AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 11th Lesson సీత ఇష్టాలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 11th Lesson సీత ఇష్టాలు

7th Class Telugu 11th Lesson సీత ఇష్టాలు Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రం చూడండి. ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
చిత్రంలో తంబురా వాయిస్తూ బుర్రకథ చెపుతున్న కథకుడూ, వంత పాడుతున్న మరో ఇద్దరూ ఉన్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో ఏం జరుగుతున్నది?
జవాబు:
చిత్రంలో బుర్రకథ చెప్పడం జరుగుతున్నది.

ప్రశ్న 3.
ఇలాంటి ప్రదర్శనను ఎప్పుడైనా చూశారా? దీనిని ఏమంటారు?
జవాబు:
ఇటువంటి ప్రదర్శనను చూశాను. దీనిని “బుర్రకథ” అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

ప్రశ్న 4.
చిత్రంలో మధ్యనున్న వ్యక్తి ఏం మాట్లాడుతుండవచ్చు? ప్రక్కనున్నవారు ఏమంటున్నారు? ఊహించి చెప్పండి.
జవాబు:
చిత్రంలో మధ్యనున్న వ్యక్తి బుర్రకథలో ప్రధాన కథకుడు. అతడు అల్లూరి సీతారామరాజు వంటి సాహసవీరుని కథ చెపుతూ ఉండవచ్చు. ప్రక్కనున్నవారు వంతలు.. వారు “తందాన తాన” అంటూ వంత పాడుతూ ఉండవచ్చు. ప్రక్కవారిలో ఒకడు హాస్యం చెపుతూ ఉండి ఉండవచ్చు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
‘సీత’ లాంటి వాళ్ళను గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
సీతలాంటి తెలివైన ఆడవాళ్ళు, సంఘంలో ఎంతోమంది ఉంటారు. వారిలో చాలామందికి చదువు లేనందువల్ల వారు వంటింటి కుందేళ్ళుగా మారిపోయారు. సీతలా చదువుకుంటే, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రాణించవచ్చు. ముద్దుగా నేర్పిస్తే, ముగుదలు నేర్చుకోలేని విద్యలు ఉండవు. కిరణ్ బేడీ లాంటి నిజాయితీ పోలీసు ఆఫీసర్లు, . ఇందిర, సిరిమావో వంటి గొప్ప రాజకీయ నాయకులు స్త్రీలలో ఉన్నారు.

ప్రశ్న 2.
ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే. ఎందుకు? కారణాలు చెప్పండి.
జవాబు:
ఆడవాళ్ళలో ఎంతోమంది చదువుకున్నవారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసినవారు, రాజ్యాలు పాలించిన వారూ ఉన్నారు. రాణి రుద్రమదేవి, ఇందిరాగాంధీ, ఝాన్సీలక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ ముఖ్, సరోజినీ నాయుడు వంటి గొప్ప నాయికామణులు ఉన్నారు. మమతాబెనర్జీ జయలలిత, మాయావతి, షీలాదీక్షిత్ వంటి ఆడ ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రతిభాపాటిల్ వంటి స్త్రీ రాష్ట్రపతులున్నారు. ముఖ్యంగా స్త్రీలు బిడ్డలను కనిపెంచుతున్నారు. స్త్రీలలో ఎందరో ప్రొఫెసర్లు, అంతరిక్ష యాత్రికులు, శాస్త్రకోవిదులు ఉన్నారు. సోనియాగాంధీ వంటి పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు. కాబట్టి స్త్రీలు కూడా గొప్పవారే.

ప్రశ్న 3.
శ్రావణి టీచర్ గురించి తెలుసుకున్నారు కదా ! అట్లాగే మీ ఉపాధ్యాయులను గురించి మాట్లాడండి.
జవాబు:
మా ఉన్నత పాఠశాలలో ‘గౌరి’ అనే తెలుగు టీచరూ, ‘పార్వతి’ గారు అనే లెక్కలు టీచరూ ఉన్నారు. వారు మాకు చక్కగా పాఠాలు బోధిస్తారు. మా తెలుగు టీచరు మాకు భారత, భాగవత, రామాయణ కథలు చెపుతారు.. మాకు తెలుగు భాషపై మంచి ఇష్టం కల్గించారు.

ఇక మా లెక్కల టీచరు పార్వతిగారు, లెక్కలు చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యేలా చెపుతారు. రోజూ సాయంత్రము అదనంగా క్లాసు తీసుకొని, అక్కడే మాచే ఇంటిపని లెక్కలు అన్నీ చేయిస్తారు. ఆ ఇద్దరు టీచర్లు అంటే, మా పిల్లలందరికీ చాలా ఇష్టం.

II. చదవడం – రాయడం

ప్రశ్న 1.
‘కొత్త వింత – పాత పోత’ అనే అర్థంవచ్చే వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయి?
జవాబు:
పాండవులూ, కౌరవుల కథ, నలమహారాజు కథ, సీతమ్మ కష్టాలు వంటి కథలు పాతకథలయిపోయాయి. – కాబట్టి కొత్త కథ చెప్పమని రాజు, కృష్ణవేణి అక్కను అడిగాడు. అప్పుడు రోజా “పాతంటే రోతగా ఉందా !” అని రాజును ప్రశ్నించింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

ప్రశ్న 2.
పాఠంలో మీకు నవ్వు పుట్టించిన అంశాలు రాయండి.
జవాబు:

  1. రాజు రోజాను, “కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా అట్లా అరుస్తావ్” అన్నపుడు నవ్వు వచ్చింది.
  2. రాజు “ఆలస్యం అమృతం విషం” అంటే, ఇదేనేమో అన్నాడు. అప్పుడు రోజా “నువ్వు నోరు మూస్తావా? ముయ్యవా?” అంటుంది. అప్పుడు కూడా నవ్వు వచ్చింది.
  3. రాజు తాను “26 లెటర్సూ ABCD ” లాంటివి చదివానని తన చదువు – గురించి గొప్ప చెప్పినపుడు నవ్వు వచ్చింది.

ప్రశ్న 3.
కింది అపరిచిత వచన భాగం చదివి, ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి, రాయండి.

“1940 ప్రాంతంలో తెలంగాణలో స్త్రీల చైతన్యం కొంత వికసించింది. లేడీ హైదరీ క్లబ్, సోదరీ సమాజం, ఆంధ్ర యువతీమండలి, ఆంధ్రమహాసభ మొదలైన సమాజాలు ఏర్పడి, సమావేశాల ద్వారా స్త్రీలను చైతన్యవంతులను చేశాయి. – రత్నదేశాయి తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. వితంతువుల కోసం వసతిగృహాలు ఏర్పాటు చేశారు. అనేకమంది రచయితలు, రచయిత్రులు పత్రికల ద్వారా స్త్రీలలో చైతన్యం కలిగించారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి మొదలైనవాళ్ళు సంఘసంస్కరణకు కృషిచేశారు. అఘోరనాథ ‘ఛటోపాధ్యాయగారి భార్య వసుంధరా దేవి గారు, నాంపల్లిలో బాలికల కోసం ‘పాఠశాలను ప్రారంభించారు. ఈమె సరోజినీ నాయుడు గారి తల్లి.
అ) పైన పేర్కొన్న సంఘటనలన్నీ ఎప్పుడు జరిగాయి?
ఎ) స్వాతంత్ర్యానికి ముందు
బి) స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత
సి) 19వ శతాబ్దంలో
జవాబు:
ఎ) స్వాతంత్ర్యానికి ముందు

ఆ) గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసిన మహిళ ఎవరు?
ఎ) లేడీ హైదరీక్లబ్
బి) రత్నదేశాయి
సి) ఇందిరాగాంధీ
జవాబు:
బి) రత్నదేశాయి

ఇ) సంగం లక్ష్మీబాయి ఏంచేశారు?
ఎ) వితంతువులకు హాస్టల్ ఏర్పరిచారు
బి) సంఘసంస్కరణ చేశారు
సి) క్లబ్బును స్థాపించారు
జవాబు:
బి) సంఘసంస్కరణ చేశారు

ఈ) నాంపల్లిలో బాలికా పాఠశాలను ప్రారంభించిన వారు ఎవరు?
ఎ) అఘోరనాథ ఛటోపాధ్యాయ
బి) శ్రీమతి అఘోరనాథ ఛటోపాధ్యాయ
సి) శ్రీమతి సరోజినీ నాయుడు
జవాబు:
బి) శ్రీమతి అఘోరనాథ ఛటోపాధ్యాయ

ఉ) ఇది ఒక సమాజం పేరు.
ఎ) సోదరీ సమాజం
బి) ఆంధ్ర యువతీ మండలి
సి) లేడీ హైదరీక్లబ్
జవాబు:
ఎ) సోదరీ సమాజం

ఊ) సరోజినీ నాయుడు తండ్రి పేరు
ఎ) రత్నదేశాయి
బి) అఘోరనాథ ఛటోపాధ్యాయ
సి) గాంధీ
జవాబు:
బి) అఘోరనాథ ఛటోపాధ్యాయ

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

4. పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) బుర్రకథ ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఎవరెవరు ప్రదర్శించారు?
జవాబు:
బుర్రకథ ప్రదర్శన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. కృష్ణవేణి కథకురాలు. రాజు, రోజాలు వంతలు.

ఆ) బుర్రకథలో మొదట ఎవరెవరిని ప్రార్థించారు? ఏమని వేడుకున్నారు?
జవాబు:
బుర్రకథలో మొదట కృష్ణవేణి, సరస్వతీదేవిని, మహాలక్ష్మిని, దుర్గను ప్రార్థించింది.

  1. చదువులనిచ్చే సరస్వతిని చల్లగా చూడమని ప్రార్థించింది.
  2. సంపదలనిచ్చే లక్ష్మిని కరుణించమని కోరింది. 3) శత్రువులను నశింపజేసే దుర్గను, జయము నిమ్మని కోరింది.

ఇ) బుర్రకథ ప్రారంభంలో సీతను ఏమని పరిచయం చేశారు?
జవాబు:
సీతను గురించి ఈ విధంగా పరిచయం చేశారు. “సీత పేదల ఇంటిలో పుట్టిన పైడిబొమ్మ, చదువు సందెలో – పేరు పొందిన చక్కనమ్మ. ఓటమిని ఎరుగక పోరాడే వీరబాల”

ఈ) సీత బడిలో చేరడానికి కారణం ఏమిటి?
జవాబు:
సీత ఊరి బడికి, ‘శ్రావణి’ అనే టీచర్ వచ్చింది. ఆమె బడిఈడు వచ్చిన పిల్లలు ఎవరు బడికి రావట్లేదో ఆమె తెలుసుకొంది. శ్రావణి సీతమ్మ తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆడపిల్లను చక్కగా పెంచితే దేశం అభివృద్ధి అవుతుందని చెప్పింది. రుద్రమదేవి, సరోజినీ నాయుడు, సంగం లక్ష్మీబాయి, దుర్గాబాయి వంటి ఆదర్శ మహిళల గూర్చి శ్రావణి వారికి చెప్పింది. శ్రావణి మాటలు, సీత వింది. తాను చదువుకుంటానని చెప్పి బడిలో చేరింది.

ఉ) బుర్రకథలో ఏ ఏ ఆదర్శ మహిళలను గురించి చెప్పారు? వారు ఏం చేశారు?
జవాబు:
బుర్రకథలో రుద్రమదేవి, సరోజినీనాయుడు, సంగం లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ ముఖ్, కల్పనా చావ్లా వంటి ఆదర్శ మహిళలను గురించి చెప్పారు. రుద్రమదేవి శత్రువులను చీల్చి చెండాడింది. సరోజినీ నాయుడు స్వరాజ్య సమరం చేసింది. సంగం లక్ష్మీబాయి బాలలను బాగుపరచింది. దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళల. మార్గము దిద్దింది. కల్పన చావ్లా అంతరిక్షంలోకి ఎగిరింది.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) శ్రావణి టీచర్ పిల్లల అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాన్ని తెలపండి.
జవాబు:
శ్రావణి మంచి టీచరు. ఈమె రామాపురం స్కూలుకు టీచరుగా వచ్చింది. ఆమె ఆ ఊరికి వెళ్ళగానే, బడి ఈడున్న పిల్లలు ఎవరు బడికి రావడం లేదో తెలుసుకుంది. తెలుసుకొని వారి ఇళ్ళకు వెళ్లింది. ఆ ఊళ్ళో సీత అనే అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బడికి పంపడం లేదు. శ్రావణి సీతవాళ్ళ ఇంటికి వెళ్ళి సీత తల్లిదండ్రులకు కొన్ని మంచిమాటలు చెప్పింది. మానవజన్మ గొప్పదనీ, ఆడపిల్లగా పుట్టడం శ్రేష్ఠమనీ, ఆడపిల్లను చక్కగా పెంచితే దేశం అభ్యున్నతి పొందుతుందని చెప్పింది. ఆ మాటలు విని, సీత బడికి వెళ్ళి చదువుకొంది.

ఆ) పాఠాన్ని ఆధారంగా చేసుకొని, ఆడపిల్లల పరిస్థితులు గురించి, 5 వాక్యాలు రాయండి.
జవాబు:
పూర్వము తల్లిదండ్రులు ఆడపిల్లలను శ్రద్ధగా బడికి పంపేవారు కాదు. ఆడపిల్లలకు ఉన్నత చదువులు అవసరం లేదని ఆనాడు భావించేవారు. ఆడపిల్లలను బడికి పంపండని టీచర్లు వచ్చి అడిగితే, తల్లిదండ్రులు తను పిల్లల్ని టీచరుకు కనబడకుండా దాచేవారు. కాని ఈ పాఠంలో సీతవలె చదివి మంచి ఉద్యోగాలు చేసి, పిల్లల చదువుల కోసం, స్త్రీలకు మేలు చేయడం కోసం, స్త్రీలు శ్రమించాలి. అందుకు తల్లిదండ్రులు స్త్రీలకు చేయూతనియ్యాలి.

ఇ) “పెద్దలు పనికి – పిల్లలు బడికి” – అనే నినాదాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
పెద్దవారు పనిచేసి డబ్బు సంపాదించి, సంసారాన్ని పోషించాలి. పిల్లలు చక్కగా బడికి వెళ్ళి, చదువుకొని మంచి విజ్ఞానాన్ని సంపాదించాలి. చిన్నపిల్లలను పనులకు పంపి, వారు సంపాదించే చిన్నపాటి కూలీ డబ్బులను పెద్దలు ఆశించరాదు. పిల్లలను చదువులు మాన్పించి వారిని పనులకు పంపిస్తే, పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది.

ఈ) “ఆలస్యం అమృతం విషం” – అంటే మీకేమి అర్ధమైంది?
జవాబు:
సహజంగా మనం ఏదైనా మంచిపని చేయాలని అనుకుంటే, దానిని త్వరగా ప్రారంభించాలి. అలా కాకుండా ఆ పని చేయడానికి ఆలస్యం చేస్తే, ఒకప్పుడు అది నష్టం తీసుకువస్తుంది. తీవ్రమైన వ్యాధితో ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టరు వద్దకు వెళ్ళాలి. ఆలస్యం చేస్తే అమృతంలా చక్కగా నయం కావలసిన జబ్బు. కాస్తా విషంగా మారి, ప్రాణం మీదికి రావచ్చు. కాబట్టి పీకల మీదకు తెచ్చుకోకుండా తలచుకున్న మంచి పనిని ముందే పూర్తిచేయాలి.

ఉ) మీరు చదువుకొని ఏం కావాలనుకుంటున్నారు? ఎందుకు?
జవాబు:
నేను డాక్టరు కోర్సులో చేరి, MBBS చదవాలని అనుకుంటున్నాను. మాది పల్లెటూరు. ఆ గ్రామంలో వైద్యసహాయం ప్రజలకు అందడం లేదు. కాబట్టి నేను వైద్యవృత్తిని చేబట్టి, మా గ్రామ ప్రజలకు వైద్యం అందించాలని ఉంది. కొద్దిపాటి ఫీజు వసూలు చేసి, గ్రామ ప్రజలకు సాయం చేయాలని ఉంది. ఆదర్శ వైద్యశాల ప్రారంభిద్దామని నా కోరిక.

ఊ) ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ సమానమే ! ఎందుకు ? మీ అభిప్రాయాలు రాయండి.
జవాబు:
స్త్రీలు, పురుషులు అనే భేదం తప్ప, ఆడ మగపిల్లల్లో మరో తేడా లేదు. ఇద్దరూ తెలివిగలవారే. ఇద్దరూ పెద్దయిన తర్వాత తల్లిదండ్రులకు తోడుగా ఉంటారు. ఇద్దరూ ఉద్యోగాలు చేయగలరు. స్త్రీ, పురుషులు అన్ని ఉద్యోగాలకూ అర్హులు. స్త్రీ కన్న పురుషుడు సహజంగా బలవంతుడు.

ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలు చదువుకున్నా, వారు ఉద్యోగాలు చేస్తున్నా, వారి పెళ్ళికి, వరునికి కట్నం ఇవ్వవలసి వస్తుంది. పెళ్ళయిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఆడపిల్లలకు అండగా ఉండవలసి వస్తోంది. ఆడపిల్లలు మాత్రం, తమ తల్లిదండ్రులకు వారి భర్తల అనుమతి లేనిదే ఏమీ సాయం చేయలేరు. క్రమంగా ఆడ-మగ భేదం పోతుంది. పోవాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) బుర్రకథలోని ముఖ్యాంశాలను రాయండి.
జవాబు:
బుర్రకథలో ఒకరు కథ చెపుతూ ఉంటారు. కథ చెప్పే వారికి చెరోప్రక్క ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. – కథ చెప్పేవారిని కథకుడు’ అనీ, ఆయనకు రెండు పక్కలా నిలబడి గొంతు కలిపే వాళ్ళను ‘వంతలు’ అని అంటారు. కథకుడు తంబురా వాయిస్తాడు. వంతలు డక్కీలు వాయిస్తారు.

బుర్రకథలో మొదట .కథకుడు సరస్వతినీ, మహాలక్ష్మినీ, దుర్గనూ ప్రార్థిస్తారు. వంతలలో ఒకడు హాస్య సంభాషణలు చేస్తాడు. బుర్ర కథ పూర్తి అయ్యాక, మంగళం పాడతారు.

జానపద కళల్లో బుర్రకథకు ఎంతో ప్రాచుర్యం లభించింది. ప్రజలను చైతన్యపరచడంలో బుర్రకథ కీలక పాత్ర వహి తెచింది.

ఆ) సీత ఇష్టాలు పాఠం ఆధారంగా మీ ఇష్టాలను వివరించండి.
జవాబు:
నాకు పాఠశాలలో బాగా చదువుకోవాలని ఉంది. చదువుతోపాటు ఆటలపై నాకు ఆసక్తి ఎక్కువ. క్రికెట్, షటిల్ ఆటలపై నాకు ఎంతో ఆసక్తి ఉంది. క్రికెట్ ఆటలో సచిన్ టెండూల్కర్ నాకు ఇష్టమైన ఆటగాడు. ఎప్పటికైనా నేను సచిన్ లాగ, నూరు సెంచరీలు చేసి, మన దేశానికి పేరు తేవాలని ఉంది. . .

నాకు సివిల్ ఇంజనీరు కావాలని ఉంది. ఐ.ఐ.టిలో చదివి, మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశ . ఉంది. ఎప్పటికయినా, ఏదో పెద్ద ప్రాజెక్టు కట్టే ఇంజనీరు కావాలని ఉంది. ఈ

IV. పదజాలం

1. కింది వాక్యాలు చదవండి. ఎవరెవరిని ఏమంటారో రాయండి.

అ. బుర్రకథలో కథ చెప్పేవాడు : (కథకుడు)
ఆ. మండలంలో అభివృద్ధి పనులు నిర్వహించే వ్యక్తి : (మండల అభివృద్ధి అధికారి)
ఇ. నాయకత్వం వహించేవాడు : (నాయకుడు)
ఈ. ఉపన్యాసం ఇచ్చేవాడు : (వక్త)
ఉ. హరికథ చెప్పేవాడు : (హరిదాసు )

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

1. సినీమా పాటలలో ఘంటసాల వారి గీతాలు ప్రాచుర్యం పొందాయి. : (విస్తారము)
2. భర్తృహరి సుభాషితాలలో మంచి సూక్తులు ఉన్నాయి. : (మంచి మాటలు)
3. నేను వేసిన తారాజువ్వ అంతరిక్షాన్ని తాకింది. : (ఆకాశము)
4. దేశం అభ్యున్నతికి పౌరులంతా శ్రమించాలి. : (అభివృద్ధి)
5. రామయ్యగారు కథలను అలవోకగా రాస్తారు. : (అప్రయత్నము)
6. విద్యార్థులలో ప్రతిభ ఉంటే వారు చక్కగా రాణిస్తారు. : (తెలివి)

3. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1) కలకలలాడు :
పెళ్ళికి వచ్చిన బంధువులతో మా ఇల్లు కలకలలాడుతూ ఉంది.

2) ప్రదర్శించు :
తెలివి ఉంది కదా అని, గర్వమును ప్రదర్శించరాదు.

3) కీలకపాత్ర :
మా సంసారమును నడిపించడంలో మా నాన్నగారే కీలకపాత్ర వహిస్తారు.

4) వంతపాడు :
మా చెల్లి మా అమ్మ మాటలన్నింటికీ వంతపాడుతుంది.

5) దిగ్విజయం :
మా పాఠశాల నూరు శాతం ఫలితాలతో దిగ్విజయంగా నడుస్తోంది.

6) రసాభాస : మా పాఠశాలలో నాటక ప్రదర్శన వర్షం రావడంతో రసాభాస అయ్యింది.

7) చదువు సందెలు :
మా మేనల్లుడికి చదువుసందెలు అబ్బలేదు.

8) నోరుమూయు :
నాన్నగారు కోపపడడంతో.తమ్ముడు నోరుమూశాడు.

9) కుంగదీయు :
కష్టాలు మా తాతగార్ని కుంగదీశాయి.

10) తల్లడిల్లు :
చీకటి పడినా తమ్ముడు ఆటల నుండి రాలేదని మా ఇంటిల్లపాదీ తల్లడిల్లాము.

11) కొవ్వొత్తి :
కష్టాలతో మా అమ్మమ్మ జీవితం, కొవ్వొత్తిలా కరిగిపోయింది.

12) సూకులు :
గురువులు పిల్లలకు సూక్తులు బోధించాలి.

13) పుణ్యఫలం :
భారతదేశం పుణ్యఫలం కొద్దీ గాంధీ, నెహ్రూలు మనదేశంలో పుట్టారు.

14) అభ్యున్నతి :
దేశం అభ్యున్నతి కోసం దేశపౌరులందరూ శ్రమించాలి.

15) అలవోకగా :
మా చెల్లెలు అలవోకగా త్యాగరాజు కీర్తనలు పాడుతుంది.

16) వెక్కిరించు :
అంగవైకల్యం గలవారిని చూచి వెక్కిరించరాదు.

4. కింది పదాలకు వ్యతిరేకపదాలు రాయండి.

1. తొలి × మలి
2. ప్రయత్నము × అప్రయత్నము
3. జయము × అపజయము
4. పాత × కొత్త
5. ఇష్టం × అనిష్టం
6. ఉత్తముడు × అనుత్తముడు
7. కష్టము × సుఖము
8. పిల్లలు × పెద్దలు
9. నిజం × అబద్ధం
10. ముందు × వెనుక
11. మంచి × చెడ్డ
12. పుణ్యము × పాపము
13. అన్యాయము × న్యాయము
14. పెద్ద × చిన్న
15. అవకాశం × నిరవకాశం
16. మేలు × కీడు
17. సమానము × అసమానము

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

5. ఈ కింది పదాలలో ప్రకృతి వికృతులను గుర్తించి ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.

1. కథ (ప్రకృతి) – కత (వికృతి)
2. సిరులు (వికృతి) – శ్రీలు (ప్రకృతి)
3. గాథ (ప్రకృతి) – గాద (వికృతి)
4. సన్నాసి (వికృతి) – సన్యాసి (ప్రకృతి)
5. కాకి (వికృతి) – కాకము (ప్రకృతి)
6. దీపము . (ప్రకృతి) – దివ్వె (వికృతి)
7. భారము (ప్రకృతి) – బరువు (వికృతి)
8. బొమ్మ, (వికృతి) – బ్రహ్మ (ప్రకృతి)
9. విషము (ప్రకృతి) – విసము (వికృతి)
10. దంపతులు (ప్రకృతి) – జంపతులు (వికృతి)
11. విజ్ఞానము (ప్రకృతి) – విన్నాణము (వికృతి)
12. అక్షరము (ప్రకృతి) – అక్కరము . (వికృతి)

V. సృజనాత్మకత

1. ఈ బుర్రకథను మీ పాఠశాలలో ప్రదర్శించండి. ఈ బుర్రకథకు ‘సీత ఇష్టాలు’ గాక మరేదైనా పేరును సూచించండి.
జవాబు:
ఈ కథకు “MDO సీతమ్మ” అని మరో పేరు పెట్టవచ్చును.
(లేదా)

2. ఆడపిల్లలను సమానంగా చూడాలన్న అంశాన్ని గురించి నినాదాలు రాయండి.
జవాబు:

  1. ఆడపిల్ల పుట్టింది – అదృష్టం పట్టింది.
  2. ఆడపిల్లే కావాలి – సౌభాగ్యం వర్ధిల్లాలి.
  3. ఆడపిల్లే మాకు యోగ్యం – ఆమే అత్తింటి సౌభాగ్యం.
  4. ఆడపిల్ల – ఆ యింటి మహాలక్ష్మి.
  5. ఆడా మగా తేడా వద్దు – ఎవరైనా మాకు ముద్దు.

VI. ప్రశంస

* మీ తరగతిలోని ఆడపిల్లల్లోని మంచి గుణాలను గుర్తించి, జాబితా రాయండి.
జవాబు:
మా తరగతిలో పదిమంది ఆడపిల్లలున్నారు. అందులో కింది బాలికలలో మంచి గుణాలున్నాయి.

1) సీత :
మంచి తెలివైన పిల్ల. ఈమె ఏక సంథాగ్రాహి.

2) రజని :
ఈమెలో కరుణ ఎక్కువ. ప్రక్కవారికి కష్టం కలిగితే కన్నీరు పెడుతుంది. వారికి సాయం చేస్తుంది.

3) గోపిక :
నిజాయితీ, ధర్మము, న్యాయముపై ఈమెకు మక్కువ.

4) పావని :
ఈమెకు శుభ్రతపై దృష్టి ఎక్కువ. తన బట్టలు, పుస్తకాలు నిర్మలంగా ఉంచుకుంటుంది. ఈమె స్నేహితురాళ్ళ పుస్తకాలు కూడా సర్దుతుంది.

5) రమ్య :
ఈమె పేరుకు తగినట్లుగా అందంగా ఉంటుంది. అభ్యుదయభావాలు కలది. ఈమె కొత్తదనాన్ని కోరుకుంటుంది.

6) గంగ :
ఈమెకు దేవునిపై మంచి విశ్వాసం. దైవభక్తి కలది. కమ్మగా దైవభక్తి గేయాలు పాడుతుంది.

VII. ప్రాజెక్టు పని

1. ఆడవాళ్ళపట్ల జరుగుతున్న అన్యాయాలను సరిచేయడానికి సంబంధించి వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్తలను సేకరించండి.
జవాబు:
ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న అన్యాయాలను సరిచేయడానికి సంబంధించి వార్తా పత్రికలో ప్రచురితమైన వార్తలను సేకరించి, కత్తిరించి ఇక్కడ అతికించండి.
ఉదా :
సమస్యలపై సైకిల్ యాత్ర!
AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు 2

(లేదా)

2. మీ ప్రాంతంలోని కళారూపాలను గురించి తెలుసుకొని, నచ్చిన కళారూపాన్ని గురించి రాయండి.
జవాబు:
మేము తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా వాసులం. మేము కపిళేశ్వరపురం ఉన్నత పాఠశాలలో చదువుతున్నాం. మా గ్రామంలో SBPK సత్యనారాయణరావు గారు అనే జమిందారు గారు ఉండేవారు.

ఆయనకు ‘హరికథ’ అనే కళారూపం అంటే చాలా ఇష్టం. మా గ్రామంలో హరికథను చెప్పడం నేర్పే పాఠశాలను ఆయన స్థాపించారు. ఇక్కడ వందలకొద్దీ హరికథా గాయనీగాయకులు తయారయ్యారు. ఇంకా అవుతున్నారు.

ఆదిభట్ల నారాయణదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు వంటి ప్రసిద్ధ హరికథకులు, ఆంధ్రదేశంలో పుట్టారు. వారు మన తెలుగువారికి రామాయణ భారత భాగవత కథలను పరిచయం చేశారు. ‘హరికథ’ సంగీత, సాహిత్య, నృత్య కళారూపం. హరిదాసులు, మెడలో దండ వేసుకొని, చేతిలో చిడతలు తీసుకొని, హార్మనీ, ఫిడేలు, మద్దెలల సహకారంతో హరికథను చెపుతారు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ. కింది వాక్యాలు చదవండి.

1. సీత బడికి వెళ్ళింది. (సామాన్య వాక్యం)
2. సీత అన్నం తిని, బడికి వెళ్ళింది. (సంక్లిష్ట వాక్యం)
3. సీత అన్నం తిన్నది, కాని బడికి వెళ్ళలేదు. (సంయుక్త వాక్యం)

ఇలా ఉన్న వాక్య భేదాల గురించి మీరు తెలుసుకున్నారు. అవేమిటంటే సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాలు. ఐతే ఈ వాక్యాలు ఇలా వేరువేరుగా కనబడటానికి కారణం, ఆ వాక్యాల్లోని క్రియ. క్రియను బట్టే కాక, అర్థాన్ని బట్టి కూడా వాక్యాల్లో తేడాలు గమనించవచ్చు. అలాంటి వాక్య భేదాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.

1. కింది వాక్యాల్ని చదివి అర్థం చేసుకోండి. అందులోని భేదాలను గుర్తించండి.

అ) ఆహా ఎంత బాగుందో !
ఆ) చేతుల కడుక్కో !
ఇ) చాలాసేపు టీవీ చూడొద్దు.
ఈ) లోపలికి రావచ్చు.
ఉ) గోపాల్ చెట్టు ఎక్కగలడు.

గమనిక :
పై వాక్యాలు ఒక్కో భావాన్ని సూచిస్తున్నాయి. అదెలాగో చూద్దాం !

ఉదా :
అ) ఆహా ! ఎంత బాగుందో ! :
ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కనుక ఈ వాక్యం. “ఆశ్చర్యార్థక వాక్యం ”.

ఆ) చేతులు కడుక్కో :
ఇది విధిగా ఆ పని చేయాలి అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే చేయవలసిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని “విధ్యర్థక వాక్యం” అంటాం.

ఇ) చాలా సేపు టీవీ చూడొద్దు :
ఈ వాక్యం టీవీ చూడటం వద్దని చెబుతున్నది. టీవీ చూడటాన్ని నిషేధిస్తున్నది. అంటే ‘నిషేధార్థక వాక్యం’. ఒక పనిని చేయవద్దని నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యం, “నిషేధార్థక వాక్యం”.

ఈ) లోపలికి రావచ్చు :
ఈ వాక్యం ఒక వ్యక్తికి అనుమతిని ఇస్తున్నట్లు సూచిస్తున్నది. అంటే అనుమత్యక వాక్యం. ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతినిచ్చే అర్థాన్ని సూచించే వాక్యం “అనుమత్యర్థక వాక్యం”.

ఉ) గోపాల్-చెట్టు ఎక్కగలడు :
ఈ వాక్యంలో గోపాల్ చెట్టు ఎక్కగలడు. అంటే గోపాల్ కు ఉన్న చెట్టును ఎక్కే – సామర్థ్యాన్ని సూచిస్తున్నది. ఇది “సామర్థ్యార్థక వాక్యం”.

ఒక వ్యక్తికి గాని, వ్యవస్థకు గాని లేదా యంత్రానికి గాని ఉన్న సమర్థతను సూచించే అర్థంగల వాక్యాన్ని . “సామర్థ్యార్థక వాక్యం” అంటాం. ఈ . అభ్యాసాలు.

అభ్యాసాలు

2. కింది వాక్యాలలోని భావాన్ని అనుసరించి ఏ వాక్యాలు అవుతాయో గుర్తించి రాయండి. ఈ వాక్యాలన్నీ మీ, పాఠ్యాంశంలోనివే.

అ) సీత కలెక్టరైందా? (ప్రశ్నార్థక వాక్యం )
ఆ) మీరు తర్వాత కొట్టుకోవచ్చు. (అనుమత్యర్థక వాక్యం)
ఇ) అక్క చెప్పేది విను. (విధ్యర్థక వాక్యం)
ఈ) రసాభాస చేయకండి. (నిషేధార్థక వాక్యం)

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

3. ఇలాంటి మరికొన్ని వాక్యాలు మీ పాఠ్యాంశాలలో నుంచి రాయండి.

1. ముందు సీత ఇష్టాలు విను. (విధ్యర్థక వాక్యం)
2. ఏం చదివావో చెప్పు. (విధ్యర్థక వాక్యం)
3. సీత చదువు ఆగిపోయిందా? (ప్రశ్నార్థక వాక్యం)
4. సీత బడికి వెళ్ళిందా లేదా ! (సందేహార్థక వాక్యం)
5. సరస్వతి తల్లీ ! చల్లగ. చూడమ్మా ! (ప్రార్థనాధ్యర్థక వాక్యం)
6. దుర్గా ! జయము నీయవమ్మా ! (ప్రార్థనార్థక వాక్యం)
7. అంతమాట అనకండి (నిషేధార్థక వాక్యం)
8. ఆహా ! ఎంత బాగుంది. (ఆశ్చర్యార్థక వాక్యం)
9. సీత లెక్కలు బాగా చేసింది. (సామాన్య వాక్యం)
10. నీవు ఇంటికి వెళ్ళవచ్చు. (అనుమత్యర్థక వాక్యం).

4. కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.

1. జాతీయ దినోత్సవం = జాతీయదిన + ఉత్సవం = (అ + ఉ = ఓ) = గుణసంధి
2. పల్లెటూరు = పల్లె + ఊరు = టుగాగమ సంధి
3. కథకురాలు = కథక + ఆలు = రుగాగమసంధి
4. దిగ్విజయం = దిక్ + విజయం = జత్త్వసంధి
5. ఏందక్కా = ఏంది + అక్కా = (ఇ + అ = అ) = ఇకారసంధి
6. రసాభాస = రస + ఆభాస = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘసంధి
7. చక్కనమ్మ = చక్కని + అమ్మ = ఇకార సంధి
8. పదహారేళ్ళు = పదహారు + ఏళ్ళు = (ఉ + ఏ = ఏ) = ఉత్వసంధి
9. కొవ్వొత్తి = కొవ్వు + ఒత్తి = ఉత్వసంధి
10. అభ్యున్నతి = అభి + ఉన్నతి = (ఇ + ఉ = యు) = యణాదేశ సంధి
11. చిన్నక్క = చిన్న + అక్క = (అ + అ = అ) = అత్వసంధి
12. ఏమున్నది = ఏమి + ఉన్నది = (ఇ + ఉ = ఉ) = ఇత్వసంధి
13. ప్రధానోపాధ్యాయుడు = ప్రధాన + ఉపాధ్యా యుడు = (అ + ఉ = ఓ) = గుణసంధి
14. నాయకురాలు = నాయక + ఆలు = రుగాగమ సంధి
15. సీతక్క = సీత + అక్క న = (అ + అ = అ) = అత్వసంధి.

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

5. కింది సమాసాలకు అర్థం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాస నామం
1) సీత ఇష్టాలు సీత యొక్క ఇష్టాలు షష్ఠీ తత్పురుష సమాసం
2) ప్రజాచైతన్యం ప్రజల యొక్క చైతన్యం షష్ఠీ తత్పురుష సమాసం
3) దిగ్విజయము దిక్కుల యొక్క విజయము షష్ఠీ తత్పురుష సమాసం
4) చదువు బీజాలు చదువునకు బీజాలు షష్ఠీ తత్పురుష సమాసం
5) అక్షరమాల అక్షరముల యొక్క మాల షష్ఠీ తత్పురుష సమాసం
6) ఉన్నత పాఠశాల ఉన్నతమైన పాఠశాల విశేషణ పూర్వపద కర్మధారయం
7) మంచి కథలు మంచివైన కథలు విశేషణ పూర్వపద కర్మధారయం
8) స్వరాజ్య సమరం స్వరాజ్యం కొఱకు సమరం చతుర్డీ తత్పురుష సమాసం
9) రెండు పక్కలు రెండైన పక్కలు ద్విగు సమాసం
10) నాలుగు రాళ్ళు నాలుగు  (4) సంఖ్యగల రాళ్ళు ద్విగు సమాసం
11) తల్లిదండ్రులు తల్లీ, తండ్రీ ద్వంద్వ సమాసం
12) లవకుశలు లవుడూ, కుశుడూ ద్వంద్వ సమాసం
13) అన్యాయము న్యాయము కానిది నఞ్ తత్పురుష సమాసం
14) అనవసరము అవసరం కానిది నఞ్ తత్పురుష సమాసం

కొత్త పదాలు-అర్థాలు

అంశం = విషయం
అనవసరం = అవసరం లేనిది
అభినయించు = నటించు
ఆలస్యం అమృతం విషం = ఆలస్యము వల్ల అమృతం కూడా విషంగా మారుతుంది.
అంకితము = గుర్తువేయబడినది
అంతరిక్షము = ఆకాశము
అక్షరమాల = అక్షరాలు
ఆదర్శం = ప్రతియైన (చూపబడిన)
అలవోకగా = అనాయాసముగా
కలకలలాడు = సంతోషంగా ఉండు
కీలకపాత్ర = ప్రధాన పాత్ర
తల్లడిల్లు = కలతపడు
నేపథ్యం = తెరవెనుక జరిగినది (పూర్వ రంగం)
దిగ్విజయం = సంపూర్ణ జయం
తుద = చివర
నిరంతరం = ఎల్లప్పుడు
పరిసరాలు = సమీప ప్రదేశాలు
పక్కా = కచ్చితంగా
ప్రతిభ = తెలివి
ప్రభావితులు = ప్రభావము పడినవారు
బాలభానుడు = ఉదయించే సూర్యుడు
ప్రాంగణం = ముంగిలి
ప్రాచుర్యం = విరివి, విస్తారం
ఫ్యాషన్ = Fashion (వైఖరి, విధము)
పైడిబొమ్మ = బంగారు బొమ్మ
బడాయి = గర్వము
ప్రేరణ = ప్రేరేపించుట
రోత = అసహ్యం
రాజనాలు = మంచి ధాన్యం
వంతపాడు = ఒకరన్న దానినే ఆలోచన లేకుండా తాను కూడా అనడం
శ్రీలు = సిరులు
సూక్తులు (సు + ఉక్తులు) = మంచిమాటలు
సహనము = ఓర్పు
మహిళలు = స్త్రీలు
వెక్కిరించు = పరిహాసం చేయు
లెటర్సు = Letters (అక్షరాలు)

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 10th Lesson ప్రకటన Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 10th Lesson ప్రకటన

7th Class Telugu 10th Lesson ప్రకటన Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఇలాంటి ప్రకటనలు ఎప్పుడైనా చూశారా? ఎక్కడ చూశారు?
జవాబు:
ఇలాంటి ప్రకటన నేను చూడలేదు. కాని మా ప్రక్క ఇంటివారి ‘కుక్కపిల్ల’ తప్పిపోయినపుడు పత్రికలో ఇలాంటి ప్రకటన ఇచ్చారు. బహుమతిగా దానిని తెచ్చి ఇచ్చిన వారికి రూ. 200 ఇస్తామని మా ప్రక్క ఇంటివారు ప్రకటించారు.

ప్రశ్న 2.
ఈ ప్రకటన ఎవరి కోసం?
ఈ ప్రకటన “శాంతి కపోతం” కోసం.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
ప్రకటనలోని కపోతాన్ని వెతకడానికి నీవేం చేస్తావు?
జవాబు:
అమెరికా ప్రెసిడెంటుకూ, రష్యా ప్రధానమంత్రికీ దేశాల మధ్య కలతలు సృష్టించవద్దని శాంతిలేఖలు పంపిస్తాను.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ కవితను భావయుక్తంగా చదవండి. సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
సాధన చేసి చదవండి.
పాఠ్యభాగ సారాంశం :
ఎవరికీ రైలు టిక్కెట్లు ఇవ్వకండి. రైళ్ళను ఆపివేయండి. ‘గుళ్ళ పూజలు చేయించండి. రేడియోల్లో ప్రకటనలు చేయండి. అన్నిచోట్లా జాగ్రత్తగా వెతకండి. సైన్యాన్ని, కాపలా పెట్టండి. రాకెట్లను అన్ని గ్రహాలకూ పంపండి. కాలిముద్రలు, వేలిముద్రలు పరిశీలించండి.

జనం గుంపులు గుంపులుగా వస్తూ భయంతో గుసగుసలాడుతున్నారు. స్వార్థం ఉన్నవాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. ఒప్పందాల కాగితాలు చింపేస్తున్నారు. సిద్ధాంతాల చర్చలు ఆగిపోయాయి.

ఇంక చరిత్రలు ఎవరూ రాయనక్కర లేదు. ఎవరూ పాలించనక్కరలేదు. అణుబాంబు ప్రజల్ని నాశనం చేసే ముహూర్తం, దగ్గరకు వచ్చేసింది. మనం మనజాతిని కాపాడుకోవాలంటే, పరారీ అయిన శాంతిని వెతికి తీసుకురావాలి. జయజయ ధ్వనులు చేస్తూ కదలండి.

శాంతి చక్కని తల్లి. ఆమె మన చెల్లి. ఆమె కళ్ళల్లో జాలి ఉంటుంది. ఆమె ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఆమె జడలో గులాబి పువ్వు ఉంటుంది. ఆమె ప్రజల మేలునే ఎప్పుడూ కోరుతుంది. తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది.

ప్రశ్న 2.
మీరు ప్రకటనలు ఎక్కడెక్కడ విన్నారు? ఇవి వేటికి సంబంధించినవి.
జవాబు:
జాతరలలో, తీర్థాలలో పిల్లలూ, ముసలివారూ తప్పిపోతే పేపర్లలో, రేడియోలలోనూ, టీవీలలోనూ ప్రకటనలు ఇస్తారు. ఉద్యోగాల ఖాళీలను గూర్చి ప్రకటిస్తారు. కళాశాలలో సీట్ల ఖాళీలను ప్రకటిస్తారు. పరీక్ష ఫలితాలు ప్రకటిస్తారు. ధరల ప్రకటన ఉంటుంది. ప్రభుత్వం తాను చేసే కార్యక్రమాలను గూర్చి ప్రకటిస్తుంది. సభలను గూర్చి, అక్కడకు వచ్చే అతిథులను గూర్చి ప్రకటనలు ఇస్తారు. వర్తకులు, వ్యాపారులు తమ వద్ద ఉన్న సరకులను గురించి, ధర వరలను గురించి ప్రకటనలు చేస్తే నేను విన్నాను.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
ప్రకటనలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మీకు ఇష్టమైన ఏదైనా ఒక ప్రకటనను గురించి చెప్పండి. అది ఎందుకు ఇష్టమైందో వివరించండి.
జవాబు:
ఉద్యోగ ప్రకటనలు, కొత్త సినిమాలు, కళాశాలల్లో సీట్ల వివరాలు, విశ్వవిద్యాలయాల్లో వివిధ కోర్సుల ప్రకటనలు, వస్తువుల అమ్మకాలను గురించి ప్రకటనలు, పెళ్ళి కావలసిన వధూవరుల గురించి ప్రకటనలు ఉంటాయి. నాకు కొత్త సినిమాలను గురించి ఇచ్చే ప్రకటనలు అంటే చాలా ఇష్టం. సినిమాలలో మంచి హాస్యం ఉంటుంది. అందుకే ఆ సినిమా ప్రకటనలంటే నేను ఇష్టపడతాను. …

II. చదవడం – రాయడం

ప్రశ్న 1.
పాఠం చదవండి. కింది వాటిని పాఠంలో గుర్తించండి.

అ) ఆపివేయండి – పంపించండి – ప్రకటించండి – పరిశీలించండి.
జవాబు:
రైళ్ళు ఆపివేయండి. కేబుల్ గ్రామ్స్ పంపించండి. ఆకాశవాణిలో విషయం ప్రకటించండి. నిశితంగా పరిశీలించండి.

ఆ) గుసగుసలాడుతున్నారు – బాదుకుంటున్నారు – చింపేస్తున్నారు. ఇలాంటి పదాలు గల వాక్యాలను గుర్తించండి – వాటి కింద గీత గీయండి.
జవాబు:

  1. కంగారుగా భయంతో గుసగుసలాడుతున్నారు.
  2. స్వార్థ జీవనులు గభాలున టొమ్ములు బాదుకుంటున్నారు.
  3. సిరా ఇంకకుండానే అగ్రిమెంట్లు చింపేస్తున్నారు.
  4. ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు.

ప్రశ్న 2.
కవితలో శాంతిని గురించి వర్ణించిన పంక్తులు చదవండి. వాటి కింద గీత గీయండి.
జవాబు:
“అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి”.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
పాఠం చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) జాతిని కాపాడుకోవడానికి కవి ఏం చేయాలన్నారు?
జవాబు:
మనం మన జాతిని కాపాడుకోవాలంటే, ఒక్కటే మార్గం ఉందని కవి చెప్పాడు. పరారీ అయిన శాంతిని వెతికి తీసుకురావాలని చెప్పాడు. అంతకంటే మరోదారిలేదనీ, జై అంటూ శాంతిని వెదకడానికి కదలండనీ ప్రజలకు – కవి పిలుపునిచ్చాడు.

ఆ) కవి దేనికోసం వెతకమన్నారు? ఎక్కడెక్కడ వెతకమన్నారు?
జవాబు:
కవి పరారీ అయిన శాంతి కోసం వెతకమన్నారు. దాని కోసం కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాలలో, సముద్ర తీరాలలో, నదీ జలాలలో వెతకమన్నారు. రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపి, అడుగుజాడల్నీ, వేలిముద్రల్నీ పరీక్షించమన్నారు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలతో సమాధానాలు రాయండి.

అ) ‘ప్రకటన’ అంటే ఏమిటి? ప్రకటనలు ఎందుకోసం?
జవాబు:
‘ప్రకటన’ అంటే వెల్లడి చేయడం. పదిమందికీ విషయాన్ని తెలపడం కోసం ప్రకటనలు చేస్తారు. పన్నులు ఫలానా తేదీ లోపల చెల్లించాలని, మున్సిపల్ కమిషనరు మైకు ద్వారా ప్రకటన చేస్తాడు. రేషను సరుకులు వచ్చాయనీ, వాటిని ఫలానా తేదీ నుండి పంపిణీ చేస్తారనీ దుకాణం దారులు ప్రకటన చేస్తారు. చౌకగా బట్టలు అమ్ముతున్నామని బట్టల వర్తకులు ప్రకటిస్తారు. ఈ విధంగా ప్రచారం చేసుకోవడం కోసం, ప్రకటనలు చేస్తారు. తప్పిపోయిన వారిని గూర్చి కూడా ప్రకటన ఇస్తారు.

ఆ) ఈ’ పాఠానికి మరొక శీర్షికను సూచించండి. దానికి మూడు కారణాలు తెలపండి.
జవాబు:
ఈ పాఠానికి మరో శీర్షిక “శాంతి పావురం”.

  1. ఈ పాఠంలో శాంతి లేకపోతే వచ్చే అలజడిని వర్ణించారు.
  2. ‘శాంతి’ స్వరూపాన్ని వర్ణించారు.
  3. జాతిని రక్షించుకోవడానికి శాంతిని వెదకడమే ఏకైక మార్గము అని కవి చెప్పాడు. కాబట్టి ఈ పాఠానికి ‘శాంతి పావురము’ పేరు బాగుంటుంది.

ఇ) ఆకాశవాణి, దూరదర్శన్లలో ఏ ఏ ప్రకటనలు వస్తాయి?
జవాబు:

  1. వీటిలో ముఖ్యంగా ఆనాడు వచ్చే కార్యక్రమాల ప్రకటనలు ఉంటాయి.
  2. ముఖ్యమైన కార్యక్రమాలు ఏ సమయంలో ఏ రోజు వస్తాయో ప్రకటిస్తారు.
  3. ప్రభుత్వం చేసే ప్రకటనలు ఉంటాయి.
  4. తమకు కావలసిన కళాకారులను గూర్చి వారు ప్రకటనలు ఇస్తారు.
  5. అప్పుడప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను గూర్చి, దరఖాస్తు పెట్టుకొనే తీరును గూర్చి ప్రకటనలు ఉంటాయి.
  6. తప్పిపోయిన వారిని గూర్చి ప్రకటనలు ఉంటాయి.
  7. తుపాన్లు వంటి సమయాలలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రకటనలు ఉంటాయి.

ఈ) “ప్రకటన” పాఠం గురించి మీ అభిప్రాయాలు తెల్పండి.
జవాబు:
‘బాలగంగాధర తిలక్’ గొప్ప భావుకుడైన మహాకవి. తిలక్ వచన గేయాలు తెలుగు కవితకు మణిహారాలు. ఈ కవితలో కవి “శాంతి” అవసరాన్ని నొక్కి చెప్పాడు. యుద్దాలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాడు. తప్పిపోయిన వారిని ఎలా వెతకాలో ఎక్కడ వెతకాలో చెప్పాడు. దేశాల మధ్య జరిగిన ఒడంబడికలను వారు పాటించకపోవడాన్ని విమర్శించాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) తిలక్ ప్రకటన కవితకు నేపథ్యం ఏమిటి? ఈ కవిత రాయడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది?
జవాబు:
తిలక్ ఈ కవిత రాసేనాటికి రెండు ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, అంతర్యుద్ధాలు, ప్రచ్ఛన్నయుద్ధ వ్యూహాలను పన్నుతున్న రెండు అగ్రరాజ్యాల మధ్య పోటీ వంటి అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి.

భారతదేశంలో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమపోరాటం, విముక్తి, కరవులు వంటి స్థానిక విషయాలు ఉన్నాయి. . తిలక్ వీటిని పరిశీలించి ఈ కవిత రాశారు. ఇవే ఈ కవితకు నేపథ్యం.

ప్రపంచంలో అశాంతి పోవాలంటే, అణుయుద్ధ భయం పోవాలంటే, శాంతి ఒక్కటే మార్గమని, చెప్పడమే ఈ కవిత రాయడానికి గల ప్రధాన కారణం.

ఆ) తిలక్ శాంతి అనే స్త్రీని ఏ విధంగా వర్ణించాడు?
జవాబు:
శాంతి చల్లని తల్లి. చక్కని చెల్లి. ఆమె కనుగొలకులు దయతో నిండి ఉంటాయి. ఆమె ముఖంలో సంతోషం పొంగే చిరునవ్వు పరిమళాలు ఉంటాయి. ఆమె కొప్పులో ప్రేమ గులాబి ఉంటుంది. ఆమె ప్రజల హితాన్ని కోరుతుంది. చక్కగా మాట్లాడుతుంది. ఆమె గర్వంలేని రాణి. ఆమె అసత్యాన్ని, క్రూరత్వాన్ని, మాలిన్యాన్ని ఖండిస్తుంది. తెల్లని పావురాన్ని సరదాగా ఎగరేస్తుంది.

IV. పదజాలం

1. గీత గీసిన పదాలకు సమానమైన అర్థమిచ్చే పదాలు పాఠంలో ఉన్నాయి. వాటిని వెతికి ఎదురుగా రాయండి.

అ) సాగరంలో అలలు ఎగసిపడుతున్నాయి.
జవాబు:
1. సముద్రము
2. పారావారము

ఆ) ఆయుధాలు ధరించిన సైనికులు సరిహద్దుల్లో కాపలాకాస్తున్నారు.
జవాబు:
సాయుధ దళాలు

ఇ) రేడియోలో రోజూ నేను వార్తలు వింటాను.
జవాబు:
విషయం

ఈ) శాంతికి గుర్తుగా కపోతాలను ఎగరవేద్దాం.
జవాబు:
పావురాలు

ఉ) నేను ఎప్పుడూ అబద్ధం ఆడను.
జవాబు:
కల్ల

ఊ) గులాబీ తోటలోని సువాసనలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించాయి.
జవాబు:
పరిమళాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదానికి సమానమైన పర్యాయపదాలు అదే వాక్యంలో ఉన్నాయి. వాటిని గుర్తించండి. ఆ.వాటి కింద గీత గీయండి.

అ) దేవాలయంలో దేవుడి విగ్రహాలు ఉంటాయి. పూజారులు కోవెలలో పూజలు చేస్తారు. గుడికి మనమందరం తప్పకుండా వెళతాం.
జవాబు:
దేవాలయం, కోవెల, గుడి (పర్యాయపదాలు)

ఆ) సర్వేంద్రియాణాం నయనం ప్రధానం, అంటూంటారు. అందుకే మన కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పుడప్పుడు నేత్ర వైద్యుడి దగ్గరకు వెళ్ళాలి.
జవాబు:
నయనం, కన్ను, నేత్రం (పర్యాయపదాలు)

ఇ) సరిహద్దుల్లో సైనిక దళాలు ఉంటాయి. వాళ్ళను చూడడానికి మనం బృందాలుగా వెళ్లాం. సమూహంగా వెళ్ళడంలో ఆనందం ఉంటుంది.
జవాబు:
దళాలు, బృందాలు, సమూహం (పర్యాయపదాలు) :

ఈ) గూఢచారులు రహస్యంగా విషయాలను కూపీ లాగుతారు. వాళ్ళు ఆరా తీయడంలో చాలా నేర్పరులు.
జవాబు:
కూపీ, ఆరా (పర్యాయపదాలు)

3. పాఠ్యాంశం ఆధారంగా ఈ కింది. నానార్థాల మూలపదాలను వెతికి రాయండి.

అ) దళము = గుంపు, ఆకు
ఆ) ముద్ర = గుర్తు, ప్రభావం

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

4. ఈ క్రింది పదాలకు వ్యతిరేక పదాలు మీ పాఠ్యాంశంలోనే ఉన్నాయి. వాటిని గుర్తించండి. రెండు పదాలనూ ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
అజాగ్రత్త × జాగ్రత్త
నేను ఏ విషయమైనా జాగ్రత్తగా పరిశీలిస్తాను. ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండను.

అభ్యాసము :
అ) నీతి × అవినీతి
వాక్య ప్రయోగం : నీతి కలవారు, అవినీతిని చూచి ‘సహించలేరు.

ఆ) నిస్స్వార్గం × స్వార్థం
వాక్య ప్రయోగం : నేను నిస్స్వార్థంగా జీవిస్తాను, స్వార్థంగా జీవించను.

ఇ) సుఖం × కష్టం
వాక్య ప్రయోగం : సుఖం వెంబడి కష్టం ఉంటుందని గుర్తించాలి.

ఈ) శాంతి × అశాంతి
వాక్య ప్రయోగం : ప్రపంచంలోని అశాంతి పోవాలంటే శాంతి దేవతను ఆహ్వానించాలి.

ఉ) నిగర్వి × గర్వి
వాక్య ప్రయోగం : నిగర్వి ఆనందాన్నీ, గర్వి దుఃఖాన్ని తప్పక పొందుతాడు.

ఊ) అంగీకారం × అనంగీకారం
వాక్య ప్రయోగం : నా చదువు విషయంలో అమ్మానాన్నాల మధ్య ఇంకా అంగీకారం, అనంగీకారం ఉంది.

ఎ) నిర్భయం × భయం
వాక్య ప్రయోగం : నిర్భయంగా మాట్లాడేవారంటే అందరికీ భయం.

5. కింది పదాలకు ప్రకృతి పదాలు పాఠ్యాంశంలో ఉన్నాయి. వాటిని గుర్తించి, సొంతవాక్యంలో ఉపయోగించి రాయండి.
ఉదా : దేవళం (వికృతి) – దేవాలయం (ప్రకృతి)
వాక్యము : నేను రోజూ దేవాలయానికి వెళ్లి దేవునికి దండం పెడతాను.

అ) దరి (వికృతి) – తీరము (ప్రకృతి)
నా మిత్రుడు గోదావరీ తీరమున ఇల్లు కట్టాడు.

ఆ) సంద్రం (వికృతి) – సముద్రం (ప్రకృతి)
మనదేశంలో తూర్పు దిక్కున “బంగాళాఖాతము” అనే సముద్రం ఉంది.

ఇ) గారవం (వికృతి) – గౌరవం (ప్రకృతి)
గురువులపై భక్తి, గౌరవం కలిగియుండాలి.

ఈ) నిచ్చలు (వికృతి) – నిత్యము (ప్రకృతి)
నిత్యం శివునికి నేను అభిషేకం చేస్తాను.

6. కింది పదాలలో ఏవైనా రెండేసి పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు తయారుచేయండి.

అ) తండోపతండాలు
ఆ) విరగబడు
ఇ) రొమ్ములు బాదుకొను
ఈ) గుసగుసలాడు
ఉ) పరీక్షించండి
ఊ) ఆకర్షించటం
ఎ) విరుచుకుపడు
ఏ) నిరూపిస్తున్నది

వాక్య ప్రయోగాలు :
ఉదా : ఆ జాతరకు ప్రజలు తండోపతండాలుగా విరగబడి వచ్చారు.

  1. శత్రువుల ఘాతుకాల్ని చూచి, ప్రజలు రొమ్ములు బాదుకొని వారిపై విరుచుకుపడ్డారు.
  2. ఆమె ప్రజలను బాగా ఆకర్షించడం ద్వారా తన గొప్పతనాన్ని నిరూపిస్తున్నది.
  3. నిజమేమిటో పరీక్షించండని ప్రజలు భయంతో గుసగుసలాడారు.
  4. తండోపతండాలుగా వస్తున్న వారిని పరీక్షించండి.

V. సృజనాత్మకత

1. రవి నాలుగు సంవత్సరాల పిల్లవాడు. ఒకసారి కోటప్పకొండ తిరునాళ్ళకు వెళ్ళినపుడు కిక్కిరిసిన జనంలో తప్పిపోయాడు. అప్పుడు నీలంరంగు నిక్కరు, తెల్లచొక్కా వేసుకున్నాడు. ఈ వివరాలతో ఒక ప్రకటన తయారు. చేయండి.
జవాబు:

తప్పిపోయాడు

మా అబ్బాయి రవికి నాలుగు ఏళ్ళు. కోటప్పకొండ తిరునాళ్ళకు మేము వెళ్ళినపుడు జనంలో తప్పిపోయాడు. అతడు అప్పుడు నీలంరంగు నిక్కరు, తెల్లరంగు చొక్కా వేసుకున్నాడు. నా పేరు ముదిరాజు. నా భార్య పేరు “గీర్వాణి. మాది గురజాల గ్రామం. మా పిల్లవాడు చామనచాయగా ఉంటాడు. చురుకుగా ఉంటాడు.

ఆచూకీ తెలిసినవారు, క్రింది చిరునామాకు తెలుపగోరిక. ఆచూకీ తెలిపినవారికి మంచి బహుమతి ఇస్తాము. వివరాలకు ‘గురజాల’ పోలీసు స్టేషను వారిని సంప్రదించండి.

ఇట్లు,
తండ్రి,
కె. ముదిరాజు,
గురజాల గ్రామం,
‘ఫోన్ నెంబరు 286742.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

2. పాఠం ఆధారంగా అంత్యప్రాస పదాలను ఉపయోగించి నాలుగు పంక్తుల కవిత రాయండి.
జవాబు:
విరివిగా చందాలను పంపించండి
మీ ఔదార్యగుణాన్ని ప్రకటించండి
ధర్మాధర్మాలను పరిశీలించండి
ధర్మాన్నీ, న్యాయాన్ని నిలబెట్టండి.”

3. అందరినీ ఆకర్షించే “శాంతి నినాదాలు” తయారు చేయండి.
ఉదా : యుద్ధాలు వద్దని చెప్పేద్దాం – శాంతే ముద్దని చాటిద్దాం.
జవాబు:

  1. మందుగుండు తగ్గిద్దాం – పదిమందికింత పెడదాం.
  2. కలహాలు మానేద్దాం – సలహాలు పాటిద్దాం
  3. యుద్ధం వద్దు – శాంతి ముద్దు.
  4. మైత్రిని పెంచు – ఆయుధాలు త్రుంచు.
  5. నమ్మకం పెంచుకుందాం – అందరం కలిసి మెలిసి తిరుగుదాం
  6. ప్రపంచ మానవులంతా దేవుని బిడ్డలే – వారంతా అన్నదమ్ములే
  7. మనుషుల మధ్య కలహం – వినాశానికి మూలం
  8. కావాలి తప్పక శాంతి – ఇచ్చేద్దాం యుద్ధాలకు విశ్రాంతి.

VI. ప్రశంసము

1. ఆయా సందర్భాల కనుగుణంగా శాంతికోసం జరిగే సభల్లో, ర్యాలీలో పాల్గొనండి. ఇతరులతో చర్చించండి. ‘ప్రపంచ శాంతి దినోత్సవాన్ని గురించి తెలుసుకోండి.
జవాబు:
ఈనాడు ప్రపంచంలో సుమారు 194 దేశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము సెప్టెంబరు 21వ తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహింపబడుతుంది. దానిలో అందరూ పాల్గొనాలి.

VII. ప్రాజెక్టు పని

* మీ గ్రామంలో, వాడలో శాంతికోసం ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకోండి. వారు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకోండి.
జవాబు:
మా వాడలో పుల్లయ్య, వెంకట్రావులు శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాది అమలాపురం నగరంలో నారాయణ పేట అనే పేట. అక్కడ ఆంజనేయ దేవాలయానికి సంబంధించి ఖాళీస్థలాల్లో చాలామంది బీదలు పాకలు వేసుకొని నివసిస్తూ ఉంటారు.

వాళ్ళు నిత్యం కుళాయి నీటి కోసమో, లేక చిన్న చిన్న దొంగతనాల సంబంధంగానో, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉండేవారు.

పుల్లయ్య, వెంకట్రావు మునిసిపల్ అధికారులతో మాట్లాడి ప్రతి ఇంటికీ కుళాయిలు వేయించారు. ఇళ్ళ మధ్య తారురోడ్లు వేయించారు. వాడలో శాంతి సంఘాలు నెలకొల్పారు.

ఇప్పుడు మనుషులంతా అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెండ్రుగా ఉంటున్నారు. వారు శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వారి ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు.

(లేదా)

* ప్రపంచ శాంతికోసం కృషిచేసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల ఫోటోలు, వివరాలు సేకరించండి. వారి ఫోటోలను ఛార్జ్ మీద అతికించి వివరాలు ప్రదర్శించండి.
జవాబు:
ప్రపంచ శాంతికోసం కృషిచేసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల వివరాలు :

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన
1) నెల్సన్ మండేలా :
ఈయన దక్షిణాఫ్రికా దేశంలో “ట్రాన్సీలో 1918లో పుట్టారు. ఆఫ్రికా నేషనల్ కాంగ్రెసులో చేరి, బ్రిటిషు పాలకుల జాతివర్ణ వివక్షతకు ఎదురొడ్డి పోరాడాడు. బ్రిటిషు వారి పాలనలో 27 సంవత్సరాలు చెరసాలలో ఉన్నారు. ఈయన . దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1993లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఈయన 1990లో భారతరత్న అవార్డు పొందిన రెండవ విదేశీయుడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన 3
2) యాసర్ అరాఫత్ :
ఈయన కయిరోలో 1929లో జన్మించాడు. పాలస్తీనియన విద్యార్థి నాయకుడిగా, పాలస్తీనా విమోచన సైన్య నాయకుడిగా పోరాటం నడిపాడు. పాలస్తీనాకు అధ్యక్షుడయ్యాడు. ఈయన పాలస్తీనాలోని అతి పెద్ద గెరిల్లా గ్రూపు అయిన ‘ఆల్తా కు’ అధిపతి. ఈయనకు 1994లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈయన మన భారత్ కు మంచి మిత్రుడు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ) కింది వాక్యాలను చదవండి. ఆమ్రేడిత పదాలను గుర్తించండి.

1) ఔర ! ఎంత పని చేశావు.
2) అరెరె ! అలా అయిందా?
3) ఆహాహా ! నేనే గొప్పవాడిని.
4) ఏమేమి? నువ్వు చూశావా?
5) ఎట్లెట్లూ? మరోసారి చెప్పండి.
6) ఏమిటేమిటి? నువ్వు వినలేదా?
7) ఓహోహో ! మీరు వచ్చారా !

గమనిక :
పై వాక్యాల్లో కొన్ని పదాలు రెండుసార్లు వచ్చాయి. అవి
ఉదా :
1) ఔర + ఔర = ఔరౌర
2) అరె + అరె = అరెరె
3) ఆహా + ఆహా = ఆహాహా
4) ఏమి + ఏమి = ఏమేమి?
5) ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లూ?
6) ఏమిటి + ఏమిటి? = ఏమిటేమిటి?
7) ఓహో + ఓహో = ఓహోహో

గమనిక :
వీటిలో మనం తొలుత పలికిన పదాన్నే రెండోమారు పలుకుతున్నాం. అలా రెండోమారు పలికే పదాన్ని “ఆమ్రేడితం” అని అంటాం.

ఆ) పైన ఉన్న, పూర్వపదాల్లో చివరన ఏముందో చూద్దాం.
అ) ఔర్ + అ – (ఔర)
ఆ) అర్ + ఎ – (అరె)
ఇ) ఆహ్ + ఆ – (ఆహా)
ఈ) ఏమ్ + ఇ – (ఏమి)
ఉ) ఎట్ + ఉ – (ఎట్లు)
ఊ) ఏమిట్ + ఇ – (ఏమిటి)
ఎ) ఓహ్ + ఓ – (ఓహో)

ఈ పదాలను పరిశీలిస్తే అ, ఆ, ఇ, ఉ, ఎ, ఓ లు పదం చివరన ఉన్నాయి. అంటే అచ్చులు ఉన్నాయన్నమాట.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ఇ) కింది పదాలను పరిశీలించండి.

1) ఔర + ఔర = ఔరౌర = (అ + ఔ = ఔ)
2) ఆహా + ఆహా = ఆహాహా = (అ + ఆ = ఆ)
3) ఏమి + ఏమి = ఏమేమి = (ఇ + ఏ = ఏ)
4) ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు – (ఉ + ఎ = ఎ)
5) ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి = (ఇ + ఏ = ఏ)
6) అరె + అరె = అరరె – (ఎ + అ = అ)
7) ఓహో + ఓహో = ఓహోహో = (ఓ + ఓ = ఓ) లుగా మారుతాయి.

ఈ) కింది వాటిలో కూడా అచ్చుకు ఆమ్రేడితం పరమైందనే విషయాన్ని గమనించండి.

ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి
ఎట్లు + ఎట్లు ఎట్లెట్లు, ఎట్లుయెట్లు
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత

గమనిక :
ఇలాంటి పదాల్లో ఒక్కోసారి ఆమ్రేడితం విడిగా ఉండటం జరుగుతున్నది.

పై విషయాలను బట్టి అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది. అదే ఆమ్రేడిత సంధి అని తెలుస్తున్నది.

ఆమ్రేడిత సంధి సూత్రం :
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.

ఇప్పటివరకు ఆమ్రేడితానికి సంబంధించిన సంధి అంటే ఆమ్రేడిత సంధి గురించి తెలుసుకున్నారు.

ఉ) ఈ కింది పదాలను పరిశీలించి సూత్రాన్ని సరిచూడండి.
అభ్యాసం :
అ) అడిగడిగి = అడిగి + అడిగి = (ఇ + అ = అ) – ఆమ్రేడిత సంధి
ఆ) ఊరూరు = ఊరు + ఊరు = (ఉ + ఊ = ఊ) – ఆమ్రేడిత సంధి
ఇ) అంతంత = అంత + అంత = (అ + అ = అ) – ఆమ్రేడిత సంధి
ఈ) ఓరోరి = ఓరి + ఓరి = (ఇ + ఓ = ఓ) – ఆమ్రేడిత సంధి

సూత్రం :
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగానగు.

1. కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.

అ) దేవాలయాలు : దేవ + ఆలయాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఆ) సాయుధ దళాలు = స + ఆయుధదళాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఇ) అంగారకాది గ్రహాలు = అంగారక + ఆదిగ్రహాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధీ
ఈ) యుగాంతాన్ని = యుగ + అంతాన్ని = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఉ) నయనాంచలాలు = నయన + అంచలాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఊ) సంస్కారపు కేశపాశం = సంస్కారము + కేశపాశం – పుంప్వాదేశసంధి
ఎ) అనురాగపు గులాబి = అనురాగము + గులాబి – పుంప్వాదేశసంధి
ఏ) కళాలయాలు = కళా + ఆలయాలు = (ఆ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి

2. కింది సమాసాలకు విగ్రహవాక్యం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాస నామం
1) ప్రజాపారావారం ప్రజలు అనే పారావారం రూపక సమాసం
2) దరహాస పరిమళాలు దరహాసము అనే పరిమళాలు రూపక సమాసం
3) నయనాంచలాలు నయనముల యొక్క అంచలాలు షష్ఠీ తత్పురుష సమాసం
4) యుగాంతము యుగము యొక్క అంతము షష్ఠీ తత్పురుష సమాసం
5) అనురాగపు గులాబి అనురాగము అనే గులాబి రూపక సమాసం

కవి పరిచయం

పాఠం ఫేరు : ‘ప్రకటన’
కవి : దేవరకొండ బాలగంగాధర తిలక్
దేని నుండి గ్రహింపబడింది : తిలక్ రచించిన ‘అమృతం కురిసిన రాత్రి’ అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
రచయిత కాలం : 1921-1966
జన్మస్థానం : ‘మండపాక’ గ్రామం, తణుకు తాలూకా, ప:గో జిల్లా.
రచనలు :
1) అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, (కవితా సంపుటాలు)
2) తిలక్ కథలు
పురస్కారాలు : ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా గ్రంథానికి 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.

1. ‘చల్లని తల్లి చక్కని చెల్లి’ అని శాంతిని ఉద్దేశిస్తూ ‘ప్రకటన’ కవితను రచించిన కవిని గురించి రాయండి.
జవాబు:
దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రకటన కవితను రాశాడు. ఈ కవిత ఆయన రచించిన ‘అమృతం కురిసిన
రాత్రి’ అనే కవితా సంకలనంలోది. తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో – 1921లో జన్మించాడు. ఈయన అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, తిలక్ కథలు రచించాడు. 1971లో ఈయన అమృతం కురిసిన రాత్రి అనే కవిత సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.

గేయానికి – ప్రతిపదారాలు – భావాలు

1 నుండి 5 పంక్తులు :
1. స్టేషన్లో టిక్కెట్లను జారీ చెయ్యకండి
ఎక్కడి రైళ్ళు అక్కడ ఆపివెయ్యండి
దేశదేశాలకి కేబుల్ గ్రామ్స్ పంపించండి
దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి
ఆకాశవాణిలో యీ విషయం ప్రకటించండి.
ప్రతిపదార్ధం :
స్టేషన్లో = రైల్వే స్టేషన్లలో
టిక్కెట్లను = రైలు టిక్కెట్లను
జారీ చెయ్యకండి = ఇవ్వకండి (అమ్మకండి)
ఎక్కడి రైళ్ళు = ఏ స్టేషన్లో నిలిచిన రైళ్ళు
అక్కడ ఆపివెయ్యండి = ఆ స్టేషన్లోనే నిలిపి ఉంచండి
దేశదేశాలకి = విదేశాలన్నింటికీ
కేబుల్ గ్రామ్స్ = విదేశాలకు పంపే
(Cable gram) టెలిగ్రాము సమాచారాలు
పంపించండి = పంపండి
దేవాలయాల్లో = గుళ్ళలో
నిత్యం = ప్రతిరోజూ
పూజలు చేయండి = పూజలు జరిపించండి.
ఆకాశవాణిలో ఈ విషయం = రేడియోలో ఈ విషయాన్ని
ప్రకటించండి = ప్రకటన ఇవ్వండి

భావం :
ఎవరూ ప్రయాణం చెయ్యకుండా స్టేషన్లలో టిక్కెట్లు ఇవ్వడం ఆపివేయండి. ఎక్కడి రైళ్ళను అక్కడే నిలిపివేయండి. దేశాలు అన్నింటికీ టెలిగ్రాములు పంపండి. దేవాలయాల్లో రోజూ పూజలు చేయండి. అన్ని రేడియో స్టేషన్ల నుండి ఈ విషయం ప్రకటించండి.

విశేషం :
ఏ దొంగ అయినా పారిపోతే అతడు రైలు ఎక్కి పారిపోకుండా రైళ్ళు ఆపివేస్తారు. విదేశాలకు ఆ దొంగ పారిపోతే పట్టుకొని తమకు అప్పగించమని విదేశాలకు టెలిగ్రాములు పంపుతారు. దొంగ దొరికేలా చేయమనిదేవుడికి పూజలు చేస్తారు. దొంగ పారిపోయేడని ప్రజలకు, అందరికీ తెలిసేలా రేడియోలో ప్రకటనలు చేస్తారు. అలాగే ఇక్కడ శాంతి పావురం పారిపోయింది. కాబట్టి, దాన్ని వెతకడం కోసం పై విధంగా చెయ్యమని కవి చెప్పాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

6 నుండి 12 పంక్తులు :
2. కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాల్లో
కాస్త జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి.
సముద్రతీరాలలో నదీజలాలలో వెదకండి
సాయుధ దళాల్ని దిక్కులలో నిలబెట్టండి
రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి.
అడుగుజాడల్ని కూపీ తియ్యండి
వేలిముద్రల్ని పరీక్షించండి
ప్రతిపదార్థం :
కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో = కాఫీ హోటళ్ళలోనూ, క్లబ్బులలోనూ
కర్మాగారాలలో = కర్మాగారాలోనూ (ఫ్యాక్టరీలలోనూ)
కాస్త జాగ్రత్తగా = కొంచెం జాగ్రత్త తీసుకొని
నిశితంగా పరిశీలించండి = క్షుణ్ణంగా పరిశీలన చేయండి
సముద్రతీరాలలో = సముద్రము యొక్క తీర ప్రాంతాలలో
నదీజలాలలో వెదకండి = నదులలోని నీళ్ళలో వెతకండి
సాయుధ దళాన్ని = ఆయుధాలతో, ఉన్న సైనికుల్ని
దిక్కులలో నిలబెట్టండి = అన్ని దిక్కులలో కాపలా పెట్టండి (శాంతి పావురం పారిపోకుండా)
రాకెట్లను = రాకెట్లను
అంగారకాది (అంగారక + ఆది) = అంగారకుడు మొదలయిన
గ్రహాలకు పంపించండి = గ్రహముల వద్దకు పంపించండి (శాంతి పావురాన్ని వెదకడానికి)
అడుగుజాడల్ని = పాదముద్రలను (సంగీతం, నాటకం మొదలైనవి)
కూపీ తియ్యండి = గుట్టు లాగండి
వ్రేలి ముద్రల్ని = వేలి ముద్రల్ని
పరీక్షించండి = పరిశీలించండి

భావం :
కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాలలో చాలా జాగ్రత్తగా అన్నిచోట్లా పరిశీలన చేయండి. సముద్ర తీరాలలో, నదీజలాలలో వెదకండి. ఆయుధాలు ధరించిన సైనికుల్ని దిక్కులలో నిలబెట్టండి. రాకెట్లను అంగారకుడు మొదలైన గ్రహాల వద్దకు పంపించండి. నేలమీద అడుగుముద్రల్లో ఏమైనా జాడలు కనిపిస్తాయేమో గుట్టు తీయండి. వేలిముద్రల్ని కూడా పరిశీలించండి.

విశేషం :
శాంతి పావురం జాడను పట్టుకోడానికి పై విధంగా చెయ్యమని కవి చెప్పాడు. పారిపోయిన వానిని పట్టుకోవడానికి పై చర్యలు చేస్తారు కదా !

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

13 నుండి 18 పంక్తులు :
3. ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు
కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు.
కావ్యచర్చలు కళాలయాలు ఆకర్షించటం లేదు.
స్వార్థజీవనులు గభాలున రొమ్ములు బాదుకుంటున్నారు
సిద్ధాంతాలు చర్చలు ఎవరూ చేయడం లేదు
సిరా యింకకుండానే ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు
ప్రతిపదార్థం :
ప్రజలు తండోపతండాలుగా = ప్రజలు గుంపులు గుంపులుగా
విరగబడుతున్నారు. = విరగబడి వస్తున్నారు
కంగారుతో భయంతో = ప్రజలు కంగారుపడి భయంతో
గుసగుసలాడుతున్నారు = ఒకరితో ఒకరు రహస్యంగా మాట్లాడు కుంటున్నారు
కావ్య చర్చలు = సాహిత్య చర్చలు
కళానిలయాలు = లలిత కళా స్థానములు
ఆకర్షించటంలేదు = జనాన్ని ఆకర్షించడం లేదు (జనం వీటిపై దృష్టి పెట్టడం లేదు)
స్వార్థ జీవనులు = తమకోసమే బ్రతికేవారు
గభాలున = గమ్ముని (వేగంగా)
రొమ్ములు బాదుకుంటున్నారు = గుండెలు బాదు కుంటున్నారు
సిద్ధాంతాలు, చర్చలు = విభిన్నవాద సిద్ధాంతాలు, దానిపై చర్చలు
ఎవరూ చేయడం లేదు = మౌనంగా ఉండిపోయారు
సిరా ఇంక కుండానే = శాంతి ఒప్పందాలపై సంతకం చేసిన పెన్ను సిరా ఆరకుండానే (వెంటనే)
ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు = ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు

భావం :
ఇసుకవేస్తే రాలనంతగా ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కంగారుతో, భయంతో, ఏవేవో అనుమానాలతో గుసగుసలాడుతున్నారు. కావ్య చర్చలు, కళా నిలయాలు జనాన్ని ఆకర్షించడం లేదు. తమ స్వార్థం కోసమే ఆలోచించే మనుష్యులు మాత్రం, గుండెలు బాదుకుంటున్నారు. విభిన్నవాద సిద్ధాంతాల మీద రకరకాల చర్చలు జరిపే మేధావులు, మౌనంగా ఉండిపోయారు. ఎన్నో అంశాల మీద చేసుకున్న ఒప్పందాలు అన్నింటినీ సంతకం చేసిన సిరా ఆరకముందే, చింపేస్తున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

19 నుండి 28 పంక్తులు :
4. అతృప్త అశాంత ప్రజాపారావార తరంగం
అంచుల్ని దాటి భీకరంగా విరుచుకుపడుతోంది.
ఇంక చరిత్రలు వ్రాయనక్కరలేదు.
ఇక రాజ్యాలు పాలించనక్కరలేదు
అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నది
ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది
కాబట్టి స్టాండ్ ఎటెన్షన్ – మన జాతిని మనం
కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం
వెదికి తీసుకురండి పరారీ అయిన వ్యక్తిని
వేరుదారి లేదు కదలండి కదలండి జై అని
ప్రతిపదార్థం :
అతృప్త = తృప్తిలేని
అశాంత = శాంతిలేని
ప్రజా, పారావార, తరంగం = ప్రజలు అనే, సముద్రపు కెరటం (ప్రజా సమూహం)
అంచుల్ని దాటి = చెలియలి కట్టలను దాటి
భీకరంగా విరుచుకు పడుతోంది = భయంకరంగా మీదకు పడుతున్నారు
ఇంక చరిత్రలు వ్రాయ నక్కరలేదు = ఇకమీదట చరిత్రలు వ్రాయవలసిన అవసరం లేదు
ఇక రాజ్యాలు పాలించనక్కరలేదు = రాజులు రాజ్యాలు పాలించవలసిన పనిలేదు
అణుబాంబు = ఆటంబాంబు
యుగాంతాన్ని (యుగ + అంతాన్ని) = యుగ సమాప్తి జరుగుతుందని
నిరూపిస్తున్నది = వెల్లడిస్తోంది
ఆ ముహూర్తం = యుగ సమాప్తి అయ్యే సమయము
త్వరలోనే వస్తున్నది = తొందరగానే వస్తోంది
కాబట్టి స్టాండ్ ఎటెన్షన్ = శ్రద్ధగా నిలబడండి
(Stand attention)
మన జాతిని = మన భారతజాతిని
మనం కాపాడుకోవాలంటే = మనము రక్షించుకోవాలంటే
ఒక్కటే మార్గం = ఒక్కటే దారి ఉంది
వెదకి తీసుకురండి = వెదకి వెనక్కు తీసుకురండి
పరారీ అయిన వ్యక్తిని = పారిపోయిన దానిని (శాంతి కపోతాన్ని)
వేరు దారి లేదు = మరో మార్గం లేదు
కదలండి కదలండి జై అని = జయ జయ ధ్వనులు చేస్తూ నడవండి.

భావం :
అసంతృప్తి, అశాంతితో ఉన్న ప్రజలు, సముద్రంలోని కెరటాల్లా భయంకరంగా విరుచుకు పడుతున్నారు. ఇకమీదట ఎవరూ చరిత్రలు రాయనవసరం లేదు. రాజులు రాజ్యాల్ని పాలింపవలసిన అవసరం లేదు. అణుబాంబు, ఈ యుగాన్నీ, మానవులనూ నాశనం చేసే సమయం తొందరలోనే ఎదురవుతుంది. కాబట్టి శ్రద్ధగా నిలబడండి. మన జాతిని మనం కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. అందరూ కదలి పరారీ అయిన వ్యక్తిని వెతికి తీసుకురావాలి. మరోదారి లేదు. అందరూ ‘జై’ అంటూ కదలండి.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

29 నుండి 35 పంక్తులు :
5. అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది.
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి.
ప్రతిపదార్ధం :
అపార – అంతులేని
కృపా తరంగితాలు + ఐన = దయతో పొంగి పొరలే వయిన (నిండిన)
నయనాంచలాలు (నయన + అంచలాలు) = కన్నుల అంచులు (కను గొలకులు)
ఆనందం జాలువారే = సంతోషం ప్రవహించే
స్నిగ్ధ దరహాస = స్వచ్ఛమైన చిఱునవ్వు యొక్క
పరిమళాలు = సువాసనలు
సంస్కారపు కేశపాశంలో = చక్కగా దువ్వుకొన్న తల వెండ్రుకల కొప్పులో
తురిమిన = ధరించిన
అనురాగపు గులాబి = ప్రేమ గులాబీ పుష్పం
సదా = ఎల్లప్పుడూ
ప్రజా హితైషిణి = ప్రజల మేలు కోరేది
సుభాషిణి = చక్కగా మాట్లాడేది
గర్వం లేని రాణి = గర్వము ఎరుగని రాణి
కల్లనీ = అబద్దాన్ని
క్రౌర్యాన్నీ = క్రూరత్వాన్ని
కాలుష్యాన్ని = మాలిన్యాన్ని
తిరస్కరిస్తుంది = నిరసిస్తుంది
తెల్లని పావురాన్ని = తెల్లని పావురాలను
సరదాగా ఎగరేస్తుంది = వేడుకగా ఎగురవేస్తుంది
చల్లని తల్లి = ఆమె చల్లని తల్లి
చక్కని చెల్లి = ఆమె మనకు చక్కని చెల్లెలు
ఆమె పేరు శాంతి . = ఆ చల్లని తల్లి, చెల్లి పేరు శాంతి

భావం :
ఆమె కనుగొలకులు అంతులేని దయతో నిండియుంటాయి. ఆమె ముఖంలో ఆనందమూ, స్వచ్ఛమైన చిఱునవ్వు పరిమళమూ కనిపిస్తాయి. ఆమె తలలో ప్రేమ గులాబిని ధరిస్తుంది. ఆమె ఎప్పుడూ చక్కగా మాట్లాడుతూ, ప్రజల హితాన్ని కోరుకుంటుంది. ఆమె గర్వంలేని రాణి. ఆమె అసత్యాన్నీ, క్రూరత్వాన్నీ, కాలుష్యాన్ని నిరసిస్తుంది. ఆమె ఎప్పుడూ తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది. ఆమె మన చల్లని తల్లి. చక్కని చెల్లెలు. ఆమె పేరు శాంతి.

AP Board 7th Class Telugu Solutions Chapter 9 కూచిపూడి నాట్యకళ

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 9th Lesson కూచిపూడి నాట్యకళ Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 9th Lesson కూచిపూడి నాట్యకళ

7th Class Telugu 9th Lesson కూచిపూడి నాట్యకళ Textbook Questions and Answers

ప్రశ్నలు జవాబులు

ఈ క్రింది ప్రశ్నలపై చర్చించండి – జవాబులు వ్రాయండి.

ప్రశ్న 1.
కూచిపూడి భాగవతులు ఎవరు? వారి ప్రదర్శనల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
కూచిపూడి భాగవతులు పది నుండి ఇరవైమంది వరకు, బృందంగా ఏర్పడి, ప్రదర్శనలు. ఇచ్చేవారు. ఆయా గ్రామాల కూడళ్ళలో వీధి భాగవత ప్రదర్శనలు జరిగేవి. వీధుల్లో జరిగే భాగవత ప్రదర్శనలు కాబట్టి వీటికి, వీధి భాగవతాలు, అనే పేరు వచ్చింది. వీరిని వీధి భాగవతులు అని, బయలాటగాండ్రు’ అని అంటారు.

భాగవతం, రామాయణం, భారతం, దేవీ భాగవతములలోని కథా ఘట్టాలను కూచిపూడి భాగవతులు ప్రదర్శిస్తారు. ఆ కథలలో ఎంతటి గొప్పవారైనా ధర్మాన్ని వదలి అధర్మపరులయితే, వారికి పతనం తప్పదనే నీతిని ప్రజలకు తెలియజేసి, వారిని మంచి మార్గంలో నడిచేలా చేయడమే, వీధి భాగవతుల నాట్య ప్రదర్శనలోని ప్రధాన లక్ష్యం.

భాగవతుల బృందాలను వారి వంశస్థుల పేర్లతో పిలిచేవారు. ఈ బృందాలను ‘మేళం’ అని కూడా అంటారు. ఈ భాగవతుల వారి మేళం, వేదాంతం వారి మేళం, మొదలయిన పేర్లతో వీరిని పిలిచేవారు. ఈ మేళాలు నాట్యమేళం, నట్టువ మేళం అని రెండు విధాలు. నాట్య మేళంలో భాగవతులంతా పురుషులే ఉండేవారు.

ప్రశ్న 2.
కూచిపూడి నాట్యకళపై కృషిచేసినవారి గురించి చర్చించండి. వారి కృషిని మీరు ఎలా అభినందిస్తారు?
జవాబు:
సిద్ధేంద్రుడు అనే యోగి కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు. సిద్ధేంద్రుడి తర్వాత ‘భాగవతుల రామయ్య – గారు పేరు పొందారు.

తరువాత ‘కేళిక’, యక్షగానము వచ్చాయి. కందుకూరి రుద్రకవి యక్షగాన రచనకు మొదటివాడు. నృత్య నాటకాలను రామానుజయ్య సూరి, తిరునారాయణాచార్యులు రూపొందించారు. నృత్య రూపక, నృత్య నాటికలను, వెంపటి చినసత్యం, కేళికను వేదాంతం రామలింగ శాస్త్రి వెలువరించారు. కూచిపూడి నాట్యకళలో ‘వెంపటి వెంకట నారాయణగారు, చింతా వెంకట్రామయ్యగారు, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిగార్లను, ‘మూర్తిత్రయం’ అని పిలుస్తారు.

వేదాంతం పార్వతీశం, వెంకటాచలపతి, రామకృష్ణయ్య, రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, వెంపటి పెదసత్యం, చినసత్యం, వేదాంతం సత్యనారాయణ శర్మ, పసుమర్తి కృష్ణమూర్తి, వేణుగోపాల కృష్ణశర్మ, మొదలయినవారు, ‘కూచిపూడి నాట్యాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.

కూచిపూడి నాట్యానికి చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని తెచ్చిన వారిలో వేదాంతం పార్వతీశం, సత్యనారాయణ శర్మలు ముఖ్యులు. . కూచిపూడి నాట్యకళ తెలుగు వారికి స్వంతము. ఈ నాట్యకళకు ఆద్యుడైన సిద్ధేంద్రయోగిని, ఈ నాట్యకళను విశ్వవ్యాప్తం చేసిన కళాకారులను మనసారా అభినందిస్తున్నాను.

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

ప్రశ్న 3.
అభినయంలోని రకాల గూర్చి చర్చించండి.
జవాబు:
అభినయం నాల్గు రకాలు. అవి :

  1. ఆంగికం,
  2. వాచికం,
  3. ఆహార్యం,
  4. సాత్వికం.

1) ఆంగికాభినయం :
కళాకారులు తమ శరీరంలోని అవయవాల ద్వారా ప్రేక్షకులకు ప్రదర్శనలోని సారాంశాన్ని అందించడం ‘ఆంగికాభినయం’. ఆంగికాభినయంలో హస్తాలతో పట్టే ముద్రలు, చూసే చూపులలో తేడాలు, తలను అటూ ఇటూ త్రిప్పడంలో తేడాలు, పాదాల కదలికలో భేదాలు ముఖ్యము.

2) వాచికాభినయం :
భాష ద్వారా అందించే దానిని వాచికాభినయం అంటారు.

3) ఆహార్యాభినయం :
తాము ధరించిన వేషం, ద్వారా తెలియపరచే దాన్ని ‘ఆహార్యాభినయం’ అంటారు. ఏ వేషానికి ఏ వస్త్రాలు ధరించాలి? ఏ ఆభరణాలు ధరించాలి? ఎలాంటి రంగులు దిద్దుకోవాలి? అనే విషయాలను చెప్పేదే, ఆహార్యాభినయం.

4) సాత్వికాభినయం :
మనస్సులో కలిగే భావాలను ముఖం ద్వారా వెల్లడించడాన్ని సాత్వికాభినయం అంటారు.

కఠిన పదములకు అర్థములు

జీవనాడి = ప్రాణనాడి
సంప్రదాయం = పాదుకొన్న ఆచారము
అరుదైన = అపురూపమైన (దుర్లభమైన)
ఆవిర్భవించిన= పుట్టిన
అంగాలు = అవయవాలు
కథాఘట్టాలు – కథలోని రసవంతమైన చోటులు
అధర్మపరులు = అధర్మమునందు ఆసక్తి కలవారు
పతనం = భ్రష్టుడు కావడం
ప్రవర్తించేలా = నడిచేలా
బృందం = గుంపు
కూడళ్ళు = కలియు చోటులు
ప్రజా బాహుళ్యం = అనేకమంది ప్రజలు
పాలకులు = రాజులు, ప్రభువులు
దైవ కెంకర్యము = దైవసేవ
ఎల్లలు = పొలిమేరలు
నలుచెరగులు = నాల్గు వైపులు
సంతరించుకొన్నప్పుడు = సేకరించుకొన్నప్పుడు
గణుతి = ఎన్నిక
అపచారము = తప్పు చేయడం
సమకాలీన చరిత్రలు = అదే కాలానికి చెందిన చరిత్రలు
పరిష్కారాలు = సరిదిద్దడాలు
ఆవిష్కరింపబడినవి = వెల్లడి చేయబడ్డాయి
నృత్యాంశములు (నృత్య+అంశములు) = నృత్యమునకు చెందిన విషయములు
సొబగు = అందము

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

వివాహం పాపా
ఆద్యుడు = మొదటివాడు
రూపొందించారు = ఏర్పాటు చేశారు
పరిమితం = మిక్కిలి మితమైనది
విశ్వవ్యాప్తం = ప్రపంచం అంతా వ్యాపించింది
మహనీయులు = గొప్పవారు
ప్రముఖులు = ప్రసిద్ధులు
పురస్కారాన్ని = బహుమానాన్ని
పురాతన గ్రంథాలు = ప్రాచీన పుస్తకాలు
మలచుకొని = తిప్పుకొని
సంధానం = కలయిక
సోపానములు = మెట్లు
కరచరణాది = చేతులు, పాదములు మొదలయిన
చలనాలు = కదలికలు
అభినయించడానికి = నటించడానికి
అనువుగా = అనుకూలముగా (వీలుగా)
తాళలయాన్వితము = తాళము, లయలతో కూడినది.
నర్తనము = నాట్యము
ప్రేక్షకులు = చూసేవారు
ఆంగికం = చేతులు మొదలయిన వాటితో చేసే అభినయము
వాచకం = మాటల ద్వారా అభినయం
ఆహార్యం = వస్త్రధారణ రూపమైన అభినయాలు
అంగములు = అవయవములు
వ్యక్తపరచడాన్ని = వెల్లడించడాన్ని
బాణి = పద్దతి
హస్తాలు = చేతులు

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 8th Lesson నిజం-నిజం Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 8th Lesson నిజం-నిజం

7th Class Telugu 8th Lesson నిజం-నిజం Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై చిత్రంలో పిల్లవాడు ఏ పాత్ర ధరించాడు?
జవాబు:
పై చిత్రంలో పిల్లవాడు ‘భీముడు’ పాత్ర ధరించాడు.

ప్రశ్న 2.
ఏ సందర్భంలో పిల్లలు ఇలాంటి వేషాలు ధరిస్తారు? ఎందుకు?
జవాబు:
పాఠశాలలో వార్షికోత్సవం జరిగినప్పుడు పిల్లలు ఇలాంటి వేషాలు వేస్తారు. తమలోని నటనా కౌశల్యాన్ని ప్రదర్శించి, తోడిపిల్లలను సంతోషపెట్టడానికి పిల్లలు ఇలాంటి వేషాలు వేస్తారు.

ప్రశ్న 3.
చిత్రంలో అమ్మాయి గదను గురించి ఏమనుకుంటోంది?
జవాబు:
చిత్రంలో అమ్మాయి, గదను చూసి తాను ఆడుకొనే బంతి అనుకుంటోంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 4.
వేషం ధరించిన పిల్లవాడు తన స్నేహితునితో ఏమి చెప్తున్నాడు?
జవాబు:
వేషం ధరించిన పిల్లవాడు, తాను భీముడి వేషం వేశానని, మిత్రుడికి చెప్తున్నాడు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
శీను ఎలాంటివాడో మీ మాటల్లో చెప్పండి. రచయిత ఇంట్లో ఎందుకున్నాడు?
జవాబు:
శీను పన్నెండేండ్ల వయస్సు పిల్లవాడు. శీను రంగయ్యకు కుమారుడు. రంగయ్య రచయితకు మిత్రుడు. శీను మంచి చెడ్డలు చూసి, శీనును మంచిదారిలో పెడతాడని, రంగయ్య, శీనును రచయిత ఇంట్లో ఉంచి అక్కడ బడిలో చదివిస్తున్నాడు.

శీను ఈ మధ్య అబద్దాలు చెప్పడం మొదలు పెట్టాడు. దసరా సెలవులకు శీను ఇంటికి వెళ్ళి, బడి తెరిచాక నాల్గు రోజుల తర్వాత రచయిత ఇంటికి వచ్చాడు. బడికి ఆలస్యంగా వచ్చావేమిరా ? అని రచయిత అడిగితే, తన తండ్రి ఉండమన్నాడనీ, సెలవు చీటి తెచ్చాను కాని ఎక్కడో పారవేశాననీ, అబద్దాలు చెప్పాడు.

తిరిగి స్కూలుకు నాల్గురోజులు సెలవులు ఇచ్చారు. ఇంట్లో ఆవు ఈనుతుంది జున్ను తినాలని, శీను మళ్ళీ రచయితతో అబద్దాలు చెప్పాడు. తన తండ్రి రమ్మన్నాడని, తన ఊరిపిల్లవాడు సీతయ్యతో కలిసి తన ఊరు వెడతానని, రచయిత దగ్గర శీను అబద్దాలు చెప్పాడు.

అనుకోకుండా రచయితకు బజారులో శీను తండ్రి కనబడ్డాడు. శీనును తాను రమ్మనలేదని చెప్పాడు. విషయం తెలిసిన రచయిత, తెలివిగా శీనును డబాయించాడు. శీను తండ్రికి లేఖరాసిస్తానని దానికి జవాబు రాయించుకొని తెమ్మని శీనుకు చెప్పాడు.

దానితో శీను, తండ్రికి విషయం తెలుస్తుందని భయపడి తన ప్రయాణం మానుకొని, తన తప్పు అంగీకరించి, జీవితంలో ఇంక ఎప్పుడూ అబద్ధం ఆడనన్నాడు.

శీను తప్పు తెలిసికొన్నాడు. కాబట్టి మంచి పిల్లవాడు.

ప్రశ్న 2.
పాఠంలో ఏ అంశానికి ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు? ఎందుకు?
జవాబు:
పిల్లలు. మంచి అలవాట్లతో, నిజాయితీతో నడవాలి. అలా నడచుకొన్నవారే, జీవితంలో గొప్పవారుగా ఎదుగుతారు. మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా, నీతి మార్గంలోనే నడవాలని, అబద్దాలు ఎప్పుడూ చెప్పగూడదని, తెలియజేయడమే ఈ పాఠంలోని ప్రధాన అంశము. పిల్లలు ఎప్పుడూ నిజమే చెప్పాలనే అంశానికే ఈ కథలో ప్రాధాన్యం ఉంది.

ఈ కథలో జున్ను తినాలనే కోరికతో అబద్దం చెప్పిన శీనును, రచయిత నేర్పుగా తెలివిగా బుజ్జగించి, ఇంక తాను ఎప్పుడూ జీవితంలో అబద్దం చెప్పనని అనిపించాడు. శీనుకు పశ్చాత్తాపం కలిగించాడు. పిల్లలను కొట్టకుండా, * తిట్టకుండా వారికి నచ్చచెప్పి, వారిని మంచిదారిలోకి తేవాలని చెప్పడమే ఈ కథలోని ప్రధాన. అంశం.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 3.
శీను, మామయ్య మాటలలో మీకు ఎక్కడ నవ్వు వచ్చింది? ఎందుకు?
జవాబు:
మామయ్య, శీనును “ఎందుకురా ఇన్ని అబద్దాలాడావు? మీ ఇంటికి మొన్ననేగా వెళ్ళివచ్చింది? ఎందుకు ఇంతలోనే బెంగ పెట్టుకొన్నావు? భయం లేదు చెప్పు” అని బుజ్జగించి అడిగాడు.

అప్పుడు శీను తమ ఇంట్లో ఆవు ఈనుతుందని, శీనుకు పెట్టకుండా తాము ఎలా ,తినగలం అని, శీను తల్లి బాధపడిందని, ఆ జున్ను కోసమే తాను తండ్రి రమ్మన్నాడని అబద్దం చెప్పానని మామయ్యతో నిజం చెప్పాడు. ఈ శీను మాటలు నాకు నవ్వు తెప్పించాయి.

అలాగే సీతయ్యతో కలిసి ఇంటికి వెడతానని శీను మామయ్యకు చెప్పాడు. దానితో మామయ్యకు సీతయ్య చెడ్డవాడనే అనుమానం వచ్చింది. సీతయ్య దుర్మార్గుడనీ, అతనితో స్నేహం వల్లనే శీను చెడిపోయాడనీ, సీతయ్య గురించి వాళ్ళ మేష్టారు తనకు చెప్పాడనీ, మామయ్య శీనును డబాయించాడు.

అప్పుడు శీను, సీతయ్య అనే పిల్లవాడే లేడని తాను సీతయ్య గురించి అబద్ధం చెప్పానని, నిజం బయటపెట్టాడు. : ఈ సందర్భంలో మామయ్య చెప్పిన డబాయింపు మాటలు, నాకు నవ్వు తెప్పించాయి.

ప్రశ్న 4.
‘కథ’ను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
రంగయ్య కుమారుడు శీను, తన మామయ్యగారి ఇంట్లో ఉండి, బడిలో చదువుతున్నాడు. మామయ్య శీనును మంచివాడిగా తీర్చిదిద్దుతాడనీ, శీనుకు అక్కడ చదివితే రెండు ముక్కలు వస్తాయనీ, రంగయ్య, శీనును మామయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నాడు.

దసరా సెలవులకు శీను ఇంటికి వెళ్ళి స్కూలు తెరిచాక నాల్గు రోజులకు తిరిగి వచ్చాడు. తన తండ్రి తనను – నాల్గురోజులు ఉండమన్నాడనీ, సెలవు చీటి తెచ్చాను కాని పడిపోయిందనీ, శీను మామయ్యకు అబద్ధం చెప్పాడు.

తిరిగి బడికి నాల్గురోజులు సెలవులు ఇచ్చారు.. తన తండ్రి, ఆ సెలవులకు తనను తప్పక రమ్మన్నాడనీ, తమ ఊరి పిల్లవాడు సీతయ్య’ తనకు తోడుగా వస్తాడనీ, శీను మామయ్యతో అబద్ధం చెప్పాడు.

ఎందుకో, మామయ్యకు శీను అబద్దం చెపుతున్నాడనే అనుమానం వచ్చింది. ఇంతలో శీను తండ్రి రంగయ్య, మామయ్యకు బజారులో కనబడ్డాడు. శీనును తాను ఇంటికి రమ్మనలేదని రంగయ్య, మామయ్యకు చెప్పాడు.

దానితో మామయ్య, తాను శీను తండ్రికి ఉత్తరం రాసి ఇస్తానని, దానికి ఆ ఉత్తరానికి శీను తండ్రిచే జవాబు రాయించుకు రమ్మనీ, ఉత్తరం తీసుకురాకపోతే తనకు కోపం వస్తుందనీ శీనుతో చెప్పాడు.

ఉత్తరం చూస్తే, తాను అబద్ధం చెప్పానని తన తండ్రికి తెలుస్తుందని, శీను. తన ప్రయాణం మానుకున్నాడు. శీను, మామయ్యతో. నిజం చెప్పి, చేసిన తప్పుకు పశ్చాత్తాపపడ్డాడు. ఈ విధంగా మామయ్య తెలివితో శీనును మంచిదారిలోకి మళ్ళించాడు.

ప్రశ్న 5.
మీరు ఎప్పుడైనా అబద్దాలు చెప్పారా? దానివల్ల ఏం జరిగింది?
జవాబు:
మా బడిలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆ రోజు లెక్కలు పరీక్ష. ఆ రోజే మా నగరంలోకి ‘బాహుబలి’ అనే సినిమా .. వచ్చింది. ఆ రోజు శనివారం. పరీక్షలు అయిపోయాయని, ఆ రోజు స్కూలుకు సెలవు అని నేను మా అమ్మగారితో . చెప్పి, పరీక్ష ఎగగొట్టి సినీమాకు వెళ్ళాను. ఆనందంగా సినిమా చూశాను. . . పరీక్షలు అయిన తర్వాత ఒకరోజు మాకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారు. దానిలో లెక్కల పరీక్ష నేను రాయలేదని రాసి ఉంది. ప్రోగ్రెస్ కార్డుపై మా నాన్నగారు సంతకం చేయాలి. నేను భయపడుతూనే నాన్నగార్కినా ప్రోగ్రెస్ కార్డు ఇచ్చాను. మా నాన్నగారు దానిపై సంతకం చేసి, లెక్కల పరీక్ష ఎందుకు రాయలేదని నన్ను అడిగారు. అమ్మ అక్కడే ఉంది. నాన్న పరీక్షల టైంటేబులు చూశారు. నా తప్పు వారికి దొరికింది. నేను ఏడుస్తూ నాన్నగారి కాళ్ళపై పడి క్షమించమన్నాను. నాన్నగార్కి ఆ కోపం, ఇంకా తగ్గలేదు.

II. చదవడం – రాయడం

అ) పాఠం చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘శీను’ను గురించి వాళ్ళ మామయ్యకు గల బాధ్యతలు ఏవి?
జవాబు:
శీను ఎప్పుడయినా ఆలస్యంగా ఇంటికి పొద్దుపోయి వస్తే కోప్పడడం, శీను వేళకు. భోజనం చేస్తున్నదీ, లేని – కనుక్కోవడం, అనేవే శీను గురించి వాళ్ళ మామయ్యకు ఉన్న బాధ్యతలు.

ప్రశ్న 2.
రంగయ్య, మామయ్య ‘శీను’ను గురించి, ఏ ఏ సందర్భాలలో, ఏమేమి మాట్లాడారు?
జవాబు:
రంగయ్య తన కుమారుడు శీనును మామయ్య దగ్గర వదలి పెట్టి “కాస్త కనిపెట్టి చూస్తూ ఉండరా !” అని చెప్పాడు.

ఒకరోజు సాయంత్రం బజారులో మామయ్యకు రంగయ్య కనబడ్డాడు. “శీను చదువు ఎల్లా ఉందని” రంగయ్య మామయ్యను అడిగాడు. “చదువు ఎలా. ఉన్నా, శీను చెడుసావాసాలు చేస్తున్నట్లు నాకు అనుమానంగా ఉంది” .. అని మామయ్య రంగయ్యకు చెప్పాడు.

అప్పుడు రంగయ్య మామయ్యతో “కుర్రవాడిని బాగుచేసే బాధ్యత నీదిరా, అబ్బాయి ! మరి నీ ఇంట్లో ఉంచినది ఎందుకు? కాస్త మంచిచెడ్డ చూస్తావని కదూ ! వాడిని నీవే ఒక దారిలో పెట్టాలి. వాడు పన్నెండేళ్ళ. పిల్లాడు. ఇప్పుడే నీవు వాడిని మంచిదారిలో పెట్టాలి. అంతా నీదే భారం” అని రంగయ్య మామయ్యతో అన్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 3.
మామయ్య, ‘శీను’ను ఊరికి పంపకపోవడానికి కారణమేమిటి?
జవాబు:
‘శీను ఈ మధ్య ఏవో కుర్రతనపు చేష్టలు చేస్తున్నాడు. శీను ఈ మధ్య దసరా సెలవులకు ఇంటికి వెళ్ళాడు. స్కూలు తెరవగానే తిరిగి రాక, నాలుగు రోజులు ఆలస్యంగా మామయ్యగారి ఇంటికి వచ్చాడు. ఎందుకురా ఆలస్యంగా – వచ్చావు? అని మామయ్య అడిగితే, తన తండ్రి ఉండమన్నాడని అబద్దం చెప్పాడు. సెలవు చీటీ తెచ్చావురా? అంటే, తెచ్చాను కాని ఎక్కడో పారవేశానని మరో అబద్దం చెప్పాడు.

ఈ విధంగా శీను అభాద్దాలు చెపుతున్నాడనే అనుమానం మామయ్యకు వచ్చింది. అందుకే, శీనునీ ఊరికి పంపడానికి మామయ్య అంగీకరించలేదు.

ప్రశ్న 4.
‘శీను’ తమ ఊరికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు?
జవాబు:
శీను దసరా సెలవుల నుండి మామయ్యగారింటికి వచ్చే రోజుననే, శీను ఇంట్లో ఆవు ఆ రోజుననో, మరునాడో ఈనుతుందని అందరూ అనుకుంటున్నారు. శీను తల్లి శీనుతో “నాయనా ! జున్ను తినకుండా వెడుతున్నావు. ఇంకో రెండు రోజులు ఉండరాదురా ! జున్ను నీకు పెట్టకుండా, మేము అందరం ఎలా తింటాం” అని ఎన్నోసార్లు అంది.

శీనుకు జున్ను తినాలని ఉంది. అందుకే శీను ఏదో అబద్ధం చెప్పి, తన ఊరుకు వెళ్ళాలనుకున్నాడు.

ప్రశ్న 5.
మామయ్య ‘సీతన్న’ గురించి ‘శీను’తో ఏం చెప్పాడు?
జవాబు:
మామయ్య శీనుతో సీతన్న గురించి ఇలా చెప్పాడు. – “ఒరే శీనూ ! ఆ సీతన్న వరివెధవ. వీధుల వెంట తిరిగే వెధవ. వాడు వర్థి అబద్ధాల కోరు. వాడు మీ ఊరు వాడయినా సరే వాడితో ఎప్పుడూ మాట్లాడకు.

ఆ సీతన్న గురించి నాకు అంతా తెలుసు. వాళ్ళ మాస్టారు కూడా సీతన్న వట్టి దుర్మార్గుడని, వాడి సహవాసం వల్ల నీవు కూడా చెడిపోతున్నావనీ నాకు చెప్పాడు.”

పై విధంగా మామయ్య శీనుతో సీతయ్య గురించి తనకు తెలిసినట్లు డబాయిస్తూ మాట్లాడాడు.

ప్రశ్న 6.
పాఠం చదవండి. అందులో ప్రశ్నా వాక్యాలను గుర్తించి, రాయండి.
జవాబు:

  1. ఏం కావాలిరా శీనూ?
  2. మళ్ళీ ఎందుకు రా వెళ్ళటం?
  3. ఎందుకురా శీనూ!, ఇప్పుడు నీవు మళ్ళీ ఊరికి వెళ్ళటం? మొన్ననే కదా వెళ్ళి వచ్చావు? ఇంతలోనే ఏమి తొందర?
  4. నిజంగా రమ్మన్నారా?
  5. ఏం రా? వెడతావా?
  6. ఏం వెళ్ళకపోతే ఏం?
  7. మీ నాన్న కోప్పడుతాడేం?
  8. నిన్ను గట్టిగా రమ్మని చెప్పాడా?
  9. వాడి పేరు?
  10. ఏ క్లాసు?
  11. ఏం చెయ్యాలి చెప్పు?
  12. ఎందుకు వెళ్ళవురా?
  13. హరిశ్చంద్రుడి కథ తెలుసునా?
  14. ఏం జేశాడూ?
  15. ఏం అట్లా చూస్తావు?
  16. ఎందుకురా శీనూ, ఇన్ని అబద్ధాలాడావు? మొ||వి.

ప్రశ్న 7.
క్రింది పేరాను చదవండి. ఐదు ప్రశ్నలు తయారు చేయండి.

“ఈ సెలవులు నాలుగు రోజులూ ఇంటి దగ్గర ఉండివస్తాను మామయ్య”, అన్నాడు శీను. “మళ్ళీ ఎందుకురా వెళ్ళటం?” అన్నాడు మామయ్య. శీను బిక్కముఖంతో అక్కడే నుంచుని ఉన్నాడు.

శీను అంటే ఎవరో కాదు. మా రంగయ్య కొడుకు. బంధుత్వం ఎల్లాగున్నా ! రంగయ్యా, నేను చిన్నప్పటి నుండి స్నేహితులం. అందుకనే వాడు తన కుర్రవాణ్ణి నా దగ్గర వడలిపెట్టి, “కాస్త కని పెట్టి చూస్తూవుండరా ! అని చెప్పి వెళ్ళాడు.” కుర్రవాడు మామయ్య దగ్గరవుంటే వాడికో ముక్క వస్తుందని, మంచి బుద్ధిమంతుడు అవుతాడని రంగయ్య ఉద్దేశ్యం.
జవాబు:
ప్రశ్నలు :
1) శీను మామయ్యతో ఏమి చెప్పాడు?
2) శీనునీ మామయ్య ఏమని అడిగాడు?
3) శీను ఎవరు?
4) రంగయ్య, మామయ్యల సంబంధం ఏమిటి?
5) రంగయ్య మామయ్యతో ఏమి చెప్పాడు?

గయ్య కొడుకు అక్కడే నుంచును” అన్నాడు.
రాకపోయినా, చర్చయిత కోరుకున్నారులు చెప్పిన పిల్లలు పిల్లలను కొట్టకు

III. స్వీయరచన

అ) కింది ప్రశ్నలకు నాలుగు లేదా ఐదు వాక్యాలలో సమాధానాలు ఆలోచించి రాయండి.

ప్రశ్న 1.
పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలని రచయిత కోరుకున్నారు? ఎందుకు?
జవాబు:
పిల్లలకు చదువు వచ్చినా రాకపోయినా, చదువుకోడం వల్ల వారి ప్రవర్తన బాగుపడాలి. చిన్నతనంలోనే పిల్లలను కాస్త మంచి మార్గంలో పెట్టాలని రచయిత కోరుకున్నాడు. … పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి. లేకపోతే మొదట అబద్దాలు చెప్పిన పిల్లలు క్రమంగా దొంగతనాలు నేర్చుకుంటారు. తరువాత స్కూలుకు ఎగగొట్టి ఎందుకూ పనికిరాకుండా పోతారు. పిల్లలను కొట్టకుండా తప్పు చేస్తే గట్టిగా చీవాట్లు వేయాలి. అబద్ధం ఆడటం తప్పని పిల్లలకు నచ్చచెప్పాలని రచయిత అనుకున్నాడు.

ప్రశ్న 2.
ఈ కథ వలన మీరు గ్రహించిన విషయాలు ఏవి?
జవాబు:

  1. ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు.
  2. సీతన్నవంటి చెడ్డపిల్లలు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళతో సహవాసం చెయ్యకూడదు.
  3. అబద్దం చెప్పిన పిల్లలను పెద్దలు కొట్టకూడదు.
  4. ఎందుకు వారు అబద్దం చెప్పారో బుజ్జగించి అడిగి కారణం తెలుసుకొని ఆ పిల్లల కోరికలు తీర్చాలి. ఈ కథలో శీను జున్ను తినాలనే కోరికతో అబద్దం చెప్పాడు. అందుకోసం శీను ఎన్నో అబద్దాలు ఆడాడు. మామయ్య లేఖ రాసిస్తాననీ, దానికి శీను తండ్రి చేత జవాబు రాయించుకు రమ్మని చెప్పాడు. తండ్రికి ‘ విషయం తెలుస్తుందని శీను తన తప్పును అంగీకరించి ఇంక ఎప్పుడూ అబద్దం చెప్పనని మామయ్యకు మాట ఇచ్చాడు.
  5. దీనిని బట్టి పిల్లలను తెలివిగా మంచిదారిలోకి తేవాలని ఈ కథ ద్వారా నేను గ్రహించాను.
  6. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా నీతి మార్గంలో నడవాలనీ, అబద్ధం చెప్పరాదనీ ఈ పాఠం వల్ల నేను గ్రహించాను.

ప్రశ్న 3.
చెడ్డవాళ్ళతో స్నేహం చేయగూడదని రచయిత అన్నారు కదా ! అందువల్ల కలిగే నష్టాలు ఏవి?
(లేదా)
చెడ్డ వాళ్ళతో స్నేహం చేయరాదని పెద్దవారు చెబుతారు కదా ! అందువల్ల కలిగే నష్టాలను మీ పాఠ్యాంశము ఆధారంగా వివరించండి.
జవాబు:
చెడ్డవారితో స్నేహం చేస్తే వారి చెడుగుణాలు స్నేహం చేసిన వారికి వస్తాయి. చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే, అబద్ధాలు చెప్పడం, బడి మానివేయడం, పేకాట ఆడడం, సిగరెట్లు, బీడీలు కాల్చడం, సినిమాలకు తరచుగా వేళ్ళడం, త్రాగడం వగైరా చెడు గుణాలు సంక్రమిస్తాయి.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 4.
‘శీను’కు రచయిత ఎలా బుద్ధి చెప్పారో రాయండి.
జవాబు:
శీను’ సెలవులకు తనను ఇంటికి తప్పక రమ్మని, తన తండ్రి చెప్పాడని, రచయితతో అబద్ధం చెప్పాడు. రచయితకు శీను తండ్రి బజారులో కనబడి, తాను శీనును రమ్మని చెప్పలేదని చెప్పాడు.

అప్పుడు రచయిత తాను ఒక ఉత్తరం, శీను తండ్రికి రాసి ఇస్తానని, దానికి తప్పకుండా శీను తండ్రి చేత . జవాబు రాయించుకొని తేవాలని, శీనుకు చెప్పాడు. రచయిత రాసిన ఉత్తరం చదివితే తండ్రికి నిజం తెలుస్తుందని శీను భయపడి, తాను సెలవులకు ఇంటికి వెళ్ళనని చెప్పాడు. అంతేగాక తాను జున్ను తినాలని అబద్దం – చెప్పానని అంగీకరించాడు. ఇంక ఎప్పుడూ అబద్దం. చెప్పనన్నాడు. ఈ విధంగా తెలివిగా, రచయిత .శీనుకు .. బుద్ధి చెప్పాడు.

ప్రశ్న 5.
“శీను విధేయతతో తల ఊపుతూ బస్సు ఎక్కాడు. నేను కిందనే నుంచున్నాను. ఇలా పాడు పైన – నేను కింద ఉన్నామని” రచయిత అన్నాడు కదా ! ఈ మాటల వల్ల మీరు ఏమి గ్రహించారో రాయండి.
జవాబు:
సీతయ్య అన్నవాడు తనకు తెలుసునని రచయిత శీను దగ్గర డబాయించాడు. ఆ సీతయ్యే శీనుకు మీ మామయ్యతో ఇలా చెప్పి రారా” అని బోధించి ఉంటాడని రచయిత అనుకున్నాడు. అందుకే శీను దుర్మార్గుడని వాడి – స్నేహంతోనే శీను చెడిపోతున్నాడని, సీతయ్య మాష్టారు కూడా తనకు చెప్పాడని రచయిత శీనును గట్టిగా .. దబాయించాడు.

రచయిత మాటలన్నీ విన్న శీను సీతయ్య అన్నవాడు లేనేలేడని, మెల్లగా నిజం బయటపెట్టాడు. ఈ విధంగా అబద్ధాలు కల్పించి చెప్పడంలో, రచయిత కన్నా శీను పైన ఉన్నాడని, రచయిత కింద ఉన్నాడని కథా. రచయిత చమత్కరించి చెప్పాడు.

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘శీను’ గురించి రాయండి.
జవాబు:
శీను రంగయ్యకు పుత్రుడు. రంగయ్య తనకు మిత్రుడూ, శీనుకు మామయ్య అయిన రచయిత ఇంట్లో ఉంచి శీనును చదివిస్తున్నాడు. శీనును రచయిత కనిపెట్టి చూస్తాడని రంగయ్య ఆశ.

శీను ఈ మధ్య అబద్దాలు ఆడుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్ళి తన తండ్రి ఉండమన్నాడని బడి తెరిచాక నాల్గు రోజులకు తిరిగి వచ్చాడు. సెలవు చీటీ తెచ్చాను కాని ఎక్కడో పారవేశానన్నాడు.

మళ్ళీ నాల్గు రోజులు సెలవులు వచ్చాయి. ‘ శీను ఇంట్లో ఆవు ఈనుతోంది. దాని జున్ను తినాలని శీను ఆశపడ్డాడు. తండ్రి’ రమ్మన్నాడని, తమ ఊరి సీతయ్యతో కలిసి వెడతానని మామయ్యతో అబద్దం చెప్పాడు.

మామయ్యకు శీను అబద్దం చెపుతున్నాడని ఎందుకో తోచింది. బజారులో శీను తండ్రి రంగయ్య, శీనుమామయ్యను కలిశాడు. శీనును తాను ఇంటికి రమ్మనలేదని చెప్పాడు.

అప్పుడు శీను మామయ్య, శీనుతో, తాను శీను తండ్రికి ఉత్తరం రాసి ఇస్తానని, దానికి శీను తండ్రిచే జవాబు తప్పక రాయించి తెమ్మనీ చెప్పాడు – మామయ్య ఉత్తరం చూస్తే తండ్రికి నిజం తెలుస్తుందని, శీను తన తప్పు ఒప్పుకున్నాడు. ఇంక జీవితంలో ఎప్పుడూ అబద్దం చెప్పనని మామయ్యకు శీను చెప్పాడు. మామయ్య జాలిపడి, శీనును జున్ను తినడానికి ఇంటికి పంపాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 2.
పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
శీనువచ్చి ఈ నాలుగు సెలవు రోజుల్లో వాళ్ళ ఇంటికి వెడతానని మామయ్యను అడిగాడు. శీను మామయ్య – గారింట్లో ఉండి చదువుకుంటున్నాడు. శీను తండ్రి రంగయ్య. మామయ్య శ్రద్ధగా చదివిస్తాడని శీనును మామయ్య గారింటి దగ్గర రంగయ్య ఉంచాడు. శీనును మామయ్య జాగ్రత్తగా చూస్తున్నా ఈ మధ్య అబద్ధాలు చెపుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్ళి బడి తెరిచిన నాల్గు రోజులకు వచ్చాడు. వాళ్ళ నాన్న, ఉండమన్నాడని మామయ్యతో అబద్దం చెప్పాడు. మామయ్యకు శీను ‘మీద అనుమానం వచ్చింది.

శీను తండ్రి రంగయ్య బజా మామయ్యకు కనబడి శీనును తాను రమ్మనలేదని చెప్పాడు. దానితో శీను అబద్దాలు ఆడుతున్నాడని మామయ్య గ్రహించాడు. శీనును తిడదామని మామయ్య అనుకున్నాడు. శీను ప్రయాణం ఆపాలని నీవు ఒక్కడివీ ఎలా వెడతావురా అని మామయ్య శీనును అడిగాడు. తన ఊరి పిల్లాడు సీతయ్యతో కలిసి వెడతానన్నాడు శీను.

మామయ్య శీనును వెళ్ళమని చెప్పాడు. శీను తండ్రికి తాను ఉత్తరం రాసి ఇస్తానని, దానికి తప్పక జవాబు రాయించి తెమ్మని, తేకపోతే తనకు కోపం వస్తుందనీ మామయ్య శీనుతో అన్నాడు.

ఉత్తరం చూస్తే తాను అబద్దం ఆడినట్లు తండ్రికి తెలుస్తుందని శీను ప్రయాణం మానివేశాడు. అప్పుడు మామయ్య శీనును మందలించాడు.

తరువాత ఎందుకు అబద్దమాడావురా ? అని మామయ్య శీనును అడిగి తెలుసుకున్నాడు. శీను జున్ను తినాలని అబద్దం చెప్పాడని మామయ్య జాలిపడి శీనును వాళ్ళ ఇంటికి బస్సు ఎక్కించి పంపాడు.

IV. పదజాలం

అ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, వాక్యాలను తిరిగి రాయండి.

1. పిల్లలకు మంచి ప్రవర్తన నేర్పాలి.
జవాబు:
ప్రవర్తన = నడవడి – వాక్యము
తిరిగి రాయడం : పిల్లలకు మంచి నడవడి నేర్పాలి.

2. రచయిత, ‘శీను’కి ఏ సంగతి చెప్పలేదు.
జవాబు:
సంగతి = సమాచారము
వాక్యము తిరిగి రాయడం : రచయిత శీనుకి ఏ సమాచారము చెప్పలేదు.

3. రంగయ్య బజారులో హఠాత్తుగా కనిపించాడు.
జవాబు:
హఠాత్తుగా = అకస్మాత్తుగా
వాక్యము తిరిగి రాయడం : రంగయ్య బజారులో అకస్మాత్తుగా కనిపించాడు.

4. విద్యార్థులు అల్లరి చేష్టలు చేయగూడదు.
జవాబు:
చేష్టలు = పనులు
వాక్యము తిరిగి రాయడం : విద్యార్థులు అల్లరి పనులు చేయగూడదు.

5. పెద్దలు, పిల్లల అభివృద్ధికి బాధ్యత వహించాలి.
జవాబు:
బాధ్యత = పూచీ
వాక్యము తిరిగి రాయడం : పెద్దలు పిల్లల అభివృద్ధికి పూచీ వహించాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ఆ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు, వ్యతిరేకార్థాలనిచ్చే పదాలు పట్టికలో ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. వాటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :

  1. మా ఆవిడిచ్చిన వెచ్చని కాఫీ త్రాగుతూ, కూర్చున్నాను.
  2. నేను రంగయ్య మంచి స్నేహితులం.
  3. శీను ఇంటికి ఆలస్యంగా వచ్చాడు.
  4. ఆ రోజు సాయంత్రం రంగయ్య కనిపించాడు.
  5. పిల్లవాన్ని సన్మార్గంలో పెట్టాలి.
  6. వాడికి ధైర్యం లేకపోయింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం 2
ఉదా :
1. చల్లని
2. చెడు
3. తొందరగా
4. ఉదయం
5. చెడు మార్గం
6. అధైర్యం

సొంతవాక్యాలు :

  1. చల్లని ఆ : నేను చల్లని మంచి నీళ్ళు తాగుతాను.
  2. చెడు : పిల్లలు చెడు అలవాట్లకు సులభంగా లొంగుతారు.
  3. తొందరగా : బడికి రోజూ తొందరగా వెళ్ళాలి.
  4. ఉదయం : నేను ఉదయం లేవగానే దేవుడికి నమస్కరిస్తాను.
  5. చెడు మార్గం : పిల్లలు చెడు మార్గంలోకి పోకుండా పెద్దలు శ్రద్ధ చూపాలి.
  6. అధైర్యం  : పరీక్షలంటే, పిల్లలు అధైర్యం చెందరాదు.

ఇ) కింది రెండు వరసల నుంచి ఏవైనా రెండు మాటలు తీసుకొని, వాటిని ఒకే వాక్యంతో ఉపయోగించి రాయండి.

ఉదా :
1) నిజం – అ) కీర్తి
2) ఊరు – ఆ) కష్టాలు
3) మంచి – ఇ) ప్రయాణం
4) చెడు స్నేహం – ఈ) సక్రమంగా
5) బస్సు – ఉ) సెలవులు
6) బడి – ఊ) అబద్ధం

ఉదా :
1. నిజం, అబద్దం : మనం ఎప్పుడూ నిజమే చెప్పాలిగాని అబద్దం చెప్పగూడదు.
2. ఊరు, సెలవులు : ఈ సెలవులకు తప్పక మా ఊరు వెడతాను.
3. మంచి, కీర్తి : మంచి గుణవంతుడికి, కీర్తి వస్తుంది.
4. చెడు స్నేహం, కష్టాలు: చెడు స్నేహం వలన కష్టాలు వస్తాయి.
5. బస్సు, ప్రయాణం : ఎ.సి. బస్సులో ప్రయాణం, సుఖంగా ఉంటుంది.
6. బడి, సక్రమంగా : విద్యార్థులు బడికి రోజూ సక్రమంగా వెళ్ళాలి.

ఈ) పాఠం ఆధారంగా కింది పదాల అర్థాలను తెలుసుకోండి. వీటిని సొంతవాక్యాలలో రాయండి.

1. తెల్లముఖం వేయడం అంటే : వెలవెల పోవడం అని అర్థం.
వాక్య ప్రయోగం : గురువుగారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక, పిల్లలు తెల్లముఖం వేశారు.

2. బుజ్జగించడం అంటే : మారాము చేసేవారిని, మంచి మాటలు చెప్పి ఓదార్చి, ఒప్పించడం అని అర్థము.
వాక్య ప్రయోగం : కొత్త బట్టలు కావాలని ఏడుస్తున్న తమ్ముణ్ణి మా అమ్మ ఎలాగో బుజ్జగించింది.

3. బిక్కమొఖం వేయడం అంటే : భయంతో తెల్లమొగం వేయడం అని అర్థం.
వాక్య ప్రయోగం : బడి మాని సినిమాకు వెళ్ళిన తమ్ముణ్ణి, అమ్మ నిలదీసి ప్రశ్నిస్తే, వాడు బిక్కమొఖం వేశాడు.

4. ఎగగొట్టడం అంటే : తీర్చవలసిన ఋణం మొదలయిన వాటిని తీర్చకపోడం, చేయవలసిన పనిని మానివేయడం.
వాక్య ప్రయోగం :
1) రామయ్య బ్యాంకు నుండి తెచ్చుకొన్న ఋణాన్ని ఎగగొట్టాడు.
2) నా మిత్రుడు నిన్న బడికి ఎగగొట్టాడు.

5. చీవాట్లు వేయడం అంటే : తిట్టడం లేక నిందించడం అని అర్థం.
వాక్య ప్రయోగం : నా మీత్రుడు బడికి ఎగగొట్టాడని తెలిసి, వాళ్ళ నాన్నగారు వాడికి చీవాట్లు వేశారు.

V. సృజనాత్మకత

1. పాఠ్యాంశం ఆధారంగా రచయితకూ, ‘శీను’కూ జరిగే సంభాషణలను రాయండి.
జవాబు:
రచయిత : ఏం కావాలిరా శీనూ?
శీను : ఈ సెలవులు నాల్గు రోజులు ఇంటి దగ్గర ఉండి వస్తాను.
రచయిత : మళ్ళీ ఎందుకురా వెళ్ళటం. మొన్నేకదా, వచ్చావు.
శీను : నాన్న తప్పకుండా రమ్మన్నాడు.
రచయిత : సరే ! అవసరం అయితే వెళ్ళుదువుగానిలే. నీవు ఒక్కడివీ ఎల్లా వెడతావురా?
శీను : మా ఊరి పిల్లాడు సీతయ్యతో కలిసి వెడతా.
రచయిత : సరే. నీకు ఒక ఉత్తరం రాసి ఇస్తా. అది మీ నాన్నకు ఇచ్చి దానికి జవాబు రాయించుకొని రావాలి.
రచయిత : నేను చెప్పిన విషయాలు తెలిశాయా?
శీను : (ఏడ్పు ముఖంతో) మా నాన్న చేత ఉత్తరం రాయించుకు రావాలి.
రచయిత : ఏం రా శీనూ ! డబ్బు కావాలా?
శీను : అక్కరలేదు. నేను వెళ్ళను మామయ్య.
రచయిత : ఎందుకు వెళ్ళవురా?
శీను : (తలవంచి తెల్లముఖం వేశాడు)
రచయిత : వెధవా చెడిపోతున్నావు. ప్రాణం పోయినా ‘అబద్దం ఆడకూడదు. తెలిసిందా?
శీను : తెలిసింది.
రచయిత : హరిశ్చంద్రుడి కథ తెలుసునా?
శీను : తెలుసు. ఎప్పుడూ అబద్దం ఆడలేదు.
రచయిత : అదీ మన ఆదర్శం. ఇక నుంచి ఎప్పుడూ నిజమే చెప్పాలి. చెడ్డ పిల్లలతో స్నేహం వద్దు.
శీను : సరే మామయ్యా ! నన్ను క్షమించు. తప్పు చేశా.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

VI. ప్రశంస

* ఇచ్చిన మాటకోసం లేదా ‘సత్యం’ కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులను గురించి ప్రశంసిస్తూ మాట్లాడండి.
జవాబు:
1) బలిచక్రవర్తి :
వామనుడికి మూడు అడుగుల నేలను దానం చేస్తానన్నాడు. వామనుడు విష్ణుమూర్తి అని, మూడు అడుగులు దానం చేస్తే బలిచక్రవర్తికి ప్రమాదం వస్తుందని బలిచక్రవర్తిని గురువు శుక్రుడు హెచ్చరించాడు. అయినా బలిచక్రవర్తి గురువు మాటను కాదని వామనుడికి దానం చేశాడు.

2) కర్ణుడు :
కర్ణుడు తన సహజ కవచకుండలాలను కోసి దేవేంద్రుడికి ఇచ్చాడు. అలా ఇవ్వవద్దని, కర్ణుడిని అతని తండ్రి సూర్యుడు హెచ్చరించినా వినకుండా కర్ణుడు దేవేంద్రుడికి తన కవచకుండలాలు ఇచ్చాడు.

3) హరిశ్చంద్రుడు :
హరిశ్చంద్రుడు, తాను అన్నమాట కోసం తన రాజ్యాన్ని విశ్వామిత్రునికి ఇచ్చాడు. తనను, భార్యను అమ్ముకొని గురువుగారికి ఇవ్వవలసిన మొత్తాన్ని చెల్లించాడు.

4) ఆవు :
తనను తినబోయిన ‘పులికి ఇచ్చినమాట ప్రకారం ఆవు తన దూడకు పాలిచ్చి తిరిగివచ్చి తనను తినమని పులిని బ్రతిమాలింది.

5) దిలీపుడు :
దిలీపుడు నందినీ, ధేనువును రక్షించడం కోసం, సింహానికి తన శరీరాన్ని ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు.

ఆవు :
అమ్మకొని గురువుగారి అను అన్నమాట కోసి

VII. ప్రాజెక్టు పని

* ‘నిజం’ గొప్పతనాన్ని తెలిపే కథలను సేకరించండి. వాటిని మీ తరగతిలో చదివి వినిపించండి; ప్రదర్శించండి.
జవాబు:

  1. ఆవు – పులి కథ
  2. సత్యహరిశ్చంద్రుని కథ
  3. బలిచక్రవర్తి కథ మొదలయిన వాటిని సేకరించుట.
    విద్యార్థి కృత్యం.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ) కింది పదాలను విడదీయండి.
1. ఉదా : వసుధైక = వసుధా + ఏక = (ఆ + ఏ = ఐ)
అ. రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ)
ఆ. సురైక = సుర + ఏక = (అ + ఏ = ఐ)
ఇ. ఏకైక క = ఏక + ఏక = (అ + ఏ = ఐ)

2. ఉదా : సమైక్య = సమ – + ఐక్య = (అ + ఐ = ఐ)
ఈ. అప్లైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)
ఉ. దేవైశ్వర్యం = దేవ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)

3. ఉదా : పాపౌఘము = పాప + ఓఘము = (అ + ఓ = ఔ)
ఊ. దివాకసులు = దివ + ఓకసులు = (అ + ఓ = ఔ)
ఎ. వనౌషధి = వన + ఓషధి = (అ + ఓ = ఔ)

4. ఉదా : రసౌచిత్యం = రస + ఔచిత్యము = (అ + ఔ = ఔ)
ఏ. దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ)
ఐ. దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ = ఔ)

గమనిక : పై పదాలను విడదీసినపుడు, ప్రతి పదంలోనూ పూర్వపదము యొక్క చివరి అక్షరం ‘అ’ కారం (‘అ’ – అక్షరం) ఉంది. అలాగే పరస్పరం (పరపధంలోని మొదటి అక్షరమైన అచ్చు) స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ — లు ఉన్నాయి. ఇలా ‘అ’కారానికి, ఏ, ఐ – లు కలిసినప్పుడు ‘ఐ’ వచ్చింది. ‘అ’ కారానికి ఓ, ఔ – లు కలిసినపుడు ‘ఔ’ వచ్చింది. దీనిని “వృద్ధి సంధి” అంటారు.

గమనిక :
ఐ, ఔ – లను వృద్ధులు అంటారు. వీటితో ఏర్పడే సంధి “వృద్ధి సంధి”.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

వృద్ధిసంధి : సూత్రము :
అకారానికి ఏ, ఐలు పరమైనప్పుడు ‘ఐ’ కారము, ఓ, ఔ లు పరమైనపుడు ‘ఔ’ కారము ఏకాదేశమగును.

ఆ) కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించండి.

అ. అభ్యుదయం = అభి – + ఉదయం = (ఇ + ఉ = య్) – యణాదేశసంధి
ఆ. సూర్యోదయం = సూర్య + ఉదయం = (అ + ఉ = ఓ) – గుణసంధి
ఇ. మహౌషధం = మహా + ఔషధం – (ఆ + ఔ = ఔ) – వృద్ధిసంధి
ఈ. భాషాన్నత్యం = భాషా + ఔన్నత్యం = (ఆ + ఔ = ఔ) – వృద్ధిసంధి
ఉ. లోకైక = లోక + ఏక = (అ + ఏ = ఐ) – వృద్ధిసంధి
ఊ. లఘూత్తరం = లఘు + ఉత్తరం = (ఉ + ఉ = ఊ) – సవర్ణదీర్ఘ సంధి
ఎ. మాతృణం = మాతృ + ఋణం = (ఋ + ఋ = ఋ) – సవర్ణదీర్ఘ సంధి.
ఏ. అణ్వస్త్రం = అణు + అస్త్రం = (ఉ + అ = వ్) – యణాదేశసంధి

పాఠంలోని వ్యతిరేకపదాలు

వెచ్చని × చల్లని
వెనుక × ముందు
స్నేహితులు × శత్రువులు
బుద్ధిమంతుడు × బుద్దిహీనుడు
జాగ్రత్త × అజాగ్రత్త
నిజము × అబద్ధము
అవసరం × అనవసరం
సన్మార్గం × దుర్మార్గంలో
ధైర్యం × అధైర్యం
దుఃఖం × సుఖం
ప్రశ్న × జవాబు
విచారం × ఆనందం
నమ్మకం × అపనమ్మకం
పాపం × పుణ్యం
భయం × అభయం

ప్రకృతి – వికృతి

ఘంటా – గంట
ముఖం – మొగం
భక్తి – బత్తి
ప్రయాణము – పయనము
నిమిషం – నిముసం
బ్రద్నుడు – ప్రొద్దు
స్నేహం – నెయ్యము
ప్రాణం – పానం
కథ – కత
సన్యాసి – సన్నాసి
సంతోషం – సంతసం
పుస్తకం – పొత్తము
కంఠము – గొంతు
ఆశ్చర్యం – అచ్చెరువు

సమానార్ధక పదాలు (పర్యాయపదాలు)

1. భార్య : 1) పెళ్ళాము, 2) ఇల్లాలు, 3) ఆలు
2. కొడుకు : 1) కుమారుడు, 2) సుతుడు, 3) తనయుడు
3. స్నేహితుడు : 1) మిత్రుడు, 2) నేస్తము, 3) హితుడు
4. ఊరు : 1) గ్రామము, 2) పల్లె
5. నాన్న : 1) తండ్రి, 2) అయ్య, 3) జనకుడు
6. చేయి : 1) చెయ్యి, 2) కరము, 3) హస్తము
7. అబద్ధము : 1) అసత్యము, 2) కల్ల, 3) బొంకు
8. ముఖము : 1) ఆననము, 2) మొగము, 3) మోము

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

సమాసములు – విగ్రహవాక్యాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాస నామం
1. తల్లిదండ్రులు తల్లి, తండ్రి ద్వంద్వ సమాసం
2. భయభక్తులు భయము, భక్తి ద్వంద్వ సమాసం
3. రెండు రూపాయలు రెండు (2) సంఖ్యగల రూపాయలు ద్విగు సమాసం
4. తొమ్మిది గంటలు తొమ్మిది (9) సంఖ్యగల గంటలు ద్విగు సమాసం
5. రెండు అబద్దాలు రెండు (2) సంఖ్యగల అబద్ధాలు ద్విగు సమాసం
6. రెండు చొక్కాలు రెండు (2) సంఖ్యగల చొక్కాలు ద్విగు సమాసం

రచయిత పరిచయం

రచయిత : మునిమాణిక్యం నరసింహారావు
జననం : 15-03-1898.
మరణం : 1972వ సంవత్సరం.
జన్మస్థలం : సంగం జాగర్లమూడి (గ్రామం) తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా.
రచనలు :

  1. కాంతం కథలు
  2. కాంతం కైఫీయత్
  3. కాంతం కాపురం
  4. మేరీ కహానీ – మొదలైన 24 పుస్తకాలు రచించారు.
  5. దాంపత్యోపనిషత్తు
  6. వినోద వ్యాసములు – మొదలైన వ్యాస సంపుటాలు రచించారు.
  7. ‘మన హాస్యం’ అనే హాస్యాన్ని గూర్చిన సిద్ధాంత గ్రంథము వ్రాశారు.

హాస్యరస సృష్టికర్త : వీరు దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరంగా, చమత్కార భరితంగా, చిత్రించిన గొప్ప రచయిత. తెలుగు కథా సాహిత్యంలో వీరు సృష్టించిన ‘కాంతం’ పాత్ర, జీవవంతమైనది.

రచనా శైలి : చమత్కారమును పుట్టించే సులభశైలి, ఆకర్షణీయమైన కథా శీర్షికలు, మునిమాణిక్యం గారి రచనలకు వన్నె తెచ్చాయి.

ఉద్యోగం : వీరు ఉపాధ్యాయులుగా, ఆకాశవాణిలో విద్యావిషయ ప్రసారాలకు సహాయ ప్రయోక్తగా పనిచేశారు.

వీరి కథలోని ప్రధానాంశాలు :

  1. సజీవమైన వాడుక భాష
  2. అచ్చమైన తెనుగు నుడికారం

1. ‘నిజం నిజం’ కథ రాసిన హాస్యకథా రచయిత మునిమాణిక్యం గారిని గూర్చి రాయండి.
జవాబు:
మునిమాణిక్యం నరసింహారావుగారు గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో 1898లో పుట్టారు. వీరు . ఉపాధ్యాయులుగా, ఆకాశవాణిలో విద్యావిషయాల ప్రయోక్తగా పనిచేశారు. వీరు దాంపత్య జీవితాన్ని చమత్కారంగా చిత్రించిన హాస్యకథా రచయిత. వీరు కాంతం కథలు, కాంతం కాపురం, దాంపత్యోపనిషత్తు, వంటి గ్రంథాలు రచించారు. హాస్యాన్ని గూర్చిన సిద్ధాంత గ్రంథం “మన హాస్యం” రచించారు.

కొత్త పదాలు-అర్థాలు

43వ పేజి
తమాషా = గమ్మత్తు
గిరుక్కున ఆ = శీఘ్రముగా తిరుగుటలో అనుకరణము (తొందరగా)
నిక్కరు = లాగు
షర్టు – = చొక్కా
బిక్క ముఖంతో = తెల్ల మొఖంతో (బెదరుతున్న ముఖంతో)
వాడికో ముక్క వస్తుందని = వాడికి కొద్దిగానైనా చదువు వస్తుందని
కుర్రతనపు చేష్టలు = చిన్నపిల్లవాడి పనులు
బిక్కముఖం పెట్టి = బెదరుతున్నట్లు ముఖం పెట్టి

44వ పేజి
తోచలేదు = స్పురించలేదు
నిర్బంధించడం = బలవంతపెట్టడం
హఠాత్తుగా = అకస్మాత్తుగా (అనుకోకుండా)
సంగతి = సమాచారము
సహవాసాలు = స్నేహాలు
ఒక దారిని పెట్టాలి = ఒక మంచి మార్గంలోకి నడిపించాలి
సన్మార్గం = (సత్ + మార్గం) . : = మంచి మార్గం (మంచి దారి)
భారం = బాధ్య త
వఠ్ఠిది = అసత్యమైనది
ఎగగొట్టి = ఎగవేసి (మాని)
చెయ్యి చేసుకోవలసిన అవసరం = కొట్టవలసిన అవసరం
ఈ దఫా = ఈ పర్యాయము
చీవాట్లు వేయు = మందలించు, తిట్టు
పిల్లిలాగ = నెమ్మదిగా, నిశ్శబ్దంగా
బ్రహ్మాండమైన = బాగా గొప్పదైన
బాదుదాము = కొడదాము
నచ్చజెప్పాలి = నచ్చేటట్లు చెప్పాలి

45వ పేజి
ఫోర్తు ఫారం = 9వ తరగతి
తల ఊపాడు = అంగీకరిస్తున్నట్లు తల తిప్పాడు
హడలిపోయేలాగున = భయపడే విధంగా
అక్కర లేదన్నాడు . = అవసరం లేదని చెప్పాడు
బైట పడుతుంది = వెల్లడి అవుతుంది (తెలిసిపోతుంది)
చీవాట్లు వేయటానికి = తిట్టడానికి
తెల్లముఖం వేశాడు = వెలవెల పోయాడు
వఠ్ఠి అబద్ధం = పూర్తిగా అసత్యం
ఓర్చుకున్నాడు = సహించాడు
ఆదర్శం = ఇతరులు చూసి నేర్చుకోదగిన గుణం
సహవాసం = స్నేహం
పాడైపోయినావు = చెడిపోయావు

46వ పేజి
సన్యాసి = అన్నింటినీ విడిచినవాడు
చీదరించుకొనేసరికి = కోపపడే సరికి
పశ్చాత్తాపం = తాను చేసినది తప్పని తెలిసినప్పుడు, అలా తాను చేశానే అని, బాధపడడం
వెక్కివెక్కి ఏడ్వటం = గట్టిగా ఏడ్వడం
సన్మార్గం (సత్ + మార్గం) = మంచి దారి
ఆదుర్థాపడు = ఆందోళన పడు
ఆరాటం = సంతాపము
ఖిన్నుడై (ఖిన్నుడు + ఐ) = దుఃఖము పొందినవాడై
బుజ్జగించి = బ్రతిమాలి
మాట పెగిలిరాలేదు = నోట మాటరాలేదు
రుద్దకంఠంతో = ఏడ్పు కంఠంతో
బస్టాండు (Bus stand) = బస్సులు ఆగే స్థలము
వ్యర్ధము = వృథా, ప్రయోజనం లేకపోడం

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

47వ పేజి
ఎరిగి ఉన్నట్లు = తెలిసినట్లు
డబాయిస్తే కాని = తనకు తెలిసినట్లు నటిస్తే కాని
బైట పెట్టడు = వెల్లడించడు, పైకి చెప్పడు
దుర్మార్గుడు . = చెడ్డవాడు
కళ్ళ నీళ్ళు కుక్కుకుంటూ = కళ్ళ నుండి వచ్చే నీరు తుడుచుకుంటూ (ఆపుకుంటూ)
గర్జించాను = గట్టిగా అరచాను
ఒళ్ళు = శరీరము
తెప్పరిల్లి = దుఃఖము నుండి తేరుకొని
విధేయతతో = వినయముతో

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 7th Lesson శిల్పి Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 7th Lesson శిల్పి

7th Class Telugu 7th Lesson శిల్పి Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై చిత్రాన్ని చూడండి. చిత్రంలోని వేటితో తయారయ్యాయి?
జవాబు:
పై చిత్రంలో పూలతీగలు చెక్కిన జాతిస్తంభం నిలబడియుంది. అలాగే బాతిపై చెక్కిన ‘నంది’ విగ్రహం ఉంది. చిత్రంలోనివి జాతితో తయారయ్యాయి.

ప్రశ్న 2.
ఈ చిత్రాలు ఏ కళకు సంబంధించినవి? దాన్ని గురించి మీకు తెలిసినది చెప్పండి.
జవాబు:
ఈ చిత్రాలు శిల్పకళకు సంబంధించినవి. శిల, లోహం, మట్టి మొదలైన పదార్థాలతో ప్రతిమలనూ, మందిరాలనూ నిర్మించే విద్య శిల్పకళ.

కళలు అరవైనాలుగు. అందులో

  1. కవిత్వం
  2. సంగీతం
  3. చిత్రలేఖనం
  4. శిల్పం
  5. నాట్యం -అన్నవి లలితకళలు.

శిల్పకళలో మన తెలుగువారు ప్రసిద్ధి పొందారు. అమరావతి, అజంతా, లేపాక్షి, హంపిలో ఏకశిలా రథం, – మహాబలిపురంలో శిల్పాలు ఆంధ్రుల శిల్పకళా వైభవాన్ని చాటి చెపుతాయి.

గమనిక :
పై చిత్రంలో నంది విగ్రహం, లేపాక్షిలోని బసవన్న విగ్రహం.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

ప్రశ్న 3.
శిల్పాలను తయారు చేసేవారిని ఏమంటారు? వారిని గురించి మీకు తెలిసింది చెప్పండి.
జవాబు:
శిల్పాలను తయారు చేసేవారిని ‘శిల్పులు’ అంటారు. శిల్పులలో ‘అమరశిల్పి జక్కన’ సుప్రసిద్ధుడు. హలీబేడులో ఆయన చెక్కిన హోయసలేశ్వర దేవాలయం ఉంది. అక్కడి శిల్పం అద్భుతం. హంపి-విజయనగరంలోని శిల్పాలు చాలా ప్రసిద్ధము. జాషువ కవి ఈ పద్యాలను హంపీలోని శిల్పాలను చూచి, ఆ ప్రభావంతో శిల్పిని మెచ్చుకుంటూ రాశాడట.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలో ఉండే పద్యాలనూ రాగయుక్తంగానూ, భావయుక్తంగానూ పాడండి.
జవాబు:
సాధన చేయండి. పద్యాలను చక్కగా చదవడంలో మీ గురువుల సాయం తీసుకోండి.

ప్రశ్న 2.
‘కవి, శిల్పిని శాశ్వతుడనీ, ఆయన ప్రజ్ఞకు నమస్కారం చేయమని చెప్పాడు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
‘శిల్పి’ శాశ్వతుడు. అనగా చిరంజీవి. అంటే చాలాకాలం అంటే అతడు చెక్కిన శిల్పాలు ఉన్నంతకాలం, ప్రజలు అతడిని గుర్తు చేసుకుంటారు. ఆతని శిల్పకళా చాతుర్యానికి మెచ్చుకొని జోహార్లు సమర్పిస్తారు. అందువల్ల శిల్పి ‘శాశ్వతుడు’. గొప్ప శిల్పాన్ని చెక్కిన శిల్పికి మనము ఈయగలిగిన కానుక మరొకటి ఏమీ ఉండదు. తలవంచి మనం ఆయన శిల్పకళా ప్రొఢికి నమస్కారం చేయడమే. శిల్పి యొక్క శిల్పకళను మెచ్చుకొని ఆయనకు జోహార్లు సమర్పించడమే మనం చేయాలి.

ప్రశ్న 3.
శిల్పి రాతిని శిల్పంగా మార్చడంలో పడే శ్రమను గూర్చి మీరేమనుకుంటున్నారు?
జవాబు:
‘శిల్పి’ ముందు శిల్పాన్ని చెక్కడానికి తగినరాయిని ఎంచుకోవాలి. ఆ రాయి మెత్తగా శిల్పి ,ఉలి నాటడానికి అనుకూలంగా ఉండాలి. ఆ శిలను ఎంతో జాగ్రత్తగా చెక్కాలి. బొమ్మ అంతా చెక్కాక ఏ ముఖమో చెక్కేటప్పుడు, ఏ ముక్కుకో దెబ్బతగిలితే మొత్తం ఆ శిల్పం అంతా పాడవుతుంది. మళ్ళీ మొదటి నుంచి చెక్కాలి – రాతిని అతికించడానికి వీలుకాదు కదా ! కాబట్టి ‘శిల్పి’ నిజంగా గొప్ప. ప్రజ్ఞాశాలి అని నేను అనుకుంటున్నాను.

II. చదవడం – రాయడం

1. కింది పద్యపాదాలు పాఠంలోని ఏ ఏ పద్యాలలో ఉన్నాయి. వాటి సందర్భమేమిటి?

అ) బయలుపడె నెన్ని యెన్ని దేవస్థలములు.
జవాబు:
ఈ పద్యపాదం “సున్నితంబైన నీ చేతి సుత్తెనుండి’ అనే రెండో పద్యంలో ఉంది. శిల్పి తన సుత్తితో బండరాళ్ళను చెక్కగా, ఆ రాళ్ళు, దేవుళ్ళుగా మారి అవి పుణ్యక్షేత్రాలయి, ఆ విగ్రహాలు పసుపు కుంకుమలతో పూజింపబడ్డాయని కవి జాషువ చెప్పిన సందర్భంలోనిది.

ఆ) తారతమ్యంబు లే దబద్దంబు గాదు.
జవాబు:
ఈ పద్యపాదం ‘ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత’ అనే నాలుగవ పద్యంలోనిది. ‘కవిత్వంలో చిత్రాలు కూర్చే కవికీ, శిల్పికీ తేడాలేదు. కవికీ శిల్పికీ తేడా లేదు అనే మాట అబద్ధంగాదు’ అని కవి జాషువ – చెప్పిన సందర్భంలోనిది.

ఇ) బాల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి
జవాబు:
ఈ పద్యపాదం, ‘జాల నిద్రించు ప్రతిమల మేలుకొల్పి’ అనే ఐదవ పద్యంలోనిది. శిల్పి రాళ్ళలో నిద్రించే శిల్పాలను లేపి ఉలిని తగిలించి బయటికి పిలుస్తాడనీ, శిల్పి శాశ్వతుడనీ కవి జాషువ చెప్పిన సందర్భంలోనిది.

ఈ) జగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకో గల
జవాబు:
ఈ పద్యపాదం ‘తెలిజాతి జాలువార’ అనే ఎనిమిదవ పద్యంలోనిది. శిల్పి తెల్లని రాతిపై అప్సరస స్త్రీని చెక్కి, దాని ప్రక్క తన్ను తాను దిద్దుకొని సంతోషిస్తాడు. శిల్పి జగత్తులో అతడు చిరంజీవత్వమును కల్పించుకుంటాడు – అని, కవి జాషువ శిల్పిని గూర్చి చెప్పిన సందర్భంలోనిది.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

2. కవికి-శిల్పికి మధ్య పోలికలున్న పద్యాలు ఈ పాఠంలో ఉన్నాయి. అవి ఏ ఏ పద్యాలలో ఉన్నాయో గుర్తించి వాటిని రాయండి.
జవాబు:
కవికి – శిల్పికి మధ్య పోలికలు ఉన్నాయి అని చెప్పే పద్యాలు ఇవి.
1) “కవికలంబున గల యలంకార రచన –
కలదు కలదోయి శిల్పి, నీ యులిముఖమున” – అనే మూడవ పద్యం మొదటిది.

2) కవనమున చిత్రములు గూర్చు కవికి నీకు
దారతమ్యంబు లే దబద్దంబు గాదు” – అనే నాలుగవ పద్యం రెండవది.

3. కింది గద్యాన్ని చదవండి. ప్రశ్నలు రాయండి.

“జనపదం అంటే గ్రామం. జనపదంలో నివసించేవాళ్ళు జానపదులు. వీళ్ళు ప్రదర్శించే కళలను జానపద కళలు అంటారు. యక్షగానం, వీధి నాటకం, వీరభద్రవిన్యాసాలు, హరికథ, ఒగ్గుకథ, బుర్రకథ వంటివి కొన్ని జానపద కళారూపాలు. వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనపైన ఉంది.

చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలితకళలు. భావం మనస్సుకు హత్తుకొనే రకంగా బొమ్మను గీయడం చిత్రలేఖనం. వీనుల విందుగా ఉండే గానకళ సంగీతం. మనలను కదలకుండా అనేక భావాలను మనసుకు అందించే కళ ‘శిల్పకళ’. రాగ, తాళ, లయలకు తగిన విధంగా అభినయం చేయడం నృత్యకళ. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా, మాటల వెనుక మరుగుపరచి, మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పేదే కవిత్వం.

ప్రశ్నలు రాయండి.
1) ‘జానపద కళలు’ అని వేటిని పిలుస్తారు?
2) కొన్ని ఆనపద కళారూపాలను పేర్కొనండి.
3) లలిత కళలు ఏవి?
4) చిత్రలేఖనం అంటే ఏమిటి?
5) సంగీతం అంటే ఏమిటి?
6) ‘శిల్పకళ’ అంటే ఏమిటి?
7) ‘నృత్యకళ’ అంటే ఏమిటి?
8) ‘కవిత్వం’ లక్షణం పేర్కొనండి.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

4. కింది ప్రశ్నలకు పాఠం చదివి జవాబులు రాయండి.

అ) కవికి – శిల్పికి గల పోలికలు ఏమిటి?
(లేదా)
కవితలు అల్లే కవికి, శిలను చెక్కే శిల్పికి పోలికలను తెల్పండి.
జవాబు:
కవి కలములో అలంకార రచన ఉంటుంది. అటువంటి అలంకార రచన శిల్పి ఉలిలో కూడ ఉంటుంది. ఆ . అందువల్లనే శిల్పి, రాతిస్తంభాలపై పూలగుత్తులు చెక్కుతాడు.

శిల్పి బొమ్మలు చెక్కి ఒక రాజు కథను చూపరులచే చెప్పించగలడు. కవిత్వంలో చిత్రాలు కూర్చే కవికీ, శిల్పికీ నిజంగా తేడా లేదు. కవిత్వం ద్వారా కవి రాజు కథ రాయగలడు. శిల్పి తన శిల్పం ద్వారా రాళ్ళపై రాజుకథ చెక్కగలడు.

ఆ) శిల్పిని గురించి “నిశ్చయముగా చిరంజీవి” అని కవి ఎందుకన్నాడు?
జవాబు:
శిల్పి రాళ్ళల్లో నిద్రపోతున్న బొమ్మలకు, తన ఉలిని తాకించి, వాటిని మేల్కొలిపి, బయటకు పిలుస్తాడు. ఆ బొమ్మలు బయటకు వచ్చి శిల్పి పేరును శాశ్వతంగా నిలుపుతాయి. అందువల్ల శిల్పి నిశ్చయంగా చిరంజీవి అని కవి అన్నాడు.

ఇ) “సుత్తి నుండి మొలచునవి” అని కవి వేటిని ఉద్దేశించి చెప్పాడు?
జవాబు:
కేవలం బండరాళ్ళ యందు, జీవకళను నిలుపగల శిల్పి సుత్తె నుండి మానవవిగ్రహాలు మొలుస్తాయని కవి చెప్పాడు. శిల్పి సుత్తి దెబ్బలతో ఎన్నో దేవాలయాలు బయటపడతాయి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు మీ సొంతమాటల్లో జవాబులు రాయండి.

అ) శిల్పి రాళ్ళలో ఏ ఏ రూపాలను చూసి ఉంటాడు?
జవాబు:
శిల్పి రాళ్ళలో దేవతామూర్తులను చూసి ఉంటాడు. అందమైన రాతిస్తంభాలపై పూలగుత్తులను చూసి ఉంటాడు. దేవాలయాలను చూసి ఉంటాడు. ఏనుగునూ, గున్నఏనుగులనూ చూసి ఉంటాడు. అజంతా చిత్రాలను చూసి ఉంటాడు. అప్సరస స్త్రీలను చూసి ఉంటాడు. భయంకర సింహాల తలలను చూసి ఉంటాడు.

ఆ) నల్లని రాళ్ళకు శిల్పిమీద కృతజ్ఞత ఎందుకుండాలి?
జవాబు:
నల్లని రాళ్ళు కొండలమీదనే పడి ఉంటే, అవి బండరాళ్ళగానే మిగిలిపోయేవి. కాని శిల్పి చేతిలో పడి అవి దేవతా మూర్తులయ్యాయి, దేవాలయాలయ్యాయి. అవి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు అందుకుంటున్నాయి. కాబట్టి నల్లని రాళ్ళు, శిల్పి మీద కృతజ్ఞత చూపాలి.

ఇ) శిలకూ, శిల్పానికీ ఉండే భేదం ఏమిటి?
జవాబు:
కొండలపై ఉన్న రాయిని ‘శిల’ అంటారు. అదే శిలను శిల్పి తన సుత్తితో అందమైన బొమ్మగా చెక్కితే అది శిల్పం అవుతుంది.

ఈ) కవికీ, చిత్రకారుడికీ ఉండే పోలికలు, భేదాలు ఏమిటి?
జవాబు:
కవి కవిత్వంలో మాటలతో చిత్రా’ . గీస్తాడు. కవి వర్ణనలతో ఎంతటి విషయాన్నైనా పాఠకుల మనస్సుల “ముందు నిలిచేటట్లు చిత్రాలను నిర్మిస్తాడు. కాగా చిత్రకారుడు కాగితం పైననో, కాన్వాసుపైనో రంగులతో చిత్రాలు గీస్తాడు. కవి గీసే చిత్రాలకు కవి మనస్సే హద్దు. దానికి ఎల్లలు లేవు. కాని చిత్రకారుడు గీసే చిత్రానికి, కొన్ని పరిమితులు ఉంటాయి.

ఉ) చూసే వాళ్ళకు శిల్పాలు మహారాజుల కథలు చెప్పగలవని కవి అంటున్నాడు. కవి ఎందుకు అలా అన్నారు?
జవాబు:
ఒక మహారాజు చరిత్రను శిల్పాలుగా చెక్కితే, వాటిని చూసేవారికి ఆ మహారాజు చరిత్ర తెలుస్తుంది. ఆ శిల్పాలను చూచి ఆ రాజు చరిత్రను తెలుసుకోవచ్చు. ఆ శిల్పాలు ఆ రాజుల కథలను కళ్ళకు కట్టిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయ రాజులు వంటివారి శిల్పాలు చూపరులకు వారి చరిత్రలను నేటికీ గుర్తుకు తెస్తాయి. అందువల్ల చూసేవారికి, శిల్పాలు రాజుల కథలను చెప్పగలవని కవి చెప్పాడు.

ఊ) “కవి” ఈ గేయంలో ఒకచోట శిల్పి దారిద్ర్యాన్ని చూసి, తెలుగుదేశం కంట తడిపెడుతుందని అన్నాడు కదా ! దీన్ని గురించి మీ అభిప్రాయం. ఏమిటి?
జవాబు:
గొప్పగా శిల్పాలు చెక్కిన అమరశిల్పి జక్కన వంటి శిల్పుల శిల్పాలు, నేటికీ అద్భుతంగా ఉండి, అవి నిజమైన మూర్తులే అనే భ్రాంతిని కల్గిస్తాయి. అంతటి శిల్పం సృష్టించిన శిల్పులు మాత్రం నేడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. వారిని పోషించి సంపదలు ఇచ్చే రాజులు నేడు లేరు. అందువల్ల శిల్పుల దరిద్రాన్ని చూచి తెలుగుదేశం ‘అంటే తెలుగు ప్రజలు కన్నీరు కారుస్తున్నారని కవి చెప్పాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ)మన రాష్ట్రంలోని శిల్పకళా సంపదను గూర్చి వ్యాసం రాయండి.
(ఆంధ్రరాష్ట్రం – శిల్ప సంపద)
జవాబు:
రాయి, లోహం, కట్ట, మట్టి మొదలయిన వాటితో దేవతా విగ్రహాలనూ, మందిరాలనూ నిర్మించే విద్య శిల్పకళ.

“కృష్ణాతీరంలో అమరావతిలో శాతవాహనుల నాటి అందమైన శిల్పాలు ఉన్నాయి. శిల్పుల చేతిలో బండరాళ్ళు వెన్నముద్దల్లా కరిగి, కావలసిన రూపం ధరిస్తాయి. అమరావతిలో, హంపిలో, అజంతా గుహల్లో, తెలుగు శిల్పుల ఉలి దెబ్బలచే రాళ్ళు, పూర్ణకుంభాలుగా, పద్మశాలలుగా, ధర్మచక్రాలుగా రూపం ధరించాయి. ఎల్లోరాలోని కైలాస దేవాలయం, శిల్పుల గొప్పతనానికి నిదర్శనం. అక్కడి విగ్రహాలు, దేవాలయాలు, ప్రాకారాలు, … ధ్వజస్తంభాలు, అన్నీ ఒకే రాతిలో చెక్కారు.

మన శిల్ప. విద్యలో స్తంభాల నిర్మాణం గొప్పది. హంపి విఠలాలయంలోనూ, మధుర మీనాక్షి దేవాలయంలోనూ సప్తస్వరాలు పలికే రాతిస్తంభాలు నిర్మించారు. హనుమకొండలోని వేయిస్తంభాల గుడి, మన కాకతీయ చక్రవర్తుల పాలనలో శిల్పకళ పొందిన వైభవాన్ని తెలుపుతుంది.

మైసూరు, హనుమకొండ, లేపాక్షి దేవాలయాల్లోని నంది విగ్రహాలు అందాలు చిందిస్తూ ఉంటాయి. ఆ నంది విగ్రహాలు, ప్రాణాలతో కూర్చున్న పెద్ద ఎద్దులవలె ఉంటాయి. దానిని చూసి ‘లేపాక్షి బసవన్న లేచి రావన్న’ అంటూ అడవి బాపిరాజు గారు గీతం రాశారు.

ఆ) శిల్పి గొప్పదనాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.
(లేదా)
రాళ్ళలో నిదురపోతున్న బొమ్మలకు ప్రాణం పోసే శిల్పి గొప్పదనాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
శిల్పి గొప్పవాడని నిరూపిస్తూ సవివరంగా రాయండి.
జవాబు:
శిల్పి చిరంజీవి. అతడు ,చెక్కిన శిల్పాలు జీవకళతో నేటికీ నిల్చియున్నాయి. అతడు సింహాల శిల్పాలను చెక్కితే, అవి నిజమైన సింహాలేమో అనే భ్రాంతిని కల్గిస్తాయి. పూర్వం మహారాజులు శిల్పకళను పోషించారు. ఎన్నో దేవాలయాలు కట్టించేవారు. అందువల్ల శిల్పులకు ఆనాడు దారిద్ర్యము లేదు. ఈ శిల్ప విద్యలో ఒక్కొక్క రాజు ఒక్కొక్క మార్గాన్ని అనుసరించారు.

హోయసలరాజులు ‘హలీబేడ్’లో అందమైన శిల్పాలు చెక్కించారు. అక్కడే ‘జక్కన’ శిల్పాలున్నాయి. కోణార్క శిల్పాలు గాంగరాజులవి. ఓరుగల్లులో శిల్పం కాకతీయ రాజులది. ఈ ‘శిల్ప విద్య నేర్చుకొనే కళాశాలలు నేడు స్థాపించాలి. ప్రభుత్వం శిల్ప విద్యకు ప్రోత్సాహం. ఇవ్వాలి. శిల్పారామాలు నిర్మించాలి. పూర్వం శిల్పులు చెక్కిన శిల్పాలను రక్షించాలి. లేపాక్షిలోని బసవన్న వంటి విగ్రహ శిల్పులు ఇక పుట్టరని నా నమ్మకం.

IV. పదజాలం

1. కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను మరో సందర్భంలో ఉపయోగించి రాయండి.

అ) మాలో కొత్త ఆశలు చిగురించాయి.
జవాబు:
వసంత ఋతువురాగానే, పూలమొక్కలన్నీ చిగురించాయి.

ఆ) శిల్ప కళ ఎన్నటిక ఆరిపోయేది కాదు.
జవాబు:
బీదల కడుపుమంట ఎప్పటికీ ఆరిపోయేది కాదు.

ఇ) ఆ సంగతి నాకు తెలియదు.
జవాబు:
నా మిత్రుడు పాట పాడతాడన్న సంగతి నాకు తెలియదు.

ఈ)ఆయన కీర్తి పదికాలాలపాటు నిలిచి ఉంటుంది.
జవాబు:
వాల్మీకి రామాయణము ఆదికావ్యంగా కీర్తికెక్కింది.

ఉ) ఆయనది రాతిగుండె కాదు.
జవాబు:
ఔరంగజేబు రాతిగుండె సుల్తాను.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

2. కింది వాక్యాలు మీ పాఠంలోవే. వీటిలో గీత గీసిన పదాల అర్థాన్ని తెలుసుకొని వాక్యాలను తిరిగి రాయండి.

అ) భయద సింహముల తలలు
జవాబు:
భయంకరమైన సింహాల తలలు

ఆ) వసుధ గన్పట్టు పర్వతములందు
జవాబు:
భూమిపై కనబడే పర్వతములలో

ఇ) శాశ్వతుడవోయి నిశ్చయముగాను
జవాబు:
నిర్ణయంగా నీవు చిరంజీవివి.

ఈ) తెనుంగుదేశము నిన్ను వంటి పనివానిం జూచి యుప్పొంగుచుండును.
జవాబు:
నీ వంటి పనిమంతుణ్ణి చూసి ఆంధ్రదేశం ఉప్పొంగుతుంది.

ఉ) నీ సుత్తెలో మొలుచున్మానప, విగ్రహంబు
జవాబు:
నీ సుత్తె నుండి మనుష్యరూపాలు పుడతాయి.

3. కింది పదాలు చదివి, వాటికి సరిపడే అర్థం వచ్చే పదాన్ని ఉపయోగించి, మీ మాటలతో వాక్యాలు రాయండి.
ఉదా : చూసేవారు = చూపరులు
(అక్కడి శిల్ప కళాఖండాలు చూపరులను ఆకట్టుకున్నాయి.)

అ) దేవాలయాలు = దేవ స్థలములు.
మన ఆంధ్రదేశంలో ఎన్నో దేవస్థలములు ఉన్నా, తిరుపతిని మించినది లేదు.

ఆ) గుహలశ్రేణి = గహ్వరశ్రేణి.
హిమాలయాల గహ్వరశ్రేణి మంచుతో నిండియుంటుంది.

ఇ) ఏడవడం = కంటతడి పెట్టడం.
గాంధీజీ మరణవార్త విని అఖిలభారతం కంటతడి పెట్టింది.

ఈ) ఎప్పుడూ ఉండేవాడు = శాశ్వతుడు.
“నన్నయ తెలుగుపద్య కవులలో శాశ్వతుడు.

4. కింది వాక్యాలలో ఉన్న ప్రకృతి, వికృతులను గుర్తించండి. వాటిని ఉపయోగిస్తూ మరో వాక్యాన్ని రాయండి.

అ) సింగం బావిలో తన మొహాన్ని చూసి అది మరో సింహం ముఖమని అనుకుంది.
జవాబు:
సింహం అడవిలో ఓ పులి ముఖాన్ని చూసి, అది మరో సింగం మొహమని భ్రాంతి పడింది.

ఆ) కరెంటు స్తంభాలు ఉరికంబాలు కాకూడదు.
జవాబు:
మధురలో రాతి కంబములు, సంగీత స్తంభములుగా మారాయి.

ఇ) నిద్ర మనకు అవసరమే కాని, మనమే నిద్దుర మొహాలం కాగూడదు.
జవాబు:
పగలు నిద్ర మంచిది కాదు కాని, రాత్రి నిద్దుర అత్యవసరం.

ఈ) పేదలకు సహాయం చేయడం పున్నెం. ఆ పుణ్యమే మనను నిలుపుతుంది.
జవాబు:
పుణ్యం కోసం మొగుణ్ణి ఉపవాసాలతో మాడ్చడం పున్నెం కాదు.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

5. సూచనల ఆధారంగా పాఠ్యాంశంలోని పదాలతో గళ్ళు నింపండి. (గళ్ళనుడికట్టు)

ఆధారాలు :
AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి 2

అడ్డం :

  1. శిల్పాలు చూపరుల చేత ఇలా చేయించగలవు.
  2. కవి చేతిలోనిది.
  3. దేవళంలో ‘ళం’ తీసేస్తే.
  4. మూడో పద్యం రెండో పాదంలో మొదటి పదం చివరి అక్షరం లోపించింది.
  5. శిల్పంగా మారేది.
  6. శిల్పి ప్రజ్ఞకు ………….

నిలువు :

  1. ఈ పదం భూమికి మరో అర్థం.
  2. కవిత్వం చెప్పడాన్ని ఇలా అంటారు.
  3. రాతికి మరోపదం తలకిందులైంది.
  4. చివరిపద్యం చివరి పాదంలోని మొదటి పదంలోని మొదటి అక్షరం మారింది.
  5. శిలను’ శిల్పంగా మలిచేవాడు.
  6. బొమ్మలు’ అని అర్థమున్న పదంలో మొదటి అక్షరం లోపించింది.

జవాబు:
AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి 3

6. అ) కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.

1) నేను ఐ.ఎ.యలో ఉత్తీర్ణుడనయినందున, నా జీవితం సార్థకమయ్యింది.
2) కొండలు మీద అన్నీ పాషాణాలే ఉంటాయి.
3) చెరువు మధ్య కంబమును పాతారు.
4) శిల్పి ప్రతిమలను చెక్కుతాడు.
5) నన్నయగారి కవనము ఆంధ్ర కవిత్వానికి నాంది.
6) కొండలలోని గహ్వరములలో కంఠీరములు ఉన్నాయి.
7) ఊర్వశి అచ్చరలలో శ్రేష్ఠురాలు.
8) నా మిత్రుని శిరోగ్రముపై టోపీ ఉంది.
జవాబు:
1) ప్రయోజనం కలది
2) బండరాళ్ళు
3) స్తంభము
4) బొమ్మ
5) కవిత్వము
6) గుహ, సింహము
7) అప్సరస
8) తలపైన

ఆ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1) సార్థకము :
మంచి ర్యాంకు సాధించడంతో, నా జీవితం సార్థకమయ్యింది.

2) పసుపు కుంకాలు :
అమ్మవారిని పసుపుకుంకాలతో పూజించాలి.

3) వల్లెవేయించు :
గురువుగారు వేదమంత్రాలను శిష్యులచే వల్లె వేయించారు.

4) మేలుకొలుపు :
ఉదయము వేంకటేశ్వరునికి మేలుకొలుపులు పాడాలి.

5) చిందిపడు :
నా మిత్రుని ముఖములో ఆనందము చిందిపడుతూ ఉంది.

6) ఉప్పొంగు :
గాలివానకు సముద్రము ఉప్పొంగుతుంది.

7) కంటఁతడిపెట్టు :
గాంధీ మరణవార్త విని, దేశ ప్రజలు కంటఁతడి పెట్టారు.

8) పేరునిలుపు :
నా కుమారుడు మా వంశం పేరు నిలుపగలడు.

ఇ) కింది పదాలకు వ్యతిరేకపదాలు రాసి, వాటిని ఉపయోగించి వాక్యాలు రాయండి.

1) అబద్దంబు × నిజము
నేను ఎప్పుడూ నిజమే మాట్లాడతాను.

2) మేలుకొలుపు × నిద్రపుచ్చు
మా అమ్మ మా తమ్ముణ్ణి నిద్రపుచ్చుతోంది.

3) శాశ్వతుడు × అశాశ్వతుడు.
జీవితము అశాశ్వతమని గ్రహించాలి.

4) సంతోషించు × ఏడ్చు
భయంకర దృశ్యాలు చూసి. నా మిత్రుడు ఏడుస్తాడు.

మఱికొన్ని వ్యతిరేక పదాలు :
కలదు × లేదు
మహాపుణ్యండు × మహాపాపాత్ముడు
నిద్రించు × మేల్కొను
ముగ్ధ × ప్రౌఢ
నిశ్చయము × అనిశ్చయము :
కలిమి × లేమి

ఈ) ఈ కింది ఖాళీలలో సరైన విభక్తులు రాయండి.

1. రమ లక్ష్మి ……………… ఆడుకుంటోంది. .
2. ఎండ ………………. దాహమేస్తోంది.
3. చలి ……………… వణకుపుడుతోంది.
4. రవి ……………… అమ్మ మిఠాయి తెచ్చింది.
జవాబు:
1) తో
2) కి
3) వల్ల
4) కొఱకు

V. సృజనాత్మకత

* శిల్పి ఆత్మకథ రాయండి. దీన్ని ఏకపాత్రాభినయంగా ప్రదర్శించండి.
జవాబు:
నేను మీకు తెలుసా ! నేను రాళ్ళను బొమ్మలుగా చెక్కే శిల్పిని. నేను రాళ్ళను దేవుడి బొమ్మలుగా చెక్కితే, మీరు వాటిని పసుపు కుంకాలతో పూజిస్తున్నారు. పూర్వం మహారాజులు మాకు ఎంతో డబ్బు ఇచ్చి దేవాలయాల్లో శిల్పాలు చెక్కించేవారు. మీరు మేము చెక్కిన నంది విగ్రహాలూ, నాట్య ప్రతిమలూ లొట్టలు వేసుకుంటూ చూస్తారు. ఆ చూసినంతసేపూ ఓహో, ఆహా అని అంటారు. కానీ మీలో ఏ ఒక్కరూ నన్ను పోషించరు. మరి నన్ను ఎవరు చూస్తారు? దేవుడు బొమ్మలు చెక్కే నాకు, ఇంక దేవుడే దిక్కు. నేను సంగీతం వచ్చే స్తంభాలు చెక్కాను. అందమైన స్త్రీమూర్తులను చెక్కాను. నా శిల్పాన్ని పోషించిన రాజులను మీరు రాజుల సొమ్ము రాళ్ళపాలన్నారు. కాని నా . శిల్పాలు శాశ్వతంగా నిలుస్తాయి.

VI. ప్రశంసలు

1) శిల్పాలు చెక్కడంలాగా చిత్రాలు గీయడం, పాటలు పాడడం, నాట్యం చేయడం, సంగీతం పాడడం వంటివి కూడా కళలే. వీటిలో నైపుణ్యమున్నవాళ్ళు మీ పాఠశాలలో ఎవరెవరున్నారు? వాళ్ళను గురించి చెప్పండి.
(లేదా )
మీ గ్రామం/ప్రాంతంలోని కళలను గురించి, కళాకారులను గురించి వివరాలు తెలుసుకొని వాళ్ళ గొప్పదనాన్ని గురించి వివరించండి.
జవాబు:
విద్యార్థికృత్యం

VII. ప్రాజెక్టు పని

* శిల్పం, సంగీతం ………. ఇలాంటి వాటికి సంబంధించిన అదనపు సమాచారం లేదా చిత్రాలు సేకరించండి. వాటిని గురించి రాసి గోడపత్రికలో ప్రదర్శించండి.
జవాబు:
కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం అనేవి లలితకళలు :

ఎ) ప్రపంచ ప్రసిద్ధుడైన చిత్రలేఖన కళాకారుల వివరాలు :
1) వడ్డాది పాపయ్య :
ఆంధ్రదేశంలో శ్రీకాకుళంలో 1921లో పుట్టాడు. ఈయన భారతదేశం గర్వించదగ్గ చిత్రకారుడు. ఈయన తొలి గురువు తండ్రి. తరువాత గురువు రవివర్మ. చందమామ, ఆంధ్రపత్రిక వంటి పత్రికల్లో చిత్రాలు గీశారు. ఈయన చిత్రాలలో తెలుగుదనం, తెలుగు సంస్కృతి ఆచారవ్యవహారాలు, పండుగలకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు.

2) లియోనార్డో డావిన్సి :
ఈయన ఇటలీ దేశస్థుడు. ఈయన ‘మొనాలిసా’ చిత్రాన్ని గీశాడు. ఈ చిత్రాన్ని ఎవరు – చూసినా మంత్ర ముగ్ధులవుతారు. ఇప్పుడు ఈ చిత్రం పారిస్ నగరంలో ‘టావ్’ అనే వస్తు ప్రదర్శనశాలలో ఉంది.

3) పాబ్లో పికాసో (1881 – 1973) :
పికాసో 20వ శతాబ్దిలోని. చిత్ర కళాకారులలో మిక్కిలి’ ప్రసిద్ధుడు. 1901లో ఈయన చిత్రించిన “తల్లి ప్రేమ (మాతా, శిశువు” చిత్రం అద్భుత కళాఖండం. తన బుగ్గను శిశువు తలకు ఆనించి, కళ్ళు మూసి తన్మయత చెందుతున్న తల్లి చిత్రం ఇది.

4) రాజా రవివర్మ :
దేవుడు మనిషిని సృష్టించాడు. ఆ మనిషి దేవుణ్ణి చిత్రించి మనుషులకు ఇచ్చాడు. గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళను తన చిత్రకళ ద్వారా ఇళ్ళకు తెచ్చిన ఘనత రాజా రవివర్మకు దక్కుతుంది. రవివర్మ చిత్రించిన దేవుళ్ళ బొమ్మలు ప్రసిద్ధి పొందాయి. ఈయన చిత్రించిన కావ్యస్త్రీలందరిలో దమయంతి గొప్ప అందాల రాశి.

బి) సంగీతం :
మన తెలుగుదేశంలో వెలసిన ప్రసిద్ధ సంగీత విద్వాంసులను గూర్చి తెలుసుకుందాం.
1) కాకర్ల త్యాగరాజు (1798 – 1883) :
ఈయన సుప్రసిద్ధ వాగ్గేయకారుడు. నాదబ్రహ్మ, గాన చక్రవర్తి. గొప్ప రామభక్తుడు తంజావూరు జిల్లాలోని తిరువారూరులో జన్మించాడు. ఎన్నో కీర్తనలు తెలుగులో రాశాడు. నేడు 600 కీర్తనలు దొరుకుతున్నాయి.

2) తాళ్ళపాక అన్నమాచార్యులు :
ఈయన ఆంధ్రలో కడప జిల్లా తాళ్ళపాక నివాసి. ఈతడు తిరుపతి వేంకటేశ్వరునిపై తెలుగులో సంకీర్తనలు రచించాడు. ఈయన 1408 – 1503 వరకు జీవించాడు. 32 వేల కీర్తనలు చక్కని చిక్కని తెలుగులో రచించాడు.

3) కంచర్ల గోపన్న :
17వ శతాబ్ది చివరివాడు. రామదాసుగా ప్రఖ్యాతి పొందాడు. దాశరథి శతకం, కీర్తనలు రచించాడు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1. ఈ కింది పదాలను విడదీయండి.

1. ఉదా : రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు = (అ + ఇ = ఏ)
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు = (అ + ఇ = ఏ)
ఆ) మహేంద్రుడు = మహా + ఇంద్రుడు – (ఆ + ఇ = ఏ)

2. ఉదా : పరోపకారం = పర + ఉపకారం – (అ + ఉ = ఓ)
ఇ) మహోన్నతి = మహా + ఉన్నతి – (ఆ + ఉ = ఓ)
ఈ) దేశోన్నతి = దేశ + ఉన్నతి , (అ + ఉ = ఓ)

3. ఉదా : మహర్షి = మహా + ఋషి = (ఆ + ఋ = అర్)
ఉ) రాజరి = రాజ + ఋషి = (అ + ఋ = అర్)

గమనిక :
పైన పేర్కొన్న పదాలను మూడు రకాలుగా విడదీయడం సాధ్యమయ్యింది. అవి. అ / ఆ + ఇ / ఈ = ఏ; అ / ఆ + ఉ / ఊ = ఓ; అ / ఆ + ఋ / ఋ = అర్

ఈ మూడు సందర్భాల్లోనూ, పూర్వస్వరం, ‘అ’ ఆ; పరస్వరం స్థానంలో ఇ, ఉ, ఋ లు వచ్చాయి. ‘ఇ’ కలిసినపుడు ‘ఏ’ ; ‘ఉ’ కలిసినపుడు ‘ఓ’ ; ‘ఋ’ కలిసినపుడు ‘అర్’ ఆదేశంగా వచ్చాయి. ఇందులో ఏ, ఓ, అర్లను గుణాలు అంటారు. ఇలా ఏర్పడే సంధిని ‘గుణసంధి’ అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

2. ఈ కింది పదాలను కలిపి రాయండి. సంధి ఏర్పడ్డ విధానాన్ని చర్చించండి.
ఉదా : రాజ + ఉత్తముడు = (అ + ఉ = ఓ) = రాజోత్తముడు

1) సుర + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = సురేంద్రుడు
2) దేవ + ఋషి = (అ + ఋ = అర్) = దేవర్షి
3) స్వాతంత్ర్య + ఉద్యమం = (అ + ఉ = ఓ) = స్వాతంత్ర్యోద్యమం

3. అ) కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.

1) ఇగురొత్త = ఇగురు + ఒత్త = (ఉ + ఒ = ఒ) – ఉత్వసంధి
2) సున్నితంబైన = సున్నితంబు + ఐన = (ఉ + ఐ = ఐ) – ఉత్వసంధి
3) కలదోయి = కలదు + ఓయి = (ఉ + ఓ = ఓ) – ఉత్వసంధి
4) నీకెవ్వరు = నీకున్ + ఎవ్వరు – ఉత్వసంధి
5) నిలుపకున్నె = నిలుపక + ఉన్నె – (అ + ఉ = ఉ) – అత్వసంధి
6) పసుపుగుంకాలు = పసుపు + కుంకాలు – గసడదవాదేశ సంధి
7) నునుపుల్ దీర్చి : నునుపుల్ + తీర్చి – గసడదవాదేశ సంధి
8) అబద్ధంబు గాదు = అబద్ధంబు + కాదు – గసడదవాదేశ సంధి
9) సార్థకము = స + అర్థకము = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
10) కిరీటాకృతి . . = కిరీట + ఆకృతి = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి

ఆ) కింది సమాసాలకు విగ్రహవాక్యం రాసి, పేర్లు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాస నామం
1) గహ్వరశ్రేణి గహ్వరముల యొక్క శ్రేణి షష్ఠీ తత్పురుష సమాసం
2) మానవ విగ్రహాలు మానవుల యొక్క విగ్రహాలు షష్ఠీ తత్పురుష సమాసం
3) శిల్పి కంఠీరవుడు శిల్పులలో కంఠీరవుడు షష్ఠీ తత్పురుష సమాసం
4) దేవస్థలములు దేవతల యొక్క స్థలములు షష్ఠీ తత్పురుష సమాసం
5) కవి కలము కవి యొక్క కలము షష్ఠీ తత్పురుష సమాసం
6) కుసుమ వల్లరులు కుసుమముల యొక్క వల్లరులు షష్ఠీ తత్పురుష సమాసం
7) శిరోగ్రము శిరస్సు యొక్క అగ్రము షష్ఠీ తత్పురుష సమాసం
8) కిరీటాకృతి కిరీటము యొక్క ఆకృతి షష్ఠీ తత్పురుష సమాసం
9) విద్యానిధి విద్యలయందు నిధి సప్తమీ తత్పురుష సమాసం
10) సోగకన్నులు సోగయైన కన్నులు విశేషణ పూర్వపద కర్మధారయం
11) సర్వ పర్వతములు సర్వములైన పర్వతములు విశేషణ పూర్వపద కర్మధారయం
12) పసుపు కుంకాలు పసుపూ, కుంకుమా ద్వంద్వ సమాసం

ఇ) ఈ కింది పదాలకు ప్రకృతి, వికృతులు రాయుము.

ప్రకృతి – వికృతి
1. సింహము – సింగము
2. చిత్రము – చిత్తరువు
3. స్థలము – తల
4. స్తంభము – కంబము
5. అప్సర – అచ్చర
6. పశ్చాత్ – పజ్జ
7. విద్య – విద్దె
8. కవి – కయి
9. ముఖము – మొగము
10. గహ్వరము – గవి
11. నిద్ర – నిద్దుర
12. పుణ్యం – పున్నెం

కవి పరిచయం

పాఠం : శిల్పి
కవి : గుఱ్ఱం జాషువ
పాఠం దేని నుండి గ్రహింపబడింది : జాషువ రచించిన “ఖండకావ్యం” మొదటి భాగం నుండి
కవి జననం : సెప్టెంబరు 28వ తేదీ 1895. (28-09-1895)
మరణం : జులై 24, 1971. (24-07-1971)
జన్మస్థలం : గుంటూరు జిల్లా వినుకొండ’.
ప్రసిద్ధి : జాషువ ఆధునిక పద్యకవులలో అగ్రశ్రేణి కవి.
రచనలు : 1) పిరదౌసి, గబ్బిలము, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, కాందిశీకుడు, స్వప్నకథ, ఖండకావ్యాలు 7 భాగాలు; మొదలైన పద్యకావ్యాలు. 2) రుక్మిణీ కల్యాణం, తెరచాటు, మీరాబాయి వంటి నాటకాలు.
బహుమతులు : వీరు రాసిన ‘క్రీస్తు చరిత్ర’ కు – కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
బిరుదులు : కవికోకిల, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవిచక్రవర్తి.
సత్కారాలు : 1) ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదును ఇచ్చింది.
2) భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ బిరుదుతో సత్కరించింది.
3) గజారోహణం
4) గండపెండేరం
5) కనకాభిషేకం వంటి సత్కారాలు పొందారు.

1. ‘శిల్పి’ ప్రజ్ఞకు నమస్కారం పెట్టిన జాషువ కవిని పరిచయం చెయ్యండి.
జవాబు:
గుఱ్ఱం జాషువ 1895లో గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించాడు. జాషువ తన ఖండకావ్యం మొదటి భాగంలో ‘శిల్పి’ని గురించి ప్రశంసించాడు. ఈయన పిరదౌసి, గబ్బిలము, ముంతాజ్ మహలు, స్వప్నకథ, ఖండకావ్యాలు 7 భాగాలు, రుక్మిణీ కల్యాణము వంటి నాటకాలు రచించాడు.

ఈయనకు కవికోకిల, పద్మభూషణ్, నవయుగ కవిచక్రవర్తి, కళాప్రపూర్ణ వంటి బిరుదులు ఉన్నాయి.. ఈయన రాసిన క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.

ఈయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదును ఇచ్చింది. గజారోహణం, గండ పెండేరం వంటి సన్మానాలు వీరికి లభించాయి.

కొత్త పదాలు-అర్థాలు

అచ్చర = అప్సరస
ఇగురొత్తు = చిగురించు
ఉప్పొంగు = పైకి పొంగు
కంబము
కంఠీరవము = సింహం
కవనము = కవిత్వం
కుసుమములు = పుష్పాలు
గహ్వరము = గుహ
చాతురి = నేర్పు
చాతుర్యము = నేర్పు
చిరజీవత్వము = చాలాకాలం జీవించుట
చేతము = మనస్సు
తారతమ్యము = తేడా
దేవస్థలము = దేవాలయం
ప్రతిమ = బొమ్మ; విగ్రహం
పాషాణము = బండరాయి
పజ్జ = దగ్గర, వెనుక
ప్రజ్ఞ = తెలివి, నేర్పు, ప్రతిభ
మలచు = చెక్కు
వల్లరులు = తీగలు
వసుధ = భూమి
విగ్రహము = ప్రతిమ
వల్లెవేయు = తిరిగి తిరిగి చదువు
శిరోగ్రము = తలపైన
సోగ = పొడవైన
సోకించి = తగిలించి
శ్రేణి = వరుస
హరిత్తులు = దిక్కులు, (లేక) సింహాలు

పద్యాలు – ప్రతి పదార్థాలు – భావాలు

1వ పద్యం :

తే॥గీ॥ చేత మిగురొత్త నొక నల్లజాతియందు
మలచినాడవు, భయద సింహముల తలలు
వసుధ గన్పట్టు సర్వపర్వతములందు
జిత్రముల నెన్ని గతులఁ జూచెదవో నీవు !
అర్థాలు :
చేతము = మనస్సు
ఇగురొత్తన్ (ఇగురు + ఒత్తన్) = చిగురించేటట్లు
ఒక నల్ల జాతియందున్ = ఒక నల్లని ఱాయిపై
భయద సింహముల = భయంకరమైన సింహాల యొక్క
తలలు = తలలు
మలచినాడవు = చెక్కినావు
నీవు = నీవు
వసుధన్ = భూమిపై
కన్పట్టు = కనబడే
సర్వ పర్వతములందున్ = అన్ని పర్వతాలలోనూ
ఎన్ని గతులన్ = ఎన్ని విధాలుగా
చిత్రములన్ = శిల్పాలను
చూచెదవో (చూచెదవు + ఒ) = చూస్తావో !

భావం :
ఓ శిల్పీ ! నీవు మనసు చిగురించేటట్లు నల్లరాతిలో భయంకరమైన సింహాల తలలు చెక్కావు. భూమి మీద కనిపించే కొండలలోని రూపాలను నీవు ఎన్ని విధాలుగా చూస్తావో !

విశేషం :
నిజమైన సింహం అనే భ్రాంతి కల్గించేటట్లు సింహాల తలలు చెక్కాడని భావం.

2వ పద్యం :

తే॥గీ॥ సున్నితంబైన నీచేతి సుత్తెనుండి
బయలుపడె నెన్ని యెన్ని దేవస్థలములు
సార్ధకము గాని యెన్ని పాషాణములకు
గలిగె నీనాడు పసుపు గుంకాల పూజ !
ప్రతిపదార్థం :
సున్నితంబైన (సున్నితంబు + ఐన) = కోమలమైన
నీ చేతి = నీ చేతిలోని
సుత్తె నుండి = సుత్తి నుంచి
ఎన్ని, ఎన్ని = ఎన్నెన్నో
దేవస్థలములు = దేవాలయాలు
బయలుపడెన్ = వెలువడ్డాయి
సార్థకము + కాని = ప్రయోజనము లేని (వ్యర్థమైన)
ఎన్ని పాషాణములకు = ఎన్నో బండఱాళ్ళకు
పసుపు కుంకాల పూజ = పసుపు, కుంకుమలతో పూజ;
ఈనాడు = ఈ రోజు
కలిగెన్ = లభించిందో కదా !

భావం :
మెత్తనైన నీ చేతి సుత్తి దెబ్బలతో ఎన్నో దేవాలయాలు బయటపడ్డాయి. ఒకనాడు వ్యర్థంగా పడియున్న ఎన్నో బండబాళ్ళకు, నీవల్లనే పసుపు కుంకుమలతో పూజలు పొందే భాగ్యం నేడు లభించింది.

(అంటే శిల్పి ఆ బండటాళ్ళను, దేవతా విగ్రహాలుగా చెక్కాడని, ఆ దేవతా విగ్రహాలను ప్రజలు పసుపు, కుంకుమలతో నేడు పూజిస్తున్నారనీ భావం.)

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

3వ పద్యం :

తే॥గీ॥ కవికలంబున గల యలంకార రచన
కలదు కలదోయి శిల్పి, నీ యులిముఖమున;
గాకపోయినఁ బెను జాతికంబములకు
గుసుమవల్లరు లేరీతి గ్రుచ్చినావు?
ప్రతిపదార్థం :
ఓయి శిల్పి – ఓ శిల్పీ !
కవి = కవి యొక్క
కలంబున + కల = కలమునందున్న
అలంకార రచన = అలంకార రచనాశక్తి (అందముగా తీర్చిదిద్దే శక్తి)
నీ + ఉలి ముఖమున = నీ ఉలి అనే ఇనుప పనిముట్టు నందు కూడ
కలదు కలదు = నిశ్చయంగా ఉంది
కాకపోయిన = అలా నీ ఉలిలో (అలంకార రచన శక్తి) లేకపోతే
పెను = పెద్ద
ఱాతికంబములకు = రాతి స్తంభములకు
కుసుమ వల్లరులు = పూలగుత్తులు (పూల తీగలు)
ఏ రీతిన్ = ఏ విధంగా
గ్రుచ్చినావు = చెక్కగలిగావు (నాటినావు)

భావం :
కవి కలానికి వర్ణించే శక్తి ఉంది. అటువంటి
అలంకార రచనా శక్తి నీ ఉలికి కూడా ఉంది. లేకపోతే కఠినమైన రాతిస్తంభంలో పూసిన లేత కొమ్మలను (పూలగుత్తులను) నీవు ఎలా చెక్కగలిగావు?

(ఉలి = శిల్పి రాళ్ళను చెక్కుటకు ఉపయోగించే ఇనుప పనిముట్టు.)

4వ పద్యం :

తే॥గీ॥ ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత
వల్లెవేయింప గలవు చూపరులచేత;
గవనమునఁ జిత్రములు గూర్చు కవికి నీకుఁ
దారతమ్యంబు లే దబద్ధంబు గాదు.
ప్రతిపదార్థం :
ప్రతిమలు = శిల్పములు (ఱాతిపై బొమ్మలు)
రచించి = చెక్కి
ఒక మహారాజు చరితన్ = ఒక మహారాజు కథను
చూపరుల చేత = చూచేవారి చేత
వల్లెవేయింపగలవు = చెప్పించగలవు
కవనమునన్ = కవిత్వమందు
చిత్రములు + కూర్చు = బొమ్మలను చూపే
కవికిన్ = కవికీ
నీకున్ = నీకూ
తారతమ్యంబు లేదు = తేడా లేదు
అబద్ధంబు కాదు = ఈ మాట అబద్ధం కాదు.

భావం :
నీ శిల్పాలు చూసేవారిచేత నీ శిల్పాలు, ఒక మహారాజు కథను చెప్పించగలవు. కావ్యంలో చిత్రాలను చెక్కే కవికీ, నీకూ ఏ మాత్రమూ తేడా లేదు. ఇది నిజమైన మాట.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

5వ పద్యం

తే॥గీ॥ ఱాల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి
యులిని సోకించి బయటికిఁ బిలిచినావు;
వెలికి రానేర్చి నీ పేరు నిలపకున్నె
శాశ్వతుడ వోయి నీవు నిశ్చయముగాను.
ప్రతిపదార్థం :
ఱాలన్ = రాళ్ళల్లో
నిద్రించు = నిద్రపోతున్న (దాగి ఉన్న)
ప్రతిమలన్ = శిల్పాలను (బొమ్మలను)
ఉలిని = నీ ఉలిని
సోకించి = రాళ్ళకు తగులునట్లు చేసి
బయటికిన్ = వెలుపలికి
పిలిచినావు = ఆ బొమ్మలను పిలిచావు (రప్పించావు)
వెలికిన్ = బయటకు
రానేర్చి = ఆ చిత్రాలు రాగలిగి (వచ్చి)
నీ పేరున్ = నీ పేరును
నిలపకున్న (నిలపక + ఉన్నె) = నిలబెట్టకుండా ఉంటాయా?
నీవు = నీవు
నిశ్చయముగాన్ = తప్పకుండా
శాశ్వతుడవు + ఓయి = శాశ్వతత్వం కలవాడవు (చిరంజీవివి)

భావం :
బాళ్ళల్లో దాగియున్న (నిద్రపోతున్న) బొమ్మలను, నీ ఉలిని తాకించి వాటిని మేల్కొలిపి బయటకు పిలిచావు. ఆ శిల్పాలు బయటకు వచ్చి, నీ పేరు నిలబెట్ట కుండా ఉండవు. నీవు నిశ్చయంగా చిరంజీవివి.

6వ పద్యం :

మ|| తలయెత్తెన్ గద, నీదు చాతురి యజంతాగహ్వరశ్రేణి గే
వల పాషాణములందు; జీవకళ నిల్పంజాలు నీ సుత్తిలో
మొలుచు న్మానవ విగ్రహంబులు; మహాపుణ్యుండవయ్యా ! హరి
త్తులు, నీ బొమ్మలచెంత ముగ్ధగతినందున్; శిల్పికంఠీరవా!
ప్రతిపదార్థం :
శిల్పి కంఠీరవా = శిల్పులలో సింహం వంటి గొప్పవాడా ! (శిల్పి శ్రేష్ఠా!)
అజంతా గహ్వర శ్రేణిన్ = అజంతా గుహల సముదాయంలో
నీదు చాతురి = నీ నైపుణ్యం
తలయెత్తైన గద (తల + ఎత్తైన్ + కద) = తలఎత్తుకొని నిలబడింది కదా! (వెల్లడి అయినది కదా!)
కేవల పాషాణములందున్ = వట్టి బండరాళ్ళలో
జీవకళ నిల్పంజాలు = సజీవత్వంను చూపగల
నీ సుత్తెలోన్ = నీ సుత్తెలో నుండి
మానవ విగ్రహంబులు = మనుష్యుల బొమ్మలు
మొలుచున్ = మొలుస్తాయి (రూపుదిద్దుకుంటాయి)
అయ్యా = ఓ శిల్పీ !
మహా పుణ్యుండవు = నీవు గొప్ప పుణ్యమూర్తివి,
నీ బొమ్మల చెంతన్ = నీ బొమ్మల ప్రక్కన
హరిత్తులు = సింహాలు
ముగ్గగతిన్ + అందున్ = ముగ్గములు అవుతాయి (సంతోషముతో ఉక్కిరి బిక్కిరవుతాయి) (నీ శిల్ప నైపుణ్యాన్ని చూచి మెచ్చుకుంటాయి).

భావం :
ఓ శిల్పి శ్రేష్ఠుడా ! అజంతా గుహలలో నీ శిల్పనైపుణ్యం వెల్లడయ్యింది కదా ! నీ సుత్తి, వట్టి బండరాళ్ళలో కూడా జీవకళను నిలుపగలదు. నీ సుత్తిలో నుండి మానవ విగ్రహాలు పుడతాయి. నీవు పుణ్యమూర్తివి. నిజమైన సింహాలు సైతం, నీ శిల్పాలను చూచి ముగ్ధములు అవుతాయి.

విశేషం :
‘హరిత్తులు అంటే ‘సింహాలు’ అని, దిక్కులు అని అర్థం. శిల్పంగా చెక్కిన సింహాలను చూచి సింహాలు ఆనందిస్తాయి. అంటే నిజమైన సింహాల కన్న సింహాకృతిలో ఉన్న శిల్పమే అందంగా చెక్కబడిందని భావం.

7వ పద్యం :

మ|| నునుపుల్ దీర్చి మదంబు చిందిపడ నేన్గున్ గున్నలన్ జెక్కి వై
చిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చెన్సత్కిరీటాకృతిన్;
తెనుగుందేశము నిన్నువంటి పనివానిం జూచి యుప్పొంగుచుం
డును; నీ లేమి దలంచి కంటఁ దడిబెట్టున్; శిల్పవిద్యానిధీ !
ప్రతిపదార్థం :
శిల్ప విద్యానిధీ = శిల్ప విద్యలో గొప్పవాడా !
నునుపుల్ + తీర్చి = ,బాతిని నున్నగా చేసి
మదంబు + చిందిపడన్ = బొమ్మలలో మదము ఉట్టిపడేటట్లు
ఎన్గున్ = ఏనుగునూ
గున్నలన్ = ఏనుగు పిల్లలనూ
చెక్కివైచిన = చెక్కిన
చాతుర్యము = నేర్పు
నీ శిరోగ్రము = నీ తలపై
సత్కిరీటాకృతిన్ (సత్ + కిరీట + ఆకృతిన్) = మంచి కిరీటము యొక్క ఆకారం వలె
నిల్చెన్ = నిలబడింది
తెనుగుం దేశము = తెలుగు దేశం
నిన్ను వంటి = నీ వంటి
పనివానిన్ = పనివాడిని (శిల్పం చెక్కడంలో నేర్పుగలవాడిని)
చూచి = చూచి
ఉప్పొంగుచుండును = సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది
ఆ నీ లేమి + తలంచి = నీ దరిద్రాన్ని చూచి
కంట + తడి పెట్టున్ = కన్నీరు కారుస్తుంది.

భావం :
శిల్ప విద్యలో నిధివంటివాడా ! రాతిని నునుపు చేసి మదం చిందేటట్లుగా ఏనుగునూ, దాని పిల్లలనూ చెక్కిన నీ నేర్పు, నీ తలపై మంచి కిరీటం వలె నిలిచింది. తెలుగునేల నీ వంటి పనివాళ్ళను చూసి ఉప్పొంగిపోతూ ఉంటుంది. నీ దారిద్య్రాన్ని చూచి కన్నీరు కారుస్తుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 7 శిల్పి

8వ పద్యం :

మ|| తెలిజాతిన్ జెలువార నచ్చరపడంతిం దిద్ది యా సోగ క
న్నుల పజ్జన్ నిను నీవు దిద్దుకొని, సంతోషించుచున్నాడవా!
భళిరే ! శిల్పిజగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకో
గల నీకెవ్వడు సాటివచ్చును? నమస్కారంబు నీ ప్రజ్ఞకున్.
ప్రతిపదార్థం :
తెలిఱాతిన్ = తెల్లని చంద్రకాంత శిలపై;
చెలువారన్ = అందంగా
అచ్చర పడంతిన్ = అప్సరసను
దిద్ది = చెక్కి
ఆ సోగకన్నుల = ఆ అప్సరస యొక్క పొడవైన కన్నుల యొక్క
పజ్జన్ = వెనుక
నినున్ = నిన్ను
నీవు = నీవు
దిద్దుకొని = మలచుకొని;
సంతోషించుచున్నాడవా ! = సంతోషిస్తున్నావా !
భళిరే = ఆశ్చర్యము
శిల్పి జగంబులోన = శిల్పి ప్రపంచంలో
చిరజీవత్వంబు = శాశ్వతత్వాన్ని
సృష్టించుకోగల = కల్పించుకోగలిగిన
నీకున్ = నీకు
ఎవ్వడు = ఎవడు
సాటి వచ్చును = సాటి రాగలడు .
నీ ప్రజ్ఞకున్ = నీ ప్రతిభకు (తెలివికి)
నమస్కారంబు = నమస్కారాలు.

భావం :
ఓ శిల్పీ ! తెల్లని చంద్రకాంత శిలలో అప్సరసను చెక్కి, ఆమె దీర్ఘమైన కన్నులకు ప్రక్కగా నిన్ను నీవు మలచుకొని సంతోషపడుతున్నావా ? భళా ! శిల్పి ప్రపంచంలో శాశ్వతత్వాన్ని కల్పించుకోగలిగిన నీకు, ఎవరూ సాటిరారు. నీ ప్రజ్ఞకు నా నమస్కారాలు.

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 6th Lesson “ఎందుకు పారేస్తాను నాన్నా?” Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 6th Lesson “ఎందుకు పారేస్తాను నాన్నా?”

7th Class Telugu 6th Lesson “ఎందుకు పారేస్తాను నాన్నా?” Textbook Questions and Answers

ప్రశ్నలు జవాబులు

ఈ క్రింది ప్రశ్నలపై చర్చించండి – జవాబులు వ్రాయండి.

ప్రశ్న 1.
“ఎందుకు పారేస్తాను నాన్నా?” కథను సంక్షిప్తంగా సొంతమాటలలో రాయండి.
జవాబు:
కృష్ణుడు ఫోర్తు ఫారమ్ లోకి వచ్చాడు. వాళ్ళ అమ్మ వాడిని చదివించమన్నా, వాళ్ళ నాన్న వాడిని బడికి పంపలేనన్నాడు. తన దగ్గర డబ్బులేదన్నాడు. కృష్ణుడికి వాళ్ళ నాన్న, చుట్టలు తెమ్మని డబ్బులు ఇచ్చాడు. చుట్టలు తేవాలంటే స్కూలు ప్రక్క నుంచే వెళ్ళాలి. కృష్ణుడికి బడి మానినందువల్ల బడివైపు వెళ్ళడం అవమానంగా ఉంది.

కృష్ణుడు ఎలాగో తలవంచుకొని బడి ప్రక్కగా వెడుతూంటే, వాడి స్నేహితుడు నరసింహం కనబడి బడికి రాటల్లేదేమీ అని అడిగాడు. తాను బడిలో చేరాననీ, పుస్తకాలు అన్నీ కొన్నాననీ వాడు చెప్పాడు. కృష్ణుడు, వాడి ఇంగ్లీషు పుస్తకం వాసన చూసి, తాను సోమవారం. బడిలో చేరతానని నరసింహానికి చెప్పాడు. ఇంతలో శకుంతల అనే కృష్ణుడి సహాధ్యాయిని వచ్చి, ఇంగ్లీషులో తనదే ఫస్టు మార్కు అంది. కృష్ణుడు తనకు మూడింట్లో ఫస్టు వచ్చిందన్నాడు. ఇంతలో స్కూలు బెల్లు కొట్టారు. పిల్లలు అంతా బడిలోకి వెళ్ళారు.

కృష్ణుడికి అక్కడ నుండి కదలబుద్ధి పుట్టలేదు. అక్కడే కూర్చున్నాడు. ఇంతలో వాళ్ళ నాన్న బజారుకు వెడుతూ అక్కడకు వచ్చి కృష్ణుడిని చూశాడు – కృష్ణుడి ఏడుపు ముఖం చూసి ఆయన జాలిపడ్డాడు. తాను చుట్టలు కాల్చడం మాని, ఆ డబ్బుతో కృష్ణుడిని చదివిస్తానన్నాడు. కృష్ణుడు వాళ్ళ నాన్నను ఇంగ్లీషు పుస్తకం కొనిమ్మని అడిగాడు. ఆయన అంగీకరించాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

ప్రశ్న 2.
కృష్ణుడికి చదువంటే ఎంత ఇష్టమో మీ మాటల్లో చెప్పండి.
జవాబు:
కృష్ణుడు తెలివైన పిల్లవాడు. ‘ఫోర్తు ఫారములోకి వచ్చాడు. కృష్ణుడి తండ్రి, తన దగ్గర డబ్బులేదని కృష్ణుడిని బడి మానిపించాడు. కృష్ణుడికి ఇంగ్లీషులో సెకండు మార్కు మూడింట్లో ఫస్టు వచ్చింది. లెక్కల్లో నూటికి నూరు వచ్చాయి. తండ్రి చదువు మాన్పించాడని నామోషితో కృష్ణుడు వీధుల్లోకి రావడం మానేశాడు.

కృష్ణుడి తండ్రి చుట్టలు తెమ్మన్నాడని, కృష్ణుడు సిగ్గుతో బడి ప్రక్క నుంచి వేడుతున్నాడు. కృష్ణుడి స్నేహితుడు నరసింహం కనబడి బడికి రావడం లేదేమని అడిగితే, కృష్ణుడు తాను సోమవారం చేరతానని అబద్దమాడాడు – నరసింహం ఇంగ్లీషు పుస్తకాన్ని కృష్ణుడు . ఆనందంగా వాసన చూశాడు. ‘కొత్త పుస్తకం వాసన తనకు ఇష్టం అన్నాడు.

కృష్ణుడు మొదటి నుంచీ తెలివైనవాడు. పంతంతో చదివేవాడు. అందువల్ల మేష్టర్లు కృష్ణుడిని ప్రేమగా చూసేవారు – తల్లి కృష్ణుడిని బడికి పంపమని తండ్రితో బ్రతిమాలి చెప్పింది. కాని తండ్రి తన దగ్గర డబ్బుల్లేవని మొండికేశాడు.

కృష్ణుడి సహాధ్యాయిని శకుంతల కనబడి, ఇంగ్లీషులో తనది ఫస్టు అని కృష్ణుడికి చెప్పింది. ఏమయినా తాను బడి .నుండి కదలననీ, ఇంటికి భోజనానికి వెళ్ళననీ కృష్ణుడు బడి దగ్గరే కూర్చుని ఏడ్చాడు. ఆ బడి తనదని అన్నాడు. కృష్ణుడి ఏడుపు ముఖం చూసి, తండ్రి జాలిపడ్డాడు. తాను చుట్టలు మానివేసి, ఆ డబ్బుతో కృష్ణుడిని చదివిస్తానన్నాడు. కృష్ణుడు సంతోషంగా ఇంగ్లీషు పుస్తకం తండ్రిచే కొనిపించుకున్నాడు.

దీనిని బట్టి కృష్ణుడికి చదువంటే ఎంతో ఇష్టం అని తెలుస్తోంది.

ప్రశ్న 3.
కృష్ణుడు తండ్రిలాంటి వ్యసనపరులు, సమాజంలో ఉంటారు కదా ! వాళ్ళ ప్రభావం, పిల్లలపై ఎలా ఉంటుందో చర్చించండి.
జవాబు:
కృష్ణుడు తండ్రి బీదవాడు – కృష్ణుడు తెలివిగలవాడైనా, ఫోర్తు ఫారం చదివించడానికి కనీసం ఏభై రూపాయలు -కావాలని, కృష్ణుడిని తండ్రి బడి మానిపించాడు. కృష్ణుడు దానితో కుమిలి కుమిలి ఏడ్చాడు. వీధిలోకి రావడానికే, . సిగ్గు పడ్డాడు. అతడు స్నేహితుల ముఖాలు చూడలేకపోయాడు.

కృష్ణుడి తండ్రి చుట్టలు కాలుస్తాడు – చుట్టలు కాల్చడం కోసం, కృష్ణుడిని బడి మానిపించాడు. కొందరు తండ్రులు త్రాగుతారు. మరికొందరు సిగరెట్లు కాలుస్తారు. కొందరు క్లబ్బులకు పోతారు. కొందరు పేకాట ఆడతారు. ఆ దురలవాట్లకు డబ్బు తమకు తక్కువవుతుందని, తమ పిల్లలచే చదువులు మానిపిస్తారు. తమ పిల్లలను బాలకార్మికులుగా మారుస్తారు.

పిల్లలు కూడా తండ్రిని చూసి ఆ దురలవాట్లు నేర్చుకుంటారు. పిల్లలు చదువు మానివేసి ఆ దురలవాట్లకు లోనవుతారు. వారు చిన్నప్పుడే బట్టీలలో కార్మికులుగా, హోటళ్ళలో పనివారుగా తయారు అవుతారు. కాబట్టి తండ్రులు తాము చెడు అలవాట్లు మానుకొని, ఆ డబ్బుతో తమ పిల్లలను చదివించాలి. కృష్ణుడి తండ్రిని చూసి తల్లిదండ్రులు జ్ఞానం తెచ్చుకోవాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

ప్రశ్న 4.
మన సమాజంలో కృష్ణుడు లాంటి విద్యార్థులు ఎందరో ఉండవచ్చు. వాళ్ళకు మీరు ఎలా సాయపడతారు?
జవాబు:
మన చుట్టూ సమాజంలో ఎందరో పిల్లలు తాము కూడా బడిలో చదువుకోవాలని, పుస్తకాల సంచి బుజాన వేసుకొని, పెన్ను జేబులో పెట్టుకొని, దర్జాగా బడికి వెళ్ళాలనీ, కోరుకుంటూ ఉంటారు.

అయితే కొందరు పిల్లలకు అసలు తల్లిదండ్రులే ఉండరు. మరికొందరు తల్లిదండ్రులకు తమ పిల్లలను చదివించే స్తోమత ఉండదు. నిజానికి మన ప్రభుత్వము పిల్లలందరికీ పుస్తకాలు ఉచితంగా ఇస్తోంది. మధ్యాహ్నం భోజనం పెడుతోంది. ఆడపిల్లలకు సైకిళ్ళు ఉచితంగా ఇస్తోంది. బడిలో ఫీజులు లేవు.

నేను కృష్ణుడిలాంటి పిల్లల తండ్రుల దగ్గరకు వెళ్ళి నా పుస్తకాలు, పెన్ను వగైరా ఉచితంగా వారికి ఇస్తాను. బీద పిల్లలకు పరీక్ష ఫీజులు కడతాను. వారికి నోట్సు పుస్తకాలు ఉచితంగా ఇస్తాను. నా పాతచొక్కాలు, లాగులు వారికి ఉచితంగా ఇస్తాను. మా తల్లిదండ్రులతో చెప్పి మాకు ఇరుగు పొరుగున ఉన్న బీద విద్యార్థులకు కావలసిన వస్తువులు, కొని ఇస్తాను. నా మిత్రులతో చెప్పి వారిచేత కూడా వారికి సాయం చేయిస్తాను.

ప్రశ్న 5.
ఈ కథలో నరసింహం, శకుంతల, కృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణను రాయండి.
జవాబు:
(నరసింహం, శకుంతల, కృష్ణుడు సహాధ్యాయులు)
నరసింహం : కృష్ణా ! నువ్వు బడికి రావడం లేదేం?
కృష్ణుడు : నేను సోమవారం చేరతాను.
నరసింహం : మరి పుస్తకాలు కొన్నావా?
కృష్ణుడు : ఇంకా లేదు.
నరసింహం : తొందరగా కొను. మళ్ళీ అయిపోతాయి. ఎక్సరు సైజు పుస్తకాలు స్టోర్సులో కొనకు. నా పుస్తకం చూడు.
నరసింహం : కొత్త పుస్తకం వాసన బాగుంటుందిరా కృష్ణా !
కృష్ణుడు : కమ్మగా ఉంటుంది. అది నాకెంతో ఇష్టం.
నరసింహం : ఇంగ్లీషులో ఫస్టుమార్కు ఎవరికొచ్చిందిరా?
కృష్ణుడు : శకుంతల కొట్టేసింది.
నరసింహం : ఆడపిల్లని మాస్టరు వేసేసుంటారు.
కృష్ణుడు : నీ మొహం ! అది తెలివైంది.
శకుంతల (వచ్చి) : కృష్ణా ! ఇంగ్లీషులో ఫస్టుమార్కు నాది ! తెలుసా?
కృష్ణుడు : నీకు ఒక్క ఇంగ్లీషులోనే కదా ! నాకు మూడింట్లో ఫస్టుమార్కులొచ్చాయి. లెక్కల్లో నూటికి నూరు వచ్చాయి.
శకుంతల : ఇంగ్లీషు ముఖ్యమైందండీ !
కృష్ణుడు : తెనుగే ముఖ్యమండి ! బి.ఏ వాళ్ళు కూడా ఇంగ్లీషులో మానేసి, తెలుగులోనే చెప్పాలని పేపర్లో పడ్డాదండి.
శకుంతల : కృష్ణా ! బెల్లయింది బళ్ళోకిరా !
కృష్ణుడు : నేను సోమవారం నుంచి వస్తా.
శకుంతల : -నేను బళ్ళోకి పోవాలి బాబూ !
కృష్ణుడు : శకుంతలా ! సరే వెళ్ళు.

ప్రశ్న 6.
“తల తాకట్టు పెట్టి అయినా నిన్ను బడిలోకి పంపిస్తాను” అనే విధంగా తన తండ్రిని మార్చిన కృష్ణుని గూర్చి రాయండి.
జవాబు:
కృష్ణుడు వాళ్ళ నాన్నది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. కొడుకు చదవడానికి చాలా ఖర్చు అవుతుందని అంత ఖర్చు పెట్టడం కష్టమంటాడు కృష్ణుడు వాళ్ళ నాన్న. కృష్ణుడి తల్లి ఎంత పోరినా కాదు పొమ్మంటాడు. నెలనెలా జీతం ఎంత కట్టాలో? పుస్తకాలకు యాభై రూపాయలు, దస్తాకాగితాలు రూపాయి అర్ధణా, పెన్సిలు ఆరణాలు. ఇవన్నీ ఎక్కడ నుండి తేవాలి అంటాడు. ఇంకా, వారం వారం ఎక్కడలేని డబ్బూ బియ్యానికి ముడుపు చెల్లించడానికే తల ప్రాణం తోక్కొస్తున్నది అంటాడు. తండ్రి మాటలు విన్న కృష్ణుడు చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమని. బాధపడుతున్నాడు. చదువుతున్న కుర్రాళ్ళ మీద ఈర్ష్యా, తనకి చదువు లేకుండా పోయిందన్న దుఃఖం, మనసును – కుదిపేస్తున్నాయి.

తండ్రి చుట్టలు తెమ్మనడంతో బయలుదేరిన కృష్ణుడు బడి దగ్గర ఆగిపోతాడు. కొడుకు ఎంత సేపటికి రాకపోవడంతో వెతుకుతూ వస్తున్న తండ్రికి కొడుకు బడి దగ్గర నుంచుని తనతోటివారిని చూస్తూ ఉండడం కనిపించింది. పిల్లవాడి ముఖంలోని విచారరేఖల్ని చూసి, ఏంటని అడగడంతో కృష్ణుడికి ఆనకట్టలు తెగొట్టుకొని దుఃఖం కొట్టుకొచ్చింది. కొడుకు బాధ చూసి, చుట్టలు తాగడం మాని ఆ డబ్బులతో పిల్లవాణ్ణి చదివించాలనుకున్నాడు ఆ తండ్రి. ఎంత మానుదామనుకొన్నా మానలేకపోతున్న ఆయన పిల్లవాడి కోసం “తల తాకట్టు పెట్టుకునైనా బళ్ళో వేస్తాను” అంటాడు. కృష్ణుడిలోని చదవాలనే పట్టుదలే తన తండ్రి చేత ఆ మాటలు అనిపించింది.

కఠిన పదములకు అర్థములు

పురమాయించేడు = ఆజ్ఞాపించాడు
నామోషి = అవమానము
గింజుకుంటూ = కాళ్ళు విదలించుకుంటూ
ఘోష = ధ్వని
నిశ్చయంగా = నిర్ణయంగా
ఈడు = వయస్సు
శతపోరి = నూరు; విధాల దెబ్బలాడి
సంబరము = సంతోషం
ఫోర్తు ఫారమ్ = 9వ తరగతి
ప్రారబ్ధం = అనుభవించి తీరవలసిన కర్మ (పూర్వజన్మ కర్మ)
తల ప్రాణం తోక్కొస్తోంది = మిక్కిలి కష్టం అవుతోంది
స్వస్తి చెప్పడం = ముగించడం
నిర్ధారణ = నిశ్చయము
ఈర్ష్య = అసూయ

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

త్రివర్ణ చిత్రం = మూడు రంగుల బొమ్మ
బెల్లు (Bell) = గంట
దుఃఖోపశమనం (దుఃఖ +ఉపశమనం) = దుఃఖం అణగడం
స్తంభించిపోయి = స్తంభంలా బిగిసిపోయి
కుమిలిపోతున్నాడు = తపించిపోతున్నాడు (బాగా బాధపడుతున్నాడు)
చాడీలు చెప్పాడు = లేని నేరాలు చెప్పాడు
పునః నిశ్చయించు = తిరిగి నిర్ణయించు
కందగడ్డ = కందదుంపలా ఎఱుపు
దిగమారావేం = ఉండిపోయావేం?
బోధపడ్డాది = అర్థమయ్యింది
దేవులాడుతున్నావా? = విచారిస్తున్నావా?
పాలుపోలేదు = నిర్ణయం కాలేదు (తోచలేదు)

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 5th Lesson తెలుగు వెలుగు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 5th Lesson తెలుగు వెలుగు

7th Class Telugu 5th Lesson తెలుగు వెలుగు Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారని మీరనుకుంటున్నారు?
జవాబు:
చిత్రంలో తాతగారూ, ఆయన మనుమరాండ్రు ఇద్దరూ ఉన్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో ఏ భాష గురించి చెబుతున్నారు?
జవాబు:
చిత్రంలో తెలుగుభాషను గురించి చెబుతున్నారు.

ప్రశ్న 3.
తాతయ్య చెప్పిన మాటలకు అర్థం ఏమిటి?
జవాబు:
“తెనుగుభాష తేనె కంటె తియ్యగా ఉంటుంది. ఆ తెలుగుభాష మన కన్నులకు వెలుగును ఇస్తుంది” అని అర్థం.

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

ప్రశ్న 4.
తెలుగుభాష ఎటువంటి భాష?
జవాబు:
తెలుగుభాష చాలా అందమైన భాష. తెలుగు అన్ని భావాలను తెలిపే సామర్థ్యము గల భాష. తెలుగుభాషలో గొప్పదనం, సామెతలు, శబ్దపల్లవాలు, జాతీయాలు మొదలైన వాటిలోనూ, హరికథలు, సంకీర్తనలు మొదలయిన ప్రక్రియల్లోనూ ఉంది.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠ్యభాగంలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి?
జవాబు:
“అడిగెదనని కడు వడిఁ జను” అన్న పోతన గారి భాగవతంలోని పద్యం, నాకు బాగా నచ్చింది. ఆ చిన్న కంద పద్యంలో ‘డ’ అనే హల్లు, 23 సార్లు తిరిగి తిరిగి వచ్చింది. ఇది పోతన గారి చమత్కారం.

ప్రశ్న 2.
మనకు ఏ భాషా లేకపోతే ఏమౌతుంది? మన భాష గొప్పతనాన్ని గురించి మీరు ఏం తెలుసుకున్నారు?
జవాబు:
మనకు ఏ భాషా లేకపోతే, మన అభిప్రాయం ఇతరులకు తెలపడానికి వీలు కాదు. భాష వల్లనే ఒకరి అభిప్రాయం మరొకరికి చెప్పడానికి, ఇతరులతో మాట్లాడడానికి వీలు అవుతోంది. మనకు భాషలేకపోతే మనం జంతువులతో సమానం అవుతాం.

మన భాష తెలుగుభాష. అది. తేనె కన్న తీపిదనం కలది. ఈ భాషలో ఎన్నో చమత్కారాలున్నాయి. “దేశ భాషలలో తెలుగు లెస్స” అని, శ్రీ కృష్ణదేవరాయలు చెప్పాడు. ఈ తెలుగుభాషలో పొడుపుకథలు, సామెతలు, జాతీయాలు, శబ్దపల్లవాలు ఉన్నాయి. జోలపాటలు, సంకీర్తనలు ఉన్నాయి. జానపద గేయాలు, స్త్రీల పాటలు, హరికథలు, బుర్రకథలు ఉన్నాయి. అవధాన ప్రక్రియ ఉంది. ఆశుకవిత్వం ఉంది. తెలుగు అజంత భాష. తరగని భాష తెలుగు. మన మాతృభాష తెలుగు, మన కన్నతల్లి లాంటిది.

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

ప్రశ్న 3.
‘ఎన్ని భాషలు నేర్చుకున్నా మనం మన మాతృభాషను మరవగూడదు’ అనడానికి కారణం ఏమిటి?
జవాబు:
ఎవరి మాతృభాష వారికి కన్నతల్లి వంటిది. అందులో మన మాతృభాష మనకు అమృతం వంటిది. మాతృభాష నేర్చుకోవడం తల్లిపాలు త్రాగడం లాంటిది. అందుకే మనం మాతృభాషను ఎన్నడూ మరచిపోరాదు.

II. చదవడం -రాయడం

1. ఈ కింది వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారు?

అ) తెలుగుభాష అంటే పద్యాలేనా తాతయ్యా?
జవాబు:
ఈ వాక్యం, ‘సురభి’, తాతగారితో అన్న వాక్యం.

ఆ) లేదమ్మా ! ఒక్కొక్క కథావిధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది.
జవాబు:
ఈ వాక్యం, ‘తాతయ్య’ సురభితో అన్న వాక్యం.

ఇ) ఎప్పుడో పుట్టిన గోదావరి ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది కదా !
జవాబు:
ఈ వాక్యం, తాతగారు సురభితో చెప్పిన వాక్యం.

ఈ) అజంత భాష అనీ పేరు వచ్చింది.
జవాబు:
ఈ వాక్యం, తాతగారు శ్రీనిధికి చెప్పిన వాక్యం.

2. కింది పేరాలోని సామెతలను గుర్తించి రాయండి.

అ) “అప్పుచేసి పప్పుకూడు తినకుండా, కోటి విద్యలు కూటి కొరకే కాబట్టి, ఏదో ఒక విద్యను నేర్చుకొని, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం మాని, మూడు పువ్వులు ఆరు కాయలుగా జీవితంలో వృద్ధి చెందాలి”.
జవాబు:
పై పేరాలోని సామెతలు ఇవి :
1) అప్పుచేసి పప్పుకూడు
2) కోటి విద్యలు కూటి కొరకే
3) తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం
4) మూడు పువ్వులు ఆరుకాయలు

3. కింది ప్రశ్నలకు పాఠాన్ని చదివి, జవాబులు రాయండి.

అ) జాతీయాలు, శబ్దపల్లవాలు అంటే ఏమిటి? వాటికి ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
జాతీయాలు :
ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధమును జాతీయం అంటాం. ‘పలుకుబడి’ అనే పేరుతో కూడా జాతీయాన్ని పిలుస్తాం.
ఉదా :

  1. నెమరువేయటం,
  2. అడవిగాచిన వెన్నెల,
  3. అరికాళ్ళ మంట నెత్తికెక్కడం మొదలయినవి.

శబ్దపల్లవం :
రెండు వేరు వేరు అర్థాలున్న పదాలు కలిసి, ఇంకో అర్థం వచ్చే కొత్త పదాన్ని శబ్దపల్లవం అంటారు. నామవాచకానికి క్రియచేరిన పదాలనే, శబ్ద పల్లవాలంటారు.
ఉదా : మేలుకొను

ఆ) నెమరువేయడం అంటే భాషాపరంగా అర్థం ఏమిటి?
జవాబు:
నెమరువేయడం అంటే, జ్ఞప్తికి తెచ్చుకోవటం అని భాషా విషయకంగా అర్థం చెప్పాలి.

ఇ) జానపద గేయాలు అంటే ఏమిటి?
జవాబు:
మన పల్లెల్లో ఉన్న జానపదులు, ఆనందంగా పాడుకొనే పాటలను “జానపద గేయాలు” అంటారు. ఈ గేయాలు మౌఖికంగా, ఆశువుగా చెప్పినవి. అంటే అప్పటికప్పుడు ఊహించుకొని పాడినవి. జానపదగేయం ఫలానావాడు రాశాడు అని చెప్పలేము.

ఈ) ఇటలీ భాషను, తెలుగు భాషతో పోల్చవచ్చా? ఎందువల్ల?
జవాబు:
ఇటలీ భాష తెలుగు భాషలాగే, అజంత భాష. అందువల్ల ఇటలీ భాషను తెలుగుభాషతో పోల్చవచ్చు. తెలుగుభాష ఇటలీ భాషలాగా అజంతంగా ఉంటుంది కాబట్టే పాశ్చాత్యులు మన తెలుగును, “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని మెచ్చుకున్నారు.

ఉ) తెలుగు సాహిత్యంలోని కొన్ని రకాల ప్రక్రియల పేర్లను తెలపండి.
జవాబు:
తెలుగులో పద్యం, గద్యం, పొడుపు కథలు, సంకీర్తనలు, జోలపాటలు, జానపద గేయాలు, హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, డప్పు కథ, పజిల్స్, సమస్యాపూరణలు, అవధానాలు, గేయాలు, పాటలు, స్త్రీల పాటలు మొదలయిన ప్రక్రియలు ఉన్నాయి.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో ఆలోచించి జవాబులు రాయండి.

అ) మీ ప్రాంతంలోని ప్రజలు మాట్లాడే తెలుగు తీరుకూ, మీ పాఠ్యపుస్తకంలోని తెలుగు తీరుకూ తేడాలు కనిపిస్తున్నాయా? వాటిని గుర్తించి రాయండి.
జవాబు:
మా ప్రాంతంలోని ప్రజలు మాట్లాడే తెలుగు తీరుకూ, మా పాఠ్యపుస్తకంలోని తెలుగు తీరుకూ కొద్దిగా భేదం ఉంది. పాఠ్యపుస్తకాన్ని విద్యావంతులైన ఉపాధ్యాయులు తయారుచేస్తారు. అందువల్ల పాఠ్యపుస్తకంలోని తెలుగు శుద్ధ వ్యావహరికంలో ఉంటుంది. మా ప్రాంతంలోని ప్రజలు మాట్లాడే తెలుగు ఇండ్లలో మాట్లాడే వాడుకభాషకు దగ్గరగా ఉంటుంది.

ఆ) మన భాషలో మీకు తెలిసిన కవుల పేర్లు రాయండి.
జవాబు:
నన్నయభట్టు తెలుగులో ఆదికవి. తిక్కన, ఎఱ్ఱ ప్రగడ, శ్రీనాథుడు, పోతన, అనంతామాత్యుడు, బాలగంగాధర్ తిలక్, గురజాడ, రాయప్రోలు సుబ్బారావు, శ్రీశ్రీ, దాశరథి, జాషువ – నారాయణరెడ్డి వంటి తెలుగుకవుల పేర్లు నాకు తెలుసు.

ఇ) టీ.వీ, రేడియో, మీ ఇల్లు, తరగతి గది – వీటిలో ఏ ప్రదేశంలో మీకు భాష బాగా అర్థమవుతున్నదో, రాయండి. ఏ ప్రదేశంలో ఎందుకు అర్థంకావడం లేదో రాయండి.
జవాబు:
మా ఇంటిలో మాట్లాడే భాష మాకు బాగా అర్థం అవుతుంది. మా తరగతి గదిలో భాష కూడా చాలా వరకు అర్థం అవుతుంది. కాని టీవీ, రేడియోల ‘భాష పూర్తిగా అర్థం కాదు.

మా ఇంటిలో భాష మేము పుట్టినప్పటి నుండి వింటాము. కాబట్టి ఆ భాష మాకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక తరగతిలో మాట్లాడే భాష, మేము బడిలో చేరినప్పటి నుండి వింటున్నాము. అయితే ఒక్కొక్క టీచరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు. అయినా చాలావరకు అది అలవాటై, అర్థం అవుతుంది.

కాని టీవీ, రేడియోలలో మాట్లాడేవారిలో అనేక రకాల గొంతుకలు, శైలి కలవారు ఉంటారు. ఒక్కొక్కరి ఉచ్ఛారణ వేగం, మాటతీరు ఒక్కొక్క తీరుగా ఉంటుంది. వారి భాషలో ఒక రకం భాషాశైలి ఉంటుంది. కాబట్టి దాన్ని మేము పూర్తిగా అర్థం చేసుకోలేము.

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

2. కింది ప్రశ్నలకు పదేసీ పంక్తుల్లో జవాబులు రాయండి.

అ) భాష వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని గురించి రాయండి.
జవాబు:
భాషాప్రయోజనాలు :
మనలోని భావాన్ని, ఇతరులకు తెలపడానికి మానవులు రూపొందించుకున్న ప్రధాన సాధనం “భాష”. భాష లేకపోతే, మనిషికీ, పశువుకు తేడా ఉండదు. జంతువులు తమ అభిప్రాయాన్ని ఇతరులకు చెప్పలేవు. మనిషికి భాష ఉంది కాబట్టి తన అభిప్రాయాన్ని ఇతరులకు అర్థం అయ్యేలా చెపుతున్నాడు. ప్రపంచంలో భాషలేని మనుషులు లేరు.

తెలుగుభాష గొప్పతనం :
తెలుగుభాష తేనెవలె తియ్యని భాష, అమృతం వంటిది. దీన్ని పాశ్చాత్యులు ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని మెచ్చుకున్నారు. తెలుగు అజంత భాష. సంగీతానికి అనువయినది. శ్రీకృష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కీర్తించాడు.

తెలుగులో పద్యగద్యాల వంటి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. తెలుగులో అష్టావధానం, శతావధానం వంటి ప్రక్రియలు ఉన్నాయి. తెలుగులో ఆశుకవిత, సమస్యా పూరణలు, పొడుపుకథలు, జాతీయాలు, జానపదగేయాలు ఉన్నాయి.

తెలుగులో త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య వంటి సంకీర్తనాచార్యులు ఉన్నారు. జోల, లాలిపాటలు ఉన్నాయి. కవిత్రయము, శ్రీనాథ ,పోతనల వంటి కవులు ఉన్నారు. కాబట్టి తెలుగు భాష గొప్పది.

ఆ) తెలుగు భాషను కాపాడడానికి మీరు ఏం చేస్తారో రాయండి.
జవాబు:
అంతర్జాతీయ సంస్థ “యునెస్కో” తెలుగుభాష మృతభాష కాబోతోందని ప్రకటించింది. మన తెలుగును మనం కాపాడాలి.

  1. నేను తెలుగువాడిని అనే భావంతో మెలగుతాను.
  2. ఇంటా, బయటా, చుట్టాలతో, స్నేహితులతో చక్కగా తెలుగులోనే మాట్లాడతాను.
  3. తెలుగు భాషకు ప్రాధాన్యం ఇచ్చే పాఠశాలలోనే చేరతాను.
  4. ఉన్నత పాఠశాల చదువు వరకైనా, అన్ని సబ్జక్టులూ తెలుగులోనే నేర్చుకుంటాను.
  5. డిగ్రీ చదివే వరకూ నేను రెండవ భాషగా తెలుగునే చదువుతాను.
  6. తెలుగులోని శతకములు, పోతన గారి పద్యాలు బాగా చదువుతాను.
  7. ప్రభుత్వం కూడా పరిపాలనలో తెలుగునే ప్రోత్సహించేలా మిత్రులతో కలసి పోరాడతాను.
  8. సమావేశాల్లో తెలుగులోనే మాట్లాడతాను. మిత్రులకు, బంధువులకు తెలుగులోనే ఉత్తరాలు రాస్తాను.
  9. పోటీ పరీక్షలను తెలుగు మీడియంలోనే రాస్తాను.
  10. తెలుగు సాహిత్య సమావేశాలకు తప్పక వెడతాను. తెలుగులో వచ్చే దినపత్రికలు, వారపత్రికలు, దానిలో కథలు చదువుతాను.
  11. తెలుగు వచ్చిన స్నేహితులతో తెలుగులోనే మాట్లాడతాను.

IV. పదజాలం

1. కింది పట్టికలోని పదబంధాల్లో గల జాతీయాలను గుర్తించండి. వాటితో వాక్యాలు రాయండి.

భగీరథ ప్రయత్నం గుండె కరిగింది తలపండిన
కొట్టిన పిండి కంటికి కాపలా కాలికి బుద్ధి చెప్పటం
అన్నం అరగటం వీనుల విందు కాయలు కాయటం
తలలో నాలుక నా ప్రయత్నం తుమ్మితే ఊడే ముక్కు
పెళ్ళి విందు పుక్కిటి పురాణం చెప్పులరగటం
కలగాపులగం కళ్ళు కాయలు కాయటం చెవిలో పోరు

ఉదా :
తలపండిన :
రామయ్య వ్యవసాయం చేయడంలో తలపండినవాడు, కాబట్టి ప్రతి ఏటా మంచి పంట పండిస్తున్నాడు.
జవాబు:
1) భగీరథ ప్రయత్నం ( అమోఘమైన కార్యదీక్ష) :
మా తమ్ముడు “భగీరథ ప్రయత్నం ” చేసి, ఐ.ఎ.ఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు.

2) కొట్టిన పిండి (తన వశములోనే ఉన్నది) :
“ఇంద్రజాల విద్య” అంతా, నా స్నేహితుడికి “కొట్టిన పిండి”.

3) తలలో నాలుక (ఎక్కువ అణకువ గలిగియుండుట) :
నా మిత్రుడు గురువులందరికీ “తలలో నాలుకగా” మసలుకొనేవాడు.

4) కలగాపులగం (అన్నీ కలిపేయడం) :
అన్నం తినేటప్పుడు ..మా అబ్బాయి కూరలూ, పచ్చళ్ళూ అన్ని “కలగాపులగం” చేసి పారవేస్తాడు.

5) కాలికి బుద్ధి చెప్పటం (పారిపోవడం) :
పోలీసులను చూసి, దొంగలు కాలికి బుద్ధి చెప్పారు.

6) కళ్ళు కాయలు కాయడం (ఎంతో ఓపికగా ఎదురుచూడడం) :
మా అబ్బాయి రాక కోసం, మేము “కళ్ళు కాయలు కాచేలా” ఎదురుచూశాము.

7) పుక్కిటి పురాణం (విలువలేని మాటలు) :
నేను పుక్కిటి పురాణాలను పట్టించుకోను.

8) వీనుల విందు (చెవులకు ఇంపు) :
మల్లీశ్వరి సినిమాలో, పాటలు “వీనుల విందుగా” ఉంటాయి.

9) చెవిలో పోరు (ఎంతగానో శ్రద్ధగా చెప్పు) :
పెళ్ళి చేసుకోమని నేను “చెవిలో పోరి” చెప్పినా, నా తమ్ముడు వినలేదు.

10) చెప్పులరగడం (ఎక్కువ శ్రమ) :
“చెప్పులరిగిపోయేలా” తిరిగినా, నా చెల్లెలు పెళ్ళి ఇంకా చేయలేకపోయాను.

11) తలపండిన (పెద్దయైన) :
వ్యవసాయం చేయడంలో నా “తలపండిపోయింది.”

12) గుండె కరిగింది (జాలి పడింది) :
మా కష్టగాథ వింటే, ఎవరికైనా “గుండె కరుగుతుంది.”

13) కాయలు కాయటం (బిడ్డలు పుట్టడం) :
మా కోడలు కడుపున, “నాలుగు కాయలు కాస్తే,” చూసి సంతోషిస్తాను.

14) తుమ్మితే ఊడే ముక్కు (తేలికగా తప్పుకొను) :
“తుమ్మితే ఊడే ముక్కు” వంటి వాడి స్నేహం విషయం గూర్చి అంతగా పట్టించుకోవలసిన పనిలేదు.

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

2. కింది వృత్తంలోని పదాల ఆధారంగా శబ్దపల్లవాల్ని రాయండి. సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
ఉదా : బయటపడు : కిషన్ కష్టపడి సమస్యల నుండి బయటపడ్డాడు.
AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు 2

శబ్దపల్లవాలు :

  1. బుద్ధిచెప్పు
  2. ఏరుకొను
  3. బయటపడు
  4. కూరుచుండు

వాక్య ప్రయోగాలు :

  1. ఉపాధ్యాయుడు పిల్లలకు బాగా బుద్ధి చెప్పాడు.
  2. పారు సముద్రతీరాన గులకరాళ్ళను ఏరుకొన్నారు.
  3. నేను ఎలాగో ఆ చిక్కుల నుండి బయటపడ్డాను.
  4. నేను బల్లపై కూర్చోడానికి ఇష్టపడతాను.

3. కింది వాక్యాలను చదవండి. వీటిని పట్టికలోనున్న తెలుగు భాషాప్రక్రియలలో సరైన వాటితో జతపరచి వాటిని వాక్యాలుగా రాయండి.

అ) ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు …………………. హరికథ
ఆ) అదిగో అల్లదిగో శ్రీహరి వాసము …………………. సంకీర్తన
ఇ) నేను అన్నం తిని బడికి వెళతాను …………………. బుర్రకథ
ఈ) బొబ్బిలిపులిని నేనురా – సై
వచనం దేశరక్షణ చేసెదరా – సై ………………….
వచనం
ఉ) శ్రీమద్రమారమణ గోవిందో హరి …………………. పద్యం

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు 3

ఉదా : ‘ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు’ అనేది పద్యప్రక్రియ
జవాబు:
అ) ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు : పద్యం

ఆ) అదిగో అల్లదిగో శ్రీహరి వాసము : సంకీర్తన

ఇ) నేను అన్నం తిని బడికి వెళతాను : వచనం

ఈ) బొబ్బిలిపులిని నేనురా – సై
దేశరక్షణ చేసెదరా – సై : బుర్రకథ

ఉ) శ్రీమద్రమారమణ గోవిందో హరి : హరికథ

4. కింది వాటిని ఉదాహరణలో చూపిన విధంగా ఒకే పదంగా కూర్చండి.
ఉదా : తెలుగు అనే పేరు గల భాష = తెలుగుభాష

అ) కోపము, అనెడి అగ్ని = కోపాగ్ని
ఆ) హరి యొక్క కథ = హరికథ
ఇ) దేశము నందలి భాషలు = దేశభాషలు

V. సృజనాత్మకత

* కింది జాతీయాలను ఉపయోగించి, ఓక కథ రాయండి.
1) చెవిలో ఇల్లు కట్టుకొని, 2) కంటికి కాపలా, 3) తల పండిన, 4) వీనుల విందు, 5) తలలో నాలుక, 6) కాలికి . బుద్ధి చెప్పు, 7) చేతులు ముడుచుకోవడం, 8) కొట్టినపిండి.
జవాబు:
రామాపురంలో మా తాతగారు ఉండేవారు. ఆయన వ్యవసాయం చేయడంలో (3) తలపండినవాడు. ఆయనకు వేద విద్య అంతా (8) కొట్టిన పిండి. ఆయన శిష్యుడు రామావధాన్లు ఆయన దగ్గర (5) తలలో నాలుకలా మసలేవాడు. మా తాతగారు శిష్యుడికి వేదమంత్రాలు (1) చెవిలో ఇల్లు కట్టుకొని పోరి చెప్పేవారు. ఆ శిష్యుడు మా తాతగారికి (2)కంటికి కాపలాగా ఉండేవాడు. ఎప్పుడూ మా తాతగారి ఇంటిలో వేదమంత్రాలు (4) వీనుల విందుగా వినబడేవి. శిష్యుడు మాత్రం ఏ పనీ చేయకుండా (7) చేతులు ముడుచుకోవడం తాతగారికి ఇష్టం లేదు. ఒక రోజు ఆ శిష్యుడు గురువుగారి వద్ద 10 రూపాయలు దొంగిలించి, (6) కాలికి బుద్ధి చెప్పాడు.

(లేదా)
* ‘తెలుగు భాష’ గొప్పదనాన్ని గురించి, కాపాడడాన్ని గురించి నినాదాలు రాయండి.
జవాబు:

  1. తెలుగుభాష మాట్లాడడం – తల్లి దండ్రులను గౌరవించడంతో, సమానం
  2. తెలుగు తల్లి – మన చల్లని తల్లి
  3. తెలుగు మాట్లాడు – కన్నతల్లిని చల్లగా చూడు
  4. తెలుగును మాట్లాడదాం – తల్లిని రక్షిద్దాం
  5. తేనెలాంటి భాష – మన తెలుగుభాష
  6. దేశభాషల్లో – తెలుగు భాష గొప్పది
  7. తెలుగు నేలలో – తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం
  8. తెలుగు భాషాతల్లిని – రక్షించుకుందాం
  9. తెలుగును విడిస్తే – తెల్ల మొహం వేస్తావు.

VI. ప్రశంస

* కింది సామెతల్ని మీకు తెలిసిన ఇతర భాషల్లో ఏమంటారో తెలుసుకోండి.

అ) మనసుంటే మార్గముంటుంది.
జవాబు:
Where there is a will, there is a way.

ఆ) సాధనమున పనులు సమకూరు ధరలోన
జవాబు:
‘Practice makes the men perfect. .

ఇ) మెరిసేదంతా బంగారం కాదు.
జవాబు:
All glitters is not gold.

ఈ) నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.
జవాబు:
Pleasant words please all.
(or)
A good tongue is a good weapon.

VII. ప్రాజెక్టు పని

* తెలుగుభాష/మాతృభాష గొప్పదనాన్ని గురించి తెలిపే పద్యాలు, పాటలు, గేయాలు సేకరించండి. వాటిని పాడి
వినిపించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను విడదీయండి. సంధి పేరు తెల్పండి.

అ) అయ్యయ్యో = అయ్యో + అయ్యో = ఆమ్రేడిత సంధి
ఆ) కుట్టుసురు = కుఱు + ఉసురు = ద్విరుక్తటకార సంధి
ఇ) కొట్టకొన = కొన + కొన = ఆమ్రేడిత సంధి
ఈ) పట్టపగలు = పగలు + పగలు = ఆమ్రేడిత సంధి
ఉ) అన్నన్న = అన్న + అన్న = ఆమ్రేడిత సంధి
ఊ) చిట్టెలుక = చిఱు + ఎలుక = ద్విరుక్తటకార సంధి
ఋ) ఎట్లెట్లు = ఎట్లు + ఎట్లు = ఆమ్రేడిత సంధి
ఋ) అహాహా = అహా + అహా = ఆమ్రేడిత సంధి.

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

2. కింది పదాలు ఏ సంధి సూత్రానికి వర్తిస్తాయో గుర్తించి, ఆ సంధి పేరు రాసి సూత్రం రాయండి.

అ) అచ్చు ………………… ఆమ్రేడితం …………………….. తరచు.
‘సంధిపేరు : ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగానగు.

ఆ) బి, డ లు ………….. అచ్చు …………………. ద్విరుక్తటకారం …………………. ఆదేశం …………. కు ఱు, చిఱు, కడు, నిడు, నడు.
సంధి పేరు : ద్విరుక్తటకార సంధి.
సూత్రం : కుటు, చిఱు, కడు, నడు, నిడు శబ్దములందలి అడలకు అచ్చు పరమగునపుడు, ద్విరుక్తటకారంబు ఆదేశంబగు.

1. కింది పదాలను విడదీసి సంధి నామములను రాయండి.

1. తాతయ్య = తాత + అయ్య = (అ + అ = అ) – అత్వసంధి
2. అదేమిటి = అది + ఏమిటి = (ఇ + ఏ = ఏ) – ఇకారసంధి
3. ఏమిటది = ఏమిటి + అది = (ఇ + అ = అ) – ఇకారసంధి
4. పచ్చిదొకటి = పచ్చిది + ఒకటి = (ఇ + ఒ = ఒ) – ఇకార సంధి
5. అచ్చుతానంద = అచ్యుత + ఆనంద = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
6. పల్లెటూళ్ళు = పల్లె + ఊళ్ళు = (పల్లె + టు + ఊళ్ళు) – టుగాగమ సంధి
7. ప్రత్యేక = ప్రతి + ఏక = (ఇ + ఏ = యే) – యణాదేశ సంధి
8. ఏకాగ్రత = ఏక + అగ్రత = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
9. అష్టావధానం = అష్ట + అవధానం = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
10. శతావధానం = శత + అవధానం = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
11. సహస్రావధానం = సహస్ర + అవధానం = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
12. మహానుభావులు = మహా + అనుభావులు = (ఆ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి

2. కింది సమాసాలకు విగ్రహం తెలిపి సమాసాల పేర్లు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాస నామం
1. పద బంధము పదము యొక్క బంధము షష్ఠీ తత్పురుష సమాసం
2. దేశభాషలు దేశమందలి భాషలు సప్తమీ తత్పురుష సమాసం
3.  తెలుగుభాష తెలుగు అనే పేరుగల భాష సంభావనా పూర్వపద కర్మధారయం
4. తొంభై ఆమడలు తొంభై (90) సంఖ్య గల ఆమడలు ద్విగు సమాస, సమాసం
5. కొత్తపదం కొత్తదయిన పదం విశేషణ పూర్వపద కర్మధారయం
6. పదసంపద పదముల యొక్క సంపద షష్ఠీ తత్పురుష సమాసం
7. సమస్యాపూరణం సమస్య యొక్క పూరణ షష్ఠీ తత్పురుష సమాసం
8. నలుదిక్కులు నాలుగు (4) సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం
9. ఆరాధ్య భాష ఆరాధ్యమయిన భాష విశేషణ పూర్వపద కర్మధారయం
10. మంచి చెడులు మంచి, చెడు ద్వంద్వ సమాసం

AP Board 7th Class Telugu Solutions Chapter 5 తెలుగు వెలుగు

3. ఈ కింది ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.

1. ఆహారము (ప్రకృతి) – ఓగిరము (వికృతి)
2. సొంతము (వికృతి) – స్వతంత్రము (ప్రకృతి)
3. పద్యము , (ప్రకృతి) – పద్దెము (వికృతి)
4. . బంగారము (వికృతి) – భృంగారము (ప్రకృతి)
5. అమ్మ (వికృతి) – అంబ (ప్రకృతి)
6. రాత్రి (ప్రకృతి) – రాతిరి, రే, రేయి (వికృతి)
7. కథ (ప్రకృతి) – కత (వికృతి)
8. పుస్తకము (ప్రకృతి) – పొత్తము (వికృతి)
9. ధర్మము (ప్రకృతి) – దమ్మము (వికృతి)
10. బరువు (వికృతి) – భారము (ప్రకృతి)
11. భాష (ప్రకృతి) – బాస (వికృతి)
12. బువి (వికృతి) – భూమి, భువి (ప్రకృతి)

4. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. నెమరువేయు : గురువులు బోధించిన పద్యాలను పిల్లలు నెమరువేయాలి.
2. పలుకుబడి : తెలుగుభాష పలుకుబడిలో కమ్మదనం ఉంది.
3. ఫిర్యాదు చేయు : తన సైకిలు పోయిందని, పోలీసు స్టేషనులో రామయ్య ఫిర్యాదు చేశాడు.
4. మేలుకొను : తెలుగు జాతి త్వరగా మేలుకొనకపోతే తెలుగు మృతభాషలలో చేరుతుంది.
5. మౌఖికంగా : పరీక్షలలో ప్రశ్నలను మౌఖికంగా అడుగుతారు.
6. ఆశువు : తిరుపతి వెంకటకవులు గంటకు నూరు పద్యాలు ఆశువుగా చెప్పేవారు
7. ఆబాలగోపాలము : మా గ్రామంలో ఆబాల గోపాలమూ దేవుని పెండ్లి వేడుకల్లో పాల్గొన్నారు.
8. ఏకాగ్రత : అవధాన ప్రక్రియలో ఏకాగ్రతకు, ధారణకు ప్రాధాన్యం.
9. ఆధునికము : ఆధునికంగా వస్తున్న మార్పులను పాతతరం వారు అంగీకరించాలి.
10. ప్రాచీనము : సంస్కృత భాష, ప్రాచీనమయిన భాష.

కొత్త పదాలు-అర్థాలు

చిట్టి = చిన్నది
తాతయ్య చదివిన పద్యం :
“అడిగెదనని కడు వడిఁ జను …… నడుగిడు నెడలన్ ” అనేది

గమనిక :
ఈ పద్యం, పోతన మహాకవి రచించిన ‘ఆంధ్ర మహాభాగవతములో గజేంద్రమోక్షములోనిది. విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా, తొందరగా గజేంద్రుణ్ణి రక్షించడానికి, తన చేతితో పట్టుకున్న లక్ష్మీదేవి కొంగును కూడా విడిచిపెట్టకుండా, ముందుకు వెడుతున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి విష్ణువు వెనకాలే వెడుతూ ఉంది. అప్పటి లక్ష్మీదేవి స్థితిని పోతనగారు ఈ పద్యంలో వర్ణించారు.

పద్యభావం :
ఎక్కడకు వెడుతున్నారని భర్తను అడుగుతానని లక్ష్మీదేవి మిక్కిలి వేగంగా ముందుకు నడుస్తూ వెళ్ళింది. అడిగినా విష్ణువు జవాబు చెప్పడని తలచి, నడవడం మానింది. ఇంతలో విషయం తెలిసికోవాలనే తొందరతో, తిరిగి ముందుకు అడుగులు వేస్తోంది. ఇంతలో మ్రాన్పాటు కలిగి, ముందడుగు వేయడం మానింది.

గమనిక :
ఈ పద్యంలో ‘వృత్త్యనుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది. ఈ చిన్న కందపద్యంలో ‘డ’ అనే హల్లు 23 సార్లు తిరిగి తిరిగి వచ్చింది. అదే ఈ పద్యంలోని చమత్కారం.

నెమరువేయు = తిన్న పదార్థాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ నమలు
జాతీయము = ఒక జాతికి సంబంధించిన పదబంధము లేక పలుకుబడి
లెస్స = మంచిది
ఫిర్యాదు = కంప్లైస్ట్ (Complaint)
చర్య = యాక్షన్ (Action)

పొడుపుకథ పద్యం

పండిన వెండిన దొక్కటి : షండినది, ఎండినది అంటే ‘వక్క’ అనగా పోకచెక్క. (పోక కాయ పండి, అది ఎండిన తర్వాత, దాన్ని వక్కలుగా చేస్తారు.

ఖండించిన పచ్చిదొకటి : చెట్టునుండి కోసిన పచ్చిది ‘తమలపాకు’.

కాలినదొకటై : ఆల్చిప్పలను కాలిస్తే ‘సున్నం’ వస్తుంది.

తిండికి రుచిగానుండును : వక్క తమలపాకు, సున్నం కలిపిన తాంబూలము, తినడానికి రుచికరం.

తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోయింది : ఈ పొడుపు కథకు సమాధానం, ‘ఉత్తరం’.

మొక్కె వంగనిది మానై వంగుతుందా? : చిన్న మొక్కగా ఉన్నపుడే అది వంగుతుంది. చెట్టు మానుగా అయిన తరువాత అది వంగదు.

జాగృతము + అవడం = మేల్కోవడం
జో జో అచ్యుత + ఆనంద = అచ్యుతా ! ఆనందా ! నీకు జోల
జోజో ముకుంద = ముకుందా ! విష్ణుమూర్తీ ! నీకు జోల
‘పలుకే బంగారమాయెనా?’ = ఈ పాటను రామదాసు అనే కంచెర్ల గోపన్న రాశాడు. (ఒక మాట మాట్లాడడం నీకు బంగారం లాంటిదా?) (తనతో మాట్లాడుమని ప్రార్థన)
మౌఖికం = ముఖం నుండి వచ్చేది
ఆశువు = అప్పటికప్పుడు, ఏ ప్రయత్నము లేకుండా చెప్పే పద్యం
ఆబాలగోపాలం = పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ
ఫణివరుండు = పెద్దపాము
సమస్యాపూరణం = సమస్యను పూర్తిచేయుట
ధారణ = జ్ఞాపకము చేసికోవడం
అవధానం = ఏకాగ్రత
అష్టావధానం (అష్ట + అవధానం) = ఎనిమిది విషయాలలో ఏకాగ్రత చూపడం
శతావధానం (శత + అవధానం) = నూరు మంది అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడం
సహస్రావధానం (సహస్ర + అవధానం) = వేయి మంది ప్రశ్నించిన ప్రశ్నలకు జవాబులు చెప్పడం
ప్రతిభ = తెలివి
“మా నిజాం రాజు తరతరాల బూజు” = ఈ పద్యం చెప్పిన కవి “దాశరథి” నైజాం నవాబును గూర్చి ఆయన అలా చెప్పాడు.
“వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ = ఈ గేయం పంక్తులు, గురజాడ అప్పారావు గారి ‘దేశభక్తి’ గేయం లోనివి.
మాతృభాష = తల్లి భాష
ఆరాధ్య భాష = పూజింపదగిన భాష
మహానుభావులు = గొప్పవారు
ఆధునికము = నవీనము
భువి = భూమి

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 4th Lesson మేలిమి ముత్యాలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 4th Lesson మేలిమి ముత్యాలు

7th Class Telugu 4th Lesson మేలిమి ముత్యాలు Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమిAP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు 5 ముత్యాలు 5

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రాన్ని చూడండి. చిత్రంలో ఎవరెవరున్నారు? – ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో ఇద్దరు ఉపాధ్యాయులూ, కొందరు విద్యార్థులూ, కొందరు విద్యార్థినులూ ఉన్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో మాట్లాడుతున్నది ఎవరు ? ఆయన ఏం చెప్తున్నారు? దాని భావం ఏమిటి?
జవాబు:
చిత్రంలో అధ్యాపకుడు మాట్లాడుతున్నాడు. ఆయన వేమన పద్యం పిల్లలకి చెపుతున్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

పై పద్య భావం :
ఓ వేమనా ! విను మేడిపండు చూస్తే, పైకి ఎఱ్ఱగా బాగా ఉంటుంది. కాని దాన్ని బద్దలు కొట్టి చూస్తే, లోపల పురుగులు ఉంటాయి. మేడిపండులాగే పిరికివాడు పైకి ధైర్యంగా కనిపిస్తాడు కాని, వాడిలో ధైర్యం ఏమాత్రమూ ఉండదు.

ప్రశ్న 3.
ఇలాంటి ‘పద్యాలు మీకు తెలిసినవి చెప్పండి.
జవాబు:
“అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ ! వినుర వేమ !” (వేమన శతకం నుండి)

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగంతో పాడండి. అలాగే భావం అర్థమయ్యేలా చదవండి.
జవాబు:
మీ అధ్యాపకుని సాయంతో సాధన చేయండి. పద్యాలు – భావాలు చూచి చదవండి.

ప్రశ్న 2.
మీ తరగతిలో ఇద్దరు జతగా కూర్చోండి. ఒకరు పద్యం చదివితే, ఇంకొకరు భావం చెప్పండి.
జవాబు:
పద్యాలు – తాత్పర్యాలు చూచి పైన చెప్పినట్లు సాధన చెయ్యండి.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

ప్రశ్న 3.
ఈ పాఠానికి మేలిమి ముత్యాలు అనే పేరు తగిన విధంగా ఉందా? ఎందువల్ల?
జవాబు:
ఈ పాఠమునకు “మేలిమి ముత్యాలు” అన్న పేరు తగిన విధంగానే ఉంది. ఈ పద్యాలలో నీతి వచనాలు అంటే సూక్తులు ఉన్నాయి. సూక్తులు అంటే మంచి మాటలు. మంచి మాటలు, మంచి ముత్యాల వంటివి. కాబట్టి ఈ పద్యాలకు ‘మేలిమి ముత్యాలు’ అన్న పేరు తగిన విధంగానే ఉంది.

II. చదవడం – 8యడం

ప్రశ్న 1.
పాఠంలోని ఏ ఏ పద్యాలలో ప్రాస పదాలు ఎక్కువగా ఉన్నాయి? వాటిని గుర్తించండి.
జవాబు:
1) ప్రాస అంటే వచ్చిన పదమే తిరిగి తిరిగి రావడం,
ఈ పద్యాలలో ఏడవ పద్యంలో ‘పత్రిక’ అన్న పదం మూడుసార్లు తిరిగి తిరిగి వచ్చింది. చూడండి.

ఆ. “పత్రికొకటియున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్రకోటి
ప్రజకు రక్షలేదు పత్రికలేకున్న
వాస్తవమ్ము నార్లవారి మాట.”

అలాగే మొదటి పద్యంలో ‘ల’ అనే హల్లు పెక్కు పర్యాయములు తిరిగి తిరిగి వచ్చింది.

క. కలిమిగల లోభికన్నను
విసితముగఁ బేద మేలు వితరణి యైనన్
లిచెమ మేలు కాదా
కునిధి యంభోధి కన్న గువ్వలచెన్నా !

అలాగే రెండవ పద్యంలో ‘వ’ అనే ప్రాసాక్షరము చాలాసార్లు తిరిగి తిరిగి వచ్చింది. గమనించండి.

క. అవయవహీనుని, సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరానియతని, సం
స్తవనీయు, దేవు, శ్రుతులన్
భువి నిందింపఁ దగదండ్రు బుధులు కుమారా!

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

ప్రశ్న 2.
పాఠం ఆధారంగా క్రింది విషయాలకు తగిన పద్యాలను చదవండి. పద్యభావాన్ని సొంతమాటల్లో చెప్పండి.
అ) కష్టపడితే ఫలితం ఉంటుంది.
జవాబు:
పై భావానికి తగిన పద్యం ఇది.
“సానఁబెట్టిన వజ్రంబు లీను కాంతి
పొలము జక్కగ దున్నిన ఫలమునిచ్చు
నటులే యజ్ఞానియైనను నవనిపైని
విద్య నేర్చినయేని వివేకియగును”

భావం :
సానబెడితేనే వజ్రం కాంతులను వెదజల్లుతుంది. చక్కగా దున్నితేనే, పొలం పండుతుంది. విద్య నేర్చుకుంటే, అజ్ఞాని సైతం వివేకం కలవాడు అవుతాడు. కాబట్టి కష్టపడితేనే ఫలితం ఉంటుందని ఈ పద్యం చెబుతోంది.

ఆ) ఎవర్నీ చిన్నచూపు చూడగూడదు.
జవాబు:
పై భావానికి తగిన పద్యం ఇది.
“అవయవహీనుని, సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరానియతని, సం
స్తవనీయు, దేవు, శ్రుతులన్
భువి నిందింపఁ దగదండ్రు బుధులు కుమారా!”

భావం :
అవయవాలులేని వాళ్ళనూ, అందంగా లేనివాళ్ళనూ, బీదవాళ్ళనూ, చదువురాని వాళ్ళనూ, గొప్పవాళ్ళనూ, దైవాన్నీ, వేదాలనూ నిందించకూడదు. కాబట్టి ఎవర్నీ చిన్నచూపు చూడడం తగదు అని ఈ
పద్యం చెపుతోంది.

ఇ) “మంచివాళ్ళతో సావాసం మేలు చేస్తుంది”.
జవాబు:
పై భావానికి తగిన పద్యం ఇది.
“సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు జనులకు గలుషమడఁచు
గీర్తిఁ బ్రకటించు చిత్తవిస్ఫూర్తిఁ జేయు
సాధుసంగంబు సకలార్థ సాధనంబు.”

భావం :
మంచి వాళ్ళతో స్నేహం, సత్యాన్ని మాట్లాడేలా చేస్తుంది. మందగొడితనాన్ని పోగొడుతుంది. మనస్సును బాగుచేస్తుంది. కీర్తిని వ్యాపింపజేస్తుంది. మంచివారితో స్నేహం, అన్ని కార్యాలనూ. సాధిస్తుంది. కాబట్టి మంచివాళ్ళతో సావాసం చెయ్యాలి.

ఈ) పుస్తకాలను పువ్వుల్లా చూడాలి.
జవాబు:
ఆ. పుస్తకముల నీవు పూవువలెను జూడు
చింపఁబోకు మురికి చేయఁబోకు
పరుల పుస్తకముల నెరవు తెచ్చితి వేని
తిరిగి యిమ్ము వేగ, తెలుఁగు బిడ్డ !
భావం :
ఓ తెలుగు బిడ్డా ! పుస్తకాలను పువ్వుల్లా జాగ్రత్తగా చూడు. వాటిని చింపవద్దు. మురికి చేయవద్దు. ఇతరుల పుస్తకాలు అడిగి తెచ్చుకుంటే, వాటిని త్వరగా ఇచ్చి వేయాలి.

3. పాఠంలోని పద్యాలు ఆధారంగా కింద తెలిసినవాటిని దేనితో పోల్చారో చెప్పండి.
అ) ధనికుడైన పిసినారి
జవాబు:
ధనికుడైన పిసినారిని, (అంభోధితో) ఉప్పునీటి సముద్రంతో పోల్చాడు.

ఆ) పేదవాడు
జవాబు:
దాన గుణముగల పేదను, ‘చలిచెలమ’తో పోల్చాడు.

ఇ) చెడ్డవాళ్ళ స్నేహం
జవాబు:
చెడ్డవాళ్ళ స్నేహాన్ని ఉదయం పూట నీడతో పోల్చాడు.

ఈ) మంచివాళ్ళ స్నేహం
జవాబు:
మంచి వాళ్ళ స్నేహాన్ని సాయంకాలపు నీడతో పోల్చాడు.

ఉ) డబ్బు సంపాదించి కూడబెట్టడం
జవాబు:
డబ్బు సంపాదించి కూడబెట్టడాన్ని, తేనెటీగలు తేనెను కూడబెట్టడంతో పోల్చాడు.

ఊ) కోటిమంది మిత్రులు
జవాబు:
పత్రికను కోటి మంది మిత్రులతో పోల్చాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) ఎవరెవరిని చులకనగా చూడగూడదు?
జవాబు:
అవయవ లోపం ఉన్నవాళ్ళనూ, అందంగా లేనివాళ్ళనూ, పేదవాళ్ళనూ, చదువురాని వాళ్ళనూ, గొప్పవాళ్ళనూ, దైవాన్నీ, వేదాలనూ చులకనగా చూడరాదు.

ఆ) పుస్తకాలను మనం ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి?
జవాబు:
పుస్తకాలను పువ్వుల్లా చూడాలి. వాటిని చింపకూడదు, మురికి చేయకూడదు. ఇతరుల పుస్తకాలు అడిగి తెచ్చుకుంటే, వాటిని తొందరగా తిరిగి వారికి ఇచ్చివేయాలి.

ఇ) చదువుకుంటే ఎవరైనా ఎలా మారతారు?
జవాబు:
చదువుకుంటే అజ్ఞాని అయినా సరే, వివేకిగా మారతాడు.

ఈ) మంచివారి సహజ గుణాలేవి?
జవాబు:
ఆపదలు వచ్చినప్పుడు ధైర్య గుణం, ఐశ్వర్యం వచ్చినపుడు ఓర్పు, సభలో వాక్చాతుర్యం, యుద్ధంలో శౌర్యం చూపడం, కీర్తి యందు ఆసక్తి, విద్య నేర్చుకోవాలనే అనురాగం అన్నవి, మంచివారికి సహజ గుణాలు.

5. పాఠంలోని పద్యాలు ఆధారంగా చేసుకొని తప్పొప్పులు గుర్తించండి.

అ) ఎవరి దగ్గర నుంచి అయినా పుస్తకాలు తెచ్చుకుంటే వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వాలి.
జవాబు:
తప్పు

ఆ) కష్టపడ్డ తరువాత పొందే సుఖం ఎంతో గొప్పగా ఉంటుంది.
జవాబు:
ఒప్పు

ఇ) పత్రికలు లేకుంటే ప్రజలకు రక్షణ లేదు.
జవాబు:
ఒప్పు

ఈ) ధనవంతుడి విషయాలు తొందరగా ప్రచారం కావు.
జవాబు:
తప్పు

ఉ) మంచివాళ్ళతో స్నేహం చేస్తే, వాళ్ళ కీర్తి కూడా వ్యాప్తి చెందుతుంది.
జవాబు:
ఒప్పు

ఊ) ఎవరైనా అన్నం తింటారేకాని బంగారం తినరు.
జవాబు:
ఒప్పు

ఎ) సంపాదించిన సొమ్మును అనుభవించకుండా దాచి పెట్టాలి.
జవాబు:
తప్పు

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) ధనికుడైన పిసినారిని సముద్రంతో, దానగుణమున్న పేదవాడిని మంచి నీటి మడుగుతోనూ పోల్చడాన్ని గురించి మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
ధనికుడైన పిసినారి వద్దగల ధనం; ఎవరికీ ఉపయోగపడదు. ఎందుకంటే అతడు ఎవరికీ ఇవ్వడు. అతడు దాన్ని అనుభవించడు. అతని వద్ద ధనం ఉన్నా వ్యర్థమే. అలాగే సముద్రంలో నీరు ఎంతో ఉన్నా, ఉప్పుగా ఉండడం వల్ల అది ఎవరికీ ఉపయోగపడదు. దానగుణం ఉన్న పేదవాడు కొంచెమే ఇవ్వగలడు. . అలాగే చలిచెలమలో నీళ్ళు కొంచెమే ఉన్నా, అవి దాహం తీరుస్తాయి. పేదవాడు ఇచ్చేది కొంచెమైనా అది అవసరానికి పనికి వస్తుంది.

ఆ) అవయవలోపం ఉన్నవాళ్ళనూ, అందంగా లేనివాళ్ళనూ చులకనగా చూడగూడదని తెలుసుకున్నారు కదా! కాబట్టి వాళ్ళను కూడా అందరితో సమానంగా చూడటానికి ఏం చేయాలి?
జవాబు:
అందంగా ఉండడం అనేది, భగవంతుడు మనకు ఇచ్చిన వరం. అలాగే అవయవాలన్నీ ఏ లోపం లేకుండా ఉండడం కూడా దేవుడు మనపై చూపిన అనుగ్రహమే. దేవుడు అన్నీ అందరికీ ఇవ్వడు. డబ్బు కొందరికి ఇస్తాడు. కొందరికి ఇవ్వడు. అందుచేత మంచి మనస్సుతో, అవయవ లోపం ఉన్నవారిపై దయ చూపించాలి. వారికి సాయం చేయాలి. అంతేకాని వారిని చులకనగా చూడరాదు. అవయవ లోపం కలవారికి చదువుకోవడానికి, ఉద్యోగాలకు రిజర్వేషనులు ఇవ్వాలి. వారికి దానధర్మాలు చేయాలి.

ఇ) ఎంతటి అజ్ఞాని అయినా చదువుకొంటే వివేకి అవుతాడనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
“విద్యనేర్చినయేని వివేకియగును” అన్న విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
దేశంలో ఎందరో విజ్ఞానవంతులు ఉన్నారు. వారు అందరూ పాఠశాలల్లోనో, గురువుల వద్దనో చదువుకున్నవారే. చదువుకోకపోతే ఎవరూ జ్ఞానం సంపాదించలేరు. పుట్టగానే తెలివైన వారిగా ఎవరూ పుట్టరు. ఎంత రత్నమైనా సాన పెట్టనిదే ప్రకాశించదు. దున్నకపోతే పొలంలో పంటలు పండవు. కాబట్టి ఎంత అజ్ఞాని అయినా, చదువుకొంటే తప్పక వివేకి అవుతాడు.

ఈ) “సుభాషిత రత్నావళి” పద్యంలో కవి, స్నేహాన్ని నీడతో పోల్చాడుకదా ! ఇది సరైనదేనా ? దీని మీద మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
సుభాషిత రత్నావళి పద్యంలో చెడ్డవాళ్ళ స్నేహం ఉదయం పూట నీడలాగా, మంచివాళ్ళతో స్నేహం సాయంకాలం నీడలాగా ఉంటుందని చెప్పాడు. ఈ పోలిక బాగుంది. ఉదయం పూట మననీడ, మనం ఉన్నదానికంటే పెద్దదిగా పడుతుంది. క్రమంగా ఆ నీడ చిన్నది అవుతుంది. దానిని బట్టి చెడ్డవాళ్ళతో స్నేహం మొదట ఎక్కువగా ఉండి, తర్వాత క్రమంగా తగ్గిపోతుందని తెలుస్తుంది.

మంచివారితో స్నేహం సాయంకాలం నీడలాగా మొదట చిన్నదిగా ఉండి, క్రమంగా పెరుగుతుందని తెలుస్తుంది. కాబట్టి పద్యంలో మంచి, చెడ్డ వారలతో స్నేహాల్ని, ఉదయ, సాయంత్రపు నీడలతో పోల్చడం సరి అయినదే, అని నా అభిప్రాయం.

ఉ) “ధనవంతులు చేసే చిన్న పనికి కూడా గొప్ప ప్రచారం లభిస్తుంది. అదే పేదవాళ్ళ గొప్పపనికి కూడా ఎలాంటి – ప్రచారం ఉండదు” అని వేమన ఎన్నో వందల సంవత్సరాల క్రిందట అన్నాడు కదా ! ఈ పరిస్థితే నేడు కూడా ఉందా? ఇలా ఎందుకు ఉంటుంది?
జవాబు:
ధనవంతుడికి చిన్న కురుపు వేసినా అందరూ దాన్ని గూర్చి పెద్దగా చెప్పుకుంటారు. ఆయన యోగక్షేమాలను అడుగుతారు. ధనవంతుడి అవసరం అందరికీ ఉంటుంది కాబట్టి ధనవంతుడికి ప్రచారం ఎక్కువ అవుతుంది. అదే బీదవాడి ఇంట్లో పెళ్ళి అయినా, అతడు పదిమందికీ భోజనాలు పెట్టలేడు కాబట్టి, ఆ వార్తకు ప్రచారం ఉండదు. కాబట్టి వేమన చక్కగా ఈ విషయాన్ని గమనించి చెప్పాడు. ఈ పరిస్థితి నేడు కూడా ఉంది. ధనవంతుడు ఊరిలో గుడి కట్టిస్తే అందరూ చెప్పుకుంటారు. బీదవాడు రక్తదానం చేసినా, ఎవరూ దాన్ని. గూర్చి చెప్పుకోరు.

ఊ) కింది వాటిలో ఏది సరైనదని భావిస్తున్నారు? ఎందుకో వివరించండి.
1. డబ్బు సంపాదిస్తే పొదుపు చేసి, అనుభవించాలి.
2. డబ్బు సంపాదిస్తే పొదుపు చేసి దానం చేయాలి.
3. డబ్బు సంపాదిస్తే దానం చేయాలి, అనుభవించాలి.
4. దానం చేయడం కోసం, అనుభవించడం కోసం డబ్బు సంపాదించక పోవడం మేలు.
జవాబు:
“డబ్బు సంపాదిస్తే దానం చేయాలి, అనుభవించాలి” అన్న 3వ వాక్యం సరిఅయినది.. డబ్బు దాస్తే అది దొంగలపాలు అవుతుంది. లేదా రాజునకు వశం అవుతుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) పుస్తకాలను పువ్వుల్లాగ జాగ్రత్తగా చూడాలని తెలుసుకున్నారు .కదా ! పుస్తకాల గొప్పతనం ఏమిటి? వాటిని గురించి ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి?
జవాబు:
పూర్వం విజ్ఞానాన్ని అంతా మెదడులోనే గుర్తుపెట్టుకొనేవారు. పుస్తకాలు వచ్చిన తరువాత ప్రపంచ విజ్ఞానం అంతా పుస్తకాలలోకి చేరింది. మనకు జ్ఞాపకం లేకపోతే పుస్తకాలు చూచి గుర్తు చేసుకొంటాము. మన ప్రాచీన విజ్ఞానం భారత భాగవత రామాయణాలలోనూ, నేటి సైన్సు లెక్కల విజ్ఞానం, నేటి శాస్త్ర గ్రంథాలలోనూ ఉంది. పుస్తకాలు, మనం విజ్ఞానం సంపాదించడానికి ముఖ్యమైన ఆధారాలు. కాబట్టి పుస్తకాలను పువ్వుల్లా చూడాలి. చింపరాదు, ఎరవు ఇవ్వరాదు. ఎరువు తెస్తే, వెంటనే ఇచ్చేయాలి. పుస్తకాలు ప్రపంచ విజ్ఞానాన్ని తమ గుప్పిటలో పెట్టుకున్న పెన్నిధులు.

ఆ) మంచివాళ్ళతో స్నేహం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:
మంచివారితో స్నేహం వలన, వారు మనలను పాపకార్యాల నుండి మళ్ళిస్తారు. మనచే మంచి పనులు చేయిస్తారు. మన రహస్యాన్ని రక్షిస్తారు. మన సద్గుణములను ప్రకటిస్తారు. ఆపత్కాలంలో – మన వెంట ఉంటారు. మనకు లేనప్పుడు సాయం చేస్తారు. మంచివారు మనకు అన్నివిధాల సాయం చేస్తారు. శ్రీరాముడు సుగ్రీవుడు, విభీషణులనే మంచివారితో స్నేహం చేశాడు. వారి సాయంతో రావణుని సంహరించాడు.

ఇ) ‘పత్రికలు పదివేల సైన్యంతో, కోటిమంది మిత్రులతో సమానం’ అని తెలుసుకున్నారు కదా ! పత్రికలవల్ల ఉపయోగాలు వివరించండి.
(లేదా)
నిత్యజీవితంలో పత్రికల ఉపయోగాలను మీ సొంతమాటలలో రాయండి.
జవాబు:
సహజంగా పత్రికలను చదివితే, మనకు ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి. దేశ విదేశాలలో, మన – రాష్ట్రంలో జిల్లాలో జరిగే విషయాలన్నీ పత్రికల వల్ల తెలుస్తాయి. విషయం పత్రికలో ప్రకటిస్తే ఆ పత్రిక చూచే వారందరికీ తెలుస్తుంది. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, వారి అభిప్రాయాలు పత్రికల ద్వారానే ప్రజలకు తెలుస్తాయి. పత్రికలు ప్రజాభిప్రాయానికి గీటురాళ్ళు.

ఎవరైనా కష్టదశలో ఉండి, ఇతరుల సాయం కోరి పత్రికలో ప్రచురిస్తే ప్రజలు వారిని ఆదుకుంటారు. ఈ ధరవరల సమాచారం, పెండ్లి కావలసిన యువతీయువకుల సమాచారం, వగైరా తెలుస్తుంది. కాబట్టి ఒక్క పత్రిక, 10 వేల సైన్యంతో, కోటిమంది మిత్రులతో సమానం.

IV. పదజాలం

1. కింది పేరాలోని గీత గీసిన పదాలకు అర్థాలు తెలుసుకోండి. అవే అర్థాలనిచ్చే పదాలతో, పేరాను తిరిగి రాయండి.

“ఒక ఊళ్ళో ఒక లోభి ఉండేవాడు. అతను ఎంతో   కూడబెట్టాడు. ఆ సొమ్ము తాననుభవించడు, ఎవరికీ ధర్మం చేయడు. పుత్తడితో నగలు చేయించుకొని వాటిని చూసుకొని విర్రవీగేవాడు. చదువు నేరిస్తే వివేకం కలుగుతుందని ఎంతమంది చెప్పినా, అజ్ఞానం వల్ల వినలేదు. తుదకు ఆ సంపాదన దొంగలపాలైంది. సత్యాన్ని గ్రహించాడు. చదువు మొదలుపెట్టాడు. అందరూ హర్షించారు.
జవాబు:
ఒక ఊళ్ళో ఒక పిసినారి ఉండేవాడు. అతను ఎంతో డబ్బు కూడబెట్టాడు. ఆ సొమ్ము తాననుభవించడు, ఎవరికీ దానం చేయడు. బంగారంతో నగలు చేయించుకొని వాటిని చూసుకొని గర్వపడేవాడు. చదువు నేరిస్తే విజ్ఞానం కలుగుతుందని ఎంతమంది చెప్పినా అవివేకం వల్ల వినలేదు. చివరకు ఆ సంపాదన దొంగల పాలైంది. యథార్థాన్ని గ్రహించాడు. చదువు మొదలుపెట్టాడు. అందరూ సంతోషించారు.

2. కింది పదాలను మీరు మాట్లాడే భాషలోకి మార్చి రాయండి.
ఉదా : వృక్షంబు – వృక్షము – వృక్షం
అ) వజ్రంబు – వజ్రము – వజ్రం,
ఆ) ప్రాణంబు – ప్రాణము – ప్రాణం
ఇ) సంగంబు – సంగము – సంగం
ఈ) సాధనంబు – సాధనము – సాధనం
ఉ) బంగారంబు – బంగారము – బంగారం

3. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానార్థకాలు రాయండి.
ఉదా : సంపదతో గర్వపడకూడదు. (కలిమి)

అ. సముద్రం మీద ఓడలు ప్రయాణిస్తాయి. (అంభోధి)
ఆ. పున్నమి రాత్రి చంద్రుడు ప్రకాశిస్తాడు. (రేయి)
ఇ. భూమి మీద ఎవరూ శాశ్వతంగా ఉండరు. (ధరణి)
ఈ. వికలాంగులను నిందించగూడదు. (దూషించడం)

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

4. కింది వాక్యాలలోని గీత గీసిన పదాలను చదివి, ఖాళీలలో వాటికీ వ్యతిరేక పదాలు రాయండి.

అ) కలిమిలో గర్వపడకూడదు ………. కుంగిపోకూడదు.
జవాబు:
లేమి

ఆ) సజ్జనులతో స్నేహం చేయాలి. ………. దూరంగా ఉండాలి.
జవాబు:
దుర్జనులకు

ఇ) సత్యాన్ని పలకడం అలవరచుకోవాలి. ……….. అనర్థాలకు దారితీస్తుంది.
జవాబు:
అసత్యం

ఈ) కీర్తి రావాలంటే కష్టపడాలి. ………. మాత్రం అరక్షణంలో వస్తుంది.
జవాబు:
అపకీర్తి

ఉ) ఆకలి, దప్పికా, నిద్రా దరిద్రుడికీ, ………. కీ ఒకేలా ఉంటాయి.
జవాబు:
ధనవంతుడి

ఎ. వ్యతిరేకపదములు

లోభి × వితరణి
గౌరవము × అగౌరవము
మేలు × కీడు
వివేకి × అవివేకి
పరులు × స్వజనులు
ధైర్యము × అధైర్యము
జ్ఞాని × అజ్ఞాని
అనురక్తి × విరక్తి
మొదలు × తుది
వృద్ధి × హాని
పూర్వము × పరము
మిత్రుడు × శత్రువు
వాస్తవము × అవాస్తవము
పేద × ధనికుడు

5. కింది ప్రకృతి పదాలు చదవండి. వాటికి సంబంధించిన వికృతి పదాలు రాయండి.

ప్రకృతి – వికృతి
(అ) పుస్తకం – పొత్తం
(ఆ) సుఖం – సుగము
(ఇ) భూమి – బూమి
(ఈ) ధర్మం – దమ్మము
(ఉ) శ్రీ – సిరి
(ఊ) గౌరవం – గారవము
(ఎ) భృంగారం – బంగారము
(ఏ) ప్రాణం – పానము

బి. ఈ పదాలకు ప్రకృతి – వికృతులు వ్రాయండి.
ప్రకృతి – వికృతి
(అ) వ్యర్థము – వమ్ము
(ఆ) విద్య – విద్దె
(ఇ) భూ – బువి
(ఈ) శాణము – సాన
(ఉ) ఫలము – పండు
(ఊ) పుత్తళి, పుత్తళిక – పుత్తడి
(ఋ) గుణము – గొనము
(ఋ) యశము – అసము
(ఎ) శక్తి – సత్తి
(ఏ) ఛాయ – చాయ
(ఐ) కీర్తి – కీరితి
(ఒ) గర్భము కడుపు
(ఓ) స్వము – సొమ్ము

V. సృజనాత్మకత

1. పాఠంలోని పద్యాలను ఆధారంగా చేసుకొని మంచి సూక్తులను, నినాదాలను తయారుచేయండి. వాటిని ప్రదర్శించండి.
(లేదా)
“మేలిమి ముత్యాలు” పాఠం ఆధారంగా మీకు నచ్చిన నాలుగు సూక్తులను రాయండి.
జవాబు:

  1. “కలిమిగల లోభికంటె వితరణియైన పేద మేలు”.
  2. పుస్తకములను పువ్వుల్లా, చూడు.
  3. సానపెడితేనే వజ్రం. శోభిస్తుంది.
  4. విద్యనేరిస్తే వివేకి అవుతాడు.
  5. పేదవాడి యింట్లో పెళ్ళెనా ఎవరికీ తెలియదు.
  6. పత్రికొకటి యున్న పదివేల సైన్యము.
  7. ప్రజకు రక్షలేదు పత్రికలేకున్న.
  8. సాదుసంగంబు సకలార్థసాధనంబు.
  9. లక్షాధికారైన లవణమన్నమెకాని, మెఱుగు బంగారంబు మింగబోడు.

VI. ప్రశంస

1. ఇతర భాషలలోని మంచి సూక్తులను తెలుసుకోండి. వాటిని గురించి చర్చించండి.
జవాబు:
1) “విభూషణం మౌన .మపండితానామ్” (సంస్కృత సూక్తి) (చదువురాని వారికి మౌనమే అలంకారం)
2) ‘మూర్బస్య నాస్యౌషధమ్’ (సంస్కృత సూక్తి) (మూర్ఖుడికి మందులేదు)
3) ‘విద్యావిహీనః పశుః’ (సంస్కృత సూక్తి) (విద్యరాని వాడు వింత పశువు)

2. కింది పట్టికలోని అంశాలను చదవండి. మీరు చేసేవి, చేయనివి గుర్తించండి.
జవాబు:
అ) నేను ఎవరి దగ్గరయినా పుస్తకం తీసుకొంటే, వెంటనే చదివి తిరిగి ఇస్తాను. (✓)
ఆ) నా తరగతిలో కొద్దిమందితోనే మర్యాదగా ఉంటాను. (✗)
ఇ) నేను డబ్బు ఖర్చుపెట్టకుండా దాచుకుంటాను. (✗)
ఈ) నేను కేవలం మంచివాళ్ళతో మాత్రమే స్నేహం చేస్తాను. (✓)
ఉ) నా పుస్తకాలను నేను జాగ్రత్తగా ఉంచుకొంటాను. (✓)
ఊ) అవయవలోపం ఉన్నవాళ్ళకు నేను సహయం చేస్తాను. (✓)
ఎ) నేను బాగా చదువుకొని గొప్ప కవిలా ఎదుగుతాననే నమ్మకం ఉంది. (✓)

VII. ప్రాజెక్టు పని

1. శతక కవులకు సంబంధించిన విషయాలను సేకరించి కింది పట్టికలో రాయండి.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు 2
AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు 3

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది మాటలను చదవండి. మార్పును గమనించండి.

  1. ఎండవానలు – ఎండా, వానా
  2. తల్లిదండ్రులు – తల్లీ, తండ్రీ
  3. రేయింబవళ్ళు – రేయీ, పగలూ
  4. గంగాయమునలు – గంగా, యమునా

వీటిని “ద్వంద్వ సమాసాలు” అంటారు. ద్వంద్వ సమాసాల్లో రెండూ నామవాచకాలే ఉంటాయని, ఇవి “కలిసినప్పుడు బహువచన రూపం ఏర్పడుతుంది. ఈ విషయాలు మీరు ఆరవ తరగతిలో నేర్చుకున్నారు.

2. కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.
ఉదా : రాముడూ, లక్ష్మణుడూ – రామలక్ష్మణులు
అ) కుజనుడూ, సజ్జనుడూ – కుజనసజ్జనులు
ఆ) కూరా, కాయా – కూరగాయలు
ఇ) అన్నా, తమ్ముడూ – అన్నదమ్ములు
ఈ) కష్టమూ, సుఖమూ – కష్టసుఖములు
ఉ) ,మంచి, చెడూ – మంచిచెడులు

3. క్రింది సమాస పదాలను ఉదాహరణలో చూపిన విధంగా వివరించండి.
ఉదా : నవరసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
ఊ) రెండు జడలు – రెండు (2) సంఖ్యకల జడలు
ఎ) నాలుగు వేదాలు – నాలుగు (4), సంఖ్యకల వేదాలు
ఏ) దశావతారాలు – దశ (10) సంఖ్యకల అవతారాలు
ఐ) చతుషష్టి కళలు – చతుషష్టి (64) సంఖ్యగల కళలు
ఒ) ఏడు రోజులు – ఏడు (7) సంఖ్యగల రోజులు

గమనిక :
పైన పేర్కొన్న సమాసాల్లో మొదటి (పూర్వ) పదంలో, ‘సంఖ్య’ ఉండటాన్ని గమనించారు కదా. ఇలా సమాసంలో మొదటి పదం సంఖ్యావాచకంగాను, రెండవ పదం నామవాచకం ఉంటే దానిని సంఖ్యగల సమాసాన్ని, ‘ద్విగు సమాసం’ అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

4. కింద పేర్కొన్న సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి. కారణాలు చర్చించండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాస నామం
అ) అక్కాచెల్లెళ్ళు అక్కా చెల్లెలు ద్వంద్వ సమాసం
ఆ) పంచపాండవులు పంచ(5) సంఖ్యగల పాండవులు ద్విగు సమాసం
ఇ) రాబర్ట్ రహీమ్ లు రాబర్టూ, రహీమూ ద్వంద్వ సమాసం
ఈ) త్రిమూర్తులు త్రి (3) సంఖ్యగల మూర్తులు ద్విగు సమాసం
ఉ) వందపరుగులు వంద (100) సంఖ్యగల పరుగులు ద్విగు సమాసం
ఊ) సూర్యచంద్రులు సూర్యుడూ, చంద్రుడూ ద్వంద్వ సమాసం
అవయవ హీనుడు అవయవముల చేత హీనుడు తృతీయా తత్పురుష సమాసం
సౌందర్య విహీనుడు సౌందర్యం చేత విహీనుడు తృతీయా తత్పురుష సమాసం
సభాంతరాళము సభ యొక్క అంతరాళము షష్ఠీ తత్పురుష సమాసం
సాధు సంగము సాధువుల యొక్క సంగము షష్ఠీ తత్పురుష సమాసం
తల్లి గర్భము తల్లి యొక్క గర్భము షష్ఠీ తత్పురుష సమాసం
లక్షాధికారి లక్షలకు అధికారి షష్ఠీ తత్పురుష సమాసం
వాక్చతురత్వము వాక్కు నందు చతురత్వము సప్తమీ తత్పురుష సమాసం
కుజన సజ్జనులు కుజనుడూ, సజ్జనుడూ ద్వంద్వ సమాసం
దానధర్మములు దానమూ, ధర్మమూ ద్వంద్వ సమాసం

గమనిక :
ఎ) 1, 4, 5, 10 ప్రశ్నలలోని సమాసాలలో రెండు పదాలూ నామవాచకములు, అవి కలసి బహువచన రూపాలు ఏర్పడ్డాయి. కాన అవి ద్వంద్వ సమాసాలు.

బి) 2, 3, 6, 7, 8, ‘9, ప్రశ్నలలోని సమాసాలలో మొదటి పదంలో సంఖ్య ఉంది. అందువల్ల అవి ‘ద్విగు సమాసాలు’

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

5. కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.

1. బాధైనను = బాధ + ఐనను = (అ + ఐ = ఇ) – అకారసంధి
2. పత్రికొకటి = పత్రిక + ఒకటి = (అ + ఒ = ఒ) – అకారసంధి
3. పెండ్లి = పెండ్లి + ఐన = (ఇ + ఐ = ఐ) – ఇకారసంధి
4. జుంటీగ = జుంటి + ఈగ = (ఇ + ఈ = ఈ) – ఇకారసంధి
5. తెచ్చితివేని = తెచ్చితివి + ఏని = (ఇ + ఏ = ఏ) – ఇకారసంధి
6. వారకెక్కు = వార్తకు + ఎక్కు = (ఉ + ఎ = ఎ) – ఉకారసంధి
7. జనితమైన = జనితము + ఐన = (ఉ + ఐ + ఐ) – ఉకారసంధి
8. గౌరవమొసంగు = గౌరవము + ఒసంగు = (ఉ + ఒ = ఒ) – ఉకారసంధి
9. కలుషమడచు = కలుషము + అడచు = (ఉ + అ = అ) – ఉకారసంధి
10. దొంగలకిత్తురు = దొంగలకు + ఇత్తురు = (ఉ + ఇ = ఇ) – ఉకారసంధి
11. పూవువోలె = పూవు + పోలె – గసడదవాదేశ సంధి
12. పుత్తడిగలవాని – పుత్తడి + కలవాని – గసడదవాదేశసంధి
13. కూడఁబెట్టూ = కూడన్ + పెట్టు – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
14. చింపఁబోకు = చింపన్ + పోకు – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
15. చేయఁబోకు = చేయన్ + పోకు – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
16. సానఁబెట్టిన = సానన్ + పెట్టిన – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
17. విస్ఫూర్తిఁజేయు = విస్ఫూర్తిన్ + చేయు – సరళాదేశసంధి (లేక) ద్రుతప్రకృతిక సంధి
18. విశ్వదాభిరామ = విశ్వద + అభిరామ = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
19. సభాంతరాళము = సభా + అంతరాళము = (ఆ + అ = అ) – సవర్ణదీర్ఘ సంధి
20. సజ్జనాళి = సజ్జన + ఆళి = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
21. లక్షాధికారి = లక్ష + అధికారి = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
22. సకలార్థములు = సకల + అర్థములు = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి

కవి పరిచయాలు

కవి కాలం రచన
1. గువ్వల చెన్నడు 16వ శతాబ్ది గువ్వల చెన్న శతకం
2. పక్కి అప్పల నర్సయ్య 16వ శతాబ్ది కుమార శతకం
3.  నార్ల చిరంజీవి 20వ శతాబ్ది తెలుగుపూలు శతకం
4. అజ్ఞాత కవి
5. వేమన 17వ శతాబ్ది వేమన శతకం
6. నార్ల వెంకటేశ్వరరావు 20వ శతాబ్ది నార్లవారి మాట
7. ఏనుగు లక్ష్మణకవి 17వ శతాబ్ది సుభాషిత రత్నావళి
8. శేషప్పకవి 18వ శతాబ్ది నరసింహ శతకం

కొత్త పదాలు-అర్గాలు

అంతరాళము = నడిమిచోటు
అంభోధి = సముద్రం
అడచు = అణచు
అనురక్తి = ఇష్టం
అవని = భూమి
ఆజి = యుద్ధం
ఆది = మొదలు
ఈను = బయలు పటచు
ఎరవు = అప్పు
కలిమి = సంపద
కలుషము = మురికి, పాపం
కుఱుచ = పొట్టి
కుజనుడు = చెడ్డవాడు
గర్భం = పొట్ట, కడుపు
చెలమ = ఎండిపోయిన ఏరు మొదలగు వాటిలో నీటి కోసం చేసిన గొయ్యి
ఛాయ = నీడ
జుంటీగలు = తేనెటీగలు
తాల్మి = ఓర్పు
తెరువరులు = బాటసారులు
దురితము = పాపం
ధీజడిమ = బుద్ధిమాంద్యం
పుత్తడి = బంగారం
ప్రకృతి సిద్ధము = సహజ సిద్ధం
పరులు = ఇతరులు
భూపసభ = రాజసభ
భూషణములు = ఆభరణాలు
భూమి = భూలోకము
బుధులు = పండితులు
పిదప = తరువాత
మిత్రకోటి = కోటి మంది స్నేహితులు
మైత్రి = స్నేహం
మేలు = మంచి, ఉపకారం
మఱుగు = దాపరికం
యశము = కీర్తి
లవణము = ఉప్పు
వాస్తవము = నిజం
వితరణి = దానశీలి
విత్తము = ధనము
విస్ఫూర్తి = మిక్కిలి తెలివి
లోభి = పిసినారి
వివేకి = విచారణ చేయువాడు
వసుధ = భూమి
వాక్చతురత్వము = మాటనేర్పు
వారకెక్కు = ప్రచారాన్ని పొందు
వాంఛ = కోరిక
శ్రుతులు = వేదాలు
సజ్జనులు = మంచివారు
సాధుసంగము = మంచివారితో స్నేహము
సంస్తవనీయుడు = పొగడదగిన వాడు
సాన = సానరాయి (పదను పెట్టే రాయి, గంధం తీసే రాయి)
సత్యసూక్తి = మంచి మాట
సొమ్ము = ధనము

పద్యాలు – ప్రతి పదార్థాలు – భావాలు

1వ పద్యం : కంఠస్థ పద్యం

* క. కలిమిగల లోభికన్నను
విలసితముగఁ బేద మేలు వితరణి యైనన్
చలిచెలమ మేలు కాదా అని
కులనిధి యంభోధికన్న గువ్వలచెన్నా! – గువ్వల చెన్న శతకం
ప్రతిపదార్థం :
గువ్వల చెన్నా! = ఓ గువ్వల చెన్నా !
కలిమి = సంపద
కల = కలిగిన
లోభి కన్నను = పిసినారివాడి కంటె
వితరణియైనన్ వితరణి + ఐనన్ = దాత అయితే (దానము చేసేవాడు అయితే)
విలసితముగ = ఒప్పుగా
పేద = బీదవాడు
మేలు = మంచిది
కులనిధి = అంతులేని జలరాశిగల
అంభోధి కన్నన్ = సముద్రము కంటె
చలి = చల్లని
చెలమ = ఎండిపోయిన ఏఱు మొదలయిన వాటిలో నీటి కోసం చేసిన నీటి గొయ్యి.
మేలు కాదా ! = మంచిదే కదా !

భావము :
ఓ గువ్వల చెన్నా ! ధనికుడైన పిసినారి కంటె, దానగుణము ఉన్న పేదవాడే మంచివాడు. అంతులేని జలరాశి గల సముద్రుడి కంటె, మంచి నీరు ఉన్న గొయ్యి మేలు కదా !

2వ పద్యం : కంఠస్థ పద్యం

* క. అవయవహీనుని, సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరానియతని, సం
స్తవనీయు, దేవు, శ్రుతులన్
భువి నిందింపఁ దగదండ్రు బుధులు కుమారా ! – కుమార శతకం
ప్రతిపదార్థం :
కుమారా ! = ఓ కుమారా !
అవయవ హీనునిన్ = అవయవ లోపం ఉన్న వాడినీ
సౌందర్య విహీనునిన్ = అందము లేని వాడినీ
దరిద్రున్ = పేదవాడినీ
విద్యరాని + అతనిన్ = చదువురాని నిరక్షరాస్యునీ,
సంస్తవనీయున్ = కొనియాడదగిన వాడినీ (గొప్పవాడినీ)
దేవున్ = దేవుడినీ
శ్రుతులన్ = వేదాలనూ
భువిన్ = భూలోకంలో
బుధులు = పండితులు
నిందింపన్ = నిందించడం
తగదు + అండ్రు = తగదని చెపుతారు.

భావము :
కుమారా ! భూమిపైన అవయవలోపం ఉన్నవారినీ, అందంగా లేనివారినీ, పేదవారినీ, చదువురాని వారినీ, గొప్పవారినీ, దైవాన్నీ, వేదాలనూ నిందించరాదని పెద్దలు చెబుతారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

3వ పద్యం : – కంఠస్థ పద్యం

* ఆ. పుస్తకముల ‘నీవు పూవువలెను జూడు
చింపఁబోకు-మురికి చేయఁబోకు
పరుల పుస్తకముల నెరవు తెచ్చితి వేని
తిరిగి యిమ్ము వేగ, తెలుఁగు బిడ్డ ! – తెలుగుపూలు శతకం
ప్రతిపదార్థం :
తెలుగు బిడ్డ = ఓ తెలుగు బాలుడా!
పుస్తకములన్ = పుస్తకాలను
నీవు = నీవు
పూవు వలెను = పువ్వువలె (జాగ్రత్తగా)
చూడు = చూడు
చింపఁబోకు (చింపన్ + పోకు) = వాటిని చింపవద్దు
మురికి = మురికి
చేయఁబోకు (చేయన్+పోకు) = చేయవద్దు (పాడు చేయ వద్దు)
పరుల = ఇతరుల యొక్క
పుస్తకములన్ = పుస్తకములను
ఎరవు = కొంత కాలం వాడుకొని తిరిగి ఇచ్చే పద్దతిలో
తెచ్చితివి + ఏని = తీసుకువస్తే
వేగ = వేగంగా (తొందరగా)
తిరిగి + ఇమ్ము = వాటిని తిరిగి వారికి ఇచ్చి వెయ్యి.

భావము :
ఓ తెలుగు బిడ్డా ! పుస్తకాలను పువ్వుల్లా జాగ్రత్తగా చూడు. వాటిని చింపవద్దు. మురికి చేయవద్దు. ఇతరుల పుస్తకాలు అడిగి తెచ్చుకుంటే, వాటిని త్వరగా ఇచ్చి వేయాలి.

4వ పద్యం : కంఠస్థ పద్యం

* తే. సానఁబెట్టిన వజ్రంబు లీను కాంతి
పొలము జక్కగ దున్నిన ఫలమునిచ్చు
నటులె యజ్ఞానియైనను నవనిపైని
విద్య నేర్చినయేని వివేకియగును. – అజ్ఞాత కవి
ప్రతిపదార్థం :
సానఁబెట్టినన్ (సానన్ + పెట్టినన్) = సాన మీద అరగదీస్తే
వజ్రంబులు = వజ్రాలు
కాంతి = కాంతిని
వేమ = ఓ వేమనా ఈను = వెదజల్లుతాయి (బయలు పరుస్తాయి)
చక్కగన్ = బాగుగా
దున్నినన్ = (నాగలితో) దున్నినట్లయితే
పొలము = పొలము
ఫలమున్ = పంటను
ఇచ్చున్ = ఇస్తుంది.
అటులె (అటులు + ఎ) = అలాగే
అవనిపైని = భూమి మీద
అజ్ఞాని + ఐనను = జ్ఞానము లేని వాడయినా
విద్యన్ = విద్యను
నేర్చిన + ఏనిన్ = నేర్చుకుంటే
వివేకి = వివేకముగలవాడు (మంచి చెడులు తెలిసికొనే తెలివి కలవాడు)
అగును = అవుతాడు.

భావము :
సాన పెడితేనే వజ్రాలు కాంతిని వెద జల్లుతాయి. చక్కగా దున్నితేనే పొలం పంటను ఇస్తుంది. అలాగే భూమి మీద ఎంత అజ్ఞాని అయినా సరే, చదువుకొంటే వివేకి అవుతాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

5వ పద్యం : – కంఠస్థ పద్యం

* ఆ. పుత్తడిగలవాని పుండుబాధైనను
వసుధలోన చాల వారకెక్కు
పేదవాని యింట పెండైన యెరుగరు
విశ్వదాభిరామ ! వినుర వేమ! – వేమన పద్యం
ప్రతిపదార్థం :
విశ్వదా = ఓ విశ్వదా
అభిరామ = ఓ అభిరాముడు అనే శిష్యుడా
వినుర = వినుము
పుత్తడి = బంగారము (ధనము)
కలవాని = ఉన్నవాడి యొక్క
పుండు = చిన్న కురుపు
బాధైనను బాధ + ఐనను = నొప్పి పెడితే
వసుధలోన = భూమిలో (లోకంలో అది)
చాల = మిక్కిలి
వార్తకెక్కు (వార్తకు + ఎక్కు) = పెద్దగా ప్రచారం అవుతుంది
పేదవాని = బీదవాడి
ఇంటన్ = ఇంటిలో
పెండ్లైన = పెండ్లి + ఐన = పెళ్ళి జరిగినా కూడా
ఎరుగరు = ఎవరికీ తెలియదు.

భావము :
ఓ వేమనా ! భూమి మీద ధనవంతుడు చిన్న కురుపుతో బాధపడినా. కూడా పెద్దగా ప్రచారం అవుతుంది. కాని పేదవాడి ఇంట్లో పెళ్ళి జరిగినా కూడా, ఎవరికీ తెలియదు.

6వ పద్యం : – కంఠస్థ పద్యం

* ఉ. ఆపదలందు ధైర్యగుణ, మంచిత సంపదలందుఁ దాల్మియున్,
భూపసభాంతరాళమునఁ బుష్కలవాక్చతురత్వ, మాజి బా
హాపటుశక్తియున్, యశమునం దనురక్తియు, విద్యయందు వాం
ఛాపరివృద్ధియున్, బ్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ – సుభాషిత రత్నావళి
ప్రతిపదార్థం :
ఆపదలంధున్ = ఆపదలు వచ్చినప్పుడు
ధైర్యగుణము = ధైర్యము కలిగియుండుటయును;
అంచిత = చక్కని
సంపదలందున్ = సంపదలు కలిగినపుడు;
తాల్మియున్ = ఓర్పు కలిగియుండుటయును;
భూప సభా = రాజసభ యొక్క
అంతరాళమునన్ = మధ్యలో
పుష్కల = సంపూర్ణమైన
వాక్చతురత్వము = మాటనేర్పునూ
ఆజిన్ = యుద్ధంలో
బాహా = బాహువులయందు
పటు = సమర్ధమైన
శక్తియున్ = శక్తియునూ
యశమునందున్ = కీర్తిని సంపాదించుట యందు;
అనురక్తియున్ = ఆసక్తియూ
విద్యయందున్ = చదువునందు
వాంఛా = కోరిక యొక్క
పరివృద్ధియున్ = అభివృద్ధియును (అధికమగు కోరికయూ)
సజ్జనాళికిన్ (సజ్జన+ఆళికిన్) = సత్పురుషుల సమూహమునకు
ప్రకృతి సిద్ధ = సహజ సిద్ధమైన
గుణంబులు = గుణములు

భావము :
ఆపదలు వచ్చినప్పుడు ధైర్యం, ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్పు, సభల్లో వాక్పాటవం, యుద్ధంలో శౌర్యం చూపడం, కీర్తిమీద ఆసక్తి, విద్య నేర్చుకోవాలనే కోరిక – ఇవి ఉత్తములకు సహజ గుణాలు.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

7వ పద్యం : -కంఠస్థ పద్యం

* ఆ. పత్రికొకటియున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్రకోటి
మైత్రి ప్రజకు రక్షలేదు పత్రికలేకున్న
వాస్తవమ్ము నార్లవారి మాట – నార్లవారి మాట
ప్రతిపదార్థం :
పత్రిక = వార్తాపత్రిక
ఒకటి + ఉన్న = ఒక్కటి ఉంటే
పదివేల = పదివేల మంది
సైన్యము = సైన్యముతో సమానము
పత్రిక = వార్తాపత్రిక
ఒక్కటి + ఉన్నన్ = ఒకటి ఉంటే
మిత్రకోటి = కోటి మంది మిత్రులతో సమానం
పత్రిక = పత్రిక
లేక + ఉన్నన్ = లేకపోతే
ప్రజకు = ప్రజలకు
రక్షలేదు = రక్షణ ఉండదు
నార్లవారిమాట = నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పిన ఈ మాట
వాస్తవమ్ము = నిజము

భావము :
ఒక పత్రిక వేలాది సైన్యంతో, సమానం; ఎంతోమంది, మిత్రులతో సమానం. పత్రిక లేకపోతే ప్రజలకు రక్షణ ఉండదు. సమాజంలోని మంచి, చెడులను భయంలేకుండా పత్రికలు తెలియజేస్తాయి. అందువల్ల
సమాజంలో పత్రికలు ఉండాలి

8వ పద్యం : – కంఠస్థ పద్యం

* తే. మొదలఁ జూచినఁ గడు గొప్ప పిదపఁ గుఱుచ
యాది గొంచెము తర్వాత నధికమగుచుఁ
దనరు, దినపూర్వ, పరభాగజనితమైన
ఛాయపోలికఁ గుజనసజ్జనుల మైత్రి. – సుభాషిత రత్నావళి
ప్రతిపదార్థం :
దినపూర్వ = ఉదయం పూట
పరభాగ = సాయంత్రము వేళ
జనితము + ఐన = పుట్టిన
ఛాయపోలికన్ = నీడవలె
కుజన త = చెడ్డవారి యొక్క
మైత్రి = స్నేహము
మొదలన్ = మొదట.
చూచినన్ = చూస్తే
కడుగొప్ప = చాలా గొప్పగా ఉంటుంది
పిదపన్ = తరువాత
కుఱుచ = చిన్నదిగా ఉంటుంది
సజ్జనమైత్రి = మంచివారితో స్నేహము
ఆది = మొదట
కొంచెము = తక్కువగానూ
తర్వాతన్ = రాను రాను
అధికము + అగుచున్ = ఎక్కువ అవుతూ
తనరు = ఒప్పుతుంది.

భావము :
చెడ్డవాళ్ళ స్నేహం ఉదయం పూట నీడలాగ, మొదట ఎక్కువగా ఉండి క్రమక్రమంగా తగ్గిపోతుంది. మంచివాళ్ళ స్నేహం సాయంకాలం నీడలాగ మొదట చిన్నదిగా ఉండి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. బుద్ధిమంతుడు ఈ రెంటిలో ఏది మంచిదో తెలిసికోవాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 4 మేలిమి ముత్యాలు

9వ పద్యం : – కంఠస్థ పద్యం

* తే. సత్యసూక్తి ఘటించు ‘ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు జనులకు గలుషమడఁచు
గీర్తిఁ బ్రకటించు చిత్తవిస్ఫూర్తిఁ జేయు
సాధుసంగంబు సకలార్థ సాధకంబు. – సుభాషిత రత్నావళి
ప్రతిపదార్థం :
సాధు సంగంబు = మంచివాళ్ళతో స్నేహం
జనులకున్ = మనుష్యులకు
సత్యసూక్తిన్ = సత్యమైన మంచిమాటను
ఘటించున్ = చేకూరుస్తుంది (సత్యాన్ని మాట్లాడిస్తుంది)
ధీజడిమన్ = బుద్ధిమాంద్యమును
మాన్చున్ = పోగొడుతుంది
గౌరవము = గౌరవమును
ఒసంగున్ = ఇస్తుంది
కలుషము = పాపాలను
అడచున్ = పోగొడుతుంది
కీర్తిన్ = కీరిని
ప్రకటించున్ = వ్యాపింపజేస్తుంది
చిత్త = మనస్సు, యొక్క
విస్ఫూర్తిన్ = ప్రకాశాన్ని
చేయున్ = చేస్తుంది
సకల + అర్థ సాధకంబు = సమస్తమైన కార్యాలను సాధిస్తుంది

భావము :
మంచి వారితో స్నేహం అన్ని కార్యాలనూ సాధిస్తుంది. సత్యాన్ని మాట్లాడేలా చేస్తుంది. మందకొడి తనాన్ని పోగొడుతుంది. గౌరవాన్ని ఇస్తుంది. పాపాలను పోగొడుతుంది. మనస్సును బాగుచేస్తుంది. కీర్తిని వ్యాపింప జేస్తుంది. లోకంలో అది చేయలేని మంచిపని అంటూ ఉండదు.

10వ పద్యం : – కంఠస్థ పద్యం

*సీ. తల్లిగర్భమునుండి ధనము తేడెవ్వఁడు,
వెళ్ళిపోయెడినాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగఁ బోడు
విత్తమార్జన చేసి విజ్ఞవీగుటె కాని,
కూడఁ బెట్టిన సొమ్ముఁ గుడువఁ బోడు
పొందుగా మఱుగైన భూమిలోపల పెట్టి
దానధర్మము లేక దాచి దాచి

తే. తుదకు దొంగలకిత్తురో ? దొరలకవునో ?
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు ?
భూషణ వికాస ! శ్రీ ధర్మపుర నివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురిత దూర ! – నరసింహ శతకం
ప్రతిపదార్థం :
శ్రీ ధర్మపుర నివాస = సంపదలను ఇచ్చే, ధర్మపురం నందు నివసించువాడా!
భూషణ, వికాస = అలంకారములచే, ప్రకాశించేవాడా!
దుష్టసంహార = పాపులను సంహరించువాడా!
దురిత దూర = పాపాలను దూరం చేసేవాడా !
తల్లిగర్భము నుండి = తల్లి కడుపు నుండి పుట్టేటప్పుడు
ధనము = ధనాన్ని
ఎవ్వడు = ఎవడూ
తేడు = తన వెంట తీసుకురాడు
వెళ్ళిపోయెడినాడు = ఈ లోకాన్నుండి వెళ్ళిపోయే మరణ సమయములో
వెంటరాదు = ఆ ధనము అతనికి తోడుగా రాదు
లక్షాధికారి + ఐనన్ = లక్షలు సంపాదించినవాడైన
లవణము + అన్నమె కాని = ఉప్పు, అన్నమే కాని
మెఱుగు బంగారంబు = పదునాఱు వన్నె బంగారాన్ని
మ్రింగబోడు = తినడు
విత్తము + ఆర్జన చేసి = ధనమును సంపాదించి
విఱ్ఱవీగుటె కాని = గర్వంగా ఉండడమే కాని
కూడబెట్టిన సొమ్ము = దాచిన ధనము
కుడువన్ + పోడు = తినడు
పొందుగా = బాగుగా
మఱుగు + ఐన = చాటైన
భూమిలోపలన్ + పెట్టి = భూమి యందు ఉంచి
దానధర్మము లేక = దాన ధర్మాలు చేయకుండా
దాచిదాచి = ఆ ధనమును దాచి
తుదకున్ = చివరకు
దొంగలకు = దొంగవాళ్ళకు
ఇత్తురో = ఇస్తారో
దొరలకున్ = ప్రభువులకు
అవును + ఒ = సంక్రమిస్తుందో (చట్టం ప్రకారంగా భూమిలో దాచిన సొమ్ములు సర్కారుకు చేరతాయి)
జుంటీగలు = తేనెటీగలు
తేనెన్ = తేనెను
తెరువరులకున్ = బాటసారులకు (దారిని పోయేవారికి)
ఇయ్యవా = ఇస్తాయికదా !

భావము :
శ్రీ ధర్మపురి నివాసుడా ! దుష్ట సంహార ! నరసింహా ! పాపాలను దూరం చేసేవాడా ! ఆభరణాలచే ప్రకాశించేవాడా! తల్లి కడుపులో నుండి పుట్టినప్పుడు, ఎవ్వడూ ధనాన్ని తన వెంట తీసుకొని రాడు. పోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళలేడు. లక్షాధికారైనా, ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని, బంగారాన్ని తినలేడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవడమే కాని, తాను దాచిన సొమ్మును తాను తినడు. ఆ సొమ్మును దానధర్మాలు చేయకుండా, భూమిలో పాతి పెడుతూ ఉంటాడు. చివరకు అతడు దాన్ని అనుభవించకుండానే, తేనెటీగలు తేనెను బాటసారులకు సమర్పించుకొన్నట్లు, దొంగలకో, రాజులకో సమర్పించు కుంటాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 3 ఆనందం (కథ)

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 3rd Lesson ఆనందం (కథ) Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 3rd Lesson ఆనందం (కథ)

7th Class Telugu 3rd Lesson ఆనందం (కథ) Textbook Questions and Answers

ఇవి చేయండి

ప్రశ్న 1.
‘ఆనందం’ కథ ఎలా ఉంది ? దీన్ని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
‘ఆనందం’ కథ చక్కగా ఉంది. విద్యార్థులు, బడులకు సెలవులు ఇచ్చే రోజులలో వ్యర్థంగా వారు కాలాన్ని గడపరాదని, సంఘానికి మేలు కల్గించే మంచి పనులు ఆ రోజుల్లో విద్యార్థులు చేయాలని, ఈ కథ సూచిస్తుంది. ఈనాడు సమాజంలో ముసలివారు ఎక్కువగా ఉన్నారు. వారంతా ఒకనాడు సంఘానికి ఎంతో సేవ చేసినవారే. అటువంటి ముసలివారికి సంతోషం కల్గించే ఒక నాటకం ప్రదర్శించడం, వారికి వృద్ధాశ్రమాలలో కాలక్షేపానికి రేడియో, టేప్ రికార్డరు ఇవ్వడం, అన్నవి మంచి ఆదర్శనీయమైన విషయములని, నా అభిప్రాయము.

ప్రశ్న 2.
సెలవులలో సుశీల్, సునీత, సాగర్లు నాటకం వేశారు కదా ! మరి మీరు సెలవులలో ఏమేం చేస్తారు?
జవాబు:
నేను సెలవులలో మా గ్రామంలో మిత్రులతో కలసి ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాన్ని చేపడతాను. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవలసిన అవసరాన్ని గురించి మిత్రులతో కలసి ప్రచారం చేస్తాను. నీరు – చెట్టు ఆవశ్యకతను గూర్చి గ్రామంలో ప్రచారం చేస్తాను. దసరా సెలవుల్లో రోడ్ల వెంబడి మొక్కలు నాటుతాను. వేసవి సెలవుల్లో స్నేహితులతో – కలిసి మా గ్రామంలో ఇంకుడు గుంతలు తవ్వుతాను. మా ఊరి చెరువును శుభ్రం చేస్తాను.

AP Board 7th Class Telugu Solutions Chapter 3 ఆనందం (కథ)

ప్రశ్న 3.
సుశీల్, సాగర్, సునీత నాటకం వేసి, దాని ద్వారా డబ్బు పోగుచేసి, వృద్ధులకు సహాయపడ్డారు కదా ! అట్లాగే ఏ – ఏ మంచి పనులు ఎవరెవరి కోసం చేయవచ్చు?
జవాబు:

  1. గ్రామాలలో, నగరాలలో పరిశుభ్రత యొక్క అవసరాన్ని గూర్చి ప్రచారం చేయవచ్చు.
  2. పోలియో చుక్కలు పిల్లలకు వేయించవలసిన అవసరాన్ని గురించి, హెపటైటిస్ ఎ, బి ఇంజక్షన్లు అందరూ చేయించుకోవాల్సిన అవసరాన్ని గూర్చి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయవచ్చు.
  3. గ్రామాలలో మంచినీటి వసతులను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని గూర్చి, ‘చెట్టు – నీరు’ యొక్క ఆవశ్యకతను గూర్చి, ప్రచారం చేయవచ్చు.
  4. గ్రామాలలో చందాలు వసూలు చేసి గ్రామానికి ఉపయోగించే కార్యక్రమాలను చేపట్టవచ్చు.
  5. గ్రామంలో గుడి, బడి, ఆరోగ్య కేంద్రాలను బాగుచేయించవచ్చు.

ప్రశ్న 4.
ఈ కథలో మీకు బాగా నచ్చిన సంఘటన ఏది? ఎందుకు?
జవాబు:
ఒకనాడు సంఘం యొక! అభివృద్ధికి ఎంతో సేవ చేసిన వ్యక్తులు నేడు. ముసలివారై పోయారు. ఈ రోజుల్లో ముసలివారైన తల్లిదండ్రులను వారి పిల్లలు సహితం పట్టించుకోవడం లేదు. అటువంటి రోజుల్లో, గ్రామంలోని ‘ పిల్లలు అంతా, వృద్ధాశ్రమంలోని ముసలివారికి సంతోషం కోసం, రేడియో, టేప్ రికార్డర్లు ఇవ్వడం, వారికి నవ్వు తెప్పించే నాటకాన్ని తాము ప్రదర్శించడం నాకు బాగా నచ్చాయి. పిల్లలు వృద్ధాశ్రమంలోని . పెద్దలకు పూలగుత్తులిచ్చి, అభినందించి, వారి ఆనందానికి నాటకాన్ని ప్రదర్శించినందుకు, నాకు ఈ కథ బాగా నచ్చింది.

ప్రశ్న 5.
ఈ (ఆనందం) కథను మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
సుశీల్, సునీత, సాగర్‌లకు సెలవులు ఇచ్చారు. సెలవుల్లో ఏమి చేయాలో వారికి తోచలేదు. వాళ్ళు ముగ్గురూ తోటలోకి వెళ్ళి పూలు కోసి పూలగుత్తులు తయారుచేశారు. వాళ్ళకు దగ్గరలో ముసలివాళ్ళు ఉండే వృద్ధాశ్రమం ఉంది. వాళ్ళు వృద్ధాశ్రమానికి వెళ్ళి, ఆ పూలగుత్తులను ముసలివారికి ఇచ్చారు. వాళ్ళు సంతోషించారు. అక్కడి – ముసలివారికి కాలక్షేపానికి టీవీ కానీ, రేడియో కానీ కొని ఇద్దామని ఆ పిల్లలు అనుకున్నారు.

వాళ్ళ దగ్గర రేడియో కొనడానికి సరిపడ డబ్బు లేదు. చివరకు స్కూలు నాటకాల్లో వారు నటించిన అనుభవంతో, ఒక నాటక ప్రదర్శన ఇస్తే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. పక్క వారి నుండి కూడా కొంత డబ్బు వసూలు చేద్దామనుకున్నారు. నాటక ప్రదర్శనను “ఛారిటీ షో”లా చేద్దామనుకున్నారు.

సుశీల్ కు నితిన్ అనే స్నేహితుడు ఉన్నాడు. వారు ‘గుశ్వం’ అనే హాస్య నాటికను ప్రదర్శన చేద్దామని సంభాషణలు రాసుకొని, రిహార్సల్సు చేశారు. ఒక రోజున వృద్ధాశ్రమంలో ఆ నాటకాన్ని ప్రదర్శించారు. అక్కడి వృద్ధులు ఆ నాటకం చూసి సంతోషించారు. అందరూ ఇచ్చిన డబ్బు రూ. 800తో, ఒక రేడియో, టేప్ రికార్డర్ కొని, వృద్ధాశ్రమానికి ‘వారు ఇచ్చారు. ఆ పిల్లలు సెలవులను అద్భుతంగా గడిపారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 3 ఆనందం (కథ)

ప్రశ్న 6.
సుశీల్, సాగర్, సునీతల స్థానంలో మీరే ఉంటే, మీ మిత్రులతో కలిసి వృద్ధాశ్రమానికి ఎలా సాయపడతారు? ఆలోచించి రాయండి.
జవాబు:
నేను, మా మిత్రులతో కలసి మా నగరంలోని ప్రతి ఇంటికీ వెళ్ళి, చందాలు వసూలు చేసి, ఆ డబ్బుతో వృద్ధాశ్రమంలోని ముసలివారికి కొన్ని మంచి పుస్తకాలు కొని ఇస్తాను. రామాయణం, భారతం, భాగవతం, కొని ఇస్తాను. వారికి కాలక్షేపానికి ఒక టీవీ, టేప్ రికార్డర్ కొని ఇస్తాను.

మా మిత్రులకు నాటికలలో నటించడం, బుర్రకథ చెప్పడం అలవాటు ఉంది. మేము వృద్ధాశ్రమంలో ఒక ఛారిటీ షో ఏర్పాటుచేసి, దానిలో నటిస్తాము. మాకు సినిమా పాటలు పాడడం బాగా వచ్చు. మేము మ్యూజికల్ నైట్ (Musical Night) ఏర్పాటుచేసి మా గ్రామస్థులందరినీ పిలుస్తాము. తల్లిదండ్రులు దేవుళ్ళవంటివారని, వారిని వృద్ధాశ్రమాల్లో ఉంచడం మంచిది కాదని, తమ ఇంట్లోనే ఉంచుకోవాలని ప్రచారం చేస్తాము.

కఠిన పదములకు అర్థములు

సాహసోపేతం (సాహస + ఉపేతం) = సాహసంతో కూడినది
సాహసము = చేయడానికి శక్యం కాని పని చేయడానికి ఉత్సాహం
దిండు తొడుగులు = తలగడ గలేబులు
కుషన్లు (Cushions) = కూర్చుండే మెత్తటి దిండ్లు
లాన్లు (Lawns) = పచ్చిక బయళ్ళు
వంటకాలు – అన్నము మొదలయిన తినే పదార్థాలు
తాజాగా = సరికొత్తదిగా
కళకళలాడుతూ = మంచి ప్రకాశవంతంగా
వృద్ధాశ్రమం (వృద్ధ + ఆశ్రమం) = ముసలివారు ఉండే ఆశ్రమం
ఒంటరిగా = ఏకాకిగా (ఒక్కడూ)
కృతజ్ఞతలు = ధన్యవాదములు
దైవప్రార్థన = దేవుడిని ప్రార్థించడం
గొడవ = అల్లరి
ప్రదర్శన = చూపించడం (నాటకం వేయడం)
స్టేజి (Stage) = రంగము, నాటకశాల
ఛారిటీ షో (Charity show) = ఒక మంచి పనికి సహాయ పడటానికి ధనం కొరకు ఇచ్చే ప్రదర్శన
తుళ్ళుతూ = ఉప్పొంగుతూ

AP Board 7th Class Telugu Solutions Chapter 3 ఆనందం (కథ)

ప్రింట్ చేద్దాం (Print చేయు) = అచ్చు వేద్దాం
విరాళం = ధర్మకార్యాలు చేయడానికి సంతోషంతో ఇచ్చే ధనము
సంభాషణలు = మాటలు (నాటకంలో పాత్రధారుల మాటలు)
సేకరించారు = కూడబెట్టారు (పోగు చేశారు)
రిహార్సల్సు (Rehearsals) = నాటకాన్ని జనం ముందు ఆడడానికి ముందు, వేరుగా ఆడి చూసుకోడాలు)
దర్శకత్వం (Direction) = నాటకంలో ఎలా నటించాలో మార్గం చెప్పడం
ఆహ్వానించాలి = పిలవాలి
అనుమతి = సమ్మతి (అంగీకారము)
ఉత్కంఠతో = ఇష్ట వస్తువును పొందడానికి పడే తొందరతో
కర్టెన్ (Curtain) = తెర
బ్రహ్మాండంగా = చాలా గొప్పగా
అద్భుతంగా = ఆశ్చర్యకరంగా
అభినందించారు = ప్రశంసించారు
హాస్య సన్నివేశాలు = నవ్వు తెప్పించే ఘట్టములు
టేప్ రికార్డరు = రికార్డు చేసిన పాటలను తిరిగి వినిపించే యంత్రము
వృద్ధులంతా = ముసలివారు అంతా
దీవించారు = ఆశీర్వదించారు

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 2nd Lesson అతిథి మర్యాద Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 2nd Lesson అతిథి మర్యాద

7th Class Telugu 2nd Lesson అతిథి మర్యాద Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో శ్రీకృష్ణుడు, రుక్మిణి, కుచేలుడు ఉన్నారు. రుక్మిణి కుచేలుని పాదాలపై కలశంతో నీరు పోస్తోంది. శ్రీకృష్ణుడు అతిథిగా వచ్చిన మిత్రుడైన కుచేలుని పాదాలను కడుగుతున్నాడు. తన మిత్రుడు కృష్ణుడు తనకు చేస్తున్న అతిథి సేవలకు కుచేలుడు సంతోషిస్తున్నాడు.

ప్రశ్న 2.
చిత్రంలో ఆసనంపైన కూర్చున్న వ్యక్తికి ఎందుకలా చేస్తున్నారు?
జవాబు:
కుచేలుడు శ్రీకృష్ణుని ఇంటికి అతిథిగా వచ్చాడు. అతిథికి కాళ్ళు కడిగి ఆతిథ్యం ఇవ్వాలి. అందువల్ల కుచేలుని పాదాలు శ్రీకృష్ణుడు కడుగుతున్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

ప్రశ్న 3.
పై సందర్భం ఏమై ఉంటుంది? వాళ్ళు ఏం.మాట్లాడుతుండవచ్చు? ఊహించి చెప్పండి.
జవాబు:
శ్రీకృష్ణుని బాల్యమిత్రుడైన కుచేలుడు, శ్రీకృష్ణుని దర్శించడానికి ద్వారకా నగరానికి వచ్చిన సందర్భంలోనిది. కుచేలుని వంటి బాల్యమిత్రుడు, బ్రాహ్మణోత్తముడు తన యింటికి అతిథిగా రావడం, తన అదృష్టమని శ్రీకృష్ణుడు కుచేలునితో చెప్పి ఉంటాడు.

తనకు బాల్యమిత్రుడు, పురుషోత్తముడు, భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు తనకు స్వయంగా అతిథి సత్కారములు చేయడం వల్ల తన జన్మ ధన్యము అయ్యిందని, కుచేలుడు శ్రీకృష్ణునితో చెప్పి ఉంటాడు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
మీ ఇంటికి వచ్చిన అతిథులకు మీరు ఎలా మర్యాద చేస్తారు?
జవాబు:
మా ఇంటికి వచ్చిన అతిథిని లోనికి రమ్మని పిలుస్తాం. కాళ్ళు కడుగుకోడానికి నీళ్ళు ఇస్తాం. మంచి నీరు తెచ్చి ఇస్తాం. ఆయన వచ్చిన పని ఏమిటో తెలుసుకుంటాం. ఆయనకు కాఫీ కాని, టీ కాని, మజ్జిగ కాని ఇస్తాం. భోజనం కావాలంటే వండి పెడతాం.

ప్రశ్న 2.
ఈ కథలో ఆశ్చర్యం కలిగించిన సంఘటన ఏది ? దాన్ని గురించి చెప్పండి.
జవాబు:
ధర్మరాజు అశ్వమేధయాగాన్ని మెచ్చుకొని, దేవతలు పూలవాన కురిపించారు. ఇంతలో ముంగిస ఒకటి వచ్చి, ఇది దేవతలు అభినందించేటంత గొప్ప యాగమా ? అని ప్రశ్నించింది. ఆ ముంగిస వేసిన ప్రశ్న, ఆశ్చర్యం కల్గించింది.

ప్రశ్న 3.
కథను సొంత మాటల్లో చెప్పండి.
(లేదా)
“అతిథి మర్యాద” కథను సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
యుద్ధం చేసిన పాపం పోవడానికి ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు. ఆ యాగంలో ధర్మరాజు గొప్ప దాన ధర్మాలు చేశాడు. దేవతలు కూడా మెచ్చుకున్నారు. .ఇంతలో ఒక ముంగిస వచ్చి, ధర్మబుద్ధిలో సక్తుప్రస్థుడు … ధర్మరాజు కంటే గొప్పవాడు అని చెప్పింది. ముంగిస సక్తుప్రస్థుని కథ ఇలా చెప్పింది.

“కురుక్షేత్రంలో సక్తుప్రస్థుడు, అతని భార్య ఉంటున్నారు. ఆయనకు ఒక కొడుకు, కోడలు ఉన్నారు. వారంతా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని, జీవితం గడుపుతున్నారు.. వారు ఒక రోజు. ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని, వాటిని దంచి, పిండి చేసి, దాన్నే వండుకొని నలుగురూ సమంగా పంచుకున్నారు. వారు తినే సమయంలో ఒక ముసలివాడు వచ్చి ఆకలిగా ఉంది అన్నాడు.

సక్తుప్రస్థుడు తన వంతు ఆహారాన్ని ముసలివాడికి పెట్టాడు. ముసలివాడి ఆకలి తీరలేదు. మిగిలిన ముగ్గురూ కూడా తమ ఆహారాన్ని ఇచ్చారు. ఆ వృద్ధుడు వారి దానబుద్ధిని మెచ్చుకున్నాడు. వారు ఆకలితో ఉన్నా, తినడం ‘మాని వారు తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని దానం చేశారు. ఆకలితో బాధపడే వానికి అన్నం పెట్టడం కంటె గొప్ప దానం లేదని వృద్దుడు చెప్పాడు.

దేవ విమానం వచ్చింది. సక్తుప్రస్థుడి కుటుంబం అంతా, ఆ విమానం ఎక్కి వెళ్ళారు. సక్తుప్రస్థుడి ఇంటికి వచ్చిన అతిథి పాదాలు కడిగిన స్థలంలో నేను తిరిగాను. నా శరీరంలో ఒక వైపు భాగం బంగారమయమయింది. ఆ తరువాత దానధర్మాలు జరిగే ఎన్నో ప్రదేశాలు తిరిగాను. కానీ నా రెండో వైపు శరీరం అలాగే ఉండి పోయింది. ఈ ధర్మరాజు అశ్వమేధయాగం చేసిన స్థలం వద్ద తిరిగినా, నా శరీరంలో రెండో భాగం బంగారం కాలేదు, అని ముంగిస ఈ కథ చెప్పింది.

II. చదవడం -రాయడం

1. పాఠం చదవండి. కింది సూచనలకు అనుగుణంగా, వాక్యాలను పాఠంలో వెతకండి. వాటి కింద గీత గీయండి.

అ) మహాభారత యుద్ధానికి సంబంధించిన వాక్యాలు.
జవాబు:
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్ను మూశారు. పద్దెనిమిది అక్షౌహిణుల సేన ఉన్న కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మాత్రం మిగిలారు. ఇటు పాండవులు ఐదుగురూ, కృష్ణుడూ, సాత్యకీ మిగిలారు.

ఆ) అశ్వమేధయాగానికి సంబంధించిన వాక్యాలు.
జవాబు:
ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ధర్మరాజు భావించాడు. అశ్వమేధం చేయమని విద్వాంసులు సలహా ఇచ్చారు. వారి ఆదేశానుసారం ధర్మరాజు అశ్వమేధయాగం ఆరంభించారు. దేశదేశాలనుంచి చక్రవర్తులూ, విద్వాంసులూ, ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుంచి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వస్తున్నారు.

ఇ) అతిథి సత్కారాన్ని గురించి తెలిపే వాక్యాలు.
జవాబు:
చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడు. యోగ్యులైన వారికి సువర్ణ, మణి, రత్నదానాలు చేశాడు”

ఈ) దానం గొప్పదనాన్ని గురించి తెలిపే వాక్యాలు.
జవాబు:
ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే, ఏ దానమూ గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు.

ఉ) ముంగిస మాట్లాడిన మాటలు.
జవాబు:

  1. “దేవతలు కూడా అభినందించే యాగమా ఇది?”
  2. సక్తుప్రస్థుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏ మాత్రం?
  3. ‘సావధానంగా వినండి’
  4. అనంతరం ఎన్నోన్నో దాన, ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా, ఈ రెండో వైపు దేహం ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే – అనేవి, ముంగిస మాట్లాడిన మాటలు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

2. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

“మహారాజా ! నీ రాజ్యంలో ఎక్కడా ఆకలిదప్పికలు లేకుండా చూడు. సత్రాలు, చావడులు కట్టించు. చెరువులు తవ్వించు. అడిగిన వాళ్ళకు లేదనకుండా అన్నం పెట్టు. ఏ దానమైనా అన్నదానంతో సరికాదని గుర్తించు. ఎవరి శక్తికి తగినట్లుగా వాళ్ళు అన్నదానం చేసేలా నీ ప్రజల్ని ప్రోత్సహించు. ఆకలి గొన్నవారికి కడుపారా అన్నం పెట్టి, వాళ్ళు తృప్తిగా తింటూంటే అది చూసి మురిసిపోవడం గొప్ప అదృష్టం, గొప్ప అనుభవం. రాజుల సొమ్ము బీదసాదలకు, బడుగు జీవులకు, అన్నార్తులకు, అనాథలకు, అవిటి వారికి ఆదరువు కావాలి, అక్కరకు రావాలి. అదే ముక్తికి మార్గం,” అని వశిష్ఠుడు శ్వేతరాజుకు చెప్పాడు.

అ) పేరాలోని మాటలు ఎవరు ఎవరితో అన్నారు?
జవాబు:
పేరాలోని మాటలు, వశిష్ఠుడు శ్వేతరాజుతో అన్నాడు.

ఆ) రాజులు చేయాల్సిన పని ఏమిటి?
జవాబు:
రాజులు తమ రాజ్యంలో ప్రజలకు ఎక్కడా ఆకలిదప్పికలు లేకుండా చూడాలి. సత్రాలు, చావడులు కట్టించాలి. ఆ చెరువులు తవ్వించాలి. అడిగిన వాళ్ళకు లేదనకుండా అన్నం పెట్టాలి.

ఇ) పై పేరాలో ‘ఆదరువు’ అనే పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
‘ఆదరువు’ అంటే ఆధారం అని అర్థం.

ఈ) వశిష్ఠుడు ముక్తికి మార్గం ఏదని చెప్పాడు?
జవాబు:
“రాజుల సొమ్ము బీదసాదలకు, బడుగు జీవులకు, అన్నార్తులకు, అనాథలకు, అవిటి వారికి ఆదరవు కావాలి, అక్కరకు రావాలి. అదే ముక్తికి మార్గం” అని వశిష్ఠుడు చెప్పాడు.

ఉ) రాజు తన ప్రజలను ఏ విషయంలో ప్రోత్సహించాలి?
జవాబు:
ప్రజలు ఎవరి శక్తికి తగినట్లుగా, వాళ్ళు అన్నదానం చేసేలా రాజు తన ప్రజలను ప్రోత్సహించాలి.

ఊ) పై పేరాకు తగిన శీర్షికను సూచించండి.
జవాబు:
“రాజు కర్తవ్యం” లేక ‘రాజ ధర్మములు.

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ). ధర్మరాజు మనసు ఎందుకు వికలమైంది?
జవాబు:
జరిగిన యుద్ధంలో బంధువులు అందరూ మరణించారనే బాధ, ధర్మరాజు మనస్సును వికలం చేసింది.

ఆ) ధర్మరాజు చేసిన పాపం ఏమిటి? ప్రాయశ్చిత్తంగా ఏమి చేశాడు?
జవాబు:
ధర్మరాజు చేసిన యుద్ధంలో, ఆప్తులూ, ఆత్మీయులూ అంతా మరణించారు. ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తంగా, ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు.

ఇ) ధర్మరాజు చేసిన దానధర్మాలను చూసి ముంగిస ఏమన్నది?
జవాబు:
ధర్మరాజు చేసిన దానధర్మాలను చూసి ముంగిస, “సక్తుప్రసుడి ధర్మబుద్దితో పోలిస్తే, ధర్మరాజు చేసిన దానం ‘ గొప్పది కాదు” అని చెప్పింది.

ఈ) సక్తుప్రసుడు ఏ విధంగా జీవితం గడిపేవాడు?
జవాబు:
ఎవరికీ హాని చేయకుండా ఏ పూటకు ఆపూట దొరికిన దాన్ని తిని సక్తుప్రస్థుడు తృప్తిగా జీవితం గడిపేవాడు.

ఉ) ఆకలితో ఉన్న ముసలివాణ్ణి సక్తుప్రసుడు ఎలా తృప్తి పరిచాడు?
జవాబు:
తాము తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన మొత్తం ఆహారాన్ని సక్తుప్రస్థుడు ముసలివాడికి పెట్టి అతణ్ణి తృప్తిపరచాడు.

ఊ) కడుపు నిండిన ముసలివాడు, సక్తుప్రస్థుడితో ఏమన్నాడు?
జవాబు:
“నాయనా ! మీ అన్నదానం, అతిథి సత్కారం నాకు తృప్తి కల్గించాయి. మీరు ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా, మీ ఆహారాన్ని దానం చేసి పుణ్యం సాధించారు. మీ దాన బుద్ధిని అన్నిలోకాలూ మెచ్చుకుంటాయి. మీకు దివ్య లోకాలు లభిస్తాయి” అని ముసలివాడు సక్తుప్రస్థుడితో అన్నాడు.

III స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఒక్కో పేరాలో లేదా ఐదేసి వాక్యాలలో ఆలోచించి సమాధానాలు రాయండి.

అ) అతిథులు అంటే ఎవరు? అతిథి మర్యాద అంటే ఏమిటి?
జవాబు:
‘అతిథులు’ అంటే తిథి నియమం లేకుండా ఇంటికి వచ్చేవారు. మన ఇండ్లకు ఎవరైనా క్రొత్తవారు వస్తే, వారిని మర్యాదతో లోపలికి పిలిచి, వారికి కాళ్ళు కడుగుకోడానికి నీళ్ళు ఇచ్చి, వారికి కాఫీ, టిఫిను, వగైరా ఇవ్వడం అతిథి మర్యాద. అవసరమైతే వారికి భోజనం కూడా పెట్టాలి. మా ఇంటికి అతిథులు వస్తే వారిని … ఆదరించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భోజనం పెడతాను. ఉన్నంతలో వారి కోరికలు తీరుస్తాను.

ఆ) దయగల గుండె గలవారే ఆశకు దూరమౌతారు’ దీని మీద అభిప్రాయం ఏమిటి? వివరించండి.
జవాబు:
కొంతమందికి దయగల గుండె ఉంటుంది. వారు ప్రక్క వారికి కష్టం వస్తే, చూచి సహించలేరు. అవసరమైతే ప్రక్కవారి కోసం వారు తమ ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధమౌతారు. వారికి వారి ప్రాణాల మీద కూడా ఆశ ఉండదు. ఇతరులకు అవసరమయితే తమ రక్తాన్ని, అవయవాలను సైతం దానం చేస్తారు. తమ మూత్రపిండాల్నీ, నేత్రాలనూ దానం చేస్తారు. దయాహృదయం లేనివారు దానం చేయలేరు.

ఇ) ముంగిస దేహం పూర్తిగా బంగారంగా మారాలంటే ఏం జరగాలి?
(లేదా)
ముంగిస దేహం పూర్తిగా బంగారంగా ఎప్పుడు మారుతుంది?
జవాబు:
సక్తుప్రస్తుడి వంటి గొప్ప ధర్మబుద్ధి కల దాత, ముసలివాని వంటి అతిథి యొక్క పాదాలు కడిగిన చోట, ఆ ముంగిస తిరిగితే, దాని రెండవ భాగం కూడా బంగారంగా మారుతుంది.

ఈ) “సక్తుప్రసుడు సర్వభూత కోటిని దయతో చూసేవాడు కదా !” అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
‘భూతము’ అంటే ప్రాణము కల ప్రాణి. సర్వభూత కోటి అంటే అందరు ప్రాణులు. మనిషికి ఉన్నట్లే జంతువులకు, – వృక్షాలకు, కూడా ప్రాణం ఉంటుంది. ‘తోటి మనిషికి ఆకలి వేస్తే అన్నం పెడతాము. అలాగే ఆవు, గేదె వంటి జంతువులకు కూడా ఆహారం పెట్టాలి. వృక్షాలకు నీళ్ళు పోయాలి. ఇలా అన్ని ప్రాణులయందు దయ చూపించాలి.

ఉ) ఈ కథకు ఇంకేం పేరు పెట్టవచ్చు? ఎందుకు? కారణాలు రాయండి.
జవాబు:
ఈ కథకు “సక్తుప్రస్థుడి ధర్మబుద్ధి’ అని కాని ‘అన్నదాన మహిమ’ అని కాని పేరు పెట్టవచ్చు. ఈ కథలో సక్తుప్రస్థుడి దాన, ధర్మ బుద్ధి ప్రధానము కాబట్టి ‘సక్తుప్రస్థుడి ధర్మబుద్ధి’ అని పేరు పెట్టవచ్చు. ఆకలితో ఉన్న . అతిథికి అన్నదానం చేసి సక్తుప్రస్థుడు దివ్యలోకాలు చేరాడు కాబట్టి ‘అన్నదాన మహిమ’ అని కూడా పేరు పెట్టవచ్చు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) ధర్మరాజు, సక్తుప్రసుడు ‘ఇద్దరూ దానాలు చేశారు కదా ! వీరిద్దరిలో ఎవరిది గొప్పదానం? ఎందుకు?
జవాబు:
సక్తుప్రసుడి దానం గొప్పది. సక్తుప్రసుడు ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని, జీవితం నడుపుతున్న. పేదవాడు. కేవలం రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని, వాటిని దంచి పిండి చేసి, దానినే వండుకొని ఆ ఇంట్లో నలుగురూ తింటారు. సక్తుప్రస్థుడితో పాటు, అతని కుటుంబంలోని వాళ్ళంతా. ఆకలితో ఉన్నారు. వారు ఆహారం తినడానికి సిద్ధపడ్డారు. ఆ పరిస్థితుల్లో వచ్చిన వృద్ధుడికి, వాళ్ళకు ఉన్నదంతా పెట్టారు. కాబట్టి, సక్తుప్రస్థుడి దానం గొప్పది.

ధర్మరాజు తనకు లేకుండా సంపూర్తిగా తనకు ఉన్నవన్నీ దానం చేయలేదు. దానం చేశాక కూడా ధర్మరాజు వద్ద ఎంతో సంపద ఉంది. అదీగాక ధర్మరాజు అశ్వమేధ యాగంలో అశ్వాన్ని చంపి, పశుహింస చేశాడు. కాబట్టి సక్తుప్రస్థుని అన్నదానం, ధర్మరాజు దానం కంటె గొప్పది.

ఆ) ఈ కథ ఆధారంగా మానవులందరూ అలవరచుకోవలసిన మంచి గుణాలు ఏమిటి?
(లేదా)
సక్తుప్రస్తుని కథ ద్వారా మనం ఏమి గ్రహించాలి?
(లేదా)
“అతిథి మర్యాద” కథ ఆధారంగా మానవులందరూ అలవరచుకోవలసిన మంచి గుణాలను తెల్పండి.
జవాబు:

  1. తమ పొట్ట పోషించుకోవడం కోసం ఆహారం సంపాదించడం కోసం, ఏ పాపానికి ఒడిగట్టరాదు.
  2. వచ్చిన అతిథిని ఆదరంగా తీసికొని వచ్చి ఆదరించాలి.
  3. అతిథిని యోగక్షేమాలు అడిగి తెలిసికోవాలి.
  4. అతిథిని ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరాలి.
  5. అతిథి. ఆకలి బాధను తీర్చాలి.
  6. ఆకలితో బాధపడే ప్రాణికి అన్నం పెట్టడం కంటె మించిన దానము లేదని మానవులు గ్రహించాలి.
  7. అన్నం కోసం దారుణాలు చేయరాదు.
  8. తమకు ఉన్నంతలో ఇతరులకు అవసరమయితే ‘దానం చేయాలి.

IV. పదజాలం

1) కింది ఆధారాలకు తగిన పదాలు రాయండి.
ఉదా : ఇతరులకు ఉచితంగా అన్నం పెడితే అది అన్నదానం.

అ) ఉచితంగా చదువు చెబితే…………
జవాబు:
అది విద్యాదానం.

ఆ) అవసరమున్నవాళ్ళకు దుస్తులు ఇస్తే ………………
జవాబు:
అది వస్త్రదానం

ఇ) అవసరానికి రక్తాన్ని ఇస్తే ………….
జవాబు:
అది రక్తదానం

ఈ) శరీర అవయవాలను ఇతరులకు ఇస్తే ……………
జవాబు:
అది అవయవదానం

ఉ) లేని వాళ్ళకు భూమిని ఇస్తే ……………
జవాబు:
అది భూదానం

ఊ) చూపులేని వాళ్ళకు కళ్ళను ఇస్తే …………
జవాబు:
అది నేత్రదానం

ఎ) ఇతరుల మేలు కోసం స్వచ్ఛందంగా శ్రమిస్తే ………….
జవాబు:
అది శ్రమదానం

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

2) కింది పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.

అ) పుణ్యకాలం = పుణ్యాన్ని కలిగించే సమయం
సొంతవాక్యం : సూర్యగ్రహణం పట్టిన పుణ్యకాలంలో నదీస్నానం చేసి దానాలు చేయాలి.

ఆ) మనసు వికలం = మనసు పాడవడం.
సొంతవాక్యం : నా స్నేహితుడికి వచ్చిన కష్టాన్ని చూసి, నా మనసు వికలం అయింది.

ఇ) ప్రాయశ్చిత్తం’ = పాపం పోవడానికి చేసే పని
సొంతవాక్యం : పిల్లిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు.

ఈ) నిర్విరామం = విశ్రాంతి లేకుండా, అంతులేకుండా.
సొంతవాక్యం : నా మిత్రుడు తన కుటుంబ పోషణకై నిర్విరామంగా పనిచేస్తాడు.

ఉ) ధర్మబుద్ధి = ధర్మముతో కూడిన బుద్ధి
సొంతవాక్యం : మా అన్నదమ్ములు అందరమూ ధర్మబుద్ధితో నడుచుకుంటాము.

ఊ) ఒడికట్టడం = అన్నింటికీ సిద్ధపడడం
సొంతవాక్యం : ధన సంపాదన కోసం పాపకార్యాలు చేయడానికి ఒడికట్టడం మంచిదికాదు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

3) కింది పదాలకు వ్యతిరేకపదాలను పాఠంలో గుర్తించండి. ఆ పదాలతో వాక్యాలు రాయండి.
అ) అసంతృప్తి × సంతృప్తి
మనం ఉన్నదానితో సంతృప్తి పడాలి.

ఆ) విరామం × నిర్విరామం
మనం నిర్విరామంగా శ్రమిస్తే ఆరోగ్యం చెడుతుంది.

ఇ) అధర్మం × ధర్మం
ధర్మమును మనం రక్షిస్తే, ధర్మం తిరిగి మనలను రక్షిస్తుంది.

ఈ) అనాదరణ × ఆదరణ
ప్రభుత్వము పేదలపట్ల ఆదరణ చూపాలి.

ఉ) పుణ్యాత్ములు × పాపాత్ములు
పాపాత్ములు ఈ లోకంలో ఎక్కువయ్యారు.

ఊ) పాపము × పుణ్యము
ధర్మకార్యాలు చేసి పుణ్యము సంపాదించుకోవాలి.

ఋ) ధర్మము × అధర్మము
ఎవ్వరూ అధర్మమునకు సిద్ధపడరాదు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

4) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

1) పండుగకు మా ఇంటికి ఆప్తులు అంతా వచ్చారు. నం ఉన్నదానం నిర్విస్తే ఆరోగ్యం (హితులు)

2) గురువుగారు మా ఆతిథ్యం స్వీకరించారు. (అతిథి సత్కారం)

3) సినిమా ‘టిక్కట్లు అయిపోతాయనే ఆతురతతో పరిగెత్తాము. (తొందర)

4) తొంభై సంవత్సరాల వయస్సులో మా మామ్మ కన్ను మూసింది. (మరణించింది)

5) మీరు సెలవుల్లో ఏయే సినిమాలు తిలకించారు? (చూచారు)

6) మా నాన్నగారు అతిథి సత్కారం బాగా చేస్తారు (సన్మానం)

7) కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరో వీరులు మరణించారు. (యుద్ధం)

8) ప్రజలు ఆకలితో దొంగ పనులకు ఒడిగడుతున్నారు. (అన్నింటికీ సిద్ధమగు)

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

5) పాఠంలోని ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి

పక్షి – పక్కి
కృష్ణుడు – కన్నయ్య
శయ్య – సెజ్జ
పుణ్యము – పున్నెము
మణి – మిన్న
రత్నము – రతనము
శాల – సాల
కథ – కత
కుమారుడు – కొమరుడు
వృద్ధుడు – పెద్ద
ఆహారము – ఓగిరము

6) ముఖ్యమైన సంధులు

పట్టాభిషేకం = పట్ట + అభిషేకం – సవర్ణదీర్ఘ సంధి
ఆదేశానుసారం = ఆదేశ + అనుసారం – సవర్ణదీర్ఘ సంధి
సావధానంగా = స + అవధానంగా – సవర్ణదీర్ఘ సంధి
పరమేశ్వర ధ్యానం = పరమ + ఈశ్వర ధ్యానం – గుణసంధి
ధాన్యపు గింజలు = ధాన్యము + గింజలు – పుంప్వాదేశ సంధి
పుణ్యాత్ములు = పుణ్య + ఆత్ములు – సవర్ణదీర్ఘ సంధి

7) సమాసములు – విగ్రహవాక్యాలు

సమాసములు విగ్రహవాక్యాలు సమాసం పేరు
దానధర్మాలు దానమును, ధర్మమును ద్వంద్వ సమాసము
కామక్రోధాలు కామమును, క్రోధమును ద్వంద్వ సమాసము
యాగశాల యాగము కొఱకు శాల చతుర్డీ తత్పురుష సమాసము
ఆకలి బాధ ఆకలి వలన బాధ పంచమీ తత్పురుష సమాసము
పద్దెనిమిది అక్షౌహిణులు పద్దెనిమిది (18) సంఖ్య గల అక్షౌహిణులు ద్విగు సమాసము
పరమేశ్వర ధ్యానము పరమేశ్వరుని యొక్క ధ్యానము షష్ఠీ తత్పురుష సమాసము
పుణ్యాత్ములు పుణ్యమైన ఆత్మ కలవారు బహుజొహి సమాసము
దివ్యలోకాలు దివ్యమైన లోకాలు విశేషణ పూర్వపద కర్మధారయము
పూలవాన పూలతో వాన తృతీయా తత్పురుష సమాసము

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

8) సమానార్థక పదములు

1) సేన : సైన్యము, దండు, బలము, వాహిని.
2) సంగ్రామం : యుద్ధము, పోరు, సమరము, రణము, కలహము.
3) మనస్సు : మనము, చిత్తము.
4) వాన : వర్షము, వృష్టి, జడి.
5) యజ్ఞము : యాగము, క్రతువు, మఖము.
6) భూమి : జగతి, ధరిత్రి, ధరణి, ఉర్వి.
7) పాదము : అడుగు, అంఘి, చరణము.
8) ఆనందము : ముదము, హర్షము, ప్రమోదము.

9) సొంతవాక్యాలు

1) దానధర్మాలు : ప్రతివ్యక్తి సంపాదించిన దానిలో కొంత దానధర్మాలు చేయాలి.
2) పట్టాభిషేకం : దశరథుడు శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని తలపెట్టాడు.
3) కామక్రోధాలు : సన్యాసులు తప్పక కామక్రోధాలు విడిచి పెట్టాలి.

V. సృజనాత్మకత

ప్రశ్న 1.
“అతిథి దేవోభవ” అనే శీర్షికతో చిన్న కథ రాయండి.
జవాబు:
‘రంతి దేవుడు’ అనే రాజు చాలా యజ్ఞాలు, దానాలు చేశాడు.. చివరకు ఆయనకు తినడానికి తిండి కూడా లేకపోయింది. అయనకు కొంచెము అన్నము దొరికింది. దానిని ఆయన తినబోతుండగా ఒక అతిథి వచ్చి అన్నము పెట్టమన్నాడు.

రంతి దేవుడు తనకు గల దానిలో సగము అతిథికి పెట్టాడు. ఆ అతిథి తరువాత ఒక శూద్రుడు, చండాలుడు కూడా వచ్చారు. ఆ తరువాత ఒక కుక్క వచ్చింది. రంతి దేవుడు తనవద్ద మిగిలిన అన్నాన్ని వారందరికీ పూర్తిగా పెట్టాడు.

తరువాత బ్రహ్మ మొదలయిన దేవతలు వచ్చి, తామే అతిథులుగా వచ్చామని రంతి దేవుడికి చెప్పారు. వారు .. రంతి దేవుని అతిథి సత్కారానికి మెచ్చి ఆయనకు వరాలు ఇచ్చారు.

(లేదా )

ప్రశ్న 2.
అతిథి మర్యాద కథను సంభాషణల రూపంలో రాసి ప్రదర్శించండి.
జవాబు:
సక్తుప్రస్థుడు : మనకు దొరికిన ఆహారాన్ని మన కుటుంబం అంతా సమంగా పంచుకున్నాము. తిందాం రండి.

వృద్ధుడైన అతిథి : అయ్యా ! ఆకలి, ఆకలి, నీరసంగా ఉంది. ఏదైనా ఉంటే పెట్టండి.

సక్తుప్రస్థుడు : బాబూ ! లోపలకు రా. కూర్చో

అతిథి : అయ్యా ! ఆకలిగా ఉంది. తొందరగా పెట్టండి.

సక్తుప్రస్థుడు : మా ఆతిథ్యం స్వీకరించండి. .ఇది మేము తెచ్చుకున్న ధాన్యం గింజల పిండితో వండిన పదార్థం. దీన్ని తినండి.

అతిథి : అయ్యా ! మీరు పెట్టినది మంచి రుచిగా ఉంది. ఇంకా ఆకలిగా ఉంది.

సక్తుప్రస్థుని కుటుంబంవారు : అయ్యా ! మా దగ్గర ఉన్న ఆహారం కూడా తినండి.

అతిథి : నాయనా ! మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తిని కల్గించాయి. మీరు ఆకలిగా ఉన్నా, మీకు ఉన్నదంతా నాకు పెట్టారు.

సక్తుప్రస్థుడు : మీకు కడుపు నిండింది మాకు అదే సంతోషం.

అతిథి : మీరు దయగలవారు. మీకు దివ్యలోకాలు వస్తాయి.

VI. ప్రశంస

1) “ఆకలిగా ఉన్న వాళ్ళకు అన్నం పెట్టడం, అవసరానికి సహాయం చేయడం వంటివి మంచి లక్షణాలు.” మీ తరగతిలో ఇలాంటి మంచి లక్షణాలు గలవాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళను అభినందించండి.
జవాబు:
ఆకలిగా ఉన్న వాళ్ళకు అన్నం పెట్టే అలవాటు, అవసరంలో ఉన్నవారికి సాయం చేసే అలవాటు మా తరగతిలో గోపాల కు, రాజుకు, సుమిత్రకు ఉంది. వారికి ఉన్నవన్నీ మంచి లక్షణాలే.

ఒకరోజున రాజు, గోపాల్ లు ఇద్దరూ మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో తాము తెచ్చుకున్న కేరియర్స్ తెరిచి అన్నం తినడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో మా తరగతి అబ్బాయి దాసు నీరసంగా వారి పక్కనుండి వెడుతున్నాడు. దాసు బీదవాడు. రాజు, గోపాల్ లు ఇద్దరూ దాసును పిలిచి తమతోపాటు దాసుకు భోజనం వడ్డించారు. దాసు వారికి కృతజ్ఞత చెప్పాడు.

అలాగే సుమిత్ర, తన తరగతి బాలిక రాధ పరీక్షఫీజు కట్టలేక పోయిందని తెలిసి తన పర్సులోని డబ్బుతీసి . రాధ పరీక్షఫీజు తాను కట్టింది. రాజు, గోపాల్, సుమిత్ర మంచి లక్షణాలు కలవారు.

అభినందనలు :
రాజూ ! గోపాల్ ! మిత్రులారా ! తోటి పిల్లవాని ముఖం చూసి, అతడు అన్నం తెచ్చుకోలేదని మీరు గ్రహించి అతడికి మీరు అన్నదానం చేశారు. మీ పరోపకార బుద్ధికి, దయ ధర్మగుణానికి నా అభినందనలు. సుమిత్రా ! నీవు రాధకు పరీక్ష ఫీజు కట్టి, రాధ చదువు కొనసాగించడానికి సాయపడ్డావు. నీ పరోపకారబుద్ధికి, దాతృత్వానికీ. నా అభినందనలు.

VII. ప్రాజెక్టు పని

1) మర్యాద చేయడం, ఆతిథ్యం ఇవ్వడం ఒక్కో ప్రాంతంలో ఒక్కో కుటుంబంలో, ఒక్కో రకంగా ఉంటుంది. వీటిని గురించి మీ మిత్రులతో మాట్లాడి వివరాలు సేకరించండి. ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థికృత్యం.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ) ఈ కింది పదాలు కలిపి రాయండి.
ఉదా : వెయ్యి + అమ్మా = (ఇ + అ = అ) = వెయ్యమ్మా

1. చిర్రు + ఎత్తు = (ఉ + ఎ = ఎ) = చిఱ్ఱెత్తు
2. అప్పటికి + ఏ = (ఇ + ఏ = ఏ) = అప్పటికే
3. రాక + ఉంటే = (అ + ఉ = ఉ) = రాకుంటే

గమనిక :
పై మూడు పదాల్లో పూర్వ స్వరం (మొదటి అచ్చు) స్థానంలో వరసగా ఉ, ఇ, అ లు ఉన్నాయి. వాటికి ఎ, ఏ, ఉ అనే అచ్చులు కలిశాయి. (పరం అయినాయి) ఏ అచ్చులు కలిశాయో అదే రూపం పూర్వ స్వరాలకు వచ్చింది. అంటే పూర్వ పరస్వరాలు మిగులుతాయి. తెలుగు సంధుల్లో ఈ మార్పు మనం గమనిస్తాం.

ఇక్కడ పూర్వ స్వరాన్ని (మొదటి పదం చివరి అచ్చుని) ఆధారంగా చేసుకొని, సంధి నిర్ణయం జరుగుతుంది.
ఆ ప్రకారంగా 1) ఉత్వ 2) ఇత్వ 3) అత్వ సంధులు, ఏర్పడే మీరు 6వ తరగతిలో తెలుసుకున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

ఆ) ఈ కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి, సంధి జరిగిన విధాన్ని చర్చించండి.
ఉదా : ఏమిటా కథ = ఏమిటి + ఆ కథ – (ఇ + ఆ = ఆ) = ఇత్వసంధి

1. జీవగడ్డయి = జీవగడ్డ + అయి = (అ + అ = అ) = అత్వసంధి
2. భాగ్యసీమయి = భాగ్యసీమ + అయి = (అ + అ = అ) – అత్వసంధి
3. చేసుకోవాలని = చేసుకోవాలి + అని = (ఇ + అ = అ) = ఇత్వసంధి
4. సెలవిచ్చి = సెలవు + ఇచ్చి = (ఉ + ఇ = ఇ) = ఉత్వసంధి
5. రానిదని = రానిది + అని = (ఇ + అ = అ) = ఇత్వసంధి
6. ఎవరికెంత = ఎవరికి + ఎంత = (ఇ + ఎ = ఎ) = ఇత్వసంధి
7. వచ్చిందిప్పుడు = వచ్చింది + ఇప్పుడు = (ఇ + ఇ = ఇ) = ఇత్వసంధి
8. కవితలల్లిన = కవితలు + అల్లిన = (ఉ + అ = అ) = ఉత్వసంధి

ఇ) ఇటువంటి పదాలను మొదటి రెండు పాఠాల నుండి తీసుకొని, వాటిని విడదీసి, లక్షణాలను చర్చించండి.

1. “శ్రీలు పొంగిన జీవగడ్డ” పాఠం నుండి

1. వెలిసె నిచ్చట = వెలిసెను + ఇచ్చట = (ఉ + ఇ = ఇ) – ఉత్వసంధి
2. విమల తలమిదె = విమల తలము + ఇదె = (ఉ + ఇ = ఇ) – ఉత్వసంధి
3. రాగమెత్తీ = రాగము + ఎత్త = (ఉ + ఎ = ఎ) = ఉత్వసంధి
4. నాట్యమాడగ = నాట్యము + ఆడగ = (ఉ + ఆ = ఆ) – ఉత్వసంధి
5. దేశమరసిన = దేశము + అరసిన = (ఉ + అ = అ) – ఉత్వసంధి
6. లోకమంతకు = లోకము + అంతకు = (ఉ + అ = అ) – ఉత్వసంధి

2. “అతిథి మర్యాద” పాఠం నుండి

1. క్షేత్రమైన = క్షేత్రము + ఐన = (ఉ + ఐ = ఐ) – ఉత్వసంధి
2. మరణించారనే = మరణించారు + అనే = (ఉ + అ = అ) – ఉత్వసంధి
3. వారందరికీ = వారు + అందరికీ = (ఉ + అ = అ) – ఉత్వసంధి
4. మీ వాళ్ళంతా = మీ వాళ్ళు + అంతా = (ఉ + అ = అ) – ఉత్వసంధి
5. తనకింకా = తనకు + ఇంకా = (ఉ + ఇ = ఇ) – ఉత్వసంధి
6. కాంతు లీనుతోంది = కాంతులు + ఈనుతోంది = (ఉ + ఈ = ఈ) = ఉత్వసంధి
7. కుమారుడుండేవాడు = కుమారుడు + ఉండేవాడు = (ఉ + ఉ = ఉ) = ఉత్వసంధి
8. లక్షలాది . = లక్షలు + ఆది = (ఉ + ఆ = ఆ) – ఉత్వసంధి
9. బంగారు మయమయింది = బంగారుమయము + అయింది = (ఉ + అ = అ) = ఉత్వసంధి
10. యోగ్యులైన = యోగ్యులు + ఐన = = ఐ) = ఉత్వసంధి
11. పాపానికైనా = పాపానికి + ఐనా = (ఇ + ఇ = ఐ) = ఇత్వసంధి
12. సక్తుప్రస్తుడనే = సక్తుప్రస్తుడు + అనే = (ఉ + అ = అ) – ఉత్వసంధి
13. వారందరూ = వారు + అందరూ = (ఉ + అ = అ) – ఉత్వసంధి

విభక్తులు – ఉపవిభక్తులు

1. కింది వాక్యాలలోని విభక్తి ప్రత్యయాలను గుర్తించి, అవి ఏ విభక్తులో రాయండి.
ఉదా : సమావేశంలో చదివిన విషయం బాగుంది – లో – షష్ఠీ విభక్తి

విభక్తి ప్రత్యయం ఏ విభక్తి ప్రత్యయం?
అ) గాలికి రెపరెపలాడుతున్నది కి షష్ఠీ విభక్తి
ఆ) రహస్యాలను అన్వేషించండి ను ద్వితీయా విభక్తి
ఇ) జంతువులు మనకంటె ముందున్నాయి కంటె పంచమీ విభక్తి లు
లు ప్రథమా విభక్తి
ఈ) జ్ఞానేంద్రియాల చేత గ్రహిస్తాం చేత తృతీయా విభక్తి
ఉ) బాధవలన దుఃఖం వస్తుంది వలన పంచమీ విభక్తి
ఊ) ధ్వనులను బట్టి జంతువులను గుర్తించవచ్చు బట్టి పంచమీ విభక్తి
ను ద్వితీయా విభక్తి
ఎ) రాముడు, ధేనువు పాలు పిండుతున్నాడు డు ప్రథమా విభక్తి
వు ప్రథమా విభక్తి
విభక్తి ప్రత్యయాలు విభక్తులు
అ) డు, ము, వు, లు ప్రథమా విభక్తి
ఆ) ని (న్), ను (న్), ల(న్), ‘కూర్చి, గుఱించి’ ద్వితీయా విభక్తి
ఇ) చేత (న్), చే (న్), తోడ (న్), తో (న్) తృతీయా విభక్తి
ఈ) కొఱకు (న్), కై చతుర్టీ విభక్తి
ఉ) వలన (న్), కంటె (న్), పట్టి పంచమీ విభక్తి
ఊ) కి (న్), కు(న్), యొక్క లో(న్),. లోపల(న్) షష్ఠీ విభక్తి
ఎ) అందు (న్), న(న్) సప్తమీ విభక్తి
ఏ) ఓ ! ఓరి ! ఓయీ ! ఓసీ! సంబోధన ప్రథమా విభక్తి

2. కింది ఖాళీలను సరైన ప్రత్యయాలతో పూరించండి. విభక్తులను బ్రాకెట్లలో రాయండి.
ఉదా : ప్రహ్లాదుడు, విష్ణువును గురించి తపస్సు చేశాడు. (ద్వితీయ)

అ) తేట తెలుగు మాటలతో పాటలు రాశాడు. (తృతీయ)
ఆ) దేశమును కాపాడిన వీరులు. (ద్వితీయ)
ఇ) దేశాన్ని గురించి కీర్తించారు కవులు. . (ద్వితీయ)

3. కింద గీత గీసిన పదాలను గమనించండి. వాటి నామవాచకం అసలు రూపాన్ని గుర్తించి రాయండి.
ఉదా : కంటిలోని నలుసు చూడు. (కన్ను)
1) ఇంటికి వెలుగు ఇల్లాలు. (ఇల్లు)
2) ఏటిలోని చేపపిల్ల (ఏరు)
3) ఊరి కట్టుబాట్లు. (ఊరు)
4) కాలికి బుద్ధి చెప్పారు. (కాలు)

గమనిక : పై వాక్యాల్లోని నామవాచకాల్లో వచ్చిన మార్పులు గమనించారు కదా ! నామవాచకాలు వాక్యాలలో ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాటి స్వరూపం’ మారుతున్నది. (కన్ను – కంటిగా, ఇల్లు – ఇంటిగా, ఏరు – ఏజుగా, ఊరు – ఊరిగా, కాలు – కాలిగా, మారాయి.) అలా మారేటప్పుడు నామవాచకం చివరి అక్షరం మీద ‘ఇ’ గాని, ‘టి’ గాని, ‘తి’ గాని, చేరుతున్నాయి. వీటిని ‘ఉపవిభక్తులు’ అంటారు.

ఔపవిభక్తములు : ఉపవిభక్తులు కలిగిన నామవాచకాలను “ఔపవిభక్తులు” అంటారు.

4. కింది నామవాచకాలకు ఇచ్చిన ఉపవిభక్తులు చేర్చి, ఔపవిభక్తులుగా మార్చి వాక్యాలు రాయండి.
ఉదా : చేయి + తి = చేతి; అతనికి చేతినిండా పని ఉంది.
అ) గోరు + టి = గోటి; శివుడు బ్రహ్మ ఐదవతలను గోటితో గిల్లాడు.
ఆ) రోలు + టి = రోటి; రోటిలో తలదూర్చి రోకటి పోటుకు భయపడరాదు.

రచయిత పరిచయం

రచయిత : ఉషశ్రీ (పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు)
జననం : మార్చి 16, 1928 (16.03. 1928)
మరణం : సెప్టెంబరు 07, 1990 (07.09. 1990)
జన్మస్థలం : కాకరపర్రు, పశ్చిమగోదావరి జిల్లా.
రచనలు : రామాయణ, భారత, భాగవతాలను వచనంలో రాశారు. ప్రవచనం చేశారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

కొత్త పదాలు – అర్థాలు

అతిరథులు = అనేక మందితో ఒంటరిగా యుద్ధం చేయగల యోధులు (వీరు అర్థరథుడు, సమరథుడు, మహారథుల కన్న గొప్పవారు)
అక్షౌహిణి = 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,160 గుర్రములు, 1,09,350 సైనికులు ఉన్న సైన్య విభాగము.
అశ్వత్థామ = కృపా, ద్రోణాచార్యుల పుత్రుడు
అంపశయ్య = బాణాలతో తయారుచేసిన పడక
అనంతరం = తరువాత
అశ్వమేధం = ఇది ఒక రకం యాగం. గుజ్రాన్ని యజ్ఞ పశువుగా చేసి, చేసే యజ్ఞం.
అభినందించు = పొగడు, మెచ్చుకొను
అనుగ్రహించు = దయతో ఇచ్చు
ఆప్తులు = బంధువులు, హితులు
ఆత్మీయులు = తనకు కావలసినవారు
ఆదేశానుసారం = ‘ఆజ్ఞకు తగిన విధంగా
ఆతురత = తొందర
ఆతిథ్యం = అతిథి సత్కారము
ఆరగించు = తిను
ఈను = బయలుపఱచు, వెదజల్లు
ఉత్తరాయణము = సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన దగ్గర నుండి ఆరు నెలల సమయం, సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణించే కాలం (సంక్రాంతి పండుగ నుండి ఆరు నెలల కాలం)
ఒడిగట్టు = అన్నిటికీ సిద్ధమగు, పూనుకొను
కన్ను మూయు = మరణించు
కురుక్షేత్రం = కౌరవ పాండవులు యుద్ధం చేసిన పుణ్యభూమి
కృతవర్మ = భోజ చక్రవర్తి ఇతడు దుర్యోధనుని మిత్రుడు
కృపాచార్యులు = కౌరవ పాండవులకు మొదటి అస్త్ర విద్యా గురువు
కృష్ణుడు = దేవకీవసుదేవుల పుత్రుడు
కుశలము = క్షేమము
జనపదాలు = గ్రామాలు
డొక్కలు = కడుపులు
తిలకించు = చూచు

AP Board 7th Class Telugu Solutions Chapter 2 అతిథి మర్యాద

ధర్మ క్షేత్రము = ధర్మ భూమి
దారుణాలు = భయంకరములు
దివ్య లోకాలు = స్వర్గము మొదలయిన పుణ్య లోకాలు
దేవ విమానాలు = దేవతలు విహరించే విమానాలు
నిర్విరామంగా = ఆపులేకుండా
నివారించు = అడ్డగించు
పద్దెనిమిది = పదునెనిమిది (18) (కౌరవ సైన్యం 11 అక్షౌహిణులు, పాండవ సైన్యం 7 అక్షౌహిణులు)
ప్రాయశ్చిత్తం = పాపం పోవడానికి చేసే కర్మ
పట్టాభిషేకము = కొత్తగా రాజు అయిన వాడిని, సింహాసనముపై ఉంచి, నుదుట పట్టము కట్టి, పుణ్య జలాలతో అభిషేకము చేయడం
పాండవులు = పాండురాజు పుత్రులు ఐదుగురు (ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులు)
పరబ్రహ్మ = పరమాత్మ
భీష్మపితామహుడు = తాత అయిన భీష్ముడు
మహనీయుడు = గొప్పవాడు
మహారథులు = 10 వేల మంది విలుకాండ్రతో ఒంటరిగా పోరాడగల శస్త్రాస్త్ర విశారదులైన వీరులు
యాగం = యజ్ఞము
యాగశాల = యజ్ఞము చేసే శాల (ప్రదేశం)
వికలం = చెదరుట (పాడగుట)
విద్యాంసులు = పండితులు
వృద్ధులు = పెద్దలు
వస్త్రదానం = బట్టలు దానం ఇవ్వడం
సత్కారం = సన్మానం
సంగ్రామం = యుద్ధం
సాత్యకి = ఒక యాదవ వీరుడు. అర్జునుని శిష్యుడు
సువర్ణం = బంగారం
సర్వ భూతకోటి = అందరు ప్రాణులు
సావధానంగా = ఏకాగ్రతతో

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 1st Lesson శ్రీలు పొంగిన జీవగడ్డ Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 1st Lesson శ్రీలు పొంగిన జీవగడ్డ

7th Class Telugu 1st Lesson శ్రీలు పొంగిన జీవగడ్డ Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ 1
“ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము”

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న1.
పై మాటలు దేని గురించి చెప్తున్నాయి?
జవాబు:
పై మాటలు మన జన్మభూమి అయిన భారతదేశం గురించి చెప్తున్నాయి. ..

2. దేశం పట్ల ఎటువంటి భావనతో ఉండాలి?
జవాబు:
దేశం పట్ల భక్తి, గౌరవ భావనలతో ఉండాలి.

3. జాతి గౌరవం నిలపడం అంటే మీరు ఏమనుకుంటున్నారు?
జవాబు:

  1. ఆ జాతి జనుల ప్రాచీన వైభవాన్ని గుర్తించి, కీర్తించాలి.
  2. ఆ జాతి జనుల సంస్కృతీ సంప్రదాయాలను ఆదరించాలి.
  3. ఆ జాతి జనుల ఆధ్యాత్మిక ఘనతను గ్రహించాలి.
  4. ఆ జాతి జనులకు వారసునిగా తాము నిలబడాలి.

4. మీకు తెలిసిన దేశభక్తి గేయాలను పాడండి.
జవాబు:
విద్యార్థులు కొన్ని గేయాలను అభ్యసించగలరు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ గేయం దేన్ని గురించి చెప్తోంది ? దీనిలో దేశభక్తికి సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయి?
జవాబు:
a) 1) ఈ గేయం భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తోంది.
2) భారతీయులు, భారతదేశంలో పుట్టిన మహాకవులను గూర్చి, “వీరులైన రాజులను గురించి, భారతదేశాన్ని గురించి గానం చేయాలని ఈ గేయం చెప్తోంది.

b) దీనిలో దేశభక్తికి సంబంధించిన విషయాలు :

  1. మన భారతదేశం పాడిపంటలకు నిలయమైన సిరిసంపదలు గల దేశం.
  2. భారతదేశంలో వేదాలు, రామాయణం, వ్యాసుని వంటి ఋషులు జన్మించారు.
  3. నవరసాలతో, వీనుల విందుగా కవిత్వం చెప్పిన మహా కవులు భారతదేశంలో ఉన్నారు.
  4. భారతదేశంలో ఎందరో ధీరులు, పాండవుల వంటి వీరులు పుట్టారు.
  5. కాకతీయులు, విజయనగర చక్రవర్తులు వంటి గొప్పరాజులు భారతదేశాన్ని పాలించారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

ప్రశ్న 2.
ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి. సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
ఉపాధ్యాయుల సహాయంతో రాగయుక్తంగా పాడటం నేర్చుకోవాలి.. మన భారతదేశం సంపదలు గల దేశం. పాడిపంటలు గల భాగ్యదేశం. ఇది వేదాలు, రామాయణం, వ్యాసుడు పుట్టిన పుణ్యభూమి. ఇక్కడ పెద్ద అరణ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఉపనిషత్తులు పుట్టాయి.

మన రాజుల.పరాక్రమ చరిత్రలు, మన బానిసత్వం వల్ల నశించాయి. కిన్నెర మీటుతూ, రాళ్ళను కరగించే రాగంతో, భావి భారతదేశ భాగ్యాన్ని గూర్చి పాడుకోవాలి. నవరసాలతో వీనుల విందుగా కవిత్వం చెప్పిన కవులను గౌరవించాలి.

” దేశ గౌరవాన్నీ, దేశ చరిత్రను విస్తరింపజేసిన వీరపురుషులను కీర్తించాలి. పాండవుల కురుక్షేత్ర యుద్ధాన్ని గూర్చి చక్కని తెలుగు మాటలతో పాడుకోవాలి. కాకతీయుల యుద్ధనైపుణ్యాన్ని కీర్తించాలి. చెక్కుచెదరని విజయనగర రాజుల చరిత్రలను పాడుకోవాలి.

ప్రశ్న 3.
భారతదేశాన్ని ‘పుణ్యభూమి’ అని ఎందుకన్నారు?
జవాబు:
భారతదేశంలో వేదశాఖలూ, ఆదికావ్యం రామాయణమూ, వ్యాసుని వంటి ఋషులూ, ఉపనిషత్తులూ పుట్టాయి. అందువల్ల భారతదేశాన్ని పుణ్యభూమి అని అన్నారు.

ప్రశ్న 4.
దేశ గౌరవాన్ని పెంచిన భారతీయ వీరుల గురించి చెప్పండి.
జవాబు:
పాండవులు, కాకతీయ చక్రవర్తులు, విజయనగర చక్రవర్తులు, శివాజీ, పృథ్వీరాజు మొదలయినవారు భారతీయ వీరులు.

II చదవడం – రాయడం

ప్రశ్న 1.
ఈ గేయంలో మన భారతదేశం అని తెలిపే పదాలను గుర్తించండి.
జవాబు:

  1. శ్రీలు పొంగిన “జీవగడ్డ”
  2. పాలు పారిన “భాగ్యసీమ”
  3. “భరత ఖండము”
  4. విపుల తత్త్వము విస్తరించిన “విమల తలము”
    – పైన చెప్పిన నాలుగు మాటలు, గేయంలో భారతదేశాన్ని గూర్చి తెలుపుతున్న పదాలు.

ప్రశ్న 2.
ఈ కింది మాటల క్రమాన్ని సరిచేస్తే గేయంలోని పాదాలుగా అవుతాయి. సరిచేసి రాయండి. భావం చెప్పండి.
“దీప్తి దేశ చెందగ గర్వము
చరితము దేశ తేజరిల్లగ
ధీర దేశ పురుషుల మరసిన
తమ్ముడా ! పాడర తెలిసి.”
జవాబు:
గేయ సవరణ ఇలా ఉండాలి.
“దేశ గర్వము దీప్తిచెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా !

పై గేయానికి భావం :
దేశ గౌరవం ప్రకాశించేటట్లుగా, దేశచరిత్ర విస్తరించేటట్లుగా, దేశాన్ని కాపాడిన వీరపురుషులను – గురించి తెలుసుకొని కీర్తించాలి.

ప్రశ్న 3.
ఈ కింది భావం వచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ 2

అ) మన దేశం వేదాలకు పుట్టినిల్లు.
జవాబు:
“వేద శాఖలు వెలిసె నిచ్చట.”

ఆ) కాకతీయుల యుద్ధ నైపుణ్యం.
జవాబు:
“కాకతీయుల కదనపాండితి.”

ఇ) లేత మాటలు చెవుల కింపుగ.
జవాబు:
“చివురు పలుకులు చెవుల విందుగ.”

ఈ) ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి.
జవాబు:
“ఉపనిషన్మధు వొలికె నిచ్చట.”

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

ప్రశ్న 4.
ఈ కింది ప్రశ్నలకు గేయం ఆధారంగా జవాబులు రాయండి..

అ) పాఠానికి ఇంకొక శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
“భారతదేశం” – అన్నది ఈ గేయానికి తగిన మరొక శీర్షిక.

ఆ) మన దేశం పవిత్రభూమి ఎందుకయింది?
జవాబు:
వేదాలూ, వేదాంగాలూ ఈ దేశంలో వెలిశాయి. ఆదికావ్యం రామాయణం ఇక్కడే పుట్టింది. భారత భాగవతాలు
రచించిన వేదవ్యాసుడు ఇక్కడే పుట్టాడు. ఉపనిషత్తులూ, తత్త్వబోధన ఇక్కడే విస్తరించాయి. ధర్మసూత్ర రచన ఇక్కడే జరిగింది. పై కారణాల వల్ల మనదేశం పవిత్రభూమి అయ్యింది.

ఇ) భావి భారతపదాన్ని ఏ విధంగా పాడాలి?
జవాబు:
కిన్నెర వాద్యాన్ని మీటుతూ, రాళ్ళను కూడా కరగించగల రాగంతో బిగ్గరగా, పాలవలె తియ్యనైన భావిభారత పదాన్ని పాడాలి.

ఈ) కవి గేయంలో వేటిని గురించి పాడాలని అన్నారు?
జవాబు:

  1. భావి భారత పదాన్ని గురించి పాడాలని చెప్పారు.
  2. దేశాన్ని కాపాడిన వీరపురుషులను గూర్చి పాడాలని చెప్పారు.
  3. పాండవేయుల యుద్దగాథను గూర్చి పాడాలని చెప్పారు.
  4. కాకతీయుల యుద్ధ నైపుణ్యాన్ని గూర్చి పాడాలని చెప్పారు.
  5. తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలని చెప్పారు.

III. స్వీయరచన

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి పంక్తులలో సమాధానాలు రాయండి.

అ) భారతదేశాన్ని కాపాడిన కొందరు వీరపురుషులను గురించి తెలపండి.
జవాబు:

  1. శివాజీ
  2. ఝాన్సీ లక్ష్మీబాయి
  3. రాణీ రుద్రమదేవి
  4. శ్రీకృష్ణదేవరాయలు
  5. పృథ్వీరాజు
  6. ప్రతాపరుద్రుడు
    వంటి వీర పురుషులు భారతదేశాన్ని కాపాడారు.

ఆ) యుద్దాలు ఎందుకు చేస్తారు? యుద్ధాల వల్ల లాభమా? నష్టమా? ఎందువల్ల?
జవాబు:

  1. ఇతరుల రాజ్యాన్ని స్వాధీనం చేసుకోడానికీ, తమ దేశాన్ని శత్రువుల నుండి కాపాడుకోడానికి సామాన్యంగా ఎవరైనా యుద్దాలు చేస్తారు.
  2. యుద్ధాల వల్ల లాభం ఎప్పుడూ ఉండదు. నష్టమే ఉంటుంది.
  3. యుద్దాల వల్ల ప్రాణనష్టం జరుగుతుంది. రెండు పక్షాలలోని సైనికులూ మరణిస్తారు. యుద్ధసామగ్రికి చాలా ఖర్చు అవుతుంది. యుద్ధంలో నష్టపోయిన దేశాలను బాగుచేయడానికి ఎంతో ఖర్చూ, కాలమూ వ్యయమవుతుంది.
  4. దేశాలన్నీ స్నేహంగా ఉండి, యుద్ధాలు చేయకపోతే, ఆ ధనంతో ఆయా దేశాలు తమ దేశాలను అభివృద్ధి చేసుకోవచ్చు.

ఇ) “బానిసతనం” అంటే ఏమిటి?
జవాబు:
బానిసతనం అంటే దాస్యం. తమకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లేకపోవడం, ఇతరుల చెప్పుచేతలలో పడియుండడం ‘అన్నదే బానిసతనం. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు, మన దేశం బ్రిటిష్ వారి చెప్పుచేతలలో ఉండి, బానిసత్వంను అనుభవించింది. మన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా పైకి చెప్పుకోలేకపోవడం కూడా బానిసత్వమే.

ఈ) “భరత ఖండం” భాగ్యసీమ అనటానికి గల కారణాలు తెలపండి.
జవాబు:
మన భరత ఖండం, శ్రీలు పొంగిన జీవగడ్డ. పాలు పారిన భాగ్యసీమ. మనదేశంలో విశాలమైన పంటభూములు, గంగా గోదావరీ వంటి జీవనదులు ఉన్నాయి. పంటలను పండించడానికి కావలసిన మానవ వనరులు ఉన్నాయి. మనదేశంలో పరిశ్రమలు స్థాపించడానికి కావలసిన లోహాలు, అరణ్యాలు ఉన్నాయి. ఇక్కడ ముడిసరుకు, . కూలీలు దొరుకుతారు. బుద్ధిమంతులైన యువకులు ఉన్నారు. కాబట్టి మన భరతఖండాన్ని భాగ్యసీమ అని చెప్పవచ్చు.

ఉ) రాయప్రోలు సుబ్బారావు గారిని మీ మాటల్లో పరిచయం చేయండి.
(లేదా)
‘భరతఖండం – భాగ్యసీమని’ – ఎలుగెత్తి పాడిన రాయప్రోలు సుబ్బారావును గూర్చి రాయండి.
జవాబు:
‘శ్రీలు పొంగిన జీవగడ్డ’ గేయాన్ని శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. వీరు 1892లో గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించారు. వీరు తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార మొదలయిన భావ కవిత్వ కావ్యాలు రాశారు. ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల అనే ఖండకావ్యాలను; ‘రమ్యాలోకం’ అనే లక్షణ గ్రంథాన్ని రచించారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

ప్రశ్న 2.
కింది ప్రశ్నకు పదేసి పంక్తులలో సమాధానం రాయండి.

అ) భారతదేశం గొప్పతనాన్ని గురించి మీ సొంతమాటలలో రాయండి.
(లేదా)
శ్రీలు పొంగిన జీవగడ్డ, పాలు పారిన భాగ్యసీమ’ అయిన మన భరత భూమి గొప్పతనమును గూర్చి మీ సొంతమాటలలో రాయండి.
జవాబు:
భారతదేశం, సంపదలకు నిలయమైన జీవగడ్డ. ఇది పాడిపంటలకు నిలయమైన భాగ్యభూమి. భారతదేశంలో నాలుగు వేదాలు, వేదాంగాలు పుట్టాయి. ఆదికావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలయిన మహామునులను కన్న పుణ్యభూమి మన భారతదేశం. – ఈ దేశంలో దట్టమైన చెట్లతో నిండిన విస్తారమైన అడవులు ఉన్నాయి. మధురమైన భావం గల ఉపనిషత్తులు, ఇక్కడే పుట్టాయి. ఇక్కడ వేదాంత తత్త్వసారం, బాగా విస్తరించింది. ఇక్కడే ఆపస్తంభుడు, ఆశ్వలాయనుడు వంటి ఋషులు సూత్ర గ్రంథాలు రచించారు. ప్రపంచ ప్రసిద్ధి గల పరాక్రమం గల రాజులు, ఈ దేశాన్ని పాలించారు.

ఇక్కడ మన కవులు, నవరసాలతో నిండిన తేట తెలుగు మాటలతో వీనులవిందుగా కవిత్వాన్ని చెప్పారు. ఈ దేశమును ఎందరో వీర పురుషులు, రక్షించారు. ఇక్కడ ఎందరో దేశభక్తులు, జన్మించారు. కౌరవపాండవులు యుద్ధం చేసిన వీరభూమి కురుక్షేత్రం, ఈ దేశంలోనే ఉంది. కాకతీయ రాజులు, తమ యుద్ధ నైపుణ్యంతో ప్రపంచానికే వేడి పుట్టించారు.

తుంగభద్రా నదీ తీరంలో హరిపి రాజధానిగా ఆకాశాన్ని అంటిన ధైర్యంగల విజయనగర చక్రవర్తులు, ఆంధ్ర సామ్రాజ్యాన్ని పాలించారు.

IV. పదజాలం

1. ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానార్థాన్నిచ్చే పదాలమ, గేయం ఆధారంగా రాయండి.

అ) అధిక సంపదలు కలిగిన వారికంటే గుణవంతులే గొప్ప. (శ్రీలు)
ఆ) మన దేశం చాలా సంవత్సరాలు బ్రిటిష్ వారి కింద బానిసతనంలో మగ్గిపోయింది. (దాస్యము)
ఇ) మంచివారిని, గొప్పవారిని గౌరవించాలి. (ధీరపురుషులు)
ఈ) వేసవికాలం ఎండ వేడిగా ఉంటుంది. (కాక)
ఉ) వ్యాసుడు సంస్కృతంలో భారత, భాగవతాలు రాశాడు. (బాదరాయణుడు)

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు వికృతి పదాలు రాయండి.

అ) మంచి కవితలు వింటే హృదయం ఉప్పొంగిపోతుంది. ఎందరో గొప్పకవులు ఉండటం మనదేశ భాగ్యం.

ఆ) మన దేశం గురించి భక్తితో పాడాలి. అలాగే దేశాన్ని గౌరవించాలి.
జవాబు:
ప్రకృతి – వికృతి
హృదయం – ఎద, ఎడద
భక్తి – బత్తి
భాగ్యం – బాగెము
గౌరవించాలి – గారవించాలి

3. కింది వాక్యాలలో ఒకే అర్థాన్నిచ్చే పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి, రాయండి.

అ) విపినాలలో క్రూర జంతువులుంటాయి. అరణ్యాలలో మునులు నివసిస్తారు.
జవాబు:
విపినాలు, అరణ్యాలు – (సమానార్థకాలు)

ఆ) ఈ ధరణిలో ఎందరో వీరులు జన్మించారు. ఈ గడ్డమీద పుట్టిన ప్రతివారూ పౌరుషవంతులే.
జవాబు:
1. ధరణి, గడ్డ (సమానార్థకాలు)
2. వీరులు, పౌరుషవంతులు (సమానార్థకాలు)

ఇ) గొప్పవారి సేవలు కలకాలం చిరస్థాయిగా ఉంటాయి. అందుకోసం వారిని ఎల్లప్పుడూ గుర్తించాలి.
జవాబు:
కలకాలం, ఎల్లప్పుడూ (సమానార్థకాలు)

ఈ) విశాలమైన మనదేశంలో విస్తారమైన అడవులున్నాయి.
జవాబు:
విశాలమైన, విస్తారమైన (సమానార్థకాలు)

4. కింది వాక్యాలను వ్యతిరేకార్థమిచ్చే వాక్యాలుగా మార్చి రాయండి.

అ) కమల పుస్తకం చదువుతూంది.
జవాబు:
కమల పుస్తకం చదవడం లేదు. (వ్యతిరేకార్థకం)

ఆ) వర్షం జోరుగా కురుస్తూంది.
జవాబు:

  1. వర్షం జోరుగా కురవడం లేదు. (వ్యతిరేకార్థకం)
  2. వర్షం నెమ్మదిగా కురుస్తుంది. (వ్యతిరేకార్థకం)

ఇ) ఈ నది చాలా వేగంగా ప్రవహిస్తూంది.
జవాబు:

  1. ఈ నది చాలా నెమ్మదిగా ప్రవహిస్తూంది. (వ్యతిరేకార్థకం)
  2. ఈ నది చాలా వేగంగా ప్రవహించడం లేదు. (వ్యతిరేకార్థకం)

ఈ) ఈ చెట్టు కొమ్మలు చాలా పెద్దవి.
జవాబు:
ఈ చెట్టు కొమ్మలు చాలా చిన్నవి. (వ్యతిరేకార్థకం)

ఉ) లీల సంగీతం వింటూంది.
జవాబు:
లీల సంగీతం వినడం లేదు. (వ్యతిరేకార్థకం)

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

5. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాల అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.

అ) సైనికులకు చేవ ఉండాలి.
జవాబు:
చేవ = శక్తి / ధైర్యం
సొంతవాక్యం : యువకులు మంచి చేవ, ధైర్యం కలిగి ఉండాలి.

ఆ) ఋషులు, మునులు విపినాలలో తపస్సు చేస్తుంటారు.
జవాబు:
విపినాలలో = అరణ్యా లలో
సొంతవాక్యం : రాముడు పదునాల్గు సంవత్సరాలు విపినాలలో సంచరించాడు.

ఇ) మనందరం భూతలం మీద నివసిస్తున్నాము.
జవాబు:
భూతలం = భూభాగం
సొంతవాక్యం : భారత భూతలంపై శత్రు సైనికులు అడుగుపెడుతున్నారు.

ఈ) ఉగాది పచ్చడి ఆరు రుచుల మేళవింపు.
జవాబు:
మేళవింపు = కలయిక
సొంతవాక్యం : జీవితం కష్టసుఖముల మేళవింపుగా సాగుతుంది.

ఉ) తేనెటీగలు మధువును ఇస్తాయి.
జవాబు:
మధువు = తేనె
సొంతవాక్యం : గిరిజనులు మధువును సేకరించి అమ్ముతారు.

ఊ) నేటి బాలలే భావి భారత పౌరులు.
జవాబు:
భావి = రాబోవు కాలపు;
సొంతవాక్యం : నేటి పొదుపు భావి సౌఖ్య జీవితానికి మంచి మలుపు.

6. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

1. భారతదేశము కొంతకాలం బ్రిటిష్ వారికి దాస్యము చేసింది.
2. కౌరవ పాండవులు కురుక్షేత్రంలో కదనం చేశారు.
3. పగలు సూర్యుని దీప్తి వెలుగు నిస్తుంది.
4. బాదరాయణుడు భారతభాగవతాలు రచించాడు.
5. మన కృషియే విజయానికి పాదు.
6. మా తమ్ముని చిట్టి పలుకులు ఎంతో ఇంపుగా, ఉంటాయి.
జవాబు:
1. దాస్యము = బానిసత్వం
2. కదనం = యుద్ధం
3. దీప్తి . = కాంతి
4. బాదరాయణుడు = వేదవ్యాసుడు
5. పాదు = మూలం
6. పలుకులు – మాటలు

7. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. జీవగడ్డ . : తెలుగుదేశం, సిరులు పొంగిన జీవగడ్డ.
2. భాగ్యసీమ : భారతదేశం పాడిపంటలకు భాగ్యసీమ.
3. ఆదికావ్యం : రామాయణం భారతీయ సాహిత్యములో ఆదికావ్యం.
4. మధువు : పూల నుండి మధువు ఒలుకుతోంది.
5. శౌర్యచండిమ : విజయనగర రాజుల శౌర్యచండిమ పేరుకెక్కింది.
6. చెలిగిపోవు : నా మిత్రుని కృషితో వారి వంశపు అపకీర్తి చెఱిగిపోయింది.
7. మేళవించు : నా చెల్లెలు వీణ తీగలను చక్కగా మేళవిస్తుంది.
8. చెవుల విందు : ఘంటసాల వారి పాటలు చెవుల విందుగా ఉంటాయి.
9. క్రాంతహృదయులు : వాల్మీకి, వ్యాసుడు వంటి కవులు, క్రాంత హృదయులు.
10. తేజరిల్లు .: మా గ్రామం సంక్రాంతి ముగ్గులతో చక్కగా తేజరిల్లుతోంది.
11. కండగల : తిక్కన గారి పద్యాలు, కండగల తెలుగు పదాలతో రచింపబడ్డాయి.
12. కాకపెట్టిన : శివాజీ రణరంగ పాండిత్యం సుల్తానులకు కాక పెట్టింది.
13. చీకిపోవని : తెలుగు వారి తేజస్సు, చీకిపోవని చేవ గలది.

8. కింది పదాలకు వ్యతిరేకపదాలు రాయండి.

ధీరుడు × భీరుడు..
భాగ్యము × దౌర్భాగ్యము
తీయని × చేదైన
ఆది × అనాది
చిక్కని × పల్చని
గౌరవించు × అగౌరవించు

V. సృజనాత్మకత

అ. ఈ గేయాన్ని భారతమాత ఆత్మకథగా రాయండి.
జవాబు:
భారతమాత ఆత్మకథ

నేను భారతమాతను. నేను సిరిసంపదలు, పాడి పంటలు గలదానను. నా నేలపైననే, వేద వేదాంగాలు, రామాయణం వెలిశాయి. వ్యాసాది ఋషులు ఇక్కడే పుట్టారు. నా భూమిపై పెద్ద అరణ్యాలు ఏర్పడ్డాయి. ఉపనిషత్తులు నా నేలపైననే పుట్టాయి.

నన్ను పాలించిన రాజుల పరాక్రమ చరిత్రలు, నా ప్రజల బానిసత్వం వల్ల అంతరించాయి. నా ప్రజలు కిన్నెర మీటుతూ రాగాన్ని ఆలాపిస్తూ నా భావిభాగ్యాన్ని గూర్చి పాడాలి. నవరసాలతో తేట తెలుగు పదాలతో వీనుల విందుగా కవితలు చెప్పిన కవులు నా నేలపై పుట్టారు. నన్ను కాపాడిన వీరులను గూర్చి గానం చేయాలి. నా నేలపై పాండవేయులు చేసిన యుద్ధాన్ని గూర్చి. పాడుకోవాలి. నన్ను పాలించిన కాకతీయుల యుద్ధనైపుణ్యాన్ని .. కీర్తించాలి. తుంగభద్రా తీరాన నన్ను పాలించిన తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలి.
(లేదా)
ఆ) మన దేశంలాగే మనం పుట్టిన ఊరు కన్నతల్లి వంటిది. మీ ఊరిని గురించి పొగుడుతూ ఒక గేయం రాయండి.
జవాబు:
మా ఊరు గురించి గేయం

ముత్యాల సరములు :
1. సిరులు పొంగిన నదుల సీమిది
పాడిపంటల భాగ్య సీమిది
పూల వనముల పొంగురా ఇది
కన్నతల్లిది “కడియమూ”.

2. జామతోటలు జాజిపూవులు
వంగతోటలు పండ్ల తరువులు
మల్లె మొల్లలు బంతి తోటలు
కన్నతల్లిర కడియమూ.

3. గలగల పారేటి కాల్వలు
గాలికూగే కలమ సస్యము
విందు చేసే ప్రేమ పాటలు
కంటి విందుర కడియమూ.

4. కూరగాయలు కోరినన్నియు
పాడిపంటలు వలసినంతగ
వర్తకమ్మున భాగ్య సంపద.
కలుగు క్షేత్రము కడియమూ.

5. ఆశు కవితలు వధానమ్ములు
భాష్య పాఠాల్ ‘కైత పొంగులు
స్వర్ణకంకణ ధారణమ్ములు
చెళ్ళపిళ్ళా కడియమూ.

VI. ప్రశంస

అ) ఇతర భాషలలోని దేశభక్తి గేయాలను నేర్చుకొని పాడండి. జ. దేశభక్తి గేయాలు :

1) ‘సారే జహాసే అచ్ఛా’. రచయిత : మహ్మద్ ఇక్బాల్ (ఉర్దూ)

“సారే జహాఁసె అచ్ఛా హిందూస్తాం. హమారా
హమ్ బుల్ బులేఁహై ఇసకె, యేగుల్ సితాఁహమారా||
పరబత్ వో సబ్ సే ఊంఛా, హమ్ సాయా ఆస్మఁకా
వో సంతరీ హమారా! వో పాస్ బాఁ హమారా||

గోదీమె ఖేల్ తీహైఁ, ఇక హజారోఁ నదియాఁ
గుల్షన్ హైజిన్ కేదమ్ సే, రష్ కె జినాఁ హమారా!”
మజ్ – హబ్ నహీఁ సిఖాతా ఆపస్ మె బైర్ ర నా
హిందీ హైఁహమ్, వతన్
హైఁ హిందూస్తాం హమారా!

భావం :
ప్రపంచంలో భారతదేశం ఉత్తమమైనది. ఇది మనందరికీ ఒక పూలతోట. మనమంతా ఇక్కడ బుల్ బుల్ పిట్టలం. ఆకాశాన్ని అంటుతున్న ఎత్తయిన పర్వతం మనల్ని కాస్తూ రక్షిస్తోంది. భారతమాత ఒడిలో వేలకొద్దీ నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదీ జలాలతో పూచిన పూలతోటను చూచి స్వర్గమే అసూయపడుతుంది. మతము పరస్పర శత్రుత్వాన్ని బోధించదు. మనమంతా భారతీయులం.

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

2) ‘ఝండా ఊంఛా రహే హమారా’ (రచయిత : శ్యామ్ లాల్ గుప్త పార్ష్యద్ (హిందీ))

“విజయీ విశ్వతి రంగా ప్యారా
ఝండా ఉంఛా రహే హమారా (ఝండా)

సదాశక్తి బర్సానే వాలా
సేమ సుధా సర్నేనే వాలా
వీరోంకో హర్షానే వాలా
మాతృభూమికా తన మనసారా (ఝండా)

స్వతంత్రతాకీ భీషణ్ రణ్ మే
లగ్ కర్ బడౌ జోష్ క్షణ్ క్షణ్ మే
కావే శత్రుదేఖ్ కర్ మనమే
మిట్ జావే భయ సంకట్ సారా (ఝండా)

భావం :
ప్రీతికరమైన మన త్రివర్ణపతాకం విజయంతో విశ్వంలో ఎగురుగాక! ఎప్పుడూ శక్తిని విరజిమ్మేది ప్రేమామృతం చిలికేది. వీరులకు స్ఫూర్తి నిచ్చేది. మాతృభూమి తనువుకు మనస్సుకు ప్రతీకగా ఉండేది. భీకరమైన స్వాతంత్ర్య పోరాటంలో క్షణక్షణం శత్రువులను ఎదిరించే స్ఫూర్తిని కలిగిస్తుంది. ఈ జెండాను చూడగానే మనస్సులో భయభ్రాంతులు తొలగిపోతాయి.

3) జయజయ జయ ప్రియ భారత జనయిత్రి (రచయిత : దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి (సంస్కృతం))

జయ జయ జయ ప్రియభారత, జనయిత్రీ విశ్వధాత్రి
జయ జయ జయ శతసహస్ర, నరనారీ హృధయనేత్రి
జయజయ సశ్యామల, సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమ లతా, చలిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశయ, లాక్షారుణ పదయుగళా
జయజయ జయ ప్రియ భారత ……….
జయ దిశాంత గత శకుంత, దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక, గళవిశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ, చుంబిత సుందర చరణా
జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి||

(లేదా)

ఆ) దేశ గౌరవం నిలబెట్టటానికి ఏమేమి చెయ్యాలో చెప్పండి.
జవాబు:
దేశాన్ని ప్రేమించాలి. దేశ సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టాలి. దేశభక్తులను గౌరవించాలి. ఏ దేశం వెళ్ళినా మన దేశాన్ని గూర్చి మరచిపోరాదు. దేశాన్ని గౌరవించాలి. దేశ సంపదను పెంచడానికి శ్రమించాలి. బద్ధకం విడిచి కష్టించి పనిచేసి దేశసంపదను పెంచాలి. దేశ సౌభాగ్యం కోసం శ్రమించిన దేశనాయకులను గౌరవించాలి.

VII. ప్రాజెక్టు పని

(అ) భారతమాతను స్తుతించే గేయాలను సేకరించండి. వాటిని రాసి ప్రదర్శించండి.
1. ‘వందేమాతరం’ గేయం. (బెంగాలీ భాషలో బంకించంద్ర ఛటర్జీ వ్రాసినది)
జవాబు:
“వందేమాతరం”
“వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం
పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధురభాషిణీం
సుఖదాం వరదాం మాతరం
వందేమాతరం”

2. ‘జనగణమన’ ఇది మన జాతీయగీతం (రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసినది).
జవాబు:
“జన గణ మన అధినాయక జయహే !
భారత భాగ్య విధాతా !
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా
ద్రావిడ, ఉత్కల, వంగ !
వింధ్య, హిమాచల, యమునా, గంగ,
ఉచ్ఛల జలధి తరంగ !
తవ శుభ నామే జాగే !
తవ శుభ ఆశిష మాగే !
గాహే తవ జయ గాథా !
జన గణ మంగళ దాయక జయహే !
భారత భాగ్య విధాతా ! – జయహే !
జయహే ! జయహే ! . జయ జయ జయ జయహే !!”

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ) కింది పదాలు కలిపి రాయండి.
ఉదా : విశ్వ + భిరామ = (అ + అ = ఆ) – విశ్వదాభిరామ

1. సోమ + ద్రి’ : (అ + అ = ఆ) . : సోమనాద్రి
2. రవి + ఇంద్రుడు . = (ఇ + ఇ = ఈ) – – రవీంద్రుడు
3. భాను + దయం ‘ = (ఉ + ఉ = ఊ) – భానూదయం
4. మాతృ + ణం = (ఋ + ఋ = ఋ) = మాత్వణం
గమనిక :
పై వాటిలో మొదటి పదానికి చివర, రెండో పదానికి మొదట, ఒకే రకమైన అచ్చు వస్తున్నది. వీటినే – ‘సవర్ణాలు’ అంటారు. వీటితో ఏర్పడే సంధినే “సవర్ణదీర్ఘ సంధి” అంటారు.

* అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి. ఆ) కింది పదాలనూ కలిపి రాయండి.
ఉదా :
సు + గతం = (ఉ + ఆ = వా) = స్వాగతం
1. అతి + శ = (ఇ + ఆ = యా) = అత్యాశ
2. అణు + అస్తం = (ఉ + అ = వ) = అణ్వస్తం
3. పితృ + ర్జితం = (ఋ + ఆ = రా) = పిత్రార్జితం
గమనిక :
పై పదాల్లో మొదటి వరుసలో ఉన్న వాటికి చివర, (పూర్వస్వరాలుగా) ఇ, ఉ, ఋ లు ఉన్నాయి. పరస్వరం స్థానంలో వేరే అచ్చులు అంటే అసవర్ణాచ్చులు కలిశాయి. అలా కలిసినపుడు ఇ-‘య’ గాను, ఉ – ‘వ’. గాను, ఋ – ‘ర’ గాను మారడం జరిగింది. దీన్నే ‘యణాదేశ సంధి’ అంటారు.

ఇ). కింది పదాలను విడదీసి, సంధుల పేర్లు రాయండి. సంధులు ఏర్పడు తీరును చర్చించండి.

ఉదా : గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ = (ఉ + ఆ = వా) = యణాదేశ సంధి

1. ‘మహీంద్రుడు = మహీ , + ఇంద్రుడు – (ఈ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
2. అత్యంత = అతి + అంత = (ఇ + అ = య) – యణాదేశ సంధి
3. మాత్రంశ = మాతృ + అంశం = (ఋ + అ = ర) = యణాదేశ సంధి
4. అణ్వాయుధం = “అణు + ఆయుధం. = (ఉ + ఆ = వా) = యణాదేశ సంధి

ఈ) కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.

1. ఉపనిషన్మధువు = ఉపనిషత్ + మధువు = అనునాసిక సంధి
2. నాట్యమాడగ = నాట్యము + ఆడగ = ఉకారసంధి (లేక) ఉత్వసంధి
3. దేశమరసిన = దేశము + అరసిన = ఉకారసంధి (లేక) ఉత్వసంధి.

ఉ) కింది సమాసాలకు అర్థం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాస నామం
1. వేదశాఖలు వేదముల యొక్క శాఖలు షష్ఠీ తత్పురుష సమాసం
2. వృక్షవాటిక వృక్షముల యొక్క వాటిక షష్ఠీ తత్పురుష సమాసం
3. దేశగర్వము దేశము యొక్క గర్వం షష్ఠీ తత్పురుష సమాసం
4. రణకథ రణము యొక్క కథ షష్ఠీ తత్పురుష సమాసం
5. భాగ్యసీమ భాగ్యమునకు సీమ షష్ఠీ తత్పురుష సమాసం
6. కదనపాండితి కదనము నందు పాండితి సప్తమీ తత్పురుష సమాసం
7. ఆదికావ్యము ఆదియైన కావ్యం విశేషణ పూర్వపద కర్మధారయం
8. చిత్ర దాస్యము చిత్రమైన దాస్యం విశేషణ పూర్వపద కర్మధారయం
9. మేలికిన్నెర మేలయిన కిన్నెర విశేషణ పూర్వపద కర్మధారయం
10. నవరసములు తొమ్మిది సంఖ్యగల రసములు ద్విగు సమాసం
11. చివురు పలుకులు చివురుల వంటి పలుకులు ఉపమాన పూర్వపద కర్మధారయం
12. పదనుకత్తులు పదనైన కత్తులు విశేషణ పూర్వపద కర్మధారయం
13. ఉపనిషన్మధువు ఉపనిషత్తు అనే మధువు రూపక సమాసము
14. ధీరపురుషులు ధీరులైన పురుషులు విశేషణ పూర్వపద కర్మధారయం
15. క్రాంతహృదయులు క్రాంతమైన హృదయము గలవారు బహున్రీహి సమాసము

ఋ) ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు వికృతి పదాలు రాయండి.

1. మన దేశము శ్రీలు పొంగిన భాగ్యసీమ.
2. ఈ మాంస ఖండము రుచిగా ఉంటుంది.
3. నాకు దేవునిపై భక్తి ఎక్కువ.
4. రామాయణ కావ్యము ఆదికావ్యము.
5. మన దేశంలో వాల్మీకి, వసిష్ఠుడు వంటి ఋషులు ఉన్నారు
6. మనదేశం దాస్యమును పోగొట్టడానికి గాంధీజీ శ్రమించాడు.
7. ఈ రణస్థలము ఎంతో భయంకరంగా ఉంది.
8. మన భాగ్యము సమున్నతము.
9. కాకతీయులు భంగము ను పొందని వీరులు.
10. నాకు రామాయణ కథ పై మక్కువ ఎక్కువ ఉన్నారు.
11. నా మిత్రునకు గర్వము కొంచెము కూడా లేదు.

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

ఎ) ప్రకృతులు – వికృతులు రాయండి.

ప్రకృతి – వికృతి
1. శ్రీలు – సిరులు
2. ఖండము – కండ
3. భక్తి – బత్తి
4. కావ్యము – కబ్బము
5. ఋషులు – రుసులు
6. దాస్యము – దవసము
7. స్థలము – తల
8. భాగ్యము – బాగెము
9. భంగము – బన్నము
10. కథ – కత
11. గర్వము – గరువము

కవి పరిచయం

కవి : రాయప్రోలు సుబ్బారావుగారు.
జననం : మార్చి 13, 1892. (13.03. 1892).
జన్మస్థలం : గార్లపాడు, బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లా.
ప్రతిభ : రాయప్రోలువారు నవ్యకవిత్వ ఉద్యమానికి నాంది పలికి, కనీసం రెండు తరాల యువకులకు, స్ఫూర్తిని ఇచ్చిన ఆచార్యులు.
రచనలు : 1) లలిత, తృణకంకణం, అనుమతి, కష్టకమల, స్నేహలతాదేవి, స్వప్నకుమార మొదలయిన వీరి రచనలు, భావకవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యాలు.
2) ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల – అనే ప్రసిద్ధమైన ఖండకావ్యాలు వీరు రచించారు.
3) ‘రమ్యాలోకం’, ‘మాధురీ దర్శనం’ – అన్నవి పద్యరూపంలోని లక్షణ గ్రంథాలు.
భావకవి : రాయప్రోలువారు గొప్ప ‘భావకవి’.
ప్రతిపాదన : వీరు అమలిన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
మరణం : జూన్ 30, 1984. (30.06.1984)

గేయాలు – అర్ధాలు – భావాలు

1. శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వరలినది యీ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా !
అర్థాలు :
శ్రీలు = సంపదలు
పొంగిన = ఉప్పొంగిన (నిండిన)
జీవగడ్డయి (జీవగడ్డ + అయి) = చైతన్యంతో తొణికిసలాడు తున్న భూమియై
పాలు పారిన = పాలు ప్రవహించిన (పాడి పంటలతో నిండిన)
భాగ్యసీమయి (భాగ్యసీమ + అయి) = భాగ్యభూమియై
ఈ భరతఖండము = ఈ మన భారతదేశం
వరలినది = వర్ధిల్లింది
తమ్ముడా = సోదరా
భక్తి పాడర = ఈ భారతదేశాన్ని గూర్చి భక్తితో గానము చెయ్యి.

భావం :
తమ్ముడా ! మన భారతదేశం, సిరులు పొంగిన జీవభూమి. ఇది పాడిపంటలు గల భాగ్యసీమ. అటువంటి ఈ భారతదేశాన్ని గూర్చి భక్తితో పాడాలి.

I) వేదాలు. నాలుగు :

  1. ఋగ్వేదం
  2. యజుర్వేదం
  3. సామవేదం
  4. అథర్వణవేదం

II) వేదాంగాలు ఆరు :

  1. శిక్ష
  2. వ్యాకరణం
  3. ఛందస్సు
  4. నిరుక్తం
  5. జ్యోతిష్యం
  6. కల్పము.

2. వేదశాఖలు వెలిసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా !
అర్థాలు :
చెల్లెలా = సోదరీ !
ఇచ్చట = ఈ భారతదేశంలో
వేదశాఖలు = వేదములు, వేదాంగములు
వెలిసెన్ = వెలిశాయి (పుట్టాయి)
ఇచ్చట = ఈ భారతదేశంలోనే
ఆది కావ్యంబు = మొదటి కావ్యమైన వాల్మీకి రామాయణం
అలరెన్ = పుట్టింది
బాదరాయణ = ‘వ్యాసుడు’ మొదలయిన
పరమ ఋషులకు = గొప్పవారయిన ఋషులకు
ఇది = ఈ భారతదేశం
పాదు సుమ్ము = మూలంసుమా ! (జన్మభూమి)

భావం :
చెల్లెలా ! వేదాలు, వేదాంగాలు ఈ దేశంలోనే వెలిశాయి. ఆదికావ్యం అయిన రామాయణం, ‘ఇక్కడే పుట్టింది. మహాభారతం, భాగవతం రచించిన వేదవ్యాసుడు మొదలయిన మహర్షులు ఈ పుణ్యభూమిలోనే జన్మించారు.

విశేషం :
బాదరాయణుడు : బదరీవనము నివాసంగా గలవాడు (వ్యాస మహర్షి)

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

3. విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపుల తత్త్వము విస్తరించిన
విమల తల మిదె తమ్ముడా !
అర్థాలు :
ఇచ్చట = ఈ భరతభూమిలో
విపిన : = అడవులతో
బంధుర = దట్టమైన
వృక్షవాటిక = = చెట్లతోటలు (ఉన్నాయి)
ఇచ్చట = ఇక్కడ
ఉపనిషత్ + మధువు = ఉపనిషత్తులు అనే తేనె
ఒలికెన్ = చిందింది
తమ్ముడా = ఓ సోదరా
ఇదే = ఇది
విపుల = విస్తారమైన
తత్త్వము = తత్త్వజ్ఞానం
విస్తరించిన = వ్యాపించిన
విమల = నిర్మలమైన
తలము = చోటు

భావం :
తమ్ముడా ! ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన, విస్తారమైన అరణ్యాలు ఉన్నాయి. మధురమైన ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. ఇది వివరాలతో కూడిన తత్త్వబోధన విస్తరించిన పవిత్రభూమి.

ఉపనిషత్తులు : వేదాల అంత్యభాగాలు. (వీటినల్ల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.)
1) ఛాందోగ్యము,
2) ఈశా వాస్యము,
3) కఠోపనిషత్తు,
4) కేనోపనిషత్తు మొ||వి.

4. సూత్రయుగముల శుద్ధవాసన
క్షాత్రయుగముల శౌర్యచండిమ
చిత్ర దాస్యముచే చరిత్రల
చెఱిగిపోయెను చెల్లెలా!
అర్థాలు :
చెల్లెలా = సోదరీ !
సూత్రయుగముల = నీతి ధర్మములను బోధించే సూత్ర గ్రంథాలు రచించిన కాలంనాటి
శుద్ధవాసన = నిర్మలమైన పరిమళం (గొప్పతనము)
క్షాత్రయుగముల = మహారాజులు పాలించిన కాలంనాటి
శౌర్యచండిమ = పరాక్రమ తీవ్రత.
చిత్ర దాస్యముచే = మనం పరాయి రాజుల వద్ద చేసిన బానిసత్వముచే
చరిత్రల = చరిత్రల నుండి,
చెఱిగిపోయెను = అంతరించిపోయాయి.

భావం :
ధర్మసూత్ర గ్రంథాలు చెప్పిన కాలంనాటి గొప్పతనం, రాజుల కాలంనాటి పరాక్రమ చరిత్రలూ, పరదేశీయుల క్రింద బానిసత్వం వల్ల అంతరించిపోయాయి.

విశేషం :
సూత్ర గ్రంథాలు : నీతి ధర్మ బోధకములైన సూత్రాలు గల గ్రంథాలను మహర్షులు వ్రాశారు.

ఉదా :
(1) ఆపస్తంభుడు – గృహ్యసూత్రాలు వ్రాశాడు.
(2) ఆశ్వలాయనుడు’ – ఋగ్వేద సంబంధమైన శ్రాత సూత్రాలు రచించాడు.
(3) వ్యాసుడు – బ్రహ్మసూత్రాలు వ్రాశాడు.
(4) సూత్రత్రయము :
1) కల్పసూత్రములు,
2) గృహ్య సూత్రములు,
3) ధర్మ సూత్రములు.
ఇటువంటి సూత్రగ్రంథాలు ఎన్నో ఉన్నాయి.

5. మేలికిన్నెర మేళవించి
రాలు కరగగ రాగమెత్తీ
పాలతీయని భావిభారత
పదము పాడర తమ్ముడా!
అర్థాలు :
తమ్ముడా = సోదరా !
మేలి = శ్రేష్ఠమైన
కిన్నెర = కిన్నెరుల వీణ వంటి వీణను
మేళవించీ = జతపరచి (స్వరమునకు అను ఆ కూలముగా అమర్చి)
రాలు = రాళ్ళు (శిలలు)
కరగగ = కరిగేటట్లు
రాగము + ఎత్తీ = సంగీత రాగము బిగ్గరగా తీసి
పాల తీయని = పాలవలె తియ్యని
భావి భారత పదము = రాబోయే కాలంలోని భారతదేశ భాగ్యాన్ని గూర్చి
పాడర = పాడవోయి.

భావం :
సోదరా ! కిన్నెర వాద్యాన్ని మీటుతూ, రాళ్ళను కూడా కరగించగల రాగంతో, బిగ్గరగా గొంతెత్తి, భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాటగా పాడు.

6. నవరసమ్ములు నాట్యమాడగ
చివురు పలుకులు చెవుల విందుగ
కవితలల్లిన క్రాంతహృదయుల
గారవింపవె చెల్లెలా !
అర్థాలు :
చెల్లెలా = సోదరీ !
నవరసమ్ములు = శృంగారము మొదలయిన తొమ్మిది రసములు
నాట్యము +ఆడగ = చిందులు వేసేటట్లు (నిండిన)
చివురు పలుకులు = చిగుళ్ళ వంటి మెత్తని మాటలతో
చెవుల విందుగ = వినడానికి సంతోషంగా ఉండేటట్లు
కవితలు + అల్లిన = కవిత్వములు రచించిన
క్రాంతహృదయులన్ = ఇంద్రియములకు గోచరము కాని వాటిని మనస్సుతో గ్రహింపగల (సర్వజ్ఞులను)
గారవింపవే = గౌరవింపుము.

భావం :
నవరసాలతో నిండిన, చిగుళ్ళ వంటి మృదువైన తేట తెలుగు మాటలతో, చెవులకు ఇంపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను గౌరవించాలి.

విశేషం :
నవరసాలు :
1) శృంగారం
2) కరుణం
3) హాస్యం
4) వీరం
5) అద్భుతం
6) భయానకం
7) బీభత్సం
8) రౌద్రం
9) శాంతం

7. దేశగర్వము దీప్తిచెందగ
దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా!
అర్థాలు :
తమ్ముడా = సోదరా !
దేశ గర్వము = దేశము యొక్క గర్వం
దీప్తిచెందగ = ప్రకాశించేటట్లుగా
దేశచరితము = దేశము యొక్క చరిత్ర
తేజరిల్లగ = విస్తరించేటట్లుగా
దేశము+అరసిన = దేశాన్ని కాపాడిన
ధీరపురుషుల = వీరులయిన వ్యక్తులను గురించి
తెలిసి = తెలిసికొని
పాడర = పాడుము !

భావం :
దేశాభిమానము ప్రకాశించేటట్లుగా, దేశ చరిత్ర విస్తరించేటట్లుగా, దేశాన్ని కాపాడిన వీర పురుషులను గురించి తెలుసుకొని కీర్తించాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

8. పాండవేయుల పదును కత్తులు
మండి మెఱసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుంగుల
కలసి పాడవె చెల్లెలా !
అర్థాలు :
చెల్లెలా = ‘సోదరీ !
పాండవేయుల = పాండురాజు కుమారులైన పాండవుల
పదును కత్తులు = పదునైన కత్తులు (‘పదను’ అన్నది సరియైన మాట. ‘వాడి’ అని దీని అర్థం)
మండి మెఱసిన = ప్రజ్వలించి తళతళలాడిన
మహిత = ప్రసిద్ధికెక్కిన
రణకథ = కౌరవపాండవుల భారత యుద్ధ గాథను
కండగల = సారవంతమైన (చక్కని)
చిక్కని = గట్టి
తెలుంగులన్ = తెలుగు పలుకులతో
కలసి = అందరితో కలసి
పాడవే = పాడుకోవాలి

భావం :
సోదరీ ! పాండవుల కత్తుల పదనుతో తళతళలాడిన కురుక్షేత్రంలో జరిగిన భారత యుద్ధాన్ని గురించి, చక్కని, చిక్కని తెలుగు పదాలతో అందరూ కలసి పాడుకోవాలి.

విశేషం :
పాండవేయులు : పాండురాజు కుమారులు
1) ధర్మరాజు
2) భీముడు
3) అర్జునుడు
4) నకులుడు
5) సహదేవుడు

9. లోకమంతకు కాకపెట్టిన
కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడర తమ్ముడా !
అర్థాలు :
తమ్ముడా = సోదరా !
లోకమంతకు (లోకము + అంతకు) = ప్రపంచానికి అంతటికీ
కాకపెట్టిన = వేడి ఎక్కించిన
కాకతీయుల = కాకతీయ చక్రవర్తుల
కదనపాండితి = యుద్ధ నైపుణ్యాన్ని
చీకిపోవని = చితికిపోని (శిథిలముకాని)
చేవ పదములన్ ‘ = శక్తి గల మాటలతో (చెట్టుమ్రానులో సారవంతమైన భాగాన్ని ‘చేవ’ అంటారు.)
చేర్చి = కలిపి
పాడర = పాడుకోవాలి.

భావం :
ప్రపంచాన్నే వేడెక్కించిన కాకతీయ రాజుల యుద్ధ నైపుణ్యాన్ని, కలకాలం నిలిచే చేవగల పలుకులతో పాడుకోవాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 1 శ్రీలు పొంగిన జీవగడ్డ

10. తుంగభద్రాభంగములతో
పొంగి నింగిని పొడిచి త్రుళ్ళీ
భంగపడనీ తెలుగునాథుల
పాట పాడవె చెల్లెలా !
అర్థాలు :
చెల్లెలా = సోదరీ !
తుంగభద్రా = తుంగభద్రా నది యొక్క
భంగములతో = అలలతో (కెరటాలతో)
పొంగి = ఉప్పొంగి
నింగిని = ఆకాశాన్ని
పొడిచి = తాకి
భంగపడనీ = చెల్లాచెదరు కానీ
తెలుగునాథుల = తెలుగు ప్రభువులైన విజయనగర చక్రవర్తులకు సంబంధించిన
పాట = పాటను
పాడవే = పాడు.

భావం : తుంగభద్రానది అలలతోపాటుగా పొంగి, ఆకాశాన్ని అంటినా, చెక్కుచెదరని ధైర్యం గల తెలుగు రాజులయిన విజయనగర ప్రభువుల చరిత్రలను గానం చేయాలి.

విశేషం : తుంగభద్రానదీ తీరాన గల ‘హంపి’ని రాజధానిగా చేసుకొని పాలించిన తెలుగురాజులు, విజయనగర చక్రవర్తులు. వీరిలో శ్రీకృష్ణదేవరాయలు ప్రసిద్ధుడు.

పదాలు – అర్థాలు

అరయు = చూడడం, వెతకడం, జాగ్రత్తగా గమనించడం
అరసిన = చూచిన
భంగము = కెరటం లేక అల
అలరు = శోభించు
ఆదికావ్యం = మొదటి కావ్యం (వాల్మీకి – రామాయణం)
ఋషి = ముని (వసిష్ఠుడు మొదలైన వారు)
ఒలుకు = చిందిపోవు
కండగల = సారవంతమైన
కదనపాండితి = యుద్ధ నైపుణ్యం
కాక = వేడి
కిన్నెర = ఒక విధమైన వీణ
క్రాంతహృదయులు = ఇంద్రియ గోచరము కాని విషయాన్ని గ్రహించిన మనస్సు కలవారు
క్షాత్రయుగము = రాజుల కాలం
చీకిపోవని = శిథిలం కాని
చెఱిగిపోవు = అంతరించు
చేవ = శక్తి / బలం (చెట్టు మ్రానులో = చెక్కుచెదరి సారవంతమైన పదార్థం)
చెవులవిందు ఆ = చెవులకు ఇంపు కలిగించేది
జీవగడ్డ = చైతన్యంతో తొణికిసలాడుతున్న భూమి
తత్త్వము = తత్త్వజ్ఞానం
తేజరిల్లు = ప్రకాశించు
తెలుగునాథులు = తెలుగు ప్రభువులు
దాస్యము = దాసత్వం (బానిసత్వం)
దీప్తి = కాంతి
ధీరపురుషులు = ధైర్యవంతులు
నింగి = ఆకాశం
నవరసములు = తొమ్మిది రసాలు
పొడుచు = పైకి వేయడం
పాఱు = ప్రవహించు
పాదు = మూలం
పాండవేయులు = పాండురాజు పుత్రులు (పాండవులు)
పదను = వాడి
భంగపడని = ఓడిపోని
భరతఖండము = భారతభూమి
భాగ్యసీమ = భాగ్యములకు నిలయమైన ప్రదేశం
బాదరాయణుడు = వేదవ్యాసుడు (బదరీవనమున నివసించేవాడు)
బంధురము = దట్టమైనది
మధువు = తేనె
మెఱసిన = తళతళలాడే కాంతికల్గిన
మహిత = పూజ్య మైనది
మేళవించు = స్వరమునకు అనుకూలంగా అమర్చు
మేలి = మంచి
యుగము = పెక్కు సంవత్సరాల కాలం
రణకథ = యుద్ధకథ
ఱాలు = శిలలు
వరలుట = వర్ధిల్లుట
వేదశాఖలు = వేదాలు, వేదాంగాలు
వెలిసె = పుట్టాయి
విపినం = అరణ్యం
వృక్షవాటిక = చెట్లు కల ప్రదేశం
విమల తలము = నిర్మలమైన చోటు
వాసన = పరిమళం
శ్రీలు = సంపదలు
శౌర్యచండిమ = పరాక్రమ తీవ్రత
సూత్రము = ధర్మములు మొదలైనవి బోధించే చిన్నవాక్యం

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Practice the AP 7th Class Science Bits with Answers Chapter 2 Acids and Bases on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP State Syllabus 7th Class Science Bits 2nd Lesson Acids and Bases with Answers

Choose the correct answer.

Question 1.
Which of the following is natural acid?
A) Citric acid
B) Hydrochloric acid
C) Oxalic acid
D) Acetic acid
Answer:
B) Hydrochloric acid

Question 2.
A blue litmus turns red when it reacts with
A) Salt
B) Base
C) Acid
D) None of these
Answer:
C) Acid

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 3.
Name the acid present in lemon juice
A) Acetic acid
B) Citric acid
C) Propanic acid
D) Hydrochloric acid
Answer:
B) Citric acid

Question 4.
Ant releases this acid.
A) Citric acid
B) Formic acid
C) Lactic acid
D) Oxalic acid
Answer:
B) Formic acid

Question 5.
When methyl orange is mixed with citiric acid it turns
A) Red
B) Pink
C) Yellow
D) Colourless
Answer:
A) Red

Question 6.
Phenolphthalein turns ………… in basic solution.
A) Red
B) Yellow
C) Pink
D) Green
Answer:
C) Pink

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 7.
Lemon Juice + Marble =
A) Hydrogen
B) Carbon dioxide
C) Oxygen
D) Sulphur dioxide
Answer:
B) Carbon dioxide

Question 8.
Neutralization of Hydrochloric acid solution with Caustic soda solution gives
A) Sodium chloride
B) Sodium carbonate
C) Copper sulphate
D) None of the above
Answer:
A) Sodium chloride

Question 9.
The substance that turns blue litmus to red are ……….. in nature.
A) Acidic
B) Basic
C) Neutral
D) All the above
Answer:
A) Acidic

Question 10.
Turmeric paper is a natural
A) Salt
B) Acid
C) Base
D) Indicator
Answer:
C) Base

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 11.
The substance that turns red litmus to blue are …………. in nature.
A) Acidic
B) Basic
C) Neutral
D) All the above
Answer:
B) Basic

Question 12.
Burning sensation of ant bite is caused by
A) Acetic Acid
B) Formic Acid
C) Uric Acid
D) Toxin
Answer:
B) Formic Acid

Question 13.
Vinegar consist acid
A) Acetic
B) Citric
C) Lactic
D) Oxalic
Answer:
A) Acetic

Question 14.
Malic Acid present in
A) Orange
B) Amla
C) Apples
D) Tea
Answer:
C) Apples

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 15.
The substances which are soapy to touch are …………. in nature.
A) Acids
B) Bases
C) Salts
D) Minerals
Answer:
B) Bases

Question 16.
Ammonium Hydroxide is used in ………….. cleaning.
A) Glass
B) Tiles
C) Granites
D) All the above
Answer:
A) Glass

Question 17.
Methyl Orange gives red colour with
A) Acids
B) Bases
C) Salts
D) All the above
Answer:
A) Acids

Question 18.
Methyl Orange gives yellow colour with ………
A) Acids
B) Bases
C) Salts
D) All the above
Answer:
B) Bases

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 19.
Pickles, jams, jellie ‘s are not preser-container.
A) Metallic
B) Glass
C) Porcelain
D) Plastic
Answer:
A) Metallic

Question 20.
Copper reacts with and forms blue-green layer.
A) Acids
B) Bases
C) Salts
D) Neutrals
Answer:
A) Acids

Question 21.
Henry Cavendish, an Italian discovered
A) Oxygen
B) Nitrogen
C) Copper
D) Hydrogen
Answer:
D) Hydrogen

Question 22.
Acid rains are the combination of ……….. acids.
A) Sulphuric
B) Nitric
C) Carbonic
D) All the above
Answer:
D) All the above

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 23.
Egg shells release …………… gas when it reacts with acids.
A) Oxygen
B) Carbon dioxide
C) Hydrogen
D) Helium
Answer:
B) Carbon dioxide

Question 24.
One of the following manure increase salinity of the soil
A) Organic
B) Chemical
C) Bio
D) All of these
Answer:
B) Chemical

Question 25.
Ammonium Hydroxide is useful to remove stains of
A) Grease
B) Blood
C) Tea
D) Ink
Answer:
A) Grease

Question 26.
Aluminum hydroxide is useful to stop
A) Rains
B) Floods
C) Fire
D) Pollution
Answer:
C) Fire

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 27.
We lose some salts through
A) Digestion
B) Reproduction
C) Excretion
D) Respiration
Answer:
C) Excretion

Question 28.
Carbonic acids present in ………..
A) Eggs
B) Cool drinks
C) Cakes
D) Meat
Answer:
B) Cool drinks

Question 29.
When lime water is sprayed on turmeric paper, its colour is
A) Yellow
B) Blue
C) green
D) Red
Answer:
D) Red

Question 30.
Following is a natural indicator
A) Turmeric
B) Methyl
C) Phenolphthalein
D) Methyl orange
Answer:
A) Turmeric

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 31.
The subsances that are soapy to touch
A) Acids
B) Basics
C) Neutrals
D) Minerals
Answer:
B) Basics

Question 32.
Which litmus paper do you use to test acids?
A) Red
B) Blue
C) Orange
D) Green
Answer:
B) Blue

Question 33.
If the substance changed the red litmus in to blue it is an ………..
A) Acid
B) Basic
C) Neutral
D) All
Answer:
B) Basic

Question 34.
Acid present in apple’s
A) Citric acid
B) Lactic acid
C) Malic acid
D) Tannic acid
Answer:
C) Malic acid

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 35.
Ascorbic acid is present in
A) Palm oil
B) Amla
C) Tea
D) Grapes
Answer:
B) Amla

Question 36.
Match the following.
i) Oxalic acid [ ] a) Tomato
ii) Lactic acid [ ] b) Tea
c) Curd
A) a, b
B) b, c
C) a, c
D) c, a
Answer:
C) a, c

Question 37.
Which one is used as an anti acid?
A) Mg(OH)2
B) CuSO4
C) AlSO4
D) HCl
Answer:
A) Mg(OH)2

Question 38.
Common name of ‘Magnesium Hydroxide’ is
A) King of chemical
B) Milk of Magnesium
C) Soap maker
D) Glass cleaner
Answer:
B) Milk of Magnesium

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 39.
Chemical name of lime water is
A) Calcium hydroxide
B) Atnmonium Hydroxide
C) Sodium Hydroxide
D) Magnesium Hydroxide
Answer:
A) Calcium hydroxide

Question 40.
Base present in the soaps is
A) Calcium hydroxide
B) Ammonium Hydroxide
C) Sodium Hydroxide
D) Magnesium Hydroxide
Answer:
C) Sodium Hydroxide

Question 41.
What is the indicator used in this activity?
AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers 1
A) Lemon leaves
B) Methyl orange
C) Lemon juice
D) Blood
Answer:
B) Methyl orange

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 42.
Reaction colour of Methyl orange with acids is
A) Red
B) Yellow
C) Pink
D) Black
Answer:
A) Red

Question 43.
Reaction colour of Methyl orange with base is
A) Yellow
B) Pink
C) Orange
D) Blue
Answer:
A) Yellow

Question 44.
Which indicator is colourless in acids?
A) Methyl orange
B) Phenolphthalein
C) Turmeric
D) Lemon juice
Answer:
B) Phenolphthalein

Question 45.
Which gas is discovered by Henry Cavendish?
A) H2
B) O2
C) Cl2
D) Li
Answer:
A) H2

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 46.
The copper is coated with
A) Iron
B) Ledoxide
C) Tin
D) Steel
Answer:
C) Tin

Question 47.
Here the tested gas is
AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers 2
A) O2
B) H2
C) H2O
D) Cl2
Answer:
B) H2

Question 48.
In this experiment the releasing gas is
AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers 3
A) O2
B) H2
C) CO2
D) H2O
Answer:
C) CO2

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 49.
When a magician cuts the lemon with the knife, it becomes red in colour. The material used on the knife may
A) Salt
B) Methyl orange
C) Rel litmus
D) Lime water
Answer:
B) Methyl orange

Question 50.
Methyl orange converts acids into X colour and bases to Y colour. What are X and Y
A) red, violet
B) violet, yellow
C) yellow, violet
D) red, yellow
Answer:
D) red, yellow

Question 51.
You find some stains on the mirror in your house. Which of these is used to remove the stains?
A) Ammonia
B) Ammonium Hydroxide
C) Phenolphthalein
D) Mythyl orange
Answer:
B) Ammonium Hydroxide

Question 52.
Basic solution converts red litmus into blue litmus. If you add the substance given below reverse happens
A) Baking Soda
B) Lime
C) Hydrochloric acid
D) Ammonium hydroxide
Answer:
C) Hydrochloric acid

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 53.
Acid used in pulihora
A) Carbonic
B) Acetic acid
C) Citric acid
D) Oxalic acid
Answer:
C) Citric acid

Question 54.
The scientist who discovered hydrogen gas is
A) Joseph Priestly
B) Hendry Cavendish
C) Charles Darwin
D) Ernest Rutherford
Answer:
B) Hendry Cavendish

Question 55.
The following is acidic in nature
A) Grape juice
B) Bleaching powder solution
C) Soap solution
D) Lime water
Answer:
A) Grape juice

AP 7th Class Science Bits Chapter 2 Acids and Bases with Answers

Question 56.
Identify the correct set of natural indicators.
A) Cucumber & melon
B) Turmeric & vinegar
C) Turmeric & rose petals
D) Hibiscus & melon
Answer:
C) Turmeric & rose petals