటుంది. విశ్వశాంతి, దేశభక్తి, మానవతావాదం, అభ్యుదయం వీరి రచనల్లో కనిపిస్తాయి.

ప్రశ్న 2.
రైతుతో ఎవరెవరు సాటిరారని కవి అన్నారు?
జవాబు:
రైతును తమ్ముడా ! అని సంబోధిస్తూ, లోకంలో కొందరు చిత్రంగా ఉంటారు. వీరిలో కొందరు చిన్నతాడు కట్టిన చిన్న చెంబుతో నేల నూతిలో నీళ్ళు తోడేవారు (ఉపయోగం లేని పని), కొందరు తలకు, మోకాలకీ ముడి పెట్టేవారు (సందర్భ శుద్దిలేని పని), ఇంకొందరు చిటికెలతో పందిళ్ళు అల్లేవారు (కబుర్లే పని), అంటే వీళ్ళంతా కేవలం మాటల చమత్కారంతో అరచేతిలో స్వర్గం చూపించేవారు. కానీ చేతులతో సమాజ సేవ చేస్తున్న నీకు వీరెవ్వరూ సాటిరారని కవి అన్నారు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 3.
రైతుకు ఏవి కొరత?
జవాబు:
సమాజం సుఖసంతోషాలతో ఉండటానికి రైతే కారణం. కానీ అతని కష్ట ఫలితాన్ని ఇతరులు అనుభవించి సుఖపడతున్నారు. రైతు క్షేమాన్ని, శ్రేయస్సును కోరేవారు ఎవరూ లేరు. కనీసం కన్నెత్తి అయిన చూడరు. ఆప్యాయంగా పలకరించరు. చివరకు తిండికీ, బట్టకు ఎప్పుడూ కొరతే.

ప్రశ్న 4.
“అట్టి కృతఘలన్………… పద్యం ద్వారా రైతు ఎలాంటి వాడని అర్థమైంది?
జవాబు:
చేసిన మేలు మరచేవారిని రైతు అసలు పట్టించుకోడని ఈ పద్యం ద్వారా అర్థమైంది. మరియు పొలం పనులలో అతని శరీరం ఎముకలగూడుగా మారినా, వానలు ముంచెత్తినా, కరవు పీడించినా వాటిని లెక్కచేయడని తెలిసింది. ఇంకా కాయకష్టాన్నే నమ్మి, స్వార్జితమైన పట్టెడన్నమే తిని రైతు నిజంగా ‘భూమి పుత్రుడె’ అని గ్రహించాను.

ప్రశ్న 5.
‘భూమి పుత్రుడు’ ప్రక్రియను గూర్చి రాయండి.
జవాబు:
‘భూమి పుత్రుడు’ పాఠ్యభాగం ‘కావ్యం’ ప్రక్రియకు చెందినది. కవి యొక్క కర్మము – కావ్యము. దీనిలో వర్ణనయే ప్రధానాంశముగా కల్గి, మనసుకు హత్తుకునేలా రచన సాగుతుంది.

ఈ క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
రైతును ఆదర్శంగా తీసుకొని ప్రజలు జీవించడం అవసరం ఎంతైనా ఉంది. దీనిని నీవు సమర్థిస్తావా ? వివరించండి.
జవాబు:
‘రైతే దేశానికి వెన్నెముక’, ‘పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు’ – అన్న మాటలు అందరూ అనే మాటలు, వినే మాటలు. రైతు, పల్లెలోని గొప్పదనాన్ని మాటల్లో చెప్పడం తప్ప ఎవరూ వారికి సాయం చేతల్లో చూపించరు. పల్లె సౌందర్యాన్ని ఆస్వాదిస్తామేగాని, అక్కడి ప్రజల బాగోగులు చూడము. పల్లె ప్రజల్లో ఇచ్చి పుచ్చుకొనే తత్వం ఉంటుంది. ఒకరికొకరు పనులలో సాయం అంది పుచ్చుకుంటారు. రైతును ఆదర్శంగా తీసుకోవడం అంటే భేషజం లేని జీవితం గడపటమే. ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండడం రైతు జీవితం. నలుగురి క్షేమం కోరేవాడు. ఈ లోకంలో రైతు తప్ప ఇంకెవరుంటారు. మనం రైతులాగా నిస్వార్థంగా, తృప్తిగా జీవించగలిగితే మనమున్న చోటే స్వర్గం అవుతుంది.

రైతు తాను పండించిన పంటను గిట్టుబాటు ధర రాకపోయినా తృప్తిపడి, మరుసటి సంవత్సరం పంట ఇంకా బాగా మొదలుకొని, చిరవకు పంట చేతికి వచ్చే దాకా పండించాలని తాపత్రయపడతాడు. పంట వేయడానికి ముందు పొలం దున్నటం రైతు గుండె ఎంతగా అల్లాడుతుందో ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా. పంట పదును మీదున్నప్పుడు వానో, వరదో వస్తుందనే ఊహే ప్రాణాన్ని విలవిలలాడిస్తుంది. అయినా వీటన్నింటిని భరించి, తోటివాళ్ళమైన మనందరి ఆకలి తీర్చే రైతు మనందరికి భగవంతుడు ఇచ్చిన సోదరుడు.

మనం గుర్తించినా, గుర్తించకపోయినా తన సంసారాన్ని ఒక ప్రక్క వ్యవసాయాన్ని ఒక ప్రక్క నడుపుతూ , సమాజాన్ని నడిపిస్తున్నాడు. నిస్వార్థం అతని మనసు, సంతృప్తి అతని ఆలోచన, అందరూ బాగుండాలి అనేది అతని ఆకాంక్ష. మనం గమనిస్తే ఏదైనా సమస్య వచ్చినపుడు పెద్దల సమక్షంలో చర్చకు వస్తే అప్పుడు మధ్యమ మార్గంగా తీర్పు చెప్పడానికి “రైతు పద్ధతిలో మాట్లాడుకుందాం” అంటారు. దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు రైతు ఎంత గొప్ప వ్యక్తో.

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

ప్రశ్న 2.
రైతు దేశానికి వెన్నెముక అంటారు కదా! అంతటి ప్రాధాన్యత వహించిన భూమి పుత్రుడుని గురించి దువ్వూరి రామిరెడ్డి గారెలా ఆవిష్కరించారో మీ స్వంత మాటల్లో రాయండి. (S.A. II – 2018-19)
జవాబు:
రైతు దేశానికి వెన్నెముక. నలుగురి క్షేమం కోరేవాడు. ఈ లోకంలో రైతు తప్ప ఇంకెవరుంటారు. మనం రైతులాగా నిస్వార్థంగా, తృప్తిగా జీవించగలిగితే మనమున్నచోటే స్వర్గం అవుతుంది. రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా తృప్తిపడి, మరుసటి సంవత్సరం పంట ఇంకా బాగా పండించాలని తాపత్రయ పడతాడు. పంట వేయడానికి ముందు పొలం దున్నడం మొదలుకొని ధాన్యం ఇంటికి తెచ్చేవరకు రైతు గుండె ఎంతగా అల్లాడుతుందో ఆలోచిస్తేనే గుండె జారిపోతుంది.

ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండడం రైతు జీవితం. పంట పదును మీదున్నప్పుడు వానో, వరదో వచ్చినప్పుడు అతని మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది. అతని ధ్యాస పంటను రక్షించడమే, లేకపోతే నలుగురికి అన్నం లేకుండా చేసినవాణ్ణి అవుతానని బాధ్యత పడతాడు. సృష్టి స్థిల కారులలో విష్ణువు స్థితికర్త. అంటే మనల్ని పోషించేవాడని అర్థం. ప్రస్తుత కాలంలో మనకు రైతే స్థితికర్త,

మనం గమనిస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దల సమక్షంలో చర్చకు వస్తే అప్పుడు మధ్యమ మార్గంగా తీర్పు చెప్పడానికి ‘రైతు పద్ధతిలో మాట్లాడుకుందాం’ అంటారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రైతు ఎంత గొప్ప వ్యక్తో. అందుకే దువ్వూరి రామిరెడ్డిగారు “చేతులతో సమాజసేవ చేస్తున్న నీకు వేరెవ్వరూ సాటిరారని” అన్నారు.

III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. పర్యాయపదాలు:

ఈసు : అసూయ, ఈర్య
కన్ను : అక్షి, నేత్రం, నయనం
మనుజుడు : మానవుడు, నరుడు, మనుష్యుడు
కృషి : వ్యవసాయం, సేద్యం, కరిసనం
నుతి : పొగడ్త, ప్రశంస
క్షామం : కరవు, అనావృష్టి
తాత : తండ్రి తండ్రి, పితామహ
క్ష్మా : ధారణి, నేల, భూమి

2. వ్యుత్పత్త్యర్థాలు :

కావ్యం : కవి యొక్క కర్మము (గ్రంథం)
అతిథి : తిథి, వార, నక్షత్రము నియమాలు లేక ఇంటికి భోజనానికి వచ్చేవాడు
కృతఘ్నుడు : చేసిన మేలు మఱచువాడు
క్ష్మా : భారమును వహించుటయందు క్షమ (ఓర్పు) కలది (భూమి)
సత్యం : సత్పురుషులయందు పుట్టునది (నిజం)
పుత్రుడు : పున్నామ నరకం నుండి రక్షించువాడు (కుమారుడు)

3. నానార్థాలు :

ఆత్మ : మనస్సు, పరమాత్మ, బుద్ధి, దేహం
రసము : చారు, పాదరసం, శృంగారాది రుచి, కోరిక
కాలము : సమయం, నలుపు, చావు

4. ప్రకృతి – వికృతులు :

భూమి – బూమి
మృత్తిక – మట్టి
కాంక్ష – కచ్చు
కష్టము – కసుటు
భోగం – బోగం (సుఖం)
విద్య – విద్ధియ, విద్దె
పుత్రుడు – బొట్టె, బొట్టియ, పట్టి
గౌరవం – గారవం
బ్రధ్న – పొద్దు
శ్రీ – సిరి
విశ్వాసం – విసువాసం
స్పర్థ – పంతం

5. సంధులు :

హిత + అర్థ = హితార్థ – సవర్ణదీర్ఘ సంధి
దైనిక + ఆవశ్యకం = దైనికావశ్యకం – సవర్ణదీర్ఘ సంధి
కష్ట + ఆర్జితం = కష్టార్జితం – సవర్ణదీర్ఘ సంధి
రస + ఆస్వాద = రసాస్వాద – సవర్ణదీర్ఘ సంధి
దుర్భర + అవస్థ = దుర్భరావస్థ – సవర్ణదీర్ఘ సంధి
కన్నెత్తియున్ + చూతురే = కన్నెత్తియుంజూతురే – సరళాదేశ సంధి
తోపు + తోపు = తోదోపు – ప్రాతాది సంధి
పస్తు + ఉన్న = పస్తున్న – ఉత్వసంధి
ప్రొద్దు + పొడిచిన = ప్రొద్దువొడిచిన – గసడదవాదేశ సంధి
ప్రొద్దు + క్రుంకు = ప్రొద్దుగ్రుంకు – గసడదవాదేశ సంధి
జీవ + కట్టి = జీవగట్టు – ఉత్వసంధి
కన్ను + ఎత్తి = కన్నెత్తి – ఉత్వసంధి
శ్రమ + ఆర్జితం = శ్రమార్జితం – సవర్ణదీర్ఘ సంధి

6. సమాసాలు:

భూమిపుత్రుడు = భూమి యొక్క పుత్రుడు – షష్ఠీ తత్పురుష సమాసం
ధారుణీపతి = ధరణికి పతి – షష్ఠీ తత్పురుష సమాసం
పవిత్రమూర్తి = పవిత్రమైన మూర్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
శూరమణి = శూరుల అందు శ్రేష్ఠుడు – సప్తమీ తత్పురుష సమాసం
జీవన స్పర్థ = జీవనమునందు స్పర్థ – సప్తమీ తత్పురుష సమాసం
జీవన సంగ్రామం = జీవనమనే సంగ్రామం రూపక సమాసం
హాలిక వర్య – రైతులలో శ్రేష్ఠ – షష్ఠీ తత్పురుష సమాసం

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

7. అలంకారాలు:

జీవన సంగ్రామం – రూపకాలంకారం. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పుట.
జీవనం – ఉపమేయం
సంగ్రామం – ఉపమానం
ఈ రెండింటికి అభేదం చెప్పబడినది. కనుక ఇది రూపకాలంకారం.

9th Class Telugu 9th Lesson భూమి పుత్రుడు 1 Mark Bits

1. ఆధునిక కాలంలో కృషి చేయడానికి ఎవరూ కృషి చేయడం లేదు – గీత గీసిన పదాలకు నానార్థపదాలు గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) కష్టం – కారణం
బి) వ్యవసాయం – సాయం
సి) వ్యవసాయం – వ్యవహారం
డి) వ్యవసాయం – ప్రయత్నం
జవాబు:
డి) వ్యవసాయం – ప్రయత్నం

2. లక్ష్మి అనుకున్న కర్జము నెరవేరింది. (ప్రకృతి పదం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) కారణం
బి) కార్యం
సి) కయ్యం
డి) కాలం
జవాబు:
బి) కార్యం

3. ‘మనిచిరి నీ పితామహులమాంద్య సుశీలురు సర్వవృత్తిపా’. (ఏ పద్యపాదమో గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) మత్తేభము
బి) శార్దూలము
సి) ఉత్పలమాల
డి) చంపకమాల
జవాబు:
డి) చంపకమాల

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

4. అఖిల వాణిజ్యములు సిరికాట పట్లు. (ఆధునిక వచనాన్ని గుర్తించండి) (S.A. II. 2017-18)
ఎ) అఖిలమైన వాణిజ్యంబులు సిరికాట పట్లు
బి) అఖిలంబైన వాణిజ్యమ్ములు సిరికినాట పట్లు
సి) అఖిల వాణిజ్యాలు సిరికాట పట్లు
డి) అఖిల వాణిజ్యముల్ సిరికి నాటపట్టులు
జవాబు:
సి) అఖిల వాణిజ్యాలు సిరికాట పట్లు

5. “చిన్నప్పటి నుండీ నాకు బోటనీ అభిమాన విషయం” అన్నాడు రచయిత. (పరోక్ష కథనంలోకి గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) చిన్నప్పటి నుండీ తనకు బోటనీ అభిమాన విషయమని అన్నాడు రచయిత.
బి) రచయితకు బోటనీ అభిమాన విషయమన్నాడు.
సి) రచయిత బోటనీ నాకు అభిమాన విషయమన్నాడు.
డి) బోటనీ అభిమాన విషయమని రచయిత అన్నాడు.
జవాబు:
ఎ) చిన్నప్పటి నుండీ తనకు బోటనీ అభిమాన విషయమని అన్నాడు రచయిత.

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. ఆర్థాలు :

6. అన్ని వృత్తులలో పావనమైనది వ్యవసాయం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ధర్మం
B) పవిత్ర
C) మలినం
D) న్యాయం
జవాబు:
B) పవిత్ర

7. శ్రమ పడకుండా ఫలములు తమంతట తాముగా రావు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) దారులు
B) పండ్లు
C) దేవతలు
D) ఫలితాలు
జవాబు:
D) ఫలితాలు

8. బావులకు ఉగ్గాలు ఏర్పాటు చేసేవారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) బకెట్లు
B) బిందెలు
C) చేదలు
D) గంగాళాలు
జవాబు:
C) చేదలు

9. రాజు చేతిలోని ధర్మదండం కన్నా నీ చేతి హలం గొప్పది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) నాగలి
B) కొడవలి
C) గొడ్డలి
D) కర్ర
జవాబు:
A) నాగలి

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

10. ఇరుగుపొరుగు వారి సంపదకై ఈసు పొందవు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ప్రేమ
B) అభిమానం
C) కోపం
D) ఈర్ష్య
జవాబు:
D) ఈర్ష్య

11. నీ హృదయ కళిక ఎంతో పవిత్రమైనది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) పువ్వు
B) దీపం
C) మొగ్గ
D) బంగారం
జవాబు:
C) మొగ్గ

12. కృషి సకల పరిశ్రమలకు మూలము – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) పశువు
B) వ్యవసాయము
C) పక్షి
D) కష్టం
జవాబు:
B) వ్యవసాయము

13. సంపదయే సుఖాలను పొందడానికి జీవగఱ్ఱ – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) జీవనౌషధం
B) జీలకట్ట
C) కారణం
D) ఆధారం
జవాబు:
A) జీవనౌషధం

14. నీకు మాత్రం తిండికి, బట్టకు ఎప్పుడూ కఱవె – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) నిండు
B) సమం
C) క్షామమె
D) ఎక్కువ
జవాబు:
C) క్షామమె

15. పండ్లనిచ్చిన వృక్షమును గూర్చి ఆలోచించరు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కొమ్మ
B ) మొక్క
C) మొగ్గ
D ) చెట్టు
జవాబు:
D ) చెట్టు

16. వ్యవసాయాన్ని చేయడంలో నీ శరీరం అస్థిపంజరంగా మారింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఎముక
B) బోను
C) ఎముకల గూడు
D) పుర్రె
జవాబు:
C) ఎముకల గూడు

17. నీకు కొదవ ఏముంది? – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) లోపం
B) స్థాయి
C) స్థానం
D) హీనం
జవాబు:
A) లోపం

18. బ్రతకడంకోసం స్పర్థ సహజమైన కాలం ఇది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) పందెం
B) పోటీ
C) తగాదా
D) యుద్ధం
జవాబు:
B) పోటీ

19. జీవితం అనే సంగ్రామంలో విజయం పొందాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) పందెం
B) పోటీ
C) యుద్ధం
D) తిట్టు
జవాబు:
C) యుద్ధం

2. పర్యాయపదాలు :

20. ‘వారి సంపదకై యీసు గూరబోవవు’ – గీత గీసిన పదానికి సమానార్థక పదాన్ని గుర్తించండి.
A) ఆశ
B) ఈర్ష్య
C) వాంఛ
D) ప్రేమ
జవాబు:
B) ఈర్ష్య

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

21. ఈ ఏడాది నీరు లేక క్షామం వచ్చింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) క్షారం, కాయం
B) కామం, కారం
C) కరవు, అరువు
D) అనావృష్టి, కరవు
జవాబు:
D) అనావృష్టి, కరవు

22. అసూయ మనిషిని రాక్షసుణ్ణి చేస్తుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) అనసూయ, ఈసు
B) ఈర్ష్య, ఈసు
C) ఈర్ష్య, ద్వేషం
D) కోపం, క్రోధం
జవాబు:
B) ఈర్ష్య, ఈసు

23. శ్రుతిమించి నుతి కూడదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) బావి, నూయి
B) చెరువు, బావి
C) ప్రశంస, పొగడ్త
D) ధర్మం, దానం
జవాబు:
C) ప్రశంస, పొగడ్త

24. కన్నులున్న వారిని సైతం గుడ్డివారిని చేస్తున్నది అంధకారం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) అక్షి, కుక్షి
B) నేత్రం, నయనం
C) ఆత్రం, నయనం
D) నేత్రం, నయం
జవాబు:
B) నేత్రం, నయనం

25. మా తాత అంటే మాకెంతో ఇష్టం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) తండ్రి తండ్రి, పితామహుడు
B) తల్లి తండ్రి, పితామహి
C) బ్రహ్మ, తండ్రి
D) విధాత, తాత
జవాబు:
A) తండ్రి తండ్రి, పితామహుడు

26. రాయలు గొప్ప క్ష్మా పాలకుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) భూమి, రాజు
B) నేల, రేడు
C) ధరణీ, మంత్రి
D) వసుధ, పృథ్వి
జవాబు:
D) వసుధ, పృథ్వి

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

27. మనదేశం వ్యవసాయం ప్రధాన వృతిగా గల దేశం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) సాగు, బాగు
B) సేద్యం, కృషి
C) కరిసనం, కూలీ
D) సేద్యం, మద్యం
జవాబు:
B) సేద్యం, కృషి

28. నీ హలము కన్నను కవి కలము గొప్పదగునె? – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) అరక, కత్తి
B) పార, ఖడ్గము
C) నాగలి, సీరము
D) గునపము, నాగలి
జవాబు:
C) నాగలి, సీరము

29. ‘నేల నూతులకుగ్గాలు నిలుపువారు’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు ఏవి?
A) బావులు, కూపములు
B) గోతులు, పాతరలు
C) తాళ్ళు, నూతులు
D) చేలు, పొలములు
జవాబు:
A) బావులు, కూపములు

30. ‘కావున కృషీవలా నీవె కారణమవు’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు ఏవి?
A) రైతు, కార్మికుడు
B) కర్షకుడు, సైరికుడు
C) రైతు, పనివాడు
D) శ్రామికుడు, కార్మికుడు
జవాబు:
B) కర్షకుడు, సైరికుడు

31. వృక్షములు మానవుల పాలిటి ప్రత్యక్ష దైవాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలేవి?
A) చెట్టు, గుట్టు
B) పైరు, పచ్చ
C) తరువు, చెట్టు
D) తీగ, పాదు
జవాబు:
C) తరువు, చెట్టు

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

32. ‘జీవన సంగ్రామం అనే పోరాటంలో శ్రామికుడికే విజయం ‘ – గీత గీసిన పదాలకు పర్యాయపదం గుర్తించండి.
A) పరిశ్రమ
B) కృషి
C) రణము
D) ప్రయత్నం
జవాబు:
C) రణము

3. వ్యుత్పత్యర్థాలు :

33. ‘కావ్యం’ వ్యుత్పత్తి గుర్తించండి.
A) కవికర్త
B) కవి కర్మము
C) కవి క్రియ
D) కవి హేతువు
జవాబు:
B) కవి కర్మము

34. తిథి, వార, నక్షత్ర, నియమం లేక భోజనానికి వచ్చేవాడు – వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) చుట్టం
B) మిత్రుడు
C) అతిథి
D) హరిదాసు
జవాబు:
C) అతిథి

35. చేసిన మేలు మఱచువాడు నరకానికి పోతాడు – గీత గీసిన వానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) ధన్యుడు
B) ధర్మాత్ముడు
C) పుణ్యశీలి
D) కృతఘ్నుడు
జవాబు:
D) కృతఘ్నుడు

36. సత్పురుషులయందు పుట్టు మాటలు శిరోధార్యాలు – గీత గీసిన వానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) సత్యం
B) ప్రాణం
C) జీవితం
D) గుండె
జవాబు:
A) సత్యం

37. ‘పున్నామ నరకం నుండి కాపాడువాడు’ – దీని వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) అల్లుడు
B) తమ్ముడు
C) పుత్రుడు
D) మిత్రుడు
జవాబు:
C) పుత్రుడు

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

38. ‘భారమును వహించుట యందు క్షమ కలది’ – వ్యుత్పత్యర్థం గుర్తించండి.
A) క్షా
B) క్యా
C) క్ష్వా
D) క్ష్మా
జవాబు:
D) క్ష్మా

39. ‘కృషీవలుడు’ పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
A) కృషి చేసేవాడు
B) భూమిని దున్ని బ్రతికేవాడు
C) పొలంపని చేసేవాడు
D) కార్మికుడు
జవాబు:
B) భూమిని దున్ని బ్రతికేవాడు

4. నానార్థాలు :

40. మానవుడు కాల మాన పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) సమయం, నలుపు
B) చావు, మరణం
C) నలుపు, తెలుపు
D) సమయం, సాయం
జవాబు:
A) సమయం, నలుపు

41. ఆత్మ, పరమాత్మ వేరని ద్వైత సిద్ధాంతం చెబుతుంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) మనస్సు, మనసు
B) బుద్ధి, పరమాత్మ
C) దేహం, శరీరం
D) బుద్ధి, బుద్ధుడు
జవాబు:
A) మనస్సు, మనసు

42. రసములు తొమ్మిది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) చారు, సాంబారు
B) పాదరసం, హసరసం
C) రుచి, కోరిక
D) శృంగారాది, హాస్యం
జవాబు:
C) రుచి, కోరిక

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

43. నేడు ధరకు విపరీతంగా ధర పెరిగింది – గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి.
A) ఖరీదు, ప్రియము
B) నేల, నెల
C) ధరణి, వెల
D) రేటు, గోటు
జవాబు:
C) ధరణి, వెల

44. సరియైన వర్షం లేక పంటలు పండలేదు – గీత గీసిన పదం నానార్థాలు ఏవి?
A) వాన, సంవత్సరం
B) వర్షం, హర్షం
C) వాన, నాన
D) ఏడు, పంట
జవాబు:
A) వాన, సంవత్సరం

5. ప్రకృతి – వికృతులు :

45. పూల కాంక్ష చెట్టు తల్లి పాదాల చెంత రాలిపోవాలని – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
A) కచ్చు
B) కోరిక
C) ఇచ్చ
D) వాంఛ
జవాబు:
A) కచ్చు

46. కష్టము చేసినవాడు ఫలితం తప్పక పొందుతాడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) కసము
B) కసుట
C) కసట
D) కసటము
జవాబు:
B) కసుట

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

47. ఆత్మవిశ్వాసం ఎప్పుడు విడిచిపెట్టకూడదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) నమ్మకం
B) విశవాసం,
C) విసువాసం
D) విసాసం
జవాబు:
C) విసువాసం

48. స్పర్థా వర్తతే విద్యా – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) పోటీ
B) పందెం
C) యుద్ధం
D) పంతం
జవాబు:
D) పంతం

49. మట్టి పిసుక్కొనే వారిని హీనంగా చూడకు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) మర్యం
B) మృత్తిక
C) నేల
D) భూమి
జవాబు:
B) మృత్తిక

50. పుత్రుడు లేనివారికి మోక్షపదం రాదా? – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) పుతుడు
B) సుతుడు
C) బొట్టె
D) కొడుకు
జవాబు:
C) బొట్టె

51. వారి సంపదకై ఈసు గూరబోవు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
A) ఈస
B) ఈర్ష్య
C) అసూయ
D) ద్వేషం
జవాబు:
B) ఈర్ష్య

52. అఖిల వాణిజ్యములు సిరి కాటపట్టు – గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి.
A) సిరీ
B) హరీ
C) శ్రీ
D) హరి
జవాబు:
C) శ్రీ

53. ఎంత నిర్మలమోయి నీ హృదయ కళిక – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
A) ఎద
B) డెందము
C) చిత్తము
D) గుండె
జవాబు:
A) ఎద

6. సంధులు :

54. ‘కషార్జితం’ – పదాన్ని విడదీయుము.
A) కష్ట + ఆర్జితం
B) కష్ట + అర్జితం
C) కష్టా + ఆర్జితం
D) కష్టా + అర్జితం
జవాబు:
A) కష్ట + ఆర్జితం

55. ‘తో దోపు’ పదాన్ని విడదీయుము.
A) తో + తోపు
B) తోపు + తోపు
C) తో + దోపు
D) తోపు + దోపు
జవాబు:
B) తోపు + తోపు

56. ‘కన్ను + ఎత్తి’ – సంధి పేరేమిటి?
A) ఇత్వసంధి
B) అత్వసంధి
C) ఉత్యసంధి
D) గుణసంధి
జవాబు:
C) ఉత్యసంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

57. కింది వానిలో గసడదవాదేశ సంధికి ఉదాహరణను గుర్తించండి.
A) వస్తున్న
B) దుర్భరావస్థ
C) హితార్థ
D) ప్రొద్దు గ్రుంకు
జవాబు:
D) ప్రొద్దు గ్రుంకు

58. ‘ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు’ – ఈ సూత్రానికి సంబంధించిన ఉదాహరణను కింది వానిలో గుర్తించండి.
A) తోదోపు
B) కన్నెత్తియుం జూతురే
C) జీవగడ్డ
D) ప్రొద్దువొడిచిన
జవాబు:
B) కన్నెత్తియుం జూతురే

59. ‘దుర్భరావస్థ’ అనే పదాన్ని విడదీయండి.
A) దుర్భ + రావస్థ
B) దుర్భరా + వస్థ
C) దుర్భరము + అవస్థ
D) దుర్భర + అవస్థ
జవాబు:
D) దుర్భర + అవస్థ

60. ‘భోగోపలబ్ది’ – ఈ పదంలో గల సంధి ఏది?
A) ఉత్వ సంధి
B) గుణ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) వృద్ధి సంధి
జవాబు:
B) గుణ సంధి

61. ‘ఉత్కటము + దుర్బరావస్థ’ – సంధి జరిగిన పిమ్మట ఏర్పడిన పదం ఏది?
A) ఉత్కటపు దుర్భరావస్థ
B) ఉత్కటంపు అవస్థ
C) ఉత్కట దుర్భరావస్థ
D) ఉత్కటావస్థ
జవాబు:
A) ఉత్కటపు దుర్భరావస్థ

62. “సిరి కాటపట్టు’ – విడదీసి, సంధిని గుర్తించండి.
A) సిరి + కాటపట్టు (ఇత్వ సంధి)
B) సిరిక + ఆటపట్టు (సవర్ణదీర్ఘ సంధి)
C) సిరికిన్ + ఆటపట్టు (ఇత్వ సంధి)
D) సిరికాట + పట్టు (అత్వ సంధి)
జవాబు:
C) సిరికిన్ + ఆటపట్టు (ఇత్వ సంధి)

7. సమాసాలు :

63. భూమి పుత్రుడు’ లోని విగ్రహవాక్య విభక్తిని గుర్తించండి.
A) చేత
B) వలస
C) యొక్క
D) అందు
జవాబు:
C) యొక్క

64. “జీవన సంగ్రామం’ సమాసం పేరేమిటి?
A) రూపకం
B) షష్టి
C) ద్వంద్వం
D) బహువ్రీహి
జవాబు:
A) రూపకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

65. ‘హృదయకళిక’ లోని విభక్తిని గుర్తించండి.
A) మైన
B) అనెడి
C) లో
D) అందు
జవాబు:
B) అనెడి

66. ‘శూరులందు శ్రేషుడు’ – సమాసం పేరేమిటి?
A) షష్టీ
B) తృతీయా
C) బహువ్రీహీ
D) సప్తమీ
జవాబు:
D) సప్తమీ

67. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) జీవన స్పర్థ
B ) పవిత్రమూర్తి
C) ధరణీపతి
D) హాలిక వర్య
జవాబు:
B ) పవిత్రమూర్తి

68. ‘జీవన సంగ్రామము’ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
A) జీవనము చేత సంగ్రామం
B) జీవనం కొఱకు సంగ్రామం
C) జీవనము అనే సంగ్రామం
D) జీవనము, సంగ్రామము
జవాబు:
C) జీవనము అనే సంగ్రామం

69. ‘హృదయ కళిక‘ వికసించినది – గీత గీసిన పదం ఏ సమాసం?
A) రూపక సమాసం
B) ద్విగు సమాసం
C) ద్వంద్వము
D) ఉపమాన ఉత్తరపద కర్మధారయం
జవాబు:
A) రూపక సమాసం

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

70. ‘చిటికెలతో పందిళ్ళు’ – సమాస పదంగా కూర్చండి.
A) చిటికెల పందిళ్ళు
B) చిటికె పందిళ్ళు
C) పందిరి చిటికెలు
D) చిటిక పందిళ్ళు
జవాబు:
A) చిటికెల పందిళ్ళు

8. గణాలు:

71. ‘హితార’ గురులఘువులు గుర్తించండి.
A) III
B) IIU
C) IUI
D) UII
జవాబు:
C) IUI

72. ‘గౌరవం’ అనేది ఏ గణం?
A) మ గణం
B) ర గణం
C) న గణం
D) భ గణం
జవాబు:
B) ర గణం

73. ‘శ్రమలు’ గురులఘువులు గుర్తించండి.
A) III
B) UII
C) IUI
D) IIU
జవాబు:
A) III

74. ‘న, జ, భ, జ, జ, జి, ర’ గణాలు ఏ వృత్తానికి చెందినవి?
A) ఉత్పలమాల
B) మత్తేభం
C) శార్దూలం
D) చంపకమాల
జవాబు:
D) చంపకమాల

75. ‘1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు’ – ఇవి ఏ పద్యానికి చెందిన గణాలు (S.A. II – 2017-18)
A) ఆటవెలది
B) తేటగీతి
C) కందం
D) సీసం
జవాబు:
B) తేటగీతి

76. మత్తేభ వృత్తంలోని యతి స్థానం
A) 11
B) 10
C) 14
D) 13
జవాబు:
C) 14

77. ‘భ,ర,న,భ,భ,ర,వ’ గణాలు ఏ వృత్తానికి చెందినవి?
A) తేటగీతి
B) ఆటవెలది
C) కందము
D) ఉత్పలమాల
జవాబు:
D) ఉత్పలమాల

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

78. తేటగీతి పద్యపాదంలో ఉండే గణాలు ఏవో గుర్తించండి.
A) 3 సూర్య, 2 ఇంద్ర గణాలు
B) 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య గణాలు
C) 5 సూర్య గణాలు
D) భరనభభరవ
జవాబు:
B) 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య గణాలు

79. ‘సంగ్రామం’ అనేది ఏ గణం?
A) భ గణం
B) ర గణం
C) త గణం
D) మ గణం
జవాబు:
D) మ గణం

9. అలంకారాలు :

80. ‘జీవన సంగ్రామం’ రూపకాలంకారానికి చెందిన ఉదాహరణ – దీనిలో ఉపమానం గుర్తించండి.
A) జీవనం
B) సంగ్రామం
C) రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) సంగ్రామం

81. ‘హృదయ కళిక’ దీనిలోని అలంకారం గుర్తించండి.
A) ఉపమా
B) అతిశయోక్తి
C) రూపకం
D) శ్లేష
జవాబు:
C) రూపకం

82. ‘జింకలు బిత్తరి చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున దూకుతున్నాయి’ – ఈ వాక్యంలో గల అలంకారమును గుర్తించండి.
A) ఛేకానుప్రాస
B) స్వభావోక్తి
C) అతిశయోక్తి
D) శ్లేష
జవాబు:
B) స్వభావోక్తి

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

83. వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉన్నట్లయితే అది ఏ అలంకారం?
A) స్వభావోక్తి
B) దృష్టాంతం
C) ఉపమా
D) అర్థాంతరన్యాస
జవాబు:
B) దృష్టాంతం

10. ఆధునిక వచనాన్ని గుర్తించడం:

84. ‘శ్రమలు లేకయె ఫలములు దుముకబోవు’ – దీనికి ఆధునిక వాక్యం ఏది?
A) శ్రమ పడకుండా ఫలితాలు దుముకవు.
B) శ్రమలు లేకుండా ఫలాలు రావు
C) శ్రమ లేనిదే ఫలితాలు అవే రావు
D) శ్రమే లేకపోతే ఫలాలు ఎక్కడివి
జవాబు:
A) శ్రమ పడకుండా ఫలితాలు దుముకవు.

85. ‘సిరియె భోగోపలబ్ధికి జీవగట్టి’ – ఆధునిక వాక్యం గుర్తించండి.
A) సిరి సుఖాలను పొందడానికి మందు
B) సిరి భోగోపలబ్దికి జీవగట్టు
C) సంపదయే సుఖాలన్నిచ్చే మందు
D) సిరియె సుభాలనిచ్చే జీవనౌషధం
జవాబు:
B) సిరి భోగోపలబ్దికి జీవగట్టు

11. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం :

86. రైతు పంట పండించాడు – కర్మణి వాక్యము గుర్తించండి.
A) రైతు పంట పండించబడింది
B) రైతు చేత పంట పండించాడు
C) రైతుచే పంట పండించబడింది
D) రైతు పంటచేత పండించాడు
జవాబు:
C) రైతుచే పంట పండించబడింది

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

87. ‘నీవు చెప్పిన విషయం పరిశీలించబడుతుంది’ – ఈ కర్మణి వాక్యానికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) నీవు చెప్పిన విషయాన్ని పరిశీలిస్తారు.
B) నీవు చెప్పిన విషయం పరిశీలిస్తాము.
C) నీవు చెప్పినది పరిశీలించరు.
D) నీ చేత చెప్పిన విషయం పరిశీలిస్తారు.
జవాబు:
A) నీవు చెప్పిన విషయాన్ని పరిశీలిస్తారు.

12. ప్రత్యక్ష, పరోక్ష కథనాలను గుర్తించడం:

88. “నీకు సుఖం ఉందా” అని రైతును కవి అడిగాడు – పరోక్ష కథనం గుర్తించండి.
A) సుఖం ఉందాని రైతును కవి అడిగాడు
B) సుఖంగా ఉన్నావాయని రైతును కవి అడిగాడు
C) సుఖం ఉందాయని కవితో రైతు అడిగాడు
D) రైతుతో సుఖం ఉందాని అన్నాడు కవి.
జవాబు:
A) సుఖం ఉందాని రైతును కవి అడిగాడు

89. వాని చేతిలోని నాగలి గొప్పదని దువ్వూరి అన్నారు – ప్రత్యక్ష కథనం గుర్తించండి.
A) నా చేతిలోని నాగలి గొప్పది అని దువ్వూరి అన్నారు.
B) నీ చేతిలోని నాగలి గొప్పది” అని దువ్వూరి అన్నారు.
C) అతని చేతిలోని నాగలి గొప్పది అని దువ్వూరి అన్నారు.
D) నీ చేతిలోని నాగలి గొప్పదే కదా అని దువ్వూరి అన్నారు.
జవాబు:
B) “నీ చేతిలోని నాగలి గొప్పది” అని దువ్వూరి అన్నారు.

90. “చిన్నప్పటి నుండి నాకు బోటనీ అభిమాన విషయం” అన్నాడు రచయిత-దీనిని పరోక్ష వాక్యాన్ని గుర్తించండి.
A) చిన్నప్పటి నుండి నీకు బోటనీ అభిమాన విషయ మని రచయిత అన్నాడు.
B) చిన్నప్పటి నుండి తనకు బోటనీ అభిమాన విషయ మని రచయిత అన్నాడు.
C) చిన్నప్పటి నుండి ఆమెకు బోటనీ అభిమాన విషయ మని రచయిత అన్నాడు.
D) చిన్నప్పటి నుండి ఆయనకు బోటనీ అభిమాన విషయమని రచయిత అన్నాడు.
జవాబు:
B) చిన్నప్పటి నుండి తనకు బోటనీ అభిమాన విషయ మని రచయిత అన్నాడు.

13. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

91. రైతుకు తిండి లేదు – వ్యతిరేక వాక్యం గుర్తించండి. చెందినదో గుర్తించండి?
A) తిండి ఉంది
B) రైతుకు తిండి ఉంది
C) రైతుకు తిండి పెట్టు
D) రైతుకు ఆకలి లేదు
జవాబు:
B) రైతుకు తిండి ఉంది

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

92. పళ్ళు తినేవారు చెట్టును చూడరు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) పళ్ళు లేనివారు చెట్టును చూస్తారు
B) చూస్తారు
C) పళ్ళు తినేవారు చెట్టును చూస్తారు
D) చూడరు
జవాబు:
C) పళ్ళు తినేవారు చెట్టును చూస్తారు

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

93. ‘ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు’ – వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి.
A) ఒకే ఒక్క ఆవు తిరిగి వచ్చింది.
B) ఆవులన్నీ తిరిగి వచ్చాయి.
C) ఒకే ఒక్క ఆవు తిరిగి రాదు.
D) ఒక్క ఆవు మాత్రం వచ్చింది.
జవాబు:
A) ఒకే ఒక్క ఆవు తిరిగి వచ్చింది.

14. వాక్యరకాలను గుర్తించడం:

94. రైతు మనస్సు స్వచ్ఛమైంది. రైతు మనస్సు అసూయలేనిది – సంయుక్త వాక్యం గుర్తించండి.
A) రైతు మనస్సు స్వచ్చమైంది, అసూయలేనిది.
B) రైతు మనస్సు స్వచ్ఛమైంది, అనసూయలేనిది
C) స్వచ్చమైంది మనస్సు, అసూయలేనిది రైతు
D) స్వచ్ఛమైంది, అసూయ ఉంది రైతు మనస్సు
జవాబు:
A) రైతు మనస్సు స్వచ్చమైంది, అసూయలేనిది.

95. బుద్దుడు వటవృక్ష చ్ఛాయకు వచ్చాడు. అష్టాంగ ధర్మ ప్రవచనం ప్రారంభమైంది – ఈ వాక్యాలలో సంయుక్త వాక్యాన్ని గుర్తించండి.
A) బుద్ధదేవుడు వటవృక్ష చ్ఛా యకు వచ్చి అష్టాంగ ధర్మ ప్రవచనం ప్రారంభం చేశాడు.
B) బుద్ధదేవుడు వటవృక్ష చ్ఛాయకు రాగానే అష్టాంగ ధర్మ ప్రవచనం ప్రారంభమైంది.
C) బుద్ధదేవుడు వటవృక్ష చ్ఛాయకు వచ్చాడు వెంటనే అష్టాంగ ధర్మ ప్రవచనం ప్రారంభమైంది.
D) బుద్ధదేవుడు వచ్చిన వెంటనే అష్టాంగ ధర్మ ప్రవచనం ప్రారంభం అయ్యింది.
జవాబు:
C) బుద్ధదేవుడు వటవృక్ష చ్ఛాయకు వచ్చాడు వెంటనే అష్టాంగ ధర్మ ప్రవచనం ప్రారంభమైంది.

15. ప్రక్రియలను గుర్తించడం :

96. ‘శ్రమ చేయకుండా ఫలితాలు రావు’ – ఇది ఏ ప్రక్రియకు –
A) చేదర్థకం
B) ప్రశ్నార్థకం
C) శత్రర్థకం
D) క్యార్ధకం
జవాబు:
A) చేదర్థకం

97. ‘రైతు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడతాడు” -ఏ ప్రక్రియ?
A) ఆశ్చర్యార్థకం
B) సామర్థ్యార్థకం
C) నిషేధార్థకం
D) హేత్వర్ణకం
జవాబు:
B) సామర్థ్యార్థకం

98. పండ్లు ఇచ్చిన చెట్టు గూర్చి ఎప్పుడైనా ఆలోచిస్తారా? -ఏ ప్రక్రియ?
A) సందేహార్థక
B) విధ్యర్థకం
C) ప్రశ్నార్ధకం
D) అనుమత్యర్థకం
జవాబు:
C) ప్రశ్నార్ధకం

AP Board 9th Class Telugu Important Questions Chapter 9 భూమి పుత్రుడు

99. నీ గొప్పతనాన్ని నీవు తెలుసుకో – ఏ ప్రక్రియ?
A) ప్రార్ధనార్థకం
B) ఆశీర్వాద్యర్థకం
C) సామర్థ్యార్థకం
D) ప్రేరణార్థకం
జవాబు:
D) ప్రేరణార్థకం

100. ఈ కింది వాక్యంలోని అసమాపక క్రియ ఏదో గుర్తించండి. ‘కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో’.
A) చేదర్థకం
B) శత్రర్థకం
C) తద్ధర్మార్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
B) శత్రర్థకం