AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

10th Class Telugu 11th Lesson భిక్ష 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“ఇవ్వాటిమీద నాగ్రహముదగునె?” అనే మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు? (March 2017)
జవాబు:
ఈ వాక్యం భిక్ష పాఠంలోనిది. కాశీ మహా నగరంలో వేదవ్యాస మహర్షికి ఎవ్వరూ భిక్ష పెట్టలేదు. దానితో ఆయనకు కోపం వచ్చింది. కాశీని శపించబోయాడు. అంతలో పార్వతీదేవి ప్రాకృత వేషంలో వచ్చింది. భోజనానికి రమ్మంది. వేదవ్యాసునికి బుద్ధులు చెపుతూ కాశీ మహానగరం మీద కోప్పడడం తప్పని చెప్పింది.

ప్రశ్న 2.
భిక్ష పాఠ్యాంశ నేపథ్యం రాయండి.
జవాబు:
వేదవ్యాస మహర్షి తన 10 వేలమంది శిష్యులతో కాశీలో నివసిస్తున్నాడు. ఋషి ధర్మంగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. శివుడు వ్యాసుని పరీక్షించాలనుకొన్నాడు. అతనికి భిక్ష దొరకకుండా చేయుమని తన భార్య పార్వతీదేవికి చెప్పాడు. ఆమె కాశీ నగర స్త్రీల హృదయాలలో ప్రవేశించి భిక్ష దొరకకుండా చేసింది.

ప్రశ్న 3.
భిక్ష పాఠం ఎవరు రచించారు? ఆయన గురించి రాయండి.
జవాబు:
భిక్ష పాఠం శ్రీనాథ మహాకవి రచించాడు. ఆయన రచించిన కాశీఖండం సప్తమాశ్వాసంలోనిది.

శ్రీనాథుడు 1380-1470 మధ్య జీవించాడు. అనగా 15వ శతాబ్ది కవి. రాజమహేంద్రవరంలో రెడ్డిరాజుల కొలువులో ఆస్థానకవి. మారయ, భీమాంబలు శ్రీనాథుని తల్లిదండ్రులు.

‘కవి సార్వభౌమ’ బిరుదాంకితుడు. పెదకోమటి వేమారెడ్డి కొలువులో విద్యాధికారి. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని గౌడడిండిమ భట్టును పాండిత్యంలో ఓడించాడు. అతని కంచుఢక్కను పగులకొట్టించాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 4.
శ్రీనాథుని రచనా శైలిని, సాహిత్య సేవను వివరించండి.
జవాబు:
శ్రీనాథుడు చిన్నతనం నుండే కావ్యరచన ప్రారంభించాడు. మరుత్తరాట్చరిత్ర, కాశీఖండం, శృంగారనైషధం మొదలైనవి రచించాడు.

చమత్కారానికీ, లోకానుశీలనకు, రసజ్ఞతకు, ఆయన జీవిత విధానానికి అద్దంపట్టే చాటువులు చాలా ఉన్నాయి. ఆయన కవిత్వం ఉద్దండలీల, ఉభయ వాక్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి వంటి లక్షణాలతో ఉంటుంది.

సీస పద్య రచనలో ఆయనకు ఆయనే సాటి. వృద్ధాప్యంలో కష్టాలనుభవించాడు.

ప్రశ్న 5.
వ్యాసునికి కోపకారణం తదనంతర పరిణామాలను వివరించండి.
జవాబు:
వ్యాసుడు కాశీనగరంలో శిష్యులతో భిక్ష కోసం తిరిగాడు. ఈశ్వరుని మాయతో వరుసగా రెండు రోజులపాటు ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. దానితో వ్యాసుడు భిక్షాపాత్రను పగులకొట్టి, కాశీవాసులకు మూడు తరాలదాకా ధనం, విద్య, మోక్షం లేకుండుగాక అని శపించబోయాడు.

అప్పుడు పార్వతీదేవి కాశీ నగరాన్ని శపించడం తప్పని, ఉన్న ఊరు కన్నతల్లితో సమానమని వ్యాసుడిని మందలించి, వ్యాసుడిని తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది. వ్యాసుడు, తన పదివేల శిష్యులు తినకుండా, తాను తినననే వ్రతం తనకు ఉందన్నాడు. అప్పుడు అందరికీ భోజనం పెడతాననీ శిష్యులతో తన ఇంటికి రమ్మని పార్వతి పిలిచింది.

వ్యాసుడు గంగలో స్నానం చేసి శిష్యులతో పార్వతీదేవి ఇంటికి వచ్చాడు. పార్వతి వారందరికీ భోజనం వడ్డించింది.

ప్రశ్న 6.
‘వ్రతము తప్పి భుజింపంగ వలను గాదు’ – ఈ మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంగా అన్నారు?
జవాబు:
‘వ్రతము తప్పి భుజింపంగ వలనుగాదు’ అని వ్యాసుడు సామాన్య స్త్రీవలె కనబడిన అన్నపూర్ణాదేవితో అన్నాడు. వ్యాసుడు తనకు రెండు రోజులుగా కాశీలో భిక్ష దొరకలేదని కోపించి కాశీనగరమును శపించబోయాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి సామాన్య స్త్రీవలె కనబడి, వ్యాసుని మందలించి, తన ఇంటికి భోజనానికి రమ్మని వ్యాసుడిని పిలిచింది.

అప్పుడు వ్యాసుడు తనకు పదివేల మంది శిష్యులు ఉన్నారనీ, వారందరితో కలిసి భుజించే వ్రతం తనకు ఉందనీ, ఆ వ్రతాన్ని విడిచి పెట్టి తాను ఒక్కడూ ‘భోజనానికి రాననీ చెప్పిన సందర్భంలో ఈ మాటను అన్నపూర్ణాదేవితో ఆయన చెప్పాడు.

ప్రశ్న 7.
కాశీ పట్టణంలో స్త్రీలు అతిథులను ఎలా ఆదరించేవారు?
జవాబు:
కాశీనగరంలోని స్త్రీలు అన్నపూర్ణాదేవికి ప్రియమైన స్నేహితురాండ్రు. వారు వాకిట్లో ఆవుపేడతో చక్కగా అలికి, నాలుగు అంచులూ కలిసేలా దానిపై ముగ్గు పెడతారు. ఆ ముగ్గు మధ్యలో నచ్చిన అతిథిని నిలిపి, వారికి అర్హపాద్యాలు ఇస్తారు. వారికి పూలతో, గంధముతో పూజ చేస్తారు.

తరువాత బంగారు గరిటెతో అన్నముపై ఆవునేయిని అభిఘరిస్తారు. తరువాత భక్తి విశ్వాసాలు కనబరుస్తూ, పండ్లతో, పరమాన్నముతో, పలురకాల పిండివంటలతో, గాజులు గలగల ధ్వని చేస్తుండగా, యతీశ్వరులకు వారు మాధుకర భిక్ష పెడతారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 8.
కోపం తగదని అన్నపూర్ణాదేవి వ్యాసునికి ఏయే ఉదాహరణల పూర్వకంగా తెలిపింది?
జవాబు:
వ్యాసుడికి కోపం తగదని అన్నపూర్ణాదేవి ఈ కింది విధంగా చెప్పి, ఆయనను మందలించింది.

“ఓ మహర్షీ! నీవు ఇప్పుడు గొంతుదాకా తినడానికి భిక్షాన్నము దొరకలేదని చిందులు వేస్తున్నావు. ఇది మంచిపని కాదు. నీవు నిజంగా శాంత స్వభావం కలవాడవు కాదు. ఎందుకంటే, ఎంతో మంది మునులు పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళదీస్తున్నారు. మరికొందరు శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకుంటున్నారు. కొందరు వరిమళ్ళలో రాలిన ధాన్యం కంకులు ఏరుకొని దానితో బతుకుతున్నారు. మరికొందరు మునులు రోళ్ళ దగ్గర జారిపడిన బియ్యం ఏరుకొని బతుకుతున్నారు. వారంతా నీ కంటె తెలివితక్కువవారు కాదు కదా ! ఆలోచించు.

అదీగాక ఉన్నఊరు, కన్నతల్లి వంటిది. కాశీ నగరం శివునికి భార్య. “నీవంటివాడు అటువంటి కాశీ నగరాన్ని భిక్ష దొరకలేదని కోపించడం తగదు.” ఈ ఉదాహరణలతో అన్నపూర్ణాదేవి వ్యాసుడిని మందలించింది.

10th Class Telugu 11th Lesson భిక్ష 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“భిక్ష” పాఠ్యభాగ కథను మీ మాటల్లో వివరించండి. (June 2018)
జవాబు:

  1. వ్యాసమహర్షి శిష్యులతో మండుటెండలో కాశీనగర బ్రాహ్మణ వీధులందు భిక్ష కోసం తిరుగసాగాడు.
  2. ఒక ఇల్లాలు వండుతున్నామని చెప్పగా మరో గృహిణి మళ్ళీ రమ్మని చెబుతుంది. ఇంకొక ఆవిడ వ్రతం అని చెబితే, వేరొక ఇల్లాలు అసలు తలుపులే తెరువదు.
  3. కాశీ నగర గృహిణులు అన్నపూర్ణాదేవికి ప్రియమైన చెలులు. అతిథిని పరమేశ్వర స్వరూపంగా భావించి సకల మర్యాదలతో భిక్ష సమర్పిస్తారు. అలాంటి స్త్రీలున్న కాశీలో ఒక్కరు కూడా భిక్ష సమర్పించకపోవడంతో వ్యాసుడు ఆశ్చర్యపోయాడు.
  4. మరుసటి రోజు కూడా విశ్వనాథుని మాయ వలన భిక్ష లభించకపోవడంతో వ్యాసుడు కోపావేశాలకు లోనై కాశీనగర జనులను శపించబోయాడు.
  5. అప్పుడు పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో బ్రాహ్మణ మందిరపు వాకిట నిల్చి, వ్యాసుడిని ఇటు రమ్మని పిల్చి “ఓ మునివరా ! ‘ఉన్న ఊరు కన్నతల్లితో సమానం’ అని నీవెరుగవా ? ఈ కాశీనగరిపై ఇంత కోపం తగునా ?” అని సున్నితంగా మందలించింది.
  6. “మా ఇంటికి భోజనానికి రా !” అని పార్వతీదేవి పిలువగా, శిష్యులను వదలి పెట్టి భుజించరాదన్న తన నియమాన్ని వ్యాసుడు వెల్లడించాడు. ఆమె తాను విశ్వనాథుని దయవలన ఎంతమంది అతిథులకైనా భోజనం పెట్టగలనని తెల్సింది. వ్యాసుడు తన శిష్యులతో పాటు, గంగానదిలో స్నాన, ఆచమనాలు ముగించి, భోజనానికి వచ్చాడు.

ప్రశ్న 2.
“కోపం మంచి చెడులను గ్రహించే జ్ఞానాన్ని నశింపచేస్తుంది” – భిక్ష పాఠ్యభాగం ఆధారంగా నిరూపించండి. March 2018
జవాబు:

  1. బ్రహ్మజ్ఞానియైన వేదవ్యాసుడు తన పదివేలమంది శిష్యులతో కాశీలో కొంతకాలం నివసించాడు. ఆ సమయంలో శిష్యులతో కలిసి భిక్షాటనం చేసి జీవించేవాడు. ఒక రోజున కాశీ విశ్వనాథుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలన్న సంకల్పం కలిగింది.
  2. పరమేశ్వర సంకల్పం వలన పట్టపగలు మండుటెండలో భిక్షాటనం చేస్తున్న వ్యాసునికి భిక్ష లభించలేదు. “నేను ఈ రోజు ఏ పాపిష్టి వాడి ముఖం చేశానో” అని వ్యాసుడు చింతించాడు. ఆ రోజుకు ఉపవాసం ఉండి మరునాడు భిక్ష కోసం తిరుగసాగాడు. కానీ విశ్వనాథుని మాయ వలన ఏ ఇల్లాలూ భిక్ష పెట్టలేదు.
  3. కోపంతో ఆలోచనాశక్తిని కోల్పోయిన వ్యాసుడు భిక్షపాత్రను నట్టనడివీథిలో విసిరికొట్టి ముక్కలు చేశాడు. ఈ కాశీ నగరంలో నివసించే వారికి మూడు తరాలదాక ధనము, విద్య, మోక్షము లభించకుండుగాక !” అని శపించబోయాడు.
  4. మహర్షులు మనోనిగ్రహం కలిగి ఉండాలి. కోపాన్ని జయించాలి. సంయమనాన్ని (ఓర్పును) వహించాలి. కానీ వ్యాసుడు అలా చేయలేకపోయాడు. వేదాలను విభజించినవాడు, అష్టాదశ పురాణాలను రచించిన వాడైన వ్యాసుడు తన గొప్పతనానికి తగినట్లు ప్రవర్తించక, మితిమీరిన కోపావేశాలకు లోనయ్యాడు. పార్వతీ పరమేశ్వరుల ఆగ్రహానికి గురియైనాడు.
  5. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఎంతటివారికైనా తిప్పలు తప్పవనే విషయం వ్యాసుని ప్రవర్తన ద్వారా
    నిరూపితమైంది. “కోపం ఆలోచనాశక్తిని నశింపజేస్తుంది” అనటానికి వ్యాసుని వృత్తాంతమే నిదర్శనమని చెప్పవచ్చు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. వ్యాసమహర్షి :
వేద విభజన చేశాడు. 18 పురాణాలు రచించాడు. 10 వేల మంది శిష్యులకు విద్య నేర్పేవాడు. ఋషి ధర్మంగా భిక్షాటన చేసినవాడు. రెండు రోజులు భిక్ష దొరకలేదు. తన శిష్యుల ఆకలి చూడలేక కాశీని శపించబోయాడు. అంటే కాశీని కూడా శపించగల మహా తపస్సంపన్నుడు. అన్నపూర్ణాదేవి స్వయంగా పిలిచి భిక్షను పెట్టింది. అంటే అన్నపూర్ణాదేవిని కూడా ప్రత్యక్షం చేసుకోగల పుణ్యాత్ముడు. ఆ జగన్మాత చేతి వంటను రుచి చూసిన మహాభాగ్యశాలి. కాని తన కోపం కారణంగా ఆ వైభవాలను కోల్పోయాడు. అల్పసంతోషి. తక్షణ కోపం కలవాడు.

2. కాశీలోని సామాన్య స్త్రీలు :
చక్కగా అలికి ముగ్గులు పెట్టి, ఇల్లు కలకలలాడుతూ ఉంచే స్వభావం కలవారు. అతిథులను సాక్షాత్తు దైవంగా భావించి పూజిస్తారు. బంగారు కంచంలో పిండి వంటలతో అన్నం పెడతారు. భిక్షుకులకు లేదు అనే మాట వారినోట రాదు. వారి హృదయాలలో నిరంతరం అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. కాశీలోని స్త్రీలు అన్నపూర్ణాదేవికి చెలికత్తెలు. అంతటి పుణ్యస్త్రీలు ఎక్కడా కనిపించరు. వారికి వారేసాటి.

3. అన్నపూర్ణాదేవి (పార్వతీదేవి) :
కేవలం భిక్ష దొరకనంత మాత్రాన ఇంత బాధపడిపోతావా? ఇది మంచిదా? అని బిడ్డను తల్లి మందలించినట్లు వ్యాసుని మందలించింది. పిడికెడు బియ్యం వండుకొని తినే వారున్నారు. కేవలం కాయలు తినే వారున్నారు. ఇంకా రకరకాల వారున్నారు కదా! వారంతా నీకంటే తెలివితక్కువ వారా! అని ప్రశ్నించింది.

ఒక బిడ్డకు తల్లి చెప్పే నీతులు, మందలింపులు, పోలికలు, ప్రశ్నలు సంధిస్తూ పార్వతీదేవి ఒక పెద్ద ముత్తైదువగా కనిపిస్తుంది. పరిపూర్ణ మాతృత్వం మూర్తీభవించినట్లుగా అన్నపూర్ణాదేవి స్వభావం కనిపిస్తుంది.

ప్రశ్న 4.
అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమవడానికి కారణాలు వివరించండి.
జవాబు:
వేదవ్యాసుడు ఒకనాడు కాశీనగరంలో తన పదివేల మంది శిష్యులతో భిక్ష కోసం బ్రాహ్మణ వీధులలో ఇంటింటికీ తిరిగాడు. ఎవరూ వారికి భిక్ష పెట్టలేదు. సామాన్యంగా కాశీనగరంలోని బ్రాహ్మణ స్త్రీలు, రోజూ అతిథులకు ఆదరంగా మాధుకర భిక్ష పెడుతూ ఉంటారు. కానీ ఆనాడు వ్యాసుడికి ఎవరూ భిక్ష పెట్టలేదు. ఒకామె ‘అన్నం వండుతున్నాము’ అంది. మరొక స్త్రీ ‘మళ్ళీ రండి’ అంది. ఒకామె తమ ఇంట్లో దేవకార్యం అని చెప్పింది.

ఆ రోజుకు ఎలాగో ఉపవాసం ఉందామనీ, మరునాడు తప్పక భిక్ష దొరుకుతుందని వ్యాసుడు నిశ్చయించాడు. మరుసటి రోజున వ్యాసుడు శిష్యులతో భిక్షాటనకు వెళ్ళాడు. ఈశ్వరుడి మాయవల్ల ఆ రోజు కూడా ఆయనకు కాశీ నగరంలో ఎవరూ భిక్ష పెట్టలేదు.

దానితో వ్యాసుడు కోపంతో తన భిక్షాపాత్రను పగులకొట్టి, కాశీవాసులకు మూడు తరాల వరకూ ధనము, మోక్షము, విద్య లేకుండుగాక అని శపించడానికి సిద్ధమయ్యాడు.

అప్పుడు అన్నపూర్ణాదేవి, ఒక బ్రాహ్మణ భవనం వాకిటిలో సామాన్య స్త్రీవలె ప్రత్యక్షమయ్యింది. వ్యాసుడు కాశీ నగరాన్ని శపించకుండా అడ్డుపడి, ఆయనను మందలించడానికే అన్నపూర్ణాదేవి అలా ప్రత్యక్షమయ్యింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 5.
‘కోపం అన్ని అనర్ధాలకు కారణం అని ఎలా చెప్పగలవు?
(లేదా)
కోపం మనిషి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది అనే విషయాన్ని భక్ష పొఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
“కోపం వస్తే నేను మనిషిని కాను” అని అంటూ ఉంటారు. అది నిజమే. కోపం వస్తే తనను తాను మరచి, మనిషి రాక్షసుడు అవుతాడు. ఆ కోపంతో తాను ఏమి చేస్తున్నాడో, తెలిసికోలేడు. కోపంలోనే అన్నదమ్ములనూ, అక్క చెల్లెండ్రనూ, చివరకు కట్టుకొన్న భార్యనూ, కన్నపిల్లల్నీ కూడా చంపుతూ ఉంటారు. కాబట్టి కోపం మంచిది కాదు.

ఈ కథలో వ్యాసుడి అంతటి బ్రహ్మజ్ఞాని రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్నే శపించబోయాడు. భర్తృహరి నీతి శతకంలో “క్షమ కవచంబు క్రోధమది శత్రువు” అంటాడు. అంటే ఓర్పు కవచం లాంటిది.
కోపం శత్రువు లాంటిది అని అర్థం. శత్రువులాంటి కోపాన్ని విడిచి పెట్టాలి.

దుర్యోధనుడికి పాండవుల పైన, భీముడి మీద కోపం. అందుకే వారితో తగవు పెట్టుకొని యుద్ధంలో తాను మరణించాడు. దేవతలపై కోపంతోనే, రాక్షసులు అందరూ మరణించారు. “కోపమునను ఘనత కొంచెమైపోవును” అని వేమన కవి చెప్పాడు.

కాబట్టి మనిషి కోపాన్ని అణచుకోవాలి. కోపము మనిషికి శత్రువు వంటిది. “తన కోపమే తన శత్రువు” అంటాడు సుమతీ శతక కర్త. కాబట్టి కోపం విడిచి పెట్టాలి.

ప్రశ్న 6.
‘ఆవేశం ఆలోచనలను నశింపచేస్తుంది’ – మీ పాఠం ఆధారంగా సమర్థించండి.
జవాబు:
కోపం వస్తే, ఆవేశం వస్తుంది. ఆవేశంలో ఏది మంచిదో, ఏది చెడ్డదో గ్రహించే వివేచన శక్తి మనిషికి నశిస్తుంది. దానితో అతడు తప్పుడు పనులకు సిద్ధం అవుతాడు. ఆవేశంతో కట్టుకున్న భార్యను, కన్న పిల్లల్నీ కూడా చంపడానికి సిద్ధం అవుతాడు.

కోపం యొక్క ఆవేశంలో అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసమహర్షి అంతటివాడు, కన్నతల్లి వంటి కాశీ నగరాన్నే శపించబోయాడు. వ్యాసమహర్షి పదివేలమంది శిష్యులకు గురువు. నిత్యం కాశీ నగరంలో శిష్యులతో భిక్షకు వెళ్ళి ఆ భిక్షాన్నం తిని జీవించేవాడు. వ్యాసుడిని పరీక్షించాలని శివుడు భావించాడు. అన్నపూర్ణాదేవితో చెప్పి ఎవరూ వ్యాసునికి భిక్ష పెట్టకుండా చేశాడు.

ఒక రోజున వ్యాసుడికి, శిష్యులకూ ఎవరూ భిక్ష పెట్టలేదు. ఆ రోజు కాకపోయినా, మరునాడు తప్పక భిక్ష దొరకుతుందని వారు అనుకున్నారు. మరునాడు కూడా వ్యాసునికి ఎవరూ భిక్ష పెట్టలేదు.

దానితో వ్యాసుడు కోపంవల్ల వచ్చిన ఆవేశంతో, ఉద్రేకంతో తాను నివసిస్తున్న కాశీ నగరాన్నే శపించబోయాడు. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అంటారు. భిక్ష దొరకలేదనే ఆవేశంతో, వ్యాసుడు కాశీ నగరవాసులకు మూడు తరాల దాక విద్య, ధనము, మోక్షము లేకుండా పోవుగాక అని శపించబోయాడు.

దీనినిబట్టి ఆవేశం, ఆలోచనలను నశింపజేస్తుంది అని మనకు తెలుస్తోంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 7.
అన్నపూర్ణాదేవి పాత్ర స్వభావం వివరించండి.
జవాబు:
పార్వతీ స్వరూపం :
అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరుని ఇల్లాలు. పరమశివుని భార్య పార్వతీదేవినే, కాశీ నగరంలో అన్నపూర్ణాదేవి అని అంటారు. అన్నపూర్ణా విశ్వేశ్వరులు ఒకసారి కాశీ నగరంలో శిష్యులతో నివసిస్తున్న వ్యాసమహర్షిని పరీక్షిద్దాం అనుకున్నారు.

ఆదిశక్తి :
కాశీ నగరంలో అన్నం కావలసిన వారందరికీ అన్నపూర్ణాదేవి భిక్ష పెడుతుంది. కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు అందరూ అన్నపూర్ణాదేవికి స్నేహితురాండ్రు. అన్నపూర్ణాదేవి వేదపురాణ శాస్త్ర మార్గాన్ని చక్కగా పాటించే ముత్తయిదువ. ఆమె కాశీనగర బంగారుపీఠాన్ని అధిష్ఠించిన ఆదిశక్తి.

ఆతిధ్యము :
వ్యాసుడు కాశీ నగరాన్ని శపించకుండా అన్నపూర్ణాదేవి అడ్డుపడింది. ఒక బ్రాహ్మణ గృహద్వారం దగ్గర సామాన్య స్త్రీ వలె ఆమె ప్రత్యక్షమై, వ్యాసుడిని మందలించింది. తన ఇంటికి వ్యాసుడినీ, శిష్యులనూ భోజనానికి పిలిచి, వారికి కడుపునిండా భోజనం పెట్టింది.

మాట చాతుర్యం :
అన్నపూర్ణాదేవి మాటలలో మంచి నేర్పు ఉంది. “గొంతు దాకా తిండిలేదని గంతులు వేస్తున్నావు. మహర్షులు పిడికెడు నివ్వరి గింజలతో, కాయగూరలతో తృప్తి పడుతున్నారు కదా” అని వ్యాసుడిని చక్కగా మందలించింది. ఉన్న ఊరు కన్నతల్లి వంటిదని, కాశీ నగరం శివుడికి ఇల్లాలని, వ్యాసుడికి గుర్తు చేసింది. వ్యాసుడు అంతటివాడు కాశీని శపించడం తగదని హితవు చెప్పింది.

దీనినిబట్టి అన్నపూర్ణాదేవి మహాసాధ్వి అని, మంచి మాట చాతుర్యం కలదని, అతిథులకు అన్నం పెట్టే ఉత్తమ ఇల్లాలు అని తెలుస్తుంది.

10th Class Telugu 11th Lesson భిక్ష Important Questions and Answers

ప్రశ్న 1.
యాచన మంచిదికాదు అని చెబుతూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
యాచన మానండి – మాన్నించండి
ఆత్మాభిమానానికి గొడ్డలిపెట్టు యాచన. మర్యాదకు సమాధి యాచన. దరిద్రానికి పునాది యాచన.

అందుకే యాచన మానండి. కష్టపడండి. కాసులను ఆర్జించండి. దరిద్రాన్ని తరిమికొట్టండి. మీకెదురైన యాచకులకు ఆత్మసైర్యాన్ని కల్గించండి. జీవన మార్గాన్ని నిర్దేశించండి. ఉపాధి మార్గాలు చూపించండి. వృద్ధులైతే వృద్ధాశ్రమాల్లో చేర్చండి. అనాథలైతే అనాథాశ్రమాలలో చేర్పించండి. వారూ మన సోదరులే. వారిని ఉద్దరించడం, వారిలో ఆత్మాభిమానం కల్గించడం మన సామాజిక బాధ్యత.

ఇట్లు,
యాచనా వ్యతిరేక సంఘం.

ప్రశ్న 2.
కోపంవల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
‘కోపం – అనర్థాలు’

కోపము చెడ్డ లక్షణం. మనకు వ్యతిరేకంగా మాట్లాడితే, పనిచేస్తే, మనకు కోపం వస్తుంది. అనుకున్న పని జరుగకపోతే, కోపం వస్తుంది. కోపం వల్ల మోహం వస్తుంది. మోహం వల్ల బుద్ది నశిస్తుంది. బుద్ధి నశిస్తే మనిషి నశిస్తాడు అని గీత చెపుతోంది.

కోపంవల్ల చాలా అనర్థాలు సంభవిస్తాయి. మనిషి విచక్షణ శక్తిని కోల్పోతాడు. మనిషి కోపంలో తాను ఏమి చేస్తున్నాడో తెలిసికోలేడు. కోపంలో మనిషి తల్లిదండ్రులనూ, భార్యాబిడ్డలనూ, గురువులనూ సహితం, చంపడానికి సిద్ధం అవుతాడు. కోపంతో పగబట్టి మనిషి శత్రువులను చంపడానికి ప్రయత్నిస్తాడు.

కోపం మంచిదికాదని, మనకు పురాణాలు కూడా చెపుతున్నాయి. విశ్వామిత్రుడు, దుర్వాసుడు వంటి మహర్షులు, కోపంతో విచక్షణ పోగొట్టుకొని, ఎన్నో చిక్కులు పడ్డారు. విశ్వామిత్రుడు వశిష్ఠుడి చేతిలో భంగపడ్డాడు.

దుర్యోధనుడు పాండవులపై కోపంతో యుద్ధానికి దిగి, సర్వనాశనం అయ్యాడు. దుర్వాస మహర్షి అంబరీషుడిపై కోపపడి తానే కష్టాలపాలయ్యాడు. వ్యాసుడి వంటి బ్రహ్మజ్ఞాని కోపంతో కాశీని శపించబోయాడు.

కోపం మంచిది కాదని, మనకు నీతిశతకాలు చెపుతున్నాయి. భర్తృహరి “క్రోధమది శత్రువు” అని చెప్పాడు! “కోపమునను ఘనత కొంచెమైపోవును” అని వేమన చెప్పాడు. “తన కోపమె తన శత్రువు” అని సుమతీశతకం చెప్పింది.

అందువల్ల మనము కోపాన్ని విడిచి, శాంతముగా బ్రతకాలి. ‘శాంతమే భూషణము’ అని మనం గ్రహించాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
కోపంవల్ల గౌరవం తగ్గుతుందనే విషయాన్ని వివరిస్తూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:
కోపం – గౌరవహీనం మిత్రులారా!

ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రతి చిన్న విషయానికీ కోపం తెచ్చుకుంటూ ఉంటాము. కోపం అన్ని అనర్ధాలకూ మూలకారణం. కోపంవల్ల విచక్షణా జ్ఞానం నశిస్తుంది. ముఖ్యంగా చీటికీ మాటికీ కోపపడే వ్యక్తులకు, సంఘంలో గౌరవం తగ్గుతుంది. కోపం ఉన్న వ్యక్తి, ఇతరుల మనస్సులను జయించలేడు. నవ్వుతూ మాట్లాడే వ్యక్తి, ప్రపంచాన్నే జయిస్తాడు.

క్రోధం వల్ల మోహం, మోహంవల్ల బుద్ధి నాశనం కల్గుతాయని భగవద్గీత చెప్పింది. పురాణాలలో చెప్పబడే మునులలో విశ్వామిత్రుడు, దుర్వాసుడు సులభకోపులు. కోపంవల్ల వారు ఎన్నో చిక్కులు పడ్డారని, ఇతరులను అకారణంగా వారు హింసించారని పురాణాలు చెపుతున్నాయి. కోపం మనిషికి గౌరవ హీనతను తెస్తుంది. కోపం మనిషి వివేకాన్ని పాతర వేస్తుంది.

అందుకే మనం కోపాన్ని దూరంగా పెడదాం. తన కోపం తన శత్రువు అని సుమతీశతకం చెప్పినమాట గుర్తు పెట్టుకుందాము. కోపంవల్ల ఆయుర్దాయం తగ్గుతుంది. గుండె బలం తగ్గుతుంది. పిల్లలకు కోపంతో చెప్పిన దానికంటె, నవ్వుతో చెప్పినధి సులభంగా ఎక్కుతుంది. కార్యసాధనకు కోపం మహాశత్రువు అని గుర్తించండి. కోపానికి తిలోదకాలు ఇవ్వండి. నవ్వుకు, ఆనందానికి స్వాగతం పలకండి. పదికాలాలపాటు ఆరోగ్యంగా బ్రతకండి. కోపాన్ని విడిచిపెడతాం అని మనం ప్రతిజ్ఞ చేద్దాం. పదండి. కదలండి.
ఇట్లు,
ఆరోగ్య మిత్ర సంఘం,
గుంటూరు యువత.

10th Class Telugu 11th Lesson భిక్ష 1 Mark Bits

1. గురుశిష్యులు మండుటెండలో భిక్ష కోసం తిరిగారు – గీత గీసిన పదానికి విడదీసిన రూపాన్ని గుర్తించండి. (June 2017)
A) మండుట + ఎండ
B) మండు + టెండ
C) మండు + ఎండ
D) మండుట + అండ
జవాబు:
C) మండు + ఎండ

2. పార్వతి కాశీనగరమును శపించబోయిన వ్యాసుని మందలించింది – గీత గీసిన పదంలోని సమాసమేది ? (June 2017)
A) ఉపమాన ఉత్తరపద కర్మధారయం
B) సంభావనా పూర్వపద కర్మధారయం
C) అవధారణా పూర్వపద కర్మధారయం
D) విశేషణ పూర్వపద కర్మధారయం
జవాబు:
B) సంభావనా పూర్వపద కర్మధారయం

3. మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్మువిశ్వనా – ఇది ఏ పద్యపాదమో గుర్తించండి. (June 2017)
A) మత్తేభం
B) ఉత్పలమాల
C) శార్దూలం
D) చంపకమాల
జవాబు:
D) చంపకమాల

4. మేఘుడంబుధికి పోయి జలంబులు తెచ్చి ఇస్తాడు. లోకోపకర్తలకిది సహజగుణము – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. (June 2017)
A) అర్థాంతరన్యాసం
B) రూపకం
C) స్వభావోక్తి
D) అంత్యానుప్రాసం
జవాబు:
A) అర్థాంతరన్యాసం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

5. విజ్ఞానం కోసం విహారయాత్రలు చేయాలి – (గీత గీసిన పదమునకు వికృతిని గుర్తించండి.) (March 2017)
A) యంత్రము
B) ప్రయత్నం
C) జతనం
D) జాతర
జవాబు:
D) జాతర

6. సామాన్యాన్ని విశేషంతో గానీ, విశేషాన్ని సామాన్యంతో గాని సమర్థించి చెప్పే అలంకారం గుర్తించండి. (June 2018)
A) శ్లేష
B) ఉత్ప్రేక్ష
C) రూపకము
D) అర్థాంతరన్యాసము
జవాబు:
D) అర్థాంతరన్యాసము

7. ‘స్వభావం చేతనే ఐశ్వర్యం గలవాడు” అను వ్యుత్పత్యర్ధము గల్గిన పదమును గుర్తించుము. (March 2018)
A) భాగ్యశాలి
B) సంపన్నుడు
C) ధనికుడు
D) ఈశ్వరుడు
జవాబు:
D) ఈశ్వరుడు

8. భవాని ఒక పెద్ద ముత్తైదువ రూపంలో వచ్చి వ్యాసుణ్ణి మందలించింది – గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్యర్థాన్ని గుర్తించుము. (March 2018)
A) ఇంద్రుని భార్య
B) భవుని భార్య
C) విష్ణువు భార్య
D) సూర్యుని భార్య
జవాబు:
B) భవుని భార్య

9. పద్యములోని మొదటి అక్షరమును ఏమంటామో గుర్తించండి?
A) ప్రాస
B) యతి
C) పాదం
D) పదం
జవాబు:
B) యతి

10. మాయింటికిం గుడువ రమ్ము ! (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) మాయింటికి భోజనానికి రావద్దు
B) మాయింటిలో అన్నం వండేందుకు రా
C) మాయింటికి భోజనానికి రా !
D) మాయింటికి భోజనానికి రాబోకుమా
జవాబు:
C) మాయింటికి భోజనానికి రా !

11. ఏ పాపాత్ముని ముఖంబు నీక్షించితినో – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2017)
A) ఏ పాపాత్ముని చూసానో నేను
B) ఏ పాపాత్ముని ముఖాన్ని చూసానో
C) ఏ పాపాత్ముని ముఖాన్ని చూడలేదు
D) ఏ పాపాత్ముని చూడలేదు నేను
జవాబు:
B) ఏ పాపాత్ముని ముఖాన్ని చూసానో

AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష

12. బౌద్ధ భిక్షువులచే వేలాది దీపాలు వెలిగించబడ్డాయి – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి. (March 2018)
A) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగించారు.
B) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగించలేదు.
C) వేలాది దీపాలు బౌద్ధ భిక్షువులచే వెలిగించారు.
D) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగిస్తారు.
జవాబు:
A) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగించారు.

13. హరిహర బ్రహ్మలను పురిటి బిడ్డలను చేసిన పురంద్రీ లలామ అనసూయ – గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్యర్థాన్ని రాయండి. (March 2019)
జవాబు:
గృహమును ధరించునది

14. ఆకంఠంబుగ నిష్ణు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా – ఇది ఏ పద్యపాదము?
జవాబు:
శార్దూలము

15. అర్థాంతరన్యాసాలంకారానికి ఉదాహరణ
జవాబు:
హనుమంతుడు సముద్రమును లంఘించెను. మహాత్ములకు సాధ్యం కానిది లేదుగదా !

చదవండి – తెలుసుకోండి

మాట్లాడటమూ ఒక కళ

మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలివారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట్లాడటం ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళ కరతలామలకమవుతుంది.

ఒకాయన మెట్లు దిగుతున్నాడు. అదే సమయంలో మరొకాయన మెట్లు ఎక్కుతున్నాడు. దారి ఇరుకుగా ఉంది. ఇద్దరూ మధ్యలో ఎదురుపడ్డారు. కింద నుండి వస్తున్న అతనికి కోపమెక్కువ పై నుండి దిగుతున్న వానితో ‘నేను మూర్ఖులకు దారివ్వను’ అన్నాడు. వెంటనే ఎదుటివాడు ఏమాత్రం తడుముకోకుండా ‘పరవాలేదు నేనిస్తాను’ అన్నాడు. ఇప్పుడు ఎవడు మూర్ఖుడయ్యాడు?

ఒకావిడ ఇంకొకావిడతో పేచీ పెట్టుకున్నది. కోపంతో రెచ్చిపోయి ‘ఛీ కుళ్కా’ అనేసింది. అవతలావిడ ‘ఏమత్కా?” అన్నది. ఈ ముక్కతో మొదటావిడ తిక్క కుదిరింది.

తాంబూలం వేసుకోడానికి వెళ్ళాడో పెద్దమనిషి. తమలపాకులు కట్టేవానితో ‘ఏయ్, ఆకులో సున్నం తక్కువవేయి, దవడ పగులుతుంది’ అంటూ పక్కనేవున్న అరటిపండ్ల గెలకు చేయి ఆనించి నిలబడ్డాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న తమలపాకులవాడు ‘ఏమయ్యోయ్, చెయ్యితియ్యి, పండ్లు రాలుతాయి’ అన్నాడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ.

సాహిత్యాభిలాషియైన ఒకడు కవిని కలిశాడు. ఎంతోకాలం నుండి తన మనసులో దాచుకున్న ఆశను బయటపెట్టాడు. ‘అయ్యా, నాకు ఏదైనా నాటికను రాసివ్వండి’ అనడిగాడు. దానికి బదులిస్తూ ఆ కవి ‘ఓ! దానికేముంది ఏనాటికైనా రాస్తాను’ అని అభయమిచ్చాడు.

ఒక పెండ్లి వేడుకలో కొందరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒక పెద్దాయన ‘మీవయసెంతండి’ అనడిగారు. దానితా పెద్దమనిషి ‘ఏడేళ్ళు’ అన్నాడు. అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఎంత పెద్దమనిషైతే మాత్రం ఇంతగా పరిహాసమాడుతారా అని నిలదీశారు. అతడన్నాడు. ‘నేను నిజమే చెప్పాను నాకు ఏడేళ్ళు (7 x 7 = 49) అన్నాడు. అసలు విషయం తెలుసుకుని అందరూ గొల్లున నవ్వేశారు.

బజారులో వెళుతున్న ఒకతనికి మిత్రుడు తారసపడ్డాడు. చాలాకాలమైంది వాళ్ళు కలుసుకొని. మిత్రుడు చెప్పులు లేకుండా ఉండడం చూసి విషయమేమిటని ప్రశ్నించాడు. దానికి బదులిస్తూ ‘చెప్పుకొనుటకే మున్నద’ని పెదవి విరిచాడా మిత్రుడు.

తను తీయబోయే సినిమా విషయంలో నిర్మాత ఒక కవి దగ్గరకు వెళ్లాడు. ‘నా సినిమాత పాట రాస్తారా?” అని అభ్యర్థించాడు. దానికి కవి రాస్తారా’ అన్నాడు. ఎంత కవియైతే మాత్రం ఇంత అహంతారంగా తనను ‘రా’ అంటాడా అనుకున్నాడు నిర్మాత. అతని ఆంతర్యం గ్రహించిన కవి అయ్యా, నన్ను తప్పుగా అనుకుంటున్నట్లున్నారు నేనన్నది ‘రాస్తా, రా’ అని. హమ్మయ్య అనుకున్నాడు.

ఇలా మాటలలో విరుపులు మెరుపులను సృష్టిస్తాయి. వ్యంగ్యం గిలిగింతలు పెడుతుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 10th Lesson గోరంతదీపాలు

10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
గోరంత దీపాలు పాఠం ఎవరు రచించారు? రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
గోరంత దీపాలు పాఠం పులికంటి కృష్ణారెడ్డిగారు రచించారు. ఆయన 30.7.1931న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని ‘జక్కదన్న’ గ్రామంలో జన్మించారు. తండ్రి గోవిందరెడ్డి, తల్లి పాపమ్మ. 18.11.2007లో తిరుపతిలో స్వర్గస్తులయ్యారు.

ఆయన రాయలసీమ కథానికా రచయిత, నటుడు, జానపద కళాకారుడు, కవి, నాటక రచయిత, బుర్రకథా కళాకారుడు. పునర్జన్మ నాటకంలో వృద్ధుని పాత్రను తొలిసారిగా ఆయన ధరించారు.

ప్రశ్న 2.
పులికంటి కృష్ణారెడ్డిగారి సాహిత్యసేవను వివరించండి.
జవాబు:
పులికంటివారు నటనలో అసమాన ప్రతిభ కనబరిచారు. 150 కథలు రచించారు. వాటిలో 14 కథలకు బహుమతులు అందుకొన్నారు. ‘గూడులేని గువ్వలు’ కథ తొలికథగా ఆయన కలం నుండి జాలువారింది.

కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు మొదలైన సామాజిక అంశాలపై 100కు పైగా బుర్రకథలు వ్రాసి, ప్రదర్శించారు.

ఆంధ్రప్రభ దినపత్రికలో ‘నాలుగ్గాళ్ళ మండపం’ శీర్షికను 67 వారాలు నిర్వహించారు. దీనిలో గ్రామీణ రైతుల జీవితాన్ని రాయలసీమ మాండలికంలో చిత్రించారు.

ప్రశ్న 3.
పులికంటి వారు అందుకొన్న పురస్కారాలు, చేసిన సత్కారాలు వివరించండి.
జవాబు:
2001లో తెలుగు విశ్వవిద్యాలయం, పులికంటి కృష్ణారెడ్డిగారిని ఘనంగా సత్కరించింది. 2003లో గోపీచంద్ అవార్డు ఆయనను వరించింది.

2005లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి పురస్కారం అందుకొన్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు.

2000వ సంవత్సరంలో ‘పులికంటి సాహితీ సంస్కృతి’ని పులికంటి కృష్ణారెడ్డిగారు ప్రారంభించారు. ఈ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో 18 మందిని సన్మానించారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

ప్రశ్న 4.
‘గోరంత దీపాలు’ కథానిక ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:

  1. అనాథ బాలురు కొడిగట్టిన దీపాలు వంటివారు. కొంచెం సానుభూతితో కొడిని దులిపి నూనెపోసి వత్తి ఎగదోస్తే, ఆ గోరంతదీపం ఎప్పటికో అప్పటికి, గొప్ప వెలుగును ఇస్తుంది.
  2. ప్రతి వ్యక్తి మానవత్వంతో దిక్కులేని వారికి, తనకు ఉన్నంతలో సాయం చేయాలి.
  3. దిక్కులేని వాళ్ళను చేరదీసి ఆశ్రయమిస్తే ఆశ్రయం పొందిన వ్యక్తి, జీవితాంతం ఆశ్రయం ఇచ్చిన వారికి కృతజ్ఞతగా ఉంటాడు.
  4. తమ సహాయంతో అనాథలు అభివృద్ధిలోకి వస్తే, సాయంచేసిన వారి మనస్సు ఆనందంతో నిండిపోతుంది.
  5. అనాథలకు మన శక్తి కొలదీ చేయూతను అందించాలి.

ప్రశ్న 5.
కుర్రవాడి బ్రతుకు మీద వృద్ధుడు చేసిన ప్రయత్నం ఏమిటి? దాని ఫలితం ఎలా ఉంది?
జవాబు:
ఆ వృద్ధుడు కావాలని ఐదు రూపాయిల కాగితం, రైలులో తన సీటు కింద పడవేశాడు. రైలు తుడిచే పిల్లవాడు నిజాయితీ గల పిల్లవాడు. అందువల్లనే ఆ నోటును తీసి వృద్దుడికి తిరిగి ఇచ్చాడు.

ఆ పిల్లవాడు నిజాయితీ గలవాడనీ, చేరదీసి చదివిస్తే బాగుపడతాడనీ వృద్ధుడు అనుకున్నాడు. అదే మాట ఆ కుర్రాడికి చెప్పాడు. ఆ కుర్రవాడు వృద్ధుడితో వెళ్ళడానికి అంగీకరించాడు. వృద్ధుడు ఆ పిల్లవాడిని తన విద్యానగరం పాఠశాలలో ఉంచి, చదివించి అతడికి ఉద్యోగం వచ్చాక పెళ్ళి కూడా చేశాడు.

ప్రశ్న 6.
కుర్రవాడి బ్రతుకు మీద వృద్ధుడు చేసిన ప్రయత్నం ఫలించిందా? వివరించండి.
జవాబు:
ఒక వృద్ధుడు రైలులో ప్రయాణం చేస్తూ ఉంటే రైలు పెట్టెలు తుడుస్తూ ప్రయాణికులు ఇచ్చే డబ్బులతో పొట్ట పోసుకొనే ఒక కుర్రవాడు ఆయనకు కనిపించాడు. ఆ పిల్లవాడు నిజాయితీ గలవాడు. వృద్ధుడు, ఆ కుర్రవాడు నిజాయితీపరుడని గ్రహించాడు. అతడిని చేరదీసి చదివిస్తే బాగుపడతాడని వృద్ధుడు అనుకున్నాడు. పిల్లవాడు కూడా చదువుకుంటానని చెప్పాడు.

ఆ కుర్రవాడిని ఆ వృద్ధుడు తాను నడిపే విద్యానగరం పాఠశాలలో చేర్చి చదివించాడు. ఆ కుర్రవాడు శ్రద్ధగా చదివాడు. ఉద్యోగం సంపాదించాడు. తరువాత ఆ వృద్ధుడు ఆ కుర్రవాడికి పెళ్ళి చేశాడు. ఈ విధంగా వృద్దుడి ప్రయత్నం చక్కగా ఫలించింది.

ప్రశ్న 7.
‘చదువుకొనే వయసులో సంపాదనపైకి దృష్టి పోకూడదు’ ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
చదువుకొనే రోజులలో పిల్లల దృష్టి పూర్తిగా వారి చదువుల పైనే ఉండాలి. కాని కొందరు పిల్లలు తీరిక సమయాల్లో ఏదో విధంగా డబ్బులు సంపాదిస్తూ ఖర్చు పెట్టుకుంటారు. కొందరు పిల్లలకు ఏదోరకంగా సంపాదింపవలసిన అవసరాలు కూడా ఉంటాయి.

పేపర్లు వేయడం, పెట్రోలు బంకుల్లో పనిచేయడం, తండ్రి చేసే వృత్తుల పనుల్లో సాయం చెయ్యడం ద్వారా వారు సంపాదిస్తారు. అందువల్ల వారి దృష్టి చదువులపై పూర్తిగా పెట్టలేరు. సంపాదించే డబ్బుతో విలాసాలకు వారు అలవాటు పడతారు. సినిమాలకు పోతారు. సిగరెట్లు వగైరాలకు అలవాటు పడతారు.

కాబట్టి చదువుకొనే వయసులో సంపాదనపై దృష్టి పెట్టరాదు. దానివల్ల వారి చదువులు సక్రమంగా సాగవు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

ప్రశ్న 8.
‘ఏకాంతంలో పుస్తకాలను మించిన నేస్తం లేదు’ దీనిపై మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించండి.
జవాబు:
ఒంటరిగా ఉన్నప్పుడు మనతో మాట్లాడే స్నేహితులు ఎవరూ ఉండరు. అలాంటప్పుడు ఏదో మంచి పుస్తకాన్ని తీసుకొని చదువుకుంటే, హాయిగా కాలం గడుస్తుంది. ప్రక్కన కబుర్లు చెప్పేవారు లేరనే బెంగ కూడా ఉండదు.

పుస్తకాలు స్నేహితుడిలా ఆనందాన్ని ఇస్తాయి. మంచి పుస్తకం చదువుతూ ఉంటే, కాలమే తెలియదు. కాబట్టి పుస్తకం ఒంటరిగా ఉన్నప్పుడు మన నేస్తం అనే మాటతో నేను ఏకీభవిస్తాను.

10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘ఒక వ్యక్తి ఆలోచన ఆచరణగా మారితే ఏర్పడిన మహాసంస్థ ఎన్నో కొడిగట్టిన దీపాలకు ఆశ్రయమిచ్చింది.’ గోరంత దీపాలు పాఠం ఆధారంగా వివరించండి. (June 2017)
జవాబు:
అనాథ బాలురు గోరంత దీపాల వంటివాళ్ళు. ఆ దీపాలను నిలుపుతున్న వ్యక్తి ఒక వృద్ధుడు.

వృద్ధుడు దీనజనబాంధవుడు. విద్యానగరం అనే విద్యాలయం కట్టించాడు. అక్కడ బాలబాలికలకు వసతి గృహాలు, అతిథులకు గదులు, వయస్సులో పెద్దవాళ్ళకు వసతులు, గ్రంథాలయం, ప్రార్థనాలయం ఏర్పాటుచేశాడు.

వృద్ధుడు విద్యానగరంలో మకుటం లేని మహారాజు, దిక్కులేని వారినందరినీ అక్కడకు చేర్చి, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించేవాడు. అక్కడ వందలాది మంది ఉపాధ్యాయుల్ని నియమించి, వేలాదిమంది పిల్లలకు చదువు చెప్పించేవాడు. దానికయిన ఖర్చు అంతా ఆయనే భరించేవాడు.

ఎవరయినా ఈ వృద్ధుణ్ణి స్వార్థం కల మనిషి అని నిందించినా, ఆయన తన ధ్యేయాన్ని విడిచి పెట్టేవాడు కాదు. రైల్లో అడుక్కుతింటున్న పిల్లవాణ్ణి తనతో తీసుకువచ్చి చదువు చెప్పించి పెళ్ళిచేశాడు. ఆ పిల్లవాడు ప్రతి పుట్టినరోజుకీ వచ్చి ఈ వృద్ధుడిని కలిసి, కృతజ్ఞత వెల్లడించేవాడు. పిల్లవాడికి తన యందుకల ప్రేమకు వృద్ధుడి మనస్సు పొంగిపోయేది. ఆ వృద్ధుని పిలుపులో ఆప్యాయత ఉండేది.

విద్యానగరంలో చదువుకొంటున్న పిల్లల్ని చూసి వృద్ధుడు ఆనందానుభూతిలో తేలిపోయేవాడు. వృద్ధుని మాటలు అక్షరసత్యాలు. ఈ విధంగా వృద్ధుడి ఆలోచనతో ఒక మహాసంస్థ వెలిసింది. ఎన్నో కొడిగట్టిన దీపాలకు అతడు ఆశ్రయం ఇచ్చాడు. ఆ వృద్ధుడు వెలిగించిన ఎన్నో గోరంత దీపాలు, కొండంత వెలుగునిచ్చాయి.

ప్రశ్న 2.
చిన్నతనంలో చదువుకొంటే పెద్దవయసులో బాగా సంపాదించవచ్చు. ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తారా? చర్చించండి.
జవాబు:
చిన్న వయస్సులో చదువుకుంటే పెద్ద వయస్సులో సంపాదించుకోవచ్చు అని వృద్ధుడు రైలు తుడుస్తున్న పిల్లవాడితో అన్నాడు.

రైలు తుడుస్తున్న పిల్లవాడు చిన్న పిల్లవాడు. కాబట్టి రైలు తుడుస్తూ ప్రయాణీకులు ఇచ్చిన డబ్బులతో బతికేసేవాడు. వృద్ధుడు చెప్పినట్లు ఆ పిల్లవాడు పెద్దవాడు అయితే, సిగ్గు విడిచి అలా తుడవలేడు. డబ్బు సంపాదించలేడు. అదీగాక అందరూ అతణ్ణి తప్పుపడతారు.

కాబట్టి వృద్ధుడు చెప్పినట్లు అతడు అతనితో వెళ్ళి చదువుకున్నాడు. శ్రద్ధగా చదివాడు. ఉద్యోగం సంపాదించి పెద్ద అయ్యాక హాయిగా పెళ్ళి చేసుకొని సుఖంగా బ్రతికాడు.

కాబట్టి వృద్ధుడు పిల్లవాడితో అన్నమాట సరయిన మాట. పిల్లలందరూ బాల్యంలో చక్కగా చదువుకోవాలి. అప్పుడు వారు పెద్దతనంలో చక్కగా సంపాదించుకోవచ్చు.

ప్రశ్న 3.
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. వృద్ధుడు :
అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పిస్తాడు. సమాజంలోని పేదలను, అనాథలను ఆదుకొనే స్వభావం కలవాడు. సమాజం పట్ల బాధ్యత గలవాడు. వయోవృద్ధులకు కూడా సదుపాయం కల్పించాడు. సమాజం పట్టించుకోని వారికి పెద్ద దిక్కు అయ్యాడు. తన వద్ద పెరిగిన అనాథలు ఉన్నత స్థితిలో ఉంటే చూసి, ఆనందించే స్వభావం కలవాడు. తనను విమర్శించే వారిని కూడా పట్టించుకోకుండా సేవ చేసే మహామనీషి.

2. కుర్రవాడు :
అనాథ. రైలు పెట్టెలు తుడిచేవాడు. వృద్ధుని దయతో విద్యానగరం వచ్చాడు. చక్కగా చదువుకొన్నాడు. మంచి ఉద్యోగం సంపాదించుకొన్నాడు. వృద్ధుని పట్ల అమితమైన కృతజ్ఞతను ప్రదర్శించాడు. తన కన్నీటితో వృద్ధుని పాదాలకు అభిషేకం చేశాడు. మేలు చేసిన వారిని భగవంతునితో సమానంగా పూజించే అత్యుత్తమ సంస్కారం కలవాడు. వినయం కలవాడు. ‘మంచివాడు’ అనడానికి సరిపోయే అన్ని లక్షణాలు ఉన్నవాడు.

3. రచయిత :
వృద్ధుని స్నేహితుడు. వృద్ధుని మంచితనాన్ని, గొప్పతనాన్ని ఆకళింపు చేసుకొన్న వ్యక్తి. పరిశీలనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా సమాజాన్ని పరిశీలిస్తాడు. వృద్ధునిలోని ఆలోచనా ధోరణిని అభినందించిన సంస్కారి. గోరంతదీపాలు ఇచ్చే కొండంత వెలుగులో తన పాత్ర కూడా గోరంత ఉండాలని తపించే స్వభావం కలవాడు. ఓర్పు, నేర్పు కలవాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

ప్రశ్న 4.
గోరంత దీపాలు కథలో వృద్ధుని గూర్చి వివరించండి.
(లేదా)
“గోరంత దీపాలు” కథానికలో వృద్ధుడు చేసిన సమాజసేవను వివరిస్తూ అతని గొప్పతనాన్ని తెలియజేయండి. (March 2019)
జవాబు:
గోరంత దీపాలు కథలో వృద్ధుడు దీనజన బాంధవుడు. ఆయన విద్యానగరం అనే విద్యాలయం కట్టించాడు. అక్కడ బాలబాలికలకు వసతి గృహాలు, అతిథులకు గదులు, వయస్సులో పెద్దవాళ్ళకు వసతులు, గ్రంథాలయం, ప్రార్థనాలయం కట్టించాడు.

దిక్కులేని పిల్లలను తన పాఠశాలలో చేర్చి, వారికి భోజనం పెట్టి చదువు చెప్పించేవాడు. అక్కడ వందల కొద్దీ ఉపాధ్యాయులను నియమించి, వేలాది పిల్లలకు చదువు చెప్పించేవాడు. దానికయిన మొత్తం ఖర్చును తానే భరించేవాడు.

ఇతరులు ఆయన్ని విమర్శించినా, ఆయన పట్టించుకొనేవాడు కాదు. రైలులో అడుక్కుతింటున్న పిల్లవాడిని తీసుకువచ్చి ఆయన వాడికి చదువు చెప్పించి పెళ్ళి చేశాడు. ఆ విద్యానగరంలో చదువుకొనే పిల్లల్ని చూసి ఆ వృద్ధుడు మురిసిపోయేవాడు. ఆయన కొడిగట్టిన దీపాలవంటివారికి ఆశ్రయం ఇచ్చి వారి జీవితాలను కొండంత దీపాలుగా వెలిగించాడు. ఆయన మహానుభావుడు, ఉత్తముడు.

ప్రశ్న 5.
వృద్ధునికి ప్రయోజకుడైన యువకుడికి గల అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
ఒకసారి వృద్ధుడు రైలులో ప్రయాణం చేస్తున్నాడు. దానిలో ఒక పిల్లవాడు రైలు పెట్టి తుడుస్తూ అడుక్కుంటున్నాడు. వృద్ధుడికి ఆ పిల్లవాడి మనస్తత్వాన్ని పరీక్షించాలని బుద్ధిపుట్టింది. ఐదు రూపాయల నోటు కింద జారవిడిచాడు. ఆ పిల్లవాడు నోటును తీసి వృద్దుడికి అప్పగించాడు. ఆ పిల్లవాడిని చదివించి వృద్ధిలోకి తేవాలని వృద్ధుడు అనుకున్నాడు. పిల్లవాడు సరే అని, వృద్ధుని వెంట వెళ్ళి విద్యాలయంలో శ్రద్ధగా చదివి ఉద్యోగం కూడా సంపాదించాడు. వృద్ధుడు ఆ యువకుడికి పెళ్ళి కూడా చేశాడు.

ఆ యువకుడికి ఆ వృద్ధునిపై ఎంతో కృతజ్ఞత ఉంది. వృద్ధుడు ఆ యువకుడిని ప్రేమగా చూసేవాడు. ఆ యువకుడికి పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు. ఆ యువకుడు విద్యాలయంలో చేరిన రోజునే, తన పుట్టినరోజుగా ఆ యువకుడు భావించేవాడు.

యువకుడు ఎక్కడ ఉన్నా, వృద్ధుడు ఎక్కడ ఉన్నా యువకుడు తన పుట్టినరోజున తప్పకుండా వచ్చి ఆ వృద్ధుడి కాళ్ళు పట్టుకొని ఆ వృద్ధుడి పాదాలను, తన ఆనందబాష్పాలతో ముంచెత్తేవాడు. ఆ వృద్ధుడు ఆ యువకుడిని ఆశీర్వదించి, తన ఆనందబాష్పాలతో యువకుడి తలను తడిపివేసేవాడు. వారి మధ్యన ఉన్న అనుబంధం అనిర్వచనీయం.

10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు Important Questions and Answers

ప్రశ్న 1.
‘అనాథ బాలలకు చేయూతనందిస్తే ఎంతటి స్థాయికైనా ఎదుగగలరు’ – ఈ అంశంపై వ్యాసం వ్రాయండి.
జవాబు:
‘అనాథ బాలలు – చేయూత’

తల్లిదండ్రులు లేని పిల్లలను అనాథ బాలలు అంటారు. అలాగే తల్లిదండ్రులకు డబ్బులేక, చదువు సంధ్యలు చదువుకోకుండా వీథి బాలలుగా తిరిగే దిక్కులేని పిల్లలు ఉంటారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులపై కోపగించుకొని పారిపోయి రోడ్లపై బిచ్చం ఎత్తుకుంటూ, రైళ్ళల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అనాథలుగా తిరుగుతారు. ఇలాంటి అనాథలకు రక్షణ కల్పించి వారు చదువుకోడానికి ఆశ్రయం కల్పిస్తే వారు కూడా మంచిగా పెరిగి అభివృద్ధిలోకి వస్తారు. ఆ గోరంత దీపాలను కొండంత దీపాలుగా చేయడానికి సంఘంలోని సంపన్నులూ, దాతలూ, అనాథ శరణాలయాలవారూ, ప్రభుత్వమూ సహాయం చేయాలి.

ఈనాడు దేశంలో ఎన్నో అనాథ శరణాలయాలు ఉన్నాయి. వారు ప్రజల నుండి చందాలు వసూలు చేసి అనాథ బాలబాలికలకు ఆశ్రయం కల్పించి, వారిని పెద్దవారిని చేసి వారికి పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు. ఇటువంటి అనాథ శరణాలయాలకు డబ్బు కలవారు విరివిగా విరాళాలు ఇవ్వాలి. అనాథ బాలబాలికలకు తోడుగా నిలవాలి.

డబ్బు కలవారు, దాతలు, ఉదారహృదయం కలవారు తమ సంపాదనలో కొంత భాగం అనాథలకు కేటాయించాలి. అలా ఇచ్చి అనాథలను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించాలి. అలా చేస్తే వారు పెద్దవారై ఎంతో ఉన్నత స్థానాన్ని తప్పక పొందుతారు. అటువంటి అనాథలు పెద్దవారై డాక్టర్లుగా, ప్రజాపరిపాలకులుగా, ఇంజనీర్లుగా తయారవుతారు. ప్రభుత్వం కూడా అనాథ శరణాలయాలను స్థాపించి, అనాథ బాలబాలికలకు చేయూతను అందివ్వాలి. అప్పుడే ఆ గోరంత దీపాలు పెద్దవై, కొండంత వెలుగును ఇస్తాయి. అనాథ బాలబాలికలకు సాయంచేస్తే దేవుడు కూడా సంతోషించి వారికి మోక్షాన్ని, సంపదలను, సౌఖ్యాన్ని ఇస్తాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

ప్రశ్న 2.
అనాథలను ఆదుకొన్న మీ మామయ్యను అభినందిస్తూ లేఖ వ్రాయండి.
జవాబు:

నెల్లూరు,
x x x x x.

పూజ్యులైన చిన్న మామయ్యకు నమస్కరించి,
మీ మేనకోడలు పద్మ వ్రాయు లేఖ.

ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

మొన్న తుపాను మీ ప్రాంతంలో చాలా భీభత్సం సృష్టించిందని టీ.వీ. లో చూశాను. పేపర్లో చదివాను. చాలా కంగారు పడ్డాము. మా అమ్మా నాన్నా మిమ్మల్ని చూసి వచ్చేక నాకొక సంగతి చెప్పారు.

ఒక కుటుంబంలో తుపానుకు ఇల్లు కూలి అందరూ మరణించారనీ, ముగ్గురు చిన్నపిల్లలు మిగిలారనీ, ఆ పిల్లలను మీరు పెంచుతున్నారనీ మా అమ్మ చెప్పింది. అంతేకాకుండా చాలామందికి ఆహారం, బట్టలు అందించారని కూడా చెప్పారు. మీ పరోపకార బుద్ధికి నాకు చాలా ఆనందం కల్గింది.

నా స్నేహితులకు మీ మంచి మనసు గురించి చెప్పాను. వాళ్ళంతా చాలా ఆనందించారు. మీ మేనకోడలిని అయినందుకు చాలా గర్వపడ్డాను. కేవలం మాటలు కాకుండా, చేతలతో మంచి చేసే మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, అభినందిస్తున్నాను. అత్తయ్యకు నా నమస్కారాలు.

ఇట్లు,
మీ మేనకోడలు,
వి. పద్మ.

చిరునామా :
ఎస్. నరసింహారావుగారు,
తెలుగు ఉపాధ్యాయులు,
బాలికోన్నత పాఠశాల,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.

ప్రశ్న 3.
అనాథలను ఆదుకోవలసిన అవసరం గురించి వివరిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
అమృత హృదయులారా ! ఆదుకోండి

అనాథలను ఆదుకోవడం మన కర్తవ్యం. మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. తోటి మనిషిని ఆదరించండి. పట్టెడన్నం పెట్టండి. సమాజానికి ఉపయోగపడే మాణిక్యాలను మట్టిలో కలిసిపోనీయకండి. ఇది మన బాధ్యత. వాళ్లు కూడా మన సోదరులే.

భగవంతుడికి ‘దరిద్ర దామోదరుడ’ని పేరు. అనాథలలో దైవాన్ని సందర్శించండి. ఆదరించండి. తీర్చిదిద్దండి. భరతమాత సేవలో పునీతులవ్వండి.

ఇట్లు,
అనాథల పెద్ద అన్న.

10th Class Telugu 10th Lesson గోరంతదీపాలు 1 Mark Bits

1. వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నం చేయాలి – గీత గీసిన పదాలకు నానార్థమును గుర్తించుము. (March 2017)
A) కృషీవలుడు
B) కృషి
C) కర్షకుడు
D) కారణము
జవాబు:
B) కృషి

2. ప్రజలను పాలించే ప్రభువు దేవతలకు తోడు ఇంద్రుడులా ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థమును గుర్తించుము. (March 2017)
A) భర్త
B) రాజు
C) శని
D) ధర్మము
జవాబు:
B) రాజు

3. ఏ వయస్సులో చేయవలసిన దానిని, ఆ సమయంలో చేయకున్నచో జీవితము నరకంతో సమానం కాగలదు – గీత గీసిన పదాలకు సంబంధించిన నానార్థ పదాన్ని గుర్తించుము. (March 2018)
A) ప్రాయము
B) కాయము
C) కార్యము
D) ఆదాయము
జవాబు:
A) ప్రాయము

4. విద్యార్థులు ఎల్లవేళలా చదువుపై దృష్టిని తిరముగా ఉంచుకోవాలి – గీత గీసిన పదానికి ప్రకృతి రూపాన్ని గుర్తించండి. (March 2018)
A) తీరము
B) స్థిరము
C) దూరము
D) భారము
జవాబు:
B) స్థిరము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

5. రైతులు కష్టపడగలరు. (ఏ వాక్యమో గుర్తించండి ?) (June 2017)
A) సంభావనార్ధకం
B) చేదర్థకం
C) ప్రశ్నార్ధకం
D) సామర్ధ్యార్ధకం
జవాబు:
D) సామర్ధ్యార్ధకం

6. వైద్యుడు ప్రథమ చికిత్స చేసి, మందులు ఇస్తాడు. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) క్వార్థకము
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) అష్యర్ధకం
జవాబు:
A) క్వార్థకము

7. గోరంత దీపాలు కొండంత వెలుగు నిస్తాయి – దీనికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. (March 2018)
A) గోరంత దీపాలు కొండంత వెలుగు నివ్వవు
B) గోరంత దీపాలు కొండంత వెలుగు నివ్వవచ్చు
C) గోరంత దీపాలు కొండంత వెలుగు ఇవ్వగలవు.
D) గోరంత దీపాలు కొండంత వెలుగు ఇవ్వకపోవచ్చు
జవాబు:
A) గోరంత దీపాలు కొండంత వెలుగు నివ్వవు

8. వృద్ధుని చేత బాలుడు రక్షింపబడెను – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.
A) సామాన్య
B) సంయుక్త
C) కర్తరి
D) కర్మణి
జవాబు:
D) కర్మణి

AP SSC 10th Class Telugu Important Questions Chapter 10 గోరంతదీపాలు

9. వఱదైన చేనుదున్న వద్దు. (ఇది ఏ వాక్యమో గుర్తించండి) (S.A. I – 2018-19)
A) నిషేధార్థక వాక్యం
B) ప్రార్థనార్థక వాక్యం
C) విధ్యర్ధకం
D) సామర్థ్యార్థక వాక్యం
జవాబు:
A) నిషేధార్థక వాక్యం

10. క్రింది వానిలో విధ్యర్థక వాక్యం గుర్తించండి. (S.A. I – 2018-19)
A) చదవ గలరు
B) చదవండి
C) దయచేసి చదవండి
D) చదువుతున్నారు
జవాబు:
B) చదవండి

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 9th Lesson మాణిక్యవీణ

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“చిన్నవాడు మానవుడు – చిరంజీవి మానవుడు” అంటూ చాటిన “విద్వాన్ విశ్వం” గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. (June 2018)
జవాబు:
1) మాణిక్యవీణ పాఠ్యరచయిత విద్వాన్ విశ్వం కాలము 1915 – 1987.

2) రచనలు : పత్రికా సంపాదకునిగా “అవి-ఇవి, తెలుపు నలుపు, మాణిక్యవీణ” వంటి శీర్షికలతో సంపాదకీయాలు, “ప్రేమించాను” అనే నవల, “ఒకనాడు”, “పెన్నేటిపాట” అనే కావ్యాలు రాశారు.

3) బిరుదులు : కళాప్రపూర్ణ

4) రచనా విధానం : చిన్న చిన్న పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితలు రచించారు.

ప్రశ్న 2.
మాణిక్య వీణ పాఠం ఎవరు రచించారు? రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
మాణిక్య వీణ పాఠం విద్వాన్ విశ్వంగారు రచించారు. ఆయన పూర్తి పేరు మీసరగండ విశ్వరూపాచారి. ఆయన తల్లిదండ్రులు లక్ష్మమ్మ, రామయ్య. విశ్వం అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో జన్మించారు. 21.10.1915 ఆయన పుట్టినరోజు. ఆయన 19.10.1987న స్వర్గస్తులయ్యారు.

ప్రశ్న 3.
విద్వాన్ విశ్వం సాహిత్యసేవ, అందుకొన్న సన్మానాలు వ్రాయండి.
జవాబు:
విద్వాన్ విశ్వం తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషలలో పండితులు. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో పనిచేశారు.

‘కాదంబరి’తో సహా అనేక సంస్కృత గ్రంథాలను తెలుగులోనికి అనువదించారు.

పత్రికలలో ‘అవి-ఇవి’, ‘తెలుపు-నలుపు’, ‘మాణిక్య వీణ’ మొదలైన శీర్షికలతో రచనలు చేశారు. భాష, సాహిత్యం , సమాజం, నైతిక విలువలు మొదలైన అంశాలపై రాసిన విశ్వం సంపాదకీయాలు విలువైనవి. ‘పెన్నేటిపాట’, ‘ఒకనాడు’ అనే కావ్యాలను, ‘ప్రేమించాను’ అనే నవలను రచించారు. కళాప్రపూర్ణ, డి.లిట్. వంటి డిగ్రీలను అందుకొన్నారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 4.
మానవ చరిత్రలోని గొప్ప మలపులేవి?
జవాబు:
మానవ చరిత్రలో క్రింద చెప్పినవన్నీ గొప్ప మలపులు. మానవుడు చక్రం కనుక్కొన్న రోజు, మానవుడు చకచకా నాలుగు గీతలతో అక్షర లిపిని కనుక్కొన్న రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, మానవుడు తప్పటడుగులు మాని తాండవం చేసిన రోజు, మానవ చరిత్రలో గొప్ప మలపులు.

అలాగే మానవుడు కిచకిచలు మాని, మంచి భాషలు నేర్చుకొన్నరోజు, చిన్న చిన్న మాటలతో జానపద గీతాలు అల్లుకొన్న రోజు, ధాన్యాన్ని పండించడం నేర్చుకున్న రోజు, లలిత కళలను పండించుకొన్న రోజు కూడా, మానవ చరిత్రలో గొప్ప మలపులు.

ఈ విధంగా మానవుడు చక్రం కనుక్కొన్న రోజు, లిపిని నేర్చిన రోజు, నిప్పును కనుక్కొన్న రోజు, కళలు, కవిత్వము నేర్చిన రోజు మానవ చరిత్రలో అసాధారణ పర్వదినాలని, గొప్ప మలపులు అని చెప్పాలి.

ప్రశ్న 5.
మాణిక్యవీణ పాఠం ఆధారంగా సమాజ రుగ్మతలు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
సమాజ రుగ్మతలు అంటే సమాజానికి అనగా సంఘానికి పట్టిన జబ్బులు.

  1. అంటరానితనాన్ని పాటించడం
  2. కులమత భేదాలు పాటించడం
  3. మూఢనమ్మకాలు కలిగియుండడం
  4. అవినీతి దురాచారం
  5. కులసంఘాలు, మత సంఘాలు మొ||నవి.

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మానవాభివృద్ధిలో చోటు చేసుకున్న మార్పులను “మాణిక్యవీణ” పాఠ్యభాగం ఆధారంగా వివరించండి. (June 2018)
జవాబు:

  1. ప్రకృతిని చూచి పరవశించిన మానవుడు దానిని తన కనుసన్నలలో ఉంచుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మానవాభివృద్ధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
  2. గుహలలో జీవించిన ఆదిమానవుడే గుర్రాల్ని, జింకలను గీస్తూ చిత్రలేఖన నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాడు. తన గానమాధుర్యంతో ఎండిన మోడుల్ని చిగురింపజేశాడు.
  3. పాటకు అనుగుణంగా కఠినరాతినేలపై కాళ్ళకు గజ్జెకట్టి గంతులేశాడు. స్వరాల సొబగులతో మనసుకు హత్తుకొనే పాటలు పాడాడు. ఇలా కళలపై అభిరుచిని పెంచుకున్నాడు.
  4. ఈ క్రమంలోనే చక్రాన్ని కనుగొనడం, నిప్పును కనుగొనడం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. చక్రాన్ని కనుగొన్న రోజు ఎంత గొప్పదో చకచకా నాలుగు గీతలతో లిపిని కనుగొన్న రోజూ అంతే ముఖ్యమైనది. చక్రం చలనానికి, లిపి భావ సంచలనానికి వేదికలై సృజనాత్మక ప్రపంచం వైపు మానవుడిని నడిపించాయి.
  5. అరుపుల నుండి అర్థవంతమైన మాటలు నేర్వటం, సారవంతమైన భూమి నుండి భుక్తిని పండించుకోవడం – ఈ మార్పులన్నీ ఆదిమ దశ నుండి ఆధునిక దశ వైపు మానవుడిని అభివృద్ధి పథంలో నడిపించి శాశ్వతుణ్ణి చేశాయి.

ప్రశ్న 2.
“ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకొని మానవుడు కళాభిరుచిని పెంపొందించుకున్నాడనే” కవి అభిప్రాయాన్ని సమర్థించండి. (March 2018)
జవాబు:

  1. మనిషి కళ్ళు తెరవగానే చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించాడు. ప్రకృతిని తన కనుసన్నలలో ఉంచే ప్రయత్నం చేస్తూ అందలి రంగులను, ధ్వనులను అనుకరించాడు. పూర్తిగా ప్రకృతిలో లీనమైపోయాడు.
  2. గుహలలో జీవించిన ఆదిమానవుడు గుర్రాలను, జింకలను గీస్తూ చిత్రలేఖన నైపుణ్యాన్ని పెంపొందించుకొన్నాడు.
  3. ఆటవికుడుగా ఉన్నప్పుడే తన గాన మాధుర్యంతో ఎండిన మోడులను చిగురింపజేశాడు. పాటకు తగినట్లుగా కఱకు రాతినేలపై కాలికి గజ్జెకట్టి గంతులు వేశాడు. స్వరాల సుకుమారపు నొక్కులతో మనస్సుకు హత్తుకొనేలా పాటలు పాడాడు.
  4. ఊహ తెలిసిన నాటి నుండి ప్రకృతిని ఆరాధిస్తూ తనను తాను మైమరచి పాటలు పాడుతూ ఆనందడోలికల్లో తేలిపోయాడు.
  5. ఈ విధంగా అతడు కళలను తన జీవితంలో ఒక భాగం చేసుకొన్నాడు. ప్రకృతి అతడికి తొలి గురువు. ప్రకృతి ఒడి అతడికి తొలి బడి. కనుక మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకొని కళాభిరుచిని పెంపొందించుకున్నాడనే కవి అభిప్రాయాలు సంపూర్ణంగా సమర్థించదగినవని నేను భావిస్తున్నాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 3.
మానవ మహాప్రస్థానంలో కవికి తోడైన వాటిని గూర్చి వివరించండి.
(లేదా)
మానవ మహాప్రస్థానంలో అతనితో పెనవేసుకొనిపోయిన అంశాలేవి? వాటిని కవి ఎలా స్మరించుకున్నాడో వివరించండి. (March 2019)
జవాబు:
మానవ మహాప్రస్థానంలో కవికి కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయి. ఆదిమ మానవుడికి కళలు తెలియవు. అతడు ప్రకృతిని చూసి సంతోషించి, దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ద్వారా మంచి విజ్ఞానం పొందాడు. చిత్రలేఖనం నేర్చుకున్నాడు. పక్షుల ధ్వనులను అనుకరించాడు. ఎండిన చెట్లు చిగిరించేలా పాడడం నేర్చుకున్నాడు. కాలికి గజ్జెకట్టి నాట్యం నేర్చాడు. మంచి కవిత్వం చెప్పడం నేర్చాడు.

గీతలు గీయడం ద్వారా లిపిని నేర్చుకొని తన అభిప్రాయాన్ని ఇతరులకు తెలుపగలిగాడు. చక్కని గీతాలు చిన్న మాటలతో రాశాడు. ధాన్యం పండించి హాయిగా తింటున్నాడు. మానవుడు తన అలసటను, కళా కవితల ద్వారా పోగొట్టుకుంటున్నాడు. విజ్ఞానం పెంచుకొని చక్రాన్ని కనిపెట్టి దాని ద్వారా వాహనాలు, యంత్రాలు కనిపెట్టాడు. వైజ్ఞానికంగా ఎంతో ముందడుగు వేశాడు. నిప్పును కనిపెట్టి వంటకాలు వండుకు తిన్నాడు.

ఈ విధంగా ఆదిమ మానవుడు, కళలు, కవిత, విజ్ఞానముల ద్వారా మిన్నులు పడిన చోటు నుండి ఆకాశానికి ఎదిగాడు.

ప్రశ్న 4.
మైలు రాళ్ళ వంటి అంశాలు వేటికి గుర్తులుగా మీరు భావిస్తున్నారు?
జవాబు:
విద్వాన్ విశ్వంగారు తన ‘మాణిక్య వీణ’ అనే గేయంలో చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచిన కొన్ని విషయాలను గూర్చి పేర్కొన్నాడు.

1) మానవుడు ‘చక్రం’ ను కనుక్కొన్న రోజు చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్నారు. అలాగే చకచకా నాలుగు గీతలతో లిపిని కనుక్కొన్న రోజు కూడా విశేషమైనదన్నారు. చక్రం, మానవ చలనానికి దోహదపడింది. ‘లిపి’, భావ సంచలనానికి వేదిక అయి, సృజనాత్మకత ప్రపంచంలోకి దారితీసింది.

2) నిప్పును కనుక్కొన్న రోజు ఎంత గొప్పదో, తప్పటడుగుల చిందుల నుండి, గొప్ప నృత్యాలు చేసిన రోజు కూడా అంతే గొప్పది.

3) అరుపుల నుంచి అర్థవంతమైన మాటలు నేర్చిన రోజు, ఆ మాటలతో జానపద గీతాలు అల్లిన రోజు, సారవంతమైన భూమి నుండి ఆహారం పండించుకున్న రోజు, మనస్సుకు ఆనందం కల్గించే కళ ఆవిష్కరణ జరిగిన రోజు, మొదలయినవి అన్నీ చరిత్రలో మైలురాళ్ళుగా నిలుస్తాయి. అవన్నీ గొప్ప రోజులే.

మానవుని జీవన పరిణామచరిత్రలో అసాధారణ సంఘటనలు జరిగిన ప్రతిరోజూ శుభదినమే అని విద్వాన్ విశ్వంగారు చెప్పారు.

ప్రశ్న 5.
చరిత్రలో మైలురాళ్ళుగా కవి వేటిని గుర్తించాడు? ఎందుకు?
జవాబు:
మానవుడు చక్రాన్ని కనుక్కొన్న రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, నాలుగు గీతలతో లిపిని కనుక్కొన్న రోజు, తప్పటడుగులు మాని తాండవ నృత్యం చేసిన రోజు, భాషలు నేర్చుకొన్న రోజు, చిన్న చిన్న మాటలతో పదాలు అల్లుకొన్నరోజు, ధాన్యం పండించుకున్న రోజు కళలను పండించుకొన్న రోజు, మానవ జీవిత చరిత్రలో మైలురాళ్ళుగా నిలుస్తాయని, విద్వాన్ విశ్వంగారు చెప్పారు. పైవన్నీ మానవుడి జీవనయాత్రలో అభ్యుదయానికీ, విజ్ఞానానికీ, ప్రతీకలు.
1) చక్రం కనుక్కొన్న రోజు :
చక్రాన్ని కనిపెట్టాకే, బళ్ళు, రిక్షాలు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, రైళ్ళు, ఫ్యాక్టరీ యంత్రాలు . వగైరా వాడుకలోకి వచ్చాయి. పారిశ్రామికాభివృద్ధి అంతా, చక్రం తిరగడం మీదే ఆధారపడి ఉంది.

2) నాలుగు గీతలతో ఆకార నిర్మాణం :
ఈ విధంగానే భాషలకు చిత్రలేఖనం, లిపులు, గ్రంథాలు, మహాకావ్యాలు, విజ్ఞాన సాధన, చదువులు వచ్చాయి.

3) నిప్పును కనుక్కోడం :
నిప్పును మానవుడు కనిపెట్టాక, పదార్థాలను ఉడికించి కమ్మగా, రుచిగా అతడు తింటున్నాడు. ఆధునిక నాగరికతకు ఇది ప్రతీక.

4) తాండవ నృత్యం చేయడం :
నృత్యం ద్వారానే, నాట్యకళ అభివృద్ధి అయ్యింది. భరతనాట్యం వంటి వివిధ నృత్యాలు, కళాభివృద్ధి జరిగింది.

5) భాషలు నేర్చుకోడం :
భాషలు నేర్చుకోడం వల్లే కవిత్వము, సాహిత్యాభివృద్ధి జరిగింది. 6) ధాన్యం పండించడం : పచ్చి మాంసం తిన్న మానవుడు నాగరికత పెంచుకొని, వ్యవసాయం నేర్చుకొని ఆహార పదార్థాలను పండించాడు.

7) కళలు పండించడం :
లలిత కళాభివృద్ధి దీనివల్లే జరిగింది. మానవుడు సౌందర్యమును ఆరాధించేవాడయ్యాడు. అందుకే చక్రం, నిప్పు మొ||వి చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 6.
మానవుడు సాధించిన ప్రగతిని కవి వర్ణించిన తీరుపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
విద్వాన్ విశ్వంగారు మాణిక్య వీణలో మానవుడు ఎంతో ప్రగతిని సాధించాడని, మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయని చెప్పారు.

ఆదిమ మానవుడికి కళలు తెలియవు. అతడు ప్రకృతిని తన అధీనం చేసుకోడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఎంతో విజ్ఞానం సాధించాడు. చిత్రలేఖనం నేర్చుకున్నాడు. ఎండిన మోళ్ళు చిగురించేలా పాటలు పాడడం నేర్చాడు. నాట్యం చేయడం నేర్చాడు. కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు.

గీతలు గీసి దాని ద్వారా లిపిని నేర్చుకొన్నాడు. చిన్న మాటలతో జానపద గీతాలు అల్లుకున్నాడు. ధాన్యం పండించాడు. విజ్ఞానం అభివృద్ధి చేసుకొని ‘చక్రం’ కనిపెట్టి దాని ద్వారా పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలు కనిపెట్టి ముందుకు సాగాడు. నిప్పును కనిపెట్టి వంటకాలు వండుకొని తిన్నాడు.

కవి వర్ణించినట్లుగా, మానవుడు కళలు, కవిత్వం, విజ్ఞానం అనే వాటిని తోడుగా చేసుకొని, ప్రగతిని సాధించాడని నేను కూడా నమ్ముతున్నాను.

ప్రశ్న 7.
మానవ చరిత్రలోని అసాధారణ పర్వదినాల ఆంతర్యం ఏమిటి?
జవాబు:
‘అసాధారణ పర్వదినాలు’ అంటే, గొప్ప విశేషమైన పండుగలు అని అర్ధము. మానవుడు పుట్టినప్పుడు అతడికి ఇల్లు కట్టుకోవడం తెలియక, గుహలలో నివసించాడు. చక్రం గూర్చి తెలియక, కాలి నడకన ప్రయాణం సాగించాడు. నిప్పు గురించి తెలియక, పచ్చిమాంసం తిన్నాడు. అక్షరం గూర్చి తెలియక, గీతలు గీశాడు. భాషలు తెలియక, కిచకిచలాడాడు.

అటువంటి ఆదిమ మానవుడు చక్రాన్ని, నిప్పును, కళలను, భాషలను, వ్యవసాయ పద్ధతులను తెలిసికొన్నాడు. దాని ద్వారా ఎన్నో వాహనాలను, యంత్రాలను నిర్మించి పరిశ్రమలను వృద్ధి చేశాడు. నిప్పు ద్వారా చక్కగా వండుకొని కమ్మగా తిన్నాడు. భాషలను నేర్చుకొని చక్కగా మాట్లాడగలిగాడు. లలిత కళలను నేర్చుకొని ఆనందాన్ని పొందాడు. జానపద గీతాలు, కవిత్వం అల్లాడు. కాబట్టి మానవుని అభ్యుదయ యాత్రలో అతడు నూతనంగా వస్తువులు కనిపెట్టిన రోజులన్నీ, కవి చెప్పినట్లు అసాధారణ పర్వదినాలనే నా అభిప్రాయము.

ప్రశ్న 8.
మానవ ప్రస్థానాన్ని కవి వర్ణించిన తీరును ఎలా సమర్థిస్తావు?
జవాబు:
మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయని కవి చెప్పిన మాట నిజం.

ఆదిమ మానవుడికి కళలు తెలియవు. అతడు ప్రకృతిని చూచి పరవశుడయి, ప్రకృతిని తన అధీనం చేసుకోడానికి యత్నించాడు. ఆ ప్రయత్నంలో అతడు ఎంతో విజ్ఞానం సంపాదించాడు. చిత్రలేఖనం నేర్చుకున్నాడు. రంగులనూ, ధ్వనులను అనుకరించాడు. ఎండిన మోళ్ళు చివురించేలా పాటలు పాడడం నేర్చాడు. కాలికి గజ్జెకట్టి నాట్యం చేయడం నేర్చుకున్నాడు. చిక్కని పదాలతో కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు.

గీతలు గీయడం ద్వారా లిపిని నేర్చుకొని తన అభిప్రాయాన్ని ఇతరులకు తెలుపగలిగాడు. చిన్న చిన్న మాటలతో చక్కగా జానపద గీతాలు అల్లుకున్నాడు. ధాన్యం పండించుకొని దానిని ఆహారంగా తిన్నాడు. అతనికి జీవితంలో కలిగిన అలసటనూ, యాంత్రికతనూ కళా కవితల ద్వారా దూరం చేసుకున్నాడు.

విజ్ఞానం అభివృద్ధి చేసుకొని చక్రం కనిపెట్టి దాని ద్వారా పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలు కనిపెట్టి ఎంతో వైజ్ఞానికంగా ముందుకుసాగాడు. నిప్పును కనిపెట్టి, అనేక వంటకాలు వండుకొని తిన్నాడు.

ఆదిమ మానవుడు ఈ విధంగా కళలు, కవిత్వం, విజ్ఞానం నేర్చుకోవడం ద్వారా, మిన్నులు పడ్డచోటు నుండి ఎదిగి మిన్నందుకున్నాడు. అతని ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడుగా ఉన్నాయి.

ప్రశ్న 9.
మాణిక్య వీణ కవితలో కవిగారు చెప్పిన అంశాలేవి?
జవాబు:
మంత్రాలతో చింతకాయలు ఎలా రాలవో, అలాగే పద్యాల ధాటితో చింతలు తొలగిపోవు. యంత్రాలతో రోగాలు నయం కానట్లే, తంత్రాలతో సమాజ సమస్యలు దారికిరావు.

కడుపులో కేన్సరుతో సంఘం బాధపడుతూ ఉంటే, అంతరిక్షంలోకి రాకెట్లు పంపితే మాత్రం ఏం ప్రయోజనం? మనిషి పుట్టగానే ప్రకృతిని చూచి ఆనందించాడు. దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అతడు ప్రయత్నించాడు. ప్రకృతిలోని రంగులనూ, ధ్వనులనూ అనుకరించాడు.

మానవుడు గుహలలో జీవించే ఆదిమ కాలంలోనే, గోడలపై జంతువుల బొమ్మలు గీశాడు. ఎండిన చెట్లు చిగిర్చేలా పాడాడు. గజ్జెకట్టి నాట్యం చేశాడు. చక్కని తీరుగా పదాలు పాడుకున్నాడు.

‘చక్రం’ కనుక్కొన్న రోజు, ‘లిపి’ తో రాసిన రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, చక్కగా నాట్యం చేసిన రోజు, మానవ చరిత్రలో మంచి రోజులు. మానవుడు అర్ధవంతమైన భాషలు నేర్చుకొన్న రోజు, చిన్నమాటలతో జానపద గీతాలు అల్లుకున్న రోజు, ధాన్యం పండించిన రోజు, కళలను పండించిన రోజు గొప్పరోజులు. మానవచరిత్రలో అవి అన్నీ పండుగరోజులు.

కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలసి మానవుడిని మహోన్నతంగా నడిపిస్తాయి. ఈ విధంగా నేల నుండి ఎదిగి మానవుడు ఆకాశాన్ని అందుకున్న చిన్నవాడు. మానవుడు చిరంజీవి. అతి ప్రాచీనుడు.

అనాదిగా నడుస్తున్న ఈ మానవుడి జీవనయాత్రలో కళాకవితలూ, జ్ఞాన విజ్ఞానాలూ, మానవుడి వెంటనే ఉండి, అతనితో నడుస్తూ, అతణ్ణి నడిపిస్తున్నాయి.

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ Important Questions and Answers

ప్రశ్న 1.
దిన పత్రికలు చదవమని విద్యార్థులను ప్రోత్సహిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
పత్రికా పఠనం
విద్యార్థులారా ! భావిభారత నిర్దేశకులారా !

పత్రికలు చదవండి. నిరంతరం ప్రపంచంలో జరుగుతున్న మార్పులను తెలుసుకోండి. పత్రిక పేరు ఏదైనా కావచ్చు. ప్రపంచ పరిజ్ఞానం ప్రధానం, టీ.వీ.ల మోజులో చదువుకు దూరం కాకండి.

పాఠ్య పుస్తకాలలో పరిజ్ఞానానికి, దిన పత్రికలలోని విశ్లేషణాత్మక పరిజ్ఞానం తోడైతే వ్యాఖ్యానించగల నేర్పు కలుగుతుంది. రోజూ క్రమం తప్పక పత్రికలు చదవండి. నిత్య నూతన విజ్ఞాన కాంతులతో విరాజిల్లండి.
ఇట్లు,
పాఠక బృందం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 2.
మానవుడు సాధించిన ప్రగతిని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఆదిమ మానవుడికి బట్ట కట్టుకోడం తెలియదు. అన్నం వండుకొని తినడం తెలియదు. చెట్టు బెరడులు కట్టుకొని,జంతువులను చంపి పచ్చిమాంసం తినేవాడు. ప్రకృతిలో దొరికే కాయలు, దుంపలు, పళ్ళు తినేవాడు. ఆదిమ మానవుడికి రాయడం, చదవడం, కళలు తెలియవు. ఇళ్ళు కట్టుకోడం తెలియక, గుహలలో నివసించేవాడు.

మానవుడు క్రమంగా లలిత కళలు నేర్చుకున్నాడు. రాయడం, కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. చక్రాన్ని, నిప్పును కనిపెట్టాడు. అర్థవంతమైన భాషలు నేర్చాడు. లిపులు నేర్చాడు. బట్టలు నేయడం, ధరించడం నేర్చాడు. కవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు.

విజ్ఞానం నేర్చుకొని సైన్సు ద్వారా ఎన్నో కొత్త యంత్రాలు కనిపెట్టాడు. వంటలు వండడంలో మెలకువలు గ్రహించాడు. సమాచార రంగంలో విప్లవం సాధించాడు. రేడియో, టి.వి, ఇంటర్నెట్ వంటివి కనిపెట్టాడు. కంప్యూటర్ రంగంలో విప్లవం సాధించాడు. ఫోటోలు తీయడం నేర్చాడు. కొత్త కొత్త శాస్త్ర విద్యలు నేర్చాడు.

కొత్త ప్రయాణ సాధనాలు కనిపెట్టాడు. ఫ్రిజులు, ఎ.సి.లు వగైరా కనిపెట్టాడు. రాకెట్లు కనిపెట్టాడు. ఇతర గ్రహాల పైకి వెళ్ళి వస్తున్నాడు. విమానాలపై ప్రయాణం సాగిస్తున్నాడు.

మానవుడు ఈ విధంగా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాడు.

ప్రశ్న 3.
‘ప్రగతికి మూలం నిరంతర కృషి’ అని తెలియజేసే నినాదాలు రాయండి.
జవాబు:
మానవుడి అభ్యుదయం – మనిషి చేతిలోనే ఉంది.
నిరంతర పరిశోధనయే – నిజ కల్యాణానికి పట్టాభిషేకం
శాస్త్ర ప్రయోగశాలలే – మానవుడి విజయసోపాన మందిరాలు
గోళ్ళు కొరుకుతూ కూర్చోకు – నీ అభివృద్ధికి నిరంతరం పాటుపడు
బద్ధకం, మాంద్యం – మనిషి అభివృద్ధికి వైరుధ్యం
ఈనాటి నీ కృషియే – రేపటి నీ విజయానికి సోపానం
కృషితో నాస్తి దుర్భిక్షం – కృషియే నీ భావి సౌభాగ్యం
బద్దకుడు, సోమరి – దేశ ప్రగతికి విరోధి
కృషి చేస్తే మనుషులు – ఋషులు అవుతారు.
కష్టపడి పనిచేస్తే – కడుపునిండా కూడు లభిస్తుంది.
ఆనాటి మానవుని కృషే – నేటి నీ వైజ్ఞానిక సౌఖ్యం
ఒళ్ళు వంచి పనిచేద్దాం – హాయిగా కులుకుతూ బ్రతికేద్దాం

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ 1 Mark Bits

1. సమాజంలోని రుగ్మతలు తొలగినపుడే దేశం బాగుపడుతుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి. (June 2017)
A) నీతి, ధర్మం
B) కల్మషం, విరోధం
C) జబ్బు, రోగం
D) ఆదాయం, లాభం
జవాబు:
C) జబ్బు, రోగం

2. శ్లేషాలంకారానికి ఉదాహరణ గుర్తించండి. (June 2018)
A) మా అన్న చేతివంట నలభీమపాకం.
B) ఆమె పలుకులు తేనె పలుకులు.
C) రాజు కువలయానందకరుడు.
D) సంసార సాగరమును ఈదుట కష్టము.
జవాబు:
C) రాజు కువలయానందకరుడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 9 మాణిక్యవీణ

3. సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దగలవు. (వ్యతిరేక వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) సినిమాలు జీవితాన్ని తీర్చబోవు.
B) సినిమాలు జీవితాన్ని తీర్చవు.
C) సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దలేవు.
D) సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దుతాయి.
జవాబు:
C) సినిమాలు జీవితాన్ని తీర్చిదిద్దలేవు.

4. ఈ సంవత్సరం వర్షాలు కురుస్తాయో, కురవవో – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2018)
A) సందేహార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) నిశ్చయార్థకం
D) నిషేధార్థకం
జవాబు:
C) నిశ్చయార్థకం

5. మంత్రాలకు చింతకాయలు రాలడం : “కష్టపడకుండా ఫలితం రాదు” అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. (March 2017)

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 8th Lesson సముద్ర‌లంఘ‌నం

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సముద్రలంఘనం పాఠం నేపథ్యం రాయండి. (S.A. I – 2019-20)
జవాబు:
సీతను వెతుకుతూ రామలక్ష్మణులు కిష్కింధకు చేరుకుంటారు. రామలక్ష్మణులు, సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సుగ్రీవుడు సీతను వెతకటానికి వానర సైన్యాన్ని నాలుగు దిశలకు పంపిస్తాడు. అంగదుని నాయకత్వంలో ఆంజనేయుని బృందం, దక్షిణ దిక్కుకు వెళ్తుంది. జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనానికి సిద్ధమౌతాడు.

ప్రశ్న 2.
హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు చేసిన చేష్టలను గురించి రాయండి. (June 2018)
జవాబు:

  1. సముద్ర లంఘనానికి ముందు హనుమంతుడు పెద్ద పెద్దగా అంగలు వేస్తూ బలంగా నడవడం, తోకను వేగంగా తిప్పడం, చేతిని జబ్బపై చరచడం, సింహనాదం చేయడం వంటి పనులను చేశాడు.
  2. ఈ పనులు అతని ఆత్మవిశ్వాసాన్ని, సమస్త శక్తులను కూడగట్టుకోవడాన్ని సూచిస్తున్నాయి.
  3. ఏ పనినైనా చేయడానికి పూనుకొనే ముందు శక్తులన్నింటినీ సమీకరించడం వీరులు చేసే ముఖ్యమైన పని.
  4. మహావీరుడైన రూనుమంతుడు కూడా తనలో అంతర్గతంగా ఉన్న శక్తులను బయటకు రప్పించడానికే అలా చేశాడని నేను భావిస్తున్నాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 3.
అయ్యలరాజు రామభద్రుని గురించి రాయండి.
జవాబు:
‘సముద్రలంఘనం’ పాఠ్యభాగ రచయిత అయ్యలరాజు రామభద్రుడు. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఇతడు ప్రసిద్ధుడు. వీరి రచనల్లో రామాభ్యుదయం, సకల కథాసార సంగ్రహం వంటి రచనలు రచించాడు. రామాభ్యుదయంలో ఎనిమిది ఆశ్వాసాలు ఉంటాయి. ఉత్తరకాండను వదలివేశారు. వీరికి ‘చతురసాహిత్య లక్షణ చక్రవర్తి’, ‘ప్రతివాది మదగజ పంచానన’ అనే బిరుదులు ఉన్నాయి. వీరి శైలి కవితాసామర్థ్యంతో కూడి యుంటుంది. వీరి వర్ణన సహజ ధోరణిలో సాగుతుంది.

ప్రశ్న 4.
హనుమంతుని స్వభావాన్ని వివరించండి.
జవాబు:
హనుమంతుడు, సుగ్రీవునకు, మంత్రి, ఇతడు మహాబలశాలి. స్వామిభక్తి పరాయణుడు, శ్రీరామ భక్తుడు. సుగ్రీవునికి నమ్మిన బంటు. రామలక్ష్మణులకు, ఇతడే సుగ్రీవునితో స్నేహం కల్పించాడు. శ్రీరాముని సహాయంతో సుగ్రీవుడిని వానర రాజ్యాధిపతిని చేశాడు. సీతాన్వేషణలో హనుమంతుడు ప్రముఖ పాత్ర వహించాడు. నూరుయోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళి పట్టుదలతో సీతాదేవి జాడను కనిపెట్టి, సీతమ్మకు రాముని ఉంగరాన్ని ఇచ్చి, ఆమెకు ధైర్యం చెప్పాడు. సీతమ్మ తనకు ఇచ్చిన చూడామణిని, శ్రీరామునకు తెచ్చి ఇచ్చి, సీత వృత్తాంతాన్ని రామునకు తెలియచెప్పాడు. ఇతడు ఒంటరిగా లంకకు వెళ్ళి, రాక్షస సైన్యాన్ని చంపి, లంకను దహనం చేసి, రావణునికి, రాముని సందేశం అందించిన రామదూత. ఇతడు రామరావణ యుద్ధంలో వీరోచితంగా పోరాడాడు. సంజీవిని తెచ్చి లక్ష్మణుని బ్రతికించాడు. ఆంజనేయుడు మహావీరుడు.

ప్రశ్న 5.
మీకు నచ్చిన ఒక సందర్భాన్ని వివరించండి.
జవాబు:
నేను, నా మిత్రులతో కలిసి విహారయాత్రకై మహానంది బయలుదేరాను. ఈ యాత్ర నాకు మధురానుభూతిని మిగిల్చింది. ముఖ్యంగా ఈ క్షేత్రం నల్లమల అడువుల్లో ఉంటుంది. గిద్దలూరు దగ్గరి నుండి నంద్యాల వరకు రైలు ప్రయాణం అరణ్యం గుండా జరిగింది. వంపుసొంపుల మార్గాలు, ఇరువైపులా ఆకాశాన్ని తాకుతున్న పర్వత శిఖరాలు, వాటిపై పొడవైన చెట్లు, ఆ చెట్టుకున్న ‘పూలు చూడముచ్చటగా ఉన్నాయి. మధ్యలో పొడవైన రెండు పెద్ద గుహలు. ఆ గుహల్లోకి రైలు వెళ్ళగానే అంతా దట్టమైన చీకటి. ఏమీ కనిపించదు. ఇది చూచి అనుభవించి తీరవలసిందే. ఎతైన కొండల నుండి కిందికి జాలువారే సెలయేళ్ళు, అక్కడక్కడా గిరిజనుల నివాసాలు సుమనోహరంగా ఉన్నాయి. ప్రకృతి అందాలకు నల్లమల పుట్టినిల్లు. భూదేవికి పచ్చని చీర కట్టినట్లుగా ఉంటుంది. పక్షుల కిలకిలారావాలు, కోయల విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 6.
సముద్రలంఘనానికి ముందు హనుమంతుని ప్రవర్తనను బట్టి నీవేమి గ్రహించావు?
జవాబు:
సముద్రలంఘనానికి ముందు హనుమంతుడు గట్టిగా ఒత్తి అడుగులు వేసి, రాళ్ళను పగులకొట్టి, చెట్లను కూలగొట్టి, క్రూర జంతువులను సైతం పారిపోయేలా చేసి, గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. ఆతని పాదాల ఒత్తిడికి పర్వత శిఖరాలు కంపించిపోయాయి.

హనుమంతుడు తన శక్తిని మిగిలిన వానరులకు, ఈ విధంగా చూపించాడు. తాను సీత జాడను తెలిసికొని రాగలనని తనవారికి ఆ విధంగా ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తిమంతుడననీ, కొండల్ని పిండి చేయగలననీ నిరూపించాడు. తాను వాయుదేవుని అనుగ్రహం కలవాడినని, మిగిలిన వానరులకు తెలియపరచి, వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు తాను తప్పక సీత జాడను తెలిసికొని రాగలనని, ముందుగానే తన తోడి వానరులకు ఈ విధంగా భరోసా ఇచ్చాడు. అందుకే హనుమంతుడు ఆ చేష్టలు చేశాడు.

ప్రశ్న 7.
హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినపుడు సమీపంలోని వారికి ఎలా కనిపించాడు? ఎందుకో వివరించండి.
జవాబు:
హనుమంతుడు మహేందగిరిపై కాళ్ళు వేసి, దానిని క్రిందికి అణగదొక్కి ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లు కాకుండా ఒక పర్వతము ఆకాశంలో ఎగురుతున్నట్లు సమీపం నుండి చూసే వారికి కనబడింది.

కారణము : హనుమంతుడు సూరుయోజనాల సముద్రాన్ని దాటడానికి తన రూపాన్ని బాగా పర్వతం అంత ఆకారంలో పెంచి వేశాడు. అందుకే హనుమంతుడు అప్పుడు చూసేవారికి పర్వతం అంత పరిమాణంలో కనిపించాడు. అందుకే ఆకాశంలో పర్వతం ఎగురుతున్నట్లు దగ్గర నుండి చూసేవారికి కనిపించింది.

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించిన హనుమంతుడిని కవి వర్ణించాడు కదా ! అయితే నీవు చూచిన ఒక అద్భుత ప్రకృతి దృశ్యాన్ని నీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
పవిత్రమైన భారతదేశంలో చూడదగిన ముఖ్యప్రదేశం కాశ్మీర్ ప్రాంతం. ఇక్కడి వాతావరణం సుమనోహరం. ప్రకృతి దృశ్యాలు నయనానందాన్ని కల్గిస్తాయి. ఒక్కమాటలో, చెప్పాలంటే కాశ్మీర్ ఒక భూతల స్వర్గం.

ఇక్కడ ఎటు చూసినా సమున్నత పర్వత శ్రేణి, వృక్షసంపద, సెలయేటి ధారలు యాత్రకులకు అలౌకికమైన అనందాన్ని కలిగిస్తాయి. పచ్చని పంటల శోభ, వాటి మధ్య ప్రవహించే కొండవాగుల అందం అన్నీ కలగలిపి భూదేవి హృదయాన ధరించిన ముత్యాలహారంలోని పచ్చలపతకంలా కాశ్మీరు లోయ ప్రకాశిస్తుంది.

పిర్ పంజల్ పర్వత శ్రేణిలో ‘బనిహాల్’కనుమ ఉంది. దాని చుట్టూ ఎత్తైన కొండలు. అక్కడ కొండల అంచుల్ని మంచు ముసుగు కప్పేస్తుంది. ఆ కొండల చివళ్ళనున్న మంచు పెళ్ళలుగా గట్టిగా పాలరాతి ముక్కల్లా మెరుస్తోంది. నల్లగా నిగనిగలాడే కొండ శరీరంపై అంచున తెల్లని పాలరాతి ముక్కలు ‘ఎమ్ బాస్’ చేసినట్లుగా ఉంది. అక్కడ కొండవాలుల్లో అన్నీ వరిపైర్లు, కొండవాగులోని నీరే ఆ పంటలకు ఆధారం. పచ్చని పైర్ల శోభ, వాటి మధ్య కొండవాగుల అందం అన్నీ కలగలిపి, భూదేవి హృదయాన ధరించిన ముత్యాలహారంలోని పచ్చల పతకంలా కాశ్మీరలోయ ప్రకాశిస్తోంది. అది అంత అందమైన లోయ కాబట్టే ప్రభుత్వం వారు కూడా అక్కడ ‘స్టాప్ అండ్ సీ బ్యూటిఫుల్ బనిహాల్’ (ఆగి బనిహాల్ సౌందర్యాన్ని దర్శించండి) అనే బోర్డు పెట్టి యాత్రికుల మనస్సులను సైతం అటువైపుకు తిప్పే ప్రయత్నం చేశారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 2.
ప్రాచీన కావ్యాలకు సంబంధించిన వర్ణనాత్మక పాఠ్యాంశాలను చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను రాయండి.
జవాబు:
సనాతనమైన భారతీయ సంస్కృతిలో సాహిత్య సంపదకు సమాన్నతమైన స్థానం ఉంది. మన సంస్కృతిలో కావ్య సంపద ఉన్నతమైంది. మన తెలుగు సాహిత్యంలో ఎన్నో వర్ణనాత్మక కావ్యాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉన్నాయి. వర్ణనాత్మక పాఠ్యాంశాలను చదవడం వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని.

  • మన ఇతిహాసాలకు సంబంధించిన కళాత్మక రూపాలను, సుందర ప్రదేశాల విశిష్ఠతను తెలుసుకొనవచ్చు.
  • వర్ణనల్లో ఉండే అందాలను, అనుభూతులను గ్రహించవచ్చు.
  • మనం చూడలేని ప్రకృతి దృశ్యాల అందాలను విద్యార్థులు తెలుసుకోవచ్చు.
  • వర్ణనల్లో ఉండే అలంకార మధురిమలను తెలుసుకోవచ్చు.
  • శైలి భేదాలను, రసాత్మకతను గ్రహింపవచ్చు.
  • ప్రాచీన కవుల అలంకారప్రయోగాలను, నుడికారాలను, యాసలను, సామెతలను తెలుసుకోవచ్చు.

ఈ రకంగా ప్రాచీన వర్ణనాత్మక పాఠంను చదవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తరతరాల వారసత్వాన్ని తెలుసుకొని భావితరాలకు అందించవచ్చు.

ప్రశ్న 3.
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పటి పరిస్థితిని బట్టి అతని బలాన్ని ఊహించి రాయండి.
జవాబు:
సముద్రాన్ని దాటడానికి సిద్ధమైన హనుమంతుడు, మహేంద్ర పర్వతంపై అడుగులు నొక్కిపెట్టి వేసినపుడు, పిడుగులు పడ్డట్లుగా అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. దీనిని బట్టి హనుమంతుడు గొప్ప బరువు కలవాడని తెలుస్తోంది. హనుమంతుడు వేగంగా తోకను తిప్పినప్పుడు, ఆ వేగానికి పెద్ద పెద్ద అడవులు సైతం ఖాళీ ప్రదేశాలు అయ్యాయి. చెట్లు అన్నీ కూలిపోయాయి. దీనినిబట్టి హనుమంతుడు వాయుదేవుని మించిన వేగం గలవాడని తెలుస్తోంది.

హనుమంతుడు చేతితో చరిస్తే, కఱ్ఱతో కొట్టినట్లు ఏనుగులు, సింహాలు సైతం బెదరి పారిపోయాయి. దీనినిబట్టి హనుమంతుడి చేతిలో గొప్పబలం, శక్తి ఉందని తెలిసింది. హనుమంతుడు సింహనాదం చేస్తే, ఆ ధ్వనికి గుహలు సైతం ప్రతిధ్వనించాయి. దీనినిబట్టి హనుమంతుని సింహనాదం, కర్ణకఠోరంగా భయంకరంగా ఉంటుందని తెలిసింది.

హనుమంతుడు నడుస్తూంటే, కొండలు కంపించిపోయాయి. ఆ కంపనాలకు కొండలపై ఉన్న సెలయేటి కెరటాలు ఆకాశాన్ని అంటేటట్లు ఎగసిపడ్డాయి. దీనినిబట్టి హనుమంతుడు మహాబలవంతుడని అపారశక్తి సామర్థ్యాలు కలవాడని మనకు తెలుస్తోంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 4.
అందరు వానర వీరుల్లో హనుమయే సముద్రలంఘనానికి సమర్థుడని ఎలా గుర్తించారు?
జవాబు:
ఈ ప్రశ్నకు జవాబు, మన పాఠంలో లేదు. అయినా రామాయణాన్ని బట్టి, దీనికి సమాధానం ఇలా ఉంటుంది.

సీతను అపహరించిన రావణుని గూర్చి, లంకా నగరాన్ని గూర్చి సంపాతి, వానరులకు చెప్పింది. దానితో వానరులు సముద్రాన్ని దాటడంలో వారి వారి శక్తి సామర్థ్యాలను గూర్చి చెప్పారు.

వానరులలో కొందరు తాము 50 యోజనాల దూరం’ దాటగలం అన్నారు. జాంబవంతుడు తాను 90 యోజనాల దూరం దాటగలనన్నాడు. యువరాజైన అంగదుడు తాను సూరుయోజనాల సముద్రాన్ని దాటగలను గాని, తిరిగి రాలేనేమో అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు అంగదుడు యువరాజు కాబట్టి అతడు లంకకు వెళ్ళడం తగదని చెప్పాడు. జాంబవంతుడు హనుమంతుని దగ్గరకు వెళ్ళి, అతడు వాయుపుత్రుడని సముద్రాన్ని దాటగలడని చెప్పాడు. హనుమంతుడు చిన్నప్పుడే సూర్యుడిని చూసి పండు అనుకొని నూరు యోజనాలు ఎగిరాడని అతనికి గుర్తు చేశాడు. బ్రహ్మవరం వల్ల హనుమంతుడిని వజ్రం కూడా ఏమి చేయలేదన్నాడు.

దానితో హనుమంతుడు తన శక్తిని వెల్లడించాడు. వేలకొద్దీ యోజనాల దూరం తాను దాటగలనని ప్రకటించాడు. అందువల్ల హనుమయే సముద్రలంఘనానికి సమర్థుడని వానర వీరులు గుర్తించారు. హనుమంతుడిని మెచ్చుకొని సీతాన్వేషణకు అతడినే పంపారు.

ప్రశ్న 5.
మీ పాఠం ఆధారంగా హనుమంతుడి సమర్థతను వివరించండి.
జవాబు:
హనుమంతుడి సమర్దత :
హనుమంతుడు సముద్రం పైకి ఎగిరేటప్పుడు మహేంద్ర పర్వతం పై పాదాలు నొక్కివేస్తే పిడుగులు పడినట్లుగా పెద్దరాళ్ళు పగిలిపోయాయి. హనుమ తోకను త్రిప్పిన గాలివేగానికి అడవులు అన్నీ కూలి శూన్య ప్రదేశాలు ఏర్పడ్డాయి. హనుమ చేతితో చరిస్తే కల్టుతో కొట్టినట్లు ఏనుగులు, సింహాలు పారిపోయాయి. హనుమ సింహనాదం చేస్తే పోటీపడ్డట్లు గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. ఆ కంపనాలకు కొండలపై సెలయేళ్ళు ఆకాశానికి ఎగసిపడ్డాయి.

హనుమంతుడు శరీరాన్ని ధరించిన వాయుదేవుడు వలె ఉన్నాడు. హనుమ తన శరీరాన్ని పెంచితే, పర్వత శిఖరాలు కదలిపోయాయి.

హనుమంతుడు మహేంద్రగిరిని అణగదొక్కి, ఆకాశంపైకి ఎగిరినప్పుడు పర్వతము ఎగిరినట్లు కనబడింది. దానిని బట్టి హనుమ, పర్వతం అంత ఆకారంలో ఉన్నాడని తెలుస్తుంది.

హనుమంతుడి కాలిపిక్కల నుండి పుట్టిన గాలివేగానికి సముద్రం లోతుగా చీలిపోయింది. హనుమంతుడి కాలిపిక్కల నుండి వచ్చే గాలి వేగానికి సముద్రము మధ్య చీలినట్లు కనబడింది.

ఆ విధంగా చీలిన సముద్రాన్ని చూసినవారికి, రాముడి క్రోధరసము లంకకు చేరడానికి కాలువ త్రవ్వారేమో అనిపించింది. రాబోయే కాలంలో కట్టబోయే సేతువుకు పునాది త్రవ్వారేమో అనిపించింది. హనుమంతుడిని చూడ్డానికి పాతాళంలోని ఆదిశేషువు వచ్చి తలుపులు తెరిచాడేమో అన్నట్లు కనబడింది. హనుమంతుడు భూదేవికి కీర్తి వస్త్రాలను అర్పించి, ఆమె ధరించిన నల్లని వస్త్రాలను చీల్చివేసినట్లు కనబడింది. హనుమంతుడు మహా సమర్థుడు.

ప్రశ్న 6.
సముద్రలంఘనానికి ముందు హనుమంతుని చేష్టలు సమర్థనీయమా? చర్చించండి.
జవాబు:
సముద్రమును దాటడానికి ముందు హనుమంతుడు మహేంద్రగిరిపై గట్టిగా ఒత్తి అడుగులు వేసి కొండ రాళ్ళను పగుల గొట్టాడు. తన తోకను త్రిప్పి ఆ గాలివేగంతో చెట్లను కూలగొట్టాడు. క్రూర జంతువులను సైతం బెదిరించి పారిపోయేటట్లు చేశాడు. గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. పర్వత శిఖరాలు కంపించిపోయేలా చేసి, సెలయేరులోని నీళ్ళు ఆకాశానికి తగిలేలా చేశాడు.

ఈ పనుల వల్ల హనుమంతుడు తన శక్తిని, బలాన్ని మిగిలిన వానరులకు చూపించాడు. సముద్రమును దాటడం ఎలాగా అని, ఆందోళన పడుతున్న తనతోడి వానరులకూ, యువరాజు అంగదుడికీ, ధైర్యం చేకూర్చాడు. తాను సముద్రాన్ని దాటివెళ్ళి సీత జాడను తెలిసికొని రాగలనని, తనవారికి ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తివంతుడననీ, కొండలను పిండి చేయగలనని నిరూపించాడు.

తాను వాయుదేవుని అనుగ్రహంతో ఎంతటి సాహసకార్యం అయినా చేయగలనని తనవారికి భరోసా కల్పించాడు. హనుమంతుడు మహాశక్తివంతుడని, బలవంతుడని ఈ చర్యల ద్వారా మిగిలిన వానరులకు అర్థమయ్యింది. వారి ఆరాటం శాంతించింది. కాబట్టి సముద్రమును దాటే ముందు హనుమంతుడు చేసిన చేష్టలు, సమంజసంగానే ఉన్నాయి.

ప్రశ్న 7.
మీ పాఠం ఆధారంగా హనుమంతుని స్వభావాన్ని విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. ధైర్యశాలి. సాహసం కలవాడు. దృఢమైన దీక్ష కలవాడు. కార్యసాధకుడు. అందువల్లనే సముద్రలంఘనానికి తాను సిద్ధపడ్డాడు.

హనుమంతుడి శక్తి బలములు :
హనుమంతుడి బలము, శక్తి, ధైర్యము అసమానములైనవి. .సముద్రం దాటడానికి అతడు పర్వతంపై ఒత్తి అడుగులు వేస్తే కొండరాళ్ళన్నీ, పగిలిపోయాయి. అతడు తోకను త్రిప్పిన గాలి వేగానికి చెట్లన్నీ కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే క్రూర జంతువులు సైతం పారిపోయాయి. అతడు సింహనాదం చేస్తే, గుహలు ప్రతిధ్వనించాయి. హనుమంతుడి పాదాల ఒత్తిడికి పర్వతాలు కంపించి, ఏరులలోని జలాలు ఆకాశానికి ఎగసిపడ్డాయి.

పర్వతం అంత ఆకారము:
హనుమంతుడు తన శరీరాన్ని పెంచితే సాక్షాత్తు అతని తండ్రి వాయుదేవుడిలా కనిపించాడు. అతడు ఎగురుతూ ఉంటే, పర్వతం ఎగిరినట్లు కనిపించింది.

సోదర వానరులకు ధైర్యం :
హనుమంతుడు సముద్రంపై ఎగిరే ముందు, తన శక్తి సామర్థ్యాలను తోడి వానరులకు చూపించి తప్పక తాను సీత జాడ తెలిసేని రాగలనని వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు మహేంద్ర గిరిపై పాదాలు తొక్కిపెట్టి, పైకి లేవగా ఆ పర్వతమే భూమిలోకి దిగిపోయింది.

కాలిపిక్కల వేగం :
హనుమంతుడు ఎగిరేటప్పుడు అతడి కాలిపిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రము చీలిపోయింది. అది రాముడి క్రోధరసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, సేతువు కట్టడానికి తవ్విన పునాదిలా, బలి చక్రవర్తి ఇంటి వాకిలిలా కన్పించింది.

దీనినిబట్టి హనుమంతుడు మహాబలవంతుడని, ధైర్యం కలవాడని, గొప్ప సాహసవంతుడని, కార్యసాధకుడని తెలుస్తోంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 8.
సముద్రలంఘనం పాఠంలో కవి చాతుర్యాన్ని విశ్లేషించండి.
జవాబు:
సముద్రలంఘనం పాఠం అయ్యలరాజు రామభద్రుడు రచించిన ‘రామాభ్యుదయం’ ప్రబంధములోనిది. ఈ కవి గొప్ప – కవితాచాతుర్యం కలవాడు. గొప్ప భావకుడు, మంచి కవితాశక్తి కలవాడు. ఆలంకారిక సిద్ధహస్తుడు.

ఈ పద్యాలలో స్వభావోక్తి, ఉత్ప్రేక్షాలంకారాలు చక్కగా ఉన్నాయి. హనుమంతుడు ఎగరడానికి ముందు చేసిన చేష్టల వర్ణన, చక్కని స్వభావోక్తిలో ఉంది. హనుమంతుడి అడుగులకు కంపించి ఎగిరిన సెలయేళ్ళ జలాలు, ఆకాశం ఎత్తు ఎగిరి దావాగ్నులను, వానరుల మనస్సులలోని తాపాన్ని చల్లార్చాయని కవి చక్కగా చెప్పాడు.

హనుమంతుడు ఎగిరినప్పుడు వచ్చిన పిక్కలగాలికి సముద్రం రెండుగా లోతుగా చీలి పోయిందట. అప్పుడు అది ఆ రాముని క్రోధరసాన్ని లంకకు చేరడానికి తవ్విన కాలువలా, సేతు నిర్మాణానికి తవ్విన పునాదిలా, హనుమంతుడిని చూడ్డానికి శేషుడు వచ్చి తలుపు తెరిచిన బలిమందిరంలా ఉందని, అద్భుతమైన ఉత్ర్ఫేక్షలు ఇక్కడ కవి ప్రయోగించాడు.

రామభద్రకవి ఊహాశక్తికి జోహార్లు అర్పిద్దాం.

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం Important Questions and Answers

ప్రశ్న 1.
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పుడు ప్రకృతి ఎలా సహకరించింది?
జవాబు:
హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పుడు ప్రకృతి అనేక విధాలుగా సహకరించింది. రామ కార్యానికి వెళ్తున్న హనుమంతుడికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. వాయువు చల్లగా ప్రసరించాడు. దేవతలు, గంధర్వులు, మహర్షులు కీర్తించారు. హనుమంతునికి శ్రమ కలుగకూడదని సముద్రుడు భావించాడు. సముద్రుని ఆజ్ఞపై మైనాకుడు సముద్రం నుండి బయటికి వచ్చి హనుమంతుడ్ని కొంతసేపు తన బంగారు శిఖరాల మీద విశ్రాంతి తీసుకోమన్నాడు.

ప్రశ్న 2.
సముద్రలంఘనం పాఠం కథ రూపంలో రాయండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. అతడు సముద్రాన్ని దాటేముందు శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపై అడుగులు వేశాడు. అప్పుడు పిడుగులు పడ్డట్లు రాళ్ళు పగిలిపోయాయి. హనుమంతుడు తోకను త్రిప్పినప్పుడు వచ్చిన గాలి వేగానికి చెట్లు కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే భయపడి క్రూర జంతువులు పారిపోయాయి. అతడు చేసిన సింహనాదానికి గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. కొండలపై సెలయేళ్ళ కెరటాలు ఎగసిపడి ఆకాశాన్ని తాకాయి. హనుమంతుడు పెరిగి మహేంద గిరిపై నిలిచాడు.

హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, వంగి, చేతులను నడుముకు ఆనించి, తోకను ఆకాశం మీదికి పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, గాలి గట్టిగా పీల్చి, తాను నిలబడ్డ కొండను అణగదొక్కి పైకి ఎగిరాడు.

హనుమంతుడు ఎగురుతూ ఉంటే, పర్వతము ఎగిరినట్లు అనిపించింది. హనుమంతుడు విల్లు నుండి విడిచిన బాణంలా పెద్ద ధ్వనితో లంకవైపు దూసుకుపోయాడు.

హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు, సూర్యుడు మహా వేగంగా కాడి ఉన్న తన రథాన్ని అటువైపు తోలుకు వస్తున్నాడేమో అనుకొన్నారు. హనుమంతుని పిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రం లోతుగా చీలింది. ఆ గాలి పాతాళంలో ఉన్న పాములకు, ఆహారం వచ్చిందేమో అనిపించింది.

హనుమంతుడి పిక్కల బలంతో వీచిన గాలి వేగానికి సముద్రం చీలినట్లు కాగా, రాముని క్రోధరసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, రాబోయే కాలంలో కట్టే సేతువుకు పునాదిలా, ఆదిశేషుడు తలుపులు తెరిచిన బలిమందిరం యొక్క వాకిలిలా కనిపించింది. హనుమ, త్రికూటాద్రి పై దిగాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

ప్రశ్న 3.
‘సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు’ అనే అంశం దృష్టిలో పెట్టుకొని సామాన్య విద్యార్థులను ప్రోత్సహిస్తూ కరపత్రం తయారు చెయ్యండి.
జవాబు:

(కరపత్రం )

విద్యార్థినీ, విద్యార్థులారా ! ఒక్కసారి ఆలోచించండి. మనం మన దృష్టిని చదువు పైనే కేంద్రీకరిద్దాం. కొద్దిగా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనం నిరుత్సాహపడకూడదు. మనం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నాం, కాన్వెంట్లకు వెళ్ళలేక పోతున్నాం అని బాధపడకండి.

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కృషి చేస్తే సామాన్యులు సైతం, ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మొన్న ఐ.ఎ.యస్ పరీక్ష ఫలితాలు గమనించండి. ఒక కూలి వాని బిడ్డ, ఒక ఫ్యాక్టరీ గుమస్తా కుమార్తె, ఒక మత్స్యకారుని కుమారుడు, ఒక దర్జీ కొడుకులు, కూతుళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివి ఐ.ఎ.యస్ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించారు. సామాన్య విద్యార్థులు సైతం ఐ.ఐ.టీలలో సీట్లు సాధించి, లక్షలు, కోట్ల జీతాలపై నేడు ఉద్యోగాలు చేస్తున్నారు.

కొందరు స్వయంకృషితో మంచి వ్యాపారవేత్తలుగా, మంచి ప్రతిభావంతులైన ఉద్యోగులుగా, రాజకీయనాయకులుగా తయారవుతున్నారు. టీలు అమ్మిన మన మోదీ గారు నేడు మన ప్రధాని అయ్యారు. విదేశాలలో మంచి ప్రధానమంత్రిగా ఆయన రాణిస్తున్నాడు. ఎందరో చిన్న చిన్న పనివారల పిల్లలు, పెద్ద జీతాలు సాధిస్తున్నారు. MP లుగా, MLA లుగా పేరు సంపాదిస్తున్నారు.

అందుకే నేను సామాన్యుడనని మీరు అనుకోకండి. కృషి చేయండి. పట్టుదల పట్టండి. గొప్పవారు కావాలనే కలలు కనండని మన మాజీ రాష్ట్రపతి కలామ్ మనకు చెప్పిన మాటలు మరచి పోకండి. చిన్న చిల్లర కొట్టు యజమాని కొడుకు మన అబ్దుల్ కలామ్, గొప్ప శాస్త్రవేత్తగా, పరిపాలనా దక్షుడైన రాష్ట్రపతిగా ఆయన కీర్తిని సంపాదించాడు కదా !

అందరూ సంపన్నులుగా, తెలివి కలవారుగా, పెట్టి పుట్టిన వారుగా పుట్టరు. మనమే భవిష్యత్తును బంగారం చేసుకోవాలి. కాబట్టి ప్రయత్నించండి. గొప్పవారు కండి.

రాష్ట్ర విద్యార్థి యూనియన్,
విజయవాడ.

ప్రశ్న 4.
గ్రంథాలయాల ఆవశ్యకత, ప్రయోజనాలు, సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:

(కరపత్రం )

మిత్రులారా !

“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో – కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నది సూక్తి. ఇటువంటి సూక్తులెన్నో పుస్తకాల ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని వివరించేవి వున్నాయి. తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల నివాసాన్ని గ్రంథాలయం (Library) అంటారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలున్నాయి. ఆమెరికాలో గల ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోము నగరంలోని ‘వాటికన్ లైబ్రరీ’, ‘బ్రిటిష్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరొందాయి. మనదేశంలో చెన్నైలోని “కన్నెమరా” గ్రంథాలయం, తంజావూరులోని “సరస్వతీ మహలు”, వేటపాలెంలోని “సారస్వత నికేతనం”, హైదరాబాదులోగల “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” మొదలైనవి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి. కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం కూడా నెలకొల్పబడింది.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు వున్నాయి. గ్రంథాలయాల వల్ల చాలా లాభాలున్నాయి :

  1. గ్రంథాలయాలు మనిషిని మనీషిగా మారుస్తాయి.
  2. మహామేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి.
  3. దేశాభ్యుదయానికి, సమాజవికాసానికి మూలస్తంభాలు గ్రంథాలయాలు.
  4. గ్రంథపఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.
  5. గ్రంథాలు తండ్రివలె ఆదేశిస్తాయి. తల్లివలె లాలిస్తాయి. మిత్రుని వలె ఆదుకుంటాయి. గురువువలె ప్రబోధిస్తాయి.

గ్రంథాలయాధికారులు పుస్తకాలు కొనేటప్పుడు అత్యంత శ్రద్ధ వహించాలి. డబ్బును దుర్వినియోగం చెయ్యకుండా మంచి పుస్తకాలనే కొనాలి. హాని కలిగించు పుస్తకాలను నిర్మొహమాటంగా తిరస్కరించాలి. పోటీ పరీక్షలకి, ఉద్యోగ పరీక్షలకి, చదువుకి కావలసిన పాఠ్య గ్రంథాలు, క్విజ్ పుస్తకాల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం గ్రంథాలయోద్యమాన్ని నీరుకార్చకుండా తగిన శ్రద్ధవహిస్తే సమాజం అభ్యుదయ పథంలో పయనిస్తుంది.

ఇట్లు
గ్రంథాలయాల అభివృద్ధి మండలి

ప్రశ్న 5.
అయ్యలరాజు రామభద్రుని కవితా విశిష్టతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

తిరుపతి,
x x x x

ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మా తెలుగు పాఠ్యాంశాల్లో సముద్రలంఘనం పాఠం ఒకటి. ఇది వర్ణనాత్మక పాఠం. దీన్ని అయ్యలరాజు రామభద్రుడు అనే కవి రచించాడు. రామభక్తుని వర్ణనాత్మక రచన అందరిని ఆకట్టుకుంటుంది. ఈ మహాకవి వర్ణనలు సహజంగా ఉంటాయి. ప్రకృతి దృశ్యాలను కళ్ళకు కట్టినట్టుగా తెలియచేశారు. హనుమంతుని పరారకమాన్ని సుమనోహరంగా వర్ణించాడు. అందువల్లనే నాకు రామభద్రుని వర్ణనాత్మక రచన అంటే ఇష్టం. నీవు ఏ కవిని అభిమానిస్తావో నాకు తెలియజేయి. పెద్దలందరికి నమస్కారములు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x x

చిరునామా :
వి.సతీష్ చంద్ర, 10వ తరగతి,
జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,
మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 6.
మీ ప్రాంతంలో ప్రవహించే నదిని వర్ణిస్తూ, ఒక కవితా గేయం రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో గౌతమీ నది ప్రవహిస్తోంది.
కవితా గేయం :

“సప్తర్షి సంఘాన గౌతముడు పెద్ద
వనము పెంచెను ఋషి ఫలవృక్షములను
గోవొకటి దానిని భగ్నంబు చేసె
గౌతముడు కోపాన కనువిచ్చి చూసే
భస్మమయ్యెను గోవు మునికోపదృష్టి
ఋషిమండలంబంత నిందించె ఋషిని
గౌతముడు తాపమున తపము చేయంగ
పరమేశుడప్పుడు ప్రత్యక్షమయ్యె
గోవు స్వర్గతి చెంద శివు డంత కరుణ
గోదావరీనదిని సృష్టించి విడిచె
నాసిక్కు క్షేత్రాన గోదావరీ మాత
సన్నని పాయగా ప్రభవించెనంత
ప్రవహించి జలము గోభస్మమును ముంచె
గోవు స్వర్గతి చెంద మునియు హర్షించె
గోదావరీ పాయ గౌతమి నదియై
సాగు తాగునీరు జనులకు నందించె
మోక్షమ్ము తా నొసగె దేహమ్ము ముంప
స్వర్గమోక్షదమ్ము గోదావరమ్ము
వేద నాదం బొలుకు దాని కమ్ర రవమ్ము”

10th Class Telugu 8th Lesson సముద్ర‌లంఘ‌నం 1 Mark Bits

1. దనువు అనే స్త్రీ యందు పుట్టిన వాళ్ళు. వీరు దేవతలకు శత్రువులు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థ పదాన్ని గుర్తించండి. (June 2017)
A) దానవులు
B) ధర్మాత్ములు
C) దుర్జనులు
D) దుష్టులు
జవాబు:
A) దానవులు

2. అపారమైన తీరము గలది – (వ్యుత్పత్తిని చెప్పే పదం గుర్తించుము. ) (March 2017)
A) పారాశర్యుడు
B) పారావారం
C ) తాపసుడు
D) కార్ముకం
జవాబు:
B) పారావారం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 8 సముద్ర‌లంఘ‌నం

3. యమకాలంకారానికి ఉదాహరణ గుర్తించుము. (March 2017)
A) రాజు కువలయానందకరుడు
B) మా పొలంలో బంగారం పండింది
C) లేమా ! దనుజుల గెలవగ లేమా !
D) శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వ
జవాబు:
C) లేమా ! దనుజుల గెలవగ లేమా !

4. ‘హరి భజియించు హస్తములు హస్తములు’ ఇందులోని అలంకారం గుర్తించండి. (June 2018)
A) లాటానుప్రాసము
B) ఛేకానుప్రాసము
C) యమకము
D) ముక్తపదగ్రసము
జవాబు:
A) లాటానుప్రాసము

5. హనుమంతుడు పర్వతమెక్కాడు – (వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి) (S.I. I – 2018-19)
A) హనుమంతుడు పర్వతమెక్కుటలేదు.
B) హనుమంతుడు పర్వతమెక్కలేడు.
C) హనుమంతుడు పర్వతమెక్కుట కష్టం.
D) హనుమంతుడు పర్వతమెక్కలేదు.
జవాబు:
D) హనుమంతుడు పర్వతమెక్కలేదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 7th Lesson మా ప్రయత్నం

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పీఠిక అంటే ఏమిటి? వివరించండి. (June 2017)
(లేదా)
‘పీఠిక’ సాహిత్య ప్రక్రియను వివరింపుము. (March 2017)
ఒక పుస్తకం యొక్క తాత్త్వికతను, అంతస్సారాన్ని తెలియజేసే దానిని ‘ముందుమాట’ లేదా ‘పీఠిక’ అంటారు గదా ! ‘పీఠిక’ ప్రక్రియ గురించి వ్రాయండి. (March 2019)
జవాబు:
ఒక గ్రంథాన్నీ, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ వ్రాసే ముందుమాటను పీఠిక అంటారు. దీనిని రచయిత కానీ, విమర్శకుడు కానీ, వేరే వ్యక్తి కానీ వ్రాయవచ్చు.

పీఠికకు ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం అని కూడా అంటారు.

ప్రశ్న 2.
‘మహిళావరణం’ అనే పుస్తకానికి రచయిత్రులు రాసిన ‘పీఠిక’ ప్రక్రియ వివరించండి. (S.A. I – 2018-19)
(లేదా)
మా ప్రయత్నం పాఠ్యాంశ ప్రక్రియను రాయండి. (S.A. I – 2019-20)
జవాబు:
ఒక గ్రంథాన్నీ, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ వ్రాసే ముందుమాటను పీఠిక అంటారు. దీనిని రచయిత కానీ, విమర్శకుడు కానీ, వేరే వ్యక్తి కానీ వ్రాయవచ్చు.

పీఠికకు ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం అని కూడా అంటారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 3.
ఓల్గా గారి గురించి వ్రాయండి.
జవాబు:
ఈమె ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. ఈమే తన కథలు, కవితలు, నవలలతో తెలుగు సాహిత్యంలో స్త్రీవాద ఉద్యమానికి ఉత్తేజాన్ని అందించింది. ఈమె ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. అనేక పురస్కారాలు, అవార్డులను ఆమె అందుకొన్నారు.

ప్రశ్న 4.
వసంత కన్నబిరాన్ గురించి వ్రాయండి.
జవాబు:
ఈమె 1930లో హైదరాబాద్ లో జన్మించారు. ఈమె ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేశారు. మానవహక్కులు, స్త్రీ సమానత్వం కోసం ఆమె కృషి చేస్తున్నారు. ఆమె “నేషనల్ అలయెన్స్ ఆఫ్ ఉమెన్”, “ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరం”లో పనిచేస్తున్నారు.

ప్రశ్న 5.
కల్పన కన్నబిరాన్ గురించి వ్రాయండి.
జవాబు:
ప్రముఖ న్యాయవాది కె.జి. కన్నబిరాన్, రచయిత్రి వసంత కన్నబిరాన్ల కుమార్తె కన్నబిరాన్. ఈమె హైదరాబాద్లోని ‘సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్ మెంట్’ కు సంచాలకులుగా పనిచేస్తున్నారు. సామాజిక న్యాయం, సామాజిక ఉద్యమాలలో క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘జెండర్ స్టడీస్’, ‘క్రిమినల్ లా’లో విస్తృత అధ్యయనం, పరిశోధనలు చేశారు. చాలా విలువైన గ్రంథాలు రాశారు.

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“స్త్రీలు ప్రధానమైన చరిత్ర నిర్మాతలు” అని రచయిత్రులు భావించడానికి గల కారణాలను ‘మా ప్రయత్నం’ పాఠం ఆధారంగా వివరించండి. (June 2018)
జవాబు:

  1. కొత్త కాలంలోకి అడుగు పెడుతున్న కాలంలో గడచిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకొని భవిష్యత్తుపై ఒక అంచనాకు రావటం సహజం.
  2. గత శతాబ్దపు సామాజిక మార్పులలో, అభివృద్ధిలో స్త్రీల భాగస్వామ్యాన్ని గురించి ఆలోచించిన రచయిత్రులకు చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావం కలిగింది.
  3. గడచిన శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలూ, వారు నడిపిన ఉద్యమాలూ, రాణించిన రంగాలు ఎన్నో ఉండటమే ఆ భావనకు ప్రధాన కారణం.
  4. మొదటిసారి చదువుకొన్న స్త్రీలు, మొదటి వితంతు వివాహం చేసుకొనే సాహసం చేసిన స్త్రీలు, స్త్రీ విద్య కోసం పాటుపడినవారు, ఉద్యమాలలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళేందుకు తెగించిన స్త్రీలు, కళారంగంలో తొలిసారి కాలుమోపిన మహిళలు, మొదటి తరం డాక్టర్లూ, శాస్త్రవేత్తలూ – వారు చేసిన పోరాటాలు రచయిత్రుల భావాన్ని బలపరిచాయి.
  5. స్త్రీలకు తగిన గుర్తింపు లభించలేదని, సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలకు తగిన ప్రాధాన్యం, ప్రాతినిధ్యం ఇవ్వలేదని రచయిత్రులు భావించారు.
  6. చరిత్ర అనే జగన్నాథ రథ చక్రాల క్రింద నలిగిపోయినందున చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు లభించలేదని, కానీ, ప్రధాన చరిత్ర నిర్మాతలుగా వారిది తిరుగులేని స్థానమని రచయిత్రులు భావించారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 2.
“మహిళావరణం” పుస్తక రూపకల్పనలో రచయిత్రులు పడిన శ్రమను, పొందిన అనుభవాలను తెల్పండి. (March 2018)
జవాబు:
1) గడచిన శతాబ్దంలో సామాజికాభివృద్ధిలో, సామాజిక మార్పులలో, స్త్రీల యొక్క భాగస్వామ్యం గురించి ఆలోచించిన – ఓల్గా తదితర స్త్రీవాద రచయితల ముందుకు ఎన్నో విషయాలు వచ్చాయి. గడచిన శతాబ్దంలో చాలా అంశాలలో స్త్రీల భాగస్వామ్యం అధికంగా ఉందని చరిత్ర నిర్మాతలుగా వారిది తిరుగులేని స్థానమని రచయిత్రులు భావించారు.

2) ఆ విషయాన్ని సాధికారికంగా, సోదాహరణంగా నిరూపించటానికి రచయిత్రులు ఒక పుస్తకాన్ని తీసుకురావాలను కొన్నారు. అలా “మహిళావరణం” పుస్తక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో వారెన్నో కష్టాలనెదుర్కొన్నారు. ఒళ్ళు పులకించే అనుభవాలను పొందారు.

3) గడచిన శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్త్రీలను అందరినీ ఒకచోట చేర్చటం రచయిత్రులకెంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇంతమంది స్త్రీలను ఒకే చోట చూడటం వలన, స్త్రీలు వెనుకబడిపోయారనే భావంతో ఉన్న రచయిత్రులకు కనువిప్పు కలిగింది. ఒక చైతన్య ప్రవాహంగా స్త్రీలను వాళ్ళు చూడగలిగారు.

4) ఎక్కడో ఒకచోట కొంతమంది స్త్రీలను గురించి చదవటానికి, ఒకేసారి వందమందికి పైగా స్త్రీలను, వివిధరంగాలలో వారు చేసిన కృషిని, సాధించిన విజయాలను తెలుసుకోవటానికి గల తేడాను, అనుభూతిలో గల భేదాన్ని రచయిత్రులు గ్రహించారు.

5) చరిత్రను నిర్మించడానికి ఆనాటి స్త్రీలు ఎంత మూల్యం చెల్లించారో తలచుకొంటే రచయిత్రుల గుండెలు బరువెక్కాయి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఎంతో శ్రమకోర్చి. రచయిత్రులు ఈ “మహిళావరణం” పుస్తకాన్ని రూపొందించారనటం అక్షర సత్యం.

ప్రశ్న 3.
సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు ఎందుకు గుర్తింపు లభించదో వివరించండి.
జవాబు:
చరిత్ర రచయితలకు, స్త్రీలను గూర్చి, వారు చేసిన కృషిని గురించి, అంతగా గౌరవమూ, శ్రద్ధ లేకపోవడం వల్లనే, స్త్రీలు చరిత్రలో ఎక్కకపోవడానికి కారణం అయి ఉంటుంది. చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల క్రింద, ఆ స్త్రీల యొక్క ఉనికి, ముక్కలయ్యింది.

అదీగాక చరిత్రకారులకు, స్త్రీలపై చిన్నచూపు ఉండడం కూడా అందుకు కారణం అయి ఉంటుంది. చరిత్రకారుడికి ఆ స్త్రీలను గూర్చి అంతగా వివరంగా తెలియకపోవడం కూడా ఒక కారణం అయి ఉంటుంది. అందుకే సంప్రదాయ చరిత్ర రచయితలు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడ పౌడర్ అద్దుతారు. బాగా ప్రసిద్ధులయిన స్త్రీలను గురించి మాత్రమే ఆ చరిత్రకారులు రాసి ఉంటారు. అదీగాక, ఈనాటి వలె ఆ రోజుల్లో సమాచారం అంతగా తెలిసికోడానికి సాధనాలు కూడా లేవు. అందువల్లనే ఆయారంగాల్లో అక్కడక్కడ కృషి చేసిన స్త్రీల గూర్చి ఆ చరిత్రకారుల దృష్టికి సరిగా వచ్చి ఉండదు. కొంతమంది ఉద్యమ స్త్రీలను గురించి, చరిత్ర రచయిత విని ఉన్నా, ఆ స్త్రీల వివరాలు, వారు చేసిన కృషి, చరిత్రకారుల దృష్టికి వచ్చియుండకపోవచ్చు.

అందువల్లనే సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా పెక్కుమంది స్త్రీలకు గుర్తింపు లభించలేదని మనం గ్రహించాలి.

ప్రశ్న 4.
“మహిళావరణం” శీర్షిక గురించి మీ అభిప్రాయాలు రాయండి.
జవాబు:
గడచిన 20వ శతాబ్దంలో స్త్రీలు ఆయారంగాల్లో కీలకస్థానాల్లో కీలక సమయాలలో పనిచేసి, అక్కడ తమ ముద్రవేసిన వందమంది స్త్రీలను గురించి మహిళావరణం సంపాదకులు ఒక పుస్తకం తీసుకువచ్చారు. ఆ పుస్తకానికి “మహిళావరణం” అని పేరు పెట్టారు. ‘మహిళావరణం’ అంటే, స్త్రీలను వరించడం, అనగా కోరుకోవడం అని భావము. 20వ శతాబ్దంలో విభిన్నరంగాలలో కీలక సమయాల్లో, కీలక స్థానాల్లో పనిచేసిన నారీమణులను, ఈ పుస్తకం సంపాదకులు కోరి వారికి తమ గ్రంథములో చోటు కల్పించారు. వారి దృష్టికి, ఎంతోమంది స్త్రీలు చరిత్రకు ఎక్కవలసినవారు కనిపించారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అందులో కొంతమందినే ఏరి కోరుకొని, ఈ పుస్తకంలో, వారికి, చోటు కల్పించారు.

అంటే ఈ పుస్తకంలోకి ఎక్కిన స్త్రీలు, సంపాదకులు కోరి వరించిన వారన్న మాట. అందుకే ఈ పుస్తకానికి ‘మహిళావరణం’ అని, సంపాదకులు అర్థవంతమైన చక్కని పేరు పెట్టారని నా అభిప్రాయము.

అయితే, ఈ పుస్తకానికి “20వ శతాబ్దపు ప్రసిద్ధ నారీమణులు” అని కూడా పేరుపెట్టవచ్చు. సంపాదకుల దృష్టికి సుప్రసిద్ధ నారీమణులు సుమారు 300 మంది వచ్చారు. వారిలో కేవలం 118 మంది మహిళామణులనే ఏరి కోరుకొని, స్థానం కల్పించారు. అందువల్లనే ‘మహిళావరణం’ అన్న పేరు “సమంజసంగా ఉంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 5.
చరిత్ర సాగిన క్రమాన్ని ప్రతివాళ్ళూ ఎందుకు ప్రశ్నించారు?
జవాబు:
మహిళావరణం సంపాదకులు, విభిన్నరంగాల్లో విశిష్ట కృషి చేసిన స్త్రీమూర్తులను కలసికొన్నారు. అందులో వారు సరిదె మాణిక్యాంబగారిని కలిసినప్పుడు, వేశ్యాకులం వారిని మొదట ఆడవద్దని ప్రభుత్వం వారు, వారి మాన్యాలను తీసికొన్నారని, కానీ ఇప్పుడు అన్ని కులాలవారు జీవనోపాధి కోసం ఆడుతున్నారనీ, వేశ్యలను నాట్యం చేయవద్దనడం నేరం కదా అని ప్రశ్నించింది.

ఈ విధంగా మాణిక్యాంబగారే కాక, మరెందరో స్త్రీలు చరిత్ర సాగిన క్రమాన్నీ, అందులో స్త్రీలకు జరిగిన అన్యాయాన్నీ ప్రశ్నించారు. ఆ రోజుల్లో స్త్రీలకు ఉన్నత విద్య చదువుకొనే అవకాశం ఉండేది కాదు. స్త్రీలు రేడియో, సినిమా వంటి రంగాల్లో పనిచేయడానికి అవకాశం ఉండేది కాదు.

వితంతు స్త్రీలకు తిరిగి వివాహం చేసుకొనే హక్కు ఉండేది కాదు. అందుకే సాహసవంతులయిన స్త్రీ మూర్తులు నాడు చరిత్ర సాగిన క్రమాన్ని ప్రశ్నించారు.

ప్రశ్న 6.
ప్రతివాళ్ళూ ప్రశ్నించే విధంగా చరిత్ర ఎందుకు సాగింది? దీనికి కారణాలు ఏమిటి? విశ్లేషించండి.
జవాబు:
20వ శతాబ్దం నాటికి సంఘంలో నేడు ఉన్నంత చైతన్యం లేదు. పెద్దవాళ్ళు పాటించిన రీతిలోనే చరిత్ర సాగిపోయేది. స్త్రీలకు బాల్యవివాహాలు ఉండేవి. విధవ వివాహాలు చేసేవారు కారు. స్త్రీలకు అన్నిరంగాల్లోనూ ప్రవేశం ఉండేది కాదు. స్త్రీలు ఉన్నత విద్య చదివే సావకాశం లేదు.

స్త్రీలు బిడియపడుతూ ఉండేవారు. ఆనాడు అంతా మనుధర్మశాస్త్రం ప్రకారం అంటూ, మూఢాచారాలు పాటించేవారు, ఆ రోజుల్లోనే కందుకూరి వీరేశలింగము, రాజ్యలక్ష్మి, విలియం బెంటిక్, రాజారామమోహనరాయ్ వంటి సంఘ సంస్కర్తల ప్రభావంతో సంఘంలో కొంత మార్పు వచ్చింది.

స్త్రీ సహగమనము వంటి దురాచారాలు తగ్గాయి. విధవా పునర్వివాహాలు, సామాన్య స్త్రీలు విద్యాభ్యాసం చెయ్యడం వంటివి సాగించారు. మొత్తంపై ఆ 20వ శతాబ్దంలో మొదట్లో కొన్ని సాంఘిక దురాచారాల వల్ల స్త్రీలు అంతగా రాణించలేకపోయారు.

అందువల్లనే ప్రతివాళ్ళూ ప్రశ్నించే విధంగా నాడు చరిత్ర సాగింది. ఆ స్త్రీలు అందరూ చరిత్రను మార్చటానికి గట్టిగా ప్రయత్నించారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 7.
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనడానికి కారణాలను వివరించండి.
జవాబు:
20వ శతాబ్దం సామాజికాభివృద్ధిలో, సామాజిక మార్పులలో, స్త్రీల భాగస్వామ్యాన్ని గూర్చి ఆలోచిస్తే, 20వ శతాబ్దపు చరిత్ర నిర్మాతలుగా, వారికి తిరుగులేని స్థానం ఉందని సంపాదకులకు అనిపించింది.

20వ శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, వారు పాలుపంచుకున్న ఉద్యమాలు, రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. అటువంటి స్త్రీలు ఎంతోమంది సంపాదకులకు గుర్తుకు వచ్చారు.

20వ శతాబ్దంలో మొదటిసారి చదువుకున్న స్త్రీలు, ఉద్యమాల్లో చేరి జైలుకు వెళ్ళడానికి సైతం సిద్ధపడిన స్త్రీలు, మొదటగా వితంతు వివాహం చేసుకునేందుకు సాహసించిన స్త్రీలు, స్త్రీ విద్యకోసం ఉద్యమించిన స్త్రీలు, నాటకం, రేడియో, సినిమా రంగాలలో మొదటిసారి అడుగు పెట్టిన స్త్రీలు, మొదటి తరం డాక్టర్లూ, శాస్త్రవేత్తలూ, సంగీత నృత్య కళాకారిణులూ, విద్యావేత్తలూ ఎందరో సంపాదకులకు కనిపించారు. దానితో చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలిగింది.

ప్రశ్న 8.
‘స్త్రీలే ప్రధానమైన చరిత్ర నిర్మాతలు’ – సమర్థించండి.
జవాబు:
20వ శతాబ్దపు సామాజికాభివృద్ధిలో, సామాజిక మార్పులలో, స్త్రీలకు కల భాగస్వామ్యాన్ని గురించి ఆలోచిస్తే, ఎన్నో విషయాలు మహిళావరణం సంపాదకుల ముందుకు వచ్చాయి. 20వ శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా చెప్పవచ్చునని వారికి అనిపించింది. జరిగిన శతాబ్దం చరిత్ర నిర్మాతలుగా, స్త్రీలకు తిరుగులేని స్థానం ఉందని వారికి అనిపించింది.

గడిచిన 20వ శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు, వారు పాలుపంచుకున్న ఉద్యమాలు, వారు రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. 20వ శతాబ్దంలో మొదటిసారి చదువుకున్న స్త్రీలు, మొదటి వితంతు వివాహం చేసుకున్న సాహసురాండ్రు, స్త్రీ విద్య కావాలని, ఉద్యమించిన స్త్రీలు, ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళిన స్త్రీలూ ఉన్నారు. నాటకం, సినిమా, రేడియో, వంటి రంగాలలో స్త్రీలు మొదటిసారిగా 20వ శతాబ్దంలోనే అడుగుపెట్టారు. స్త్రీలలో ఎందరో మొదటితరం డాక్టర్లు, శాస్త్రవేత్తలు, కళాకారిణులు, విద్యాధికులు నాడు ఉన్నారు.

శరీరం పులకరింపజేసే ఎందరో సాహసమూర్తులు, ఆ శతాబ్దంలోనే ఉన్నారు. అందువల్లనే 20వ శతాబ్దంలో స్త్రీలే .. ప్రధానమైన చరిత్ర నిర్మాతలు అని చెప్పవచ్చు.

ప్రశ్న 9.
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు నిలదొక్కుకొనేందుకు ఎంత కష్టపడి ఉంటారు?
జవాబు:
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు నిలదొక్కుకోడానికి వారు చాలా కష్టపడి యుంటారు. ఆ విషయం తలచుకోగానే ఈ గ్రంథము సంపాదకులకు గుండెలు బరువెక్కాయట. ఆ స్త్రీలు, వాస్తవ జీవితానికి వ్యతిరేకమైన పరిస్థితులతో పోరాడారు. ఆ స్త్రీలు కొత్త కలలు కనడానికి, కొత్త జీవిత విధానాలు కనుక్కోడానికి, వారు ఎన్నో కఠిన పరీక్షలకు గురి అయ్యారు. మొదటిసారిగా వివాహం చేసుకున్న వితంతువు పరిస్థితి తలచుకొంటే, ఆ సామాన్య స్త్రీల సాహసం అసామాన్యమైనదని, సంపాదకులకు అనిపించింది.

ఉద్యమాలలో చేరి జైలుకు వెళ్ళిన స్త్రీ మూర్తులను, మొదటిసారి సినిమాలలో నటించిన స్త్రీలను చూస్తే వారు ఆనాడు ఎంత సాహసం చేశారో మనకు తెలుస్తుంది. ఆనాడు సమాజంలో స్త్రీలకు నేటి స్వాతంత్ర్యం లేదు. ఎన్నో కట్టుబాట్లు ఉండేవి. ఆ పరిస్థితులలో చరిత్ర నిర్మాతలుగా నిలదొక్కుకోడానికి ఆనాటి స్త్రీలు చాలా కష్టపడి ఉంటారని మనం గ్రహింపవచ్చు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 10.
రచయిత్రుల గుండెలు ఎందుకు బరువెక్కాయి?
జవాబు:
స్త్రీలు దేశం కోసం, తమ కోసం ఒక సమూహంగా చేసిన పోరాటాలకూ, వారు పడిన సంఘర్షణలకూ, వారు సాధించిన విజయాలకూ చరిత్రలో సరైన గుర్తింపు దొరకలేదు. చరిత్ర అనే జగన్నాథ రథచక్రాల కింద వారి సామూహిక ఉనికి ముక్కముక్కలయ్యింది.

మహిళావరణం పుస్తకంలో స్త్రీమూర్తులందరినీ గూర్చి వరుసగా రాయడం జరిగింది. ఆ స్త్రీలందరి గూర్చి చదివేటప్పటికి, వారు సాధించిన విజయాలను గూర్చి తెలిసికొనేటప్పటికి, స్త్రీల చైతన్య ప్రవాహవేగం, జీవం, ఆ ప్రవాహక్రమంలోని మార్పులూ ఈ గ్రంథ సంపాదకులకు ఒక కొత్త విషయాన్ని చెపుతున్నట్లు అనిపించింది.

ఆ స్త్రీలు అందరూ చరిత్ర నిర్మాణానికి ఎంత కష్టపడి ఉంటారో కదా! అని తలచుకొనేటప్పటికి, సంపాదకుల గుండెలు బరువెక్కాయి. ఆ స్త్రీలు వాస్తవ జీవిత ప్రతికూల పరిస్థితులతో తలపడ్డారు. వారు కొత్త కలలు కనడానికీ, కొత్త జీవిత విధానాలు కనుక్కోడానికీ, ఎన్నో కఠిన పరీక్షలకు గురయ్యారు. అవి తలచుకుంటే, ఆ సామాన్య స్త్రీల సాహసం అసామాన్యమైనదని సంపాదకులకు అనిపించింది.

ఆ స్త్రీలు చరిత్రను నిర్మించేందుకు ఎంతగానో కష్టనష్టాలకు గురై ఉంటారని సంపాదకులు అభిప్రాయపడ్డారు.

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం Important Questions and Answers

ప్రశ్న 1.
మహిళల ప్రగతిని వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ఈనాడు సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో అగ్రగాములుగా ఉంటున్నారు. చదువుల్లో వారు సరస్వతీమూర్తులుగా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. వారు విమానాలను నడుపుతున్నారు. మిలటరీలో కూడా చేరి రాణిస్తున్నారు. శాస్త్రవేత్తలుగా ఎన్నో చక్కని పరిశోధనలు చేసి పేరు గడిస్తున్నారు. ఐ.ఎ.యస్, ఐ.పి.యస్ ఆఫీసర్లుగా పరిపాలనా రంగంలో స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు.

M.L.Aలుగా, MLC లుగా, MP లుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, కేంద్రమంత్రులుగా స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు. స్త్రీలు గొప్ప పరిపాలనాదక్షలుగా నిరూపించుకున్నారు. నిరూపించుకుంటున్నారు.

ఒకనాడు స్త్రీలు ఉన్నత విద్యారంగంలో ఉండేవారు కాదు. అటువంటిది ఈనాడు స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వచ్చాయి. పురుషులతో సమానంగా స్త్రీలు విద్యావంతులై రాణిస్తున్నారు. స్త్రీలలో మంచి డాక్టర్లు, ఇంజనీర్లు నేడు ఉన్నారు. స్త్రీలు పంచాయతీ బోర్డు మెంబర్ల దగ్గర నుండి, దేశ ప్రధానులుగా కూడా తమ పరిపాలనా దక్షతను ప్రదర్శిస్తున్నారు. ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్, సిరిమావో- భండారనాయకే, జయలలిత, మమత వంటి స్త్రీమణులు, మంచి పరిపాలన దక్షలుగా రాణించారు. రాణిస్తున్నారు.

స్త్రీలల్లో మంచి క్రీడాకారిణులు ఉన్నారు. ఉషా, అశ్వినీ వంటి స్త్రీలు, పరుగుపందెంలో రాణించారు. సైనా నెహ్వాల్, సెరెనా విలియమ్స్, హంపి, సానియామీర్జా వంటి క్రీడాకారిణులు వివిధమైన ఆటలలో ప్రపంచంలో మొదటివారుగా ఉన్నారు.

వ్యాపార రంగంలో ఎందరో స్త్రీలు చక్కగా రాణిస్తున్నారు. కిరణ్ బేడీ వంటి మంచి పోలీసు ఆఫీసర్లు స్త్రీలలో ఉన్నారు. ఈ విధంగా స్త్రీలు అన్ని రంగాలలో నేడు ముందంజలో ఉంటున్నారు. నేటి మహిళల ప్రగతికి, 20వ శతాబ్దంలో స్త్రీ విద్యకై పోరాడిన స్త్రీ మూర్తులే కారణం అని మనం ఎప్పుడూ మరువకూడదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 2.
అత్యున్నత స్థాయికి చేరిన ఒక మహిళ ఆత్మకథ రాయండి.
జవాబు:
నాకు నచ్చిన మహిళ (శ్రీమతి ఇందిరా గాంధీ) : భరతమాత ముద్దుబిడ్డలలో, ఇందిరాగాంధీ ఒకరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహిళామణులలో, ఇందిర సుప్రసిద్ధురాలు. ఈమె 1917వ సంవత్సరము నవంబరు 19వ తేదీన అలహాబాదులో జవహర్లాల్ నెహ్రూ – కమలా నెహ్రూ దంపతులకు జన్మించింది.

ఇందిర శాంతినికేతన్లో రవీంద్రుని వద్ద చదివింది. ఈమె గొప్ప దేశ భక్తురాలు. ఈమె భర్త ఫిరోజ్ గాంధీ, మహమ్మదీయుడు. ఆ వివాహం ఈమెకు మత సహనాన్ని నేర్పింది. ఈమె తండ్రితో పాటు దేశ విదేశాలు పర్యటించి, రాజనీతి చతురజ్ఞ అయ్యింది.

ఈమె భారతదేశ ప్రధానమంత్రిగా 15 సంవత్సరాలు పనిచేసింది. ఆ కాలంలో ఈమె బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది. భూ సంస్కరణలను చేపట్టింది. ‘గరీబీ హఠావో’ అని ఈమె ఇచ్చిన నినాదం భారతదేశం అంతటా మారుమ్రోగింది.

ఈమె బడుగువర్గాల ఆశాజ్యోతిగా, దళిత వర్గాల కన్నతల్లిగా పేరు తెచ్చుకొంది. ఈమె గొప్ప సాహసురాలు. గొప్ప రాజనీతిజ్ఞురాలు.

ప్రశ్న 3.
మహిళల పట్ల చూపుతున్న వివక్షను, వారిపై జరుగుతున్న దాడులనూ ఖండిస్తూ నినాదాలు రాయండి.
జవాబు:

  1. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి – ఆమెను పువ్వుల్లా చూడండి.
  2. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే – స్త్రీలపట్ల వివక్ష విడవండి.
  3. స్త్రీలు నీకు కన్నతల్లులు, సోదరీమణులు – స్త్రీలను నీవు గౌరవించు.
  4. స్త్రీలను అవమానించావా! నిర్భయ చట్టానికి లొంగుతావు జాగ్రత్త.
  5. ఆడపిల్లల జోలికి వస్తే – అడుగంటిపోతావు జాగ్రత్త.
  6. మహిళలు లక్ష్మీ స్వరూపిణులు, సరస్వతీ స్వరూపిణులు. వారిని గౌరవించండి.
  7. పార్లమెంటులో స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించండి – స్త్రీ పురుష సమానత్వాన్ని గౌరవించండి.
  8. స్త్రీలపై దాడిచేస్తే – మాడు పగులుగొడతారు జాగ్రత్త.
  9. ఆడా మగా తేడావద్దు – స్త్రీ పురుష భేదం నేటితో రద్దు.
  10. భ్రూణహత్యలను నివారించండి – మహిళామణులను ఆదరించండి.

ప్రశ్న 4.
మహిళలను గౌరవించవలసిన ఆవశ్యకతను గురించి వివరిస్తూ, మీ మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:

లేఖ,

ఒంగోలు,
x x x x x.

ప్రియమైన స్నేహితుడు శంకరు,
నీ స్నేహితుడు రాజేష్ వ్రాయు లేఖ.

నేను క్షేమంగానే ఉన్నాను. అక్కడ మన మిత్రులంతా క్షేమంగా ఉన్నట్లు తలచెదను.

స్త్రీలను గౌరవించడం మన భారతీయ ధర్మం కదా ! మొన్న ఒక రోడ్ సైడు రోమియో ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే చూశాను.

స్త్రీలు ఆనందించిన చోట దేవతలు ఉంటారు. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. మన అమ్మ, అక్క, చెల్లి, ఉపాధ్యాయురాలు కూడా స్త్రీయే, స్త్రీలను గౌరవించలేని సమాజం అనాగరిక సమాజం. అందుకే స్త్రీలను గౌరవించాలి. స్త్రీలను హేళన చేయడం, దూషించడం తప్పు. నా ఎదురుగా ఇటువంటి పనులు చేస్తే పోలీసు కంప్లైంటు ఇస్తాను అని చెప్పాను. దానితో వాడు పరారైపోయాడు.

ఈ ఉంటాను మరి. మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారాలని చెప్పు. మన స్నేహితులందరినీ అడిగినట్లు చెప్పు.

ఇట్లు,
కె. రాజేష్.

చిరునామా :
జి. శంకర్,
10వ తరగతి, బాలుర ఉన్నత పాఠశాల,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం 1 Mark Bits

1. దీపావళి పండుగరోజు ఆబాలగోపాలం ఆనందిస్తారు – గీత గీసిన పదం ఏ సమాసం? (June 2017)
A) బహుజొహి
B) అవ్యయీభావం
C) తత్పురుషం
D) కర్మధారయం
జవాబు:
B) అవ్యయీభావం

2. అవ్యయీభావ సమాసానికి ఉదాహరణను గుర్తించుము. (March 2017)
A) సేవావృత్తి
B) మృదుమధురం
C) అనుకూలం
D) పదాబ్దములు
జవాబు:
C) అనుకూలం

3. ప్రతిదినము పాఠశాల అసెంబ్లి సమయంలోపే పాఠశాలకు రావాలి – గీత గీసిన పదం సమాసం పేరు గుర్తించండి. (June 2018)
A) అవ్యయీభావ సమాసం
B) రూపక సమాసం
C) షష్టీతత్పురుష సమాసం
D) ద్వంద్వ సమాసం
జవాబు:
A) అవ్యయీభావ సమాసం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

4. క్రింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి సరియైన ఉదాహరణ గుర్తించండి. (June 2018)
A) రామబాణం
B) గంగానది
C) మూడు రోజులు
D) తల్లిదండ్రులు
జవాబు:
B) గంగానది

5. విద్యార్థులు ప్రతిదినము పాఠాలను చదవాలి. (సమాసం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) అవ్యయీభావ సమాసం
B) ద్విగు సమాసం
C) ద్వంద్వ సమాసం
D) షష్ఠీ తత్పురుష
జవాబు:
A) అవ్యయీభావ సమాసం

6. ఆహా ! ఎంత బాగుందీ ! (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) ఆశ్చర్యార్థకం
B) విధ్యర్థకం
C) ప్రేరణార్థకం
D) సందేహార్ధకం
జవాబు:
A) ఆశ్చర్యార్థకం

7. రమేష్ బడికి వస్తాడో, రాడో. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) ప్రార్థనార్థకం
B) సందేహార్థకం
C) ప్రశ్నార్థకం
D) నిషేధార్థకం
జవాబు:
B) సందేహార్థకం

8. ప్రతి పనికి లాభం ఉంటుంది – దీనికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. (March 2017)
A) ప్రతి పనికి లాభం ఉంటుందా?
B) ప్రతి పనిలో లాభం ఉంటుంది.
C) ప్రతి పనికి లాభం ఉండే ఉంటుంది.
D) ప్రతి పనికి లాభం ఉండదు.
జవాబు:
D) ప్రతి పనికి లాభం ఉండదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

9. సోముడు అడవికి వెళ్ళి, కట్టెలు తెచ్చాడు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) సంయుక్తం
B) సంక్లిష్టం
C) ప్రశ్నార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
B) సంక్లిష్టం

10. ‘ఆకాశం నీలంగా ఉంటుంది’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) సంక్లిష్టం
B) చేదర్థకం
C) సామాన్యం
D) సందేహార్థకం
జవాబు:
C) సామాన్యం

11. “నీవు శాస్త్రవేత్తవు కాగలవు” – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) సామర్థ్యార్థకం
B) సందేహార్థకం
C) సంక్లిష్ట వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
A) సామర్థ్యార్థకం

12. ‘ఆహా’ ఎంత రుచిగా ఉందో ! – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) చేదర్థకం
B) సందేహార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) అప్యర్థకం
జవాబు:
C) ఆశ్చర్యార్థకం

13. ‘వాహనాన్ని వేగంగా నడుపవద్దు’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) నిషేధాకం
B) ఆశ్చర్యార్థకం
C) ప్రశ్నార్థకం
D) సందేహార్థకం
జవాబు:
A) నిషేధాకం

14. “మీరంతా పాఠం చదవండి” – ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) చేదర్థకం
B) ప్రశ్నార్థకం
C) సందేహార్థకం
D) విధ్యర్థకం
జవాబు:
D) విధ్యర్థకం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

15. ‘తిండి కలిగితే కండ గలదు’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2017)
A) విధ్యర్థకం
B) చేదర్థకం
C) అభ్యర్థకం
D) అనుమత్యర్ధకం
జవాబు:
B) చేదర్థకం

16. ప్రతివాళ్ళు ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్ని – కర్మణి వాక్యం గుర్తించండి. (June 2018)
A) చరిత్ర సాగిన క్రమాన్ని ఎందుకు ప్రశ్నించాలి.
B) ప్రతి ఒక్కడు ప్రశ్నించకూడదు చరిత్ర సాగిన క్రమాన్ని.
C) చరిత్ర సాగిన క్రమం ప్రతి వాళ్ళచేత ప్రశ్నించబడింది.
D) ఎవరూ ప్రశ్నించలేదు చరిత్ర సాగిన క్రమాన్ని.
జవాబు:
C) చరిత్ర సాగిన క్రమం ప్రతి వాళ్ళచేత ప్రశ్నించబడింది.

17. విమల టి.వి. చూస్తూ నృత్యం చేస్తున్నది – ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) అప్యర్థక వాక్యం
B) సంయుక్త వాక్యం
C) చేదర్థక వాక్యం
D) శత్రర్థక వాక్యం
జవాబు:
D) శత్రర్థక వాక్యం

18. రవి లెక్కలు బాగా చేయగలడు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) సామర్థ్యార్థకం
B) సంభావనార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) ఆశీరర్థకం
జవాబు:
A) సామర్థ్యార్థకం

19. నేను తప్పక వస్తాను – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) అనుమత్యకం
B) విధ్యర్థకం
C) నిశ్చయార్థక వాక్యం
D) నిషేధకం
జవాబు:
C) నిశ్చయార్థక వాక్యం

20. సీత ఆటలు ఆడి అన్నం తిన్నది – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.
A) అభ్యర్థకము
B) విధ్యర్థకము
C) చేదర్థకము
D) క్వార్థకము
జవాబు:
D) క్వార్థకము

21. భారతదేశంలో వస్తువుల ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గలేదు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) అష్యకము
B) విధ్యర్థకము
C) క్వార్ధకము
D) చేదర్థకము
జవాబు:
A) అష్యకము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 7 మా ప్రయత్నం

22. తామంతా కుటుంబ స్త్రీలం కామా ? అని శ్యామలగారన్నారు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి)
A) “మేమంతా కుటుంబ స్త్రీలం కామా?” అని శ్యామల గారన్నారు.
B) “మనమంతా కుటుంబ స్త్రీలం కామా?” అని శ్యామల గారన్నారు.
C) “తామంతా కుటుంబ స్త్రీలం కామా?”, అని శ్యామల గారన్నారు.
D) “మీరు, మేము అంతా కుటుంబ స్త్రీలంకామా”, అని శ్యామల గారన్నారు.
జవాబు:
A) “మేమంతా కుటుంబ స్త్రీలం కామా?” అని శ్యామల గారన్నారు.

23. మా కంటె సీరియస్ గా ఆలోచించి, ప్రశ్నించి, సలహాలిచ్చారు. ఇది ఏ వాక్యమో గుర్తించండి) (S.A.I – 2018-19)
A) సంయుక్త వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సామర్థ్యార్థక వాక్యం
D) ప్రార్థనార్థక వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

24. కాలధర్మం చెందుట : పుట్టిన జీవికి కాలధర్మం చెందుట తప్పదు. (June 17, Mar 18)

25. గుండెలు బరువెక్కడం : “మిక్కిలి బాధపడటం” అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. (March 17, 18, S.A.I – 2018-19)

26. కనువిప్పు : గురువులు చెప్పిన మాటలతో అజ్ఞానము తొలగి నాకు కనువిప్పు కలిగింది. (March 2017 S.A. I – 2018-19)

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 6th Lesson శతక మధురిమ

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పరుల ధనాన్ని ఆశించి చేసే పనులుగా ధూర్జటి కవి వేటిని పేర్కొన్నారు? (March 2018)
జవాబు:
జాతకాలు చెప్పడం, రాజులకు సేవలు చేయడం, అబద్దాలు కల్పించడం, ధర్మాన్ని తప్పడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవీ లేనివి పలకడం, మొదలగు వాటిని ఇతరుల ధనాన్ని ఆశించి చేసే పనులుగా ధూర్జటి కవి పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
ఒక వ్యక్తి చేయకూడని పనులుగా బద్దెన కవి వేటిని పేర్కొన్నాడో తెలపండి. (March 2019)
జవాబు:
వరదలు వస్తే మునిగిపోయే పొలమును దున్నడం, కఱవు వచ్చినప్పుడు బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, రహస్యాన్ని ఇతరులకు చెప్పడం, పిటికివాడికి సేనానాయకత్వమును ఇవ్వడం వంటివి ఒక వ్యక్తి చేయకూడని పనులుగా బద్దెన కవి పేర్కొన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
ధర్మం ఆచరించే వాడిని నీచుడు నిందించినా నష్టం ఏమీ లేదు అనే విషయాన్ని మారదవెంకయ్య ఏ ఉపమానంతో చెప్పాడు?
జవాబు:
‘ధర్మం ఆచరించే వాడిని నీచుడు నిందించినా నష్టం ఏమీ లేదు’ అనే విషయాన్ని మారద వెంకయ్య అమృత సముద్రంలో రెట్టవేసే కాకితో పోల్చాడు.

అమృత సముద్రముపై నుండి కాకి ప్రయాణం చేస్తూ ఆ సముద్రంలో ఆ కాకి రెట్ట వేస్తుంది. అంతమాత్రం చేత, ఆ సముద్రానికి ఏమీ లోటు రాదు. అలాగే ధర్మాత్ముడిని నీచుడు నిందించినా, ఆ ధర్మమూర్తికి లోటు రాదు.

ప్రశ్న 4.
‘శతకం’ అనే ప్రక్రియను గురించి వివరించండి.
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘శతకం’ అనే ప్రక్రియ ప్రముఖమైనది. ఇందులో నూరు పద్యాలు ఉంటాయి. కొన్నింటిలో నూరుకు పైగా పద్యాలు ఉంటాయి. శతకంలో మకుటం ప్రధానంగా ఉంటుంది. శతకపద్యాలు నీతిని, ధర్మాన్ని, భక్తిని, వైరాగ్యాన్ని కలిగిస్తాయి. శతక పద్యాలు నైతిక విలువలను ప్రబోధిస్తాయి. శతకపద్యాలు జగతిని జాగృతం చేస్తాయి.

ప్రశ్న 5.
మీకు తెలిసిన ఒక దాతను గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మా ఊళ్ళో సోమయ్య అనే వ్యాపారి ఉన్నాడు. ఆయన గొప్పదాత. తన వ్యాపారంలో వచ్చిన లాభాన్ని దానధర్మాలకు ఉపయోగిస్తాడు. పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, పుస్తకాలు కొనిపెట్టడం, స్కూలు యూనిఫారం కుట్టించడం మొదలగు పనులు చేస్తుంటాడు. వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తాడు.

ఎవరైనా పేదవారు పెళ్ళిళ్ల సమయంలో వచ్చి యాచిస్తే వారికి ధన సహాయం చేస్తాడు. బంగారు మంగళసూత్రాలు దానం చేస్తాడు. ఆయన దేవాలయాలకు, ధర్మసత్రాలకు, అన్నసత్రాలకు, విద్యాలయాలకు విరివిగా దానధర్మాలు చేస్తుంటాడు. ఇరుగుపొరుగు ప్రాంతాలవారు వచ్చి యాచించినా ‘లేదు’ అనకుండా అందరికీ తన శక్తికొద్దీ దానం చేస్తుంటాడు. మా ప్రాంతంలో ఆయన ‘దాత’గా మంచి కీర్తి సంపాదించాడు.

ప్రశ్న 6.
సంపద ఎవరి వద్దకు వచ్చి చేరుతుంది?
జవాబు:
దైవం మనపై దయతో సంపదలు ప్రసాదిస్తాడు. కలిగినంతలో పేదలకు పెట్టాలి. నిందించకుండా, ఆదరణతో పెట్టాలి. ఆ విధంగా పెట్టినవారు ఏ ప్రయత్నం చేయకపోయినా సంపద వారిని చేరుతుంది.

దీనిలో విశేషమేమిటంటే విష్ణువుకు (దరిద్ర) నారాయణుడు, (దరిద్ర) దామోదరుడు అని పేర్లు. అంటే దరిద్రులలో నారాయణుడు ఉంటాడు. నారాయణుని భార్య లక్ష్మీదేవి. తన భర్తను ఆదరించిన వారి దగ్గరకే భార్య కూడా వెడుతుంది. కానీ, ఆదరించని వారి దగ్గరకు వెళ్ళదు కదా ! అందుచేత పేదలను (నారాయణుని) ఆదరించే వారి దగ్గరకు లక్ష్మి వెడుతుంది. సంపదలు ప్రసాదిస్తుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 7.
ఎవరిని ఆశ్రయిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరించండి.
జవాబు:
మనిషి అధముడిని ఆశ్రయిస్తే, అతడు కూడా అధముడై పేరు లేకుండా పోతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే, తాను కూడా మధ్యముడు అవుతాడు. మనిషి ఉత్తముడిని ఆశ్రయిస్తే తాను కూడా ఉత్తముడు అవుతాడు.

భర్తృహరి ఈ విషయాన్ని చక్కగా సోదాహరణంగా ఇలా వివరించాడు. నీళ్ళు కాల్చిన ఇనుముమీద పడితే, అవి ఆవిరి అయిపోయి పేరులేకుండాపోతాయి. ఆ నీళ్ళు తామరాకు మీద పడితే ముత్యములవలె ప్రకాశిస్తాయి. ఆ నీళ్ళే, ముత్యపుచిప్పలలో పడితే, ముత్యములవలె మారతాయి. నీటి బిందువు తాను ఆశ్రయించిన స్థానాన్ని బట్టి ప్రకాశించింది. అలాగే మనిషి తాను పొందిన ఆశ్రయాన్ని బట్టి రాణిస్తాడని మనం గ్రహించాలి.

ప్రశ్న 8.
ధర్మవర్తనులు పాలసముద్రం వంటివారని ఎలా చెప్పగలవు?
జవాబు:
ధర్మప్రవర్తన గల మనుష్యులు పాలసముద్రం వంటివారు. ధర్మప్రవర్తనతో పేరుపడిన మానవుడిని, ఒక నీచుడు మిక్కిలి నీచమైన మాటలతో నిందించినా, తిరస్కరించినా, ఆ ధర్మాత్ముడికి ఎటువంటి లోపమూ కలుగదు. దీనికి భర్తృహరి ఒక మంచి దృష్టాంతం ఇలా చెప్పాడు.

పాలసముద్రం మీదుగా ఎగిరివెళ్ళే కాకి, ఆ పాలసముద్రములో రెట్టవేస్తుంది. అంతమాత్రంచేత ఆ పాలసముద్రానికి ఏమి లోపము రాదు.

అలాగే పాలసముద్రం వంటి ధర్మవర్తనులను నీచులు నిందించినా, ధర్మవర్తనులకు లోటురాదు. దీనిని బట్టి ధర్మవర్తనులు పాలసముద్రం వంటి వారని మనము చెప్పగలము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 9.
ధర్మవర్తనులకు, ముష్కరులకు గల తేడా ఏమిటో చర్చించండి.
జవాబు:
ధర్మవర్తనులు అనగా ధర్మబద్ధంగా నడుచుకొనే మానవులు. ధర్మవర్తనులు పాలసముద్రము వంటివారు. ముష్కరులు అంటే నీచులు. ఈ నీచులు కాకులవంటివారు. ధర్మబద్ధంగా జీవించేవారిని చూసి కొందరు నీచులు మిక్కిలి హీనమైన నీచవాక్యాలతో నిందిస్తూ మాట్లాడతారు. ఆ నీచుల తిరస్కారవాక్యాల వల్ల ఆ ధర్మవర్తనులకు ఏమి లోపము రాదు.

ఈ విషయంలో భాస్కరశతకకర్త, చక్కని దృష్టాంతం ఇచ్చాడు. పాలసముద్రము నిర్మలంగా ఉంటుంది. ఆ సముద్రం మీది నుండి కాకి ఎగిరివెడుతూ, ఆ పాలసముద్రంలో రేట్ట వేస్తుంది. అంతమాత్రం చేత ఆ పాలసముద్రానికి ఎలా లోటు కల్గదో, అలాగే నీచులు మాట్లాడిన నీచవాక్యాల వల్ల కూడా, ధర్మవర్తనులకు ఎటువంటి లోటు, లోపము రాదని ఆయన చెప్పాడు.

ప్రశ్న 10.
మంచివాని లక్షణములేవి?
జవాబు:
మంచివారు, ఇతరులు తమకు అపకారము చేసినా, తాము మాత్రం ఇతరులకు ఉపకారమే చేస్తూ ఉంటారు. సర్వకాల సర్వావస్థలలోనూ, మంచివారు తమ ధనమాన ప్రాణాలను పరుల మేలు కోసమే వినియోగిస్తారు. ఇతరుల నుండి మంచివారు ప్రత్యుపకారాన్ని కూడా కోరుకోరు.

పై విషయాన్ని సమర్థిస్తూ భాస్కర శతకకర్త మంచి దృష్టాంతము చెప్పాడు. పెరుగును మానవులు కవ్వమును చేతపట్టి ఎంత గట్టిగా చిలుకుతున్నా, పెరుగు ఆ బాధను ఓర్చుకొని, చిలుకుతున్న వారికి వెన్ననే ఇస్తుంది.

అలాగే మంచివాడు. తనకు ఇతరులు కీడు చేస్తున్నా తాను మాత్రం వారికి అపకారము చేయడు. అంతేకాదు మంచివాడు తనకు కీడు చేసినవారికి సైతం ఉపకారము చేస్తాడు.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘సుభాషిత రత్నావళి’ ని రచించిన ఏనుగు లక్ష్మణ కవిని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
కవి పేరు : ఏనుగు లక్ష్మణకవి

రచించిన శతకం : సుభాషిత రత్నావళి

అనువాద శతకం : ఇది సంస్కృతము నుండి తెలుగులోకి అనువదింపబడిన శతకము. భర్తృహరి మహాకవి సంస్కృత భాషలో ‘సుభాషిత త్రిశతి’ అనే పేరున మూడు శతకాలు రచించాడు. వాటినే
ఏనుగు లక్ష్మణకవి ‘సుభాషిత రత్నావళి’ అనే పేరున తెనిగించాడు.

కాలము : క్రీ.శ. 1720 – 1780 మధ్యకాలము.

నివాసము : ఈయన తూర్పు గోదావరి జిల్లా ‘పెద్దాడ’ గ్రామంలో నివసించారు.

ఇతర గ్రంథాలు :

  1. రామేశ్వర మాహాత్మ్యం,
  2. విశ్వామిత్ర చరిత్ర,
  3. గంగా మాహాత్మ్యం,
  4. రామవిలాసం
    అనేవి వీరి ప్రసిద్ధ రచనలు.

ప్రశ్న 2.
శతక మధురిమలో కొన్ని నీతి పద్యాల నుండి నీతులను గ్రహించావు కదా ! మంచి విద్యార్థికి ఉండాల్సిన ఉత్తమ లక్షణాల గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
సమాజంలో విద్యార్థుల పాత్ర తిరుగులేనిది. విద్యార్థులు నవసమాజ నిర్మాతలని ఎందరో మహాకవులు చెప్పారు. విద్యార్థులు ప్రాథమిక దశనుండి వినయ విధేయతలు కలిగియుండాలి. గురువుల పట్ల శ్రద్ధాసక్తులు కలిగియుండాలి.

విద్యార్థులు తోటివారితో స్నేహభావంతో ఉండాలి. చదువుపట్ల ఆసక్తి కలిగి ఉండాలి. చిన్నతనం నుండి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలి. బాగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి. దేశభక్తిని కలిగి ఉండాలి. తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. మంచి మాటలతో సమాజంలో గౌరవాన్ని పొందాలి. క్రమశిక్షణతో కూడిన జీవనసరళిని అలవరచుకోవాలి.

విద్యార్థులు కొన్ని దురలవాట్లను కూడా దూరం చేసుకోవాలి. తిరస్కారంగా మాట్లాడడం, ఇతరులపై చాడీలు చెప్పడం, ఎదిరించి మాట్లాడడం, క్రమశిక్షణ లేకపోవడం, ఉపాధ్యాయులతోను, తోటి విద్యార్థులతోను గొడవలు పడడం మొదలైన దుర్గుణాలను దూరం చేసుకోవాలి. మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. ఇతరులకు ఆదర్శంగా మెలగాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
శతకపద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి – విమర్శిస్తాయి – వివరించండి.
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యానికి సమున్నతమైన స్థానం ఉంది. శతక కవులు వివిధ అంశాలపై చక్కని పద్యాలను రచించారు. సమాజంలో నైతిక విలువల్ని పెంచడానికి ప్రయత్నించారు. శతకపద్యాలు జనాన్ని జాగృతం చేస్తాయి.

శతక కవులు తమ అనుభవ సారాన్ని మధించి తేట తెలుగు పద్యాలను రచించారు. వేమన వంటి ప్రజాకవులు ప్రజల్లోని మూఢనమ్మకాలను తొలగించారు. కొంతమంది శతక కవులు సంఘసంస్కరణోద్యమానికి ఆయుధంగా చేసుకున్నారు. మారద వెంకయ్య వంటి శతక కవులు చక్కని దృష్టాంతాలతో శతక పద్యాలను రచించారు. తెలుగుబాల, సుమతీశతక పద్యాలు పిల్లలలో నీతి వర్తనను కల్గించాయి. శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరథి శతకం వంటి శతకాలు ప్రజల్లో భక్తితత్పరతను కల్గించాయి. రాజుల దురహంకారాన్ని ధూర్జటి కళ్ళకు కట్టినట్లుగా శతక పద్యాల్లో చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మం వంటి వారు సమకాలీన రుగ్మతలను తేటతెల్లం చేశారు. ప్రజల కళ్ళు తెరిపించారు.

ప్రశ్న 4.
సమాజానికి మార్గనిర్దేశకత్వం చేసేవాళ్ళు శతక కవులు – ఈ విషయాన్ని వివరించండి..
జవాబు:
తెలుగు సాహిత్యంలో శతక వాజ్మయానికి సమున్నతమైన స్థానం ఉంది. శతక కవులు తమ అనుభవసారాన్ని మధించి చక్కని నీతి పద్యాలను రచించారు. వేమన, సుమతి, కృష్ణ, దాశరథి మొదలైన శతకాలు ప్రజల్లో నీతివర్తనను కలుగజేస్తాయి.

అక్కరకు రాని చుట్టము, వినదగునెవ్వరు చెప్పిన, పుత్రోత్సాహము మొదలైన పద్యాలు జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఉంటాయి. వేమన ప్రజాకవిగా గుర్తింపు పొందాడు. సమాజంలోని అసమానతలను, కుళ్ళు, కుతంత్రాలను లోకానికి చాటాడు. భూర్జటి రాజాశ్రయం పొందినా రాజుల దురహంకారాన్ని నిర్భయంగా చాటిచెప్పాడు. భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణకవి వంటివారు తేటతెలుగు పద్యాల్లో రచించారు. కరుణశ్రీ గారి తెలుగుబాల శతకంలోని పద్యాలు బాలల్లో ఆలోచనాశక్తిని పెంచుతాయి. శతక పద్యాలు తెలుగు పలుకుబడులను, సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తేటతెల్లం చేస్తున్నాయి

ప్రశ్న 5.
ఆశ్రయించిన వారిని బట్టి పొందే గౌరవంలో మార్పు వస్తుందనే విషయాన్ని సోదాహరణంగా వివరించండి.
జవాబు:
వ్యక్తులు మంచివారిని ఆశ్రయిస్తే, మంచి గౌరవం పొందుతారు. అధముడిని ఆశ్రయిస్తే వారు నశిస్తారు. భర్తృహరి సుభాషితాలలో ఈ విషయాన్ని సోదాహరణంగా ఇలా వివరించారు.

  1. నీరు కాల్చిన ఇనుము మీదపడితే, ఆ నీరు ఆవిరైపోతుంది. నీరు యొక్క రూపమే నశిస్తుంది.
  2. అదే, నీరు తామరాకుపై పడితే, ముత్యమువలె అందంగా మెరుస్తుంది.
  3. అదే నీరు ముత్యపుచిప్పలలో పడితే, మణులవలె మారుతుంది.

దీనిని బట్టి ఈ క్రింది విషయం మనకు తెలుస్తుంది. మనిషి ఒక అధముడిని ఆశ్రయిస్తే తాను కూడా అధముడు అవుతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే, తాను కూడా మధ్యముడు అవుతాడు. ఉత్తముడిని ఆశ్రయిస్తే, తాను కూడా ఉత్తముడు ఔతాడు.

మనిషి అధముడిని ఆశ్రయిస్తే కాల్చిన ఇనుము మీద నీరువలె నామరూపాలు లేకుండా పోతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే రామరాకుపై నీరువలె మెరుస్తాడు. మనిషి ఉత్తముడిని ఆశ్రయిస్తే ముత్యపుచిప్పలో నీరువలె మణిగా మారుతాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 6.
మూర్యులకు నీతులు చెప్పడం ఎటువంటిది?
జవాబు:
మూర్చులకు నీతులు చెప్పడం వ్యర్ధము. అందువల్ల కొంచెము కూడా ప్రయోజనం ఉండదని భర్తృహరి సుభాషిత పద్యాల్లో క్రింది ఉదాహరణములు ఇచ్చాడు.

మూర్సులకు నీతులు చెప్పాలని ప్రయత్నించడం, మదించిన ఏనుగును తామరతూడులోని దారములతో బంధించాలని ఆలోచించడం వంటిది. ఏనుగువంటి బలమైన జంతువును సన్నని, బలహీనమైన తారతూడులోని దారాలతో బంధించలేము. అలాగే మూర్చులకు నీతులు బోధించడం వల్ల ప్రయోజనం ఉండదు.

మూర్చులకు నీతులు చెప్పాలని ప్రయత్నించడం, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని బద్దలు కొట్టాలని చూడడం వంటిది. మెత్తని దిరిసెనపువ్వుతో కఠినమైన వజ్రాన్ని భేదించలేనట్లే, మూర్యుడికి నీతులు బోధించడం అసాధ్యం. అది వ్యర్థమైన పని.

మూరులకు నీతులు చెప్పవలెనని అనుకోవడం, ఒక- తేనె బొట్టుతో ఉప్పు సముద్రంలోని నీటిని తియ్యగా మార్చాలనుకోవడం వంటిది. ఒక్క తేనె బిందువుతో ఉప్పు సముద్రాన్ని తియ్యగా మార్చడం అసాధ్యం. అలాగే మూర్ఖుడికి నీతులు బోధించడం కూడా అసాధ్యం అని, భర్తృహరి చెప్పాడు.

ప్రశ్న 7.
పరద్రవ్యము నాశించిన వాని ప్రవర్తనను విశ్లేషించండి.
జవాబు:
ఇతరుల నుండి ధనాన్ని ఆశించి కొందరు అనేకరకాలుగా జీవిస్తూ ఉంటారు. పరద్రష్యం కోసం అలాంటి తప్పుడు పనులు చేయడం వ్యర్థమని ఆ ద్రవ్యము వారివద్ద ఎన్నాళ్ళో ఉండదనీ, వారు కూడా శాశ్వతంగా జీవించరనీ, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇలా చెప్పాడు.

కొందరు పరధనాన్ని ఆశించి, జాతకములు చెపుతారు. మరికొందరు రాజులకు సేవలు చేస్తారు. కొందరు అన్యాయ ప్రవర్తన ద్వారా చెడ్డపేరు తెచ్చుకుంటారు. కొందరు చాడీలు చెపుతూ ఉంటారు. కొందరు ఇతరులను హింసిస్తూ ఉంటారు. కొందరు ఉన్నవీ లేనివీ మాట్లాడుతూ ఉంటారు. ఈ పైన చెప్పిన పనులన్నీ, వారు ఇతరుల నుండి ధనాన్ని ఆశించి చేస్తూ ఉంటారు.

కాని నిజానికి ఆ ద్రవ్యము వారి వద్ద ఎన్నాళ్ళో ఉండదు. అలా చెడుపనులు చేసేవారు కూడా, శాశ్వతంగా ఈ లోకంలో బ్రతికియుండరు. అందువల్ల పైన చెప్పినటువంటి చెడుపనులు చేసి డబ్బు సంపాదించడం వ్యర్థం అని గుర్తించాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 8.
నైతిక విలువల వలన ప్రయోజనములేవి?
జవాబు:
నైతిక విలువలు అంటే నీతి, ధర్మము, సహనము, సజ్జనత్వము, ఓర్మి, సత్యము, స్నేహము వంటి మంచి గుణాల వల్ల కలిగే ప్రయోజనాలు.

సంఘంలో మనుషులు ఎలా నడుచుకోవాలో, ఎలా నడిస్తే తనకూ, ఇతరులకూ కూడా మేలు జరుగుతుందో, ఈ నైతిక విలువలు పాటించడం వల్ల మనకు తెలుస్తుంది.

మన శతకకవులు చక్కని నీతి శతకాలు చెప్పారు. ‘ అందులో ఎన్నో నీతులను వారు మనకు తెలిపారు. భాస్కర శతకకర్త నీతులను దృష్టాంతాలతో బోధించాడు. సుమతీ శతకకర్త, భర్తృహరి, ధూర్జటి వంటి పూర్వ కవులు సైతం మనకు ఎన్నో నీతివాక్యాలు చెప్పారు.

ఈ పద్యాల్లోని నీతివాక్యాలను పాటించి నడచుకుంటే మనుషులు ధర్మవర్తనులు అవుతారు. ఆ నైతిక విలువలు, నేటి తరం వారి జీవితాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ నీతులు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.

ఈ నైతిక విలువలను పాటిస్తే సంఘంలో మానవులు ధర్మమూర్తులు అవుతారు. చక్కగా ఏ ఆటంకాలు లేకుండా మానవులు తమ జీవితాన్ని హాయిగా నడుపుకోగల్గుతారు.

శాంతి, సత్యము, దయ, ప్రేమ వంటి సద్గుణాలు వారికి అలవడుతాయి. నైతిక విలువలు పాటించడం వల్ల సంఘం చక్కగా పురోగతి చెందుతుంది. అందుకే నీతి శతకపద్యాలను పిల్లలకు నేర్పించాలి.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ Important Questions and Answers

ప్రశ్న 1.
నీకు నచ్చిన శతక కవిని గూర్చినీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రుడికి లేఖ

అమలాపురం,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు రాకేష్ కు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది తెలుగు సాహిత్యంలో ఎంతోమంది శతక కవులు ఉన్నారు. వారిలో వేమన కవి నాకు బాగా నచ్చిన కవి. ఈ మహాకవి తన జీవిత అనుభవసారాన్ని తేట తెలుగు పద్యాల్లో అందించాడు. జీవిత సత్యాలను. అలనాటి సామాజిక రుగ్మతలను చక్కగా తెలియజేశాడు. తన పద్యాలను అంటరానితనం వంటి అసమానతలపై ఆయుధంగా వాడుకున్నాడు. అందుకే నాకు వేమన అంటే బాగా ఇష్టం. నీకు నచ్చిన కవిని గురించి వివరంగా తెలియజేయి. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
x x x x x x x

చిరునామా :
వి. రాకేష్, 10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
కనిగిరి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
మీరు సందర్శించిన పర్యాటక ప్రదేశాన్ని వర్ణిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్టణం,
x x x x x

ప్రియమైన కృష్ణకు,
నీ మిత్రుడు మాధుర్ వ్రాయులేఖ.

నేనీ మధ్య అమరావతి వెళ్ళాను. అమరావతి చాలా విశాలమైన నగరం. చాలా అందమైన నగరం. కృష్ణానది పరవళ్ళతో ఆ అందం రెట్టింపయింది.

చక్కటి ఉద్యానవనాలున్నాయి. కొత్త కొత్త భవనాలు కట్టారు. ఏ విభాగానికి ఆ విభాగం చక్కగా ఉంది. చూపరులను కట్టిపడేసే అందాలతో విరాజిల్లుతున్న అమరావతి మన నవ్యాంధ్ర రాజధాని కావడం మన అదృష్టం. అమరావతిలో విశేషమైన శిల్ప సంపద ఉంది. మానవ శరీర ధర్మ శాస్త్రాననుసరించి చెక్కిన ఆ శిల్పాలను చూడవలసింది.
ఉంటాను మరి

ఇట్లు,
మాధుర్ వ్రాలు

చిరునామా:
చింత. శివరామకృష్ణ,
10వ తరగతి – ఎ,
మునిసిపల్ హైస్కూల్, పవర్ పేట, ఏలూరు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, అనాథలకు విరాళాలు ప్రకటించి తమ ఉదారతను, వదాన్యతను లోకానికి చాటించుకోవాలని కోరుతూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ఆపన్నహస్తం ఇవ్వండి

ఆదుకుందాం ! ఆదరిద్దాం !

వదాన్యులారా ! ధనవంతులారా ! ఒక్క మనవి ఆలకించండి. మన సమాజంలో ఎందరో అనాథలు, అభాగ్యులు ఉన్నారు. వారందరిని ఆదుకోవాల్సిన ధర్మం అందరిపైనా ఉంది. ముఖ్యంగా సంపన్నుల పైన ఎక్కువగా ఉంది. ఎంతో మంది అనాథలు చదువులకు దూరంగా ఉన్నారు. వృద్ధులు నిరాదరణకు లోనవుతున్నారు.

స్వార్థం కొంత మానుకొని తోటి సమాజశ్రేయస్సుకై పాటుపడాలి. అనాథలపై కనికరం చూపండి. పేదలకు భోజన వసతులను కల్పించండి. అనాథాశ్రమాలను పోషించండి. పేద విద్యార్థుల చదువుకు ధన సహాయం చేయండి. గ్రామాలను, పాఠశాలలను దత్తత తీసుకోండి. మీలోని మానవీయతను చూపండి. అందరికి ఆదర్శంగా నిలవండి. సమాజ శ్రేయస్సునే మీ శ్రేయస్సుగా భావించండి. పేదలు లేని నవసమాజాన్ని నిర్మించడానికి కృషిచేయండి. ఈ మహాయజ్ఞంలో మీ వంటి ధనవంతుల భాగస్వామ్యం తప్పక ఉండాలి.

ఇట్లు,
నిర్వాసిత బాలల సంరక్షణ సమితి,
కనిగిరి.

ప్రశ్న 4.
శతకాలను చదవమని ప్రేరేపిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

కరపత్రం

శతక పద్యాలు, శతకకర్తల అనుభవసారాలు. వారు జీవితాన్ని కాచివడపోసిన అనుభవంతో, గమనించిన సత్యాలతో శతకాలు రచించారు. శతకంలో సుమారు వందపద్యాలు ఉంటాయి. ప్రతి శతకంలోనూ మకుటం ఉంటుంది. శతకాలలో నీతి, భక్తి, వైరాగ్య శతకాలు ఉన్నాయి.

ఈనాడు సంఘంలో ఎన్నో అవకతవకలు, అధర్మ ప్రవర్తనలు, తెలివితక్కువ పనులు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్ది సంఘాన్ని మంచిదారిలో నడపాలంటే చిన్నప్పటి నుండే మంచి నీతులు నేర్చుకొని తెలివిగా బ్రతకాలి. ధర్మబద్ధంగా, ఇతరులకు ఆటంకాలు లేకుండా న్యాయబద్ధంగా, నీతి మార్గంలో నడవాలి.

అందుకు మనకు ఉన్నది ఒక్కటే మార్గం. మన కవులు మనకు అందించిన శతక పద్యాలను కంఠస్థం చేసి, వాటిలో చెప్పిన నీతిమార్గాన్ని పాటించి, నైతిక విలువలను కాపాడాలి. అందుకే మా పాఠ్యపుస్తకాల్లో ప్రతి తరగతిలోనూ నీతి శతక పద్యాలను పాఠాలుగా పెడుతున్నారు.

మనం అంతా శతకాలు చదువుదాం. మన పిల్లలచే శతకాలు చదివిద్దాం. శతక పద్యాలు చదివి, వాటిలో వేమన, సుమతీ శతకకర్త, భాస్కర శతకకర్త, భర్తృహరి వంటి వారు చెప్పిన శతకపద్యాలలోని విలువలను నేర్చుకుందాం. మన జీవితాన్ని బంగారుబాట పట్టిద్దాం. మన పిల్లలను మేలిమి రత్నాలుగా తీర్చిదిద్దుకుందాం. అందుకే మనం అంతా దీక్షగా శతక పద్యాలు చదువుదాం, కదలండి.

దివి, x x x x x

ఇట్లు,
ఆంధ్రభాషా ప్రవర్థక సమితి,
అమరావతి.

ప్రశ్న 5.
శతకాల వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:

శతకములు – ప్రయోజనములు

‘శతకము’ అంటే నూరు పద్యాల గ్రంథము. శతకాలలో నూరు నుండి. నూట ఎనిమిది వరకు పద్యాలు ఉంటాయి. శతకాలలో మకుటం ఉంటుంది. మకుటం లేని శతకాలూ ఉన్నాయి. మన తెలుగు భాషలో ఎందరో కవులు శతకాలు వ్రాశారు. వీటిలో నీతి శతకాలు, భక్తి శతకాలు ఎక్కువగా ఉంటాయి. భర్తృహరి నీతి, శృంగార, వైరాగ్య శతకాలను మూడింటినీ రచించి, ‘సుభాషిత త్రిశతి’ అని పేరు పెట్టాడు.

శతకములలో వేమన రచించిన వేమన శతకము, కంచెర్ల గోపన్న రచించిన దాశరథీ శతకము, సుమతీ శతకము, భాస్కర శతకము, ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతకము వంటివి బాగా ప్రసిద్ధి పొందాయి.

శతకములు చదవడం వల్ల ముఖ్యంగా ప్రజలలో నీతివర్తనం, భక్తి పొందుతుంది. నీతి శతకాలు మానవులకు జీవిత మార్గాన్ని ఉపదేశిస్తాయి. నీతి శతకాలవల్ల నైతిక విలువలు పెంపొందుతాయి. ముఖ్యంగా పిల్లలచే నీతి శతక పద్యాలు చదివిస్తే, వారు మంచి పౌరులుగా తయారు అవుతారు. ఏది మంచో, ఏది చెడో వారికి తెలుస్తుంది. వేమన నీతులను దృష్టాంతాలతో సులభంగా చెప్పాడు. భాస్కర శతకకర్త నీతులను దృష్టాంతాలతో చెప్పాడు. వీటిని చదవడం వల్ల సులభంగా మనకు నీతులు పట్టుపడతాయి.

భక్తి శతకాల ద్వారా దైవభక్తి పెరుగుతుంది. మొత్తంపై శతకాల వల్ల మానవులు భక్తి, నీతి కలవారై యోగ్యులైన ధర్మమూర్తులు అవుతారు. అందుకే మనం శతకాలు చదువుదాం. మన పిల్లలచే చదివిద్దాం.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 1 Mark Bits

1. కులం కంటె గుణం ప్రదానం – గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.
A) కాలము
B) కొలం
C) కలము
D) కన్నం
జవాబు:
B) కొలం

2. గగ, భ, జ, స, నల గణములు మాత్రమే వచ్చే పద్యమేది? (June 2017)
A) సీసము
B) కందము
C) ద్విపద
D) తరువోజ
జవాబు:
B) కందము

3. సృష్టి మర్మమును ఎవరు తెలుసుకోగలరు? – (గీత గీసిన పదమునకు అర్థమును గుర్తించుము.) (March 2017)
A) పుట్టుక
B) నడవడిక
C) రహస్యం
D) ఆచరణ
జవాబు:
C) రహస్యం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

4. నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు, నా – ఏ పద్యపాదమో గుర్తించండి. (March 2018)
A) చంపకమాల
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) శార్దూలము
జవాబు:
C) ఉత్పలమాల

5. సిరి సంపదలకన్నా ప్రవర్తన గొప్పగా ఉండాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి. (June 2018)
A) శ్రీశ్రీ
B) శ్రీ
C) శ్రీకారం
D) సాకారం
జవాబు:
B) శ్రీ

6. మహనీయులు వారు చేసిన పనుల వలన ఉత్తములుగా కీర్తి పొందారు. (అర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) స్నేహితులు
B) గొప్పవారు.
C) మధ్యములు
D) పేదవారు
జవాబు:
B) గొప్పవారు.

7. కరి రాజును తామరతూడులతో బంధించలేము. (పర్యాయ పదములు గుర్తించండి) (S.A. I – 2018-19)
A) కరము, కిరణము
B) గజము, ఏనుగు
C) హస్తి, హస్తము
D) గజము, సింహము
జవాబు:
B) గజము, ఏనుగు

8. మనదేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప గొప్ప నాయకులు అమరులుగా నిలిచారు. (వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) మరణం పొందినవారు
B) మరణం లేనివారు
C) మరణం లెక్కచేయని వారు
D) మరణానికి భయపడనివారు
జవాబు:
B) మరణం లేనివారు

9. దేశాల మధ్య శాంతి కాపాడుకోవాలి. (విడదీసిన సరియైన రూపం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) దే + శాల
B) దేశ + అల
C) దేశము + ల
D) దేశా + ల
జవాబు:
C) దేశము + ల

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

10. నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. (అలంకారాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) అంత్యానుప్రాసము
B) లాటానుప్రాసము
C) ఛేకానుప్రాసము
D) వృత్త్యనుప్రాసము
జవాబు:
D) వృత్త్యనుప్రాసము

11. పరధనాపహరణము కంటె దిరియుట మంచిది – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2018 )
A) ఇతరుల డబ్బు దొంగతనం చేయకూడదు.
B) పరుల సొమ్ము దొంగిలించడం కంటె బిచ్చమెత్తుకోవడం మంచిది.
C) ఇతరుల సొమ్ము దొంగిలించకుండా అడుక్కోవాలి.
D) పరుల నగదు అడిగి తీసుకోవడం మంచిది.
జవాబు:
B) పరుల సొమ్ము దొంగిలించడం కంటె బిచ్చమెత్తుకోవడం మంచిది.

12. సత్యాన్నే పలుకు, ధర్మాన్నే ఆచరించు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2018)
A) నిషేధాకం
B) విధ్యర్థకం
C) నిశ్చయార్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
B) విధ్యర్థకం

చదవండి – తెలుసుకోండి

మహాత్మాగాంధీ బోధలు

సత్యం :
ప్రపంచానికి బోధించటానికి నా వద్ద కొత్తది ఏమీ లేదు. సత్యాహింసలు పర్వతాలంతటి ప్రాచీనమైనవి.

సత్యాహింసలే నా మతం. సత్యం నా భగవంతుడు. ఆయనను ప్రసన్నం చేసుకోవటానికి అహింస మార్గం.

సత్యమనేది, నీవు ఎంత ఎక్కువగా పోషిస్తే అంత ఎక్కువగా ఫలాలిచ్చే విశాల వృక్షం వంటిది. సత్యమనే గనిలో ఎంత లోతుగా అన్వేషిస్తే అక్కడ నిక్షిప్తమైవుండి దొరికే వజ్రం అంత విలువైనదిగా ఉంటుంది. ఇతోధిక సేవా మార్గాలకు దారులు కనిపించవచ్చు.

నా జీవితమంతటా, సత్యంపై దృఢంగా నిలబడటం రాజీ తాలూకు సౌందర్యాన్ని మెచ్చుకోవటం నాకు నేర్పింది. ఈ భావన సత్యాగ్రహం (అహింసాత్మక ప్రతిఘటన)లో తప్పనిసరి భాగమని ఉత్తరోత్తరా జీవితంలో నేను చూడగలిగాను.

నిలకడవున్న వ్యక్తిగా కనిపించేందుకు నేనెప్పుడూ శ్రద్ధచూపలేదు. నా సత్యాన్వేషణ ప్రయత్నంలో అనేక భావాలను విడనాడాను. అనేక కొత్త విషయాలు నేర్చుకున్నాను. నా వయోభారం పెరిగే కొద్దీ నా అంతర్గత వృద్ధి ఆగిపోతుందని గాని లేదా మాంసం కరిగిపోవటంతో నా వృద్ధి ఆగిపోతుందనే భావన గాని నాకు లేదు. నేను ఆలోచిస్తున్నదల్లా సత్యం. నా భగవంతుడు క్షణక్షణానికి యిచ్చే పిలుపును శిరసావహించేందుకు నా సంసిద్ధత గూర్చే.

సత్యం స్వభావరీత్యా స్వయం ప్రదర్శితం. దానిని ఆవహించివున్న అజ్ఞానమనే సాలెగూళ్ళను నీవు తొలగించగలిగితే అది స్పష్టంగా ప్రకాశిస్తుంది.

అహింస:
నేను నాలో ఉన్నట్లు చెప్పుకునే ఒకే ఒక సుగుణం సత్యం, అహింస. మానవాతీత శక్తులున్నట్లు నేను చెప్పుకోజాలను. అటువంటివాటిని నేను కోరుకోను. నా తోటి మానవులలో దురలుని శరీరముకున్న దుష్టమాంసఖండములే నా శరీరమునకూ ఉన్నవి. అందువల్ల అందరిలాగే నేనూ తప్పు చేయవచ్చును. నా సేవలకు అనేక పరిమితులున్నవి.

అహింస మానవాళికి అందుబాటులో ఉన్న గొప్ప శక్తి, అహింస రూపుదిద్దుకోవలసిన లేదా పాటించమని ఆదేశించవలసిన గుణం కాదు. అది అంతర్గతంగా వృద్ధి చెందేది. ఒక వ్యక్తి చేసే తీవ్రమైన ప్రయత్నంపై దాని మనుగడ ఆధారపడి ఉంటుంది.

మన సూత్రాలను ఇతరులు గౌరవించాలని మనం ఎలా ఆశిస్తామో తమ సూత్రాల పట్ల అదే పరిగణనకు ప్రత్యర్థి కూడా పాత్రుడు. ప్రత్యర్థులను గెలుచుకోవటానికి మనం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అహింస కోరుతుంది.

క్రమశిక్షణ – విధి నిర్వహణ:
జీవిత ముఖ్య ప్రయోజనం సక్రమంగా జీవించడం, సక్రమంగా ఆలోచించడం, సక్రమంగా వ్యవహరించడం.

మనం ఏదైనా గొప్పదైన, శాశ్వతమైనదాన్ని సాధించే ముందు కఠినమైన, ఉక్కు క్రమశిక్షణ ఉండి తీరాలి. ఆ క్రమశిక్షణ కేవలం విద్యాసంబంధమైన వాదన నుండి, హేతువుకు, తర్కానికి విజ్ఞప్తి చేయటం ద్వారా రాదు. క్రమశిక్షణను ప్రతికూలత అనే పాఠశాలలోనే నేర్చుకోవాలి.

సంతృప్తి ప్రయత్నంలో ఉంటుంది గాని సాధించటంలో ఉండదు. సంపూర్ణ కృషి సంపూర్ణ విజయాన్నిస్తుంది.

నిరంతర అభివృద్ధి జీవిత సూత్రం. నిలకడగా ఉన్నట్లు కనిపించే నిమిత్తం తన పిడివాదాలను కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించే మనిషి తనను తాను బూటకపు స్థితిలోకి నెట్టుకుంటున్నాడు.

హక్కులకు సిసలైన మూలం విధి. ‘మనందరం గనుక మన విధులను నిర్వర్తించినట్లయితే హక్కును పొందటం దూరం కాజాలదు. విధులు నిర్వర్తించకుండా హక్కుల వెంట మనం పరుగెడితే అవి అగమ్య గోచరంగా మన నుండి తప్పించుకుంటాయి. మనం ఎంతగా వాటి వెంట పడితే అవి అంతగా దూరం ఎగిరిపోతాయి.

తన విధులు సష్యంగా నిర్వర్తించే వ్యక్తికి హక్కులు వాటంతట అవే సమకూరుతాయి.

ధైర్యం – దృఢ విశ్వాసం:
ధైర్యం అనేది కండర సంబంధమైన పదార్థంగా ఎవ్వరూ ఎన్నడూ చెప్పలేదు, అది హృదయానికి సంబంధించింది. అతి గట్టి కండరం కూడా ఊహాజనితమైన భయం ముందు వణికిపోతుందని మనకు తెలుసు. కండరాన్ని వణికించేది హృదయం.

శారీరక దారుఢ్యం నుండి బలం చేకూరదు. అది మొక్కవోని సంకల్పం నుండి వస్తుంది. బలానికి సంయమనాన్ని, మర్యాదను జత చేసినపుడు అది ప్రబలమవుతుంది.
ప్రపంచంలో చూడాలని నీవు కోరుకుంటున్న మార్పు నీలో రావాలి.

నమ్రత:
అహింసా స్ఫూర్తి విధిగా నమ్రతకు దారి తీస్తుంది.

నమ్రత అనేది ప్రత్యేకించి పాటించేది కాదు. ఎందుకంటే, అది ఉద్దేశపూర్వకంగా ఆచరించటానికి ఉద్దేశించింది కాదు. అయితే అది ‘అహింసకు తప్పనిసరి పరీక్ష, ఎవరిలోనైతే ‘అహింస’ ఉంటుందో వినయం అతని స్వభావంలో భాగమవుతుంది.

తప్పులు చేయనివారు ఎవరూ ఉండరు – దైవాంశ సంభూతులైనా సరే. తప్పిదాలు లేకపోవటం వల్ల వారు దైవాంశ సంభూతులు కాలేదు. తమ తప్పులను తాము తెలుసుకోవటం వల్ల, వాటిని దిద్దుకోవటానికి కృషిచేయటం వల్ల, వాటిని దాచుకోకపోవటం వల్ల, తమను తాము దిద్దుకోవటానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా వుండటం వల్ల వారు దైవాంశ సంభూతులైనారు.

మరో వ్యక్తి ఆలోచనలు చెడ్డవని, మనవి మాత్రమే మంచి ఆలోచనలని చెప్పటం, మన అభిప్రాయాలకు భిన్నమైన వాటిని కలిగి వున్నవారు దేశానికి శత్రువులని చెప్పటం దురలవాటు.

సహనశీలత – అస్పృశ్యత:
అసహనం అనేది కూడా ఒక హింసారూపం. నిజమైన ప్రజాస్వామిక భావన వృద్ధిచెందటానికి ప్రతిబంధకం. మనం నిజమైన ప్రజాస్వామిక స్ఫూర్తిని అలవరచుకోవాలంటే మనం అసహనపరులుగా వుండకూడదు. అసహనం ఒకని లక్ష్యంలోగల విశ్వాస వాంఛను దెబ్బతీస్తుంది.

ఇతరులు మనలను చూస్తునట్లుగా మనల్ని మనం చూసుకోటం మంచిది. మనం ప్రయత్నించినా, మనల్ని మనం సంపూర్ణంగా ఎన్నడూ తెలుసుకోలేము. ముఖ్యంగా మనలోని దుష్టపార్శ్వాన్ని అసలు తెలుసుకోలేము. మనలను విమర్శించేవారిపట్ల ఆగ్రహం చెందకుండా వున్నప్పుడు ఆ పని మనం చేయగలుగుతాము. వారు ఏమి చెప్పినప్పటికీ సహృదయంతో స్వీకరించాలి.

స్వేచ్ఛ – ప్రజాస్వామ్యం:
అంతర్గత ప్రమాదాలు లేనటువంటి మానవ వ్యవస్థ ఉండదు. వ్యవస్థ ఎంత పెద్దదైతే దుర్వినియోగ అవకాశాలు అంత హెచ్చుగా వుంటాయి. ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ. అందువల్ల అది ఎక్కువగా దుర్వినియోగానికి గురి అయ్యే అవకాశముంది. కనుక దానికి పరిష్కారం ప్రజాస్వామ్యాన్ని తప్పించటం కాదు, దుర్వినియోగ అవకాశాన్ని కనీస స్థాయికి తగ్గించటమే.

ప్రజాస్వామ్యం సారాంశం ఏమంటే, అందరి సమష్టి ప్రయోజనానికి సేవచేయటంలో అన్ని విభాగాల ప్రజల ఉద్యం యావత్ భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక వనరులను సమీకరించే కళ, శాస్త్రం అని అర్థం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 5th Lesson ధన్యుడు

10th Class Telugu 5th Lesson ధన్యుడు 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధన్యుడు పాఠం నేపధ్యాన్ని వివరించండి.
జవాబు:
మంచి స్నేహితులను మనం కలిస్తే, ఆ కలయిక, మన జీవితాన్ని ఒక చక్కని దారివైపునకు తిప్పుతుంది. అందుకే మనము ఎప్పుడూ మంచి స్నేహితులను కలిగియుండాలని, మన పెద్దవాళ్లు మనకు చెపుతారు. మంచి స్నేహితులతో స్నేహం మనకు మేలు చేస్తుందనీ, సత్పురుషులతో కలయిక ఎప్పటికీ మంచిది అనీ, చెప్పడమే ఈ పాఠం నేపథ్యం.

ప్రశ్న 2.
ధన్యుడు పాఠంలో నిజమైన ధన్యుడు ఎవరు? ఎట్లు చెప్పగలవు? (March 2017)
(లేదా)
నిజంగా “ధన్యుడు” ఎవరో “ధన్యుడు” పాఠ్యభాగం ఆధారంగా తెల్పండి. (June 2019)
జవాబు:
ధన్యుడు పాఠంలో నిజంగా ధన్యుడు “హిరణ్యకుడు” అనే పేరు గల ఎలుక.

హిరణ్యకుడు అనే ఎలుక, మొదట ధనలోభంతో సంచరించింది. తరువాత తెలివి తెచ్చుకొని ధనలోభాన్ని విడిచి ఉన్నదానితో తృప్తి పడ్డవాడే ధన్యుడు అని నిశ్చయించి, నిర్జనారణ్యంలో నివసించింది.

అక్కడ హిరణ్యకుడికి లఘుపతనకం అనే కాకితో మైత్రి కల్గింది. లఘుపతనకం ద్వారా మంథరుడు అనే తాబేలుతో మైత్రి కల్గింది. మంథరుడి అమృతం వంటి మాటలు, హిరణ్యకుడి తాపాన్ని చల్లార్చి, అతణ్ణి మరింతగా ధన్యుణ్ణి చేశాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 3.
ధన్యుడు పాఠం ఎవరు వ్రాశారు? ఆయన గురించి వ్రాయండి.
(లేదా)
“ధన్యుడు” పాఠ్యభాగ రచయితను గూర్చి రాయండి. (S.N. I – 2019-207)
జవాబు:
ధన్యుడు పాఠమును పరవస్తు చిన్నయసూరిగారు రచించారు. ఆయన 1809వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని, పెరంబుదూరులో జన్మించాడు. చిన్నయసూరి తండ్రి వేంకట రంగ రామానుజా చార్యులుగారు. తల్లి శ్రీనివాసాంబ. ఆయన నీతిచంద్రిక, బాలవ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం మొదలైన గ్రంథాలు రాశారు.

ప్రశ్న 4.
ధన్యుడు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆయన పాండిత్యం, రచనల గూర్చి వ్రాయండి.
జవాబు:
ధన్యుడు పాఠమును పరవస్తు చిన్నయసూరిగారు రచించారు. ‘సూరి’ అనగా పండితుడు. ఆయన తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో పండితుడు.

ఆయన అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహము మొదలైన గ్రంథాలు రాశారు.

చిన్నయసూరి రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకొనేలా ఉంటుంది. ఆయన ప్రాచీన కావ్య భాషలో రచించారు.
ఆయన పచ్చయ్యప్పకళాశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.

ప్రశ్న 5.
చిన్నయసూరి గురించి, ఆయన విశిష్ట రచనల గురించి వివరింపుము.
జవాబు:

  1. పరవస్తు చిన్నయసూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో “శ్రీ పెరంబుదూర్”లో జన్మించాడు. ఈయన మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.
  2. ఈయన తమిళం, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి పండితుడు. ‘సూరి’ అనేది ఈయన బిరుదు.
  3. చిన్నయసూరి బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహం వంటి గ్రంథాలు రాశాడు.

ఈయన రాసిన బాలవ్యాకరణం నేటికీ ప్రామాణిక గ్రంథం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 6.
ధన్యుడు పాఠం ఆధారంగా ధనలోభం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో నాలుగైదు వాక్యాల్లో రాయండి.
జవాబు:
ధన లోభం అంటే ధనం సంపాదించాలనే దురాశ, అత్యాశ. ధనలోభం ఆపదలు అన్నింటికీ మూలం. ధనలోభాన్ని విడిచిపెట్టడం కంటె, గొప్ప సుఖం ఉండదు.

కడుపుకోసం ఇతరులను యాచించకుండా లభించిన దానితో తృప్తిపడేవాడు. లోకంలో ధన్యుడు. అటువంటి వాడే సుఖవంతుడు.

ధనలోభం వల్ల మోహం కలుగుతుంది. మోహం దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖం అగ్నిలా తన స్థానానికి నాశం – కల్గిస్తుంది. కాబట్టి ధనలోభం పనికి రాదు.

ప్రశ్న 7.
ఎక్కడి ఎలుక? ఎక్కడి చిలుక కొయ్య? అనడంలో అంతరార్థం ఏమిటి?
జవాబు:
సాధారణంగా అంతరం ఎక్కువ ఉండేవాటి పట్ల ఈ విధంగా ప్రయోగిస్తారు. ఎలుక నేలపైనా, రంధ్రాలలోనూ ఉంటుంది. గోడను నిలువుగా ఎక్కువ దూరం ఎలుక ప్రాకలేదు. చిలుకకొయ్య గోడకి మధ్యలో ఉంటుంది. అటువంటి , చిలుకకొయ్య పైకి ఎలుక చేరడం అసంభవం. అది సాధ్యం కానిది ఎలాగ సాధ్యమైంది అనేది దీనిలో అంతరార్థం. అలాగే ‘నక్క ఎక్కడ ? నాగ లోకము (స్వర్గం) ఎక్కడ?” అని కూడా అంటారు.

ప్రశ్న 8.
“ధనము సర్వశ్రేయములకు నిదానము” మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
ఏ శుభకార్యం చేయాలన్నా ధనం కావాలి. ధనం లేకపోతే ఏ పనీ చేయలేము. అందుకే ప్రతి పుణ్యకార్యానికి అసలు కారణం ధనమే. అన్నదానం, భూదానం, గృహదానం మొదలైన ఏ దానం చేయాలన్నా ధనం కావాలి. చెరువు త్రవ్వించడం, దేవాలయాలు నిర్మించడం, పాఠశాల, ఆసుపత్రి మొదలైనవి నిర్మించడం ధర్మకార్యాలు. కాని ధనం లేకపోతే ఏ ధర్మకార్యాలు చేయలేము. అందుకే సర్వశ్రేయాలకు అసలు కారణం ధనం. మన ఉన్నతత్వానికి, గౌరవానికి, మర్యాదకు మన ధనమే అసలు కారణం.

ప్రశ్న 9.
‘దారిద్యము సర్వశూన్యము” అనే మాటను వ్యాఖ్యానించండి.
జవాబు:
దారిద్ర్యము అంటే బీదతనము: సర్వశూన్యము అంటే ఏమి లేనిది. అంటే ఇంటిలో పదార్థములు లేకుండా పోతాయి. అందువల్ల సుఖసంతోషాలు పోతాయి. దుఃఖము కలుగుతుంది. భార్యాబిడ్డలకు, కడుపునిండా తిండి పెట్టలేము. కాబట్టి దారిద్ర్యము అన్నింటినీ లేకుండా చేస్తుందని భావము.

ప్రశ్న 10.
‘ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు’ – ఎట్లు?
జవాబు:
ఆశ అన్ని అనర్థాలకు మూలం. ఆశ పడినది దొరకకపోతే కోపం వస్తుంది. కోపంలో విచక్షణ కోల్పోతాము. పిసినిగొట్టుతనం పెరుగుతుంది. ఆశ మితిమీరితే అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం వలన గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగితే ఎవ్వరితోటి స్నేహం చేయలేము. అందుచేత ఆశను విడిచిపెడితే సత్పురుషుడౌతాడు. మితిమీరిన ఆశ పనికి రాదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 11.
‘ధనహీనుడై నలుగురిలో ఉండరాదు. ఎందుకు?
జవాబు:
ధనహీనుడు అంటే ధనం లేనివాడు. ధనం ఉన్నప్పుడు సమాజంలో గౌరవం ఉంటుంది. హోదా ఉంటుంది. స్నేహితులు ఉంటారు. బంధువులు చేరతారు. అందరూ పలకరిస్తారు. నలుగురూ చేరతారు. కాని, ధనం లేకపోతే ఎవ్వరూ మాట్లాడరు. స్నేహితులు, బంధువులు కూడా పలకరించరు. గౌరవం, హోదా ఉండవు. ఇటువంటి అవహేళనలకు గురి అవుతూ నలుగురిలో ఉండకూడదు. ఎవరూ తెలియని ప్రదేశంలో ఉంటే ధనము లేనివాని ఆత్మాభిమానం దెబ్బ తినదు.

ప్రశ్న 12.
‘మనస్సు గట్టిపరచుకోవటం’ అంటే ఏమిటి?
జవాబు:
మనస్సు చంచలమైనది. అది ఇష్టం వచ్చినట్లు సంచరిస్తుంది. గట్టి పరచుకోవడం అంటే మనస్సును దృఢం చేసికోవడం, నిశ్చయం చేసుకోవడం అని అర్థం.

ప్రశ్న 13.
‘చచ్చిన తరి వెంట రాబోదు’ అనడంలో మీకేమి అర్థమయ్యింది?
జవాబు:
మనిషి చచ్చిపోయే సమయంలో అతడు సంపాదించిన ధనం వగైరా అతడి వెంట వెళ్ళదు. కాబట్టి తాను ధనాన్ని హాయిగా వెచ్చించి, కడుపు నిండా తినాలి. ఇతరులకు ఇంత పెట్టాలి. ఇతరులకు ఇవ్వక, తాను తినక, దాచిన డబ్బు చచ్చిపోయేటప్పుడు ఆ వ్యక్తి వెంట వెళ్ళదు అని నాకు తెలిసింది.

ప్రశ్న 14.
చూడాకర్ణుని స్వభావం గురించి వ్రాయండి.
జవాబు:
చూడాకర్ణుడు అమాయకపు సన్యాసి, చంపకవతి అనే పట్టణంలో నివసించేవాడు. తాను తినగా మిగిలిన భోజనం భిక్షాపాత్రలో పెట్టి చిలుకకొయ్యకు తగిలించేవాడు. దానిని ప్రతిరోజూ ఒక ఎలుక తినేసేది.

తన ఎదురుగానే ఎలుక చిలుకకొయ్యపైకి ఎగురుతుంటే, చప్పుడు చేస్తే బెదిరించాడు. అంతేకాని, ఆ ఎలుకకు అంత బలం, ధైర్యం కలగడానికి కారణం ఆలోచించలేదు. దాని బలాన్ని, బలగాన్ని కొల్లగొట్టాలని ఆలోచించలేదు. తన స్నేహితుని సలహాతో హిరణ్యకుని పీడ వదిలించుకొన్నాడు. సలహా చెబితే పాటించే స్వభావం కలవాడు చూడాకర్ణుడు.

ప్రశ్న 15.
వీణాకర్లుని స్వభావం వ్రాయండి.
జవాబు:
వీణాకర్ణుడు ఒకసారి చూడాకర్ణుని దగ్గరకు వచ్చాడు. అతని ఆహారాన్ని ఎలుక దొంగిలిస్తున్న విధానం గమనించాడు. వీణాకర్ణుడు చాలా తెలివైనవాడు. కనుకనే ఎలుక బలానికి కారణాన్ని అన్వేషించాడు. తన స్నేహితునికి ఆ ఎలుక నివాసాన్ని కొల్లగొట్టమని చక్కని సలహా ఇచ్చాడు. స్నేహితునకు ఉపకారం చేసే స్వభావం కలవాడు. స్నేహితుల బాధలను తన బాధలుగా భావించి, నివారిస్తాడు. అతని సలహాతో చూడాకర్ణునికి ఎలుకబాధ పూర్తిగా తొలగిపోయింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 16.
హిరణ్యకుని స్వభావం వ్రాయండి.
జవాబు:
హిరణ్యకుడు, చూడాకర్ణుని భిక్షాన్నం దొంగిలించి బ్రతికేవాడు. కాని, చూడాకర్ణునిచేత సంపదంతా కొల్లగొట్టబడి తరమబడ్డాడు. ఇంకక్కడ ఉండకూడదనుకొన్నాడు. అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాక జ్ఞానోదయమయింది. సంపద ఉన్నపుడు తనకు ఎవరూ సాటి లేరనుకొని విర్రవీగాడు. సంపదపోగానే, పట్టుదల పెరిగింది. కాని, సన్న్యాసి విసిరిన కర్ర దెబ్బ నుండి తప్పించుకొన్నాక నిజమైన జ్ఞానం కలిగింది. అప్పుడే లోభం వలన కలిగే ప్రమాదం తెలుసుకొన్నాడు. లోభం విడిచి పెట్టాడు. అడవికి వెళ్ళాడు. ధన్యుడయ్యాడు.

ప్రశ్న 17.
మంథరుని స్వభావం వ్రాయండి.
జవాబు:
అన్నిటినీ కోల్పోయి ఒంటరిగా అడవికి వచ్చిన హిరణ్యకుని ఆదరించిన స్నేహశీలి మంథరుడు. తన స్నేహంతో అతనికి పునర్జన్మను ప్రసాదించాడు. తన మంచి మాటలతో జ్ఞానోదయం కల్గించాడు. అతి సంచయేచ్ఛ తగదని బోధించింది. మనోధైర్యాన్ని ప్రసాదించింది. లఘుపతనకునితో సమానంగా ఆదరించిన స్నేహశీలి.

ప్రశ్న 18.
వివేకహీనుడిని ఎందుకు సేవించకూడదు?
జవాబు:
వివేకహీనుడిని సేవించడం కంటే, వనవాసం ఉత్తమం అని హిరణ్యకుడు అనుకుంటాడు. వివేకము అంటే మంచి చెడులు సరిగా తెలిసికొనే జ్ఞానము. వివేకము లేనివాడిని అవివేకి అని, వివేకహీనుడని అంటారు.

మంచి చెడ్డలు తెలియని ప్రభువును సేవిస్తే అతడు తెలివితక్కువగా ప్రవర్తిస్తాడు. ప్రభువు మేలుకోరి పనిచేసేవాడిని కూడా వాడు నిందిస్తాడు. ఇతరుల చెప్పుడుమాటలు విని, తన దగ్గర పనిచేసే సేవకుడిని తప్పు పడతాడు. అకారణంగా శిక్షిస్తాడు. తన కోసం కష్టపడే సేవకుడి మంచితనాన్ని, కష్టాన్ని వివేకహీనుడయిన ప్రభువు గుర్తించలేడు. అకారణంగా, అన్యాయంగా తన తెలివితక్కువతనంతో తనవద్ద పనిచేసే సేవకుడి కష్టాన్ని గుర్తించడు. సేవకుడి మంచితనాన్ని పట్టించుకోడు. కాబట్టి వివేకహీనుడిని సేవించకూడదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 19.
బాలవ్యాకరణాన్ని గూర్చి రాయండి.
జవాబు:
బాలవ్యాకరణాన్ని చిన్నయసూరి రచించాడు. ఈయన బాలవ్యాకరణము, నీతిచంద్రిక, అక్షరగుచ్ఛము, ఆంధ్రకాదంబరి, సూత్రాంధ్ర వ్యాకరణము, పద్యాంధ్ర వ్యాకరణము అనే గ్రంథాలు రచించాడు. ఈయన రచించిన ‘బాలవ్యాకరణం’
కావ్యభాషకు మంచి ప్రామాణిక గ్రంథము. నీతిచంద్రిక – బాల వ్యాకరణాలు లక్ష్య – లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధిపొందాయి.

10th Class Telugu 5th Lesson ధన్యుడు 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సంసార విషవృక్షమునకు అమృతతుల్యమైనవి ఏమిటో వివరించండి. (S.A.I – 2018-19 June 2016)
జవాబు:
‘సంసారం’ అంటే మనుషుల చావు పుట్టుకలు. ఈ సంసారం విషవృక్షము వంటిది. వృక్షమునకు పళ్ళు పుడతాయి. అలాగే సంసారం అనేది విషవృక్షం అనుకుంటే, ఆ సంసార విషవృక్షానికి రెండు అమృతము వంటి పళ్ళు పుడతాయని కవి చెప్పాడు.

అందులో ‘కావ్యామృత రసపానము’ మొదటి అమృత ఫలము, సత్పురుషులతో సహవాసము రెండవ అమృత ఫలము. అంటే మనుషులుగా పుట్టిన వారికి, రెండు ప్రయోజనాలు కలుగుతాయి. హాయిగా మహాకవులు రాసిన కావ్యాలలోని అమృతం వంటి రసాన్ని గ్రహించి ఆనందించవచ్చు. అలాగే సత్పురుషులతో స్నేహం చేసి దాని ద్వారా అమృతం వంటి ఆనందం పొందవచ్చునని కవి చెప్పాడు.

నిజంగానే రామాయణము, భారతము వంటి కావ్యాలలోని సారాన్ని గ్రహిస్తే, అది అమృతములా ఉంటుంది. అలాగే సత్పురుషులతో స్నేహం చేస్తే అందువల్ల అమృతం వంటి ఆనందం పొందవచ్చు. అందుకే రచయిత సంసారం చేస్తున్న మానవులకు, కావ్యాలను చదివి ఆనందం పొందే అదృష్టము, మంచివారితో సహవాసం చేసే అదృష్టమూ లభిస్తాయని చెప్పాడు.

ప్రశ్న 2.
హిరణ్యకుడు అడవులపాలు కావటానికి లోభమే ప్రధాన కారణమని తెల్పిన మంథరుని మాటలను సమర్థించండి. (Jure 2018)
జవాబు:
1) హిరణ్యకుడు లోభం కారణంగా అడవులపాలైన తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని మిత్రుడైన మంథరునికి వినిపించాడు.
2) ఆ మాటలు విన్న మంథరుడు “సంపదలు శాశ్వతమైనవి కావని, యవ్వనం ప్రవాహవేగంలాంటిదని, జీవితం నీటి బుడగతో సమానమైనదని చెప్పాడు.
3) కావున బుద్ధిమంతుడు సత్వరమే (వెంటనే) ఈ నిజాన్ని గుర్తించి ధర్మకార్యాలు చక్కగా ఆచరించాలని, అలా ఆచరించని వారు పశ్చాత్తాపంతో దుఃఖమనే అగ్నిలో కాలిపోతారని చెప్పాడు.
4) “నీవు కావలసిన దానికన్నా ఎక్కువగా కూడబెట్టావు. నీ లోభ బుద్ధియే నిన్నిలా అడవుల పాలు చేసింది. ఎక్కువగా కూడబెట్టాలనే కోరిక తగదు. ఇతరులకిచ్చి మనం భుజించినదే మన సొత్తు. పరులకివ్వకుండా తాను తినకుండా దాచిన సొమ్ము చనిపోయినపుడు వెంటరాదు. బ్రతకడం కోసం ఇన్ని తిప్పలు పడనవసరం లేదు. ధర్మాలన్నీ తెల్సిన నీకు నేను వివరంగా చెప్పవలసిన పని లేదు.” అంటాడు.
5) ఈ అంశాలన్నీ సమర్థింపదగినవేనని నేను భావిస్తున్నాను. సంపదల స్వభావం గురించి యవ్వనం గురించి, జీవితం గురించి, ముఖ్యంగా లోభగుణం గురించి, ధర్మకార్యాలను ఆచరించవలసిన అవసరం గురించి మంథరుడు చెప్పిన మాటలు అందరూ అనుసరించదగినవని, ఆమోదించదగినవనీ నేను భావిస్తున్నాను.

ప్రశ్న 3.
ఈ క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. చూడాకర్ణుడు :
చంపకవతి అనే పట్టణంలోని సన్యాసి. తను భోజనము చేయగా మిగిలిన వంటకం చిలుక కొయ్య మీద దాచుకొనేవాడు. ఒక ఎలుక ప్రతిరోజూ దానిని తినేసేది. ఎలుకను బెదిరించాడు తప్ప దానిని భయపెట్టి తరిమేసే ప్రయత్నం చేయలేదు. ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించే స్వభావం కాదు. వీణాకర్ణుని సలహాతో హిరణ్యకుని పీడను వదిలించుకొన్నాడు. అతని మాటతీరును బట్టి చాలా గ్రంథాలు చదివిన వాడని తెలుస్తుంది. స్నేహితులు చెప్పే మంచి సలహాలను వింటాడు. ఆచరిస్తాడు. తెలివైనవాడు.

2. వీణాకర్ణుడు :
చూడాకర్ణుని స్నేహితుడు. ఒక సమస్య యొక్క మూలాలను వెతికి పట్టుకొంటాడు. పరిష్కారం సూచిస్తాడు. చూడాకర్ణునికి హిరణ్యకుని పీడ వదలడానికి కారణం వీణాకర్ణుని సలహాయే. ఆపదలో ఉన్న స్నేహితులకు మంచి సలహాలు చెప్పే స్వభావం కలవాడు.

3. హిరణ్యకుడు :
ఇతడు ఒక ఎలుక. అవకాశం ఉన్నంతకాలం చూడాకర్ణుని దోచుకొన్నాడు. అతని వలన ప్రమాదం ఏర్పడ్డాక జ్ఞానం కలిగింది. ధన వ్యామోహం తగ్గింది. అది తనకు తగిన ప్రదేశం కాదని గుర్తించాడు. భగవంతుని దయామయత్వం అవగాహన చేసుకొన్నాడు. అడవికి చేరాడు. ధన్యుడయ్యాడు. పరిపూర్ణమైన జ్ఞానం కలిగింది.

4. మంథరుడు :
మంథరుడు ఒక తాబేలు పేరు. స్నేహశీలము కలిగినవాడు. హిరణ్యకునికి ఆశ్రయం ఇచ్చాడు. ధనం అశాశ్వతమని, యౌవనం తొందరగా గడిచిపోతుందని తెలుసుకొన్న జ్ఞాని. ధర్మమును ఆచరించాలని చెప్పిన ధర్మాత్ముడు. జీవితం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నవాడు. తన స్నేహితులను కూడా మంచి మార్గంలో నడిపించే ఉత్తముడు మంథరుడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 4.
“యాచక వృత్తి సమస్త గౌరవాన్ని హరిస్తుంది”. విశ్లేషిస్తూ రాయండి.
జవాబు:
యాచక వృత్తి వలన సమస్త గౌరవం పోతుంది. ప్రపంచంలో అనేక రకాల వృత్తులున్నాయి. ఏ వృత్తిని చూసినా కొంతపని చేసి దానికి ప్రతిఫలం పొందడం కనిపిస్తుంది. పనిచేయకుండా ఫలితాన్ని ఆశించడం తప్పు. తప్పు చేస్తే గౌరవం తగ్గడం సహజం. యాచక వృత్తి అంటే ఇతరులకు ఏ మాత్రం ఉపయోగపడకుండా వారి నుంచి ధనం, వస్తువులు మొదలగునవి ఆశించడం. అలా ఎప్పుడైతే ఆశించామో అదే మన గౌరవానికి భంగం కలిగిస్తుంది. యాచక వృత్తిని చేసే వారిని తనవారు కానీ, పైవారు కానీ ఎవరూ గౌరవించరు. చిన్న పనైనా, పెద్ద పనైనా కష్టపడి పనిచేస్తూ సంపాదించుకుని బతుకుతుంటే గౌరవానికి భంగం కలుగదు.

ప్రశ్న 5.
‘ధన్యుడు’ అనే పేరు హిరణ్యకుని వృత్తాంతానికి ఎలా సరిపోయిందో సమర్థించండి.
జవాబు:
ఉదరముకయి పరులగోఁజక, ప్రాప్తి లాభానికి సంతోషించేవాడు ఒక్కడే లోకమందు ధన్యుడు అని హిరణ్యకుడు నిశ్చయించుకొని నిర్జనారణ్యంలో నివాసం చేశాడు.

పొట్టకోసం ఇతరులను పీడించకుండా, తనకు లభించిన దానితో తృప్తిపడి, సంతోషపడేవాడు ధన్యుడని హిరణ్యకుడి అభిప్రాయం. ఇది సరైన అభిప్రాయం. భగవంతుడే మనకు కావలసినవి ఇస్తాడు. అందుచేత పోషణ కోసం ఇతరుల కాళ్ళమీద పడి వారిని యాచించనక్కరలేదు.

రాతిలోని కప్పను దయామయుడైన భగవంతుడు రక్షిస్తున్నాడు. మనం చేసుకొన్న కర్మలను బట్టి మనకు దుఃఖాలు వచ్చినట్లే, కోరకుండానే సుఖాలు వస్తాయి.

హిరణక్యుడు అనే ఎలుక మొదట ధనలోభంతో సంచరించింది. చివరకు సన్యాసి కర్రదెబ్బ తగిలి, తెలివి తెచ్చుకొంది. మనుష్యులు లేని అడవిలో నివసించింది. చివరకు లఘుపతనకం సహాయంతో మంథరుడనే కూర్మరాజు మైత్రి పొందింది. తమకు దొరికిన దానితో ముగ్గురమూ కలసి సుఖంగా ఉందామని మంథరుడు హిరణ్యకునకు నచ్చ చెప్పాడు.

మంథరుడు అమృతం వంటి మాటల వలన తన తాపం పోయిందనీ, తాను ధన్యుడనయ్యానని హిరణ్యకుడు అనుకొన్నాడు. కనుక ధన్యుడు అనే పేరు హిరణ్యకుని వృత్తాంతానికి సరిపోయింది.

ప్రశ్న 6.
హిరణ్యకునిలో ఆలోచనను రేకెత్తించినదెవరు? ఎలా?
జవాబు:
చూడాకర్ణుడు తన స్నేహితుని సలహాతో హిరణ్యకుని కలుగును త్రవ్వాడు. దాని సంపదనంతా కొల్లగొట్టాడు. తర్వాత హిరణ్యకునికి బలం తగ్గింది. ఉత్సాహం కూడా తగ్గింది. ఆహారం కూడా సంపాదించుకొనలేనంతగా నీరసపడింది. నడకలో వేగం తగ్గింది. సంపద పోవడంతో ఆలోచించే అవకాశాన్ని చూడాకర్ణుడు తన చేష్టల ద్వారా కలిగించాడు. ధనము కలవాడే పండితుడు, అతడే బలవంతుడు. ధనమే అన్నింటికీ మూలమన్నాడు చూడాకర్ణుడు.

మూషికం తన సంపదతోపాటు బలాన్ని కూడా కోల్పోయిందని ఆక్షేపించాడు. ధనం లేనివాడికి ఎల్లప్పుడూ బాధగానే ఉంటుంది. నిరంతరం బాధపడడం వలన తెలివి మందగిస్తుంది. తెలివి తగ్గితే అన్ని పనులూ పాడవుతాయి అని దెప్పి పొడిచాడు.

ధనవంతుడికే పౌరుషం చెల్లుతుంది. మేథాసంపద, బంధుమిత్రులు ధనాన్ని బట్టే చేరతారు. భార్యాబిడ్డలు లేని ఇల్లు, మూర్ఖుడి మనసు శూన్యంగా ఉంటాయి. దరిద్రం వలన అంతా శూన్యంగా కనిపిస్తుంది. దరిద్రం కంటె మరణం మంచిది. మరణం చాలా బాధాకరం. జీవితమంతా దరిద్రం అనుభవించడం చాలా కష్టం. డబ్బు లేకుంటే సొంతవాళ్ళే పరాయివాళ్ళు అవుతారు. ఇలా అనేక విధాల తన మాటల ద్వారా హిరణ్యకుని చిత్రవధ చేశాడు.

చూడాకర్ణుని మాటలు, చేష్టలు హిరణ్యకునిలో ఆలోచనలను రేకెత్తించాయి. తనలో తాను ఆలోచించడం ప్రారంభించాడు. ఆ ఆత్మపరిశీలనే జ్ఞానోదయానికి కారణమయ్యింది.

ప్రశ్న 7.
హిరణ్యకుని ఆలోచనా ధోరణిని వివరించండి.
జవాబు:
చూడాకర్ణుడు హిరణ్యకుని సంపదనంతా కొల్లగొట్టాడు. ధనం యొక్క ప్రాధాన్యతని వివరిస్తూ హిరణ్యకుని చాలా కించపరిచాడు. అప్పుడు హిరణ్యకునిలో ఆలోచన మొదలైంది.

అక్కడింక నివసించకూడదనుకొన్నాడు. తనకు జరిగిన అవమానం ఇతరులకు చెప్పుకోవడం మంచిదికాదనే సుభాషితం గుర్తు చేసుకొన్నాడు. దైవం అనుకూలించనపుడు తన పౌరుషం వలన ప్రయోజనం లేదని గుర్తించాడు. వనవాసం మంచిదని తలపోసాడు.

యాచించి బ్రతకడం కంటె వనవాసం మేలనుకొన్నాడు. బ్రతికితే పువ్వులా బ్రతకాలనుకొన్నాడు. యాచన అవమానకరం అనుకొన్నాడు. ఎన్ని విధాల ఆలోచించినా లోభం వదలలేదు. అక్కడే ఉండి మళ్ళీ ధనార్జన చేయాలని సంకల్పించాడు.

కాని, లోభం వలన మోహం పుడుతుంది. మోహం వలన దుఃఖం కలుగుతుంది. దుఃఖం వలన ఆశ్రయం కోల్పోతారు. ఇవేవీ ఆలోచించలేదు. ఇంతలో చూడాకర్ణుడు హిరణ్యకుని పైకి కర్రను విసిరాడు. దైవికంగా ఆ కర్ర దెబ్బ నుండి తప్పించుకొన్నాడు.

అపుడు అతని ఆలోచనలో పరిణతి వచ్చింది. అన్ని ఆపదలకు ధనలోభమే మూలమని గ్రహించాడు. లోభమును విసర్జించినవాడే అన్నీ తెలిసినవాడని తెలుసుకొన్నాడు. వాడు మాత్రమే సుఖపడగలవాడని గ్రహించాడు.

అక్కడి నుండి హిరణ్యకుని ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. అదేమి తన తాతముత్తాతల స్థలం కాదని గ్రహించాడు. అడవికిపోయి బ్రతకవచ్చనుకొన్నాడు.

ఈ విధంగా హిరణ్యకుని ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది.

ప్రశ్న 8.
కావ్యామృత రసపానము, సజ్జ సంగతులను అమృతతుల్యములు అనడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
సంసారము అనే విషవృక్షమునకు, రెండు ఫలములు అమృతముతో సమానమైనవి ఉన్నాయి. అందులో ‘కావ్యామృత రసపానము’ ఒకటి. ‘సజ్జన సంగతి’ రెండవది అని, హిరణ్యకుడు అనే ఎలుక, మంథరుడు అనే తాబేలుతో చెప్పాడు.

సంసారము అంటే మానవుల చావు పుట్టుకలు. మనిషి పుడతాడు, తిరిగి చస్తాడు. తిరిగి పుడతాడు. దీన్నే ‘సంసారము’ అంటారు. ఈ సంసారం, విషవృక్షము వంటిది. వృక్షాలకు కాయలు, పళ్ళు కాస్తాయి. అలాగే సంసారం అనేది విషవృక్షము అనుకుంటే, దానికి రెండు పళ్ళు పుడతాయట. అందులో మొదటిది ‘కావ్యామృత రసపానము’. అనగా మహాకవులు రాసిన మంచి కావ్యాలను చదివి, దానిలోని అమృతం వంటి రసాన్ని ఆస్వాదించడం. రెండవది ‘సజ్జన సంగతి’ అంటే మంచివారితో స్నేహము.

మనిషి పుట్టడం, చావడం అనే సంసారం విషవృక్షము వంటిదయినా, ఆ పుట్టుక వల్ల మనిషికి రెండు ప్రయోజనాలు, అమృతము వంటివి సిద్ధిస్తాయట. అంటే మనిషిగా పుట్టినవాడు, చక్కగా అమృతం వంటి రసం గల మహా కావ్యాలు చదివి ఆనందం పొందవచ్చు. అలాగే మనిషిగా పుట్టి సంసారం చేసేవాడు, మంచివారితో స్నేహం చేసి, దానివల్ల అమృతం వంటి ఆనందం పొందవచ్చునని రచయిత ఉద్దేశ్యము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 9.
‘అర్థములు నిత్యములు కావు. యౌవనము ఝరీవేగతుల్యము’. వీటిని గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారో సోదాహరణంగా రాయండి.
(లేదా)
అర్థములు నిత్యములు కావంటూ – మంధరుడు అన్న మాటలను మీరు ఏవిధంగా సమర్థిస్తారు? (S.A. I – 2019-20)
జవాబు:
‘అర్థములు నిత్యములు కావు’ అంటే ధనము శాశ్వతంగా ఉండదని అర్థము. డబ్బులు సంపాదించినా అది శాశ్వతంగా వాడి వద్ద ఉండవు. ఈ రోజు ధనవంతుడయినవాడు, మరునాటికి బీదవాడు కావచ్చు. పెద్ద పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ పెట్టిన ధనవంతుడికి, పెద్ద నష్టం రావచ్చు. ఫ్యాక్టరీకి ప్రమాదం రావచ్చు.

బ్యాంకులో డబ్బు పెడితే, ఆ బ్యాంకు దివాలా తీయవచ్చు. లేదా అతడి ధనాన్ని దొంగలు అపహరింపవచ్చు. కాబట్టి అర్థములు నిత్యములు కావని రచయిత చెప్పాడు.

‘యౌవనము ఝరీవేగతుల్యము’ అంటే మంచి యౌవన వయస్సు, ప్రవాహవేగం వంటిది. ‘ఝరి’ అంటే సెలయేరు. సెలయేరు వర్షాలు వస్తే పొంగుతుంది. ఆ నీరు కొండ నుండి కిందికి దిగి పోగానే అది ఎండిపోతుంది. యౌవనము కూడా సెలయేరు వంటిది.

రోజు ఉన్న యౌవనం, శాశ్వతంగా ఉండదు. కొద్ది రోజుల్లో మనం అంతా ముసలివాళ్ళం అవుతాము. తరువాత మరణిస్తాము. వయస్సు వేగంగా వెళ్ళిపోతుంది. చూస్తూ ఉండగానే యువకులు వృద్ధులు అవుతారు. సెలయేరు ఎంత వేగంగా వెడుతుందో, వయస్సు కూడా అంతవేగంగా ముందుకుపోతుంది. కాబట్టి మనిషి ధనాన్ని, యౌవనాన్ని నమ్మి ఉండరాదు. అవి వేగంగా పోయేవని గ్రహించి డబ్బు, యౌవనము ఉన్నపుడే మంచిపనులు చేయాలని నేను గ్రహించాను.

ప్రశ్న 10.
చిత్రాంగుని హిరణ్యకుని జీవితచరిత్ర ఆధారంగా దాని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
గమనిక : చిత్రాంగుడి గూర్చి మనకు పాఠములో లేదు. హిరణ్యకుడి గురించి ఉంది (అందుకే హిరణ్యకుడి గురించి ఇవ్వడం జరిగింది.)
జవాబు:
హిరణ్యకుని లోభము :
హిరణ్యకుడు ఒక ఎలుక. అది చూడకర్ణుడనే సన్న్యాసి ఇంట్లో కన్నంలో ఉండి, అతడు దాచిన వంటకాన్ని దొంగిలించి బాగా సంపాదించింది. ఆ సన్న్యాసి, ఈ ఎలుక కన్నాన్ని తవ్వి, అది దాచిన సర్వస్వాన్నీ తీసుకున్నాడు. దానితో హిరణ్యకం దిగులుపడింది. కాని ధనలోభంతో ఆ చోటును విడిచిపెట్టలేదు.

జ్ఞానము – వివేకము :
హిరణ్యకం, అభిమానం కలవాడికి, వనవాసం మంచిదని గ్రహించింది. వివేకం లేనివాడిని సేవించరాదనుకొంది. యాచనా వృత్తి దోషం అనుకుంది. అడవికి వెళ్ళిపోదామని నిశ్చయించింది. కాని ధనలోభం వల్ల దానికి మోహం కలిగి, అక్కడే ఉండి తిరిగి సంపాదిద్దామనుకుంది.

వనవాసము – వైరాగ్యము :
ఒక రోజున హిరణ్యకుడిపై సన్న్యాసి కజ్జును విసిరాడు. దైవవశం వల్ల ఆ దెబ్బ నుండి హిరణ్యకం రక్షించబడింది. దానితో ధనలోభము వల్ల ఆపదలు వస్తాయని అది గ్రహించింది. దొరికిన దానితో సంతోషించేవాడే ధన్యుడని, సుఖవంతుడు అని హిరణ్యకం గుర్తించింది. కోరకుండానే ప్రాణికి దుఃఖాల వలె సుఖాలు కూడా వస్తాయని హిరణ్యకం గుర్తించి, నిర్జనారణ్యంలోకి వెళ్ళింది.

ఈ విధంగా హిరణ్యకుడు మొదట ధనలోభంతో సంచరించాడు. తరువాత తెలివి తెచ్చుకొని, లోభమోహాలను విడిచి, దొరికిన దానితో తృప్తి పడదామని నిర్జనారణ్యంలో నివసించాడు. కాబట్టి హిరణ్యకుడు ధన్యజీవి.

ప్రశ్న 11.
హిరణ్యకుడు మొదట ఎందుకు బలవంతుడు? తరువాత ఎందుకు బలహీనుడయ్యాడో విశ్లేషించండి.
జవాబు:
హిరణ్యకుడు అనే ఎలుక చూడాకర్ణుడు అనే సన్న్యాసి ఇంట్లో కన్నంలో ఉండేది. ఆ సన్న్యాసి తాను తినగా మిగిలిన వంటకాన్ని భిక్షాపాత్రలో పెట్టి చిలుకకొయ్యకు తగిలించేవాడు. హిరణ్యకుడు ఆ వంటకాన్ని భక్షించేవాడు. ఆ విధంగా హిరణ్యకుడు ఎంతో ఆహారాన్ని దాచాడు. దానితో మొదట్లో హిరణ్యకుడు బలవంతుడుగా ఉండేవాడు.

తరువాత ఒకరోజున చూడకర్ణుడు మిత్రుని సలహాపై హిరణ్యకుడి కన్నమును తవ్వి అతడు దాచుకున్న సర్వస్వాన్నీ గ్రహించాడు. దానితో హిరణ్యకుడు బలహీనుడయ్యాడు. అయినా హిరణ్యకుడు ఆ సన్న్యాసి ఇంట్లోనే తిరిగేవాడు. ఒక రోజున సన్న్యాసి హిరణ్యకుడి పై చేతి కణ్ణను విసిరాడు. దానితో హిరణ్యకుడు నిర్జనారణ్యంలోకి నివాసం మార్చాడు. ఈ విధంగా హిరణ్యకుడు బలహీనుడయ్యాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 12.
సజ్జన సాంగత్యము లభించి ధన్యుడైన హిరణ్యకుని వృత్తాంతాన్ని మీ సొంతమాటల్లో వ్రాయండి. (March 2019)
జవాబు:
హిరణ్యకుడు ఒక ఎలుక. ఆ ఎలుక చూడాకర్ణుడు అనే సన్యాసి ఇంటిలో కన్నంలో నివాసము ఉండేది. ఆ సన్యాసి రోజూ తాను తినగా మిగిలిన అన్నాన్ని భిక్షాపాత్రలో పెట్టి దాన్ని చిలుక కొయ్యకు తగిలించేవాడు. ఎలుక చిలుక కొయ్య పైకి ఎగిరి, ఆ అన్నాన్ని తినివేసేది. ఆ ఎలుక ఈ విధంగా ఎంతో సంపాదించింది.

ఒకరోజు చూడాకర్ణుడి ఇంటికి వీణాకర్ణుడు అనే సన్యాసి వచ్చాడు. చూడాకర్ణుడు ఎలుకను తన కజ్జుతో బెదరిస్తున్నాడు. ఎలుక సంగతి చూడాకర్ణుడు, వీణాకర్ణుడికి చెప్పాడు. వీణాకర్ణుడి సలహాపై, చూడాకర్ణుడు ఎలుక కన్నాన్ని తవ్వి, ఎలుక దాచుకున్న దాన్ని తీసుకున్నాడు. దానితో ఎలుక ఆహారము లేక ఇంటిలో తిరుగుతోంది. సన్యాసి ఎలుకపై తన కజ్జను విసిరాడు. అదృష్టవశాత్తు ఎలుక తప్పించుకొని, ఆ ఇంటిపై విరక్తి పెంచుకొని, అడవిలోకి వెళ్ళిపోయింది. మనుష్యులు లేని ఆ అడవిలో ఆ ఎలుకకు కాకితో స్నేహము కుదిరింది. ఆ అడవిలో తినడానికి ఎలుకకు ఏమీ దొరకలేదు. దానితో ఎలుక, తన మిత్రుడైన కాకితోపాటు, కాకికి స్నేహితుడైన మంథరుడి వద్దకు వచ్చింది. కాకి, ఎలుక, మంథరుడు స్నేహితులయ్యారు.

10th Class Telugu 5th Lesson ధన్యుడు Important Questions and Answers

ప్రశ్న 1.
ధన్యుడు కథను చిన్ననాటికగా మలచండి.
జవాబు:
ఏకాంకిక : పాత్రలు 1) హిరణ్యకుడు 2) మంథరుడు

మంథరుడు : మనమంతా సుఖంగా కలసి ఉందాము. దొరికిన దాంతో కాలం గడిపేద్దాం. అది సరే కాని నీవు అడవిలో ఎందుకు ఉన్నావు హిరణ్యకా!

హిరణ్యకుడు : మిత్రమా! మంథరా ! నేను ఒకప్పుడు చూడాకర్ణుడు అనే సన్యాసి ఇంట్లో కన్నంలో ఉండి, అతడు చిలుక కొయ్యమీద దాచుకొన్న వంటకాన్ని తినేదాన్ని.

మంథరుడు : మరి ఏమైంది?

హిరణ్యకుడు : ఇక్కడ ఒకసారి ఆ సన్న్యాసి ఇంటికి వీణాళుడనే సన్న్యాసి వచ్చాడు. చూడాకర్ణుడిచే నా కన్నం త్రవ్వించాడు.

మంథరుడు : అప్పుడు నువ్వు అడవిలో మకాం పెట్టావా?

హిరణ్యకుడు : లేదు. నేను సన్న్యాసి ఇంట్లోనే తిరుగుతున్నా. ఒకరోజు సన్న్యాసి నాపై కర్ర విసిరాడు. అప్పుడు ఉన్న దానితో తృప్తి పడదామని అడవికి వచ్చా. అక్కడే మన మిత్రుడు లఘుపతనకుడితో స్నేహం అయ్యింది.

మంథరుడు : అడవిలో మీ ఇద్దరికీ ఆహారం సరిగ్గా దొరికిందా!

హిరణ్యకుడు : లేదు మిశ్రమా! అందుకే లఘుపతనకం నీ దగ్గరకు నన్ను కూడా తీసుకువచ్చింది.

మంథరుడు : మిత్రమా! హిరణ్యకా! డబ్బు శాశ్వతం కాదు. దాచిన డబ్బు మనతో రాదు. ప్రక్కవాడికి పెట్టి మనం హాయిగా తినాలి. మనం ముగ్గురమూ ఒకరికొకరు సాయం చేసికొంటూ బ్రతికేద్దాం.

హిరణ్యకుడు : మిత్రమా! నీ మాటలు విని నేను ధన్యుణ్ణి అయ్యాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 2.
చిన్నయసూరి కథను చెప్పే విధానాన్ని, రచయిత రచనా విధానాన్ని ప్రశంసిస్తూ మీ గ్రంథాలయంలో చిన్నయసూరి రచనలు పెట్టవలసిన అవసరాన్ని వివరిస్తూ మీ ప్రధానోపాధ్యాయునకు లేఖ వ్రాయండి.
జవాబు:

కర్నూలు,
x x x x x

గౌరవనీయులైన కర్నూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి,
తమ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న 8. వెంకట్ వ్రాయు లేఖ,

అయ్యా !

విషయము : పాఠశాల గ్రంథాలయంలో – చిన్నయసూరి రచనల గూర్చి – విజ్ఞప్తి.

మాకు పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ‘ధన్యుడు’ పాఠం ఉన్నది. దానిని పరవస్తు చిన్నయసూరిగారు రచించారు.

అది కావ్యభాషలో ఉంది. చిన్నయసూరి రచనా శైలి చాలా బాగుంది. మమ్మల్ని ఆ శైలి ఆకట్టుకొంది. కథను చెప్పడంలో చక్కని వేగం ఉంది. ఆ వాక్య నిర్మాణం కూడా చాలా బాగుంది. పదాల ఎన్నికలో అర్థానికి తగినవి ఎన్నుకొన్నారు.

పరివ్రాజకుడు, కాణాచి, పాతకాపు, చెడగరపు బోడవంటి పాతపదాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ కథలోని పాత్రలు అన్నీ జంతువులు. జంతువుల ద్వారా నీతులు చెప్పించడం చిన్నయసూరి ప్రత్యేకత. సంభాషణలలో కూడా నాటకీయత ఉంది.

చిన్నయసూరి ఇలాంటి కథలు ఇంకా చాలా వ్రాశారని మా తెలుగు ఉపాధ్యాయులు చెప్పారు. ఆ కథలన్నీ చదవాలని మాకు చాలా కుతూహలంగా ఉంది.

కనుక మాయందు దయతో చిన్నయసూరి రచనలన్నింటినీ మన పాఠశాల గ్రంథాలయానికి కొనిపించండి.

నమస్కారములు.

ఇట్లు,
తమ విద్యార్థి,
కె. వెంకట్, 10వ తరగతి.

ప్రశ్న 3.
చిన్నయసూరి రచనలను చదవవలసిన అవసరాన్ని తెలియజేస్తూ, అవి చదవమని పాఠకులను కోరుతూ కరపత్రం రూపొందించండి.
జవాబు:

కరపత్రం

పాఠకులారా! తెలుగు పాఠకులారా! చదవండి.

ఈ రోజు టీ.వీ.లను చూడడానికి ఇచ్చిన ప్రాధాన్యం చదవడానికి ఇవ్వటల్లేదు. క్రమంగా పుస్తకాలు చదివే అలవాటుకు దూరమవుతున్నాం. కొన్ని పాత పదాలు మనకు తెలియటం లేదు.

చిలుకకొయ్య, నిదాఘ నదీపూరము, పరివ్రాజకుడు, ఝురీవేగతుల్యము మొదలైన ఎన్నో పాత పదాలు తెలియాలంటే ప్రాచీన రచనలు చదవాలి. చిన్నయసూరి రచనలు చదివితే ఇలాంటి పదాలు తెలుస్తాయి. కథాకథన విధానం తెలుస్తుంది. పాండిత్యం పెరుగుతుంది. మన సంభాషణా చాతుర్యం పెరుగుతుంది.

అందుకే చిన్నయ రచనలు చదవండి. చదివించండి.

ఇట్లు,
పాఠక సమాజం

ప్రశ్న 4.
పరవస్తు చిన్నయసూరి రచనల గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
సూరి రచనల మాధుర్యం

‘చిన్నయ రచనలు పూర్తిగా చదివినవాడే తెలుగు భాషలో సూరి’ అని పెద్దల మాట. తెలుగు భాష సుష్టుగా నేర్చుకొన్నవాడు, సూరి రచనలను వదలలేడు.

పరవస్తు చిన్నయసూరి 1809వ సంవత్సరంలో పెరంబుదూరులో జన్మించాడు. శ్రీనివాసాంబ, వేంకట రంగ రామానుజాచార్యులు వారి తల్లిదండ్రులు.

తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో సూరి పండితుడు. అక్షర గుచ్ఛము, ఆంధ్రకాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్ద లక్షణ సంగ్రహం మొదలైనవి ఆయన రచనలు.

పాఠకులను ఆకట్టుకొనే రీతిలో ఆయన రచనలు సాగుతాయి. ఆయన రచనలు ప్రాచీన కావ్య భాషలో ఉంటాయి. సూరి రచనల్లో చక్కటి నీతులు ఉంటాయి. లోకజ్ఞానం ఉంటుంది. మంచి పదబంధాలుంటాయి. వ్యాకరణ సూత్రాలకి అనుగుణమైన పదప్రయోగాలు మాత్రమే ఉంటాయి. జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా ఉంటాయి. చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణం ఈనాటికే కాదు ఏనాటికైనా ప్రామాణిక వ్యాకరణ గ్రంథమే.

చిన్నయసూరి రచనలు చదివితే, ఇంక ఏ గ్రంథాలు చదవకపోయినా, అపారమైన జ్ఞానం కలుగుతుంది. తెలుగు భాషపై మంచి పట్టు సాధించవచ్చును. అందుకే కనీసం చిన్నయసూరిది ‘నీతిచంద్రిక’నైనా ప్రతి తెలుగువాడూ చదవాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 5.
హిరణ్యకుడు – ఏకపాత్రాభినయం రాయండి.
జవాబు:
నేను హిరణ్యకుడిని. ఈ చూడకర్ణుడి ఇంట్లో వంటకము బాగా దొరుకుతోంది. బాగా సంపాదించా. నేను ఈ చోటును విడిచిపెట్టను. హాయిగా ఉంటాను.

అరే! ఈ సన్యాసి నా కన్నం తవ్వి నేను దాచినదంతా తీసుకున్నాడు. ఏమి చేయను ? నేను ఇంక ఇక్కడ ఉండడం మంచిది కాదు. అభిమానవంతుడు, ఉంటే ఉన్నతంగా బతకాలి లేదా అడవిలో నివాసం ఉండాలి. అడుక్కు తినడం కంటే చావడం మంచిది. అయినా మరికొంత కాలం ఇక్కడే ఉండి చూస్తా.

అబ్బా! ఎంత దెబ్బ కొట్టాడు ఈ సన్న్యాసి నన్ను. నేను ధనలోభం వల్ల ఈ స్థితి తెచ్చుకున్నా. ధనలోభమే అన్ని ఆపదలనూ తెస్తుంది. ప్రాణికి దుఃఖాలులాగే, సుఖాలు కూడా కోరకుండానే వస్తాయి. ఈ స్థలము నా తాతముత్తాతల కాణాచి కాదు. ఈ సన్న్యాసి దెబ్బలు తినడం కన్న, హాయిగా అడవిలో ఉండడం మంచిది. రాతిలో కప్పను పోషించే దేవుడు, నన్ను రక్షించకుండా ఉండడు.

సరే! నిర్జనారణ్యంలోకి పోతా ! వస్తా?

ప్రశ్న 6.
ధన్యుడు పాఠం ఆధారంగా సూక్తులు తయారుచేయండి.
జవాబు:

  1. ధనము కలవాడే బలవంతుడు – పండితుడు.
  2. ధనము సర్వశ్రేయములకు నిదానము.
  3. దారిద్ర్యము కంటే మరణము మేలు. దారిద్ర్యము సర్వశూన్యము.
  4. మానవంతునికి వనవాసము కంటె సుఖము లేదు.
  5. ఒక మ్రుక్కడిని యాచించుటకంటె, నిప్పులోపడి శరీరము విడుచుట మేలు.
  6. వివేకహీనుడయిన ప్రభువును సేవించుటకంటె, వనవాసము ఉత్తమము.
  7. యాచించుకొని బ్రతుకుటకంటే, మరణము శ్రేయము.
  8. సేవా వృత్తి మానమునువలె యాచనా వృత్తి సమస్త గౌరవమునూ హరిస్తుంది.
  9. ధనలోభము సర్వాపదలకూ మూలము.
  10. ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు.
  11. అర్థములు నిత్యములు కావు. యౌవనము ఝరీవేగతుల్యము.
  12. జీవనము బుద్బుదప్రాయము.
  13. అతిసంచయేచ్ఛ తగదు.

10th Class Telugu 5th Lesson ధన్యుడు 1 Mark Bits

1. జ్వలనం అన్ని దిక్కులా వ్యాపించింది – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి. (June 2017)
A) మంట
B) సువాసన
C) దుఃఖం
D) సంతోషం
జవాబు:
A) మంట

2. నా స్నేహితుడు ఉదయం వెళ్లి, సూర్యుడు అస్తమించేటప్పుడు ఇంటికి వచ్చాడు – గీత గీసిన పదాలకు నానార్థ పదాన్ని గుర్తించండి. (June 2017)
A) చంద్రుడు
B) మిత్రుడు
C) పగతుడు
D) ఫలం
జవాబు:
B) మిత్రుడు

3. దేవతలు, రాక్షసులు, పాల కడలి నుండి అమృతమును సాధించారు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి. (June 2017)
A) జీవితాన్నిచ్చేది
B) మరణాన్నిచ్చేది
C) బలాన్నిచ్చేది
D) మరణం పొందింపనిది
జవాబు:
D) మరణం పొందింపనిది

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

4. శివుని మూర్ఖమున గంగ కొలువైనది – (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) (March 2017)
A) తల, నెల
B) నెల, శిరస్సు
C) శిరస్సు, చేయి
D) శిరస్సు, తల
జవాబు:
D) శిరస్సు, తల

5. ధీరులు కర్ణము పూర్తి చేసేవరకు విశ్రమించరు – (గీత గీసిన పదమునకు ప్రకృతిని గుర్తించండి.) (March 2017)
A) కార్యము
B) కార్యక్రమం
C) కష్టం
D) కారణం
జవాబు:
A) కార్యము

6. శాస్త్రము అందరికీ సమ్మతమైనది. అందుకే మనం దానిని గౌరవించాలి – గీత గీసిన పదానికి వికృతి రూపం గుర్తించండి. (June 2018)
A) చుట్టము
B) నష్టము
C) చట్టము
D) కష్టము
జవాబు:
C) చట్టము

7. వివరములోని పాము ఆహారం కోసం బయటకు వచ్చింది – అర్థాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
A) రంధ్రము
B) విషయము
C) పుట్ట
D) నీరు
జవాబు:
A) రంధ్రము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

8. అనృతమును పలుకుట కంటే మౌనము మేలు – పర్యాయ పదాలు గుర్తించండి. ( S.A. I – 2018-19)
A) అసత్యము, అబద్ధము
B) సత్యము, యథార్థము
C) నిజము, కారణము
D) అసత్యము, అకారణము
జవాబు:
A) అసత్యము, అబద్ధము

9. కింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ గుర్తించుము. (S.A. I – 2018-19)
A) తల్లిదండ్రులు
B) ఏడు రోజులు
C) చంపకవతి పట్టణం
D) దైవ ప్రార్థన
జవాబు:
C) చంపకవతి పట్టణం

10. అందుఁ జూడా కర్ణుడను పరివ్రాజకుడు గలడు. (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) అక్కడ చూడాకరుడు అనే సన్యాసి ఉన్నాడు.
B) అక్కడ చూడాకర్ణుడనే వ్యక్తి ఉన్నాడు.
C) అక్కడ చూడాకర్ణుడనే స్వామి గలడు.
D) అందు చూడాకర్ణుడనే సన్యాసి గలడు.
జవాబు:
A) అక్కడ చూడాకరుడు అనే సన్యాసి ఉన్నాడు.

11. ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనయితిని – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2017)
A) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.
B) ఆ పరివ్రాజకుడు చెప్పగా విని ఖిన్నుడనయ్యానా?
C) ఆ పరివ్రాజకుడు చెప్పగా విని బాధపడలేదు.
D) ఆ సన్యాసి చెప్పగా విని ఖిన్నుడను కాలేదు.
జవాబు:
A) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

12. జీవనము బుద్బుద ప్రాయము – ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి. – (June 2018)
A) జీవనము బుద్బుదంతో సమానం కాదు.
B) జీవనం బుద్బుద ప్రాయం.
C) బుద్బుద ప్రాయం జీవనమే.
D) జీవితం బుద్బుదప్రాయమే.
జవాబు:
B) జీవనం బుద్బుద ప్రాయం.

13. అనృతమాడుట కంటె మౌనము మేలు. (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (S.A. I – 2018-19)
A) అనృతమాడుట కంటెను మౌనమ్ము మేలు.
B) అనృతం ఆడడం కంటే మౌనం మేలు.
C) అనృతంబాడుట కంటె మౌనము మేలు.
D) అనృతమ్మాడుట కంటె మౌనంబు మేలు.
జవాబు:
B) అనృతం ఆడడం కంటే మౌనం మేలు.

14. ప్రత్యక్ష ఫలం ప్రజాసముదాయం చేత కోరబడదు. (కర్తరి వాక్యం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలం కోరింది.
B) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలమును కోరుతోంది.
C) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలాన్ని కోరదు.
D) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలం కోరగలదు.
జవాబు:
C) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలాన్ని కోరదు.

15. “నాకు వసింప తగదు”, అని హిరణ్యకుడన్నాడు. (పరోక్ష కథనం గుర్తించండి) (S.I. I – 2018-19)
A) తను వసించనని హిరణ్యకుడన్నాడు.
B) తనకు వసింప తగదని హిరణ్యకుడన్నాడు.
C) తనకు వసించడం తగవని హిరణ్యకుడన్నాడు.
D) తనకు వసించుట ఇష్టం లేదని హిరణ్యకుడన్నాడు.
జవాబు:
B) తనకు వసింప తగదని హిరణ్యకుడన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

16. చంపకవతి అను పట్టణము గలదు. (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. I – 2018-19)
A) సంయుక్త వాక్యం
B) చేదర్థక వాక్యం
C) సామాన్య వాక్యం
D) సామార్థ్యార్థక వాక్యం
జవాబు:
D) సామార్థ్యార్థక వాక్యం

చదవండి – తెలుసుకోండి

భారతదేశం కథా సాహిత్యానికి ప్రసిద్ధిపొందింది. ప్రాచీన కాలం నుండే భారతీయ సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన కథలు ఎన్నో ఉన్నాయి. విష్ణుశర్మ అనే పండితుడు అమరశక్తి అనే రాజు కొడుకులను వివేకవంతులను చేయడానికి పంచతంత్ర కథలను బోధిస్తాడు. అవే కథా రూపంలో వ్యాప్తి చెందాయి. వీటిని దాదాపు 200 భాషల్లోకి అనువదించారు.

ఈ పంచతంత్ర కథలు మిత్రలాభం, మిత్రభేదం, కారోలూకీయం (సంధి, విగ్రహం), లబ్దప్రణాశం, అపరీక్షితకారకం (అసంప్రేక్షకారిత్వం) అనే భాగాలుగా ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించినవారిలో ముఖ్యులు చిన్నయసూరితో పాటు కందుకూరి వీరేశలింగం. వీరేశలింగం పంతులు సంధి, విగ్రహం అనే భాగాలను తెలుగులోకి అనువదించారు. ఈయన వీటితో పాటు రాజశేఖర చరిత్ర, ఆంధ్రకవుల చరిత్ర అభాగ్యోపాఖ్యానం మొదలైన గ్రంథాలను, శతకాలను, నాటకాలను రాసి గద్య తిక్కనగా ప్రసిద్ధికెక్కాడు. స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేశారు. సంఘసంస్కర్తగా పేరు పొందాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 4th Lesson వెన్నెల

10th Class Telugu 4th Lesson వెన్నెల 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
రాత్రి అనే ఆలోచన రానీక చీకటి అనే పేరు విననీక ‘వెన్నెల’ ను వర్ణించిన కవిని గురించి తెల్పండి. (March 2017)
(లేదా)
చంద్రోదయాన్ని అత్యంత మనోహరంగా వర్ణించిన “వెన్నెల” పాఠ్యభాగ ‘కవి పరిచయం’ వ్రాయండి. (March 2019)
జవాబు:
వెన్నెల పాఠ్యభాగం ఎఱ్ఱన గారు రచించారు. ఆయన తల్లి పేరు పోతమాంబిక, తండ్రి పేరు సూరనార్యుడు. ఆయన 14వ శతాబ్దం ప్రథమార్ధంలో జీవించారు. ఎఱ్ఱన గురువుగారి పేరు శంకరస్వామి. ఎఱ్ఱనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు కలవు.

ప్రశ్న 2.
ఎఱ్ఱన రచనల గురించి వ్రాయండి.
జవాబు:
ఎఱ్ఱన ఆంధ్రమహాభారతంలోని అరణ్యపర్వశేషం రచించాడు. హరివంశం, నృసింహపురాణం, రామాయణం మొ||నవి రచించాడు.

ఆంధ్రమహాభారతంలోని అరణ్య పర్వశేషాన్ని రాజరాజ నరేంద్రునికి అంకితమిచ్చాడు. హరివంశం, రామాయణాలను ప్రోలయవేమారెడ్డికి అంకితమిచ్చాడు. నృసింహపురాణమును అహోబిల నృసింహస్వామికి అంకితమిచ్చాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
ఎఱ్ఱన రచనా వైశిష్ట్యాన్ని వివరించండి.
జవాబు:
ఎఱ్ఱన రచనలలో వర్ణనలు అధికంగా కనిపిస్తాయి. ఆయన రచించిన నృసింహపురాణంలో ‘అష్టాదశ (18) వర్ణనలు’ ఉన్నాయి. తరువాతి కాలంలో వర్ణనాత్మక కావ్యాలు రావడానికి ఎఱ్ఱన వర్ణనలే కారణం. అందుచేతనే ఎఱ్ఱనను ‘ప్రబంధ పరమేశ్వరుడు’ అని సాహితీలోకం గౌరవించింది.

ఎఱ్ఱన నృసింహపురాణం యొక్క ప్రభావం బమ్మెర పోతన భాగవతంపై ఎక్కువగా కనిపిస్తుంది. పోతన భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలో ఎఱ్ఱన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని పరిశోధకులు నిరూపించారు.

ప్రశ్న 4.
‘కాటుక గ్రుక్కినట్టి కరవటంబున జగదండ ఖండమమెరె’ ఈ మాటలు కవి ఏ సందర్భంలో పేర్కొన్నాడో వివరించండి. ఈ పోలికను విశ్లేషించండి.
జవాబు:
సంధ్యా సమయం తర్వాత విశ్వమంతా చీకటి వ్యాపించిందని చెబుతున్న సందర్భంలో కవి ఈ మాటలను పేర్కొన్నాడు.

చీకటిలో భూమి, ఆకాశం, దిక్కులూ అన్నీ కలిసి పోయాయి. అప్పుడు బ్రహ్మాండ ఖండం కాటుక నింపిన పెద్ద భరిణెలా ఉందన్నాడు. బ్రహ్మాండంలో 14 లోకాలుంటాయి. పై లోకాలు 7. క్రింది లోకాలు 7. మధ్యలోనిది భూలోకం. చీకటి కేవలం భూగోళానికి మాత్రమే ఏర్పడింది. అందుకే పైన, క్రింద సమానమైన మూతలు గల భరిణెతో భూగోళాన్ని పోల్చాడు. దీనిద్వారా ఎఱ్ఱనగారి పరిశీలనా దృష్టి, లోకజ్ఞానం వ్యక్తమౌతున్నాయి.

ప్రశ్న 5.
ఈ పాఠంలో కవి వెన్నెలను వర్ణించడానికి ఏయే అంశాలను ఎన్నుకొన్నాడు?
జవాబు:
ఆకాశమనే చెట్టు దిక్కులనే కొమ్మలతో, వెలుగులీనే నక్షత్రాలనే పూలతో ప్రకాశిస్తోందన్నాడు. అప్పుడే ఉదయిస్తున్న చంద్రుడు తన కిరణములనే చేతులతో ఆ ఆకాశపు చెట్టుకున్న నక్షత్రాలనే పూలను కోయడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నాడు. ఈ పద్యంలో వెన్నెలను వర్ణించడానికి చెట్టు, కొమ్మలు, పూలు, బాల్యచేష్టలు అనే అంశాలను కవి ఎన్నుకొన్నాడు.

‘వెన్నెల వెల్లి ….’ అనే పద్యంలో వెన్నెల ప్రవాహాన్ని పాలసముద్రంతో పోల్చాడు. చంద్రుడిని ఆదిశేషువుతో పోల్చాడు. చంద్రునిలోని మచ్చను శ్రీమహావిష్ణువుతో పోల్చాడు.

ఈ పద్యంలో తెల్లని వెన్నెలను తెల్లటి పాలసముద్రం ఎన్నుకొని పోల్చాడు. అలాగే తెల్లని చందమామను పోల్చడానికి నల్లటి మచ్చను పోల్చడానికి నల్లని విష్ణువును ఎన్నుకొన్నాడు.

ప్రశ్న 6.
పతిభక్తికి ఆదర్శం పద్మిని అని ఎలా చెప్పగలవు?
జవాబు:
మహా తేజస్సంపన్నుడైన సూర్యుని చూసిన కంటితో అల్పమైన తేజస్సు గల ఇతరులను చూడడానికి మనస్సు అంగీకరించదు. అందుకే కదిలెడి తుమ్మెదలనెడు కనుగ్రుడ్లు గల గొప్పదైన పద్మము అనెడు తన కంటిని వెంటనే మూసుకొన్నది.

ఎంతటి మహా పతివ్రతయైన పరపురుషుని కనీసం చూడనైనా చూస్తుంది. కానీ, పద్మిని మాత్రం కనీసం పరపురుషుని చూడడానికి కూడా అంగీకరించలేదు. అందుకే పద్మిని పతిభక్తికి ఆదర్శం. సూర్యోదయంకాగానే కమలాలు వికసిస్తాయి. సూర్యాస్తమయం కాగానే పద్మాలు ముడుచుకొంటాయి. ఇది లోక సహజం.

ప్రశ్న 7.
బాలచంద్రుడెలా ఉన్నాడు?
జవాబు:
పిల్లలకు ప్రాకడం సహజ లక్షణం. ఎక్కడైనా మెరుస్తున్నవి కనిపిస్తే, అవి లాగడం కూడా సహజమే.

అలాగే ఆకాశంలోని చంద్రుడు కూడా ఉన్నాడు. ఆకాశమే పెద్ద చెట్టులాగ ఉంది. దిక్కులు దానికి కొమ్మలులా ఉన్నాయి. నక్షత్రాలు కొమ్మల చివర పువ్వులులా ఉన్నాయి. అప్పుడే ఉదయించిన బాలచంద్రుడు తన పొడవైన కరములతో ఆ నక్షత్రాలనే పువ్వులు కోయడానికి ప్రయత్నిస్తున్నట్లున్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

ప్రశ్న 8.
వెన్నెలెలా ఉంది?
జవాబు:
వెన్నెల పాలసముద్రంలాగా తెల్లగా ఉంది. అది విజృంభించి దిక్కులన్నీ ముంచుతోంది. రజనీకరబింబం ఆదిశేషువులాగా తెల్లగా ఉంది. చంద్రునిలోని నల్లని మచ్చ ఆదిశేషునిపై పవ్వళించిన శ్రీమహావిష్ణువులా ఉంది.

పాలసముద్రంలో శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై పవ్వళిస్తాడు. ఈ సందర్భాన్ని వెన్నెలతో సమన్వయం చేస్తూ ఎఱ్ఱనగారు అద్భుతమైన కల్పన చేశారు.

ప్రశ్న 9.
పడమటి దిక్కును ఎఱ్ఱని తెరతో పోల్చడం సరైనదేనా? ఎందుకు?
జవాబు:
సాయం సమయంలో సూర్యుడు అస్తమిస్తాడు. సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు పడమటి దిక్కుకు వెడతాడు. అప్పుడు సూర్యబింబం చాలా ఎర్రగా ఉంటుంది. అప్పుడు సూర్యుని కాంతి కిరణాలు కూడా ఎరుపురంగులో ఉంటాయి. ఆ సూర్యకాంతికి పడమటి దిక్కంతా ఎర్రగా అవుతుంది. .

సాధారణంగా తెరలు తెలుపురంగులో ఉంటాయి. ఆయా సన్నివేశాలకు తగినట్లు తెరపైకి కాంతిని ప్రసరింపచేస్తూ, రంగులు మార్చడం నాటకాలలో సహజం. ఇక్కడ కూడా నాట్యం చేసే నిశాసతికి తగినట్లుగా పడమటి దిక్కు అనే తెర ఎరుపురంగులో ఉంది అనడం’ అద్భుతమైన ఊహ.

ప్రశ్న 10.
లోకంలో చీకటి అలుముకున్న సందర్భాన్ని కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
కవి ఎట్టా ప్రెగ్గడ ‘వెన్నెల’ పాఠంలో చీకటి యొక్క వ్యాప్తిని ఇలా వర్ణించాడు. సంధ్యాకాలం తరువాత చీకట్లు లోకమంతా వ్యాపించాయి. ఆ చీకటిలో భూమి, ఆకాశం, దిక్కులు అన్నీ ఒకటిగా కలిసిపోయాయి. అప్పుడు బ్రహ్మాండ ఖండము, కాటుక నింపిన పెద్ద బరిణె ఏమో అన్నట్లు ఉంది. అంటే అధికమైన చీకట్ల రాశీ వల్ల, దిక్కులు, భూమి, ఆకాశం ఒకదానిలో ఒకటి కలిసి పోయాయి. విశ్వము బాగా కాటుక నింపిన బరిణె ఏమో అన్నట్లు నల్లగా కనిపించిందని కవి వర్ణించాడు.

10th Class Telugu 4th Lesson వెన్నెల 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
రాత్రి అనే ఆలోచన రానీయక, చీకటి అనే పేరును విననీయక ఆనంద తరంగంలా విస్తరించిన వెన్నెల విజృంభణను మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
చంద్రుడు ఉదయించాడు. వెన్నెల ప్రవాహం పాలసముద్రంలా పొంగి ఆకాశాన్ని ముంచెత్తింది. చంద్రబింబం ఆ పాలసముద్రంలో గుండ్రంగా చుట్టుకొన్న ఆదిశేషుడి శయ్యలా, చంద్రుడిలోని మచ్చ ఆ శయ్య మధ్యన ఉన్న విష్ణువులా కనబడింది.

ఆ వెన్నెలలో కలువల రేకులు విచ్చుకున్నాయి. కలువ పూలలో తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. తుమ్మెదలకు విందు చేస్తూ పూల పరిమళాలు బయలుదేరాయి.

చంద్రకాంత శిలల వానలతో, చకోరాల రెక్కల స్పర్శలతో, స్త్రీల చిరునవ్వుల కాంతులతో అతిశయించి, దిక్కులన్నింటినీ ముంచెత్తి వెన్నెల సముద్రంలా వ్యాపించింది. ఆ వెన్నెల అనే సముద్రపు నీటి నుండి చంద్రుడు ఆవిర్భవించాడు.

ఆ విధంగా అందంగా, గంభీరంగా, నిండుగా చంద్రుని వెన్నెల వ్యాపించింది.

అది రాత్రి అనే ఆలోచనను రానీయలేదు. చీకటి అనే పేరు విననీయలేదు. అవ్యక్తం అనే అనుమానాన్ని కలిగించలేదు. ఆ వెన్నెల కళ్ళకు అమృతపు జల్లులా, శరీరానికి మంచి గంధంలా, మనసుకు ఆనంద తరంగంలా విజృంభించింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

ప్రశ్న 2.
పద్యభావాలను ఆధారంగా చేసుకొని పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి.
జవాబు:

  1. సాటిలేని కాంతి గల సూర్యుని చూచినట్లుగా అల్ప తేజస్సు కలవానిని చూడలేనని సాయంసంధ్యలో కమలం కళ్లు (రేకులు) మూసుకొన్నది.
  2. నక్షత్రాలనే పూలతో అలంకరింపబడిన ఆకాశమనే వేదికపై నాట్యం చేయడానికి రాత్రి అనే స్త్రీకి ఏర్పరచిన ఎఱ్ఱని పరదా వలె పడమటి దిక్కు శోభించింది.
  3. ఇంతలో ఆకాశం, భూమి, దిక్కులు ఒక్కటి చేస్తూ చీకటి, ప్రపంచాన్ని కాటుక భరిణిగా మార్చింది.
  4. అంతలో తూర్పున చంద్రుడు ఉదయించాడు. అప్పుడు చంద్రబింబం చీకటి అనే పిశాచపు బాధా నివారణకు ముల్లోకాలనెడు స్త్రీ ధరించిన ఎఱ్ఱని బొట్టువలె ఉంది.
  5. రాత్రి అనెడు స్త్రీ తూర్పు దిక్కుకు ఇచ్చిన ఎఱ్ఱని గురువింద పూసల దండవలే శశిబింబం ఉంది.
  6. ఐరావతం మూపురంపై ఉన్న ఎఱ్ఱని అలంకారంలా, ఇంద్రసభలోని మాణిక్యదీపంలా నెలవంక గోచరించింది.
  7. తెల్లకలువ అనురాగ రసంతో నింపిన మాత్రవలె కన్పించింది.
  8. స్త్రీలకు ఉత్సాహం పెంచే ఔషధపు ముద్దలా మెరిసింది.
  9. అలా అలా చంద్రుడు పెరుగుతూ ఉన్నాడు.
  10. ఆకాశమనే వృక్షానికి గల దిక్కులనే కొమ్మలలోని నక్షత్రాలనే పూలు కోయడానికి తన కరములతో ఉత్సాహంగా ఆకాశంలో పాకుతున్నాడు.
  11. వెన్నెలనే పాల సముద్రంతో దిశలు, ఆకాశం ముంచుతున్న నెలవంక శేషపాన్పులా కనువిందు చేసింది.
  12. చంద్రునిలోని మచ్చ విష్ణువువలె కన్పించింది.
  13. ఆ పండు వెన్నెలలో కలువలు బాగా వికసించి, వెన్నెలకు పరవశిస్తూ కొంట్రొత్త సువాసనలు వెదజల్లుతూ నేత్రపర్వం చేస్తున్నాయి.
  14. వెన్నెల అనే సముద్రం చంద్రకాంత శిలలను తడుపుతూ, చక్రవాకపక్షుల రెక్కల వేగం పెంచుతూ, విరబూసిన కలువలను ఆకర్షిస్తూ, అనేక విధాల అందగించింది.
  15. అందంతో రాత్రి అనే ఆలోచన రానివ్వక వెన్నెల చూచేవారి కళ్లకు అమృతాభిషేకం చేస్తోంది.
  16. వెన్నెల తన గంభీరతతో చీకటి అనే పేరు విననివ్వక శరీరానికి గంధపు వర్షం అవుతోంది.
  17. ధీరమైన వెన్నెలను చూస్తే పరమాత్మ కూడా గుర్తుకు రాడు.
  18. ఎందుకంటే వెన్నెలను చూస్తుంటే అంతరాత్మకు బ్రహ్మానందం కలుగుతుంది.
  19. ఈ విధంగా కళ్లకు, శరీరానికి, ఆత్మకు ఆనందకారకమైంది వెన్నెల.
  20. ఈ వర్ణన ఎఱ్ఱన కవిత్వంలో కలికితురాయి.

ప్రశ్న 3.
సాయం సంధ్యా సమయంలో ఆకాశం ఎలా ఉందని కవి వర్ణించాడు? అది ఎంతవరకు సమంజసం?
జవాబు:
సూర్యుడు అస్తమించేటపుడు ప్రకృతిని పరిశీలిస్తే మొదట జరిగేది కమలాలు ముడుచుకొంటాయి. అస్తమించే సూర్యునికాంతి వన్నె తగ్గుతుంది. ఆ కాంతిలో వెచ్చదనం తగ్గుతుంది. అందుకే కమలాలు ముడుచుకొంటాయి.

ప్రకృతి సహజమైన దీనిని కవిగారు భార్యాభర్తల సంబంధంతో పోల్చారు. మహా తేజోవంతుడైన సూర్యుని చూసిన కంటితో అల్పతేజస్కులను చూడడానికి అంగీకరించదన్నట్లు పద్మిని తన కమలపు కంటిని మూసుకొన్నది అని చక్కగా వర్ణించారు.

సూర్యుడు పూర్తిగా పడమటి దిక్కుకు చేరి క్రిందకు అస్తమిస్తుంటే పడమటి దిక్కు ఎర్రబారుతుంది. పడమటి దిక్కు ఒక ఎర్రని తెరలా కవిగారు ఊహించారు. ఆ తేర వద్ద నటించడానికి రాత్రి అనే స్త్రీకి ఆకాశమనే వేదిక అలంకరించబడింది. కాలపురుషుడే సూత్రధారి, దిక్పాలకులే ప్రేక్షకులు.

అంటే సూర్యాస్తమయంతో ఒక అంకం ముగిసిపోయింది. క్రొత్త అంకానికి తెరలేచింది. ఇది ఒక అత్యద్భుతమైన నాటక రంగంగా కవి కల్పించాడు. సూర్యుడి అస్తమయంతో ఒక పెద్ద వెలుగు ఆకాశమనే రంగస్థలం నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయింది.

రంగస్థలంపై ఎవరైనా కళాకారుడు ఉండాలి తప్ప, వేదిక ఖాళీగా ఉండకూడదు. వెలుగు ఖాళీ చేస్తే ఆ ప్రదేశాన్ని చీకటి ఆక్రమించడం సహజం.

క్రమేణా చీకటి దట్టంగా అలుముకొంది. ఆకాశం, నేల, దిక్కులు అన్నీ చీకటితో నిండిపోయాయి. బ్రహ్మాండంలో , భాగమైన భూగోళం ఒక కాటుక నిండిన భరిణెలా ఉందని ఎఱ్ఱనగారు ఊహించారు.

కవిగారి ఊహ చాలా సమంజసంగా ఉంది.

ప్రశ్న 4.
వెన్నెల వ్యాపించిన విధానాన్ని విశ్లేషించండి.
జవాబు:
వెన్నెల వ్యాపించిన విధానాన్ని ఎఱ్ఱనగారు చక్కగా వర్ణించారు. చంద్రుని ఒక చిన్నబాలుడుగా వర్ణించాడు. చిన్న పిల్లలకు చెట్లెక్కడం సరదా. పూలు, పళ్ళు కోయాలని చేతులు చాపడం సహజం. అది బాల్య చాపల్యం.

ఇక్కడ చంద్రుడు కూడా పుట్టి కొద్దికాలమే అయింది. అందుచే ఆకాశమనే చెట్టు పైకి ప్రాకాడు. దిక్కులనే కొమ్మలకు పూసిన నక్షత్రాలనే చుక్కలను కోయడానికి తన కరములు చాపాడు అని ఎర్రనగారు వర్ణించారు.

చీకటి పడగానే నక్షత్రాలు ఆకాశంలో రావడం సహజం. ఆ తరువాత చంద్రకిరణాలు ఆకాశంలోకి వ్యాపిస్తాయి. చంద్రకిరణాలు వ్యాపించే కొద్దీ వెన్నెల కాంతి పెరుగుతూ ఉంటుంది. వెన్నెల కాంతి పెరుగుతుంటే నక్షత్రాల కాంతి మసకబారుతూ ఉంటుంది. ఇది సహజం. దీనినే ఎర్రనగారు తన ఊహాబలంతో చాలా చక్కగా వర్ణించారు.

తరువాత పద్యంలో వెన్నెలను పాల సముద్రంతో పోల్చారు. చంద్రుడిని ఆదిశేషువుతో పోల్చారు. చంద్రుడిలోని నల్లని మచ్చను శ్రీమహావిష్ణువుతో పోల్చారు.

నిజానికి చంద్రుడి వలన వెన్నెల వ్యాపించింది. అది చంద్రుడిని మించిపోతుంది. చంద్రుడు ఆకాశంలో మాత్రమే కనిపిస్తాడు. వెన్నెల ప్రపపంచమంతా నిండిపోతుంది. దేనికైనా ఆవలి ఒడ్డు, ఈవలి ఒడ్డు ఉంటుంది. కాని అనంతమైనది సముద్రం. సముద్రంలో ఎటుచూసినా నీరే కనిపిస్తుంది. పాలసముద్రంలో ఎటుచూసినా తెల్లదనమే కనిపిస్తుంది. అలాగే ప్రపంచమంతా తెల్లటి వెన్నెలతో నిండిపోయింది.

పాలసముద్రంలో ఆదిశేషుడులా చంద్రుడు కనిపించాడు. ఆదిశేషువు తెలుపు. చంద్రుడు తెలుపే. కాని, చంద్రునిలో నల్లటి మచ్చను కూడా కవి వదలలేదు. అదే మహాకవుల లక్షణం. ఆ మచ్చను శ్రీమహావిష్ణువుతో పోల్చి తన చతురత నిరూపించారు ఎఱ్ఱనగారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

ప్రశ్న 5.
వెన్నెల పాఠ్యాంశం ఆధారంగా ఎఱ్ఱన రచనా శైలిని విశ్లేషించండి.
జవాబు:
ఎఱ్ఱన వర్ణనలకు గీటురాయి వంటిది వెన్నెల పాఠం. సూర్యాస్తమయం జరిగినపుడు పద్మాలు ముడుచుకోవడం ప్రకృతిలో సాధారణమైన విషయం. కాని, అసమానమైన సూర్యుని చూసిన కంటితో ఇతరులను చూడడానికి అంగీకరించని పద్మిని తన పద్మమనే కంటిని మూసుకొన్నదని చక్కటి వర్ణన చేశాడు. పద్మాన్ని పద్మినీ జాతి స్త్రీతో పోల్చాడు. భార్యాభర్తల సంబంధాన్ని చక్కగా వర్ణించాడు.

‘సురుచిర తారకాకుసుమ శోభి’ అనే పద్యంలో సంధ్యాసమయంలో ఎఱ్ఱబడిన పడమటి దిక్కును పెద్ద తెరతో పోల్చాడు. ఆకాశాన్ని వేదికగా ఊహించాడు. నక్షత్రాలను పుష్పాలుగా ఊహించాడు. కాలమును సూత్రధారిగా భావించాడు. దిక్పాలకులను ప్రేక్షకులను చేశాడు. రాత్రిని నాట్యకత్తెగా మార్చాడు. ఈ పద్యంలో కూడా ఎఱ్ఱన వర్ణనాత్మక శైలిని ప్రదర్శించాడు.

‘దట్టమైన చీకటిని కాటుక భరిణెతో పోల్చి తన పరిశీలనాదృష్టిని ప్రదర్శించాడు.

అప్పుడే ఉదయిస్తున్న చంద్రుడు తన కరములతో ఆకాశమనే వృక్షమునకు గల దిక్కులనే కొమ్మలకు ప్రాకుతూ నక్షత్రాలనే పూలను కోయడానికి ప్రయత్నిస్తున్నాడని వెన్నెల రావడాన్ని చక్కగా వర్ణించాడు.

ఇదే విధంగా ప్రతి పద్యంలోనూ ఎఱ్ఱనగారు తన ప్రత్యేకతను నిరూపించుకొన్నారు.

ప్రశ్న 6.
సూర్యాస్తమయానికి, చంద్రోదయానికి మధ్య కాలాన్ని కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
“పద్మిని, తన ప్రియుడయిన గొప్ప తేజస్సు కల సూర్యుడిని చూసిన తన కళ్ళతో, అల్ప కాంతికల పరపురుషులను చూడడం తగదన్నట్లుగా, కదలుతున్న తుమ్మెద అనే నల్లగ్రుడ్డు కల పద్మం వంటి తన కన్నును మూసుకుందని” కవి వర్ణించాడు. అంటే సూర్యాస్తమయం కాగానే పద్మాలు ముడుచుకున్నాయని పద్మాలలో తుమ్మెదలు చిక్కుకున్నాయని భావం. పద్మాలు ముడుచుకోవడం, అవి తమ పతి భక్తిని ప్రదర్శించడానికా అన్నట్లు ఉందని కవి వర్ణించాడు.

  1. రాత్రి అనే స్త్రీ చేయబోయే నాట్యానికి, రంగస్థలం మీద కట్టిన ఎఱ్ఱరంగు తోపు తెరవలె, పడమటి దిక్కున ఆకాశంలో సంధ్యారాగం కనబడింది.
  2. చుక్కలతో కూడిన ఆకాశం, పువ్వులతో అలంకరించిన నాట్య రంగస్థలం వలె కన్పడింది.
  3. రాత్రి అనే స్త్రీ ‘నర్తకి’ వలె ఉంది.
  4. కాలము అనేది నాటక సూత్రధారుడు వలె ఉంది. అంటే సంధ్యాకాలమయ్యింది. పడమటి దిక్కున ఆకాశం ఎఱుపురంగులో కనబడుతోంది. ఆకాశంలో నక్షత్రాలు ఉదయించాయి. రాత్రి వస్తోంది. రాత్రి తన చీకటిని అంతా వ్యాపింప చేస్తుందని కవి తెలిపాడు.

ప్రశ్న 7.
చంద్రోదయానికి ముందు ప్రకృతి ఎలా ఉందో వివరించండి.
జవాబు:
1) చంద్రుడు, దిక్కులు అనే కొమ్మలను, తన పొడవైన కిరణాలు అనే చేతులతో పట్టుకొని, పైకి లేచి, ఆకాశము అనే చెట్టు యొక్క నక్షత్రాలు అనే పువ్వులను కోయడం కోసమేమో అన్నట్టు ఆకాశంలోకి పాకాడు. అంటే చంద్రుడి , కాంతి, ఆకాశం అంతా వ్యాపించిందని భావము.

2) వెన్నెల ప్రవాహం పాలసముద్రంలా పొంగి అన్ని దిక్కులనూ, ఆకాశాన్ని ముంచెత్తింది. అప్పుడు చంద్రబింబం, ఆ పాలసముద్రంలో గుండ్రంగా చుట్టుకొన్న ఆదిశేషుడి శయ్యను ఏర్పాటు చేసినట్లు ఉంది. చంద్రుడిలోని నల్లని మచ్చ ఆదిశేషువు శయ్యపై మధ్యలో ఉన్న విష్ణుమూర్తివలె కనబడింది.

అంటే చంద్రుడి వెన్నెల పాలసముద్రంలా కనబడింది. చంద్రబింబం, పాలసముద్రంలో విష్ణుమూర్తి నిద్రించే శేషుని పానుపు వలె కనిపించింది. చంద్రుడిలోని నల్లని మచ్చ, ఆదిశేషువుపై నిద్రించిన నీలవర్ణుడైన విష్ణువువలె కన్పించిందన్న మాట.

ప్రశ్న 8.
కవి వెన్నెలను ఏయే అంశాల ఆధారంగా వర్ణించాడు?
జవాబు:
కవి ఎట్టి ప్రెగ్గడ, వెన్నెలను వర్ణించడానికి క్రింది వస్తువులను ఎన్నుకొన్నాడు.

  1. వెన్నెల పాలసముద్రంలా తెల్లగా వ్యాపించిందన్నాడు.
  2. నిండు వెన్నెలలో కలువ పువ్వురేకులు విచ్చుకున్నాయని చెప్పాడు.
  3. వెన్నెలకు చంద్రకాంత శిలలు కరిగి, జడివానలు కురిశాయన్నాడు.
  4. చకోరపక్షులు, తమ రెక్కలతో వెన్నలను స్పృశించాయన్నాడు.
  5. వెన్నెల, స్త్రీల అందమైన చిఱునవ్వుల కాంతి వలే ఉందన్నాడు.
  6. వెన్నెల, సముద్రజలంలా వ్యాపించిందన్నాడు.
  7. చూసే వారి కళ్ళకు వెన్నెల, అమృతపు జల్లులా, శరీరానికి పూసిన మంచిగంధపు పూతలా ఉందన్నాడు.
  8. వెన్నెల చూసే వారి మనస్సులకు ఆనంద తరంగము వలె ఉందన్నాడు.

ప్రశ్న 9.
వెన్నెల వ్యాపించినపుడు ప్రకృతిలో కలిగిన మార్పులేమి?
జవాబు:
చంద్రోదయము :

  1. చంద్రుడు ఉదయించాడు. వెన్నెల ప్రవాహం, పాలసముద్రంలా పొంగి ఆకాశాన్ని ముంచెత్తింది.
  2. చంద్రబింబం, ఆ పాలసముద్రములో గుండ్రంగా చుట్టుకొన్న ఆదిశేషుడి పానుపులా, చంద్రుడిలోని మచ్చ, ఆ శయ్యపై ఉన్న విష్ణువులా కనబడింది.
  3. ఆ వెన్నెలలో కలువటేకులు విచ్చుకున్నాయి. కలువపూలలో తేనెలు పొంగి, కెరటాలుగా విజృంభించాయి. తుమ్మెదలకు విందు చేస్తూ పూల పరిమళాలు వ్యాపించాయి.
  4. చంద్రకాంత శిలలు కరిగిన జడివానలతో, చకోరాల టెక్కల స్పర్శలతో, స్త్రీల చిఱునవ్వుల కాంతులతో అతిశయించి, దిక్కులన్నింటిలో ముంచెత్తి, వెన్నెల సముద్రంలా వ్యాపించింది. ఈ విధంగా అందంగా, గంభీరంగా, నిండుగా చంద్రుని వెన్నెల వ్యాపించింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

ప్రశ్న 10.
చంద్రోదయానికి ముందు, తరువాత జరిగిన మార్పులను వివరించండి.
జవాబు:
చంద్రోదయానికి ముందు మార్పులు :

  1. సూర్యుడు అస్తమించాడు.
  2. పద్మములు ముడచుకున్నాయి.
  3. తుమ్మెదలు ఆ పద్మాలలో చిక్కుపడ్డాయి.
  4. పడమటి దిక్కున సంధ్యారాగం కనబడింది.
  5. ఆకాశంలో నక్షత్రాలు ఉదయించాయి.
  6. చీకటి బాగా పెరిగి, దిక్కులూ, భూమ్యాకాశాలు దానిలో కలిసి పోయాయి.
  7. విశ్వం, కాటుక నింపిన బరిణెయా అన్నట్లు కనబడింది.

చంద్రోదయము తరువాత జరిగిన మార్పులు :

  1. చంద్రుడు ఉదయించగానే, వెన్నెల ప్రవాహం పాలసముద్రం వలె పొంగి ఆకాశాన్ని ముంచెత్తింది.
  2. చంద్రబింబం, ఆ పాలసముద్రంలో చుట్టచుట్టుకొన్న ఆదిశేషువు శయ్యవలె కనిపించింది.
  3. చంద్రుడిలోని మచ్చ, ఆ శయ్య మధ్యన ఉన్న విష్ణువువలె కనబడింది.
  4. వెన్నెలలో కలువరేకులు విచ్చుకున్నాయి. కలువలలో తేనెలు ఉప్పొంగాయి.
  5. పువ్వుల పరిమళాలు వ్యాపించాయి. 6) చంద్రకాంత శిలలు కరిగి జడివానలు కురిశాయి.
  6. చకోరాల లెక్కల స్పర్శలతో, స్త్రీల చిరునవ్వుల కాంతులతో అతిశయించి, వెన్నెల దిక్కులన్నింటినీ ముంచెత్తి, సముద్రంలా వ్యాపించింది.

10th Class Telugu 4th Lesson వెన్నెల Important Questions and Answers

ప్రశ్న 1.
నీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
చంద్రోదయము
1) “చెరువులో నీరు గాలికి తిరుగుచుండె
కలువపుష్పాలు వికసించి కనులు తెరిచె
పూల గంధాల మధుపాలు మురియుచుండె
చంద్రకాంతులు వ్యాపించే జగము నిండ”

2) దివిని చుక్కల పూవులు తేజరిల్లె
రాత్రి సతికట్టె నల్లని రంగు చీర
చంద్రుని రాకకు జగమంత సంతసించె
విశ్వమంతకు వెన్నెల విందు చేసె

ప్రశ్న 2.
మీ పాఠం (వెన్నెల) ఆధారంగా ఎఱ్ఱన రచనా శైలిని వివరిస్తూ మీ తండ్రిగారికి లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్టణము,
x x x x x.

పియ్రమైన నాన్నగార్కి,

నమస్కారములు. ఉభయకుశలోపరి. అమ్మకు నమస్కారాలు చెప్పండి. ఈ మధ్య మాకు ఎఱ్ఱన కవి రచించిన నృసింహపురాణంలోని వెన్నెల పాఠాన్ని చెప్పారు. వెన్నెల పాఠంలో అద్భుతమైన వర్ణనలు ఉన్నాయి. ఈ పద్యాలలో ఎఱ్ఱా ప్రెగ్గడ కవి, సంధ్యాకాలాన్ని, చంద్రోదయాన్ని బాగా వర్ణించాడు. మీకు కవిత్వం అంటే ఇష్టమని ఇది రాస్తున్నా.

సూర్యుడిని చూసిన కళ్ళతో పరపురుషులను చూడ్డానికి ఇష్టపడని పద్మిని, కళ్ళు మూసుకుందని పద్మము, సాయంత్రం వేళ ముడుచుకోవడాన్ని చక్కగా ఎఱ్ఱన వర్ణించాడు.

మరో పద్యంలో ఆకాశాన్ని రంగస్థలంతో పోల్చాడు. కాలాన్ని నాటకంలో సూత్రధారిగా చెప్పాడు. దిక్పాలకులను నాటక ప్రేక్షకులుగా వర్ణించాడు. సంధ్యాకాలంలోని ఆకాశాన్ని తోపురంగు నాటకం తెరగా వర్ణించాడు.

ఎఱ్ఱన గారి వర్ణన శైలి అద్భుతము. అందుకే ఎఱ్ఱన గారిని ‘ప్రబంధ పరమేశ్వరుడు’ అంటారు. వర్ణనలు చేయడంలో ఎఱ్ఱన కవికి సాటి మరి లేరని నా నమ్మకం. మీరు కూడా చదవండి. లేఖ రాయండి. ఉంటా.

మీ ప్రియపుత్రుడు, / పుత్రిక,
రంగనాథ్. / శ్యామల.

చిరునామా:
కె. రమణగారు,
ఇంటినెంబరు 3. 216,
గాంధీనగర్, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 3.
వెన్నెలను వర్ణిస్తూ కవిత వ్రాయండి.
జవాబు:
“వెన్నెలా ! కన్నెపిల్లల చిన్నారి ముద్దుల చెల్లెలా !
వెన్నెలా ! ప్రేమికుల మనసుల మల్లెచెండులా
వెన్నెలా ! చంద్రుని చిరునవ్వుల పన్నీరులా
వెన్నెలా ! పసిపాపల ముద్దుల బోసి నవ్వులా
వెన్నెలా ! కన్నతల్లుల కమనీయ రాగవెల్లిలా
వెన్నెలా ! మా చిన్నారి పొన్నారి చెల్లెలా
వెన్నెలా ! కలువల చుట్టపు చూపులా
వెన్నెలా ఉన్నావు, చల్లావు చంద్రికలు
నయనారవిందాల నయగార మధురిమలు”

ప్రశ్న 4.
వర్ణన ఎలా ఉంటుందో తెలిసింది కదా! ఉషోదయ కాలం నుండి రాత్రి నిండుపున్నమి వెన్నెల వచ్చే వరకు రోజంతా ఆకాశంలో జరిగే మార్పుల్ని గురించి వర్ణిస్తూ రాయండి.
జవాబు:
ఉషోదయ కాలంలో ఆకాశంలో వేగుచుక్క కనిపిస్తుంది. అక్కడక్కడ చుక్కలు కనబడతాయి. క్రమంగా తూర్పు దిక్కున సూర్యబింబం ఎఱ్ఱని పెద్ద బంతిలా కనబడుతుంది. తెల్లవారేక సూర్యోదయం తూర్పుదిశలో జరుగుతుంది.

ఎండ ఎక్కిన కొద్దీ సూర్యకిరణాలు కరకరలాడుతాయి. మధ్యాహ్నం వేళ సూర్యుడు నడినెత్తిమీదికి వస్తాడు. క్రమంగా సూర్యుడు పడమటి దిశకు జారుతాడు. అక్షాశంలో పడమటి దిశలో పేదరాశి పెద్దమ్మ కుంకుమ ఆరబోసుకున్నట్లు ఆకాశం ఎరుపెక్కుతుంది. సూర్యబింబం ఎరుపు ఎక్కుతుంది.

సాయంత్రం 7 గంటలకు ఆకాశంలోని నక్షత్రాలు ఉదయిస్తాయి. చంద్రబింబం ఎఱుపుగా కనబడుతుంది. చంద్రోదయం కాగానే చల్లదనం ప్రాణాలకు హాయిని ఇస్తుంది. మేఘాల కదలికలో చంద్రబింబం ప్రయాణిస్తున్నట్లు ఉంటుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

ప్రశ్న 5.
ఎఱ్ఱన రచించిన వెన్నెల పాఠంలోని వర్ణనలు నీకెందుకు నచ్చిందో వివరిస్తూ నీ మిత్రునికి లేఖ వ్రాయి.
జవాబు:

అమలాపురం,
x x x x x

ప్రియమిత్రుడు శేఖర్ కు,
నీ మిత్రుడు రాజేష్ వ్రాయులేఖ.

నేను బాగా చదువుచున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావనుకొంటున్నాను. నేను ఈ లేఖలో ‘వెన్నెల’ పాఠం గురించి వ్రాస్తున్నాను.

వెన్నెల పాఠంలోని ఎఱ్ఱన గారి వర్ణనలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా మొదటి పద్యంలో సూర్యుడిని చూసిన కళ్ళతో ఇతరులను చూడడానికి ఇష్టం లేని పద్మిని తన కమలపు కన్నును మూసుకొందని వర్ణించిన తీరు నాకు చాలా నచ్చింది. సూర్యస్తమయం అయినపుడు కమలాలు ముడుచుకోవడం సహజం. దానిని చక్కగా భార్యాభర్తల అనురాగంతో పోల్చిన ఎఱ్ఱనగారి చతురత నాకు నచ్చింది.

రెండవ పద్యంలో ఆకాశాన్ని రంగస్థలంతో పోల్చారు. కాలమును సూత్రధారిగా ఊహించారు. దిక్పాలకులను ప్రేక్షకులను చేశారు. రాత్రిని నాట్యకత్తెగా భావించారు. ఎఱ్ఱబారిన పడమటి దిక్కును పెద్ద తెరగా ఊహించారు.

సాయంకాలపు సంధ్యా సమయాన్ని ఇంత బాగా ఊహించిన కవి మరొకరు లేరేమో అనిపిస్తుంది.

నాకు మాత్రం వెన్నెల పాఠంలోని ప్రతి పద్యం చాలా సచ్చింది. ఆ అద్భుతమైన వర్ణనలు ఎవరికైనా నచ్చుతాయిలే.

అందుకే ఎఱ్ఱనను ప్రబంధ పరమేశ్వరుడన్నారని మా గురువుగారు చెప్పారు.

నీకు ఏ పాఠం నచ్చిందో వ్రాయి. ఎందుకు నచ్చిందో వివరంగా వ్రాయి. ఇక ఉంటా మరి.

ఇట్లు
నీ స్నేహితుడు,
పి. రాజేష్,

చిరునామా:
కె. శేఖర్, నెం. 8,
బి. సెక్షన్, 10వ తరగతి,
జి.ప. ఉ. పాఠశాల,
సత్తెనపల్లి, గుంటూరు జిల్లా.

10th Class Telugu 4th Lesson వెన్నెల 1 Mark Bits

1. దేవతలు దివి నుండి భువికి దిగి వచ్చారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. (June 2017).
A) సముద్రం
B) పాతాళం
C) ఆకాశం
D) చీకటి
జవాబు:
C) ఆకాశం

2. నెమలి ఎగిరి వచ్చి పామును పట్టి చంపింది – గీత గీసిన పదాలకు నానార్థ పదాన్ని గుర్తించండి. (June 2017)
A) వనం
B) ఫలం
C) కులం
D) కుండలి
జవాబు:
D) కుండలి

3. వెన్నెల అన్ని దెసలకు వ్యాపించింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి. (June 2017)
A) దిశ
B) దేశం
C) దివాణం
D) దిక్కు
జవాబు:
A) దిశ

4. ‘UUU’ గుర్తులు గల గణమేది ? (June 2017)
A) య గణం
B) ర గణం
C) మ గణం
D) త గణం
జవాబు:
C) మ గణం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

5. రజనీకర బింబమును చూస్తే పిల్లలు ఆనందిస్తారు – (గీత గీసిన పదమునకు అర్థమును గుర్తించుము.) (March 2017)
A) సూర్యబింబము
B) చంద్రబింబము
C) ప్రతిబింబము
D) ఆకాశం
జవాబు:
B) చంద్రబింబము

6. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధాసక్తులు కల్గియుండాలి – (గీత గీసిన పదము ఏ సమాసమో గుర్తించుము. ) (March 2017)
A) కర్మధారయం
B) బహుబ్లిహి
C) తత్పురుషం
D) ద్వంద్వము
జవాబు:
D) ద్వంద్వము

7. ఉత్పలమాల పద్యంలో యతిస్థానం గుర్తించండి. (March 2017)
A) 14వ అక్షరం
B) 10వ అక్షరం
C) 13వ అక్షరం
D) 11వ అక్షరం
జవాబు:
B) 10వ అక్షరం

8. దెసలను కొమ్మ లొయ్య నతిదీర్ఘములైన కరంబులన్ బ్రియం – ఏ పద్యపాదమో గుర్తించండి. (March 2017)
A) ఉత్పలమాల
B) శార్దూలం
C) చంపకమాల
D) మత్తేభం
జవాబు:
C) చంపకమాల

9. భూరుహములు జీవులకు ప్రాణవాయువును ఇస్తున్నాయి – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి. (June 2018)
A) నదులు
B) సముద్రాలు
C) చెట్లు
D) పర్వతాలు
జవాబు:
C) చెట్లు

10. కష్టాలు మిక్కుటమైనందున, రైతులు ప్రభుత్వ సహాయం కొరకు ఎదురుచూస్తున్నారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి. (June 2018)
A) అధికం, సమానం
B) క్షామం, మితం
C) ఎక్కువ, అధికం
D) తక్కువ, పరిమితం
జవాబు:
C) ఎక్కువ, అధికం

11. దినకరుడు రాగానే లోకమంతా చైతన్యమౌతుంది. అందుకే సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం – గీత గీసిన పదాలకు పర్యాయపదాన్ని గుర్తించండి. (June 2018)
A) స్నేహితుడు
B) చంద్రుడు
C) ధనికుడు
D) ఇనుడు
జవాబు:
D) ఇనుడు

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

12. ప్రతి పాదంలో ఒక సూర్యగణం + రెండు ఇంద్రగణములు + రెండు సూర్యగణములు క్రమముగా ఉండే పద్యము పేరు గుర్తించండి. (June 2018)
A) కందం
B) సీసము
C) తేటగీతి
D) ఆటవెలది
జవాబు:
C) తేటగీతి

13. వెన్నెల పిండారబోసినట్లుండటం శరత్కాలపు లక్షణం – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి. (March 2018)
A) కౌముది, జ్యోత్స్న
B) చీకటి, తమస్సు
C) కోరిక, కాంక్ష
D) నిశి, నుసి
జవాబు:
A) కౌముది, జ్యోత్స్న

14. ఎటువంటి పరిస్థితిలోనైన ధర్మం వీడరాదు. (వికృతి గుర్తించండి) (S.N. I – 2018-19)
A) దమ్మం
B) దరమం
C) దరుమం
D) దరువుం
జవాబు:
A) దమ్మం

15. మానవునిచే ప్రకృతి ఒడి పాఠశాలగా చేసుకోబడింది. (కర్తరి వాక్యం గుర్తించండి.) (June 2017)
A) మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకున్నాడు.
B) మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకోలేదు.
C) మానవునిచే ప్రకృతి,పాఠశాలగా చేసుకోబడింది.
D) మానవుడు ప్రకృతిలో పాఠశాల నిర్మించాడు.
జవాబు:
A) మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకున్నాడు.

16. చంద్రుడిలోని మచ్చ విష్ణువులాగ కనిపిస్తూ అలరింపబడుతున్నది – కర్తరి వాక్యం గుర్తించండి. (June 2018)
A) చంద్రుడిలోని మచ్చ విష్ణువులాగా కనిపిస్తూ అలరిస్తున్నది.
B) చంద్రుడిలోని మచ్చ విష్ణువులాగ అలరించడం లేదు.
C) చంద్రుడిలోని మచ్చ శివునిలాగ కనిపిస్తోంది.
D) చంద్రుడిలోని మచ్చ విష్ణువనే భ్రాంతి కలిగిస్తోంది.
జవాబు:
A) చంద్రుడిలోని మచ్చ విష్ణువులాగా కనిపిస్తూ అలరిస్తున్నది.

17. వెన్నెల రాత్రిని పగలుగా మారుస్తున్నది – వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. (June 2018)
A) చీకటి రాత్రిని పగలుగా మారుస్తున్నది.
B) వెన్నెల రాత్రిని పగలుగా మార్చడం లేదు.
C) వెన్నెల పగలును రాత్రిగా మారుస్తున్నది.
D) వెన్నెల రాత్రిని రాత్రిగానే ఉంచుతుంది.
జవాబు:
B) వెన్నెల రాత్రిని పగలుగా మార్చడం లేదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

18. వెన్నెల కాలంలో రాత్రింబవళ్లు వెలుగుంటుంది. (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.N. I – 2018-19)
A) చేదగ్ధక వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) నిషేధార్థక వాక్యం
జవాబు:
C) సంయుక్త వాక్యం

19. వానలు వస్తే పంటలు పండుతాయి. (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.I. I – 2018 -19)
A) సంయుక్తం
B) చేదర్థకం
C) సామర్థ్యార్థకం
D) విధ్యర్థకం
జవాబు:
B) చేదర్థకం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 3rd Lesson జానపదుని జాబు

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
జానపదుని జాబు రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
జానపదుని జాబు పాఠమును డా|| బోయి భీమన్నగారు రచించారు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురులో జన్మించారు. వారు 1911 నుండి 2005 వరకు జీవించారు.

వీరు కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. 1940-45 వరకు ఉపాధ్యాయునిగా పనిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. వీరు డిశంబరు 16వ తేదీ, 2005న మరణించారు.

ప్రశ్న 2.
జానపదుని జాబు రచయిత ఎవరు? ఆయన రచనా వ్యాసంగాన్ని గూర్చి వ్రాయండి.
జవాబు:
జానపదుని జాబు పాఠమును డా॥ బోయి భీమన్న గారు రచించారు.

ఆయన తన 11వ ఏట నుండే రచనలు చేశారు. “గుడిసెలు కాలిపోతున్నాయి”, పాలేరు, జానపదుని జాబు, పిల్లీ శతకం, ఉశారులు, ధర్మం కోసం పోరాటం, రాగవైశాఖి మొదలైన 70 రచనలు చేశారు.

ఆయన రచించిన పాలేరు నాటకం ప్రభావంతో ఎంతోమంది పేదలు, దళితులు తమ పిల్లలను పాలేరు వృత్తి మాన్పించి పాఠశాలలో చేర్పించారు. ఈ నాటకం స్ఫూర్తితో ఎంతోమంది ఉన్నత విద్యావంతులయ్యారు. ఉన్నతోద్యోగులు అయ్యారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 3.
జానపదుని జాబు రచయిత ఎవరు? ఆయన అందుకొన్న పురస్కారాలేవి?
జవాబు:
జానపదుని జాబు పాఠమును డా|| బోయి భీమన్నగారు రచించారు. ఆయన రచించిన గుడిసెలు కాలిపోతున్నాయ్ రచనకు 1975లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం 1973లో పద్మశ్రీ బిరుదునిచ్చింది. 2001లో పద్మభూషణ్ బిరుదునిచ్చి గౌరవించింది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చింది.

1978+84 మధ్య రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి సభ్యత్వం ఇచ్చి బోయి భీమన్న గారిని గౌరవించింది. 1991లో . రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ వారు రాజ్యలక్ష్మీ అవార్డును ఇచ్చి సత్కరించారు.

ప్రశ్న 4.
పల్లెటూరి జీవితం ఎలా ఉంటుందో తెలపండి.
జవాబు:
పల్లెటూరి జీవితం ఎంతో మనోహరంగా ఉంటుంది. అక్కడ చక్కని గాలి, ఎండ, నీరు దొరుకుతుంది. పాలు, కూరగాయలు దొరుకుతాయి. మంచి అందమైన చేలూ, కాలువలూ ఉంటాయి. అక్కడ ప్రకృతి మనోహరంగా ఉంటుంది. కాని, ఆధునిక సదుపాయాలు ఏవీ అక్కడ ఉండవు. అక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తారు. ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు.

ప్రశ్న 5.
రచయిత పాత్ర స్వభావాన్ని రాయండి.
జవాబు:
గ్రామీణ నేపథ్యాన్ని ఇష్టపడతాడు. పేద కుటుంబీకుడు. తన కుటుంబంతో చాలా అనుబంధం గలవాడు. పట్నవాసులంతా సుఖంగా ఉంటారనే అపోహ కలవాడు. రైతు కుటుంబం. తోటి రైతుల కష్టాలలో పాలుపంచుకొనే స్వభావం కలవాడు. పల్లెటూరి ప్రజలపై ప్రేమ కలవాడు. పల్లెటూరిపై మమకారం కలవాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 6.
జానపదుని జాబు” పాఠ్యభాగ నేపథ్యం గురించి రాయండి.
జవాబు:
చదువుకొని బీదతనం వలన చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనులలో మునిగిపోయిన ‘జానపదుడు’ శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను, గ్రామాలలోని పరిస్థితులను లేఖల రూపంలో తెలుపుటయే జానపదుని జాబు పాఠ్యభాగ నేపథ్యము.

ప్రశ్న 7.
సమాచార సాధనమైన ‘లేఖ’ను గురించి వివరించండి. (March 2018)
జవాబు:

  1. సమాచారాన్ని చేరవేసే సాధనం లేఖ.
  2. కొన్ని సందర్భాలలో ప్రత్యేక సాహితీ లక్షణాలను, విలువలను కలిగి ఉంటుంది.
  3. లేఖలు ఆయాకాలాలకు సంబంధించినవే అయినా, కొన్నిసార్లు అందులోని విషయాలు అన్ని కాలాలకు వర్తిస్తాయి.
  4. లేఖలు వ్యక్తిగత లేఖలు, అధికారిక లేఖలు, వ్యాపారాత్మక లేఖలు అని ప్రధానంగా మూడు విధాలుగా ఉంటాయి.

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘బద్దకం’ గురించి మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
‘బద్దకం’ అంటే పనిచేయడానికి వెనుకాడడం. అంటే మాంద్యము. సోమరిపోతులయిన వారు ఏ పని చేయడానికీ ముందుకు రారు. వారికి పనిచేయడానికి బద్దకం. తగిన పని, చేతిలో లేకపోతే పనిమంతులకు కూడా బద్దకం వస్తుంది.

నగరాలలో వారికి చేతిలో ఏదో పని ఉంటుంది. గ్రామాలలో రైతులకు కొన్ని రోజుల్లోనే పని ఎక్కువగా ఉంటుంది. కొన్ని రోజుల్లో ఏ పనీ ఉండదు. అప్పుడు వారు ముడుచుకొని మంచము ఎక్కి పడుకుంటారు. లేదా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.

కాని ‘బద్దకం’ మంచి లక్షణం కాదు. పిల్లలు బడికి వెళ్ళడానికి, పాఠం చదవటానికి, ఇంటి పని చేయడానికి బద్దకిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చెయ్యాలి. బద్దకం విడిచి చురుకుగా పనులు చేస్తే మంచి ఆరోగ్యం ఉంటుంది. బద్దకం, సంజ నిద్ర, పనికిరాదని సుమతీ శతకం చెపుతోంది. ముఖ్యంగా యువత, బద్దకం, విడిచి తమ పనులు సకాలంలో సాగిస్తే దేశం సౌభాగ్యవంతం అవుతుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 2.
బద్దకం వదలాలంటే ఏమి చేయాలో వివరించండి.
జవాబు:
‘బద్దకం’ అంటే పని చేయడానికి ముందుకు రాకపోవడం. పని బద్ధకులకు అభివృద్ధి ఉండదు. బద్దకం వదలాలంటే రాత్రి పెందలకడనే నిద్రపోవాలి. ఉదయం సూర్యోదయం కాకుండానే లేవాలి. నడక, పరుగు, వంటి వ్యాయామాలు చేయాలి. పిల్లలు, పెద్దలకు ఇంటి పనుల్లో సాయం చేయాలి. చక్కగా స్నానం చేయాలి. పిల్లలు సాయం సమయంలో ఆటలు ఆడాలి. హాయిగా గొంతువిప్పి పాటలు పాడాలి.

పిల్లలు బద్దకంగా టి.విల ముందు కూర్చుండి, సీరియల్సు చూస్తూ ఉండరాదు. ఆడపిల్లలు తల్లుల పనిలో సాయం చేయాలి. మగపిల్లలు తండ్రికి పనిలో సాయం చేయాలి. అలా చేస్తే తండ్రి చేసే వృత్తి పనులు వారికి అలవాటు అవుతాయి.

పిల్లలు బద్దకం విడిచి చక్కగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వారు యోగా, వ్యాయామము వంటి వాటిలో పాల్గొంటూ, ఆటపాటలలో పాల్గొంటూ మంచి చురుకుగా, ఉత్సాహంగా ఉండాలి. అటువంటి చురుకైన యువతవల్లే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి అవుతుంది.

ప్రశ్న 3.
కాలం ఎలా విలువైందో నిరూపించు.
జవాబు:
‘కాలము’ విలువ అయింది. గడచిన క్షణం, తిరిగి రాదు. ప్రతి వ్యక్తి తాను చేయవలసిన పనిని సకాలంలో చేయాలి. రేపు . చేద్దాం అనుకుంటే, ఒక రోజు అతడి జీవితంలో వ్యర్థం అయినట్లే.

మన ఆయుర్దాయం చాలా పరిమితంగా ఉంటుంది. మనం ఎంత కాలం బ్రతుకుతామో మనకు తెలియదు. దేవుడిని ప్రార్థించేందుకు తిరిగి మనకు సమయం దొరకదు. బ్రతికి ఉండగానే దైవపూజ చేయాలి. చేయవలసిన పనులు పూర్తి చేయాలి. ఒక పరీక్షకు సిద్ధపడే వ్యక్తి ఏ రోజుకు ఆ రోజు చదివి సిద్ధం కావాలి. రేపు అనే మాట ఉండరాదు. అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడుపుకోవాలి. ఆడవలసిన కాలంలో ఆడాలి. వ్యాయామం చేయవలసిన కాలంలో వ్యాయామం చేయాలి.

డాక్టరుగారు నిత్యం వ్యాయామం చేసి ఉన్నట్లయితే గుండె రోగం వచ్చి ఉండేది కాదంటారు. అప్పుడు మనం పశ్చాత్తాప పడతాం. కాని జరిగి పోయిన కాలాన్ని మనం వెనుకకు తీసుకురాలేము. ఎంత డబ్బు ఇచ్చినా, జరిగిపోయిన కాలాన్ని ఒక్క నిమిషం కూడా తిరిగి తీసుకురాలేము.

కాబట్టి కాలం ప్రాధాన్యాన్ని గుర్తించి, సకాలంలో ప్రతి పనినీ పూర్తి చేసి జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి. గ్రామాల్లో రైతులు సకాలంలో పొలం పనులు చేపట్టాలి. సకాలంలో పురుగుమందులు చల్లాలి. లేకపోతే పొలంలో పంట, నాశనం అవుతుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 4.
పల్లెల్లో నివసించే వారందరూ నిజంగా సుఖపడుతున్నారని భావిస్తున్నారా?
జవాబు:
పల్లెలు నిజానికి సౌఖ్యనిలయాలు. పల్లెల్లో మంచి పాడిపంటలు ఉంటాయి. తాజాకూరగాయలు, చల్లని, కలుషితం కాని గాలి లభిస్తుంది. ప్రతి ఇల్లు ముగ్గులతో, పూల తోరణాలతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రామాలలో ఆవులు, గేదెలు ఇచ్చే తాజా పాలు లభిస్తాయి. అక్కడ కల్మషం లేని ప్రజల పలకరింపులు దొరుకుతాయి. పల్లె ప్రజలు పరస్పరం ఒకరికి , మరొకరు సాయం చేసుకుంటారు. పల్లెల్లో మంచి తాజాపళ్ళు, కూరలు లభిస్తాయి.

కాని గ్రామాలలో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ముఖ్యంగా వాటికి రోడ్లు, ప్రయాణసౌకర్యాలు ఉండవు. విద్య, వైద్య సదుపాయాలు ఉండవు. కావలసిన వస్తువులు అన్నీ అక్కడ దొరకవు. సరుకులకై నగరాలకు వెళ్ళాలి. చదువులకు నగరాలకు వెళ్ళాలి. రోగం వస్తే మంచి డాక్టర్లు పల్లెల్లో ఉండరు. విద్యుచ్ఛక్తి కూడా 24 గంటలూ అక్కడ లభించదు. కొత్త బట్టలు వగైరా కావాలంటే నగరాలకు పల్లెవాసులు వెళ్ళాలి.

కాబట్టి పల్లెల్లో నివసించే వారందరూ నిజంగా సుఖపడుతున్నారని మనం భావించకూడదు. పల్లె ప్రజల కష్టాలు పల్లెవాసులకు ఉన్నాయి. పల్లె ప్రజలకు తగిన విశ్రాంతి ఉండదు. 24 గంటలు శ్రమిస్తేనే కాని వారికి కూడు, గుడ్డ దొరకదు.

ప్రశ్న 5.
పల్లెటూరి జీవితం హాయిగా ఉంటుందని ఎలా చెప్పగలవు?
జవాబు:
పల్లెటూళ్ళలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చక్కని గాలి, ఎండ, నీరు, ఆహారము ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. అక్కడ చక్కని ప్రకృతి శోభ ఉంటుంది. పచ్చని పొలాలు కలకలలాడుతూ, గాలికి తలలాడిస్తూ గ్రామ ప్రజలను సుఖసంతోషాలతోముంచెత్తుతాయి.

ప్రజలందరికీ పాడి పంటలు ఉంటాయి. పొయ్యి కిందికీ, పొయ్యి మీదికీ వారికి కావలసినవన్నీ అక్కడే దొరుకుతాయి. గ్రామంలో చేతివృత్తుల వారు ఒకర్ని ఒకరు, అన్నదమ్ములుగా భావిస్తూ పరస్పరం ఒకరికొకరు సాయపడతారు.

పల్లెల్లో ఒకరి ఇంట్లో పెళ్ళయితే, ఊరందరికీ అది పండుగ. పల్లెల్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముగ్గులు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా తీర్థాలూ సాగుతాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటివేషధారులూ, వారి చక్కని పాటలూ ఆనందాన్ని ఇస్తాయి.

గ్రామీణులు ఆనందంగా నవ్వుతూ కలకలలాడుతూ ఒకరిని ఒకరు బంధుత్వంతో పలకరించుకుంటూ, కష్టసుఖాల్లో అందరూ పాలు పంచుకుంటారు. గ్రామాలు పాడిపంటలకు నిలయాలు. అవి ప్రకృతి రమణీయతకు పుట్టిళ్ళు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 6.
శ్రమదోపిడి గురించి రచయిత ఉద్దేశ్యమేమిటి?
జవాబు:
సామాన్యంగా గ్రామాల్లో భూకామందులు, తమకున్న పొలాలను తాము సేద్యం చేసుకోకుండా గ్రామాల్లోని బీద రైతులకు కౌలుకు ఇస్తుంటారు. ఆ బీద రైతులు ధనికుల పొలాలను కౌలుకు తీసుకొని, కష్టపడి సేద్యం చేస్తుంటారు. రాత్రింబగళ్ళు కష్టపడి పండించిన ధాన్యాన్ని భూకామందులకు వారు కౌలుగా వారికి చెల్లిస్తారు. మిగిలిన ధాన్యాన్ని వారు తింటారు. కాని సామాన్యంగా కౌలు రైతులకు ఏమీ మిగలదు. భూకామందులు, బీద రైతుల శ్రమను దోపిడీ చేయడం క్రింద వస్తుంది.

బీదరైతులు శ్రమపడి పండించిన ఫలసాయాన్ని భూకామందులు దోచుకుంటున్నారన్నమాట నిజానికి శ్రమపడేవానికి ఫలాన్ని తినే హక్కు ఉంటుంది. కాని ఇక్కడ శ్రమ ఒకరిది, ఫలం మరొకరిది అవుతోంది.
దీనినే దృష్టిలో ఉంచుకొని రైతులు కష్టపడుతున్నారని, కాని దాని ఫలితం ఇనాందారుకు లభిస్తోందని చెప్పడమే ఇక్కడ రచయిత ఉద్దేశ్యమై ఉంటుంది.

ప్రశ్న 7.
పల్లె ప్రజల కష్టాలను వివరించండి.
జవాబు:
పల్లెలలో ప్రజలు కష్టపడి పంటలు పండిస్తారు. ఒకప్పుడు వర్షాలు ఉండవు. చేలకు నీళ్ళను తోడాలి. ఒకప్పుడు తోడుకోవడానికి సైతం వారికి నీళ్ళు దొరకవు. ఒక్కొక్కసారి అతివృష్టి, ఒక్కొక్కసారి అనావృష్టి సంభవిస్తుంది.

వారి మోటర్లకు రాత్రింబవళ్ళు విద్యుచ్ఛక్తి ఉండదు. పాడిపశువులకు మేత లభించదు. రాత్రివేళల్లో కూడ చేనుకు నీరు పెట్టడానికి వారు వెళ్ళాల్సివస్తుంది. చీడపీడలకు పురుగుమందులు చల్లాలి. ఒకప్పుడు వారికి అవి ప్రమాదాన్ని తీసుకువస్తాయి.

చక్కగా పండిన పంట, ఒక్కరోజు పురుగు పట్టి తినేస్తుంది. ఇనాందార్లకు కౌలు చెల్లించాక రైతుకు ఫలసాయం మిగలదు. ఒక్కొక్కసారి కాలం కలసివస్తే పంట మిగులుతుంది. కాని రైతుకు దానికి తగిన ధర లభించదు.

రైతు పండించిన పంటలను వర్తకులు చౌకగా కొంటారు. కాని రైతుకు కావలసిన ఎరువులు వగైరా ఎక్కువ ధరకు కాని దొరకవు. పల్లె ప్రజలకు విద్యావైద్య సదుపాయాలు ఉండవు. వారికి రోడ్డు, బస్సు సౌకర్యాలు ఉండవు. ప్రతి వస్తువు కోసం నగరాలకు వెళ్ళాలి. రోగం వస్తే వారు నగరాలకు బళ్ళ పై రోగులను తీసుకువెళ్ళాలి. ఒకప్పుడు మోసుకు వెళ్ళాల్సివస్తుంది.

ఈ విధంగా పల్లెల్లో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 8.
పల్లెల ప్రగతికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏవి?
జవాబు:
పల్లెలు బాగుపడాలంటే రైతులకు కావలసిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు చౌకగా వారికి అందించాలి. గ్రామాల్లో వ్యవసాయంతో పాటు, పాడి పరిశ్రమ అభివృద్ధి కావాలి. రైతులకు ప్రభుత్వం విత్తనాలు మంచివి చౌకధరలకు ఇవ్వాలి. తక్కువ వడ్డీకి బ్యాంకులు వారికి ఋణాలు ఇవ్వాలి.

రైతులు తోటల్లో పశుగ్రాసాన్ని పెంచుకోవాలి. వారు పాడి పశువులను పెంచి, పాల ఉత్పత్తులను మంచి ధరలకు అమ్ముకోవాలి. రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు లభించాలి. రైతులు కూరగాయలను పెంచాలి.

గ్రామాల్లో ప్రజలకు విద్యావైద్య సదుపాయాలు కల్పించాలి. ప్రతి గ్రామానికి మంచినీటి కుళాయిలు, రోడ్లు, విద్యుచ్ఛక్తి సదుపాయం ఉండాలి. ప్రతి గ్రామానికి నగరాలకు పోవడానికి బస్సులు ఉండాలి. పల్లె ప్రజలు సంఘాలుగా ఏర్పడి గ్రామాలలో చెరువులు బాగు చేసుకోవాలి. మురికి నీరు దిగే కాలువలు బాగు చేసుకోవాలి. ప్రభుత్వ సహాయంతో గ్రామాలకు రోడ్లు వేసుకోవాలి. గ్రామీణ స్త్రీలు డ్వా క్రా సంఘాలలో చేరి, లఘు పరిశ్రమలను చేపట్టాలి.

పల్లెలలోని ప్రజలు తమ పిల్లలను తప్పక చదివించాలి. పిల్లలందరికీ టీకాలు వేయించాలి. పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పల్లె ప్రజలు తీరిక సమయాల్లో చేతి వృత్తులు చేపట్టి దాని ద్వారా ధనం సంపాదించాలి.

రైతులు పండించే ఉత్పత్తులకు న్యాయమైన మంచి ధరలు లభించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. గ్రామాల్లోని పోరంబోకు పొలాల్లో రైతులు సమిష్టిగా సహకార వ్యవసాయం చేపట్టాలి.

ప్రశ్న 9.
పల్లెటూళ్ళ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరాలను వివరించండి.
జవాబు:
పల్లెటూళ్ళలో ప్రజలు ఒకరినొకరు ఆప్యాయంగా అక్కా, బావా అంటూ పలకరించుకుంటారు. పల్లెలలో పండుగలు, ఉత్సవాలు, వేడుకగా జరుగుతాయి. సంక్రాంతి, దసరా వంటి పండుగలకు, గ్రామాలు చక్కగా అలంకరింపబడతాయి. ప్రతి ఇంటికి రంగుల పూలతోరణాలు కడతారు. వివిధ వాయిద్యాలు మ్రోగిస్తారు. గంగిరెద్దులు, గరగలు, విచిత్రవేషాలు తోలుబొమ్మలాటలు, హరికథలు వగైరా ఉంటాయి. ఈ కళలు మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నాయి.

భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు సంక్రాంతికి ఉంటాయి. వీటివల్ల మన ప్రజలకు ప్రాచీన సంస్కృతీ వైభవం తెలుస్తుంది. గ్రామాలు పరిశుభ్రంగా ఉండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. భోగిమంటల వల్ల, ముగ్గుల వల్ల దోమలు వగైరా దూరం అవుతాయి. మనుష్యుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకుంటారు.

పల్లెటూళ్ళు మన ప్రాచీన సంస్కృతీ వైభావాన్ని వెల్లడించే కేంద్రాలు. ఈ సంస్కృతీ సంప్రదాయాలను మనం కాపాడుకుంటే మన భారతదేశ ప్రాచీన నాగరికతా వైభవం కాపాడబడుతుంది.

ప్రశ్న 10.
‘పల్లెటూరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది’ – సమర్థించండి. (March 2017)
జవాబు:
పల్లెటూళ్ళలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చక్కని గాలి, ఎండ, నీరు, ఆహారము ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. అక్కడ చక్కని ప్రకృతి శోభ ఉంటుంది. పచ్చని పొలాలు కలకలలాడుతూ, గాలికి తలలాడిస్తూ గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో ముంచెత్తుతాయి.

ప్రజలందరికీ పాడి పంటలు ఉంటాయి. పొయ్యి కిందికీ, పొయ్యి మీదికీ, వారికి కావలసినవన్నీ అక్కడే దొరుకుతాయి. గ్రామంలో చేతివృత్తుల వారు ఒకర్ని ఒకరు, అన్నదమ్ములుగా భావిస్తూ పరస్పరం ఒకరికొకరు సాయపడతారు.

పల్లెల్లో ఒకరి ఇంట్లో పెళ్ళయితే, ఊరందరికీ అది పండుగ. పల్లెల్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముగ్గులు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా తీర్థాలూ సాగుతాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటివేషధారులూ, వారి చక్కని పాటలూ ఆనందాన్ని ఇస్తాయి.

గ్రామీణులు ఆనందంగా నవ్వుతూ కలకలలాడుతూ ఒకరిని ఒకరు బంధుత్వంతో పలకరించుకుంటూ, కష్టసుఖాల్లో అందరూ పాలు పంచుకుంటారు. గ్రామాలు పాడిపంటలకు నిలయాలు. అవి ప్రకృతి రమణీయతకు పుట్టిళ్ళు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 11.
“పల్లెటూళ్ళలో ప్రజలు పడే కష్టాలు తొలగిపోతే మానవ సంఘానికి పల్లెటూళ్ళు ఆనందాన్ని ఇవ్వగలవు”. దీనిని ‘ సమర్థిస్తూ వివరించండి.
జవాబు:
భారతావనికి పల్లెలు పట్టుకొమ్మలని మహాత్మాగాంధీ బోధించారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి పల్లెలు ప్రధాన కారణాలుగా , పేర్కొనవచ్చు. ఒకప్పుడు పల్లెలు ప్రశాంత వాతావరణానికి ఆనవాలుగా ఉండేవి. చుట్టూ పంటపొలాలు, పచ్చని చెట్లు కనువిందు చేస్తుంటాయి. స్వచ్ఛమైన గాలి, జలం దొరుకుతాయి. కలుషితమైన వాతావరణం కన్పించదు.

ప్రజల మధ్య సోదరభావం, సమత్వం కన్పిస్తాయి. కష్ట సుఖాలను సమంగా పంచుకుంటారు. కాని ఈనాడు పల్లెల ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదు. దళారీల పోరు ఎక్కువైంది. కనీస ప్రాథమిక సౌకర్యాలు కూడా పల్లెల్లో కన్పించడంలేదు. ఉపాధి అవకాశాలు లేక ఎంతోమంది పట్టణాలకు వలస పోతున్నారు. రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో పల్లె ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి. విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలను కల్పించాలి. అప్పుడే పల్లె ప్రజలు ఆనందోత్సాహాలతో సుఖంగా ఉంటారు. పల్లె ప్రజలంతా ఆనందంతో సుఖంగా తమ జీవనాన్ని గడుపగలుగుతారు.

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు Important Questions and Answers

ప్రశ్న 1.
అన్నదాత అవస్థ గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
( అన్నదాత అవస్థ )

అన్నదాతగా గర్వంగా పిలిపించుకొనే రైతుకు అన్నీ అవస్థలే. ఎప్పుడు వర్షపు చినుకులు నేలపై పడతాయా? అని ఆత్రుతగా, ఆశగా ఆకాశంవైపు చూడడంతో వ్యవసాయంలో రైతుకు అవస్థలు ప్రారంభమౌతాయి. కాలువ నీటి కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూస్తాడు.

దుక్కి దున్నుతాడు. విత్తనాలు చల్లుతాడు. కూలీల కొరకు పోటీపడి ఆకుమడి తయారు చేస్తాడు. బాడీబందా, వానా – వరదా పట్టించుకోకుండా వరి నాట్లు వేస్తాడు.

ఆకుమళ్ళను పశువులు తినేయకుండా తొక్కి పాడు చేయకుండా రాత్రింబవళ్ళు రైతు కాపలా కాస్తాడు. ఆ చేలగట్లపై జెర్రీలు, తేళ్ళు, పాములూ ఉంటాయి. అవి కరుస్తుంటాయి. అయినా అన్నదాత పట్టించుకోడు. పురిటిబిడ్డను బాలెంతరాలు కాపాడుకొన్నట్లు పంటను కాపాడతాడు.

ఎరువు చల్లి, పంటను కోసి, పనలు కట్టి కుప్ప వేస్తాడు. నూరుస్తాడు. ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బులు చేసిన అప్పులకు సరిపోవు. అయినా వ్యవసాయం మానడు.

అందుకే అన్నదాత అయ్యాడు. అమ్మకే అన్నం పెట్టే అన్నదాతకు భూమాత కూడా కన్న కూతురే.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 2.
వ్యవసాయ ప్రాధాన్యతను వివరిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
వ్యవసాయం మన జీవనాధారం

ఆంధ్రులారా ! సోదరులారా !
కల్లాకపటం తెలియని పల్లెటూరి జనాల్లారా !
కంప్యూటరు విద్య నేర్చిన పట్నవాసపు నిరుద్యోగులారా !
రండి! వ్యవసాయం చేద్దాం ! పట్టెడన్నం పదిమందికీ పెడదాం !

ఉద్యోగం చేస్తే ఎవరికో సలాం చేస్తూ బతకాలి. మన బంగారు భూమిని మనమే సాగు చేసుకొంటూ ఏడాదికి మూడు పంటలు పండిద్దాం. ఆకలి మంటలను ఆర్పేద్దాం. కరవు కాటకాలను తరిమేద్దాం. ఆత్మాభిమానంతో జీవిద్దాం. ఎవ్వరికీ తల వంచకుండా బతుకుదాం. ఆంధ్రమాతను భారతదేశపు ధాన్యాగారంగా మారుద్దాం. మన తాత ముత్తాతల దారికి ఆధునికత జోడించి అద్భుతాలు సాధిద్దాం.

భూసారానికి మన తెలివి జతచేసి కలిమిని సృష్టిద్దాం. జై కిసాన్.
ఇట్లు,
భూమి పుత్రులు.

ప్రశ్న 3.
నీ చుట్టూ ఉన్న ప్రకృతిని వర్ణిస్తూ 10 పంక్తుల వచన కవిత రాయండి.
జవాబు:
(‘మా ఇంటి తోట’ వచన కవిత)
మా ఇంటితోట మాకు నచ్చిన పాట
అందమైన మల్లె తీగ, విందు లిచ్చు మొల్లపూలు
రంగు రంగుల గుత్తిపూలు, శృంగారాల విరిజల్లు
దొడ్డిలోన జామచెట్టు, చెట్టుమీద చిలుక గూడు
చిలుక కొట్టిన జామపండు అబ్బో ఎంతో తియ్యగుండు
చెట్లమీద పక్షి గూళ్ళు, చెవులు మెచ్చెడి సంగీతాలు
పెరడులోన పనసచెట్టు, దాని పక్క నిమ్మ మొక్క
గుమ్మం ముందు తులసి తల్లి, చేస్తుంది పూజ మాదుతల్లి
కూరగాయ మొక్కలెన్నో – బీరకాయ పాదులెన్నో
వీధి గుమ్మం వెనుక తట్టు – ఉన్న దొక్కరావి చెట్టు
వేపచెట్టు పిల్లగాలి – అది యిచ్చును మాకు హేళి
పూలమొక్కల మీది గాలి – మొక్కలన్న నాకు జాలి

ప్రశ్న 4.
‘పల్లె సంరక్షణ – మన బాధ్యత’ అని వివరిస్తూ కరపత్రం రూపొందించండి.
జవాబు:
పల్లెటూళ్ళు మన దేశ సౌభాగ్యానికి పుట్టిళ్ళు. మనదేశంలో కొన్ని లక్షల గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో ఉన్న పల్లె ప్రజలు పంటలు పండిస్తేనే నగరవాసులకు ఇంత తిండి దొరుకుతుంది. పల్లెల్లో ప్రజలు పశువులను మేపి పాలను నగరాలకు అందిస్తేనే నగరవాసులకు టీ, కాఫీలు దొరుకుతాయి. పల్లెల్లో రైతులు కూరగాయలు పండిస్తేనే, నగరాల కూరగాయల దుకాణానికి కూరగాయలు వస్తాయి.

గ్రామాల్లో చేతి వృత్తులవారు పనిచేస్తేనే కత్తి, చాకు, కొడవలి, మంచాలు, కుర్చీలు, వగైరా పనిముట్లు నగరవాసులకు లభిస్తాయి. గ్రామాల్లో రైతులు పత్తి పండిస్తేనే నగరవాసులకు బట్టలు లభిస్తాయి. నగరాలు ప్రతి దానికి గ్రామాలపైనే ఆధారపడాలి. కాబట్టి ప్రతి దేశ పౌరుడు గ్రామాభివృద్ధికి కంకణం కట్టుకోవాలి. ప్రభుత్వం గ్రామాల్లో రైతులకు చౌకగా ఋణాలు, ఎరువులు, పురుగు మందులు వగైరా అందించాలి. రైతుల ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు ధరలను ప్రభుత్వం ఇవ్వాలి. ‘పల్లెల సంరక్షణ బాధ్యత’ ప్రతి పౌరుడు తీసికోవాలి. పల్లెలను రక్షించవలసిన బాధ్యత నగరవాసులదే అని అందరూ గుర్తించాలి. పల్లెలకు రోడ్డు సదుపాయాలు కల్పించాలి. పల్లెల్లో విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి. పల్లెలు పచ్చగా ఉంటేనే నగరాలు తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, నగరాల్లోని ప్రజలు, పల్లెల ఉత్పత్తులను ఉపయోగించుకుంటున్న అందరూ ముందుకు రావాలి. పల్లెలను, పల్లె ప్రజలను రక్షించాలి. పల్లెలు పచ్చగా ఉండేలా అందరూ చూడాలి.

పల్లెల సంరక్షణకు కంకణం కట్టుకుందాం. కదలి రండి. ఆలస్యం వద్దు. మనదేశ సౌభాగ్యం పల్లెల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంది. గమనించండి.

దివి. x x x x x

ఇట్లు,
అఖిల భారత యువజన సంఘం,
విజయవాడ.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 5.
కిలకిలలాడే పక్షులతో కలకలలాడే పల్లెటూరిలో మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యాన్ని వర్ణించండి. (S.A. I – 2018-19)
జవాబు:
పల్లెల్లో పచ్చని చేలు, తలలాడిస్తూ మనల్ని ఆహ్వానిస్తాయి. చెట్లపై చిలుకలూ, పిచ్చుకలూ దోబూచులాడుకుంటూ ఉంటాయి. వృక్షాలపై పక్షులు గొంతెత్తి పాటలు కమ్మగా పాడుతాయి. పక్షుల మధురనినాదాల ముందు సుశీలమ్మ పాటలు ఏమి హాయి? బాటలన్నీ ముత్యాల ముగ్గులతో, ముసి ముసి నవ్వులు నవ్వుతాయి. పొలాల్లో ఆవులు మేతలు మేస్తూ, అంభారవాలు చేస్తూ ఉంటాయి. పశువుల కాపర్ల జానపద గీతాలు జోరుజోరుగా వినిపిస్తాయి. మామిళ్ళు, పనసలు చెట్లపై కాయలతో నిండు ముత్తదువుల్లా ఉంటాయి. కాల్వ గట్ల నుండి పోతూ ఉంటే పిల్లకాల్వలు సన్నగా సాగుతూంటాయి. పచ్చగా ఈనిన వరిచేలు, బుక్కా చల్లుకొన్న పడుచుకన్నెల్లా ఉంటాయి. పల్లెల్లోని ప్రకృతి దృశ్యాలు అతిథుల నేత్రాలకు విందు చేస్తాయి.

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు 1 Mark Bits

1. గురుశిష్యులు పూదోటకు వెళ్ళారు – (గీత గీసిన పదమును విడదీసిన రూపమును గుర్తించండి.) (March 2017)
A) పూన్ + తోట
B) పూవు + తోట
C) పూ + తోట
D) పూవు + తోట
జవాబు:
B, D

2. కాలం ఎంతో విలువైనది – గీత గీసిన పదానికి నానార్ధములు గుర్తించండి. (S.A. I – 2018-19 June 2018)
A) నలుపు, కళ
B) సమయం, నలుపు
C) చావు, జీవనం
D) జీవనం, సంతోషం
జవాబు:
B) సమయం, నలుపు

3. సీత సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నది. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) సామాన్య వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) కర్మణీ వాక్యం
జవాబు:
C) సంయుక్త వాక్యం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

4. రామారావు మెట్లు ఎక్కుతూ, దిక్కులు చూస్తున్నాడు. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) కర్మణీ వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) సామాన్య వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

5. తాత పిల్లలకు నీతి కథలు చెప్పాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. (March 2017)
A) తాత చేత పిల్లలకు నీతి కథలు చెప్పబడ్డాయి
B) తాత చేత పిల్లలకు నీతి కథలు చెప్పబడలేదు
C) తాత పిల్లలకు నీతి కథలు చెప్పాడా ?
D) తాత పిల్లలకు నీతి కథలు చెప్పలేదు
జవాబు:
A) తాత చేత పిల్లలకు నీతి కథలు చెప్పబడ్డాయి

6. రైతుల చేత పంటలు పండించబడ్డాయి – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి. (March 2017)
A) రైతులు పంటలను పండించలేదు
B) రైతులు చేత పంటలు పండించబడలేదు
C) రైతుల చేత పంటలు పండించబడ్డాయి
D) రైతులు పంటలను పండించారు.
జవాబు:
D) రైతులు పంటలను పండించారు.

7. తాత భారతం చదివి నిద్రపోయాడు – ఏ వాక్యమో గుర్తించండి. June 2018
A) చేదర్థకము
B) సంయుక్త వాక్యము
C) సంక్లిష్ట వాక్యము
D) నిషేధార్థకము
జవాబు:
C) సంక్లిష్ట వాక్యము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

8. రామకృష్ణ వివేకానందులు గురుశిష్యులు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) సామాన్య వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంక్లిష్ట వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
D) సంయుక్త వాక్యం

9. పురిటిలోనే సంధి కొట్టడం : సంధివాక్యంలో వస్తుంది. ఇది పురిటిలోనే వస్తే తప్పక మరణిస్తారు. అలాగే ఏదైనా పని ప్రారంభంలోనే నాశనమైన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. (June 2017)

10. అడుగున పడిపోవుట : క్రొత్త సమస్యలు వస్తే పాత సమస్యలు అడుగున పడిపోతాయి. (June 2017)

11. కష్టఫలం : నేడు రైతులకు బొత్తిగా కష్టఫలం దక్కడం లేదు. (June 2018)

12. పొద్దస్తమానం : అన్నదాతలు పొద్దస్తమానం పొలాల్లో పనిచేస్తారు. (June 2018)

13. చమత్కారం : రఘురామ్ మాటలలో చమత్కారం తొణికిసలాడుతుంటుంది. (June 2018)

14. తునాతునకలు : ముక్కలు ముక్కలగుట / ఛిన్నాభిన్నమగుట అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. (S.A.I -2018-19 March 2018)

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 2nd Lesson అమరావతి

10th Class Telugu 2nd Lesson అమరావతి 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడంలో ఎవరెవరు భాగస్వామ్యం వహించారు?
జవాబు:
అమరావతిని శాతవాహనులు తొలి రాజధానిగా చేసుకొని అభివృద్ధి పరిచారు. ఇక్ష్వాకులు కూడా అమరావతిని మెరుగుపరిచారు. పల్లవులు తమ శాయశక్తులా అభివృద్ధి చేశారు. చాళుక్యులు, విష్ణుకుండినులు కూడా అభివృద్ధి చేశారు. కోటబేతరాజు వంశీయులు కూడా అభివృద్ధి చేశారు.

ప్రశ్న 2.
అనేక రాజవంశాలు అమరావతిని ఎందుకు అభివృద్ధి పరిచారు?
జవాబు:
రాజవంశాలు అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించాయి. వారి అభిలాషలకు అనుగుణంగా అమరావతిని తీర్చిదిద్దుకొన్నారు. వారి అవసరాలకు తగినట్లుగా అమరావతిని మలచుకొన్నారు. వారి కళా పిపాస తీర్చుకోవడానికి అందమైన నిర్మాణాలు చేయించారు. ఆ పాలకుల మతాలకు, సంప్రదాయాలకు తగినట్లు రాజధాని ఉండాలి కనుక అభివృద్ధి పరిచారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 3.
శరీరధర్మశాస్త్రాన్ననుసరించి శిల్పాలు రూపొందించడంలోని ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
శరీరంలో కొన్ని కొలతలతో అవయవాలుంటాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారంగా కొలతలు గల అవయవ నిర్మాణం, రంగు, ఒడ్డు, పొడుగు ఉంటేనే అందంగా పరిగణించబడుతుంది. అటువంటి లక్షణాలను కల్పించడం దైవానికి మాత్రమే సాధ్యం.

శిలతో చెక్కిన శిల్పంలో మానవ శరీరం యొక్క ప్రత్యేక లక్షణాలను ప్రతిబింబింపచేయడం నిపుణులైన కళాకారులకు మాత్రమే సాధ్యం. అటువంటి శిల్పాలు ఎవరినైనా ఆకర్షిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. అటువంటి శిల్పాలు ఉన్నచోట సంపదలు వృద్ధి చెందుతాయనే విశ్వాసం కూడా ఉంది.

ప్రశ్న 4.
శాతవాహనుల కులగురువు యొక్క స్వభావాన్ని విశ్లేషించండి.
జవాబు:
‘నాగార్జునుడు’ అనే బౌద్ధమతాచార్యుడు, శాతవాహన రాజులకు కుల గురువు. ఈయన ధరణికోటలోనూ, నందికొండ ప్రాంతంలోనూ ఉన్న బౌద్ధారామాలలో నివసించేవాడు. ఆ రోజుల్లో అక్కడ గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయము ఉండేది. ఈ విశ్వవిద్యాలయములో 7700 మంది బౌద్ధభిక్షువులు ఉండేవారు. ఆ విశ్వవిద్యాలయములో ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి వంటి తత్త్వవేత్తలు బోధించేవారని, క్రీ.శ. 640లో ఈ ప్రాంతాన్ని దర్శించిన చైనా యాత్రికుడు, హ్యూయత్సాంగ్ తెలియపరచాడు.

10th Class Telugu 2nd Lesson అమరావతి 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
అమరావతి నగర సాంస్కృతిక వైభవాన్ని శిల్పకళా సంపదనుగురించి సొంతమాటల్లో వివరించండి. (June 2018)
జవాబు:

  1. శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకమే కాలక్రమంలో అమరావతిగా స్థిరపడింది.
  2. శాతవాహన, ఇక్ష్వాక, పల్లవ, విష్ణుకుండిన మొదలగు వంశాలకు చెందిన రాజుల పరిపాలనాకాలంలో అమరావతి ఎంతో అభివృద్ధి చెందింది.
  3. విజయనగర ప్రభువుల పాలనలో అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందింది.
  4. క్రీ.శ. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారు అమరావతిని అత్యంత వైభవోపేతమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దారు.
  5. కాలానుగుణంగా ఆయా రాజుల పరిపాలనలో మతాచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, అమరావతి మీద ప్రభావం చూపినందున ఇక్కడ బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాలు, సంస్కృతులు విలసిల్లి; నాటి సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతున్నాయి.
  6. అమరావతి అద్భుత శిల్పకళకు కాణాచి. ఇక్కడి శిల్పాలు శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి రూపొందాయి. చిత్రకళలో మాత్రమే వీలైన హావభావ ప్రకటనలు శిల్పకళలో కూడా ప్రదర్శితం కావడం ఈ శిల్పాల విశిష్టత. క్రోధం, కరుణ, ప్రేమ, విషాదం, ఆరాధన వంటి భావాలు. ఈ శిల్పాలలో చక్కగా కనిపిస్తాయి.

ప్రశ్న 2.
ఏయే రాజవంశాలు అమరావతిని అభివృద్ధిపరచాయో తెల్పండి. (March 2018)
జవాబు:

  1. అమరావతిని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని సమగోప, గోబధ, నరన, కంవాయల వంశాలకు చెందిన రాజులు శాతవాహనుల కంటే ముందు పాలించారని శాసనాల ద్వారా తెలుస్తోంది.
  2. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు అమరావతిని పాలించారు. అభివృద్ధిపథంలో నడిపించారు.
  3. కోట బేతరాజు వంశస్థులు పాలించారు.
  4. విజయనగర ప్రభువులు సైతం అమరావతిని పాలించారు.
  5. క్రీ.శ. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని అత్యంత వైభవోపేతమైన నగరంగా తీర్చిదిద్దారు.

ప్రశ్న 3.
ఒక మామూలు నగరం రాజధానిగా ఉండడానికి పనికి వస్తుందా? రాదా? విశ్లేషించండి.
జవాబు:
ఒక మామూలు నగరం, రాష్ట్రమునకు రాజధానిగా ఉండడానికి పనికిరాదు. రాష్ట్ర రాజధాని నగరంలో మంత్రుల పరిపాలనకు సెక్రటేరియట్, డైరెక్టర్ల కార్యాలయాలు, అసెంబ్లీ భవనములు, హైకోర్టు భవనాలు ఉండాలి. మంత్రులకు, శాసనసభ్యులకు నివాస భవనాలు ఉండాలి. ఉద్యోగులకు నివాస భవనాలు ఉండాలి.

రాష్ట్ర రాజధాని నగరానికి రాకపోకలకు విశాలమైన రోడ్డుమార్గాలు ఉండాలి. రాష్ట్ర, కేంద్ర మంత్రుల రాకపోకలకు, విమాన సౌకర్యం ఉండాలి. రైలుమార్గాలు ఉండాలి. విద్యా, వైద్య సదుపాయాలు ఉండాలి. పెద్ద వర్తక కేంద్రాలు ఉండాలి. కేంద్రమునకు సంబంధించిన కార్యాలయాలకు భవనాలు ఉండాలి. క్రీడా సదుపాయాలు ఉండాలి.

కాబట్టి ఒక మామూలు నగరం, రాష్ట్ర రాజధానిగా ఉండడానికి ఎంత మాత్రం పనికిరాదు. రాజధానికి కావలసిన అన్ని హంగులతో రాజధాని నగరాన్ని వేరుగా నిర్మించుకోవాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 4.
ఒక మామూలు నగరం రాజధానిగా మారాలంటే రావలసిన మార్పులేమిటి?
జవాబు:
మామూలు నగరం రాజధానిగా మారాలంటే, ముఖ్యంగా అక్కడ పరిపాలనకు సెక్రటేరియట్ భవనాలు రావాలి. అసెంబ్లీ, హైకోర్టు భవనాలు కావాలి. పోలీసుశాఖకు తగిన భవనాలు నిర్మించాలి.

మంత్రులకు, గవర్నరు గారికి, శాసనసభ్యులకు నివాస భవనాలు నిర్మించాలి. సెక్రటేరియట్ ఉద్యోగులకు నివాస భవనాలు కావాలి. రాజధానిలో నివసించేవారికి సరిపడ మంచినీటి సౌకర్యం ఉండాలి. విద్యా, వైద్య సదుపాయాలు ఉండాలి. చక్కని రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, విమాన ప్రయాణ సౌకర్యములు ఉండాలి. విశ్వవిద్యాలయాలు, పెద్ద పెద్ద వైద్యశాలలు ఉండాలి.

క్రీడలకు సదుపాయాలు ఉండాలి. ఉద్యానవనాలు, సరస్సులు ఉండాలి. పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాలు నిర్మించాలి. పెద్ద పెద్ద వర్తక కేంద్రాలు, అత్యాధునిక హంగులతో కూడిన అన్ని సదుపాయాలు కావాలి. మంచి విద్యుచ్ఛక్తి సౌకర్యం ఉండాలి. ప్రజలు సులభంగా రాజధానికి రావడానికి, పోవడానికి ప్రయాణ సౌకర్యాలు కావాలి.

ప్రశ్న 5.
అమరావతి భిన్న సంస్కృతుల నెలవు కావడానికి కారణాలను విశ్లేషించండి.
జవాబు:
అమరావతి రాజధానిగా ఒకటవ శతాబ్దంలోనే, శాతవాహన చక్రవర్తులు దీనిని పాలించారు. తరువాత ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కోట బేతరాజ వంశస్థులు పాలించారు. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతిని మంచి రాజధాని నగరంగా తీర్చిదిద్దాడు.

ఆయా రాజుల పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, అమరావతిపై గట్టి ప్రభావం చూపించాయి. అందువల్లనే అమరావతి, ఆంధ్రప్రదేశ్ కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. ఇక్కడ బుద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాల, సంస్కృతుల ప్రభావాలు కన్పిస్తాయి.

క్రీ.పూ. 5వ శతాబ్దిలోనే గౌతమ బుద్ధుడు అమరావతిని సందర్శించాడు. అమరావతిలో బుద్ధుని ధాతువుల భరిణను ఉంచి, దానిపై మహా చైత్యం నిర్మించారు. నాగార్జునుడనే బౌద్ధమత గురువు, శాతవాహన రాజులకు కుల గురువు. ఆ రోజుల్లో ధరణికోటలో గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయము, దానిలో 7,700 మంది బౌద్ధ భిక్షువులూ ఉండేవారు.

ఆ కాలంలో అమరావతి కేంద్రంగా, జైనమతం కూడా విస్తరించింది. అమరావతిలోని పార్శ్వనాథుని ఆలయం, జైనమత వికాసానికి సాక్షీభూతంగా నేటికీ ఉంది.

12, 13 శతాబ్దాల్లో శైవమతం ఇక్కడ విస్తరించింది. శివుడి ఆత్మలింగంలో ఒక భాగాన్ని ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠ చేశాడట. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం, పంచారామాలలో ఒకటి.

రాజా వేంకటాద్రినాయుడు అమరావతికి దగ్గరలో, వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. తరువాత ఇస్లాం, క్రైస్తవ మతాలు కూడా ఇక్కడ వ్యాప్తి చెందాయి.

ఈ విధంగా అమరావతీ నగరం భిన్న సంస్కృతులకు నెలవు అయ్యింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 6.
“ఆచార్య నాగార్జునుడు విద్యాప్రదాత” అని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఆచార్య నాగార్జునుడు అనే బౌద్ధమతాచార్యుడు, శాతవాహన, రాజులకు కుల గురువు. ఈయన కాలంలో ధరణికోటలో గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది. దీనికి ధాన్యకటక విశ్వవిద్యాలయం, శ్రీ పర్వత విద్యాపీఠం అనే పేర్లు కూడా ఉండేవి.

అనేక దేశాల విద్యార్థులు వచ్చి, అక్కడ విద్యార్జన చేసేవారు. ఈ విశ్వవిద్యాలయములో 7700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారట. ఈ విశ్వవిద్యాలయంలో ధర్మశాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రస, రసాయన, వృక్ష, లోహ శాస్త్రములను బోధించేవారు.

నందికొండలో 1500 గదుల ఆరామాలలో వివిధ శాస్త్ర గ్రంథాలు నిండి ఉండేవనీ, ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్త్వవేత్తలు, అక్కడ బోధించేవారనీ, చైనా యాత్రికుడు హ్యూయత్సాంగ్ తన రచనల్లో తెలిపాడు.

దీనిని బట్టి ఆచార్య నాగార్జునుడు విద్యా ప్రదాత అని మనం చెప్పగలము.

ప్రశ్న 7.
అమరావతి శిల్పకళలకు కాణాచి అని ఎలా చెప్పగలవు?
జవాబు:
అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కాణాచి. అశోకుడు ఇక్కడ మహా బౌద్ధస్తూపం నిర్మించాడు. దానికి ఆచార్య నాగార్జునుడు మహా ప్రాకారాన్ని నిర్మించాడు. శిల్పులు ఈ చైత్యం చుట్టూ, అద్భుతమైన శిల్పకళా ఖండాలను అమర్చారు. శిల్పులు అక్కడ నలుచదరము శిలా ఫలకాల మీద బుద్ధుని జీవిత ఘట్టాలను చక్కగా చెక్కారు. మెకంజీ 1779లో అమరావతి శివారులో ఉన్న దీపాల దిన్నె దిబ్బ దగ్గర ఉన్న శిల్ప సంపదను గుర్తించాడు. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని, అక్కడ చెక్కించి, ఆ శిల్పాల గురించి ఆంగ్ల ప్రభుత్వానికి తెలిపాడు.

దంతగిరి, నేలకొండ పల్లి, ధూళికట్ట, భట్టిప్రోలులలో లభించిన శిల్పాలను, “అమరావతి స్కూలు ఆఫ్ ఆర్ట్” అంటారు. ఇక్కడి శిల్పాలు, ఎన్నో కాలగర్భంలో కలిసాయి. కొన్ని విదేశాలకు వెళ్ళిపోయాయి. పల్నాడు పాలరాయిపై చెక్కిన 120కి పైగా అమరావతి శిల్పాలు, బ్రిటిష్ మ్యూజియంలో నేటికీ ఉన్నాయి. అవి అమరావతి శిల్పకళ గొప్పతనాన్ని ప్రపంచానికి వెల్లడిస్తున్నాయి. మరికొన్ని అమరావతి శిల్పాలు, మద్రాసు, కలకత్తా మ్యూజియంలలోనూ, కొన్ని నాగార్జున కొండ మ్యూజియంలోనూ దాచారు. ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు చాలా గొప్పవని, గొప్ప శిల్పకళా పరిశోధకుడైన ఫెర్గూసన్ చెప్పాడు. దీనిని బట్టి అమరావతి శిల్ప కళలకు కాణాచి అని చెప్పవచ్చు.

ప్రశ్న 8.
సాంస్కృతిక వైభవానికి అమరావతి నెలవు అని ఎలా చెప్పగలవు?
జవాబు:
అమరావతి అనేకమంది రాజుల కాలంలో కాలానుగుణంగా అనేకమార్పులు పొందింది. ఆయా రాజుల పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతిపై ప్రభావం చూపించాయి. అందువల్లనే అమరావతి ఆంధ్రప్రదేశ్ కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. ఇక్కడ జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాల సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి.

బుద్ధుడు క్రీ.పూ. 5వ శతాబ్దంలో అమరావతిలోని అమరారామంలో కాలు పెట్టాడు. అందువల్ల అమరారామం, పవిత్రమయ్యింది. 2006లో ప్రపంచ బౌద్ధమత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర పరివర్తనం నిర్వహించాడు. అశోకుడు బుద్ధుని అస్థికలపై ఇక్కడ మహా చైత్యం నిర్మించాడు. నాగార్జునాచార్యుడు దానికి ప్రాకారం కట్టించాడు. ఇక్కడ బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది.

తరువాత అమరావతి కేంద్రంగా జైనమతం విస్తరించింది. అమరావతిలోని పార్శ్వనాథుని ఆలయం, ఇక్కడ జైనమత వికాసానికి సాక్షి. 12, 13 శతాబ్దాలలో అమరావతిలో శైవమతం వ్యాప్తి చెందింది. అమరావతిలోని అమరారామం మందార యం పంచారామాలలో ఒకటి.

రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు అమరావతి దగ్గరలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాడు.

ఈ పై కారణాల వల్ల, అమరావతి సాంస్కృతిక వైభవానికి నెలవు అని చెప్పవచ్చు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 9.
“అమరావతి గొప్ప రాజధాని” – నిరూపించండి.
జవాబు:
అమరావతి రాజధానికి 22. 10.2015న మన ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మన కొత్త రాజధానికి మంచి పేరు తెచ్చేందుకు శ్రమిస్తానని మన ముఖ్యమంత్రిగారు ప్రతిజ్ఞ చేశారు.

మన రాజధానిని ఐదు అంచెల్లో పూర్తి చేస్తారు. మొత్తం మూడు దశల్లో 35 సంవత్సరాలలో అమరావతిని నిర్మించేందుకు ప్రణాళికలు వేశారు. దీనికి ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. దీనితో ఇది వెనిస్ నగరంలా ఉండబోతోంది.

సింగపూర్, జపాన్ దేశాల భాగస్వామ్యంలో ఇక్కడ ఆకాశహర్మ్యాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో తొమ్మిది నగరాలు నిర్మిస్తారు.

అందులో పర్యాటక నగరంగా ఉండవల్లి, ఆరోగ్య నగరంగా కృష్ణయ్యపాలెం, ఎలక్ట్రానిక్ నగరంగా బేతపూడి, విజ్ఞాన నగరంగా శాఖమూరు, విద్యా నగరంగా అయినవోలు, పరిపాలనా నగరంగా రాయపూడి, న్యాయ నగరంగా నేలపాడు, క్రీడా నగరంగా అబ్బరాజుపాలెం, ఆర్థిక నగరంగా ఉద్దండరాయపాలెం, ఆధ్యాత్మిక నగరంగా అనంతవరం పరిసరాలు అభివృద్ధి అవుతాయి.

ఈ విధంగా అమరావతి చాలా గొప్ప రాజధాని అవుతుంది. 2016 జూలై నుండి అమరావతి కేంద్రంగా మన రాష్ట్ర పాలన సాగుతుంది.

ప్రశ్న 10.
నాటి – నేటి అమరావతిని విశ్లేషించండి.
జవాబు:
నాటి అమరావతి :
ఒకటవ శతాబ్ది నాటికే అమరావతి మహా నగరంగా విరాజిల్లేది. అమరావతి నగరానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. మెగస్తనీసు తన ఇండికా గ్రంథంలో అమరావతిని గుర్తించి రాశాడు. అశోకుడికి పూర్వమే అమరావతిలో బౌద్ధస్తూపం ఉండేదని తెలుస్తోంది.

శాతవాహన రాజులు అమరావతిని రాజధానిగా చేసుకొని క్రీ.పూ. 220 వరకు పరిపాలించారు. తరువాత ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు దీనిని పాలించారు. తరువాత కోట బేతరాజు వంశస్థులు పాలించారు. 1798లో అమరావతిని గొప్ప రాజధానిగా జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు తీర్చిదిద్దాడు.

నేటి అమరావతి :
ఇప్పుడు అమరావతి నగరం ఐదుకోట్ల ప్రజలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయ్యింది. ఈ రాజధానికి 22.10.2015న మన ప్రధాని శంకుస్థాపన చేశారు. మొత్తం మూడు దశల్లో ఈ రాజధాని 35 సంవత్సరాలలో సంపూర్ణ అమరావతి నగరంగా రూపొందుతుంది.

అమరావతికి రైలు, రోడ్డు సదుపాయాలు ఏర్పాటు అవుతాయి. సింగపూర్, జపాన్ దేశాల భాగస్వామ్యంలో ఇక్కడ ఆకాశహర్మ్యాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో నవ నగరాలు నిర్మితం అవుతాయి. అమరావతి నగరం, అత్యాధునిక హంగులతో ప్రజా రాజధానిగా అభివృద్ధి అవుతుంది. 2016 జూలై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఇక్కడి నుండే సాగుతుంది.

10th Class Telugu 2nd Lesson అమరావతి Important Questions and Answers

ప్రశ్న 1.
అమరావతి పర్యాటకులను ఆహ్వానిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
(ఆహ్వానము)

దేశ విదేశ పర్యాటకులకు ఇదే మా ఆహ్వానము. మీరు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, అమరావతిని గురించి వినే ఉంటారు. ఇది గొప్ప సాంస్కృతిక రాజధాని. అందాల కృష్ణమ్మ ఒంపులు తిరుగుతూ దీని పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. “అమరావతీ నగర అపురూప శిల్పాలు, తప్పక చూడదగినవి. ప్రపంచ ప్రసిద్ధ శిల్పకళా పరిశోధకుడు ఫెర్గూసన్ ప్రపంచ శిల్పకళా సంపదలో అమరావతీ శిల్పాలు మిక్కిలి గొప్పవని మెచ్చుకున్నాడు.

అమరావతిలో అశోకుడు కట్టించిన మహా బౌద్ధస్తూపం ఉంది. దానికి నాగార్జునుడు కట్టించిన మహా ప్రాకారం ఉంది. పంచారామాలలో ప్రసిద్ధమైన అమరారామం ఇక్కడే ఉంది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కట్టించిన వేంకటేశ్వరాలయం ఇక్కడ ఉంది. ఇవన్నీ చూడ ముచ్చటగా ఉంటాయి.

అమరావతిలో జైనమత వికాసానికి సాక్షిగా పార్శ్వనాథుని దేవాలయం ఉంది. అమరావతి నగరం, గొప్ప సాంస్కృతిక రాజధాని. ఇక్కడ అనేక మతాలు అభివృద్ధి చెందాయి. అమరావతిలో క్రీ.పూ. మొదటి శతాబ్దిలోనే శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి తయారైన గొప్ప శిల్ప సంపద ఉంది.

అమరావతి అద్భుతమైన శిల్ప కళలకు కాణాచి. అమరావతి శిల్పాలు, నేటికీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. ఆ శిల్పాలు అమరావతీ శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి వెల్లడిస్తున్నాయి.

ఇంత అందమైన శిల్పకళా లక్ష్మికి నిలయమైన రాజధాని అమరావతిని మీరు తప్పక దర్శించండి. మీకు ఇదే మా సుస్వాగతం. ఇదే మా ఆహ్వానం, పర్యాటకులకు అమరావతి కనులపండువగా ఉంటుంది. ఈ ప్రదేశాలు చూడడానికి బస్సులు ఉన్నాయి. రండి అమరావతిని దర్శించండి.
దివి. x x x x x

ఇట్లు,
అమరావతీ పర్యాటక సంస్థ,
అమరావతి,

ప్రశ్న 2.
“అమరావతి” ఆత్మకథ రాయండి.
జవాబు:
నేను ‘అమరావతి’ నగరాన్ని. తొలి తెలుగు రాజులు శాతవాహనులు నన్నే రాజధానిగా చేసుకొని సుమారు 220 సంవత్సరాలు పాలించారు. నా ప్రక్కనే కృష్ణానది గలగలా ప్రవహిస్తూ ఉంటుంది. నన్నే రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కోట బేతరాజ వంశస్థులు పాలించారు. 1798లో రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నన్ను అందమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దాడు – నా గడ్డపై బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ మతాలు వ్యాప్తి చెందాయి.

గౌతమబుద్ధుడు క్రీ.శ. 5వ శతాబ్దిలోనే నా నేలపై అడుగుపెట్టాడు. ఆ మహాత్ముడి పాద స్పర్శతో నేను పునీతం అయ్యాను. నా ఈ నగరంలోనే మహా బౌద్ధస్తూపం, దానికి ప్రాకారాలు ఉన్నాయి. నా నగరంలోనే నాగార్జునుడు ఒకనాడు బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పరచాడు.

నా అమరావతీ నగరంలో వెలిసిన శిల్పం, ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నా నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు నేను ఐదుకోట్ల ఆంధ్రులకు అందాల రాజధానిని అయ్యాను. ఇక్కడ తొమ్మిది నగరాలు అత్యాధునిక హంగులతో ఏర్పాటు అవుతున్నాయి. మనదేశ ప్రధాని ఇక్కడ నూతన రాజధానికి శంకుస్థాపన చేశారు. మూడు దశల్లో 35 ఏళ్ళలో నేను తెలుగువారికి గొప్ప రాజధాని నగరంగా అభివృద్ధి అవుతాను. నన్ను సర్వహంగులతో తీర్చిదిద్దుకోవడం, ఐదు కోట్ల తెలుగు ప్రజల కర్తవ్యం. ఉంటా…..

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 3.
అమరావతిని సందర్శించిన ఇద్దరు పర్యాటకుల సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
(రాజయ్య, వీరారెడ్డి అనే పర్యాటకుల సంభాషణ).

రాజయ్య : ఏవండీ ! మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మీ పేరేమిటి?

వీరారెడ్డి : నేను అనంతపురం నుండి వచ్చా. నా పేరు వీరారెడ్డి. మీరు ఎక్కడివారు? మీ పేరేమిటి?

రాజయ్య : నేను శ్రీకాకుళం నుండి వచ్చా. నా పేరు రాజయ్య. మీరు ఇక్కడ ఏమి చూశారు?

వీరారెడ్డి : నేను అశోకుడు నిర్మించిన మహా బౌద్ధ స్తూపాన్ని, నాగార్జునాచార్యుడు దానికి కట్టించిన మహా ప్రాకారాన్ని చూశాను. అది ఎంత గొప్ప శిల్పం అండీ ! చాలా బాగుంది.

రాజయ్య : నేనూ అవి చూశాను. నిజంగా అమరావతి శిల్పం, అత్యద్భుతంగా ఉంది.

వీరారెడ్డి : నేను అమరారామం చూశా ! రాజయ్యగారూ ! శివలింగం, పై అంతస్థులో ఉంది.

రాజయ్య : అవునండి. శివుడి ఆత్మలింగంలో ఒక భాగాన్ని, దేవరాజు ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేశాడటండీ ! ఇది గొప్ప మహా పుణ్యక్షేత్రం.

వీరారెడ్డి : నేను కృష్ణానదిలో స్నానం చేసి, ఆ నీళ్ళతో అమరలింగేశ్వరునికి అభిషేకం చేశానండి.

రాజయ్య : రెడ్డిగారూ ! మీరు పుణ్యాత్ములు. నాకు నదీస్నానం అంటే భయం. మీరు దీపాల దిన్నె వెళ్ళారా?

వీరారెడ్డి : లేదండి. ఏమిటి అక్కడ విశేషం?

రాజయ్య : పూర్వం ప్రతిరోజూ అక్కడ బౌద్ధ భిక్షువులు దీపాలు వెలిగించేవారట. అందుకే దాన్ని దీపాల దిన్నె అంటారట. అక్కడ ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని చక్కగా చెక్కించాడు.

వీరారెడ్డి : నేనూ చూడాలి. నేను మొన్న ప్రధాని రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్ళా. పరిసరాలు బాగున్నాయి. అక్కడ తొమ్మిది నగరాలు నిర్మిస్తారట.

రాజయ్య : బాగుంది. మొత్తం పై మన ముఖ్యమంత్రిగారు మంచి ప్రదేశాన్ని మన రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఏర్పాటు చేశారు. భేష్.

వీరారెడ్డి : సరే ఉంటానండి. ఇంకా నేను ఎన్నో చూడాలి.

రాజయ్య : సరేనండి. నేనూ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన ప్రదేశం చూస్తా.

10th Class Telugu 2nd Lesson అమరావతి 1 Mark Bits

1. అమరావతి శిల్పకళకు కాణాచి. – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించుము. (June 2018)
A) వలయము
B) నిలయము
C) ప్రధానము
D) సంకేతము
జవాబు:
B) నిలయము

2. మంచి మార్కులు రాలేదని నిరాశ చెందకుండా కష్టపడి చదవాలి – గీత గీసిన పదంలో గల సంధి పేరు గుర్తించండి. (June 2018)
A) గుణసంధి
B) అనునాసిక సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) పడ్వాది సంధి
జవాబు:
D) పడ్వాది సంధి

3. ఒకనాటికీ, నేటికీ ఎన్నో విషయాలలో అంతరం ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి. (March 2018)
A) పోలిక, సమానం
B) న్యాయం, ధర్మం
C) నీతి, నిజాయితీ
D) భేదము, తేడా
జవాబు:
D) భేదము, తేడా

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

4. స్వభావముచేత ఐశ్వర్యము కలవాడు పార్వతీ దేవిని వివాహమాడెను. (వ్యుత్పత్తి పదమును గుర్తించండి.) (S.A. I – 2018-19)
A) రుద్రుడు
B) మహేశ్వరుడు
C) ఈశ్వరుడు
D) శివుడు
జవాబు:
C) ఈశ్వరుడు

5. “దేవాలయ గోపురాలు ఆకాశాన్నందుతున్నాయి” అలంకారం గుర్తించండి. (S.A. I – 2018-19)
A) స్వభావోక్తి
B) అర్థాంతరన్యాసం
C) అతిశయోక్త
D) ఉత్ప్రేక్ష
జవాబు:
C) అతిశయోక్త

6. అమరావతి శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరిచారు. (కర్మణివాక్యం గుర్తించండి.) (June 2017)
A) అమరావతి శిల్పాలు నాగార్జున కొండ మ్యూజియంలో భద్రపరచలేదు.
B) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరచబడినవి.
C) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలో మ్యూజియంలో దాచారు.
D) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలో ఉన్నాయి.
జవాబు:
B) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరచబడినవి.

7. ‘ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది’ అని అందరనుకుంటున్నారు. (పరోక్ష కథనం గుర్తించండి.) (June 2017)
A) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడదని అందరనుకుంటున్నారు.
B) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడుతుందని ఎవరూ అనలేదు.
C) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడలేదని అందరనుకుంటున్నారు.
D) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరనుకుంటున్నారు.
జవాబు:
D) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరనుకుంటున్నారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

8. తనకు పల్లెలంటే ఇష్టమని సోము అన్నాడు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి.) (June 2017 )
A) “నాకు పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.
B) “నేను పల్లెలంటే ఇష్టపడతాను” అని సోము అన్నాడు.
C) “వానికి పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.
D) “అతనికి పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.
జవాబు:
A) “నాకు పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.

9. అమరావతీ ! నీ కీర్తి చిరకాలం వర్ధిల్లుగాక ! (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) ఆశీరర్థకం
B) నిశ్చయార్థకం
C) సందేహార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
A) ఆశీరర్థకం

10. “నేను తిరుపతికి వెళతాను” అని అమ్మ అన్నది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. (March 2017)
A) తాను తిరుపతికి వెళ్ళనని అమ్మ అన్నది.
B) తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది.
C) నేను తిరుపతికి వెళ్ళను అని అమ్మ అన్నది.
D) నేను తిరుపతికి వెళతాను అని అమ్మ అనలేదు.
జవాబు:
B) తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది.

11. చెప్పుడు మాటలు వినవద్దని రచయిత అన్నాడు – ప్రత్యక్ష కథనం గుర్తించండి. (March 2017)
A) “చెప్పుడు మాటలు వినవచ్చు” అని రచయిత అన్నాడు.
B) “చెప్పుడు మాటలు వినవద్దు” అని రచయిత అనలేదు.
C) “చెప్పుడు మాటలు వినవద్దు” అని రచయిత అన్నాడు.
D) “చెప్పుడు మాటలు వినమని” రచయిత అన్నాడు.
జవాబు:
C) “చెప్పుడు మాటలు వినవద్దు” అని రచయిత అన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

12. “నేటి సినిమాలు నేను చూడలేకపోతున్నాను” అని అమ్మతో అన్నాను – పరోక్ష కథనం గుర్తించండి. (June 2018)
A) తాను ఈనాటి సినిమాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.
B) తాను ఈనాటి సినిమాలను చూడలేనని అమ్మతో అన్నాను.
C) నేటి సినిమాలను నేను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.
D) నాటి సినిమాలను తాను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.
జవాబు:
C) నేటి సినిమాలను నేను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.

13. తన రచనలో తన జీవితముందని రచయిత అన్నాడు – ప్రత్యక్ష కథనం గుర్తించండి. (June 2018)
A) “మా రచనలో నీ జీవితముంది” అని రచయిత అన్నాడు.
B) “నా రచనలో నా జీవితముంది” అని రచయిత అన్నాడు.
C) “తన రచనలో అతని జీవితముంది” అని రచయిత అన్నాడు.
D) “నా రచనలో ఎవరి జీవితం లేదు” అని రచయిత అన్నాడు.
జవాబు:
B) “నా రచనలో నా జీవితముంది” అని రచయిత అన్నాడు.

14. తనకు అమరావతి నిర్మాణం ముఖ్యమని ముఖ్యమంత్రి అన్నాడు – దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి. (March 2018)
A) “నాకు అమరావతి నిర్మాణం ముఖ్యము” అని ముఖ్యమంత్రి అన్నాడు.
B) “మీకు అమరావతి నిర్మాణం ముఖ్యము” అని ముఖ్యమంత్రి అన్నాడు.
C) అమరావతి నిర్మాణం వారికి ముఖ్యమని ముఖ్యమంత్రి అన్నాడు.
D) ముఖ్యమంత్రి అన్నాడు “తమకు అమరావతి నిర్మాణం అవసరం.”
జవాబు:
A) “నాకు అమరావతి నిర్మాణం ముఖ్యము” అని ముఖ్యమంత్రి అన్నాడు.

15. రాజులు కూడా జైన మతాన్ని ఆవలంబించారు. (కర్మణి వాక్యం గుర్తించండి) (S.I. 1 – 2018-19)
A) రాజులచేత కూడా జైన మతం అవలంబించారు.
B) జైన మతం కూడా రాజులు అవలంబించారు.
C) జైన మతంచేత రాజులు అవలంబించబడ్డారు.
D) జైన మతం రాజులచేత కూడా అవలంబించబడింది.
జవాబు:
D) జైన మతం రాజులచేత కూడా అవలంబించబడింది.

16. పునీతం : గంగానదీ జలంతో భారతావని పునీతం అయ్యింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన.

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 1st Lesson మాతృభావన

10th Class Telugu 1st Lesson మాతృభావన 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
స్త్రీలను గౌరవించాలనే ఉదాత్త సందేశాన్నిచ్చిన ‘మాతృభావన’ పాఠ్యభాగ కవి పరిచయం రాయండి. (March 2015)
జవాబు:
1. కవి, కాలము : కీ.శే. గడియారం వెంకట శేషశాస్త్రిగారు, (1894-1980) ఆధునిక కాలము, కడపజిల్లా, జమ్మల మడుగు తాలూకా, “నెమళ్ళ దిన్నె” గ్రామ వాస్తవ్యులు.
2. రచనలు : మురారి, పుష్పబాణ విలాసము మొ||నవి.
3. బిరుదు : కవితా వతంస / కవిసింహ | అవధాన పంచానన
4. ఆధునిక తెలుగు కవులలో ప్రముఖులు, శతావధాని, బానిసత్వాన్ని నిరసించారు.

ప్రశ్న 2.
మాతృభావన నేపథ్యం వ్రాయండి.
జవాబు:
కళ్యాణి దుర్గంపై దండయాత్ర చేసి అబ్బాజీసో దేవుడు విజయం సాధించాడు. విజయోత్సాహంతో శివాజీ వద్దకు వచ్చాడు. శివాజీ ఆజ్ఞతో దుర్గం జయించి దాని సర్దారు ‘మౌలానా అహ్మద్’ను పట్టి బంధించాడు. అతని రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చినట్లు శివాజీకి చెప్పాడు. అది విన్న శివాజీకి చాలా కోపం వచ్చింది. తరువాత పాఠ్యభాగం మొదలవుతుంది.

ప్రశ్న 3.
మాతృభావన రచయిత గూర్చి వ్రాయండి.
జవాబు:
మాతృభావన పాఠం గడియారం వేంకటశేషశాస్త్రి గారు రచించారు. ఆయన రచించిన శ్రీ శివభారతంలోని తృతీయాశ్వాసంలోనిది ప్రస్తుత పాఠ్యాంశం.

శాస్త్రిగారు కడప జిల్లాలోని జమ్మలమడుగు తాలూకాలోని నెమళ్ళ దిన్నె గ్రామానికి చెందిన వారు. వారి తల్లిదండ్రులు నరసమాంబ, రామయ్యగార్లు, శాస్త్రిగారు ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూలులో తెలుగు పండితులుగా పనిచేశారు. శాస్త్రిగారు శతావధాని. వీరు మరొక శతావధానియైన రాజశేఖర శతావధాని గారితో కలిసి, కావ్యనాటకాలు రచించారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 4.
మాతృభావన రచయిత ఎవరు? ఆయన రచనల గూర్చి వ్రాయండి.
జవాబు:
మాతృభావన పాఠం గడియారం వేంకటశేషశాస్త్రి గారు రచించారు. ఆయన రచించిన శివభారతంలోని తృతీయాశ్వాసం నుండి ప్రస్తుత పాఠ్యాంశం గ్రహించబడింది.

గడియారం వారి పేరు చెప్పగానే “శ్రీ శివభారతం” గుర్తుకు వస్తుంది. బానిసత్వాన్ని నిరసించి, స్వాతంత్ర్య కాంక్షను రగుల్కొల్పిన మహాకావ్యం శ్రీ శివభారతం.

మురారి, పుష్పబాణ విలాసం, మల్లికామారుతం, శ్రీనాథ కవితా సామ్రాజ్యం, రఘునాథీయం మొదలైన అనేక గ్రంథాలు శాస్త్రిగారు రచించారు.

శాస్త్రిగారికి కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన అనే బిరుదులను సాహితీ విమర్శకులు ఇచ్చారు.

ప్రశ్న 5.
‘స్త్రీలు భారతావని భాగ్యకల్పలతలు’ అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జవాబు:
గడియారము వేంకటశేషశాస్త్రి కవిగారు ‘మాతృభావన’ అనే పాఠంలో, భారతదేశంలో అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలున్నారని వారు పుట్టింటిని, మెట్టింటిని తమ పాతివ్రత్యంతో రక్షించారని చెప్పారు.

‘కల్పలత అంటే కల్పవృక్షం. కల్పవృక్షం కోరిన కోరికలను ఇచ్చే దేవతల వృక్షం. స్త్రీలు భారతదేశానికి భాగ్యాన్ని ప్రసాదించే కల్పవృక్షాల వంటి వారని కవి ఉద్దేశ్యం.

స్త్రీలను గౌరవిస్తే భారతదేశం సౌభాగ్యముగా సర్వసంపదలతో సుఖంగా ఉంటుందని కవి ఉద్దేశ్యం.

ప్రశ్న 6.
శివాజీ స్త్రీలపట్ల చూపిన గౌరవభావం నీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఉంటే వారిని గురించి నాలుగు వాక్యాలు రాయండి.
జవాబు:
శివాజీ స్త్రీల పట్ల గౌరవభావం చూపినట్లే, మా గ్రామ సర్పంచి కూడా స్త్రీలను ఎంతో గౌరవంగా చూసేవాడు. వారు ఎదురు పడితే మాతృభావంతో మెలిగేవాడు. గ్రామంలోని స్త్రీలను ఎవరైనా ఏమన్నా వేధించడానికి చూస్తే ఊరుకొనేవాడుకాదు. వాళ్ళకు తగినబుద్ధి చెప్పేవాడు. ఇతర స్త్రీలను మన తల్లిలాగా, సోదరిలాగా భావించి గౌరవించాలని బోధించేవాడు.

ప్రశ్న 7.
“స్త్రీలు పూజ్యనీయులు” అన్న శివాజీ మాటల వెనుక ఆంతర్యమును సొంత మాటల్లో వివరించండి.
జవాబు:
సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించి, ఆ దుర్గంలోని రాణివాస స్త్రీని కూడా, ఆ సర్దారుతో పాటు బంధించి తెచ్చాడు. అది చూసి శివాజీ కోపంతో ఉగ్రుడైనాడు. స్త్రీలను తల్లులలాగా, తోబుట్టువుల్లాగా గౌరవించాలనేది శివాజీ అభిప్రాయం.

స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలు ఈ భరతమాత కన్నబిడ్డలు. అగ్నిజ్వాలల వంటి స్త్రీలకు అపచారం చేసేవారు ధ్వంసమైపోతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానమూ చేయకూడదనేది శివాజీ మాటల వెనుక ఆంతర్యం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 8.
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. శివాజీ :
శివాజీ మరాఠా వీరుడు. ఆదర్శవాది. మహాబల పరాక్రమవంతుడు. పరస్త్రీని తన తల్లిగా భావిస్తాడు. స్త్రీలకు అవమానం జరిగితే సహించడు. స్త్రీలకు కష్టాన్ని కల్గించే వారెవరినైనా శిక్షిస్తాడు. స్త్రీలను అవమానించే వారిని సహించడు.

2. సోన్ దేవుడు :
శివాజీ సేనాని. బలగర్వం ఎక్కువ. మితిమీరిన ఉత్సాహం, శివాజీ పట్ల భయభక్తులు కలవాడు. ‘కళ్యాణి’ దుర్గం జయించాడు. రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చాడు. శివాజీ కోప్పడ్డాడు. క్షమార్పణ చెప్పి శాంతింపజేశాడు. తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపపడే స్వభావం కలవాడు.

ప్రశ్న 9.
మీ తోడి బాలికల పట్ల ఏ విధమైన గౌరవభావాన్ని వ్యక్తపరుస్తావు?
జవాబు:
మేము మా తోడి బాలికలను అక్కలుగా, చెల్లెళ్ళుగా భావించి, వారిని ప్రేమాదరాలతో గౌరవిస్తాము. వారికి ఏ సహాయం కావలసినా, మేము మాతోడి బాలురతో కలిసి సాయం చేస్తాము. మా తోడి బాలికలు బడికి వచ్చేటప్పుడు లేక వారు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు, వారికి ఏ విధమైన కష్టం కలుగకుండా చూస్తాము. ఎవరైనా ఆకతాయి, అల్లరి పిల్లలు, వారిని అల్లరి పెడితే, మేము ఆ పిల్లలను బెదరించి వారిని తరిమి వేస్తాము. అవసరం అయినప్పుడు మా నోట్సులు వారికి ఇస్తాము. మా తోడి బాలికలకు స్వంత అన్నదమ్ములవలె మేము చేదోడు వాదోడుగా నిలబడతాము.

అవసరం అయితే వారి కోసం మేము మా ప్రాణాలు కూడా ఇచ్చి సాయం చేస్తాము. వారికి రక్షణ సైన్యంగా నిలబడతాము .

ప్రశ్న 10.
పుట్టినిల్లు, మెట్టినిల్లు గౌరవాన్ని నిలబెట్టిన కొందరు స్త్రీలను గురించి వివరించండి.
జవాబు:
అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవి తన పాతివ్రత్యంతో, త్రిమూర్తులను చంటిబిడ్డలుగా చేసి, వారికి జోలపాట పాడింది. సావిత్రి అనే ఇల్లాలు యమధర్మరాజు పాశాన్ని ఎదిరించి తన భర్త ప్రాణాన్ని రక్షించుకొంది. సీతా మహాదేవి, భగభగమండే అగ్ని గుండంలో దూకి, పూలరాశిలో తిరిగినట్లు బయటకు సురక్షితంగా వచ్చింది. సుమతి అనే పతివ్రత తన భర్త ప్రాణాలను రక్షించడం కోసం, సూర్యుడు ఉదయించకుండా సూర్యోదయాన్ని నిలిపి వేసింది. ఈ ఇలా ఎందరో భారతీయ స్త్రీలు, తమ పాతివ్రత్య భాగ్యంతో, తమ పుట్టింటికీ, అత్తవారింటికీ కీర్తిని తెచ్చి,
గౌరవాన్ని నిలబెట్టారు. ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

10th Class Telugu 1st Lesson మాతృభావన 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
“స్త్రీలు పూజింపదగినవారు వారికి ఏ అవమానం చేయకూడదు” అని చాటి చెప్పిన శివాజీ వ్యక్తిత్వాన్ని “మాతృభావన” పాఠం ద్వారా విశ్లేషించండి. (S.A. I – 2018-19)
జవాబు:
వ్యక్తిత్వం అంటే మాటకూ, చేతకూ తేడా లేనితనం. శివాజీ పరస్త్రీలను సైతం కన్నతల్లులవలె, సోదరీమణులవలె చూసి గౌరవించేవాడు. శివాజీ ధర్మప్రభువు. శత్రు దుర్గాలపై దండెత్తినపుడు అక్కడ ఉండే స్త్రీలకూ, బ్రాహ్మణులకూ అపకారం తల పెట్టవద్దని, తన సర్దారులను హెచ్చరించేవాడు.

తన సర్దారు సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించినా, అతడు యవనకాంతను బంధించి తెచ్చినందుకు అతడిపై శివాజీ కోపపడ్డాడు. వెంటనే ఆ యవనకాంతను విడిపించి, తన సర్దారు తొందరలో తప్పు చేశాడనీ, తనను క్షమించమనీ ఆమెను కోరాడు. ఆమెను సత్కరించి తనవారిని తోడిచ్చి, ఆమెను ఆమె ఇంటికి తిరిగి పంపాడు.

శివాజీ క్షమామూర్తి, తప్పు చేశానని అంగీకరించిన సో దేవుడిని క్షమించాడు. శివాజీ స్త్రీలపై అత్యధిక గౌరవం కలవాడు. పతివ్రతలు భారత భాగ్య కల్పలతలని, వారు అగ్నిజ్వాలల వంటివారని, స్త్రీలకు అపచారం చేస్తే నశిస్తారనీ, వారి సంపదలు నశిస్తాయనీ శివాజీ తలంచేవాడు. శివాజీ శత్రువులను సైతం అవమానించని ధర్మమూర్తి. శివాజీది మహోన్నత వ్యక్తిత్వం.

ప్రశ్న 2.
‘మాతృభావన’ పాఠ్యాంశం ఆధారంగా దానిని రచించిన కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
మాతృభావన పాఠం ‘శివభారతము’ అనే కావ్యంలోనిది. ఈ కావ్యాన్ని గడియారం వేంకటశేషశాస్త్రి గారు రాశారు. శివభారతము బానిసత్వాన్ని నిరసించి, భారతీయులలో స్వాతంత్ర్య కాంక్షను రగుల్కొల్పిన కావ్యం.

శివాజీ హిందూమత ధర్మంపై గొప్పభక్తి గౌరవాలు కలవాడు. స్త్రీలందరినీ, కన్నతల్లుల వలె శివాజీ గౌరవించాడు.

గడియారంవారు కూడా, గొప్ప దేశభక్తులు. శివాజీ వంటి దేశభక్తులైన చారిత్రక పురుషులపై గొప్ప భక్తి విశ్వాసాలు కలవారు. గడియారంవారు శివభారతము రచించే రోజుల్లో మన దేశానికి స్వాతంత్ర్యము రాలేదు. అందుకే మన భారతీయులలో స్వాతంత్ర్యంపై కోరికను ఉద్దీపింపజేయడానికి శివభారతాన్ని గడియారం వారు వ్రాశారు.

ఈ పాఠాన్ని బట్టి గడియారంవారు, గొప్ప దేశభక్తులని, హిందూమతంపై భక్తి గౌరవాలు కలవారని, గొప్ప స్వాతంత్ర్య వీరులనీ, మహాకవులనీ మనం గ్రహించగలము. వీరు స్త్రీల పై గౌరవం కలవారు.

అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలపై గొప్ప భక్తి విశ్వాసాలు కలవారు గడియారం వారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 3.
సోన్ దేవుని రాజభక్తిని విశ్లేషించండి.
జవాబు:
అబ్బాజీసో దేవుడు, శివాజీ మహారాజు వద్ద పనిచేసే ఒక సైన్యాధిపతి. సో దేవుడు, శివాజీ ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటిస్తాడు. శివాజీ, సో దేవుడిని కళ్యాణి దుర్గముపై దండయాత్రకు పంపాడు. మహావీరుడైన సో దేవుడు, శివాజీ ఆజ్ఞ ప్రకారం కల్యాణి దుర్గాన్ని జయించి, దాని సర్దారులను పట్టి బంధించి తెచ్చాడు. అంతేకాకుండా ఆ దుర్గంలోని రాణివాస స్త్రీలను కూడా బంధించి వెంట తెచ్చాడు. రాణివాస స్త్రీలను బంధించి తెచ్చాడని విని, శివాజీ కోపంతో సోన్ దేవునిపై మండిపడ్డాడు.

వెంటనే రాణివాస స్త్రీల బంధాన్ని తొలగించి సభలోకి తీసుకొని రమ్మని శివాజీ సో దేవుడిని ఆజ్ఞాపించాడు. రాజభక్తి గల సో దేవుడు, వెంటనే రాణివాస స్త్రీల బంధాలు తొలగించి వారిని సభలోకి తీసుకువచ్చాడు. తనను మన్నింపుమని సో దేవుడు, శివాజీ మహారాజును కోరాడు. కోటను జయించిన ఉత్సాహంతో, అలా స్త్రీలను బంధించి తెచ్చాననీ, తనకు చెడు ఆలోచన లేదనీ, శివాజీ మహారాజును బ్రతిమాలాడు. శివాజీ సోన్ దేవుడి రాజభక్తిని గుర్తించి అతడిని మన్నించాడు. సోన్ దేవుడు గొప్ప రాజభక్తి కల సర్దారు.

ప్రశ్న 4.
సోన్ దేవుడు తప్పు చేసినా సరిదిద్దుకొనే స్వభావం కలవాడు అని నిరూపించండి.
జవాబు:
సోన్ దేవుడు శివాజీ మహారాజు యొక్క సైన్యాధిపతి. శివాజీ సోన్ దేవుడిని కళ్యాణి దుర్గంపై దండయాత్రకు పంపాడు. సోన్ దేవుడు కల్యాణి దుర్గాన్ని జయించి, దాని సర్దారును పట్టి బంధించి, ఆ దుర్గంలోని రాణివాస స్త్రీలను కూడా బంధించి శివాజీ వద్దకు తీసుకువచ్చాడు.

పుణ్యానికి నిలయమైన అంతఃపురకాంతను బందీగా తీసుకురావడం తప్పని, తన ఆజ్ఞను అతడు అతిక్రమించాడనీ శివాజీ మహారాజు సోన్ దేవునిపై ఉగ్రుడయ్యాడు. వెంటనే రాణివాస స్త్రీలను బంధవిముక్తుల్ని చేసి తీసుకురమ్మని శివాజీ సోన్ దేవుడిని ఆజ్ఞాపించాడు.

సోన్ దేవుడు తాను చేసిన తప్పును దిద్దుకొనే స్వభావం కలవాడు. అందువల్లనే సోన్ దేవుడు మరో మాట మాట్లాడకుండా, తాను బంధించి తెచ్చిన అంతఃపుర స్త్రీల బంధాలు విడిపించి, రాజు వద్దకు వారిని తెచ్చి, తనను క్షమించమని శివాజీని బ్రతిమాలాడు. విజయోత్సాహంతో తాను తప్పు చేశాననీ, తనలో చెడు ఆలోచన లేదనీ, శివాజీకి విన్నవించాడు. దీనిని బట్టి సోన్ దేవుడు తప్పుచేసినా, సరిదిద్దుకొనే స్వభావం కలవాడని తెలుస్తోంది.

ప్రశ్న 5.
శివాజీకి స్త్రీల పట్ల ఉండే గౌరవభావాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
శివాజీ మహారాజుకు స్త్రీల పట్ల గొప్ప గౌరవం ఉంది. అంతఃపురకాంతలు పుణ్యమునకు నిలయమైనవారనీ, వారిని బంధించడం కానీ, అవమానించడం కానీ, ఏ భారతీయుడు చేయరాదనీ, శివాజీ అభిప్రాయము. అందుకే కళ్యాణి దుర్గంలోని అంతఃపురకాంతను బంధించి తెచ్చిన తన సైన్యాధిపతి సో దేవుడి పై శివాజీ మండిపడ్డాడు. వెంటనే ఆమెను విడిపించి, ఆమెను గౌరవించి తన సైన్యాన్ని తోడిచ్చి ఆమెను వారి కోటకు పంపాడు. ఆమెను శివాజీ తన తల్లిగా గౌరవిస్తానన్నాడు.

స్త్రీలు భారతభూమిపై తిరిగే పుణ్యదేవతలని, శివాజీ చెప్పాడు. మనదేశంలో పుట్టిన అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలు, తమ పాతివ్రత్యంతో తమ పుట్టింటికీ, అత్తవారింటికీ కీర్తిని తెచ్చారని, శివాజీ మెచ్చుకున్నాడు.

పతివ్రతల పట్ల అపచారం చేసేవారు నశిస్తారనీ, వారి వంశం నిలవదనీ, రావణాసురుడు అలాగే నశించాడనీ శివాజీ చెప్పాడు. స్త్రీలు రత్నముల వంటివారనీ, వారు పూజింపదగినవారనీ, శివాజీ అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 6.
శివాజీ యవనకాంతను ఎందుకు క్షమాపణ కోరాడో వివరించండి.
జవాబు:
శివాజీ, సో దేవుడు అనే సైన్యాధిపతిని కల్యాణి దుర్గంపై దండయాత్రకు పంపాడు. శివాజీ దండయాత్రకు తన సైన్యాన్ని పంపేటప్పుడు, పతివ్రతలయిన స్త్రీలకు ఎటువంటి అపచారము చేయవద్దని వారిని హెచ్చరించేవాడు.

కాని సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించిన ఉత్సాహంతో, దాని సర్దారునూ, అచటి అంతఃపురకాంతలనూ బంధించి తెచ్చాడు. అంతఃపుర స్త్రీలను బంధించి తీసుకురావడం తప్పని శివాజీ అభిప్రాయము.

పతివ్రతలయిన స్త్రీలు అగ్నిజ్వాలల వంటివారని, వారిపట్ల అపచారం చేసేవారు, సంపదలు పోగొట్టుకొని సర్వనాశనం అవుతారనీ, వారి వంశం కూడా నిలువదనీ, శివాజీ అభిప్రాయము. పతివ్రతలు భారతదేశపు భాగ్య కల్పలతలని శివాజీ, నమ్మకము.

అందుకే శివాజీ తన సర్దారు తొందరపడి తప్పు చేశాడనీ, ఆ దోషానికి బాధపడవద్దనీ, తన తప్పును క్షమించమనీ యవనకాంతను కోరాడు. ఆమెను తన తల్లిగా, చెల్లెలుగా భావించి, తన చేతులపై ఆమెను నడిపిస్తాననీ, ఓర్పు చూపించి, తనను సహించి క్షమించమనీ శివాజీ ఆమెను కోరాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 7.
సమాజంలో స్త్రీలను ఎలా గౌరవించాలి?
జవాబు:
సమాజంలో స్త్రీలను తన కన్న తల్లులుగా, తన సోదరీమణులయిన అక్కాచెల్లెండ్రుగా గౌరవించాలి. స్త్రీలను కామ ప్రవృత్తితో చూడకూడదు. తన ఇంటిలో తన తల్లినీ, చెల్లినీ, అక్కనూ ఎలా ప్రేమాదరములతో చూస్తారో, అలాగే పరస్త్రీలను కూడా గౌరవంగా చూడాలి.

ముఖ్యంగా మనతో చదువుకొనే తోడి బాలికలను, మన స్వంత సోదరీమణులుగా చూడాలి. వారికి ఏ విధమైన కీడు . చేయరాదు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిని చూసి సహించరాదు. మన శక్తికొద్దీ స్త్రీలకు జరిగే అన్యాయాలను ఎదిరించి, పోరాడాలి. అవసరం అయితే పోలీసులకు తెలియజేయాలి.

స్త్రీలు అందరూ మనకు తల్లులవంటివారు. స్త్రీలు, పుట్టింటికీ, అత్తింటికీ గౌరవాన్ని తీసుకువస్తారు. స్త్రీ, ఒక వ్యక్తికి భార్యగా, ఇంకొకరికి కన్నబిడ్డగా, మరొకరికి కన్నతల్లిగా ఉండి, సమాజానికి ఎంతో సేవ చేస్తోంది. స్త్రీలు భారతదేశపు భాగ్య కల్పలతలు. వారు అనల జ్యోతుల వంటివారు. స్త్రీల పట్ల పాపం చేస్తే, వారి వంశమూ, సంపదలూ నశిస్తాయి. కాబట్టి స్త్రీలను దేవతామూర్తులవలె, మాతృమూర్తులవలె గౌరవించాలి.

ప్రశ్న 8.
నిజ జీవితంలో స్త్రీలను ఎప్పుడు ఎలా గౌరవించాలో వివరించుము.
జవాబు:
స్త్రీలు భారతదేశపు భాగ్య కల్పలతలు. స్త్రీలలో చిన్న పిల్లలను మనం ప్రేమగా చూడాలి. బాలికలను మనం కన్నబిడ్డల వలె ఆదరించాలి. తోడి బాలికలను మన స్వంత అక్కాచెల్లెళ్ళ వలె ప్రేమతో ఆదరంగా చూడాలి. మనకంటే పెద్దవారైన ఆడవారిని, మన కన్నతల్లులుగా చూసి గౌరవించాలి..

సంఘంలో మంచి పేరు తెచ్చుకున్న స్త్రీలను దేవతా మూర్తులుగా గౌరవించాలి. ప్రహ్లాదుడు పరస్త్రీలను మాతృమూర్తులుగా భావించి గౌరవించేవాడు. స్త్రీలు ఆపదలో ఉంటే, మన శక్తియుక్తులను అన్నింటినీ ధారపోసి, వారికి మనం సహాయం చెయ్యాలి. మన బడిలో మనతో చదువుకొనే బాలికలను, మన చెల్లెళ్ళవలె వాత్సల్య భావంతో చూడాలి. వారికి కావలసిన సహాయం చేయాలి. స్త్రీలు లక్ష్మీ స్వరూపిణులు. స్త్రీలు శక్తి స్వరూపిణులు. స్త్రీల పట్ల సర్వకాల సర్వావస్థలలోనూ గౌరవమూ, ప్రేమ, వాత్సల్యమూ, ఆదరమూ కలిగి ఉండాలి. స్త్రీలను గౌరవిస్తే సకల సంపదలను లక్ష్మీదేవి ఇస్తుంది. అన్ని విద్యలను సరస్వతి ఇస్తుంది.

10th Class Telugu 1st Lesson మాతృభావన Important Questions and Answers

ప్రశ్న 1.
స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో, వివరిస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు లేఖ

రాజమహేంద్రవరం,
x x x x x

ప్రియ మిత్రుడు అఖిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీ లేఖ అందింది. సమాజంలోని స్త్రీల పట్ల మనం ఎలా నడచుకోవాలో ఈ లేఖలో నీకు రాస్తున్నా.

స్త్రీలు దేశ సౌభాగ్యానికి కల్పలతల వంటివారు. స్త్రీలు, కన్నబిడ్డలు, కన్నతల్లులుగా, సోదరీమణులుగా మనకు ప్రేమాదరములను పంచిపెడుతున్నారు. నేడు సంఘంలో స్త్రీల పట్ల అపచారాలు పెరుగుతున్నాయి. స్త్రీలపట్ల అపచారం చేసేవారిని నిర్భయ చట్టంతో శిక్షించాలి.

మనము తోటి స్త్రీలను మన అక్కాచెల్లెళ్ళుగా చూడాలి. మన తోటి చిన్నవారైన బాలికలను ప్రేమగా లాలనగా చూడాలి. పెద్దవారైన స్త్రీలను మన తల్లులవలె చూసి వారిని గౌరవించాలి. స్త్రీలను గౌరవిద్దాం. సంఘాన్ని కాపాడుదాం.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10వ తరగతి, మునిసిపల్ హైస్కూలు,
కుప్పం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
స్త్రీలకు ధైర్యాన్ని పురికొల్పుతూ, ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
సోదరీమణులారా ! ఈ రోజుల్లో మీ పై జరుగుతున్న అత్యాచారాలను చూస్తే అసహ్యం వేస్తోంది. ఈ అరాచకాలను చూసి మీలో కొందరు పాఠశాలలు, కళాశాలలు మాని, ఇళ్ళల్లోనే ఉండిపోతున్నారు. సంఘంలో స్త్రీలు కూడా పురుషులతో అన్ని విధాల సమం. దేశంలో మీరు ఇంచుమించుగా 50% మంది ఉన్నారు. మీరు నిర్భయంగా ముందుకు వచ్చి మీ స్నేహహస్తాన్ని అందించకపోతే, సంఘాభివృద్ధి కుంటుపడుతుంది.

మీరు నిర్భయంగా ముందుకు రండి. మీకు మేము తోడుగా ఉంటాం. పోలీసులు తోడుగా ఉంటారు. నిర్భయ చట్టం వచ్చింది. ఆకతాయి వారిని నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. ఫోటో కెమేరాలు వచ్చాయి. దుండగులు ఎంతటి వారైనా దొరుకుతారు. శిక్ష పడుతుంది. మీరు శక్తి స్వరూపిణులు. ధైర్యమే మీ ఆయుధం.

మేము మీకు రామదండులా తోడు ఉంటాము. నేరస్తులను పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెపుతాము. మేము అంతా మీ అన్నదమ్ముల్లా మీకు సాయం చేస్తాము. నిర్భయంగా మీరు సంఘంలో తిరిగి హాయిగా మీ చదువులు సాగించండి. దేశాభివృద్ధికి మీ చేయూత నివ్వండి. రండి. సాహసించండి.

ఇట్లు,
గాంధీ ‘యువజన సంఘం,
కాకినాడ.

ప్రశ్న 3.
స్త్రీల వలన సమాజానికి కలుగు ప్రయోజనాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
స్త్రీలు, సమాజాభివృద్ధిలో ప్రధానపాత్ర వహిస్తారు. స్త్రీ, ఒక పురుషునికి భార్యగా బిడ్డలను కని, వారిని చక్కగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. ఆమె భర్తకు తోడు నీడగా ఉండి, వంటా వార్పూ చేసి, భర్తకూ, పిల్లలకూ కడుపు నింపుతుంది. బిడ్డలను కని వారికి పాలిచ్చి పెంచుతుంది. భర్తకూ, బిడ్డలకూ, తన ప్రేమామృతాన్ని పంచి పెడుతుంది. కుటుంబంలో ఒడిదుడుకులు లేకుండా దాని సమత్వాన్ని కాపాడుతుంది.

దేశంలో స్త్రీలు, పురుషులతో అన్ని విధాలా సమానులు. అంతేకాదు, పురుషుల కంటే స్త్రీలే దేశ సౌభాగ్యానికీ, కుటుంబ రక్షణకూ ఎక్కువగా తోడ్పడుతున్నారు. స్త్రీ, భర్త సంపాదించి తెచ్చిన దానిని పొదుపుచేసి, కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెస్తుంది. అంతేకాదు. నేటి స్త్రీలు, తాము కూడా తమ భర్తలతో పాటు సంపాదించి కుటుంబాన్ని చక్కగా పోషిస్తున్నారు. నేడు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా కష్టపడుతున్నారు. స్త్రీలను పురుషులు కన్నతల్లులుగా, అక్కాచెల్లెళ్ళుగా గౌరవించాలి.

స్త్రీలు పిల్లలను కని, వారికి పాలిచ్చి పెంచి, వారికి మంచిబుద్ధులు నేర్పిస్తారు. పిల్లలకు, కన్నతల్లులే మొదటి గురువులు. స్త్రీలు విద్యావంతులయితే, దేశం పురోగతి చెందుతుంది. నేడు స్త్రీలు విద్యావంతులై డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, MLA లుగా, MP లుగా ముఖ్యమంత్రులుగా దేశ సేవ చేస్తున్నారు.

స్త్రీలు డ్వా క్రా సంఘాలలో చేరి తమ తెలివితేటలతో సంపాదిస్తున్నారు. దేశాభివృద్ధికి అన్ని రంగాల్లో స్త్రీలు చేయూత నిస్తున్నారు. స్త్రీలు ఏ దేశాభివృద్ధికైనా మూలస్తంభాల వంటివారు. స్త్రీలు లక్ష్మీ స్వరూపులు. శక్తి స్వరూపిణులు. మహిళలు మంచి కళాకారిణులు. వారు దేనినైనా అందంగా మలచి మంచి రూపాన్ని ఇవ్వగలరు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 4.
‘స్త్రీ గౌరవం’ అనే అంశంపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
స్త్రీ గౌరవం,

‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అన్నారు పెద్దలు. అంటే స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తారని అర్థం. కాబట్టి స్త్రీలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు. దేవతలు అంటే లక్ష్మి, సరస్వతి, గాయత్రి, శివుడు, విష్ణువు మొదలైనవారు. వారంతా కొలువై ఉంటే డబ్బుకు, చదువుకు, ఆనందానికి, ఆరోగ్యానికి లోటుండదు.

మనకు జన్మనిచ్చిన స్త్రీని తల్లిలా పూజించాలి. గౌరవించాలి. తల్లి ఆలన పాలన చూడకపోతే శ్రీ రామచంద్రుడైనా లేడు కదా! 9 నెలలు తన కడుపులో మోసి, కని, పాలిచ్చి పెంచిన తల్లిఋణం తీర్చుకోవటం మగజన్మకు సాధ్యంకాదు. కాని సమాజంలోని ప్రతి స్త్రీలోను తల్లిని దర్శించడం ద్వారా కొంత ఋణం తీరుతుంది.

‘స్త్రీలను గౌరవించాలి. వారి మనసుకు బాధ కలిగేలా ప్రవర్తించకూడదు. స్త్రీల మనసు సుకుమారమైనది. స్త్రీకి కోపం కలిగేలా ప్రవర్తిస్తే నాశనం తప్పదు. రావణుడు, దుర్యోధనుడు మొదలైనవారు అలాగే నశించారు.

‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండనొల్లదు’ అన్నారు పెద్దలు. ఎక్కడైతే స్త్రీ కన్నీరు పెడుతుందో అక్కడ కరవు, కాటకాలు, దరిద్రం వస్తాయి.

అందుకే శివాజీ వంటి గొప్పవారు స్త్రీలను గౌరవించారు. పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు చదివిన వారెవ్వరూ స్త్రీని బాధపెట్టే సాహసం చేయరు. ఇది భారతీయతత్వం.

ఇవేవీ నమ్మని వారు కూడా గుర్తుపెట్టుకోవలసినది మన చట్టాలు. చట్ట ప్రకారం స్త్రీని బాధిస్తే చాలా కఠిన శిక్షలకు గురి అవుతారు. సమాజంలో వెలివేయబడతారు. అందుచేత స్త్రీలను గౌరవించడమంటే మనను మనం గౌరవించుకోవడం అని గుర్తుపెట్టుకోవాలి.

ప్రశ్న 5.
స్త్రీల చైతన్యంపై 10 నినాదాలు తయారుచేయండి.
జవాబు:

  1. అబలలన్నది పాతమాట – సబలలన్నది నేటిమాట
  2. స్త్రీలను గౌరవించు – శ్రీదేవిని ఇంటికి రప్పించు
  3. స్త్రీలు లక్ష్మీ స్వరూపిణులు – స్త్రీలు పూజ్యార్హలు
  4. ఆడది చదువుకుంటే – ఆ ఇంట్లో సంస్కారం ఉంటుంది
  5. స్త్రీలను గౌరవిస్తే – మీ అమ్మను గౌరవించినట్లే
  6. స్త్రీలను అవమానిస్తే – శ్రీదేవిని కాలదన్నినట్లే
  7. చదివిస్తే స్త్రీలు – నేర్వలేని విద్యలేదు
  8. ఆడవాళ్ళను – అగ్రస్థానంలో ఉంచండి
  9. మహిళలు – మన జాతి మాణిక్యాలు
  10. వనితలన్న – నీవు ఎపుడు తల్లి చెల్లిలాగ చూడు

ప్రశ్న 6.
“మహిళల రక్షణ మన కర్తవ్యం” అనే అంశంపై కరపత్రం రాయండి.
జవాబు:
(“మహిళల రక్షణ మన కర్తవ్యం “)

సోదర సోదరీ మణులారా ! చెప్పడానికి, సిగ్గువేస్తోంది. దేశంలో ఎక్కడో అక్కడ మన మహిళలకు అవమానం నిత్యం జరుగుతూనే ఉంది. పసిపాపలపై, యువతులపై, ముసలి స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. యాసిడ్, దాడులు, ఈవ్ టీజింగ్లు, హింసాకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

మన ఇంట్లో మన తల్లిని, అక్క చెల్లెళ్ళను మనం కాపాడుకుంటున్నాము. అలాగే మన ప్రక్క మహిళలను సైతం, మనమే రక్షించుకోవాలి. మహిళలకు అన్యాయం జరిగితే, లోకం సహించదు అనే విషయం దుర్మార్గులకు తెలియాలి.

మహిళకు అన్యాయం జరుగుతూ ఉంటే, మీరు సహించకండి. ఉగ్రనరసింహరూపం ఎత్తి అన్యాయాన్ని అరికట్టండి. అవసరం అనుకుంటే ప్రక్కవారి సాయం తీసుకోండి. పోలీసుల సాయం కోరండి. మన మహిళలను మనమే రక్షించుకుందాం.

మనం అంతా ఉద్యమిస్తేనే, మన మహిళకు రక్షణ దొరుకుతుంది. మనం మహిళలను గౌరవించి, మన పవిత్ర భారతమాత ఖ్యాతిని నిలుపుకుందాం. మన మహిళలను మనమే రక్షించుకుందాం.

జైహింద్

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 7.
మానవ జీవితాన్ని గురించిన విశ్లేషణను 8, 10 పంక్తులకు తగ్గని కవిత ద్వారా తెల్పండి.
జవాబు:
(“మనిషి మాయం అయ్యాడు” (కవిత) ,

“మాయమవుతున్నాడు మనిషన్నవాడు
మానవత్వమ్ము మరి మచ్చుకైనా లేదు
నూటికో కోటికో ఒక్కడున్నాడేమో
కంటికీ కనరాని కమలాక్షుడతడు” ||మాయ ||

“నిలువెత్తు స్వార్థమ్ము నిజాయితీ శూన్యమ్ము
అన్నదమ్ముల బంధ మావిరయ్యిందమ్మ
ఇరుగు పొరుగుల మైత్రి ఇగిరిపోయిందమ్మ
అవినీతి బంధాలు అతికించుకున్నాడు.
రూపాయి చుట్టునా ప్రదక్షిణం చేస్తాడు” ||మాయ ||

“చీమలకు పాములకు పంచదారా పాలు
తోడబుట్టిన వార్కి గంజైన పోయడు
మతము పేరున లోకహితము గుర్తుకు రాదు
ముసలి తల్లీతండ్రి విషము అయిపోతారు.
పెళ్ళాము బెల్లమ్ము అత్తమామలు ముద్దు
చెల్లితల్లీ లేదు చెడునడత వనీతన్న
మాయమయి పోయాడు మనిషన్నవాడు” ||మాయ ||

ప్రశ్న 8.
శివాజీకి, సోన్ దేవుడికి మధ్య జరిగిన సంభాషణను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
శివాజీ : సోన్ దేవా ! ఏంటీ ! రాణివాసాన్ని బంధించి తెచ్చావా? హిందువు అన్నవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? నా ఆజ్ఞ నీకు గుర్తులేదా? అర్థం కాలేదా? చావాలని అనుకుంటున్నావా? నీ గర్వాన్ని ఎంతమాత్రం
సహించను. తక్షణం వెళ్ళి వారి బంధాలు విడిపించి తీసుకురా! వెళ్ళు.

సోన్ దేవుడు : చిత్తం మహారాజా !

శివాజీ : వెంటనే వెళ్ళు

సోన్ దేవుడు : (అంతఃపుర కాంతను తీసుకువచ్చి) అయ్యా (ప్రభూ!) నన్ను క్షమించండి. విజయోత్సాహంతో నా కళ్ళు మూసుకుపోయాయి. చెడ్డ చేయాలనే ఆలోచన నాకులేదు. మీ ఆజ్ఞ అతిక్రమించాలనే సాహసం లేదు. మీ పాదాలపై ఒట్టు.

శివాజీ : సోన్ దేవా! తప్పు చేశావు. స్త్రీలను పూజించాలి. వారిని అవమానించకూడదు. నా సైన్యాధిపతులు ఈ విషయాన్ని బాగా గమనించాలి. సరేలే నీ మనస్సు నేను గ్రహించాను. నీలో తప్పులేదు. ఇక ముందు జాగ్రత్త. వెళ్ళు.

ప్రశ్న 9.
స్త్రీలను దేవతలుగా భావించి పూజించాలి’ అనే మాటలను సమర్ధించండి.
జవాబు:
గడియారం వేంకటశేష శాస్త్రిగారు చెప్పినట్లు స్త్రీలు భారతావని భాగ్యకల్పలతలు. అనసూయ పాతివ్రత్యంతో త్రిమూర్తులను పురుటి బిడ్డలుగా చేసి వారికి జోలపాడింది. సావిత్రి యమధర్మరాజుతో పోరాడి భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది. సీతాదేవి పూలరాశిలో దూకినట్లు అగ్నిగుండంలో దూకింది. సుమతి తన భర్తను బ్రతికించుకోడం కోసం సూర్యోదయాన్ని నిలిపివేసింది.

స్త్రీలు అందరూ దేవతామూర్తులే. స్త్రీలను గౌరవించిన చోటనే దేవతలు విహరిస్తారని పెద్దలంటారు. స్త్రీలు మనకు జన్మనిచ్చే మాతృమూర్తులు. మనకు పాలిచ్చి పెంచే సహనమూర్తులు. వంటవండి మనకు కడుపు నిండా ఆహారాన్ని పెట్టే దేవతలు. ఆ దేవతల వంటి స్త్రీలపై దౌర్జన్యాలు, మానభంగాలు చేయడం మహాపాపం.

స్త్రీలను గుడిలో దేవతామూర్తుల వలె పూజించాలి. గౌరవించాలి. స్త్రీలను తల్లులుగా, సోదరీమణులుగా, మాతృమూర్తులుగా గౌరవించాలి.

మనదేశంలో అరుంధతి, అనసూయ వంటి పతివ్రతలు ఎందరో ఉన్నారు. నేటి కాలంలో కూడా ఇందిర, దుర్గాబాయి, మీరాకుమారి, మహాజన్, సరోజినీనాయుడు, మాంటిసోరీ వంటి దేవతాస్వరూపిణులు ఎందరినో మనం చూస్తున్నాం.

ప్రశ్న 10.
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారిని గౌరవించాలని తెలుపుతూ, ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:
స్త్రీలపై అత్యాచారాలను అరికట్టండి’ సోదరులారా ! మీకు ఒక విన్నపం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. పేపరు తెరిస్తే, టివి పెడితే, ఎక్కడో ఒకచోట మన కన్నతల్లులకు, మనకు పాలిచ్చి పెంచిన స్త్రీ మూర్తులకు అవమానం జరిగిందని వార్త చూస్తాం. మనం మానవులం. రాక్షసులం కాదు.

పసిపాపలపై అత్యాచారాలు, వృద్ధ స్త్రీలపై అత్యాచారాలు, తోటి విద్యార్థినులపై, పొరుగున ఉన్న ఇల్లాలిపై అత్యాచారాలు. వెంటనే అత్యాచారాలను అరికట్టండి.

దేవతలవంటి స్త్రీలపై అత్యాచారం చేయడం రాక్షసత్వం. స్త్రీలందరూ నీకు కన్నతల్లుల వంటివారు, అక్కచెల్లెళ్ళవంటి వారు. స్త్రీలను గౌరవించాలి, పూజించాలి.

నిర్భయ చట్టం వచ్చింది. జాగ్రత్త. స్త్రీలను అగౌరవపరిస్తే నడిరోడ్డుపైననే మిమ్మల్ని కాల్చి చంపుతారు. చట్టం పదును ఎక్కింది. జాగ్రత్త.

స్త్రీమూర్తులను పవిత్రభావంతో చూడండి. వారిని గౌరవించండి. వారికి సాయపడండి. అన్యాయం మీ కంట పడితే ఉగ్రనరసింహునిలా భయంకరంగా శిక్షించండి.
మీరు తోటి స్త్రీలను గౌరవిస్తే, దుర్గాదేవికి లక్ష కుంకుమపూజ చేసినట్లే. లలితాసహస్రం పారాయణ చేసినట్లే. గుర్తుంచుకోండి. స్త్రీలు భారత భాగ్య కల్పలతలు.
ఇట్లు,
x x x x.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 11.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x

ప్రియ మిత్రుడు అఖిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ లేఖలో తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ రాస్తున్నాను.

స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. వారికి అపచారం చేసే వారు ధ్వంసమైపోతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానం జరుగకుండా చూడాలి. తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని తెలియజేస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10వ తరగతి, యం.వి.ఆర్. హైస్కూలు,
కుప్పం, చిత్తూరు జిల్లా.

ప్రశ్న 12.
స్త్రీలను గౌరవించడాన్ని ప్రోత్సహిస్తూ పది సూక్తులు రాయండి.
జవాబు:

  1. స్త్రీలు అబలలు కాదు – సబలలు
  2. మహిళలు – మనజాతి మాణిక్యాలు
  3. స్త్రీలను గౌరవించు – శ్రీదేవిని ఇంటికి రప్పించు
  4. స్త్రీలే జాతిరత్నాలు – స్త్రీలే ఆణిముత్యాలు
  5. స్త్రీలను గౌరవిస్తే – మీ అమ్మను గౌరవించినట్లే
  6. స్త్రీలను అవమానపరిస్తే – జాతిని అవమానపరిచినట్లే
  7. స్త్రీలను గౌరవిస్తే – దేవతలు ఆనందిస్తారు
  8. వనితలేని ఇల్లు – వనంతో సమానం
  9. స్త్రీ లక్ష్మీ స్వరూపిణి – స్త్రీ పూజ్యురాలు
  10. స్త్రీని గౌరవించు – మాతృమూర్తిగా ఆదరించు

10th Class Telugu 1st Lesson మాతృభావన 1 Mark Bits

1. వారు మదోన్మాదముతో ప్రవర్తించారు – గీత గీసిన పదంలో గల సంధి ఏది? (S.A. I – 2018-19, June – 17)
A) గుణసంధి
B) యణాదేశ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) గుణసంధి

2. చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. (June 2017)
A) లాటానుప్రాసం
B) యమకం
C) ఛేకానుప్రాసం
D) వృత్యానుప్రాసం
జవాబు:
A) లాటానుప్రాసం

3. ధర్మసామ్యము చేత ఉపమేయమును ఉపమానంగా ఊహించుట – ఈ లక్షణం గల అలంకారాన్ని గుర్తించండి. (June 2017)
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) శ్లేష
జవాబు:
B) ఉత్ప్రేక్ష

4. అనసూయ పతివ్రతలలో శిరోమణి – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించుము. (March 2017)
A) మంచి అవయవములు గలది.
B) చిత్రమైన వర్ణములు గల మెడ గలది.
C) నీటియందు పుట్టినది.
D) పతిని సేవించుటయే వ్రతముగా గలది.
జవాబు:
D) పతిని సేవించుటయే వ్రతముగా గలది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

5. పురాణ వాజ్మయమును చదివి అవగాహన చేసుకోవాలి – గీత గీసిన పదానికి సంధి పేరు గుర్తించండి. (March 2017)
A) యణాదేశ సంధి
B) వృద్ధి సంధి
C) జశ్వసంధి
D) అనునాసిక సంధి
జవాబు:
D) అనునాసిక సంధి

6. ‘స, భ, ర, న, మ, య, వ’ ఏ పద్యానికి చెందిన గణాలు? (March 2017)
A) శార్దూలం
B) మత్తేభం
C) చంపకమాల
D) ఉత్పలమాల
జవాబు:
B) మత్తేభం

7. జననికి, జన్మభూమికి గౌరవమివ్వడం ఉత్తముల లక్షణం – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించుము. (March 2018)
A) చెల్లి
B) తల్లి
C) నల్లి
D) వల్లి
జవాబు:
B) తల్లి

8. రాజులు యుద్ధములందు ఏనుగులను ఎక్కువగా ఉపయోగించేవారు – గీత గీసిన పదానికి వికృతి రూపం గుర్తించండి. (March 2018)
A) ఏడు
B) రోజు
C) టేడు
D) రాట్టు
జవాబు:
C) టేడు

9. వాన బాగా పడేసరికి ఇల్లు తడిసిన వస్త్రములతో నిండింది – గీత గీసిన పదాలకు నానార్థపదమును గుర్తించుము. (S.A. I – 2018-19, June – ’18)
A) వాసం
B) మోసం
C) సహవాసం
D) వేషం
జవాబు:
A) వాసం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

10. ఆ యేమీ యొక రాణివాసమును …….. అనే పద్యపాదంలో గీత గీసిన పదం ఏ గణమో గుర్తించండి. (June 2018)
A) మ గణం
B) త గణం
C) భ గణం
D) న గణం
జవాబు:
A) మ గణం

11. జాతి, గుణ, క్రియాదులను ఉన్నది ఉన్నట్లు వర్ణించినచో అది ఏ అలంకారమో గుర్తించండి. (S.A. I – 2018-19)
A) సమాసోక్తి
B) స్వభావోక్తి
C) శ్లేష
D) రూపకము
జవాబు:
B) స్వభావోక్తి

12. ఎప్పుడూ అమ్మను కష్టపెట్టకూడదు. (ప్రకృతి గుర్తించండి) (S.A. I – 2018-19)
A) అంభ
B) అంబ
C) అమ్మమ్మ
D) అమ్మవారు
జవాబు:
B) అంబ

13. “అనల జ్యోతుల నీ పతివ్రతల బాపాచారులైడా యంభూ” ఏ పద్యపాదమో గుర్తించండి. (S.I. I – 2018-19)
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
D) మత్తేభము

14. చంపకమాల పద్యపాదంలో యతి స్థానం (S.A. I – 2018-19)
A) 10
B) 11
C) 13
D) 14
జవాబు:
B) 11

15. మాతా ! తప్పు సైరింపుమీ – ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి. (June 2018)
A) తల్లీ ! తప్పును సైరింపకుము.
B) తల్లీ ! తప్పును క్షమించుమమ్మా !
C) తల్లీ ! ఈ దోషమును సైరింపుము.
D) తల్లీ ! అందరి దోషంబులు సైరింపుము.
జవాబు:
B) తల్లీ ! తప్పును క్షమించుమమ్మా !

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

16. వనితా రత్నంబులీ భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2018)
A) స్త్రీ రత్నాలు ఈ గొప్ప హైందవ భూమిపై తిరిగే పుణ్యదేవతలు.
B) స్త్రీలు ఈ హిందూ భూమిపై సంచరించే పుణ్యదేవతలు కారు.
C) స్త్రీ రత్నాలు హైందవ భూమిపై తిరిగే జంగమదేవతలా?
D) హిందూ భూమిపై తిరిగే స్త్రీలు పుణ్యదేవతలు కావచ్చును.
జవాబు:
A) స్త్రీ రత్నాలు ఈ గొప్ప హైందవ భూమిపై తిరిగే పుణ్యదేవతలు.

17. శివాజీ యవనదేశ స్త్రీని తల్లిగా భావించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. (March 2011)
A) శివాజీ యవన స్త్రీని తల్లిగా భావించలేదు.
B) శివాజీచే యవన దేశ స్త్రీ తల్లిగా భావించబడలేదు.
C) శివాజీచే యవన దేశ స్త్రీ తల్లిగా భావించబడింది.
D) యవన దేశ స్త్రీ శివాజీ తల్లిగా భావించబడింది.
జవాబు:
C) శివాజీచే యవన దేశ స్త్రీ తల్లిగా భావించబడింది.

18. మా యాజ్ఞన్ గమనింపవో? (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి) (S.I. I – 2018-19)
A) మా ఆజ్ఞని గమనింపవా?
B) మా యాజ్ఞ గమనింపవే?
C) మా యాజ్ఞను గమనింపుమా !
D) మా యాజ్ఞ గమనింపుడు !
జవాబు:
A) మా ఆజ్ఞని గమనింపవా?

19. క్రింది వానిలో ‘శత్రర్థకం’ గుర్తించండి.
A) విని
B) వినగలడు
C) వింటూ
D) వినక
జవాబు:
C) వింటూ

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమాలకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.

1) లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు.” ఇవి హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.

2) గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె, ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు.”

గురులఘువుల గుర్తులు

లఘువు అని తెలుపడానికి గుర్తు : I ‘ల’
గురువు అని తెలుపడానికి గుర్తు : U ‘గ’

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

గురులఘువుల నిర్ణయం

ఎ) గురువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధానము.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 1

బి) లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 2

గమనిక : గురువులు కాని అక్షరాలన్నీ లఘువులు

1) ఋ కారంతో కూడిన అక్షరం సంయుక్తాక్షరం కాదు. ‘ఋ’ అనేది అచ్చు. అందువల్ల అది లఘువు. దానికి ముందు అక్షరం కూడా లఘువే.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 3

2) సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని ఊది పలికితేనే, అది గురువు అవుతుంది. లేకపోతే లఘువు అవుతుంది.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 4

3) ఏకపదంలోనూ, సమాసంలోనూ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఊది పలకబడుతుంది. కాబట్టి అది గురువు అవుతుంది.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 5

గణ విభజన

1) ఒకే అక్షరం గణాలు : ఒకే అక్షరం గణంగా ఏర్పడితే, అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 6

2) రెండక్షరాల గణాలు : రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువులు, లఘువులు ఉంటాయి. ఇవి నాలుగు రకాలు.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 7

అభ్యాసము : రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 8

మూడక్షరాల గణాలు

మూడక్షరాల గణాలు మొత్తం ఎనిమిది (8).
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 9
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 10

అ) మూడక్షరాల గణాలను గుర్తించే సులభ మార్గము :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 11

య, మా, తా, రా, జ, భా, న, స అనే సూత్రాన్ని కంఠస్థం చేసి, పై విధంగా ఒక చక్రం గీయండి. మీకు కావలసిన గణం పేరు గల మొదటి అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ అక్షరాన్నుండి కుడిగా ఉన్న మూడక్షరాలలోనూ గురు లఘువులు ఏ క్రమంగా ఉన్నాయో, మీకు కావలసిన గణానికి గురు లఘువులు ఆ క్రమంలో ఉంటాయి.

ఉదా : మీకు ‘య’ గణం యొక్క గురు లఘువుల క్రమం కావాలి అనుకోండి. అపుడు ‘య’ నుండి కుడివైపుగా ‘యమాతా’ అనే మూడక్షరాలను వేరుగా వ్రాయండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 12

ఆ) మూడక్షరాల గణముల నిర్ణయంలో మరో పద్ధతి :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 13

అని వ్రాసుకొని, దానికి గురు లఘువులు గుర్తించండి. మీకు కావలసిన గణం పేరు గల అక్షరంతో, ప్రక్క రెండు అక్షరాలూ కలిపి, దానిలోని గురు లఘువులు ఎలా ఉన్నాయో గమనిస్తే, ఏ గణానికి ఏ అక్షరాలు ఉంటాయో తెలుస్తుంది.
ఉదా :
1) య గణం = యమాతా = I U U = ఆది లఘువు
2) మ గణం = మాతారా = U U U = సర్వ గురువు
3) త గణం= తారాజ = U U I = అంత్య లఘువు
4) ర గణం = రాజభా = U I U = మధ్య లఘువు
5) జ గణం = జభాన = I U I = భాన మధ్య గురువు
6) భ గణం = భానస = U I I = ఆది గురువు
7) న గణం = నసల = I I I = సర్వ లఘువులు
8) లగము (లేక ‘వ’ గణం) = I U (లఘువు, గురువు)

నాలుగు అక్షరాల గణాలు
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 14

సూర్య గణాలు – ఇంద్ర గణాలు
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 15

యతి – ప్రాసలు

I. గమనిక : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు.
1. యతి : పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
2. ప్రాస : పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

II. గమనిక : నియమం చెప్పినచోట ‘యతి’, ‘ప్రాస’లు ప్రయోగించడం వల్ల చదవడానికి, వినడానికీ, జ్ఞాపకం పెట్టుకోడానికీ — సౌకర్యం కలుగుతుంది.

3. యతిమైత్రి :
పద్యపాదం యొక్క మొదటి అక్షరంతో, ఆ పద్యంలో నిర్ణయింపబడిన స్థానమందలి అక్షరం మైత్రి కలిగి ఉండడాన్ని యతిమైత్రి అంటారు. యతిమైత్రి యతిస్థానంలోని హల్లుకేకాక, అచ్చుతో కూడా మైత్రి ఉండాలి.

1. ఉత్పలమాల
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 16 AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 17

గమనిక :
పై పాదాల్లో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇలా పద్యంలో నాలుగు పాదాల్లోనూ ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్త పద్యం’ అంటారు.

యతి :
పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరం గానీ, దాని వర్ణమైత్రి అక్షరం గానీ ఆ పాదంలో మరొకచోట రావడాన్ని ‘యతిమైత్రి’ లేదా యతిస్థానం అంటారు.

పై పద్యపాదాల్లో పదవ అక్షరం (ఆ – అని జే – సి) యతి.

ప్రాస :
పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాల్లోనూ ‘య’ అనే అక్షరం వచ్చింది. ఈ పద్యాలలో రెండవ అక్షరంగా ఒకే గుణింతాక్షరం రావడాన్ని ‘ప్రాస’ నియమం అంటారు. పై లక్షణాలు గల పద్యాన్ని ‘ఉత్పలమాల’ పద్యం అంటారు.

ఉత్పలమాల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రాస నియమం ఉంటుంది.
  5. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

2. చంపకమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 18

చంపకమాల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం (ఈ పాదంలో అ – య).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. శార్దూలం
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 19

శార్దూల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం (ఈ పాదంలో ఆ – యం).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.

4. మత్తేభం:
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు 1

మత్తేభ పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం (ఈ పాదంలో ప – పా).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

5. తేటగీతి

తేటగీతి పద్య లక్షణాలు :

  1. ఇది ‘ఉపజాతి’ పద్యం.
  2. ఈ పద్యానికి నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
  4. నాలుగో గణం మొదటి అక్షరం యతి స్థానం.
  5. ప్రాస యతి చెల్లుతుంది.
  6. ప్రాస నియమం లేదు.

ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు 2
పై పద్యంలో 1 సూర్య గణం, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యపాదం.
ఇక్కడ ‘ప్రాసయతి’ వాడబడింది.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

6. ఆటవెలది

ఆటవెలది పద్య లక్షణాలు :
1) ఇది ‘ఉపజాతి’ పద్యం.
2) ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
3) 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్య గణాలు, రెండు ఇంద్ర గణాల చొప్పున ఉంటాయి.
4) 2, 4 పాదాల్లో ఐదూ సూర్య గణాలే ఉంటాయి.
5) ప్రతి పాదంలోనూ నాల్గవ గణంలోని మొదటి అక్షరం యతి. యతిలేనిచోట ప్రాసయతి చెల్లుతుంది.
6) ప్రాస నియమం పాటింపనవసరం లేదు.
ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు 3

7. సీసం : (ఉపజాతి పద్యాలంటే తేటగీతి, ఆటవెలది, సీసం)
సీసము పద్య లక్షణాలు :

  1. సీస పద్యంలో నాలు పెద్ద పాదాలు ఉంటాయి. ఈ పెద్ద పాదం రెండు భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలోనూ నాలుగేసి గణాల చొప్పున, ఒక్కొక్క పెద్ద పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి. ఈ 8 గణాల్లో మొదట ఆరు ఇంద్ర గణాలు, చివర రెండు సూర్య గణాలు ఉంటాయి.
  2. సీస పద్యపాదంలోని రెండు భాగాల్లోనూ, ప్రతి భాగంలోనూ మూడవ గణం మొదటి అక్షరంతో యతిమైత్రి ఉండాలి. యతిలేని చోట ప్రాసయతి ఉండవచ్చు.
  3. సీస పద్యంలో నాల్గు పెద్ద పాదాల తరువాత ఒక తేటగీతి గాని, ఆటవెలది గాని చేర్చాలి.

ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 20

8. ద్విపద
ద్విపద పద్య లక్షణాలు:

  1. ‘ద్విపద’ పద్యంలో రెండు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదంలోనూ వరుసగా మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం ఉంటాయి.
  3. మూడవ గణం మొదటి అక్షరంతో యతి.
  4. ప్రాసయతి చెల్లుతుంది.
  5. ప్రాస నియమం పాటింపబడుతుంది.

గమనిక :
ప్రాస నియమం లేని ద్విపదను ‘మంజరీ ద్విపద’ అంటారు.
ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 21

9. కందం
కందం పద్య లక్షణాలు :

  1. ఈ ‘కందం’ పద్యములో గగ, భ, జ, స, నల అనే గణాలు ఉంటాయి.
  2. మొదటి పాదం ‘లఘువు’తో మొదలయితే అన్ని పాదాల్లోనూ మొదటి అక్షరం లఘువుగానే ఉండాలి. మొదటి . పాదము ‘గురువు’తో మొదలయితే, అన్ని పాదాల్లోనూ మొదటి అక్షరం గురువుగానే ఉండాలి. 3) రెండవ, నాల్గవ పాదాల్లోని చివరి అక్షరం గురువుగా ఉండాలి.
  3. 1, 2 పాదాలలో (3 + 5) 8 గణాలు; 3, 4 పాదాల్లో (3 + 5) = 8 గణాలు ఉంటాయి.
  4. 1, 2 పాదాలు, 3, 4 పాదాలు కలిసిన మొత్తం 8 గణాల్లో 6వ గణం “నలము” గాని ‘జగణం’ కాని కావాలి.
  5. బేసి గణం జగణం ఉండరాదు.
  6. ప్రాస నియమం ఉండాలి.

ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 22

వృత్తాలు – లక్షణాలు – సులభంగా గుర్తు పట్టడం

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 23

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

పద్యపాదాలను గుర్తించి, గణ విభజన చేయడం

ఈ క్రింది పద్యపాదాలకు గణ విభజన చేసి, అవి ఏ పద్యపాదాలో గుర్తించి, యతిని పేర్కొనండి.
1) వెన్నెల వెల్లి పాల్కడలి వ్రేక దనంబున బేర్చి దిక్కులన్
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 24
గమనిక : పై పద్యపాదంలో “భ, ర, న, భ, భ, ర, వ” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్య పాదం. యతిస్థానం 10వ అక్షరం (వె – వే).

2) దెసలను కొమ్మ లొయ్యనతి దీర్ఘములైన కరంబులన్ బ్రియం
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 25
పై పద్యపాదంలో “న, జ, భ, జ, జ, జ, ర” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది చంపకమాల పద్యపాదం. యతి స్థానం 11వ అక్షరం (దె – దీ)

3) ఆ యేమీ యొక రాణి వాసమును బుణ్యవాసమున్ దెచ్చినా
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 26

పై పద్యపాదంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది శార్దూల పద్యపాదం.. యతి స్థానము 13వ అక్షరం (ఆ – ణ్యా)

4) శివరాజంతట మేల్ము సుంగుఁదెరలో స్నిగ్దాంబుద చ్చాయలో
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 27

పై పద్యపాదంలో “స, భ, ర, న, మ, య, వ” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది మత్తేభ పద్యపాదం. యతి స్థానం 14వ అక్షరం (శి – స్ని).

ఛందస్సుపై ప్రశ్నలు

1) ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు, ఏ పద్యానికి చెందినవి ?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
A) ఉత్పలమాల

2) ‘న జ భ జ జ జ ర’ గణాలు ఏ పద్యానికి చెందినవి?
A) శార్దూలము
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) చంపకమాల
జవాబు:
D) చంపకమాల

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3) ‘మసజసతతగ’ గణాలు ఏ పద్యానికి చెందినవి?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు:
D) శార్దూలం

4) ‘సభరనమయవ’ గణాలు ఏ పద్యానికి చెందినవి?
A) ఉత్పలమాల
B) మత్తేభము
C) శార్దూలము
D) చంపకమాల
జవాబు:
B) మత్తేభము

5) 14వ అక్షరంతో యతి గల పద్యము
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
D) మత్తేభము

6) ఉత్పలమాల పద్యానికి ఈ అక్షరంతో యతి
A) 11వ అక్షరం
B) 10వ అక్షరం
C) 13వ అక్షరం
D) 14వ అక్షరం
జవాబు:
B) 10వ అక్షరం

7) చంపకమాల పద్యానికి ఈ అక్షరంతో యతి
A) 10వ అక్షరం
B) 13వ అక్షరం
C) 14వ అక్షరం
D) 11వ అక్షరం
జవాబు:
D) 11వ అక్షరం

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

8) 13వ అక్షరంతో యతి గల పద్యం ఇది
A) శార్దూలము
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) చంపకమాల
జవాబు:
A) శార్దూలము

9) ‘అతడు’ – ఇది ఏ గణమో గర్తించండి?
A)త గణం
B) ర గణం
C) భ గణం
D) య గణం
జవాబు:
C) భ గణం

10) ‘మీయయ్య’ – ఇది ఏ గణమో గుర్తించండి?
A) ర గణం
B) త గణం
C) న గణం
D) మ గణం
జవాబు:
B) త గణం

11) ‘శ్రీరామా’ అనే పదం ఈ గణానికి చెందింది.
A) మ గణం
B) న గణం
C) ర గణం
D) స గణం
జవాబు:
A) మ గణం

12) ‘సీస పద్యం ‘ మీద చేరే పద్యాలలో ఇది ఒకటి
A) కందము
B) తేటగీతి
C) ఉత్పలమాల
D) ద్విపద
జవాబు:
B) తేటగీతి

13) ‘తేటగీతి’ పద్యంలో యతి ఏది?
A) 3వ గణాద్యక్షరం
B) రెండవ గణాద్యక్షరం
C) నాల్గవ గణాద్యక్షరం
D) ఐదవ గణాద్యక్షరం
జవాబు:
C) నాల్గవ గణాద్యక్షరం

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

14) పద్యంలో ప్రాసాక్షరము ఏది?
A) 4
B) 2
C) 3
D) 1
జవాబు:
B) 2

15) ‘యతి’ అంటే ఎన్నవ అక్షరము?
A) మూడవ
B) రెండవ
C) ఒకటవ
D) నాల్గువ
జవాబు:
C) ఒకటవ

16) ‘ఆటవెలది’ పద్యానికి గల పాదాలు
A) 2
B) 4
C) 5
D) 6
జవాబు:
B) 4

17) “అనయము దోషమే పరులయందు కనుంగొనునట్టియా’ – ఈ పాదంలో గురులఘువులు గుర్తించి, ఏ పద్యపాదమో పేర్కొనండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 28
ఇది చంపకమాల పద్యపాదము.

18 ‘పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచ్చినంతలో’ – ఈ పాదంలో గురులఘువులు గుర్తించి, ఏ పద్యపాదమో పేర్కొనండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 29
ఇది ఉత్పలమాల పద్యపాదము.

19) సురుచిర తారకా కుసుమ శోభి నభోంగణ భూమిఁ గాలమన్’ – ఈ పాదానికి గురులఘువులు గుర్తించి, ఏ పద్యపాదమో పేర్కొనండి. పేర్కొనండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 30
ఇది చంపకమాల పద్యపాదము.