AP State Syllabus AP Board 9th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson నేనెరిగిన బూర్గుల

9th Class Telugu ఉపవాచకం 3rd Lesson నేనెరిగిన బూర్గుల Textbook Questions and Answers

కింది ప్రశ్నలకు పదిహేను వాక్యాలకు మించని సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
డా. రామకృష్ణారావుగారు అవసరం వచ్చినప్పుడు వామనమూర్తివలే ముల్లోకాలు ఆక్రమించి విరాడ్రూపాన్ని ప్రదర్శించేవారు అని పి.వి. నరసింహారావుగారు ఎందుకు అన్నారు?
(లేదా)
అవసరమైతే విరాడ్రూపాన్ని ప్రదర్శించే వారని బూర్గుల వారి గురించి పి.వి. గారు ఎందుకు అన్నారో వివరించండి.
జవాబు:
డా|| రామకృష్ణారావు అవసరం వచ్చినపుడు వామన మూర్తివలే ముల్లోకాలు ఆక్రమించి విరాడ్రూపాన్ని ప్రదర్శించేవారు అని పి.వి. నరసింహారావుగారు అనడంలో నూటికి నూరుపాళ్ళు నిజముంది. రామకృష్ణారావు గారి పొట్టితనం కొంతవరకు వారిని మరుగుపరుస్తూ ఉండేదని అప్పట్లో కొందరి భావన. నిజానికి ఒడ్డూ, పొడుగూ ఉన్న చాలామంది కంటే కూడా వారు అతి చక్కగా గుర్తింపబడుతూ ఉండేవారు. చిన్నమూర్తిలో ఇమిడి ఉన్న వారి బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్త్వం అవసరం వచ్చినప్పుడు తమ మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం, అవసరం తీరగానే తిరిగి స్వస్వరూపంలో ఇమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉంది.

న్యాయవాద వృత్తిలో డా|| రామకృష్ణారావుగారు సునిశిత మేథా సంపత్తిని ప్రదర్శించేవారు. కాని వారి వద్దకు వచ్చే క్లయింట్లలో చాలామందికి ఒక రకమైన మిశ్రమభావం ఉండేది. న్యాయవాదిగా వారి శక్తి సామర్థ్యాలపై సంపూర్ణ విశ్వాసమున్నప్పటికీ రాజకీయ వ్యగ్రత (తొందరపాటు, కంగారు) వలన కేసుపై ధ్యాస ఉంచలేరేమో అని క్లయింట్స్ మనస్సులో ఉండేది.

నిజానికి రామకృష్ణారావుగారికి కేసును క్షుణ్ణంగా చదివి తయారవడానికి అవకాశమే ఉండేది కాదు. కేసు చేపట్టేటప్పుడు వారు విషయమంతా శ్రద్ధగా విని ఆ కేసు తాలూకు ఫైలు వెనుక అస్పష్టమైన నోటులను కొన్ని రేఖా మాత్రంగా వ్రాసి పెట్టుకొనేవారు. నిజానికి వాటిని కేసుకు తయారీ అనడానికి వీలు లేదు. కాని కోర్టులో ఆ రేఖా మాత్రపు నోట్సే డా. రామకృష్ణారావుగారి జాజ్జ్వల్యమానమైన ప్రతిభా విశేషతతో ఎదుటి న్యాయవాదుల వాదనా ఘాతములకు దుర్భేద్యమైన కంచుగోడలుగా నిలవడం పి.వి.గారు ప్రత్యక్షంగా చూసారు. అందుకే వారిని వామన మూర్తివలే ముల్లోకాలు ఆక్రమించి విరాట్ రూపాన్ని ప్రదర్శించారని అన్నారు.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
సామ్యవాద వ్యవస్థ కోసం డా. రామకృష్ణారావుగారు చేసిన కృషి ఏమిటి?
(లేదా)
చెప్పడం తేలిక, చెయ్యడం కష్టం. డా|| రామకృష్ణారావుగారు కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులయ్యారు. దీని గురించి వివరించండి.
జవాబు:
రాజకీయాలలో డా. రామకృష్ణారావుగారి సమ్యక్ దృష్టికోణం సంకుచిత సైద్ధాంతిక అరలకు తావివ్వలేదు. ఆయన పుట్టింది జాగీర్ దారీ కుటుంబంలో అయినప్పటికీ పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో తరతరాల నుండీ వస్తున్న జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు. వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు. అయినప్పటికీ వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కు నిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారు చేసి, దేశంలో సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు. ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయింది వారి బంధువులూ, రాజకీయ సహచరులే.

పూర్వపు హైదరాబాద్ సంస్థాన విచ్ఛిత్తి తన రాజకీయ ప్రాబల్యానికి స్వస్తి వాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు. అయినప్పటికీ తనకు నష్టం, ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకొంటూ తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మ పరిత్యాగానికి, చివరకు సక్రియ రాజకీయాల నుండి తన నిష్క్రమణకు దారితీసే పరిస్థితులకు, సామ్యవాద వ్యవస్థకోసం అన్నింటిని వీరివలె అంకితం చేసుకొనే రాజనీతి విశారదులు బహు అరుదు.

ప్రశ్న 3.
డా.రామకృష్ణారావుగారు నిర్వహించిన పదవులు ఏవి?
(లేదా)
బహుభాషావేత్తగా, పేరు పొందిన డా.రామకృష్ణారావు గారు నిర్వహించిన పదవులు ఏవి?
(లేదా)
స్థిత ప్రజ్ఞుడుగా పేరు పొందిన డా॥ రామకృష్ణారావుగారు నిర్వహించిన పదవులేవి?
జవాబు:
తెలుగుజాతి సగర్వంగా చెప్పుకోగలిగిన మహాపురుషులలో బూర్గుల రామకృష్ణారావుగారు అగ్రేసరులు. ఒక హైస్కూలులో పర్షియన్ బోధించే ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆంధ్రుడు బహుశా ఈయన ఒక్కరేనేమో. 1923లో హైదరాబాదు నగరంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1929లో ఏర్పడ్డ పౌరహక్కుల పరిరక్షణ సంఘానికి రామకృష్ణారావు అధ్యక్షులుగా పనిచేసారు. రెండవ ఆంధ్ర మహాసభకు (1931లో) ఈయన అధ్యక్షత వహించారు. 1950 జూన్ 12న మంత్రిగా పదవి చేపట్టారు. 1952 మార్చి 6న హైదరాబాదు ముఖ్యమంత్రిగా బూర్గులవారు పదవీ స్వీకారం చేశారు. ఆయన హైదరాబాదు రాష్ట్రానికి ప్రజాప్రతినిధులచే ఎన్నోకోబడిన తొలి ముఖ్యమంత్రి, పర్షియన్ ట్యూటర్ గా, న్యాయవాదిగా, స్టేట్ కాంగ్రెస్ నాయకులుగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గవర్నరుగా, రాజ్యసభ సభ్యులుగా ఇలా ఎన్నో పదవులు చేపట్టి, స్థితప్రజ్ఞతను ప్రదర్శించారు.

ప్రశ్న 4.
జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి డా.రామకృష్ణారావుగారు అనుసరించిన పద్ధతి ఏమిటి?
(లేదా)
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొన్న బూర్గుల రామకృష్ణారావుగారి స్వభావాన్ని వివరించండి.
జవాబు:
డా|| రామకృష్ణారావు గారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికి వారొక ఆత్మీయులైన తండ్రి. ఆ కుటుంబానికే కాదు, … ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు. వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయముగా ఎక్కువ ధ్యానముంచవలసిన పనులకంటే. శక్తిని. సమయాన్ని వ్యక్తపరిచే పనులకు అప్పుడప్పుడు వారు ప్రాధాన్యమివ్వడం జరుగుతుండేది.

వారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా జరుగులేదు. రకరకాలైన ఒడిదుడుకులను వారు ఎదుర్కొనవలసివచ్చేది. చాలా సందర్భాలలో విపత్కర పరిస్థితులు సేనావాహినిలా వచ్చి చుట్టుముట్టేవి. అయినప్పటికీ వారు చలించేవారు కాదు. మన సైర్యాన్ని, సమచిత్తతను వారు ఎన్నడూ విడనాడేవారు కాదు. విజయాలు లభించినపుడు సంతోషంతో ఉప్పొంగనూ లేదు, కష్టాలు సంభవించినపుడు అధైర్యంతో క్రుంగిపోనూ లేదు. స్నేహితులు ద్రోహం తలపెట్టినపుడుకాని, ప్రత్యర్థులు దూషించినపుడు వారనేదల్లా ఒకటే – “సరే – అవన్నీ ఆటలో ఉండేవేగా” అని.

జీవితంలో ఒడిదుడుకులు సహజం. వాటిని చూసి భయపడటం, పారిపోవడం, ఇంకా ఏవేవో చేయడం మనలోని అసమర్థతను తెలుపుతాయి. బూర్గుల వారిలో స్థితప్రజ్ఞత అనుసరణీయం.

9th Class Telugu ఉపవాచకం 3rd Lesson నేనెరిగిన బూర్గుల Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ క్రింది వాక్యాలను సంఘటనలు ఆధారంగా వరుసక్రమంలో అమర్చి రాయండి.

ప్రశ్న 1.
అ) నేను వారివద్ద అందరికంటే జూనియర్ న్యాయవాదిగా ఉండేవాడిని.
ఆ) నేను నాకు కావలసిన కేసులను – ముఖ్యంగా జూనియర్లకు కొరుకుడు పడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని.
ఇ) ఒకసారి డా|| రామకృష్ణారావు గారు దానిని గమనించి తమ ఆమోదముద్ర వెయ్యడంతో ఆ కారాల మిరియాల ప్రకరణం ముగిసింది.
ఈ) నా ఈ చొరవ వారి సీనియర్ గుమస్తాకు కోపకారణమై ఆయన నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు.
జవాబు:
అ) నేను వారివద్ద అందరికంటె జూనియర్ న్యాయవాదిగా ఉండేవాడిని.
ఆ) నేను నాకు కావలసిన కేసులను – ముఖ్యంగా జూనియర్లకు కొరుకుడు పడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని.
ఈ) నా ఈ చొరవ, వారి సీనియర్ గుమస్తాకు కోపకారణమై ఆయన నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు.
ఇ) ఒకసారి డా|| రామకృష్ణారావు గారు దానిని గమనించి తమ ఆమోదముద్ర వెయ్యడంతో ఆ కారాల మిరియాల ప్రకరణం ముగిసింది.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
అ) వారు రాగానే “సోదర సోదరీమణులారా !” నేను అలవాటు ప్రకారం నేడు కూడా ఆలస్యంగానే వచ్చాను.
ఆ) రామకృష్ణారావుగారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికే కాదు ఆయన ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు.
ఇ) దారిలో వారిని ఎవరైనా, ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు.
ఈ) అందుచేత వారు ప్రతిదానికీ ఆలస్యంగా రావడానికి పేరుపడ్డారు. అయినా మిత్రులు, సహచరులు ఎంతో ఓర్పుతో గంటల తరబడి వారి కోసం వేచి ఉండేవారు.
జవాబు:
ఆ) రామకృష్ణారావుగారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికే కాదు ఆయన ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు.
ఇ) దారిలో వారిని ఎవరైనా, ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు.
ఈ) అందుచేత వారు ప్రతిదానికీ ఆలస్యంగా రావడానికి పేరుపడ్డారు. అయినా మిత్రులు, సహచరులు ఎంతో ఓర్పుతో గంటల తరబడి వారి కోసం వేచి ఉండేవారు.
అ) వారు రాగానే “సోదర సోదరీమణులారా !” నేను అలవాటు ప్రకారం నేడు కూడా ఆలస్యంగానే వచ్చాను.

ప్రశ్న 3.
అ) ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయినవారు వారి బంధువులూ, రాజకీయ సహచరులే.
ఆ) వారు పుట్టింది జాగీర్దారీ కుటుంబంలో అయినా, జాగీర్ దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు.
ఇ) అయినా వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమిహక్కు నిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు.
ఈ) వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు.
జవాబు:
ఆ) వారు పుట్టింది జాగీర్ దారీ కుటుంబంలో అయినా, జాగీర్ దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు.
ఈ) వారి స్నేహ కోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు.
ఇ) అయినా వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమిహక్కునిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు.
అ) ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయినవారు వారి బంధువులూ, రాజకీయ సహచరులే.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
“డా.రామకృష్ణారావు గారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లప్పుడూ జోహారులర్పిస్తూనే ఉంటాను” – అని పి.వి.గారు అనడంలోని ఆంతర్యాన్ని తెల్పండి.
జవాబు:
సీనియర్ న్యాయవాదిగా బూర్గుల వారిదొక ప్రత్యేక తరహా. వారివద్ద అనేకమంది జూనియర్లు ఉండేవారు. తల్లికి తన కడగొట్టు బిడ్డపై ఎటువంటి విశేష మమకారం ఉంటుందో అటువంటి మమకారమే డా.రామకృష్ణారావుగారికి పి.వి. గారి మీద ఉండేది. చొరవగా, నిరాఘాటంగా తిరగడం, కొరుకుడుపడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదివే పి.విగారిని చూసి, అక్కడున్న సీనియర్ గుమాస్తాకు కోపకారణమైంది. దానిని గమనించిన బూర్గులవారు నా చేష్టపై ఆమోదముద్ర వేసి, వారిరువురి మధ్య దూరం తగ్గి నిష్కాపట్యంతో కూడిన సమాన స్థాయి చర్చా సంబంధం ప్రారంభమైంది. పి.వి. లోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసి, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. తనను తాను నిరూపించుకొనేందుకు డా. రామకృష్ణారావుగారి విశేష నైపుణ్యానికి పి.వి. ఎల్లప్పుడూ జోహారులర్పిస్తూనే ఉంటాను అనడంలోని ఆంతర్యం ఇదే.

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
“బూర్గుల వారు సౌజన్యానికి మారుపేరు” వివరించండి.
జవాబు:
మత దురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యమేలుతున్న ఆనాటి నిజాంకు బద్ధ వ్యతిరేకి బూర్గులవారు. కానీ అక్కడి ముస్లింలందరికీ మిక్కిలి ఆప్తులు. అతి నిరాడంబరంగా వారు మతాతీత స్థితిని పాటించేవారు. వారి డ్రాయింగ్ రూమ్ లో ఆనాటి హైదరాబాద్ ప్రభుత్వ పెద్దలు, మౌల్వీలు, ముల్లాలు, పండితులు, మహా మహోపాధ్యాయులు, గాంధీ టోపీలవారు, ఖద్దరుదారులు, అధునాతన టెరిలిన్ యువకులు ఒక్క మాటలో చెప్పాలంటే డా. రామకృష్ణారావుగారు మూడు విభిన్న తరాల చివరి వారిధిలా కన్పించేవారు. అవసరమైనపుడు ఆయన ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కాని అలా చేయడంలో ప్రత్యర్థుల కంటి నుండి ఒక్క కన్నీటి బొట్టు పడటం కాని, వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగలడం కాని జరిగేది కాదు.

ఇలా ఎన్నో విషయాలు ఆయన సౌజన్యానికి ప్రతీకలుగా నిలిచేవి.

ప్రశ్న 3.
‘బూర్గుల బహుభాషావేత్త’ అని ఎలా చెప్పగలవు?
జవాబు:
బూర్గుల వారు చాలా ప్రతిభావంతులైన భాషావేత్తలనే విషయం అందరికీ తెలిసినది. వారు చదువుకున్న చాలా భాషలు వాటి యందలి అభిరుచులచే ప్రయివేటుగా చదువుకొన్నవే. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత భాషలలో రచనలు చేసారు. 1919 – 20 ప్రాంతంలో “కన్నె కన్నులు” అనే ఖండ కృతి రచించారు. మరియు కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీకృష్ణాష్టకం, ఉమర్‌య్యూం రుబాయీలను ఫారసీ భాష నుంచే 101 రుబాయీలను తెలుగు పద్యాలుగా అనువదించారు. శంకరాచార్యులవారి సౌందర్యలహరిని వీరు 1962లో తెనిగించారు. అలాగే కనకధారాస్తవాన్ని ఆంధ్రానువాదం (1964) చేసారు. “సారస్వత వ్యాసముక్తావళి” అనే పేరుతో పరిశీలనాత్మక సాహిత్య వ్యాసాలు (1926) వ్రాసారు. ఈ వ్యాసాలు మహాకవి శ్రీశ్రీనే ఆకట్టుకొన్నాయంటే వాటి విలువ ఏమని చెప్పాలి. దాశరథి గారి ‘గాలిబ్ గీతాలు’ వంటి అనేక పుస్తకాలకు పీఠికలు వ్రాసారు. ఈయన అన్ని భాషలలో రచనలు చేయకుండా, ఏ ఒక్క భాషలోనో కృషి చేసి ఉంటే ఆ భాషా రంగంలో జాతిరత్నం వలె ప్రకాశించేవారేమో!

AP Board 9th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 నేనెరిగిన బూర్గుల

ఆ) కింది ప్రశ్నలకు పదిలేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
డా. రామకృష్ణారావు గారిని గూర్చి పి.వి. నరసింహారావుగారు ఏమి చెప్పారో రేఖామాత్రంగా రాయండి.
(లేదా)
“బూర్గుల వారిని పూర్ణ పురుషులు” అని పి.వి. అన్నారు కదా ! వివరించండి.
జవాబు:
సమాజంలో కొద్దిమందే ప్రభావశక్తి సంపన్నులు ఉంటారు. వీరి సాంగత్యం పొందినా, వీరి గురించి తెలుసుకొన్నా స్ఫూర్తి కలుగుతుంది. మంచిమార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇలా స్ఫూర్తిదాయకమైన వారిలో ఒకరు కీ.శే. బూర్గుల రామకృష్ణారావు గారు. వీరి గురించి మరొక మహోన్నత వ్యక్తి, బహుఖ ప్రజ్ఞాశాలి కీ.శే. పి.వి. నరసింహారావు గారు బూర్గులవారి మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా ఈ వ్యాసాన్ని రాసారు.

బూర్గుల వారి గురించి ఎప్పుడు, ఎక్కడ పుట్టారు, విద్యాభ్యాసం, మంత్రి, ముఖ్యమంత్రి ఇలా అనేక అంశాలను స్పృశించినంత మాత్రాన వారి వ్యక్తిత్వం తెలియదంటారు పి.వి. ప్రతి వ్యక్తిలోను సామాన్యంగా ఉన్నదానికంటే ఎక్కువ తన గురించి అనుకొనే స్వభావం ఉంటుంది. తాను ఇతరులకంటే గొప్పవాడనిపించుకోవాలనే కోరిక ఒకరినొకరు కించపరుచుకుంటూ, తమ శక్తిని, సమయాన్ని వృధా చేసుకుంటారు. కాని ఇందుకు భిన్నంగా ఉండే బూర్గుల వారిని గూర్చి ఎంత చెప్పినా తకు నే అవుతుంది. వారి బహుముఖ ప్రతి నియుత మూర్తిమత్త్వం అవసరం వచ్చినప్పుడు తమ మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం, అవసరం తీరగానే “రిగి పూర్వ రూపంలో ఇమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉందని పి.వి. అంటారు.

క్లయింట్లు చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని ఆ కేసు తాలుకు ఫైలు వెనుక నోటులను రేఖామాత్రంగా రాసి, కోర్టులో తన ప్రతి విశేషతతో ఎదుటి న్యాయవాదులకు కొరకరాని కొయ్యగా మారేవారు. ఆయన వద్ద జూనియర్ గా చేరిన సి వి.గారిని తాను సీనియర్ ని అనిగాక, నిష్కాపట్యంతో కూడిన సమానస్థాయిని ప్రదర్శించేవారు. తాను పుట్టింది జాగీర్ దార్ కుటుంబంలో అయినప్పటికీ పూర్వం నుంచి వస్తున్న జాగీర్ దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు. బూర్గులవారు ఏ నిర్ణయం తీసుకొన్నా దానిని అన్ని విధాలైన జాగ్రత్తలతోను, వ్యవహార దక్షతతోను తీసుకొనేవారు.

సౌజన్యానికి మారుపేరు రామకృష్ణారావుగారు. నిజాం నవాబుకు బద్ధ వ్యతిరేకి అయినప్పటికీ అక్కడి ముస్లింలందరికీ మిక్కిలి ఆప్తులు. ఆయనను గూర్చి ఒక్కమాట చెప్పాలంటే మూడు విభిన్న తరాల చివరి వారధిలా కన్పించేవారి పి.వి. తెలిపారు. ఆనాటి శాసనసభా నాయకులుగా ఉండి అవసరమైనపుడు ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కాని అలా చేయడంలో వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగిలేది కాదు. ముఖ్యమంత్రి అయిన రోజుల్లో బూర్గులవారు ప్రతిరోజూ అర్థరాత్రి వరకు ఆఫీసు ఫైళ్ళు చూసుకొని, ఆ కర్వాత నమ్మశక్యం గాని ఉత్సాహంతో తెలుగు, సంస్కృత, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ ఇలా అనేక గ్రంథాలను చదివేవారు.

బూర్గుల వారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా సాగలేదు. అనేక ఒడిదుడుకులను వారు ఎదుర్కొన్నారు విజయాలకు పొంగలేదు. కష్టాలకు కుంగనూలేదు. ప్రత్యర్థులు దూషించినా “సరే – ఇవన్నీ ఆటలో ఉండేవేగా” అని అనేవారు. ఆయన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే వారు పూర్ణపురుషులు” అని పి.వి. గుర్తు చారు.