SCERT AP 9th Class Social Studies Guide Pdf 10th Lesson ధరలు – జీవనవ్యయం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 10th Lesson ధరలు – జీవనవ్యయం

9th Class Social Studies 10th Lesson ధరలు – జీవనవ్యయం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ధరలను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఏమిటి? (AS1)
జవాబు:

  1. ధరలను నియంత్రించకపోతే స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు, రోజువారి వేతనదారులు, చేతి పనివారు, చిన్న అమ్మకందారులు, చిన్న పరిశ్రమలలోని కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రైవేటు ఉద్యోగులు నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురవుతారు.
  2. దీనినే ద్రవ్యోల్బణం అంటారు.
  3. ద్రవ్యోల్బణ కాలంలో కూడా ఈ వ్యక్తుల ఆదాయం మారదు.
  4. కాబట్టి వారు తమ వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకోవాలి.
  5. అప్పటికే వారి జీవన ప్రమాణం తక్కువ. ఇప్పుడు ద్రవ్యోల్బణం వారి జీవన ప్రమాణాన్ని మరింత తగ్గించింది. ఇది వారిని ఇంకా పేదరికంలోనికి నెడుతుంది. అందువలన ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న 2.
వస్తువులను ఉత్పత్తి చేసేవారు, అమ్మేవారు ధరలను ఎలా నిర్ణయిస్తారు? (AS1)
జవాబు:
వస్తువులను ఉత్పత్తి చేసేవారు తమ వస్తువుల ఉత్పత్తికయ్యే వ్యయాన్ని పరిగణనలోనికి తీసుకుంటారు. మరియు వారి లాభాలను కొంత మేర కలుపుకుంటారు. ఆ వస్తువులను అమ్మేవారు వారి యొక్క లాభాలను కూడా కలుపుకుని వస్తువుల యొక్క ధరలను నిర్ణయిస్తారు.

పై విధంగా వస్తువులను ఉత్పత్తిదారులు, అమ్మకందారుల యొక్క లాభాలు మరియు ఉత్పత్తికయ్యే ఖర్చులను పరిగణన లోనికి తీసుకుని ధరలను నిర్ణయించడం జరుగుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 3.
జీవన వ్యయం, జీవన ప్రమాణానికి మధ్యగల తేడా ఏమిటి? (AS1)
జవాబు:

  1. జీవన ప్రమాణం అనగా మానవుల కొనుగోలు శక్తి.
  2. జీవన వ్యయం అనగా మానవులు చేసే ఖర్చులు. 3. స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు, రోజువారి వేతనదారులు, చేతిపనివారు, చిన్న అమ్మకందారులు, చిన్న పరిశ్రమలలోని కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రైవేట్ ఉద్యోగులు, నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురవుతారు. దీనినే ద్రవ్యోల్బణం అంటారు.
  3. ఈ ద్రవ్యోల్బణ కాలంలో కూడా వ్యక్తుల ఆదాయం మారదు.
  4. కాబట్టి వారు తమ వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకోవాలి.
  5. అప్పటికీ వారి జీవన ప్రమాణం తక్కువ. ఇప్పుడు ద్రవ్యోల్బణం వలన వారి జీవన వ్యయం పెరిగి వారిని పేదరికంలోనికి నెట్టింది.

ప్రశ్న 4.
జీవన వ్యయంలో పెరుగుదల ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది? ఎందుకు? (AS4)
జవాబు:
జీవన వ్యయంలో పెరుగుదల ఈ క్రింది వారిపై ప్రభావం చూపుతుంది :

  1. స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు
  2. రోజువారి వేతనదారులు
  3. చేతి పనివారు
  4. చిన్న అమ్మకందారులు
  5. చిన్న పరిశ్రమలలోని కార్మికులు
  6. తక్కువ ఆదాయం కలిగిన ప్రయివేట్ ఉద్యోగులు.

వీరి ఆదాయంలో మార్పు లేకపోవడం వలన జీవన వ్యయం పెరగడం వలన అప్పుల పాలవుతారు.

ప్రశ్న 5.
ద్రవ్యోల్బణ కాలంలో ఏ సమూహాలు ఎక్కువ ఆదాయాన్ని పొందుతాయి? (AS4)
జవాబు:

  1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో, కొన్ని సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కరవు భత్యం (డి.ఎ)ను అదనంగా పొందుతారు.
  2. ధరలు ఒక శాతం వరకు పెరిగినప్పుడు వారి వేతనం కూడా పెరుగుతుంది.
  3. ఎందుకంటే ప్రభుత్వం వారికి డి.ఎ.ను చెల్లిస్తుంది.
  4. తద్వారా ద్రవ్యోల్బణంతో పాటు వారి ఆదాయం పెరుగుతుంది.
  5. వ్యాపార కార్యకలాపాలు చేసే ప్రజలు వారు అమ్మే వస్తువుల ధరలు పెంచడం ద్వారా అధిక జీవన వ్యయంను రాబట్టుకుంటారు.
    ఉదా : పంచదార ధర పెరిగితే స్వీట్సు అమ్మేవారు ధరలను పెంచుతారు. టీ అమ్మేవారు కప్పు టీ – ధరను పెంచుతారు.
  6. డైక్లీనర్లు, కర్షకులు, లాయర్లు, డాక్టర్లు మొదలగు వివిధ సేవలను అందించే ప్రజలు ధరలు పెరిగినప్పుడు వారి ఫీజును కూడా పెంచుతారు.
  7. అధిక ధనవంతులు, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపైన పెరిగిన ధరలు ప్రభావం చూపలేవు.

ప్రశ్న 6.
టోకు ధరల సూచిక (WPI), వినియోగదారుల ధరల సూచిక (CPI) కంటే ఏవిధంగా భిన్నమైనది? (AS1)
జవాబు:

  1. టోకు ధరల సూచికలో అన్ని వస్తువులు (ఉత్పాదక వస్తువులు, వినియోగ వస్తువులు) వస్తాయి.
  2. వినియోగదారుల ధరల సూచికలో వినియోగదారుల వస్తువుల ధరలు, చిల్లర ధరలు వస్తాయి.
  3. కావున ప్రధాన తేడా టోకు ధరల సూచికలోనే ఇమిడియున్నది. వినియోగదారుల ధరల సూచికలో ఆ తేడా లేదు.

ప్రశ్న 7.
ఆహార ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచికల మధ్యగల భేదమేమి? (AS1)
జవాబు:
ఆహార ధరల సూచికను.ఆహార పదార్థాల ధరలలో పెరుగుదలను అంచనా వేయుటకు ఉపయోగిస్తారు. దీనినే ఆహార ద్రవ్యోల్బణం అంటారు. ఆహార ధరల సూచికలో బియ్యం, గోధుమ, కూరగాయలు, పంచదార, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, ఆహార పదార్థాల తయారీకి ఉపయోగపడే వంటనూనెల టోకు ధరలు ఉంటాయి.

కొన్నిసార్లు లాభార్జన ప్రధాన ఆశయంగా గల వ్యాపారస్తులు చాలా వస్తువులు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు అక్రమంగా పెంచుతారు.

వినియోగదారులైన శ్రామికుల వేతనంలో పెరుగుదల లేకుంటే వారు మార్కెట్లో వస్తువులను కొనలేరు. నిత్యావసర వస్తువులైన గోధుమలు, బియ్యం, పాలు మొదలైన వాటి విషయంలో కొరత సంభవిస్తే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 8.
వినియోగదారుల ధరల సూచిక యొక్క ఉపయోగాలు ఏమిటి? (AS1)
జవాబు:

  1. జీవన వ్యయంలో పెరుగుదలను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది.
  2. వినియోగదారులు ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగితే వాటిని నియంత్రించడానికి తగిన చర్యలు చేపట్టడానికి ఉపయోగపడుతుంది.
  3. ప్రభుత్వం ఎగుమతి దిగుమతుల విధానం ద్వారా ఆహార పదార్థాల ధరలు పెరిగినప్పుడు ఆ వస్తువుల ఎగుమతిని పూర్తిగా నిషేధిస్తుంది లేదా కొంత పరిమితిని విధిస్తుంది.
  4. ఏవైనా వస్తువులు కొరతగా ఉంటే ప్రభుత్వం ఇతర దేశాల నుంచి తెప్పించి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సహకార సంఘాల ద్వారా అందిస్తుంది.

ప్రశ్న 9.
వినియోగదారుల ధరల సూచికను లెక్కించుటకు ఐదు అంశాలను రాయండి. (AS1)
జవాబు:

  1. తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ప్రతి వస్తువు యొక్క ధరలను వ్రాయుట.
  2. ప్రతి నెల అంతే మొత్తంలో కొన్నారని ఊహించుకొంటే, కాని ఈ నెల ధరలు పెరగడం వలన అంతే మొత్తంలో వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగాయి.
  3. అంటే రోజువారీ వినియోగంలో రిటైల్ స్థాయిలోను లేదా చిల్లర వ్యాపారుల స్థాయిలోను ధరల తీరుతెన్నులను తెలిపే వినియోగదారుల సూచి.
  4. ఆర్థిక – గణాంకాల డైరెక్టరేట్ వివిధ మార్కెట్లలో ధరలను సేకరిస్తుంది.
  5. ఒక కుటుంబ బడ్జెట్ లోని ప్రాముఖ్యత గల వస్తువులపై చేసే ఖర్చును లెక్కించే విధంగానే వినియోగదారుల ధరల సూచికను కూడా లెక్కిస్తారు.
  6. గత నెలలో నాలుగు వస్తువుల సరాసరి ధరల స్థాయి 100. అది ఇప్పుడు 123. 3కి పెరిగింది. అంటే దీని అర్థం గత నెలతో పోలిస్తే ఇంట్లో వినియోగించుకొనే ఈ నాలుగు వస్తువుల ధరల స్థాయి ఈ నెలలో 23.3% పెరిగింది.

ప్రశ్న 10.
ధరల పాలనా యంత్రాంగం (APM), కనీస మద్దతు ధర (MSP) కంటే ఎలా భిన్నమైనది? (AS1)
జవాబు:
ధరల పాలనా యంత్రాంగం :
వస్తువులకు ధరలు పెరగకుండా నియంత్రిస్తుంది. వినియోగదారులకు వినియోగ వస్తువుల యొక్క ధరలను అందుబాటులో ఉంచుతుంది. అనగా వారి కొనుగోలు శక్తికి అనుకూలంగా వ్యవహరిస్తుంది.

కనీస మద్దతు ధర :
రైతులు పంటలు పండించటానికి అయిన ఖర్చులను వారి యొక్క శ్రమను పరిగణనలోకి తీసుకుని రైతులు నష్టపోకుండా వారు పండించిన ధాన్యానికి, ఇతర ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస ధరను ప్రకటించి కొనుగోలు చేస్తుంది.

ఆ విధంగా రెండు విభిన్న ధోరణులను కలిగి ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 11.
‘ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ పాత్ర’ అనే శీర్షిక కింద గల 6వ పేరాను చదివి ఈ ప్రశ్నకు జవాబు రాయండి. ప్రభుత్వ రాబడిని ధరల పాలనా యంత్రాంగం (APM) ఎలా ప్రభావితం చేస్తుంది? చర్చించండి. (AS2)
జవాబు:

  1. ప్రభుత్వ రాబడిని ధరల పాలనా యంత్రాంగం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభావితం చేస్తున్నది.
  2. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే వస్తువుల ధరలు మార్కెట్ లోని ధరల కన్నా తక్కువగా ఉంటాయి.
  3. వీటి ధరలలో తేడా లేదా సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది.
  4. చౌక ధరల దుకాణాల నుండి పేద ప్రజలు వస్తువులను కొనడానికి వీలు కల్పించడమే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలు మార్కెట్లో విచక్షణారహితంగా పెరగకుండా నియంత్రిస్తుంది.
  5. నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలను నిరోధించి, వాటి ధరలను సహేతుకమైన స్థాయిలలో ఉంచడం, వాటి లభ్యతను సులభతరం చేయడం కోసం ప్రభుత్వమే ధరలను నిర్ణయించి, అవే ధరలకు మార్కెట్లో వస్తువులను విక్రయించాలని వ్యాపారస్తులను అదేశిస్తుంది.
  6. ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఎవరైతే పాటించరో వారిపై వివిధ చట్టాల ద్వారా జరిమానా విధిస్తుంది.
  7. కిరోసిన్, డీజిల్, LPG, CNG, PNG మొదలగు వాటికి ప్రభుత్వం కొంతమేర లేదా మొత్తంగా సబ్సిడీ ఇచ్చి ధరల పాలనా యంత్రాంగం ద్వారా విక్రయిస్తుంది.

ప్రశ్న 12.
మీ కుటుంబం వినియోగించే ఐదు రకాల వస్తువులను లేదా సేవలను తీసుకొని మీ కుటుంబానికి సంబంధించిన వినియోగదారుల ధరల సూచికను తయారుచేయండి. (AS3)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 1
వినియోగదారుల ధరల సూచికలను రాయండి. ………………. 100%
గత నెలతో పోలిస్తే మీ కుటుంబం మొత్తం ఖర్చులో ఎంత మార్పు వచ్చింది?
గత నెలలో 1630 రూపాయల వ్యయం జరగగా ఈ నెల 2020 వ్యయం జరిగింది.
అనగా 2020 – 1630 = 390 రూపాయలు తేడా వచ్చింది.
అనగా అవే వస్తువులకు అదే పరిమాణానికి అదనంగా 390 రూపాయలు చెల్లించవలసి వచ్చింది.

ప్రశ్న 13.
ఈ కింది వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి. (AS1)
జవాబు:
అ. ద్రవ్యోల్బణం ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచుతుంది. (తప్పు)
ఆ. ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తిలోని మార్పు ఆ ద్రవ్యం విలువను తెలుపుతుంది. (ఒప్పు)
ఇ. జీవన వ్యయంలో వచ్చిన మార్పు పెన్షనర్ల జీవన ప్రమాణంపై ఎటువంటి ప్రభావం చూపదు. (తప్పు)
ఈ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డి.ఎ. ను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణం నుండి వారు మినహాయింపు పొందుతారు. (ఒప్పు)
ఉ. వినియోగ వస్తువుల ధరలలో వచ్చిన మార్పులను మాత్రమే టోకు ధరల సూచిక లెక్కిస్తుంది. (ఒప్పు)

ప్రశ్న 14.
పారిశ్రామిక వస్తువుల టోకు ధరల సూచికలు ఈ కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. వీటి ద్వారా రేఖాపటం గీసి, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. (AS3)
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 2
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 3
అ. గత కొన్ని సంవత్సరాలుగా ఏ వస్తువుల ధరలు నిలకడగా పెరుగుతున్నాయి?
జవాబు:
ఎరువులు, సిమెంట్, ధరలు నిలకడగా పెరుగుతున్నాయి.

ఆ. నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరగడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరగడానికి గల కారణాలు :

  1. నూలు వస్త్రం, ఎరువుల వాడకంలో ఒక్కసారిగా వేగవంతంగా మార్పురాదు.
  2. నూలు వస్త్రం, ఎరువుల ఉత్పత్తి కూడా ఒక్కసారిగా పడిపోదు.
  3. అందువలన నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరుగుతాయి.

ఇ. పై వస్తువుల విషయంలో ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుందా? ఎలా?
జవాబు:

  1. వస్తువుల ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
  2. వస్తువుల కొరత ఏర్పడినపుడు విదేశాల నుండి దిగుమతి చేసుకుని వాటిని మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సహకార సంఘాల ద్వారా అందిస్తుంది.
  3. ఎప్పుడైనా వ్యాపారులు అక్రమ నిల్వల ద్వారా కృత్రిమ కొరతను సృష్టిస్తే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

ప్రశ్న 15.
ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమ నిర్వహణకై సలహాలను సూచిస్తూ మీ తహశీల్దారుకు ఒక లేఖ రాయండి. (AS6)
జవాబు:

తహశీల్దారుకు ఉత్తరం

To:
తహశీల్దార్ వార్కి
సాలూరు.
విజయనగరం.

From:
టి. అప్పారావు
సాలూరు.
అయ్యా

విషయం : ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమ నిర్వహణకై తమ సహకారానికై సూచనలు.

పేద ప్రజల ఆహార భద్రతకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమైన పథకం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS – Public Distribution System). ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం నిత్యావసర వస్తువులైన గోధుమలు, బియ్యం , పంచదార, వంట నూనెలు సకాలంలో మాకు అందడం లేదు. ప్రతి నెల 1వ తేదీ నాటికి సరకులు డీలర్ల ద్వారా అందించేందుకు ముందు నెలాఖరు. నాటికి డి.డి.లు పూర్తి చేసి మొదటి వారానికి పంపిణీ జరిగేటట్లు చేయవలెను. చాలా మంది డీలర్లు అక్రమ నిల్వలను చీకటి మార్కెట్లో విక్రయిస్తున్నారు, నిరోధించగలరు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేయు సరకులు నాణ్యతగా ఉండడం లేదు. కొన్ని సందర్భాలలో అవి అనారోగ్యం తెచ్చి పెడుతున్నాయి.

పై సూచనలు, సలహాలు ప్రజలందరివిగా భావించి, వాటిని సరిదిద్ది ప్రజా పంపిణీ వ్యవస్థను దిగ్విజయం చేయ ప్రార్థన.

ఇట్లు
టి. అప్పారావు.

9th Class Social Studies 10th Lesson ధరలు – జీవనవ్యయం InText Questions and Answers

9th Class Social Textbook Page No.121

ప్రశ్న 1.
రేపు ఉపాధ్యాయ దినోత్సవం అనుకోండి. మీ తరగతిలోని విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుటకు, నీకు రూ. 200 ఇచ్చి స్వీట్లు, బిస్కెట్లు తెమ్మని మార్కెట్ కు పంపించారు అని అనుకుందాం. మార్కెట్లో ధరలను చూస్తే ఒక స్వీట్ ప్యాకెట్ ధర రూ. 60, బిస్కట్ ప్యాకెట్ ధర రూ. 20 ఉంది. నీవు రెండు స్వీట్ ప్యాకెట్లు కొన్నచో, మిగతా డబ్బులతో ఎన్ని బిస్కట్ ప్యాకెట్లు కొనగలవు? వాటికి ఎంత చెల్లించావు?
జవాబు:
మొత్తం తీసుకెళ్ళినది – రూ. 200
ఒక స్వీట్ ప్యాకెట్ ధర – రూ. 60
రెండు స్వీట్ ప్యాకెట్ల ధర – 2 × 60 = రూ. 120
బిస్కెట్ ప్యాకెట్ ధర – రూ. 20
రెండు స్వీట్ ప్యాకెట్లు కొనగా మిగిలినది – 200 – 120 = 80 రూపాయలు
80 రూపాయలకు ప్యాకెట్ 20 రూ. చొప్పున కొనగా నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి. అనగా
4 × 20 = 80 రూపాయలు
కావున 200 రూపాయలకు కొని తెచ్చినది.
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 4

ప్రశ్న 2.
నీవు పాఠశాలకు తిరిగి వచ్చిన తర్వాత, మీ తరగతి విద్యార్థులు “ఎందుకు ఇన్ని తక్కువ ప్యాకెట్లు కొని తెచ్చావు ? ప్రతిది ఐదు ప్యాకెట్లు తీసుకురావల్సింది.” అని అన్నారు.
జవాబు:
అప్పుడు నేను ప్రతిది ఐదు ప్యాకెట్లు తీసుకురావడానికి నేను తీసుకెళ్ళిన 200 రూపాయలకు 2 స్వీట్ ప్యాకెట్లు మరియు 4 బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి.
రేట్లు పెరిగాయి అని నేను పై వివరాలు తెలిపాను.

ప్రశ్న 3.
అందుకుగాను, నీవు స్వీట్లు బిస్కెట్ ప్యాకెట్ల ధరల గురించి చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. మీ తరగతిలో ఒకరు ఈ విధంగా అన్నారు. “గత సంవత్సరం మనం స్వీటు ప్యాకెట్‌కు రూ. 30, బిస్కెట్ ప్యాకెట్‌కు రూ. 10 చెల్లించాం కదా.”
జవాబు:
గత సంవత్సరం ధరలతో పోలిస్తే ఈ సంవత్సరం రేట్లు రెట్టింపు అయ్యాయి. అందువలన 2 స్వీట్ ప్యాకెట్లు, 4 బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. కారణం రేట్లు రెట్టింపు కావడమే.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 4.
గత సంవత్సర కాలంలో ఏమి జరిగింది? రెండు వస్తువుల ధరలు పెరిగాయి. కావున రూ. 200 తో అవే వస్తువులను తక్కువ మొత్తంలో కొనుగోలు చేయాల్సి వస్తుంది.
జవాబు:
గత సంవత్సరంలో వస్తువుల రేట్లు తక్కువగా ఉన్నాయి.
ఈ సంవత్సరం వస్తువుల రేట్లు గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి.
అందువలన తక్కువ మొత్తంలో వస్తువులను కొనుగోలు చేయాల్సి వచ్చింది.

ప్రశ్న 5.
ఒకవేళ మీ ఉపాధ్యాయులు, ఈ సంవత్సరం 5 స్వీట్స్, 5 బిస్కెట్ ప్యాకెట్లు కొనమంటే, వాటి కోసం మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుంది?
జవాబు:

  1. 5 ప్యాకెట్ల స్వీట్స్ కోసం = రూ. 5 × 60 = 300 రూపాయలు
  2. 5 ప్యాకెట్ల బిస్కెట్స్ కోసం = రూ. 5 × 20 = 100 రూపాయలు
  3. నీవు చెల్లించాల్సిన మొత్తం = రూ. 400 రూపాయలు
  4. గత సంవత్సరంతో పోలిస్తే ఎంత ఎక్కువ మీరు చెల్లించాల్సి ఉంటుంది?

గత సంవత్సరం చెల్లించినది :
5 స్వీట్ ప్యాకెట్ల రేటు = 5 × 30 = 150 రూపాయలు
5 బిస్కెట్ ప్యాకెట్ల రేటు = 5 × 10 = 50 రూపాయలు
మొత్తం = 200 రూపాయలు
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 200 రూపాయలు
అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

డబ్బుతో మనం వాస్తవంగా కొనగలిగిన వస్తుసేవల సంఖ్యను ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి అంటారు. ద్రవ్యోల్బణ కాలంలో వాస్తవ ఆదాయం, ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది. పై ఉదాహరణను బట్టి గత సంవత్సరం ఇవే వస్తువులు ఐదు చొప్పున కేవలం రూ. 200 మాత్రమే చెల్లించారు. కాని ఇప్పుడు మీరు అదే వస్తువులను కొనడానికి . ‘ ఎక్కువ చెల్లించాలి, కాబట్టి మీరు ఈ రెండు రకాల వస్తువులను తక్కువగా కొనుగోలు చెయ్యాల్సి వస్తుంది.

  • గత సంవత్సరం రూ. 200 = 5 స్వీట్ ప్యాకెట్లు + 5 బిస్కెట్ ప్యాకెట్లు
  • ఈ సంవత్సరం రూ. 200 = 2 స్వీట్ ప్యాకెట్లు + 4 బిస్కెట్ ప్యాకెట్లు
  • మరో రకంగా చెప్పాలంటే రూ. 200 లతో చేసే కొనుగోలు శక్తి లేదా డబ్బు విలువ పడిపోయింది. కాబట్టి మీరు అదే డబ్బుతో తక్కువ వస్తువులనే కొనగలిగారు. ఎందుకంటే వాటి ధరలు పెరిగాయి.

9th Class Social Textbook Page No.123

* ప్రతిరోజు క్రమం తప్పకుండా మీ కుటుంబం ఉపయోగించే కొన్ని వస్తువుల లేదా సేవల పేర్లను రాయండి.
ప్రస్తుతం వాటి ధరలను, గత సంవత్సరం అవే వస్తువుల ధరలను పరిశీలించండి. వాటి మధ్య గల తేడా ఏమిటి? . దీనికిగాను మీ తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి.

వాటి మధ్యగల తేడా :
వస్తువుల రేటు గత సంవత్సరపు రేట్లతో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని వస్తువుల రేట్లు పెరిగాయి.

కారణం :
ద్రవ్యం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం రేటు పెరగడం, జనాభా పెరగడం, వస్తూత్పత్తి వనరులు జనాభా పెరిగినంత వేగంగా పెరగక పోవడం.

9th Class Social Textbook Page No.126

ప్రశ్న 1.
2005-06లో వరి ధర రూ. 20 కిలో కొంటే 2011లో ఎంత చెల్లించాలి?
2005-06లో కిలో వరి. బియ్యం – 20 రూపాయలు.
2011లో కిలో వరి బియ్యం – 40 రూపాయలు.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 2.
ఏ సంవత్సరంలో పప్పుదినుసుల ధరలు అధికంగా పెరిగాయి?
జవాబు:
2006-07 సంవత్సరంలో పప్పుదినుసుల ధరలు అధికంగా పెరిగాయి.

ప్రశ్న 3.
ప్రత్తి ధరలో ఎంత శాతం పెరుగుదల ఉంది?
జవాబు:
100 శాతం పెరుగుదల ఉంది.

ప్రశ్న 4.
ఏ వస్తువు ధర హెచ్చు, తగ్గులు లేకుండా నిలకడగా ఉంది?
జవాబు:
వంటనూనెలు