AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 11 ధర్మదీక్ష.
AP State Syllabus 9th Class Telugu Important Questions 11th Lesson ధర్మదీక్ష
9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
క్రింది పరిచిత గద్యాలను చదివి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. బాగా చీకటి పడింది. అయినా ఇంకా ఆవు తిరిగి రాలేదు. గోశాలలో గోవత్సాలన్నీ తోకలెత్తి పెట్టి ఎంతో సంతోషంగా పాలు కుడుచుకుంటున్నాయి. కాని ఆ ఒక్క ఆవుదూడ మాత్రం ‘అంబా’ ‘అంబా’ అని అదేపనిగా అరవడం మొదలు పెట్టింది. ఆ దూడ పుట్టినప్పటి నుంచీ నందగోపాలుని ఇల్లంతా పాడి పంటలతో కలకలలాడింది. అందుచేత ఆ ఆవన్నా, ఆ దూడన్నా నందగోపాలుని కెంతో ఇష్టం. అది అదే పనిగా అరవడం మొదలు పెట్టేసరికి అతని కారాత్రి మరి అన్నం సయించలేదు.
ప్రశ్నలు:
1. గోశాలలో ఆవుదూడలు ఎలా ఉన్నాయి?
2. ‘నందగోపాలుడికి ఆ దూడ అంటే ఎంతో ఇష్టం’ ఎందుకు?
3. నందగోపాలుడికి ఆ రాత్రి అన్నం ఎందుకు సయించలేదు?
4. పై పేరాపై మీరు ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. గోశాలలో ఆవుదూడలు అన్నీ తోకలు ఎత్తిపెట్టి, ఎంతో సంతోషంగా పాలు తాగుతున్నాయి.
2. ఆ దూడ పుట్టినప్పటి నుండి నందగోపాలుడి ఇల్లంతా పాడిపంటలతో కలకలలాడింది. అందుకే ఆ దూడ అంటే నందగోపాలుడికి ఎంతో ఇష్టం.
3. నందగోపాలుడికి ఇష్టమైన ఆవు ఇంటికి రాలేదు. అందువల్ల దాని దూడ ‘అంబా’ అంటూ అరవడం మొదలు పెట్టింది. అందుకే నందగోపాలుడికి ఆ రాత్రి అన్నం సయించలేదు.
4. ఆవుదూడ ‘అంబా’ ‘అంబా’ అని ఎందుకు అరుస్తోంది?
2. “నందుడంతలో గోవును వటవృక్షచ్ఛాయలో నిలిపి నురుగులు గక్కుకుంటూ పరుగెత్తుకు వచ్చి బుద్ధదేవుని పాదాలపై సాగిలపడ్డాడు. కొంత సేపటికి లేచి అతివినయంగా దోసిలి ఒగ్గి నిలబడ్డాడు. చివరికెలాగైనా దర్శన భాగ్యమైనా లభించింది గదా ! అని ఎంతో సంతోషించాడు. వెంటనే గౌతముడు లేచి నిలబడ్డాడు. వెనువెంటనే భిక్షువులందరూ లేచి నిలుచున్నారు! బుద్ధదేవుడెంతో ఆత్రంగా పక్కనే నిలబడిన భిక్షువులతో “ఇంకా భోజన పదార్థాలేమైనా మిగిలి ఉన్నాయా ?” అన్నాడు.
ప్రశ్నలు:
1. అవును నందుడు ఎక్కడ నిలబెట్టాడు?
2. నందుడు ఎందుకు సంతోషించాడు?
3. “ఇంకా భోజన పదార్థాలు మిగిలి ఉన్నాయా?” అని ఎవరు, ఎవరిని అడిగారు?
4. పై పేరా పై మీరు ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. ఆవును నందుడు వటవృక్షచ్ఛాయలో నిలబెట్టాడు.
2. తాను ఆలస్యంగా వచ్చినా, తనకు గౌతమబుద్ధుని దర్శన భాగ్యం లభించింది కదా అని నందుడు సంతోషించాడు.
3. బుద్ధుడు తన శిష్యులను “ఇంకా భోజన పదార్థాలు మిగిలి ఉన్నాయా?” అని అడిగాడు.
4. నందుడు బుద్ధుని పాదాలపై పడిన తర్వాత ఏమి జరిగింది?
3. “నందగోపుని భోజనానంతరం బుద్ధదేవుడతనిని వెంటబెట్టుకొని నెమ్మదిగా వటవృక్షచ్ఛాయకు తిరిగివచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మ ప్రవచనం ప్రారంభమైంది. అమృతవర్ష ప్రాయమైన ఆ ప్రసంగం ఆలకిస్తూ, భిక్షువులు, ఆళవీ గ్రామస్థులు ఆనంద తరంగాలలో తలమునకలైనారు. ధర్మప్రవచనం చేస్తూన్నంత సేపు బుద్ధదేవుడు చిరునవ్వులతో నందగోపాలుని వైపలవోకగా తిలకిస్తూనే ఉన్నాడు.
ప్రశ్నలు:
1. బుద్ధుడు భోజనానంతరం నందుడిని ఎక్కడకు తీసుకువచ్చాడు?
2. బుద్ధుని ధర్మప్రవచనం ఎలా ఉంది?
3. ఆనంద తరంగాలలో ఎవరు తలమునకలయ్యారు? ఎందుకు?
4. పై పేరాపై మీరు ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. భోజనానంతరం బుధుడు నందుని వెంటబెట్టుకొని వటవృక్షచ్చాయకు వచ్చాడు.
2. బుద్ధుని ధర్మప్రవచనం, అమృతవర్ష ప్రాయంగా ఉంది.
3. అమృత వర్షం వంటి బుుడి ధర్మప్రవచనం విని భిక్షువులు, ఆళవీ గ్రామస్తులు ఆనంద తరంగాలలో తలమునకలయ్యారు.
4. ధర్మప్రవచనం చేస్తునప్పుడు బుద్ధుడు ఏమి చేశాడు?
4. ఈ క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (S.A. II – 2018-19)
“మీదే వూరు నాయనా”
“అళవీగ్రామమే”
“అలాగా ! అయితే పొరుగూళ్ళ జనం అంతా తీర్థ ప్రజలాగ ఇక్కడకే వస్తూంటే నీవు ఉన్న గ్రామం విడిచి పెట్టి పోతాలేమయ్యా” ! అని ఒక చిరునవ్వు విసిరాడా ముసలి తాత నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేసాడు. అడవిలో ఆ ఆవు ఏ పులివాత పడిందోనని భయపడుతున్నానని కూడా అన్నాడు. ఆ మాట విన్న తరువాత ముసలి తాత మరి అతని మాటకడ్డు చెప్పలేక తన దారిని వెళ్ళిపోయాడు. అతని వెంట ఇంకా ఎందరెందరో పరిసర గ్రామస్థులు అళవీగ్రామం వైపు నడిచి వెళ్ళాడు.
అది చూడగానే నందగోపాలుని హృదయంలో ఆరాటం ప్రారంభమయింది. గోవు గొడవ విడిచి పెట్టి తాను కూడా వారి వెంటపడి పోవాలని అనుకున్నాడు. ఇక ఈ సమయంలో కాకపోతే మరింక తథాగతుని దర్శన భాగ్యమే కలగదేమో అని అతనికొక భయం పట్టుకుంది. వెంటనే వెనక్కి తిరిగి రెండు మూడడుగులు వేశాడు.
ప్రశ్నలు:
1. పొరుగూళ్ళ నుండి జనం అళవీ గ్రామానికి ఎవరిని దర్శించడానికి వెళుతున్నారు?
2. నందుడు తాతతో తానే విషయంలో భయపడుతున్నానన్నాడు?
3. నందుడు ఏ ఊరి నందు నివసించేవాడు?
4. పై పేరాననుసరించి సరైన ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. తథాగతుని
2. ఆవు
3. అళవీ
4. పై పేరాలో ద్విగు సమాసానికి చెందిన ఉదాహరణను గుర్తించండి.
5. క్రీ.శ. 7వ శతాబ్దారంభం నుంచీ తెలుగు పదం శాసనాలలో కనబడుతున్నదని సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకలు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు చెబుతారు. ఒక శాసనంలో “తెలుంగునాడు” అనే ప్రయోగం కూడ ఉంది. అప్పటికే ఆంధ్ర, తెలింగ, తెలుంగ శబ్దాలు ఒక జాతిని, దేశాన్ని తెలిపేందుకు వాడారని తెలుస్తోంది. తొలుత ఏర్పడిన తెలుగు పదం త్రిలింగ, త్రైలింగ ఐనట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
ప్రశ్నలు – జవాబులు:
1. తెలుగు పదం శాసనాలలో ఎప్పటి నుండి కనబడుతున్నది?
జవాబు:
7వ శతాబ్దం
2. దీనిలో సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు ఎవరు?
జవాబు:
మల్లంపల్లి సోమశేఖర శర్మ
3. శాసనంలో ఉన్న ప్రయోగం ఏది?
జవాబు:
తెలుంగనాడు
4. జాతిని, దేశాన్ని తెలిపేందుకు వాడిన పదాలేవి?
జవాబు:
ఆంధ్ర, తెలింగ, తెలుంగ
6. గంగానది వరద రోజులలో తప్ప – మిగిలిన రోజులలో ప్రశాంతంగా ఉంటుంది. మురుగుకాలువ మోతతో ప్రవహిస్తుంది. అలాగే పెద్దలు హుందాగా ప్రవర్తిస్తారు. అల్పులు ఆవేశానికి లోనై, దురుసుతనంతో ప్రవర్తిస్తారు.
ప్రశ్నలు – జవాబులు:
1. ప్రశాంతంగా ప్రవహించేది?
జవాబు:
గంగానది
2. మోతతో ప్రవహించేది?
జవాబు:
మురుగు కాలువ
3. హుందాగా ప్రవర్తించేది ఎవరు?
జవాబు:
పెద్దలు
4. అల్పులు ఎలా ప్రవర్తిస్తారు?
జవాబు:
ఆవేశానికిలోనై, దురుసుతనంతో
7. అయిపోయిన పనిని గురించి చింతింపవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేక పోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.
ప్రశ్నలు – జవాబులు:
1. దేని గూర్చి చింతింపకూడదు?
జవాబు:
అయిపోయిన పని గూర్చి
2. ఎవరిని మెచ్చుకోకూడదు?
జవాబు:
దుష్టులను
3. భగవంతుడు ఇచ్చినదానితో ఏమి చెందాలి?
జవాబు:
తృప్తి
4. ‘సాధ్యము’ వ్యతిరేకపదం?
జవాబు:
అసాధ్యం
II. స్వీయరచన
అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘ధర్మదీక్ష’ ప్రక్రియను గూర్చి రాయండి.
జవాబు:
ధర్మదీక్ష పాఠం పిలకా గణపతి శాస్త్రిగారు రాసిన “ప్రాచీన గాథాలహరి” అనే పుస్తకంలోనిది. ఇది కథా ప్రక్రియకు చెందినది. కథాంశం ప్రాచీనమైన, రచన ఆధునిక వచనంలో సాగింది. “కథ్యతే ఇతి కథా” అని వ్యుత్పత్తి. కథ పిల్లల్లో సున్నిత భావాలు పెంపొందిస్తుంది. ధర్మ ప్రబోధాన్ని, ఉత్తమ గుణాలను పెంపొందించడంలో కథ ఉపకరిస్తుంది.
ప్రశ్న 2.
భోజన సమయంలో నందగోపుడు బుద్ధునికి చెప్పిన విషయాలేవి?
జవాబు:
బుద్ధుడు నందగోపుని భోజనం పూర్తి అయ్యేవరకు అతని ప్రక్కనే కూర్చున్నాడు. ఎంతో ఆప్యాయంగా అతని గోవును గూర్చి, కోడె దూడను గూర్చి ఎన్నో కుశల ప్రశ్నలు వేశాడు. నందగోపుడు తన కోడెదూడ నుదుటి మీది నల్లని మచ్చలను గురించీ, ఒంటిమీది సుడులను గురించి ఎవరికీ తెలియని రహస్య సాముద్రిక విషయాలెన్నో చెప్పాడు. ప్రత్యేకంగా వంశపారంపర్యంగా తెలుసుకొన్న గోసాముద్రిక రహస్యాలు బుద్ధునికి చెప్పాడు.
ప్రశ్న 3.
బౌద్ధ భిక్షకులు (కొందరు అసూయ చెందడానికి కారణమేమిటి?
జవాబు:
ఆళవీ గ్రామం పరిసర గ్రామాలు బుద్ధుని దర్శనం కోసం, ధర్మబోధ వినడం కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ గౌతమ దేవుని విశాల నేత్రాలు అప్పుడు ఎవరికోసమో నిరీక్షించడం శ్రమణకులు గమనించారు. ఆ తర్వాత వచ్చిన నందగోపునికి తానే దగ్గరుండి భోజనం వడ్డించడం వారికి ఆశ్చర్యం కల్గించింది. చుట్టూరా నిలిచిన కొందరు భిక్షకులకు వారి ప్రసంగాలు విడ్డూరాన్ని కలిగించాయి. ఆ తర్వాత ధర్మ ప్రవచనం చేస్తున్నంత సేపు బుద్ధదేవుడు చిరునవ్వుతో నందగోపాలుని వైపు అలవోకగా చూస్తూనే ఉన్నాడు. బుద్ధుని ఈ చర్య భిక్షకులకు అసూయ కలగడానికి కారణమైంది.
ఆ) క్రింది ప్రశ్నలకు పది పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
అష్టాంగ ధర్మాలు/ మార్గాలు ఏవి?
జవాబు:
కేశములను పూర్తిగా నశింపజేయుటకు గల మార్గమేది? అను ప్రశ్నకు బుద్ధుడు ఇట్లు పల్కెను – ఆర్య ! అష్టాంగ మార్గమే క్లేశ క్షయానికి దారితీయును. అవి :
అష్టాంగ మార్గాలు.
1. సమ్యక్ దృష్టి – అసమంజసములైన భావములతో కాక విషయమును ఉన్నది ఉన్నట్లుగా తెలిసికొనుట.
2. సమ్యక్ వాక్కు – సౌమ్యముగా, సత్యమును, కరుణతో చెప్పుట.
– సామ్యముగా, సత్యములు తమ
3. సమ్యక్ కర్మ – శాంతం, శుద్ధం, ధార్మికము అగు కర్మలను ఆచరించుట.
4. సమ్యక్ సంకల్పం లక్ష్యం – ఉన్నతములు, గంభీరములు అగు భావాలతో ఉండుట.
5. సమ్యక్ చేతన మనస్తత్వం – జీవహింస చేయకుండ సచ్చీలమున జీవించుట
6. సమ్యక్ జీవనం – సునిశితమైన పరిశీలన, తీక్షణమైన బుద్ధి కలిగియుండుట
7. సమ్యక్ వ్యాయామం – యమ నియమాది సాధనములను ఆచరణలోకి తెచ్చుట.
8. సమ్యక్ భావన – జీవితానికి లక్ష్యాలగు తాత్త్విక విషయాలపై మననం, ధ్యాననం కలిగి ఉండుట.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
క్రింది ప్రశ్నకు సమాధానము రాయండి. మీ ఊరిలో జరిగిన / నీవు చూసిన ఆధ్యాత్మిక ప్రసంగాన్ని గూర్చి మిత్రునికి లేఖ రాయండి. మిత్రునికి లేఖ
జవాబు:
ఒంగోలు, ప్రియమిత్రుడు విష్ణుదత్తకు, నీ ప్రియ మిత్రుడు, చిరునామా : |
III. భాషాంశాలు (పదజాలం , వ్యాకరణం)
1. పర్యాయపదాలు:
ఆవు : గోవు, ధేనువు
పులి : శార్దూలం, వ్యాఘ్రం, పుండరీకం
నేత్రం : కన్ను, చక్షువు
నిర్వాణం : మోక్షం, కైవల్యం
ఉద్రేకం : ఆవేశం, కోపం
సూర్యుడు : భానుడు, భాస్కరుడు, ఆదిత్యుడు
శ్రమణకులు : సన్యాసులు, భిక్షువులు
ఆచార్యుడు : గురువు, ఉపాధ్యాయుడు
ఆరాటం : తొందర, ఆత్రం
2. వ్యుత్పత్యర్థాలు :
అదృష్టం : దృష్టము కానిది (భ్యాగం)
అతిథి : తిథివార నక్షత్రములు చూడకుండా వచ్చేవాడు (చుట్టం, స్నేహితుడు)
ఆచార్యుడు : వేదవ్యాఖ్యానము చేయువాడు (గురువు)
నిర్వాణము : సుఖదుఃఖాలు లేనిది (మోక్షం)
హృదయం : హరింపబడునది (గుండె, మనస్సు)
అమృతం : మృతం లేనిది (సుధ)
అసూయ : గుణములందు దోషారోపాణ చేయుట (ఓర్వలేనితనం)
దీక్ష : యజ్ఞాది క్రియారంభమున అనుష్ఠింపబూనుకొనెడు (ఆచార నియమం)
3. నానార్థాలు :
భాగ్యం : అదృష్టం, సంపద
పక్షం : పగ, ప్రక్క రెక్క, 15 రోజులు, బలం
జ్యోతి : ప్రకాశం, ధనం, కొడుకు, చంద్రుడు
నేత్రం : కన్ను, పేరు, ఏఱు, పట్టువస్త్రం
ప్రసంగం : విషయ విస్తరం, ప్రస్తావం, భక్తి, సంభాషణ
వంశం : తండ్రి తాతల పరంపర, వెన్నెముక, వెదురు, కులము, పిల్లనగ్రోవి.
గోవు : ఆవు, కన్ను, బాణం, దిక్కు
అహ్నం : పగలు, రోజు, కాలము
భానువు : సూర్యుడు, శివుడు, వృద్ధుడు
బుద్ధుడు : పండితుడు, బుద్ధదేవుడు
4. ప్రకృతి – వికృతులు :
భాగ్యం – బాగెము
ప్రశ్న – పన్నము
ప్రాణం – పానం
బిక్ష – బిచ్చము
రాత్రి – రాతిరి, రేయి, రేతిరి
ఆశ్చర్యం – అచ్చెరువు
దృష్టి – దిస్టి
గౌరవం – గారవం
విడ్డూరం – విడ్వరం
ధర్మం – దమ్మము
హృదయం – ఎద, ఎడద
భోజనం – బోనం
అంబా – అమ్మా
సంతోషం – సంతసం
వంశం – వంగడం
ముఖము – మొగము
5. సంధులు :
అరుణ + ఉదయ = అరుణోదయ – గుణసంధి
నూతన + ఆనంద + ఆవేశాలు = నూతనానందావేశాలు – సవర్ణదీర్ఘ సంధి
మధ్య + అహ్నం = మధ్యాహ్నం – సవర్ణదీర్ఘ సంధి
నిడు + ఊర్పు = నిట్టూర్పు – ద్విరుక్తటకరాదేశ సంధి
కాషాయ + అంబరధారులు = కాషాయాంబరధారులు – సవర్ణదీర్ఘ సంధి
ప్రతి + అక్షము = ప్రత్యక్షము – యణాదేశ సంధి
ఆసన్నము + అగు = ఆసన్నమగు – ఉత్వసంధి
సుఖ + ఆసనం = సుఖాసనం – సవర్ణదీర్ఘ సంధి
నేత్రము + లు = నేత్రాలు – లు,ల, నల సంధి
క్షుధ + ఆరుడు = క్షుధార్తుడు – సవర్ణదీర్ఘ సంధి
సమ్యక్ + బుద్ధి = సమ్యగ్బుద్ధి – జశ్త్వసంధి
దుః+ సహము = దుస్సహము – విసర్గ సంధి
శ్రమ + ఆర్జితం = శ్రమార్జితం – విసర్గ సంధి
ఆరాటము + పడు = ఆరాటపడు – పడ్వాది సంధి
ప్రతి + ఏకం = ప్రత్యేకం – యణాదేశ సంధి
నెఱు + మది = నెమ్మది – ప్రాతాది సంధి
సూత్రం : అన్యంబులకు సహితమిక్కార్యంబు కొండకచో కానంబడియెడు.
భోజన + అనంతరం = భోజనానంతరం – సవర్ణదీర్ఘ సంధి
మహా + ఆత్ముడు = మహాత్ముడు – సవర్ణదీర్ఘ సంధి
6. సమాసాలు :
గోశాల = గోవుల యొక్క శాల లో – షష్ఠీ తత్పురుష సమాసం
శిష్య సమూహం = శిష్యుల యొక్క సమూహం – షష్ఠీ తత్పురుష సమాసం
పెన్నిధి = పెద్ద (గొప్ప) దైననిధి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సుఖాసనం = సుఖమైన ఆసనం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
వటవృక్షం = మట్టి అను పేరుగల వృక్షం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
మధ్యాహ్నం = అహ్నము మధ్య భాగం – ప్రథమా తత్పురుష సమాసం.
దుస్సహము = సహింపరానిది – అవ్యయీభావ సమాసం
చిరునవ్వు = చిన్నదైన నవ్వు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
శ్రావస్తీనగరం = శ్రావస్తి అనే పేరుగల నగరం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ముఖజ్యోతి = ముఖమనెడి జ్యోతి – రూపక సమాసం
ధర్మప్రవచనం = ధర్మమును గూర్చి ప్రవచనం – ద్వితీయా తత్పురుష సమాసం
సందర్శన భాగ్యం = సందర్శనమనెడి భాగ్యం – రూపక సమాసం
ఆకటి చిచ్చు = ఆకలి అనెడి చిచ్చు – రూపక సమాసం
మహాత్మ = గొప్పదైన ఆత్మ – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
9th Class Telugu 11th Lesson ధర్మదీక్ష 1 Mark Bits
1. కందర్ప దర్పదములగు సుందర దరహాసములు – ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) వృత్త్యనుప్రాస
బి) లాటానుప్రాస
సి) ఛేకానుప్రాస
డి) అర్థాంతరన్యాస
జవాబు:
సి) ఛేకానుప్రాస
2. నా హృదయంలో వాగ్గేవి కొలువై ఉంది. – (వికృతి పదం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఎదయం
బి) సదయం
సి) ఎద
డి) ఎదడ
జవాబు:
సి) ఎద
3. ఓ కుమారా ! నీకు వంద వందనాలు – ఏ అలంకారమో గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) లాటానుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) అంత్యానుప్రాస
డి) అర్థాంతరన్యాస
జవాబు:
బి) ఛేకానుప్రాస
4. నందగోపుడు భోజనం చేశాడు. (గీత గీసిన పదానికి గణాన్ని గుర్తించండి) (S.A. III – 2016-17)
ఎ) త గణము
బి) మ గణము
సి) ర గణము
డి) భ గణము
జవాబు:
ఎ) త గణము
5. “ఏమిటి విశేషం” అని నందగోపుడు అడిగాడు. (ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి. ) (S.A. III – 2016-17)
ఎ) “ఏమిటి విశేషమని” నందగోపుడు అడగలేదు.
బి) ఏమిటి విశేషమని నందగోపుడు అడిగాడు.
సి) “విశేషం ఏంటి” అని నందగోపుడు అడిగాడు.
డి) ఏమి విశేషం లేదా అని నందగోపుడు అడిగాడు.
జవాబు:
బి) ఏమిటి విశేషమని నందగోపుడు అడిగాడు.
6. ఆయన దర్శన భాగ్యం కలుగుతుందో ! కలగదో ! (ఏ రకమైన వాక్యమో గుర్తించండి. ) (S.A. III – 2016-17)
ఎ) హేత్వర్ణకం
బి) సామర్థ్యార్థకం
సి) సందేహాహాకం
డి) ఆశీరర్థకం
జవాబు:
సి) సందేహాహాకం
భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)
1. అర్థాలు :
7. మార్కుల కోసం ఆరాటపడడం కాదు. శ్రద్ధ ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కోపం
B) ఆత్రపడు
C) సంతోషం
D) కష్టం
జవాబు:
B) ఆత్రపడు
8. భిక్షవులు బుద్ధుని వెంట నడిచారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) బిచ్చగాళ్ళు
B) మునులు
C) సన్యాసులు
D) జనులు
జవాబు:
C) సన్యాసులు
9. ప్రతి ఒక్కరు వ్యసనాలను విసర్జించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) విడుచు
B) పొందు
C) దగ్గర
D) దూరం
జవాబు:
A) విడుచు
10. పెద్దల మాట ఆలకించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) చూడు
B) విను
C) శ్రద్ధ
D) మాట్లాడు
జవాబు:
B) విను
11. చిన్నపిల్లల ముద్దుమాటలు చూసి పెద్దలు మురిసిపోతారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) గంతులు
B) బాధ
C) సంతోషం
D) ఎగతాళి
జవాబు:
C) సంతోషం
12. అపరిచితులతో చనువుగా ఉండరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కోపం
B) ద్వేషం
C) ఇష్టం
D) స్నేహం
జవాబు:
D) స్నేహం
13. నందుని హృదయంలో జిజ్ఞాస రేకెత్తింది – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి ?
A) కోపము
B) తెలుసుకోవాలనే కోరిక
C) ఆనందము
D) ఆసక్తి
జవాబు:
B) తెలుసుకోవాలనే కోరిక
14. భిక్షువులను అతిథి సత్కారాలతో ఎంతో ఆప్యాయంగా ఆదరించారు – గీత గీసిన పదం అర్థం గుర్తించండి.
A) ప్రేమగా
B) గౌరవంగా
C) ఇష్టంగా
D) కోపంగా
జవాబు:
A) ప్రేమగా
15. కొంత సేపటికి శ్రవణకులు అందరూ వటవృక్షచ్ఛాయలో సమాసీనులయ్యారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) గ్రామ ప్రజలు
B) శిష్యులు
C) బౌద్ధ భిక్షువులు
D) సన్యాసులు
జవాబు:
C) బౌద్ధ భిక్షువులు
16. అవగాహన చేసికొన్న వారికి నిర్వాణం కరతలామలకం – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి ?
A) బాగా తెలిసినది
B) చేయి
C) ఉసిరికాయ
D) సంపాదింపబడేది
జవాబు:
A) బాగా తెలిసినది
2. పర్యాయపదాలు :
17. గోవు దేవతల ప్రతిరూపంగా పూజలందుకుంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఆవు దూడ
B) ధేనువు, ఆవు
C) గిడ్డి, గరుడ
D) మొదవు, మేగము
జవాబు:
B) ధేనువు, ఆవు
18. మన జాతీయ జంతువు పులి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) వ్యాఘ్రం, కరి
B) శార్దూలం, సారంగి
C) పుండరీకం, శార్దూలం
D) సింహం, నక్క
జవాబు:
C) పుండరీకం, శార్దూలం
19. బుద్ధుని వెంట శ్రవణుకులు నడిచారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) జనులు, ప్రజలు
B) రైతులు, కూలీలు
C) మునులు, ఋషులు
D) సన్యాసులు, భిక్షువులు
జవాబు:
D) సన్యాసులు, భిక్షువులు
20. ‘నిర్వాణం’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) మోక్షం, కైవల్యం
B) మోక్షం, శుభం
C) ముక్తి, విముక్తి
D) స్వర్గం, నరకం
జవాబు:
A) మోక్షం, కైవల్యం
21. సర్వలోకాలకు కాంతి ప్రదాత సూర్యుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) భానుడు, చంద్రుడు
B) భాస్కరుడు, తస్కరుడు
C) ఆదిత్యుడు, రవి
D) రవి, రాము
జవాబు:
C) ఆదిత్యుడు, రవి
22. కన్నులతో వినే శక్తి పాముకు కలదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) నేత్రం, ఆత్రం
B) చక్షువు, దృష్టి
C) అక్షి, పక్షి
D) నయనం, నయం
జవాబు:
B) చక్షువు, దృష్టి
23. అది నందుడు పెంచి పెద్దచేసిన ఆవు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) హయము, తురగము
B) గిడ్డి, ధేనువు
C) మొదవు, హరి
D) కపిల, హస్తి
జవాబు:
B) గిడ్డి, ధేనువు
3. వ్యుత్పత్త్యర్థాలు :
24. ‘దృష్టము కానిది‘ భాగ్యం – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) దురదృష్టం
B) అదృష్టం
C) భోగం
D) శుభం
జవాబు:
B) అదృష్టం
25. దుఃఖాదులు లేనిదే జీవితం లేదు – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) నిర్వాకం
B) నిర్వహణ
C) నిర్వాణం
D) బాధ
జవాబు:
C) నిర్వాణం
26. ‘హృదయం’ దీనికి వ్యుత్పత్తి గుర్తించండి.
A) హరింపబడునది
B) ద్వేషించునది
C) ప్రేమించునది
D) దయలేనిది
జవాబు:
A) హరింపబడునది
27. ‘గుణములందు దోషారోపణ చేయుట’ హీనుల పని – వ్యుత్పత్త్యర్థం తగినది గుర్తించండి.
A) మదం
B) కోపం
C) అసూయ
D) ద్వేషం
జవాబు:
C) అసూయ
28. యజ్ఞాది క్రియారంభమున అనుష్ఠింప పూనుకొనెడు ఆచారనియమం – సరైనది గుర్తించండి.
A) కంకణ బద్దులు
B) దీక్ష
C) నడుం కట్టుట
D) పట్టుదల
జవాబు:
B) దీక్ష
29. “తిథి, వార నియమాలు లేకుండా వచ్చేవాడు” – ఈ పదానికి వ్యుత్పత్యర్థం ఏది?
A) బంధువు
B) అతిథి
C) అభ్యాగతి
D) సోదరుడు
జవాబు:
B) అతిథి
4. నానార్థాలు :
30. పక్షములు రెండు. శుక్లపక్షం, కృష్ణపక్షం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) రెక్క ముక్క
B) ప్రక్క సందు
C) 15 రోజులు, రెక్క
D) బలం, శక్తి
జవాబు:
C) 15 రోజులు, రెక్క
31. అహ్మము యొక్క మధ్యభాగం మధ్యాహ్నం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పగలు, రాత్రి
B) రోజు, కాలం
C) కాలం, సమయం
D) రోజు, దినం
జవాబు:
B) రోజు, కాలం
32. వంశం నిలబెట్టేది వివాహమే కదా ! – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) కులం, కలం
B) వెదురు, బెదురు
C) వెన్నెముక, ఎముక
D) తండ్రితాతలపరంపర, పిల్లనగ్రోవి
జవాబు:
D) తండ్రితాతలపరంపర, పిల్లనగ్రోవి
33. బుద్ధుడు మానవాళికి ఒక కొత్త దారి చూపాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) తెలియనివాడు, అమాయకుడు
B) మేధావి, తెలివి
C) పండితుడు, పామరుడు
D) బుద్ధదేవుడు, పండితుడు
జవాబు:
C) పండితుడు, పామరుడు
34. జ్యోతులు వెలిగించే కార్తీకమాసం పవిత్రమైంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) చంద్రుడు, బుధుడు
B) ప్రకాశం, కొడుకు
C) ధనం, డబ్బు
D) కొడుకు, పుత్రుడు
జవాబు:
B) ప్రకాశం, కొడుకు
35. నేత్రదానంతో మరొకరికి చూపు నివ్వండి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) కన్ను, పేరు
B) ఏరు, పారు
C) పట్టువస్త్రం, గుడ్డ
D) పేరు, నామం
జవాబు:
B) ఏరు, పారు
36. పెద్దల ప్రసంగాలు అమృతతుల్యాలు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) విషయవిస్తారం, కథ
B) మాటలు, పాటలు
C) భక్తి, ముక్తి
D) సంభాషణ, ప్రస్తావం
జవాబు:
D) సంభాషణ, ప్రస్తావం
37. ‘ఒక చిరునవ్వు విసిరాదా ముసలి తాత” – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) తండ్రి తండ్రి, ముసలి
B) తండ్రి, బ్రహ్మ
C) బ్రహ్మ, ముసలిది
D) రక్షకుడు, తల్లి తండ్రి
జవాబు:
B) తండ్రి, బ్రహ్మ
5. ప్రకృతి – వికృతులు :
38. లేగదూడలు తల్లులకై ‘అంబా‘ అని అరుస్తున్నాయి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) అంబ
B) అమ్మా
C) అబ్బా
D) అయ్యా
జవాబు:
B) అమ్మా
39. చిన్నపిల్లలకు ఎవరి కన్ను పడకుండా దిస్టి చుక్క పెడతారు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) దోషం
B) చూపు
C) దృష్టి
D) కన్ను
జవాబు:
C) దృష్టి
40. వ్యాసుడు భిక్ష పాత్రను పగులగొట్టాడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బిచ్చము
B) బిక్ష
C) భిచ్చం
D) బికష
జవాబు:
A) బిచ్చము
41. భోజనం చేసేటప్పుడు మెతుకులు చుట్టూ పడకూడదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బువ్వ
B) అన్నం
C) సద్ది
D) బోనం
జవాబు:
D) బోనం
42. దమ్మము తప్పి ప్రవర్తించకూడదు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) న్యాయం
B) ధర్మం
C) అహింస
D) సత్యం
జవాబు:
B) ధర్మం
43. తాను చేసుకున్న పూర్వ పుణ్యం అంతే కదా! – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
A) పుణ్యము
B) పున్నెం
C) పున్యము
D) పూర్వము
జవాబు:
B) పున్నెం
44. ఆకటి చిచ్చు వేధించినా, అతడు గోపాలక ధర్మం వీడలేదు – గీత గీసిన పదానికి ప్రకృతి ఏది?
A) చిచ్చి
B) శుచి
C) అగ్ని
D) చిత్తు
జవాబు:
C) అగ్ని
6. సంధులు :
45. అరుణోదయ కాంతులతో తూర్పు దిక్కు మెరుస్తోంది – గీత గీసిన పదానికి సంధిని గుర్తించండి.
A) సవర్ణదీర్ఘ
B) వృద్ధి
C) గుణ
D) యణాదేశ
జవాబు:
C) గుణ
46. ‘నిడు + ఊర్పు’ – సంధి పేరేమిటి?
A) టుగాగమ
B) ద్విరుక్తటకారం
C) ప్రాతాది
D) జశ్త్వ
జవాబు:
B) ద్విరుక్తటకారం
47. ‘సమ్యగ్బుద్ధి’ విడదీయము.
A) సమ్యక్ + బుద్ధి
B) సమ్య + బుద్ధి
C) సమ్య + కుబుద్ధి
D) సమయక్ + బుద్ధి
జవాబు:
A) సమ్యక్ + బుద్ధి
48. కింది వానిలో విసర్గసంధి ఉదాహరణను గుర్తించండి.
A) నేత్రాలు
B) సుఖాసనం
C) మధ్యాహ్నం
D) దుస్సహం
జవాబు:
D) దుస్సహం
49. ‘నెఱ + మది’ – సంధి పేరేమిటి?
A) ఆమ్రేడిత సంధి
B) ప్రాతాది
C) పడ్వాది
D) యణాదేశ
జవాబు:
B) ప్రాతాది
50. ప్రతి + ఏకం – సంధి చేయండి.
A) ప్రతేకం
B) ప్రతియేకం
C) ప్రత్యేకం
D) ప్రతిఏకం
జవాబు:
C) ప్రత్యేకం
51. యణాదేశ సంధికి ఉదాహరణను గుర్తించండి.
A) ప్రత్యక్షం
B) అరుణోదయం
C) ఆరాటపడు
D) నేత్రాలు
జవాబు:
A) ప్రత్యక్షం
52. ‘సుఖాసనం’ – సంధిని గుర్తించండి.
A) గుణ
B) యణాదేశ
C) వృద్ధి
D) సవర్ణదీర్ఘ
జవాబు:
D) సవర్ణదీర్ఘ
53. ‘నిట్టూర్పు’ పదాన్ని విడదీయండి.
A) నిట్ట + ఊర్పు
B) నిట్టు + ఊర్పు
C) నిడు + ఊర్పు
D) నిట + టూర్పు
జవాబు:
C) నిడు + ఊర్పు
54. ‘పొరుగూళ్ళు’ – ఈ పదంలో గల సంధి ఏది?
A) అత్వసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) ఉత్వసంధి
D) ఇత్వసంధి
జవాబు:
C) ఉత్వసంధి
55. ‘హృదయాంతరాళంలో ప్రేమ లేదు’ – గీత గీసిన పదం ఏ సంధి?
A) గుణ సంధి
B) వృద్ధి సంధి
C) అత్వ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
D) సవర్ణదీర్ఘ సంధి
7. సమాసాలు:
56. నేడు ప్రభుత్వం గోశాలలపై శ్రద్ధ పెట్టాలి – గీత గీసిన పదానికి విభక్తిని గుర్తించండి.
A) కంటె
B) వలన
C) యొక్క
D) అందు
జవాబు:
D) అందు
57. ‘సహింపరానిది’ – సమాసపదం గుర్తించండి.
A) స్వభావోక్త
B) ఉత్ప్రేక్ష
C) ఉపమా
D) యమకం
జవాబు:
D) యమకం
58. ‘ముఖ జ్యోతి’ దీనిలోని విభక్తిని గుర్తించండి.
A) కొఱకు
B) యొక్క
C) చేత
D) అనెడి
జవాబు:
D) అనెడి
59. సంభావనా పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) శ్రావస్తీ నగరం
B) చిరునవ్వు
C) ఆకటిచిచ్చు
D) మహాత్మ
జవాబు:
A) శ్రావస్తీ నగరం
60. ‘మధ్యాహ్నం’ సమాసం గుర్తించండి.
A) రూపక
B) అవ్యయిభావ
C) ప్రథమా తత్పురుష
D) చతుర్టీ
జవాబు:
C) ప్రథమా తత్పురుష
61. ధర్మమును గూర్చి ప్రవచనం – గీత గీసిన పదానికి విభక్తిని గుర్తించండి.
A) ప్రథమా
B) ద్వితీయా
C) తృతీయా
D) చతుర్థి
జవాబు:
D) చతుర్థి
62. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) శ్రావస్తీ నగరం
B) సందర్శన భాగ్యం
C) మధ్యాహ్నం
D) పెన్నిధి
జవాబు:
B) సందర్శన భాగ్యం
63. ‘భిక్షాపాత్రము’-ఇది ఏ సమాసమో గుర్తించండి.
A) తృతీయా తత్పురుష
B) చతుర్దీ తత్పురుష
C) దంద్వము
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
B) చతుర్దీ తత్పురుష
64. ‘మధ్యాహ్నము’ – ఈ సమాసానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
A) అహ్నము యొక్క మధ్య భాగం
B) అహ్నము మరియు మధ్యము
C) మధ్యముగా ఉన్న అహ్నము
D) మధ్యమును, అహ్నమును
జవాబు:
A) అహ్నము యొక్క మధ్య భాగం
65. ‘అతిదూరము కానిది’ – సమాసపదంగా కూర్చండి.
A) అతి దూరము
B) అనతి దూరము
C) అభ్యంతరము
D) అదూరము
జవాబు:
B) అనతి దూరము
8. అలంకారాలు :
66. “గౌతముని ముఖజ్యోతి ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉంది” – గీత గీసిన పదంలోని అలంకారాన్ని గుర్తించండి.
A) ఉపమా
B) రూపక
C) అతిశయోక్తి
D) శ్లేష
జవాబు:
B) రూపక
67. “గౌతముని ముఖ వర్చస్సు ఉదయించే సూర్యబింబంలా ఉంది” – దీనిలో అలంకారాన్ని గుర్తించండి.
A) సాససం
B) దుస్సహం
C) అసహ్యం
D) అసహనం
జవాబు:
C) అసహ్యం
68. “ఎండ నెత్తి మాడ్చింది. ఆకలి దహిస్తోంది. నాలుక పిడచ గట్టింది” – దీనిలోని అలంకారం గుర్తించండి.
A) స్వభావోక్తి
B) శ్లేష
C) అతిశయోక్తి
D) ముక్తపదగ్రస్తం
జవాబు:
A) స్వభావోక్తి
69. ఒకే అక్షరం, లేదా రెండు మూడక్షరాలు, వాక్యం చివర మాటిమాటికీ వస్తే, దాన్ని ఏ అలంకారం అంటారు?
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) అంత్యానుప్రాస
D) ఉపమాలంకారం
జవాబు:
C) అంత్యానుప్రాస
70. ‘గ్రామస్తులు ఆనంద తరంగాలలో తలమునకలయ్యారు’ – ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి.
A) రూపకము
B) ఉపమా
C) ఉత్ప్రేక్ష
D) వృత్త్యనుప్రాస
జవాబు:
A) రూపకము
71. ‘ఫలము’ – ఈ పదం ఏ గణము?
A) భ గణం
B) ర గణము
C) త గణము
D) న గణము
జవాబు:
D) న గణము
9. ఆధునిక వచనాన్ని గుర్తించడం :
72. ‘మీ సభా కార్యక్రమము నంతయుఁ జెడఁ గొట్టితిని’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (S.A. II – 2018-19)
A) మీ సభా కార్యక్రమాన్నంతా చెడగొట్టాను
B) మీ సభా కార్యక్రమాన్ని అంతా చెడగొట్టితిని
C) మీ సభా కార్యక్రమం చెడగొట్టాము
D) మీ సభలో కార్యక్రమాన్ని అంతా చెడగొట్టారు
జవాబు:
A) మీ సభా కార్యక్రమాన్నంతా చెడగొట్టాను
73. ‘జపించు వేదమటవీ మధ్యంబులో నేద్పగున్’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) జపించే వేదం, అడవి మధ్యలో ఏడ్పవుతుంది
B) జపించే వేదము, అటవీ మధ్యంలో ఏడుపు
C) జపించే వేదము అటవీ మధ్యలో ఏడ్పు
D) జపించే వేదం అటవి మధ్యమంలో ఏడ్పవుతుంది
జవాబు:
A) జపించే వేదం, అడవి మధ్యలో ఏడ్పవుతుంది
10. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం :
74. గౌతముడు ఎన్ని ప్రశ్నలు వేసాడు – కర్మణి వాక్యం గుర్తించండి.
A) ఎన్నో ప్రశ్నలు వేశాడు గౌతముడు
B) గౌతముడు వేసాడ ఎన్నో ప్రశ్నలు
C) గౌతమునిచే ఎన్నో ప్రశ్నలు వేయబడ్డాయి
D) ప్రశ్నలు ఎన్నో గౌతముడు వేసాడు
జవాబు:
C) గౌతమునిచే ఎన్నో ప్రశ్నలు వేయబడ్డాయి
75. అటువైపు చూడబడ్డారు – కర్తరి వాక్యం గుర్తించండి.
A) చూడబడ్డారు అటువైపు
B) అటువైపు చూచారు
C) వైపు అటు చూడబడ్డారు
D) అటు చూసి
జవాబు:
B) అటువైపు చూచారు
76. బుద్ధుడు ప్రవచనం ముగించాడు – కర్మణి వాక్యం గుర్తించండి.
A) బుద్ధునిచే ప్రవచనం ముగించబడింది
B) బుద్దునిచే ప్రవచనం ముగించాడు
C) బుద్ధుడు ప్రవచనం ముగించబడింది.
D) ప్రవచనంచే బుద్దుడు ముగించబడింది.
జవాబు:
A) బుద్ధునిచే ప్రవచనం ముగించబడింది
77. పెక్కు విషయములను ఉపన్యసించారు – ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.
A) పెక్కు విషయాలు ఉపన్యసిస్తారు
B) పెక్కు విషయాలు ఉపన్యసింపబడ్డాయి
C) పెక్కు విషయములు ఉపన్యసింపబడతాయి
D) పెక్కు విషయాలు ఉపన్యసింపబడును
జవాబు:
B) పెక్కు విషయాలు ఉపన్యసింపబడ్డాయి
78. ‘ఎన్నో విషయాలు కృష్ణారావుగారిచే వివరింపబడ్డాయి – ఈ కర్మణి వాక్యానికి కర్తరి వాక్యాన్ని
A) ఎన్నో విషయాలను కృష్ణారావుగారు వివరిస్తారు అవుతుంది
B) ఎన్నో విషయాలను కృష్ణారావుగారు వివరించారు
C) ఎన్నో విషయాలు కృష్ణారావుగారు వివరింపగలరు
D) ఎన్నో విషయాలు కృష్ణారావుగారు తెలిపారు
జవాబు:
B) ఎన్నో విషయాలను కృష్ణారావుగారు వివరించారు
11. ప్రత్యక్ష, పరోక్ష కథనాలను గుర్తించడం :
79. “నేనేమి ఎరగని వట్టి అమాయకుణ్ణి” అని అన్నాడు – పరోక్ష కథనం గుర్తించండి.
A) నేను ఏమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.
B) తానేమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.
C) అతను ఏమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.
D) తానేమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.
జవాబు:
D) తానేమి ఎరగని వట్టి అమాయకుణ్ణి అన్నాడు.
80. “నాయనా ! నీ లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది. నీవు భోజనం చేయి” అని అన్నాడు – పరోక్ష కథనం గుర్తించండి.
A) (అతనితో) లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది. భోజనం చేయి అని అన్నాడు.
B) అతనిని సంబోధిస్తూ లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది, భోజనం చేయని అన్నాడు.
C) బాబూ లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది భోజనం చేయని అన్నాడు.
D) అతనితో తమ లేగదూడ తల్లివద్ద పాలు తాగుతోంది. భోజనం చేయని అన్నాడు.
జవాబు:
B) అతనిని సంబోధిస్తూ లేగదూడ తల్లి దగ్గర పాలు తాగుతోంది, భోజనం చేయని అన్నాడు.
81. “మా అన్నయ్య ముస్తఫాకమల్ కి ఒక కిరాణా దుకాణం ఉంది” అన్నారు కలామ్ – ఈ ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) తమ అన్నయ్య ముస్తఫాకమల్ కి, ఒక కిరాణా దుకాణం ఉందని కలామ్ అన్నారు.
B) మా అన్నయ్య ముస్తఫాకమలకు కిరాణా దుకాణం ఉందని కలామ్ అన్నారు.
C) వారి అన్నయ్య ముస్తఫాకమల్ కి కిరాణ దుకాణం ఉందని కలామ్ చెప్పారు.
D) నా అన్నయ్య ముస్తఫాకమల్ కి కిరాణా దుకాణం ఉండేదని కలామ్ అన్నారు.
జవాబు:
A) తమ అన్నయ్య ముస్తఫాకమల్ కి, ఒక కిరాణా దుకాణం ఉందని కలామ్ అన్నారు.
12. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :
82. సమృద్ధిగా ఉన్నాయి.
A) సమృద్ధిగా ఉండవచ్చు
B) సమృద్ధిగా ఉంటాయి
C) సమృద్ధిగా లేవు
D) సమృద్ధిగా ఉంటున్నాయి
జవాబు:
C) సమృద్ధిగా లేవు
83. కుశల ప్రశ్నలు వేశాడు.
A) కుశల ప్రశ్నలు వేస్తాడు
B) కుశల ప్రశ్నలు వేయలేదు
C) కుశల ప్రశ్నలు వేయవచ్చు
D) కుశల ప్రశ్నలు వేస్తుంటాడు
జవాబు:
B) కుశల ప్రశ్నలు వేయలేదు
84. ‘సన్యాసులందరితో కలిసి భోజనం చేశారు’ – ఈ వాక్యానికి వ్యతిరేకార్థ వాక్యాన్ని గుర్తించండి.
A) సన్యాసులందరితో కలిసి భోజనం చేయలేదు
B) సన్యాసులు భోజనం చేస్తారు
C) సన్యాసులు భోజనం చేయరు
D) సన్యాసులు భోజనం తినగలరు
జవాబు:
A) సన్యాసులందరితో కలిసి భోజనం చేయలేదు
85. ‘నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు’ – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
A) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలుపలేదు
B) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు
C) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలుపడు
D) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలుపరు
జవాబు:
B) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు
13. వాక్యరకాలను గుర్తించడం :
86. ఎంతో భయభక్తులతో సాగిలపడి, లేచి నిలబడ్డాడు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంయుక్త
B) సంక్లిష్ట
C) సామాన్య
D) మహావాక్యం
జవాబు:
B) సంక్లిష్ట
87. గౌతముడు నిలబడ్డాడు, శిష్యులు నిలబడ్డారు – ఇది ఏ రకమైన వాక్యం?
A) సంక్లిష్ట
B) మహావాక్యం
C) సంయుక్త
D) సామాన్య
జవాబు:
C) సంయుక్త
88. ‘ఆచార్యుని కెదిరింపకు’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) ఆశీరర్ధకం
B) విద్యర్థకం
C) నిషేధార్థకం
D) అనుమత్యర్థకం
జవాబు:
C) నిషేధార్థకం
89. ‘రాముడు చెట్టు ఎక్కి కాయలు కోశాడు’ – ఇది ఏ రకమైన వాక్యం?
A) సామాన్య వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) మహావాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం
14. ప్రక్రియలను గుర్తించడం:
90. చిరునవ్వు చూసి ఆనందం కలిగింది – గీత గీసిన పదం ఏ ప్రక్రియ?
A) చేదరకం
B) క్వార్థకం
C) శత్రర్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
B) క్వార్థకం
91. ఈ గ్రామానికెందుకు వచ్చానో ఎరుగుదురా? – గీత గీసిన పదం ఏ ప్రక్రియ?
A) ధాత్వార్ధం
B) తద్ధర్మార్థకం
C) ప్రశ్నార్థకం
D) నిశ్చయార్థకం
జవాబు:
C) ప్రశ్నార్థకం
92. ‘వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి’ – గీత గీసిన పదాలు, ఏ రకం అసమాపక క్రియకు చెందును?
A) చేదర్థకం
B) క్వార్ధకం
C) ప్రశ్నార్థకం
D) శత్రర్థకం
జవాబు:
B) క్వార్ధకం
93. వర్తమానకాల అసమాపక క్రియను ఏమంటారు?
A) చేదర్థకం
B) క్వార్థకం
C) శత్రర్థకం
D) అద్యర్థకం
జవాబు:
C) శత్రర్థకం