AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson బాలకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson బాలకాండ

10th Class Telugu ఉపవాచకం 1st Lesson బాలకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం
1. అ) దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు.
ఆ) మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు.
ఇ) ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు.
ఈ) నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
జవాబులు
ఈ) నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
అ) దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు.
ఆ) మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు.
ఇ) ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు.

2. అ) రామాయణగాథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించాడు నారదుడు.
ఆ) శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
ఇ) ఒక వేటగాడు క్రూరబాణంతో మగపక్షిని నేలకూల్చాడు.
ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
జవాబులు
ఆ) శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
అ) రామాయణగాథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించాడు నారదుడు.
ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
ఇ) ఒక వేటగాడు క్రూరబాణంతో మగపక్షిని నేలకూల్చాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

3. అ) భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు.
ఆ) ఒక కొమ్మపై క్రౌంచపక్షుల జంటను చూశాడు.
ఇ) హృదయవిదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి.
ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
జవాబులు
ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
అ) భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు.
ఆ) ఒక కొమ్మపై క్రౌంచ పక్షుల జంటను చూశాడు.
ఇ) హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి.

4. అ) సరయూ నదీతీరంలో ‘కోసల’ అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే ‘అయోధ్య’ అనే మహానగరం.
ఆ) కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు.
ఇ) ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.
ఈ) ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు.
జవాబులు
అ) సరయూ నదీతీరంలో ‘కోసల’ అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే ‘అయోధ్య’ అనే మహానగరం.
ఆ) కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తునాడు.
ఈ) ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు.
ఇ) ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.

5. అ) మంత్రీ సారథీ అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు.
ఆ) ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని క్రుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది.
ఇ) అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.
ఈ) సరయూనదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది.
జవాబులు
ఆ) ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని క్రుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది.
ఈ) సరయూనదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది.
అ) మంత్రీ సారథీ అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు.
ఇ) అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.

6. అ) రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు.
ఆ) దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు.
ఇ) అతని దుండగాలకు అంతేలేదన్నారు. ఋషుల, యక్షగంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజస్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు.
ఈ) హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు.
జవాబులు
ఆ) దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు.
ఈ) హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు.
అ) రావణాసురుడు బ్రహ్మ వరప్రభావంచేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు.
ఇ) అతని దుండగాలకు అంతేలేదన్నారు. ఋషుల, యక్షగంధర్వుల మాట అటుంచి, అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు.

7. అ) దేవతలు వరగర్వముచేత కన్నూమిన్నూగానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు.
ఆ) బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు.
ఇ) కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు.
ఈ) ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్రగదాధారియై వచ్చాడు.
జవాబులు
ఆ) బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు.
ఇ) కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు.
ఈ) ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్రగదాథారియై వచ్చాడు.
అ) దేవతలు వరగర్వము చేత కన్నూమిన్నూ గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

8. అ) చైత్రశుద్ధ నవమినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు.
ఆ) ‘ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నింటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంద’న్నాడు.
ఇ) దశరథుడు పుత్రకామేష్ఠి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు.
ఈ) చేతిలో బంగారు పాత్ర వెండిమూతతో. అందులో దివ్యపాయసముంది.
జవాబులు
ఇ) దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు.
ఈ) చేతిలో బంగారు పాత్ర వెండిమూతతో. అందులో, దివ్యపాయసముంది.
ఆ) ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నింటిని మించి సంతానాన్ని ప్రసాదిస్తుంద’న్నాడు.
అ) చైత్రశుద్ధ నవమినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు.

9. అ) వేదశాస్త్రాలనభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు.
ఆ) రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు.
ఇ) రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు.
ఈ) ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివే.
జవాబులు
ఆ) రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు.
అ) వేదశాస్త్రాలనభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు.
ఈ) ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివే..
ఇ) రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు.

10. అ) సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహాతేజశ్శాలియైన విశ్వామిత్ర మహర్షి.
ఆ) ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచితరీతిన మర్యాదలు గావించాడు.
ఇ) అతిథి దేవోభవ అతిథి మనకు దేవుడితో సమానం.
ఈ) తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు.
జవాబులు
అ) సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహాతేజశ్శాలియైన విశ్వామిత్ర మహర్షి.
ఇ) అతిథి దేవోభవ అతిథి మనకు దేవుడితో సమానం.
ఆ) ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచితరీతిన మర్యాదలు గావించాడు.
ఈ) తనపైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు.

11. అ) రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ విద్యలనుపదేశించాడు విశ్వామిత్ర మహర్షి.
ఆ) విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు.
ఇ) వీటి ప్రభావం వల్ల, అలసట, ఆకలిదప్పులుండవు. రూపకాంతులు తగ్గవు.
ఈ) విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు.
జవాబులు
ఆ) విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు.
అ) రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ విద్యలనుపదేశించాడు విశ్వామిత్రుడు.
ఇ) వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలిదప్పులుండవు. రూపకాంతులు తగ్గవు.
ఈ) విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు.

12. అ) జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శ్రుతకీర్తులను భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు.
ఆ) శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు.
ఇ) తాటక వధతో దుష్టసంహారానికి పూనుకొన్నాడు రాముడు.
ఈ) ధనుర్విద్యయందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది.
జవాబులు
ఇ) తాటక వధతో దుష్టసంహారానికి పూనుకొన్నాడు రాముడు.
అ) జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శ్రుతకీర్తులను భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు.
ఆ) శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు.
ఈ) ధనుర్విద్యయందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది.

పాత్ర స్వభావాలు

1. నారద మహర్షి :
దేవఋషి. రామాయణగాథను వాల్మీకికి ఉపదేశించినవాడు. బ్రహ్మయొక్క మానసపుత్రుడు. త్రిలోక సంచారి. నిరంతరం నారాయణ నామాన్ని జపిస్తూ ఉంటాడు. లోకకల్యాణం కోసం నిరంతరం ప్రయత్నిస్తాడు. ఋషులకు మార్గదర్శకుడు. రామాయణ కథారచనకు మూలపురుషుడు.

2. వాల్మీకి :
మునిశ్రేష్టుడు. జిజ్ఞాసకలవాడు. ప్రకృతి అందాలకు పరవశించేవాడు. క్రౌంచ పక్షుల హృదయ విదారక దృశ్యాన్ని చూసి, అప్రయత్నంగా కవిత్వాన్ని వ్రాయగల కవి. పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు కలిగిన శ్రేష్టుడు.

3. దశరథ మహారాజు :
కోసల దేశానికి రాజు. సంతానం కోసం పరితపించాడు. పుత్రకామేష్ఠిని చేసి నలుగురు పిల్లలను పొందాడు. మహాబల పరాక్రమవంతుడు. ధర్మాత్ముడు. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించాడు. మితిమీరిన పుత్రవ్యామోహం కలవాడు. కైకకు ఇచ్చిన వరాల వల్ల శ్రీరాముని వనవాసానికి పంపాడు. శ్రీరామునిపై బెంగతో మరణించాడు.

4. వశిష్ఠుడు :
దశరథుని ఇంటి పురోహితుడు. బ్రహ్మర్షి. దశరథునికి అనేక ధర్మసందేహాలను తీర్చేవాడు. శ్రీరామునకు కర్తవ్యబోధ చేసినవాడు.

5. కౌసల్య :
దశరథ మహారాజు భార్య. శ్రీరాముని తల్లి. ఏనాడూ భర్త మాటకు ఎదురు చెప్పని మహాపతివ్రత. శ్రీరాముడు అరణ్యవాసానికి బయల్దేరేటప్పుడు శ్రీరాముని వనవాస ప్రయత్నం విరమింపజేయాలనుకుంది. ఫలించలేదు. పుత్రవ్యామోహంతో వనవాసానికి తానూ వస్తానంది. రాముడు ఒప్పుకోలేదు. శ్రీరాముడికి ధర్మబోధ చేసింది. ధైర్యం చెప్పిన వీరనారి. ధర్మాన్ని విడిచి పెట్టవద్దని చెప్పిన మహారాణి కౌసల్య.

6. సుమిత్ర :
దశరథ మహారాజుకు రెండవ భార్య. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఈమె సంతానం. కౌసల్యాదేవి అడుగుజాడలలో నడిచింది. భర్త మాటకు ఎదురు చెప్పని మహాపతివ్రత. శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులందర్నీ సమానంగా చూసిన మాతృమూర్తి.

7. కైక :
కేకయరాజు కూతురు. పరాక్రమవంతురాలు. యుద్ధవిద్యలు కూడా తెలుసు. చెప్పుడు మాటలకు లొంగిపోయే స్వభావం కలది. మంథర చెప్పిన చెప్పుడు మాటలతో శ్రీరామ వనవాసానికి కారకురాలైంది. అందరి నిందలను పడింది. దశరథుని మరణానికి కూడా కారకురాలైంది. ఒక దుష్ట స్త్రీ పాత్రగా మిగిలిపోయింది.

8. ఋష్యశృంగుడు :
విభాండక మహర్షి కొడుకు. దశరథుని కుమార్తె శాంతను వివాహం చేసుకున్నాడు. పుత్రకామేష్ఠి యాగం దశరథుని చేత చేయించాడు. ఋష్యశృంగుడు సాక్షాత్తు దైవస్వరూపుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు బాగా కురుస్తాయి. భూమి సస్యశ్యామలంగా ఉంటుంది.

9. శ్రీరాముడు :
ఎవరికీ లేనన్ని మంచి గుణాలు కలవాడు. దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు. సీతాపతి. ధర్మమూర్తి. ఆదర్శవంతమైన కొడుకు. ఆదర్శమూర్తియైన, మర్యాద పురుషుడైన భర్త. శత్రువైన మారీచుని చేత కూడా పొగడబడినవాడు.

10. లక్ష్మణుడు :
దశరథ మహారాజుకు సుమిత్రయందు జన్మించినవాడు. అన్నావదినల సేవలో తరించినవాడు. 14 సంవత్సరాలు నిద్రాహారాలు మాని సీతారాములను సేవించాడు. అన్నావదినలకు నీడలా ఉన్నాడు. సీతారాములలోనే తన తల్లిదండ్రులను దర్శించుకున్నాడు. ముక్కోపి. రామరావణ సంగ్రామంలో శ్రీరామ విజయానికి ప్రధానకారకుడు. ధర్మస్వరూపుడు.

11. భరతుడు :
కైక యందు దశరథ మహారాజుకు జన్మించాడు. కైక రాజ్యా ధికారం చేపట్టమని కోరినా శ్రీరామ పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. తల్లిని కూడా దూషించాడు. రాజ్యంపై కోరిక లేనివాడు. కేవలం శ్రీరాముని సేవించడానికే జన్మించాననుకొనే పుణ్యపురుషుడు.

12. శత్రుఘ్నుడు :
సుమిత్రయందు దశరథునకు జన్మించాడు. లక్ష్మణుని స్వభావం శత్రుఘ్నుని స్వభావం ఒక్కటే. అన్నగార్లపై అమితమైన గౌరవం కలవాడు.

13. విశ్వామిత్రుడు :
గాధి యొక్క కుమారుడు. శ్రీరామలక్ష్మణుల యాగ సంరక్షణార్థం తీసుకొని వెళ్ళాడు. వారికి బల, అతిబల, విద్యలను ఉపదేశించాడు. వాటి వలన రామలక్ష్మణులకు అలసట, ఆకలిదప్పులు ఉండవు. ధనుర్విద్యలో రామలక్ష్మణులను తీర్చిదిద్దాడు. అనేక అస్త్రాల ప్రయోగ ఉపసంహారాలను నేర్పాడు. రామలక్ష్మణుల ధనుర్విద్యా గురువు.

14. భగీరథుడు :
దృఢ సంకల్పం కలిగినవాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి ప్రక్కకు తప్పుకోకుండా, సంకల్పాన్ని నెరవేర్చుకోగల ధీశాలి. పట్టుదల కలవాడు. పట్టుదల విషయంలో ‘భగీరథ ప్రయత్నం’ అన్న జాతీయం ఏర్పడటానికి నెరవేర్చుకోగల ధీశా కలిగినవాడు.

15. జనక మహారాజు :
మిథిలానగరపు రాజు. సీతాదేవికి తండ్రి. రాజర్షి. ధర్మశాస్త్రాలు తెలిసినవాడు. ఋషులకు కూడా సందేహాలు తీర్చగలవాడు. మహాజ్ఞాని.

16. పరశురాముడు :
రేణుకా జమదగ్నుల కుమారుడు. ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షణం చేసి, క్షత్రియులను సంహరించాడు. చాలా కోపం ఎక్కువ. అధర్మాన్ని సహించడు. అధికార గర్వాన్ని అంతం చేస్తాడు. వేదాధ్యయనం చేసినవాడు. తన శక్తిని కూడా శ్రీరామునకు ఇచ్చినవాడు. పరశురాముడంటే రాజులకు సింహస్వప్నం.

సంఘటన ద్వారా గ్రహించుట )

ప్రశ్న 1.
“మీరు చెప్పినట్లుగా నడుచుకొమ్మని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యము” అని – శ్రీరాముడు తాటకను చంపడం విషయంలో విశ్వామిత్ర మహర్షితో చెప్పిన మాటలను బట్టి, మీరేం గ్రహించారు?
జవాబు:
పై మాటలను బట్టి శ్రీరాముడు గొప్ప పితృవాక్య పరిపాలకుడని, గ్రహించాను. గురువైన విశ్వామిత్రుడు చెప్పినట్లు నడుచుకోవడం, ఆయన ఆజ్ఞను పాలించడం, శిష్యుని ధర్మమని రాముడు భావించాడనీ, అతడు గురువు చెప్పినట్లే తాటకను వధించాడనీ గ్రహించాను.

తాటక స్త్రీ అయినా, ఆమె దుష్టురాలు కాబట్టి ఆమెను చంపడం తన కర్తవ్యమని రాముడు భావించాడని నేను – గ్రహించాను. అదీగాక విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయమని, తన తండ్రి దశరథుడు చెప్పిన మాటను, రాముడు వేదవాక్యంగా భావించి, స్త్రీవధ అని శంకించకుండా గురువు చెప్పినట్లు తాటకను సంహరించాడని గుర్తించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 2.
‘రాముణ్ణి వదలి నేను ఒక క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు’ అని దశరథుడు విశ్వామిత్రునితో చెప్పిన మాటలను బట్టి, మీరేమి గ్రహించారు?
జవాబు:
విశ్వామిత్రుడు తాను చేయబోయే యజ్ఞరక్షణకై శ్రీరాముడిని తనతో పంపమని, దశరథుడిని అడిగాడు. అప్పుడు దశరథుడు పై మాటలను విశ్వామిత్రుడితో అన్నాడు.

దశరథమహారాజుకు, రాముడు అంటే ప్రాణమనీ, రాముడు ఆయనకు లేక లేక పుట్టిన సంతానమనీ నేను గ్రహించాను. దశరథుడు పుత్రకామేష్టి చేయగా ఆయన నోములు పండి, రాముడు జన్మించాడనీ, రాముడిని వదలి దశరథుడు ఉండలేడనీ, రాముడు అంటే దశరథునకు బాగా ప్రేమ అనీ, పై దశరథుని మాటల వల్ల నేను అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 3.
రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు అని పలికిన మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మమార్గంలో ఉంటారని, సత్యం, నీతి, భక్తి, గౌరవం మొదలైన భావాలను కల్గి ఉంటారని గ్రహించాను. దశరథుడు, శ్రీరాముడు వంటి రాజులు ధర్మాత్ములు, సత్యకంధులు. ఆడినమాట తప్పనివారు. అట్టివారు రాజులుగా ఉన్నారు కాబట్టే ప్రజలు కూడా వారి మార్గంలోనే నడిచారని గ్రహించాను.

రాజులు ఎల్లప్పుడు ధర్మమార్గంలో ఉండాలని, ప్రజలను రక్షించాలని, వారి యోగక్షేమాలను చూడాలని, ఆ విధంగా చేస్తే ప్రజలు కూడా నీతిమార్గంలో నడిచే అవకాశం ఉంటుందని గ్రహించాను.

ప్రశ్న 4.
ఆకాశంలోని గంగను పాతాళానికి దింపిన భగీరథ ప్రయత్నం నుండి మీరేమి గ్రహించారు?
జవాబు:
గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు. గంగావతరణకు మూలకారణమైన భగీరథుని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. దీనివల్ల ఈ క్రింది విషయాలను గ్రహించాను.

  1. దృఢసంకల్పానికి అసాధ్యమైనది ఏదీలేదని తెలుస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేపట్టిన పనిని వదలకుండా చేస్తే, జయం వస్తుందని తెలిసింది.
  2. భగీరథుడు రాముని వంశంవాడే. భగీరథుని గురించి చెప్పడం వల్ల రామునికి తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలియచేశాడు విశ్వామిత్రుడు. పూర్వీకుల పేరు, మంచితనం పోగొట్టకుండా జీవించాలని చెప్పడం ఆంతర్యం.
  3. మన పితరుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండాలని తెలియజేయడం కూడా ఆంతర్యమే.

ప్రశ్న 5.
గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది ఏమిటి? శిష్యుడు పొందలేనిదేమిటి? అని కవి చెప్పడం వల్ల మీరేమి గ్రహించారు?
జవాబు:
విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగరక్షణ కోసం తన వెంట తీసుకొని వెళ్ళాడు. రామలక్ష్మణులకు ఆకలి దప్పికలు కలుగకుండా ఉండటానికి బల, అతిబల అనే మంత్రాలను ఉపదేశించాడు. శ్రీరామునికి విద్యాస్త్రాలను అనుగ్రహించాడు.

ఆ శక్తితో రాముడు తాటకి వంటి రాక్షసులను సంహరించాడు. యాగాన్ని రక్షించాడు. రాక్షస సంహారానికి శ్రీకారం చుట్టాడు. అందువల్ల గురువు ప్రేమతో శిష్యునికి అనుగ్రహిస్తే అతడు పొందలేనిది ఏమీ లేదని గ్రహించాను.

ప్రశ్న 6.
” జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండటం ఉత్తమ విద్యార్థుల లక్షణం” అని చెప్పిన కవి మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
గురువుల నుండి విద్యను అర్థించువారు విద్యార్థులు. విద్యార్థులు చక్కని విద్యను పొందడానికి గురువులను భక్తి, శ్రద్ధలతో సేవించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని గ్రహించాను. రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని సేవించారు. అతని మాటలను వేదవాక్కుగా భావించారు. అప్రమత్తులై సేవించారు. అందువల్లనే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు.

విద్యార్థులు విద్యార్జనలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సోమరితనం, గర్వం మొదలైన దుర్గుణాలను విడిచి పెట్టాలని, అదే ఉత్తమ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణమని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వాల్మీకి చెప్పిన మొదటి శ్లోకానికి కారణాలేమిటి?
జవాబు:
ఒకసారి వాల్మీకి తన శిష్యులతో తమసా నదిలోకి స్నానానికి దిగాడు. అక్కడ ఒక కొమ్మపై క్రౌంచపక్షుల జంటను చూశాడు. ఆనందించాడు. ఇంతలో ఒక వేటగాడు ఆ జంటలోని మగపక్షిని బాణంతో కొట్టాడు. అది నెత్తురోడుతూ, విలవిలలాడుతూ మరణించింది. అది తట్టుకోలేక ఆడపక్షి తల్లడిల్లిపోయింది.

హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని వాల్మీకి చూశాడు. కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. ఆయన నోటి వెంట అప్రయత్నంగా ‘మానిషాదప్రతిష్టాంత్వ..’ అనే శ్లోకం వచ్చింది.

ప్రశ్న 2.
అయోధ్యను వివరించండి.
జవాబు:
సరయూ నదీతీరంలో ‘కోసల’ దేశం ఉంది. దానిలోనిది అయోధ్యా నగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది అని అర్థం. దీనిని మనువు నిర్మించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 3.
దశరథునికి ఎన్ని ఉన్నా ఒక చింత కుంగదీసింది కదా ! ఆ చింతను ఎలా అధిగమించాడు?
జవాబు:
దశరథునికి ఎన్ని ఉన్నా సంతానం లేదనే చింత కుంగదీసింది. సంతాన ప్రాప్తి కోసం ఋషీశ్వరుల అనుజ్ఞతో అశ్వమేధ యాగం చేశాడు. తర్వాత ‘పుత్రకామేష్ఠి’ చేశాడు. సంతానం కలిగింది. శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు.

ప్రశ్న 4.
దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు. ఎందుకు?
జవాబు:
తనపైన కార్యభారం పెడితే నెరవేరుస్తానని విశ్వామిత్రుడికి దశరథుడు చెప్పాడు. విశ్వామిత్రుడు తన యాగానికి మారీ సుబాహులనే రాక్షసుల వలన కలుగుతున్న బాధను చెప్పాడు. యాగ సంరక్షణకు శ్రీరాముని తనతో పది రోజులు పంపమన్నాడు. రావణుడు ఈ రాక్షసుల వెనుక ఉన్నాడు కనుక పంపలేనన్నాడు. కావాలంటే తాను వస్తానన్నాడు దశరథుడు. దానితో విశ్వా మిత్రుడికి కోపం వచ్చింది. అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు.

ప్రశ్న 5.
బల, అతిబల విద్యల గురించి వ్రాయండి.
జవాబు:
ఈ విద్యలను రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ఉపదేశించాడు. వీటి ప్రభావం వలన అలసట ఉండదు. ఆకలి ఉండదు. దాహం ఉండదు. శరీరం కాంతి తగ్గదు. నిద్రలో ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా రాక్షసులేమీ చేయలేరు. ముల్లోకాలలో ఎవ్వరూ ఎదురొడ్డి నిలబడలేరు.

ప్రశ్న 6.
తాటక వధ న్యా యమా?
జవాబు:
తాటక యక్షిణి. వేయి ఏనుగుల బలం కలది. విశ్వామిత్రుని యజ్ఞాన్ని పాడుచేస్తోంది. ఒక స్త్రీని వధించడం మహా పాతకమని రాముడు అనుకొన్నాడు. మౌనంగా ఉన్నాడు. విశ్వామిత్రుడు తాటకను చంపమన్నాడు. అధర్మ పరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదన్నాడు. తన తండ్రి తనను విశ్వామిత్ర మహర్షి చెప్పినట్లు నడుచుకోమన్న విషయం శ్రీరాముడు గుర్తుచేసుకొన్నాడు. పితృవాక్య పరిపాలకుడు కనుక విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞను శిరసావహించాడు. తాటకను చంపాడు. ఇది న్యాయమే.

ప్రశ్న 7.
‘భగీరథ ప్రయత్నం’ అనే జాతీయం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
పాతాళంలో కపిల మహర్షి కోపాగ్నికి సగరపుత్రులు బూడిద కుప్పలయ్యారు. గంగా ప్రవాహంతో వారికి ఉత్తమగతులు కల్పించాలని సంకల్పించారు. భగీరథుడు తపస్సు చేసి, బ్రహ్మను, విష్ణువును, శివుని మెప్పించి గంగను భూమికి దింపాడు. జహ్ను మహర్షిని ప్రార్థించి ఆటంకం తొలగించాడు. అనేక కష్టాలను ఓర్పుతో అధిగమించాడు. గంగను ప్రవహింపజేశాడు. అందుకే భగీరథ ప్రయత్నం జాతీయం ఏర్పడింది. చాలా కష్టపడి సాధించిన వాటి విషయంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

ప్రశ్న 8.
శివధనుర్భంగాన్ని వివరించండి.
జవాబు:
మహాబలవంతులు ఐదువేల మంది శి వధనుస్సుతో ఉన్న పేటికను తెచ్చారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ఆ ధనుస్సు మధ్య భాగాన్ని శ్రీరాముడు అవలీలగా పట్టుకొన్నాడు. ధనుర్విద్యలో ఆరితేరిన శ్రీరాముని చేయి సోకగానే ధనువు వంగింది. వింటి నారిని సంధించాడు. అల్లెత్రాడును ఆకర్ణాంతం లాగాడు. భయంకరమైన శబ్దం చేస్తూ విల్లు ఫెళ్లున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప సభలోని వారంతా ఆ ధ్వనికి మూర్ఛపోయారు. సీతారాముల కల్యాణానికి అంకురార్పణ జరిగింది.

ప్రశ్న 9.
శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజలందరికీ పరమ ప్రీతి ఎందుకు?
జవాబు:
శ్రీరాముడు సద్గుణాల రాశి. రూపంలోనూ, గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. కోపం లేదు. గర్వం లేదు. సత్యం పలికేవాడు. పరుల సంపద ఆశించడు. దీనులను ఆదుకుంటాడు. కాలాన్ని వృధా చేయడు. వినయశీలి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలపట్ల భక్తి కలవాడు. సోమరితనం లేనివాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 10.
‘అతిథిదేవోభవ’ అతిథి మనకు దేవునితో సమానం – వివరించండి.
జవాబు:
తిథి నియమములు లేకుండా వచ్చేవాడు అతిథి. తల్లి, తండ్రి తర్వాత స్థానం అతిథిదే. మనవల్ల ఇతరులకు సంతోషం కలుగుతున్నప్పుడు మన జీవితానికి సార్ధకత ఏర్పడుతుంది. ఆ సార్థకత మనం అతిథులను ఆదరించినపుడే కలుగుతుంది. అందుకే పెద్దలు ‘అతిథి దేవోభవ’ అన్నారు. భగవత్స్వరూపంగా అతిథిని భావించాలి. సాయం కోరి మన వద్దకు వచ్చిన వ్యక్తిని నిరుత్సాహపరచకుండా కోరిన సాయం చేయటం ఉత్తమ లక్షణంగా పెద్దలు పేర్కొన్నారు. రామాయణంలోను విశ్వామిత్రుడు వచ్చినపుడు దశరథుడు అతిథి మర్యాదలు చేశాడు. విశ్వామిత్రుని ద్వారా రామలక్ష్మణులు ఎన్నో విద్యలను కూడా పొందారు. కనుక అతిథి మనకు దేవునితో సమానం.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సీతారామ కళ్యాణమును రాయండి.
(లేదా)
సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి.
(లేదా)
సీతారామ కళ్యాణమును మీ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో “జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక మహాధనుస్సు ఉంది. అక్కడకు వెడదాం” అన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మిథిలకు బయలుదేరారు. దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని గూర్చి, గంగ వృత్తాంతాన్ని గూర్చి చెప్పాడు. భగీరథుని వృత్తాంతం చెప్పాడు.

మిథిలా నగరం సమీపంలో, వారు గౌతమ మహర్షి ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమంలో అహల్యాగౌతములు ఉండేవారు. అహల్య తప్పు చేసిందని గౌతముడు అహల్యను వేల సంవత్సరాల పాటు అన్నపానాలు లేకుండా బూడిదలో పడి ఉండమని శపించాడు. రాముని రాకతో శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. రాముడు మహర్షి ఆదేశంపై గౌతమాశ్రమంలో కాలుమోపి, అహల్యకు శాపవిముక్తి కల్పించాడు.

మిథిలలో జనకమహారాజు వీరిని ఆదరించాడు. అహల్యా గౌతముల కుమారుడు శతానందుడు, రామునికి కృతజ్ఞతలు చెప్పాడు. జనకుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో “వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు. నీ ధనుస్సును చూద్దామని వచ్చారు. చూపించు శుభం కలుగుతుంది” అని చెప్పాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చాలులో దొరికిందనీ, ఆ సీతను శివధనుస్సును ఎక్కుపెట్టగల వీరునికి ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. చాలామంది రాజులు శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారని చెప్పాడు.

విశ్వామిత్రుడు శివధనుస్సును తెప్పించమన్నాడు. ఐదువేలమంది శివధనుస్సు ఉన్న పెట్టెను తెచ్చారు. రాముడు పట్టుకోగానే శివధనుస్సు వంగింది. నారి ఎక్కుపెట్టగా ఆ ధనుస్సు ధ్వని చేస్తూ విరిగింది.

జనకుడు సీతారాములకు పెండ్లి చేయడానికి సిద్ధం అయ్యాడు. దశరథునికి కబురుపెట్టారు. అయోధ్య నుండి అందరూ వచ్చారు. జనకుడు తన కుమార్తెలు సీతా, ఊర్మిళలను, రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవిని, శ్రుతకీర్తిని భరతశత్రుఘ్నులకు ఇచ్చి పెండ్లి చేశాడు.

దశరథుడు అయోధ్యకు తిరిగి వెడుతుండగా పరశురాముడు ఎదురు వచ్చాడు. రాముడు పరశురాముని చేతిలోని వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టాడు. పరశురాముడు ఓడిపోయి, మహేంద్రపర్వతానికి వెళ్ళాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 2.
వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి.
(లేదా)
వాల్మీకి రామాయణం రచించడానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించండి.
జవాబు:
నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. “అన్ని మంచిగుణాలు కలవాడూ, మాట తప్పనివాడూ, ధర్మం తెలిసినవాడూ మొదలయిన శుభలక్షణాలు గలవాడు” ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ? అని, వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించాడు. “సాధారణంగా ఇన్ని విశిష్ట గుణాలు కలవాడు ఉండడు. కాని శ్రీరాముడు ఒక్కడు అలాంటి వాడు ఉన్నాడు అని చెప్పి, నారదుడు వాల్మీకికి రామకథను చెప్పాడు. నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.

వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ, శిష్యులతో తమసానదీ స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేటగాడు బాణంతో మగపక్షిని కొట్టి చంపాడు. వాల్మీకి హృదయంలో కరుణ రసం పొంగింది. “మానిషాద” అనే శ్లోకం చెప్పాడు. వాల్మీకి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

సృష్టికర్త అయిన బ్రహ్మ, వాల్మీకిని చూడడానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేశాడు. బ్రహ్మ, వాల్మీకిని కూర్చోమన్నాడు. వాల్మీకి హృదయంలో ‘మానిషాద’ శ్లోకం, మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించింది. బ్రహ్మ చిరునవ్వు నవ్వి వాల్మీకితో “నీవు పలికినది శ్లోకమే. ఈ ఛందస్సులోనే నీవు రామాయణం రాయి. భూమండలంలో పర్వతాలూ, నదులూ ఉన్నంతకాలం, ప్రజలు రామాయణగాథను కీర్తిస్తూనే ఉంటారు” అని చెప్పాడు.

ఈ విధంగా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం, వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు.

ప్రశ్న 3.
భగీరథుడు గంగను భూమికి తీసుకురావడంలో ఎలా సఫలమయ్యాడోమీసొంతమాటల్లో వివరించండి.
జవాబు:

  1. పాతాళంలో బూడిద కుప్పలుగా పడివున్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సురగంగను అక్కడ ప్రవహింపజేయాలని సంకల్పించాడు భగీరథుడు.
  2. బ్రహ్మను గూర్చి, శివుణ్ణి గూర్చి ఘోర తపమాచరించి గంగను భూమి పైకి వదలడానికి బ్రహ్మను, గంగను భరించడానికి శివుణ్ణి ఒప్పించాడు.
  3. గంగ యొక్క అహంకారానికి కోపించి శివుడు గంగను బంధించగా మరల శివుణ్ణి ప్రార్థించి గంగను విడిపించాడు.
  4. గంగా ప్రవాహ వేగానికి కోపించిన జహ్ను మహర్షిని శాంతింపజేసి గంగను మరల ప్రవహించేలా చేశాడు.
  5. ఈ విధంగా గంగను తీసుకురావడంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా భగీరథుడు వాటిని ఎదుర్కొని గంగను భూమి పైకి తీసుకురావడంలో కృతకృత్యుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో “భగీరథ ప్రయత్నం” అన్న జాతీయం వాడుకలోకి వచ్చింది.

ప్రశ్న 4.
దశరథునికి పుత్రజననం గురించి రాయండి.
(లేదా)
రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం.
జవాబు:
సరయూనదీ తీరంలో “కోసల” దేశం ఉంది. దాని ముఖ్యనగరం ‘అయోధ్య’. దాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. దశరథుడు ధర్మపరాయణుడు. ఇతని పాలనలో దేశం భోగభాగ్యాలతో విలసిల్లేది. ప్రజలు సుఖంగా ఉండేవారు. దశరథునకు సంతానం లేదు. సంతానం కోసం ఆయన అశ్వమేథయాగం చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంత్రుడు అందుకు ఋష్యశృంగమహర్షిని పిలవమన్నాడు.

ఋష్యశృంగుడు ఉన్నచోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఋష్యశృంగుడు మూడు రోజులు అశ్వమేథయాగం చేయించాడు. పుత్రుల కోసం యజ్ఞం చేయించమని దశరథుడు, ఋష్యశృంగుని కోరాడు. ఇంతలో దేవతలు రావణాసురుడు తమను చిత్రహింస పెడుతున్నాడని బ్రహ్మకు చెప్పారు. రావణాసురుని బాధ తప్పే ఉపాయం చెప్పమని, దేవతలు బ్రహ్మను కోరారు.

బ్రహ్మ, దేవతలతో రావణాసురునికి మానవులవల్లనే మరణం ఉందని చెప్పాడు. ఇంతలో శ్రీమహావిష్ణువు వచ్చాడు. దేవతలు మానవుడిగా పుట్టి రావణాసురుని సంహరించమని విష్ణుమూర్తిని కోరారు. దశరథ మహారాజు ముగ్గురు భార్యలకూ నాలుగురూపాలలో పుత్రుడిగా పుట్టమని దేవతలు విష్ణువును కోరారు. విష్ణువు వారికి అభయం ఇచ్చాడు.

దశరథుడి పుత్రకామేష్టి యజ్ఞకుండం నుండి, బ్రహ్మ పంపించగా ఒక దివ్యపురుషుడు బంగారు పాత్రతో దివ్యపాయసం తీసుకొని వచ్చాడు. ఆ పాయసపాత్రను అతడు దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 5.
రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
దశరథ పుత్రులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వేదశాస్త్రాలు, ధనుర్విద్య నేర్చారు. లక్ష్మణుడు రాముడికి బహిః ప్రాణం. తన కుమారులను దశరథుడు వివాహం చేద్దామనుకుంటున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకు వచ్చాడు. ఆ ఋషి చెప్పిన కార్యాన్ని చేస్తానన్నాడు దశరథుడు.

విశ్వామిత్రుడు తన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞం చేసేటప్పుడు తాను శపించకూడదనీ, యజ్ఞరక్షణకు శ్రీరాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ దశరథుని కోరాడు. దశరథుడు మహర్షితో రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ రాముడికి యుద్ధం తెలియదనీ, రాముణ్ణి విడిచి తాను ఉండలేననీ, తానే యజ్ఞరక్షణకు వస్తానని చెప్పాడు.

తన యజ్ఞానికి రావణుని ఆజ్ఞపై మారీచ సుబాహులు విఘ్నాలు కల్గిస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి పంపనని చెప్పగా, విశ్వామిత్రునకు కోపం వచ్చింది. వశిష్ట మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశించాడు. ఆ విద్యల మహిమవల్ల అలసట, ఆకలిదప్పులు ఉండవు. రాముడు విశ్వామిత్రునికి గురుసేవ చేశాడు. రామలక్ష్మణులు మహర్షితో ‘మలద’ , ‘కరూశ’ గ్రామాలకు చేరారు. అక్కడ తాటక అనే యక్షిణి విధ్వంసం చేసేది. ఆమె కొడుకు మారీచుడు జనపదాలను అతలాకుతలం చేసేవాడు. తాటకను చంపమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు వాడి బాణాలతో తాటక బాహువులను ఖండించాడు. లక్ష్మణుడు తాటక ముక్కు చెవులు కోశాడు. రాముడు శబ్దవేధి విద్యతో, బాణం వేసి తాటకను చంపాడు. విశ్వామిత్ర మహర్షి సంతోషించి, అనేక దివ్యాస్త్రాలను రాముడికి అనుగ్రహించాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. ఆ యజ్ఞం, ఆరురోజులు. రామలక్ష్మణులు యజ్ఞాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఇంతలో మారీచ సుబాహులు అనే రాక్షసులు, యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడి పై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని వేసాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన వారిని, ‘వాయవ్యాస్త్రం’తో రామలక్ష్మణులు తరిమారు. మహర్షి యజ్ఞం పూర్తయ్యింది.

ప్రశ్న 6.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించిన విధం రాయండి.
జవాబు:
అయోధ్యను రాజధానిగా చేసుకొని, కోసల దేశాన్ని దశరథుడు పాలించేవాడు. దశరథునికి సంతానం లేదు. సంతానం కోసం దశరథుడు అశ్వమేధయాగాన్ని చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంత్రుడు యాగాన్ని చేయించడానికి ఋష్యశృంగ మహర్షిని పిలవమన్నాడు.

ఋష్యశృంగుడు అశమేధయాగం చేయించా. పుత్రుల కోసం యజ్ఞం చేయించండని దశరథుడు ఋష్యశృంగుడిని కోరాడు. ఇంతలో దేవతలు విష్ణుమూర్తిని మానవుడిగా పుట్టి రావణాసురుడిని సంహరింపమని కోరారు. దశరథుని ముగ్గురు భార్యలకూ నాలుగు రూపాలలో పుత్రుడిగా పుట్టమని, దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు సరే అని వారికి అభయం ఇచ్చాడు.

దశరథుడు పుత్రకామేష్టి చేశాడు. ఆ యజ్ఞకుండం నుండి బ్రహ్మ పంపించిన ఒక దివ్యపురుషుడు, బంగారుపాత్రతో దివ్యపాయసం తెచ్చి దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 7.
ఉత్తమ విద్యార్థుల లక్షణాలేమిటి? రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులని ఎలా చెప్పగలవు?
జవాబు:
జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం, ఉత్తమ విద్యార్థుల లక్షణం. గురువుగారికి సేవ చేయడం, కూడా ఉత్తమ విద్యార్థి లక్షణం.

రామలక్షణులు ఉత్తమ విద్యార్థులు : వారు తమ గురువైన విశ్వామిత్రుడి పాదాలు ఒత్తారు. వారు గురువు వెంట వెళ్ళి, సకాలంలో లేచి, నిత్యకర్మలు చేసేవారు. గంగాసరయూ నదుల సంగమం వంటి వాటి గురించి గురువుగారిని అడిగి వివరంగా తెలిసికొన్నారు. గురువు ఆజ్ఞను పాటించడం శిష్యుడి కర్తవ్యమని గ్రహించి, విశ్వామిత్రుడు చెప్పినట్లుగా వారు తాటకను వధించారు.

వారు సిద్ధాశ్రమం చేరి విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడారు. మారీచ సుబాహులను తరిమి కొట్టారు. మిథిలా నగరానికి గురువుగారితో వెడుతూ, గంగ మొదలయిన వాటిని గురించి గురువుగారిని అడిగి తెలిసికొన్నారు. గురువుగారి అనుగ్రహంతో ఎన్నో అస్త్రాలను ప్రయోగ, ఉపసంహారాలతో నేర్చుకున్నారు.

దీనినిబట్టి రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులని చెప్పగలము.

ప్రశ్న 8.
రాముడు తొలిసారిగా తాటక అనే సీని సంహరించడాన్ని ఎలా సమర్థించగలవు?
జవాబు:
తాటక, ఒక యక్షిణి. ఆమె వేయి ఏనుగుల బలం కలది. తాటక, ఆమె కుమారుడు మారీచుడు, కలసి మలద, కరూశ జనపదాలను విధ్వంసం చేశారు. దుష్టురాలు తాటకను వధించమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు కొంచెం సేపు మాట్లాడలేదు.

అప్పుడు విశ్వామిత్రుడు “స్త్రీని చంపడం ఎలా అని, నీకు అనుమానం వద్దు. అధర్మపరురాలయిన తాటకను చంపితే దోషం రాదు” అని రాముడికి కర్తవ్యం ఉపదేశించాడు.

విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయమని దశరథుడు రాముడికి వచ్చేటప్పుడు చెప్పాడు. తండ్రిగారి ఆజ్ఞ రామునకు శిరోధార్యము. అలాగే గురువుగారయిన విశ్వామిత్రుడి ఆజ్ఞను పాటించడం శిష్యుడిగా రాముడి కర్తవ్యం. అందువల్లనే తాటక స్త్రీ అయినప్పటికీ, తండ్రి, గురువుల ఆజ్ఞలను శిరసావహించి, రాముడు తాటకను చంపాడు. అందులో తప్పు లేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 12th Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 12th Lesson చిత్రగ్రీవం

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

రక్తాలు ఓడుతూన్న మా రాస్పెలదార్ గబగబా ఏదో రాసి ఆ కాగితాన్ని నా కాలికి కట్టారు. కట్టి నన్ను వంజరం లోంచి వదలిపెట్టారు. అతని కళ్లల్లో కనిపించిన ఆందోళనను బట్టి, వాళ్ళంతా తీవ్రమైన ఆపదలో ఉన్నారనీ, ముఖ్యస్థావరం నుంచి సత్వర సహాయం ఆశిస్తున్నారనీ అర్థమయింది. వెంటనే కాలికి కట్టిన సమాచార పత్రంతో సహాగాలిలోకి ఎగిరాను. ఎలాగైనా సరే ఘోండ్”వేచి ఉండే ప్రధాన స్థావరం దగ్గరకు చేరుకొని తీరాలన్న తవన. ‘చేరాలి. చేరి తరాలి’ అని మనసులో పదేవదే అనుకొన్నాను. పలికిన ప్రతీసారీ ఆ మాటలు విష్యమంత్రాల్లా నా మనసులో బాగా నాటుకొనిపోయి నాకు నూతన జవసత్త్వాలను అందించసాగాయి. అప్పటికే బాగా పైకి చేరుకొన్నాను. కాబట్టి ఒక్కసారి నాలుగు దిక్కులా కలయజూసి, పడమట దిశను గుర్తుపట్టి ఆ దిశగా ఎగర నారంభించాను. వంకర టింకర మార్గాల్లో పిచ్చిగా ఎగిరి, చిట్టచివరకు గమ్యంచేరి ఘోండ్ చేతిమీద వాలాను. రస్సెల్దార్ అందించిన ఆ సమాచారాన్ని ఘోండ్ గబగబా చదివి, సంతోషంతో దుక్కిటెద్దులా రంకె పెట్టారు. ప్రేమగా నా తల నిమిరారు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరాలోని మాటలు ఎవరు చెబుతున్నారు?
జవాబు:
ఈ పేరాలోని మాటలు, ఒక పక్షి చెపుతున్నది.

ప్రశ్న 2.
సమాచారాన్ని ఎవరి దగ్గర నుండి ఎవరికి ఆ పక్షి చేర్చింది.
జవాబు:
సమాచారాన్ని రాస్సెల్ దార్ నుండి ఊండకు చేర్చింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
సమాచారాన్ని చేరవేయడానికి ఏ పక్షిని ఉపయోగించి ఉంటారు? ఎందుకు?
జవాబు:
సమాచారాన్ని చేరవేయడానికి పావురాన్ని ఉపయోగించి ఉంటారు. పావురానికి దిశాపరిజ్ఞానం ఉంది. అందువల్ల పావురాన్ని ఉపయోగించి ఉంటారు.

ప్రశ్న 4.
సమాచారాన్ని చేరవేసిన పక్షిలోని గొప్ప లక్షణాలు ఏవి?
జవాబు:
ఎలాగైనా సరే, ఘోండ్ వేచి ఉండే ప్రధాన స్థావరం దగ్గరకు చేరుకొని తీరాలన్న తపన ఆ పక్షిలో ఉంది. ఈ పక్షి రాస్సెల్ దార్ కళ్ళలోని ఆందోళనను గుర్తించింది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
“మనుషుల్లాగే పక్షులకు, జంతువులకు కూడా తమ పిల్లలను పెంచడం ఎలాగో తెలుసు” దీనిమీద మీ అభిప్రాయాన్ని తెల్పండి. కారణాలను వివరిస్తూ మాట్లాడండి.
జవాబు:
మనం చదివిన “చిత్రగ్రీవం” కథలో తల్లి పక్షి, తండ్రి పక్షి పిల్ల పక్షికి (చిత్రగ్రీవానికి) ఆహారాన్ని పెట్టాయి. తండ్రి పక్షి, దాని బద్ధకాన్ని పోగొట్టి, ఎగిరేలా చేసింది. ఎగిరేటప్పుడు చిత్రగ్రీవానికి తల్లి సాయపడింది. చిత్రగ్రీవానికి ఆయాసం వచ్చింది. అప్పుడు తల్లి పక్షి, దాన్ని దగ్గరకు తీసుకొని లాలించింది.

లోకంలో పక్షులు తమ పిల్లల రక్షణ కోసం గూళ్లను నిర్మిస్తున్నాయి. పిల్లలు ఎగిరి వాటి ఆహారం తెచ్చుకోనే వరకూ, అవే ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నాయి. జంతువులు తమ పిల్లలకు తాము పాలిచ్చి పెంచుతున్నాయి.

తల్లి కుక్క తన పిల్లలకు పరుగుపెట్టడం, కరవడం, వగైరా నేర్పుతుంది. తమ పిల్లల జోలికి ఇతరులు రాకుండా తల్లి జంతువులు కాపాడతాయి. తమ పిల్లల జోలికి వస్తే ఆవు, గేదె వగైరా జంతువులు తమ కొమ్ములతో పొడుస్తాయి. తమ దూడలు తమ దగ్గరకు రాగానే, అని పొదుగులను చేపి పాలిస్తాయి.

ఇందువల్ల పక్షులకూ, జంతువులకూ తమ పిల్లల్ని పెంచడం తెలుసునని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి. పేరా సంఖ్య

పేరా సంఖ్య పేరాలో వివరించిన ముఖ్యమైన విషయాలు పేరాకు తగిన శీర్షిక
1వ పేరా :
2వ పేరా :
10వ పేరా:
15వ పేరా :
16వ పేరా :

జవాబు:

పేరా సంఖ్య పేరాలో వివరించిన ముఖ్యమైన విషయాలు పేరాకు తగిన శీర్షిక
1వ పేరా : 1) కోల్ కతా నగరంలో పిల్లలు పావురాలను బాగా పెంచుతారు.
2) ఎన్నో శతాబ్దాల నుంచి రాజులూ, రాజులూ పావురాలను పెంచుతున్నారు. సామాన్యులు సైతం రంగురంగుల పావురాలను పెంచుతున్నారు.
భారతదేశం – పావురాల పెంపకం
2వ పేరా : మన దేశంలో పావురాలు ఎగురుతూ, కనువిందు చేస్తూ ఉంటాయి. పావురాలు బృందాలుగా ఎగురుతూ ఉంటాయి. అవి ఎంతదూరం ఎగిరి వెళ్ళినా, తిరిగి తమ యజమాని ఇంటికి చేరతాయి. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది.
పావురాలకు దిశా జ్ఞానం ఉంది. పావురాలు తమ యజమానులు అంటే ప్రాణం పెడతాయి. వాటికి ఉన్న అంతఃప్రేరణతో అవి యజమాని ఇంటికి చేరతాయి.
పావురాల దిశా పరిజ్ఞానం
10వ పేరా: తల్లి పక్షి గుడ్డులోని శబ్దం వింటుంది. తల్లి పక్షి శరీరంలో స్పందన కనిపిస్తుంది. తల్లి పక్షిలో దివ్యస్పందన కలిగి, రెండు ముక్కుపోట్లతో అది గుడ్డును పగులకొట్టింది. పిల్ల పక్షి బలహీనంగా ఉంటుంది. తల్లి పిల్లను తన రొమ్ములో దాచుకుంటుంది. పావురం గుడ్లను పొదగడం
15వ పేరా : చిత్రగ్రీవం గూటి అంచున కూర్చుంది. అది చీమను ముక్కుతో పొడిచి, దాన్ని రెండు ముక్కలు చేసింది. పావురం చీమను తినే వస్తువు అనుకుంది. నిజానికి చీమ పావురాలకు మిత్రుడు. అందుకే పావురం పశ్చాత్తాపపడింది. పావురం తిరిగి ఆ తప్పు చేయలేదు. పావురం చీమను చంపడం
16వ పేరా : చిత్రగ్రీవానికి వయస్సు ఐదు వారాలు. అది గూటి దగ్గర మూకుడు నుండి నీళ్ళు తాగడం నేర్చుకొంది. ఆహారం కోసం తల్లిదండ్రులమీదే ఆధారపడుతోంది. యాజమాని పెట్టే గింజల్ని గొంతులో పైకి, కిందికీ ఆడిస్తూ తినేది. తాను గొప్పగా తినగలుగుతున్నానని దానికి గర్వంగా ఉండేది. తన చురుకుదనాన్ని తన తల్లిదండ్రులకు చెప్పమన్నట్లు, అది యజమానివైపు చూచేది. కానీ చిత్రగ్రీవం మిగిలిన పావురాలన్నింటి కన్నా మందకొడి. చిత్రగ్రీవం చదువు

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) చిత్రగ్రీవం ఏ వయస్సులో ఏమేం చేయగలిగిందో రాయండి.
జవాబు:

  1. చిత్రగ్రీవం పుట్టిన రెండో రోజు నుండే, దాని తల్లిదండ్రులు గూటి వద్దకు వచ్చినప్పుడల్లా అది తన ముక్కు తెరచి, తన గులాబీ రంగు శరీరాన్ని బంతివలె ఉబ్బించేది.
  2. చిత్రగ్రీవం, తన మూడు వారాల వయసులో దాని గూటిలోకి వచ్చిన చీమను చూసి తినే వస్తువు అనుకొని తన ముక్కుతో దానిని పొడిచి రెండు ముక్కలు చేసింది.
  3. ఐదోవారంలో చిత్రగ్రీవం తను పుట్టిన గూడు నుండి బయటకు గెంతి, పావురాళ్ల గూళ్ల దగ్గర పెట్టిన మట్టి మూకుడులో నీటిని, తాగగల్గింది.
  4. అదే వయసులో యజమాని ముంజేయి మీద కూర్చుని అరచేతిలో గింజల్ని పొడుచుకు తినేది. చిత్రగ్రీవం గింజలను తన గొంతులో పైకి కిందికి ఆడించి, తర్వాత టక్కున మింగేది.
  5. గాలిదుమారం వచ్చినపుడూ, సూర్యుని కిరణాలు కంటిలో పడినపుడూ, చిత్రగ్రీవం తన కళ్లమీదకు దాని కనురెప్పల పక్కనున్న చర్మపు పొరను సాగదీసి కప్పేది.
  6. చిత్రగ్రీవం ఏడవ వారంలో ఎగరడం నేర్చుకుంది.

ఆ) చిత్రగ్రీవానికి దాని తల్లిపక్షి, తండ్రిపక్షి నుండి ఏమేమి సంక్రమించాయి?
జవాబు:
చిత్రగ్రీవం తల్లి పక్షి నుండి తెలివితేటలు సంపాదించుకుంది. తండ్రి పక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం ‘ సంపాదించుకుంది. తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పింది. తల్లి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడంలో సాయపడింది.

ఇ) చిత్రగ్రీవం గురించి వివరిస్తూ అది సుందరమైనదని, మందకొడిదని, ఏపుగా ఎదిగిందని రచయిత ఎందుకన్నాడు?
జవాబు:
చిత్రగ్రీవం తల్లిదండ్రులు చిత్రగ్రీవం దగ్గరనే ఉండి దాన్ని లాలిస్తూ, దాని బాగోగులు చూస్తూ ఉండడం వల్ల, ఆహారం అందించడంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది.

చిత్రగ్రీవానికి ఐదోవారం వచ్చింది. అయినా చిత్రగ్రీవం తన ఆహారం కోసం ఇంకా తల్లిదండ్రులమీదే ఆధారపడి ఉంది. అందువల్లే శక్తియుక్తులు పెంపొందించుకోడంలో పావురాలు అన్నింట్లోనూ చిత్రగ్రీవమే మందకొడి అని రచయిత అన్నాడు.

చిత్రగ్రీవం పుట్టిన తర్వాత వారాలు గడిచేకొద్దీ దానికి ఈకలు పెరిగాయి. దానికి ఒక్కసారిగా నిండుగా ఈకలు పెరిగాక, ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాక, అందంలో చిత్రగ్రీవానికి సాటిరాగల పావురం లేదని స్పష్టమయ్యింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ఈ) చిత్రగ్రీవం గురించి మనకు వివరిస్తున్నది ఎవరు? తాను చేసిన పనికిమాలిన పని అని దేన్ని గురించి చెప్పాడు?
జవాబు:
చిత్రగ్రీవం గురించి మనకు ధనగోపాల్ ముఖర్జీ గారు వివరించారు. ధనగోపాల్ ముఖర్జీ గారు, పావురాల గూళ్లను శుభ్రం చేస్తూ, గూటిలో ఉన్న రెండు గుడ్లనూ పక్క గూట్లో పెట్టారు. మొదటి గూడు శుభ్రం చేయడం పూర్తి అయ్యాక తిరిగి ఒక గుడ్డును గూట్లో పెట్టారు. రెండవ గుడ్డును కూడా ఆ గూట్లో పెడుతుండగా, తండ్రి పావురం ధనగోపాల్ ముఖర్జీ గారి ముఖంపై దాడిచేసింది. ఆయన గుడ్లను దొంగిలిస్తున్నాడని తండ్రి పావురం అనుకుంది. అప్పుడు ముఖర్జీ గారు రెండవ గుడ్డును నేలపై జారవిడిచారు.

పావురం గూడును బాగుచేసేటప్పుడు పావురాలు తనపై దాడిచేస్తాయని ఊహించకపోవడమే ముఖర్జీగారు చేసిన ‘పనికిమాలిన పని’.

ముందే పక్షిదాడి గూర్చి ఊహించి ఉంటే, రెండవ గుడ్డు పగిలిపోయేది కాదు.

ఉ) పిల్లపక్షి నిస్సహాయంగా ఉన్నప్పుడు, గాభరాపడినప్పుడు తల్లిపక్షి ఏం చేసింది?
జవాబు:
తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పడం కోసం చిత్రగ్రీవాన్ని పిట్టగోడమీద నుండి కిందికి గెంటింది. అప్పుడు చిత్రగ్రీవం నిస్సహాయంగా, రెక్కలు విప్పి గాలిలో తేలింది. అది చూసిన తల్లి పక్షి, చిత్రగ్రీవానికి సాయంగా తానూ ఎగిరింది. ఆ రెండూ ఆకాశంలో పదినిమిషాలు ఎగిరి, గిరికీలు కొట్టి కిందికి వాలాయి. తల్లి పక్షి రెక్కలు ముడుచుకొని శుభ్రంగా కిందికి వాలింది. చిత్రగ్రీవం మాత్రం నేలను రాసుకుంటూ వెళ్లి, రెక్కల్ని టపటపలాడిస్తూ, బాలన్సు చేసుకుంటూ, ముందుకు సాగి ఆగింది.

అప్పుడు తల్లి పక్షి చిత్రగ్రీవం పక్కకు చేరి, దాన్ని ముక్కుతో నిమిరింది. చిత్రగ్రీవం రొమ్ముకు తన రొమ్ము తాకించింది. చిన్నపిల్లాడిని లాలించినట్లు చిత్రగ్రీవాన్ని అది లాలించింది.

ఊ) “ధనగోపాల్ ముఖర్జీ” చేసిన సాహితీసేవ ఏమిటి?
జవాబు:
ధనగోపాల్ ముఖర్జీ గారు జంతువులకు సంబంధించిన తొమ్మిది పిల్లల పుస్తకాలు రాశారు. వీటిలో 1922లో ఆయన రాసిన “కరి ది ఎలిఫెంట్”, 1924లో రాసిన “హరిశా ది జంగిల్ ల్యాడ్” 1928లో రాసిన “గోండ్ ది హంటర్”, పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి.

ఈయన రాసిన చిత్రగ్రీవం పుస్తకం 1928లో న్యూ బెరీ మెడల్‌ను గెల్చుకుంది. బాలసాహిత్యంలో విశిష్ట కృషి చేసిన వారికి “అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్” వారు ఇచ్చే విశిష్ట పురస్కారమే ఈ “న్యూ బెరీ మెడల్”. ఈ బహుమతిని గెల్చుకున్న ఏకైక భారతీయ రచయిత మన ముఖర్జీ గారే.

4. కింది పేరా చదవండి. సరైన వివరణతో ఖాళీలు పూరించండి.

చాతకపక్షుల ముక్కులు చాలా చిన్నవి. తాము ఎగురుతూనే గాలిలోని కీటకాలను పట్టుకోగలవు. నోరు బార్లా తెరచి తమవైపుకు వచ్చే చాతకపక్షుల బారి నుండి కీటకాలు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. చాతకపక్షులు పరిమాణంలో చాలా చిన్నవి. వాటికి బరువులెత్తే సామర్థ్యం కూడా తక్కువే! అందుకే అవి వాటి గూళ్ళ నిర్మాణంలో గడ్డీగాదం, పీచూపత్తి, సన్నపాటి చెట్టురెమ్మలు… వంటి తేలికపాటి వస్తువులనే వాడతాయి. వాటి కాళ్ళు పొట్టిగా ఉంటాయి. పొడవాటి కాళ్ళున్న పక్షుల్లో ఉండే చురుకుదనం వీటి కాళ్ళల్లో కనిపించదు. అందుకని ఇవి గెంతడం, దభీమని దూకడం వంటి పనులు చెయ్యలేవు. ఐతే వాటి కొక్కేల్లాంటి కాలివేళ్ళ పుణ్యమా అని అవి తమ గోళ్ళతో ఎలాంటి జారుడు ప్రదేశాల్లోనైనా అతుక్కుపోయి ఉండిపోగలవు. కాబట్టి అవి అనితరసాధ్యమైన నైపుణ్యంతో, కుశలతతో పాలరాతి వంటి నున్నటి గోడల్ని, ప్రదేశాలను పట్టుకొని వెళ్ళగలవు. తమ గూళ్ళను నిర్మించుకోవడానికి ఇళ్ళ చూరుల దిగువన గోడల్లోని తొర్రలను ఎన్నుకొంటాయి. రాలిన ఆకుల్నీ, గాలిలో ఎగిరే గడ్డిపోచల్ని ముక్కున కరచుకొని గూట్లోకి చేరుస్తాయి. వాటిని తమ లాలాజలాన్ని జిగురులా వాడి గూటి ఉపరితలం మీద అతికిస్తాయి. వాటి లాలాజలం ఓ అద్భుత పదార్థం. అది ఎండి గట్టిపడిందంటే మామూలుగా వాడే ఏ జిగురూ దానికి సాటిరాదు. ఇదీ చాతకపక్షుల వాస్తుకళానైపుణ్యం.

అ) చాతకపక్షులు తేలికపాటి వస్తువులతో గూళ్ళను నిర్మించుకుంటాయి. ఎందుకంటే …………………….
జవాబు:
చాతకపక్షులు తేలికపాటి వస్తువులతో గూళ్ళను నిర్మించుకుంటాయి. ఎందుకంటే వాటికి బరువులెత్తే సామర్థ్యం తక్కువ.

ఆ) చాతకపక్షులు దభీమని దూకడం, గెంతడం చెయ్యలేవు. ఎందుకంటే ……………………………
జవాబు:
చాతకపక్షులు దభీమని దూకడం, గెంతడం కూడా చెయ్యలేవు. ఎందుకంటే వాటి కాళ్ళు పొట్టిగా ఉంటాయి.

ఇ) నున్నటి గోడలు, ప్రదేశాల్లో కూడా చాతకపక్షులు జారకుండా ఉండడానికి కారణం ………………….
జవాబు:
నున్నటి గోడలు, ప్రదేశాల్లో కూడా చాతకపక్షులు జారకుండా ఉండడానికి కారణం వాటికి ఉన్న కొక్కేల్లాంటి కాలివేళ్ళు.

ఈ) చాతకపక్షుల లాలాజలం వాటి గూటి నిర్మాణంలో ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ………………
జవాబు:
చాతకపక్షుల లాలాజలం, వాటి గూటి నిర్మాణంలో ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే వాటి లాలాజలం ఎండి గట్టిపడిందంటే మామూలుగా వాడే ఏ జిగురూ దానికి సాటిరాదు.

ఉ) వాస్తు కళా నైపుణ్యం అంటే …………..
జవాబు:
వాస్తు కళానైపుణ్యం అంటే ఇళ్ళను నిర్మించే విద్యలో నేర్పరిదనం.

II. వ్యక్తి కరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) చిత్రగ్రీవాన్ని గురించి మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏవి?
జవాబు:
చిత్రగ్రీవం తనకు మూడు వారాల వయస్సు ఉన్నప్పుడు తన గూట్లోకి వచ్చిన నల్ల చీమను ముక్కుతో పొడిచి రెండు ముక్కలు చేసింది. అయితే ఆ చీమ దానికి తినడానికి పనికిరానిది. ఆ విషయం గ్రహించిన చిత్రగ్రీవం తన జీవితంలో మళ్ళీ ఎప్పుడూ మరో చీమను చంపలేదు.

తాను చేసిన పని పొరపాటు అని గ్రహించిన పావురం తిరిగి ఆ తప్పును తిరిగి చేయకపోవడం, నాకు ఆశ్చర్యం కల్గించింది.

ఆ) మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులని రచయిత ఎందుకు అన్నాడు?
జవాబు:
“ఏనుగులు, పావురాలు తమ తమ యజమానుల పట్ల గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. వీటిని మించి యజమాని పై విశ్వాసాన్ని ప్రదర్శించే ప్రాణిని తాను చూడలేదని రచయిత చెప్పాడు.

అడవులలోని ఏనుగులు, నగరాల్లోని పావురాలు తమ యజమానులంటే ప్రాణం ఇస్తాయి. అవి రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా, ఏ ఆకాశ సీమలో ఎగిరినా, చివరకు అవి వాటికి ఉన్న అద్భుతమైన ‘అంతఃప్రేరణాబలం’తో తమ మిత్రుడూ, సహచరుడూ అయిన మానవుడి పంచకే చేరుతాయి”.

అందువల్లనే రచయిత, మానవులను పావురాలకు మిత్రులు, సహచరులు అని అన్నాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) చిత్రగ్రీవాన్ని గురించి మీ సొంతమాటల్లో వర్ణించండి.
జవాబు:
‘చిత్రగ్రీవం’ అనేది ఒక పావురం. దానిని తల్లి పక్షి, తండ్రి పక్షి అనురాగంగా పెంచాయి. తల్లిదండ్రుల శ్రమ, శ్రద్ధ వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది. దానికి గులాబీరంగు మారి తెలుపురంగు వచ్చింది. ముళ్ళపందిలాంటి ఈకలు వచ్చాయి. దాని కళ్లు దగ్గర, నోటి దగ్గర ఉన్న, పసుపు పచ్చని చర్మాలు రాలిపోయాయి. పొడవాటి, గట్టిపాటి సూదిలాంటి ముక్కు ఏర్పడింది.

పుట్టిన ఐదోవారానికి చిత్రగ్రీవం గూడు నుండి బైటికి గెంతి, మూకుళ్లలో నీళ్ళు త్రాగేది. చిత్రగ్రీవం మందకొడిగా ఉండేది.. మూడు నెలల వయస్సు రాగానే, దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలు ధగధగా మెరిశాయి. దాని మెడ ప్రాంతం, సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా శోభిల్లింది. తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం బలవంతంగా నేర్పింది. ఎగరడంలో అలసిన చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి లాలించింది.

చిత్రగ్రీవానికి నిండుగా ఈకలు పెరిగాయి. ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాయి. అందుకే, చిత్రగ్రీవానికి సాటిరాగల పావురం లేదు.

ఆ) శిశువుల పెంపకంలో పక్షులకు, మానవులకు మధ్య ఉన్న సామ్యాలను రాయండి.
(లేదా)
పిల్లల పెంపకంలో పక్షులకు, మానవులకు మధ్యగల పోలికలను వివరంగా సొంతమాటలలో పాఠ్యభాగం ఆధారంగా రాయండి.
జవాబు:
చంటిపిల్లల నోటికి తల్లి తన పాలను అందించినట్లే, పక్షిపిల్లల నోటికి తల్లి పక్షి, తండ్రి పక్షి ఆహారాన్ని అందిస్తాయి. పిల్లలకు తల్లి మంచి పక్కను ఏర్పాటు చేసినట్లే, పక్షి పిల్లలకు, తల్లి పక్షి, తండ్రి పక్షి ఆచితూచి గూట్లో వస్తువులను ఉంచి, పిల్లపక్షికి సుఖసౌకర్యాలను కల్పిస్తాయి.

తల్లి పిల్లలకు పదార్థాలను ఉడకపెట్టి, మెత్తగా చేసి, నోట్లో పెడుతుంది. అలాగే తల్లి పక్షి, తండ్రి పక్షి గింజల్నీ, విత్తనాల్నీ కాసేపు తమ నోటిలో నాననిచ్చి, మెత్తపరచి ఆ తర్వాతనే పక్షిపిల్లల నోట్లో పెడతాయి.

తల్లిదండ్రులు పిల్లలకు పాకడం, లేచి నిలబడడం, నడవడం నేర్పుతారు. వారు పిల్లల చేతులను పట్టుకొని జాగ్రత్తగా వారికి నడపడం నేర్పుతారు. అప్పుడప్పుడు పిల్లలు నడుస్తూ పరుగు పెడుతూ పడిపోతారు. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలను దగ్గరకు తీసుకొని లాలిస్తారు.

చిత్రగ్రీవానికి తండ్రి ఎగరడాన్ని అలాగే నేర్పింది. బలవంతంగా చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి, ఆకాశంలోకి తోసింది. దానితో అప్రయత్నంగా రెక్కలు విప్పి చిత్రగ్రీవం ఎగిరింది. ఎగరడంలో అది అలిసిపోగా, తల్లి పక్షి చిత్రగ్రీవాన్ని లాలించింది.

ఈ విధంగా చిత్రగ్రీవం పెంపకానికీ, పిల్లల పెంపకానికి పోలికలు ఉన్నాయి.

3. సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి.

అ) ‘చిత్రగ్రీవం’ అనే పావురంపిల్ల ఎలా పుట్టిందీ ఎలా ఎగరడం నేర్చుకొన్నదీ తెలుసుకున్నారు కదా! అట్లాగే మీకు తెలిసిన లేదా మీ పరిసరాల్లోని ఏదైనా పక్షి / జంతువు గురించి మీరు కూడా ఒక కథనాన్ని రాయండి. (ఈ పాఠంలాగా).
జవాబు:

“ధోనీ” (కుక్కపిల్ల)

మా పక్క ఇంటివాళ్ళకూ కుక్కపిల్లలంటే మహాప్రేమ’. తనను పెంచుకుంటున్న యజమానిపై విశ్వాసం చూపడంలో కుక్కను మించిన జంతువు కనబడదు. మా పక్కింటి అబ్బాయి ఒక కుక్కను పెంచుకోవాలని ఆశపడుతున్నాడు.

వాళ్ళింట్లో ఒక కుక్క గర్భవతిగా ఉంది. ఒక రోజున దానికి మూడు పిల్లలు పుట్టాయి. అందులో ఒక పిల్ల అందంగా. తెల్లగా పాలరంగులో ఉంది. దానికి మంచి బొచ్చు ఉంది. దాన్ని చూస్తే ముద్దుగా ఉంది. దానికి ధోనీ అని పేరు పెట్టాలని ఆ పిల్లవాడి ఆశ. ఆ పిల్లాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్రికెట్ అంటే బాగా ఇష్టం. అందుకే ముద్దు వచ్చే ఆ కుక్క పిల్ల ధోనీగా మారింది.

ఆ ధోనీ అంటే దాని తల్లికి బాగా ఇష్టం. ధోనీకి తల్లి కుక్క కడుపునిండా పాలిచ్చేది. ధోనీ తోకను ఊపుతూ కులాసాగా మా వీధిలో తిరుగుతూ ఉంటుంది. ‘ధోనీ’ అంటే మా వీధి వాళ్ళంతా ఇష్టపడతారు. దానికి మా పక్కింటబ్బాయి స్నానం చేయించి పాలు, బిస్కెట్లు, కోడిగుడ్లు, మాంసం పెడతాడు. ధోనీ క్రమంగా టైగర్ లా పెరిగింది.

ఒక రోజున ‘ధోనీ’ వాళ్ళింట్లోకి అడుగుపెడుతూ ఉన్న దొంగపై దూకి అతని పిక్క పట్టుకొంది. అది చూసిన మా పక్కింటి అబ్బాయి ‘ధోనీ’ అని ప్రేమగా పిలిచాడు. అంతే! దొంగను వదలి తోక ఊపుకుంటూ, ఆ అబ్బాయి దగ్గరకు అది పరుగుపెట్టింది. ‘ధోనీ’ని పోలీసు కుక్కగా చేయాలని మా పక్కింటి అబ్బాయి చూస్తున్నాడు.

ఆ) ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ టవర్ల నుండి వచ్చే వేడిమికి కొన్ని పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. అలాగే ఎండాకాలంలో తీవ్రమైన వేడికి తాళలేక, తాగడానికి నీరు అందక, మృత్యువాతపడుతున్నాయి. పక్షులు ఇందుకోసం తమను కాపాడడానికి తగిన చర్యలు చేపట్టమని తమ తోటకు వచ్చిన పిల్లలతో సంభాషించాయి అనుకోండి. ఆ పిల్లలకూ, పక్షులకూ మధ్య జరిగే సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
“తోటలో మిత్రులు – పక్షులతో సంభాషణ”
రాము : ఓరేయ్ గోపాల్! పూలమీద తూనీగలు ఎగిరేవి కదా! ఇప్పుడు కనబడడం లేదేం?

గోపాల్ : ఈ మధ్య పక్షి జాతులు అనేక రకాలుగా నశిస్తున్నాయని అంటున్నారు కదా!

పిచ్చుక : బాబుల్లారా! మీ దృష్టి మా మీద పడింది. సంతోషము. మా పక్షులు ఎలక్ట్రిక్ తీగల మీద వాలితే చచ్చిపోతున్నాయి. రోజూ ఎన్ని కాకులూ, చిలుకలూ, గోరింకలూ అలా చస్తున్నాయో ! మీకు తెలుసా?

రాము : నిజమే. పక్షులు అంతరిస్తే, మన పర్యావరణం దెబ్బ తింటుంది కదా! మరేం చేయాలి?

చిలుక : నాయనా ! మీ పెరళ్ళలో జామ చెట్లు లేవు. మామిడి చెట్లు, సపోటాలు, సీతాఫలాల చెట్లూ లేవు. మేము ఏమి తిని బ్రతకాలి?

గువ్వ : నాయనా! మాకు తాగడానికి నీళ్ళు దొరకడం లేదు. మీరు చెరువులు పూడ్చివేస్తున్నారు. నూతులు కప్పివేస్తున్నారు. గ్రామాలలో మేము బతికే దారే లేదు.

గోరింక : గాలిలో హాయిగా ఎగురుదామంటే, ఈ సెల్ ఫోను టవర్లు, టి.వి. టవర్లు అడ్డుగా ఉంటున్నాయి. ఆ తరంగాల ప్రభావంతో మేము చస్తున్నాము.

గోపాల్ : మీరు చెప్పే మాటలు వింటూంటే భయంగా ఉంది. ఇంక మేము మీ పక్షులను టి.వి.ల్లోనే చూడాలేమో!

పక్షులు : మేము హాయిగా తిరగడానికి మీ గ్రామాల్లో చెట్లు పాతండి. చెరువులు, కాలువలూ పూడ్చి వేయకండి. మీ మీ పెరళ్లలో పూలమొక్కలూ, పండ్ల మొక్కలు పెంచండి.

రాము, గోపాల్: సరే. మీరు మాకు ఎన్నో విషయాలు చెప్పారు. తప్పకుండా పక్షులను రక్షించే కేంద్రాలను గురించి మా పెద్దలతో మాట్లాడతాం.

పక్షులు : మంచిది. కృతజ్ఞతలు.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

1. “ధనగోపాల్ ముఖర్జీ” రాసిన “చిత్రగ్రీవం ఓ పావురం కథ” అనే పుస్తకాన్ని లేదా పక్షుల గురించి తెలిపే ఏదైనా ఒక పుస్తకాన్ని గ్రంథాలయం నుండి చదవండి. మీరు తెలుసుకున్న వివరాలు రాసి ప్రదర్శించండి.
(లేదా)
అంతర్జాలం ద్వారా ఏవైనా రెండు పక్షుల వివరాలు, వాటి చిత్రాలు సేకరించి, రాసి ప్రదర్శించండి.
జవాబు:
అ) చిలుక: ఇది అందంగా ఉంటుంది. దీనిని పెంచుకుంటారు. ఇవి రెండు రకాలు.
1) చిలుకలు
2) కాక్కటూ
చిలుకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. కొన్ని పంచరంగుల చిలుకలు ఉంటాయి. ఇవి పరిమాణంలో 3.2 నుండి 10 అం|| పొడవు వరకూ ఉంటాయి. ఇవి గింజలు, పండ్లు మొగ్గలు, చిన్న మొక్కలను తింటాయి. కొన్ని జాతుల చిలుకలు పురుగుల్ని తింటాయి. చిలుకలు చెట్టు తొట్టెలలో గూళ్లు కట్టుకుంటాయి.

ఇవి తెలివైన పక్షులు. ఇవి మనుష్యుల గొంతును పోలి మాట్లాడతాయి. పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ, కారణాల వల్ల ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి. జ్యోతిషంలో చిలుక ప్రధాన పాత్ర వహిస్తుంది. పల్లెలలో సైతం చిలుక జోస్యం చెప్పేవారు కనిపిస్తారు.

ఆ) పిచ్చుక :
ఇది చిన్న పక్షి. ఇవి చిన్నగా, బొద్దుగా గోధుమ – ఊదా రంగుల్లో ఉంటాయి. చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కు కలిగి ఉంటాయి. పిచ్చుకలలో పెద్దగా తేడాలుండవు. ఇవి గింజలను తింటాయి. కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను తింటాయి. కొండపిచ్చుకలు పట్టణాల్లో నివసించి ఏదైనా తింటాయి. ఇది 4.5′ నుండి 7′ వరకు పొడవు ఉంటుంది. పిచ్చుకలు శరీర నిర్మాణంలో గింజలను తినే పక్షులలాగే ఉంటాయి. నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది.

ప్రాచీన పిచ్చుకలు యూరప్, ఆఫ్రికా, ఆసియాలో విస్తరించాయి. జీవనశైలిలో పెద్దవేగంగా వచ్చిన మార్పు, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. పచ్చదనం అంతరించిపోవడం, రసాయనాలతో పళ్ళు, ఆహారధాన్యాల ఉత్పత్తి వల్ల పిచ్చుకలు అంతరిస్తున్నాయి. సెల్యూలర్ టవర్ల నుండి వచ్చే అయస్కాంత కిరణాలు, ఆ జాతికి ముప్పుగా పరిణమించాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

2. “చిత్రగ్రీవం” అనే పక్షి పేరు పంచతంత్ర కథలో కూడా ఉంది. పంచతంత్రం కథల పుస్తకం చదవండి. మీరు చదివిన కథ రాసి ప్రదర్శించండి.
జవాబు:
పంచతంత్ర కథల్లో చిత్రగ్రీవుడి కథ
‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు, అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వలమీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.

ఆ చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి. ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలకు ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు చెప్పాడు. ఒక ముసలి పావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.

పావురాలు ముసలి పావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు. మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి. హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుణ్ణి, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది పదబంధాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) శ్రద్ధాసక్తులు
జవాబు:
వాక్యం : విజయం సాధించాలంటే పనిలో శ్రద్ధాసక్తులు చూపించాలి.

ఆ) ప్రేమ ఆప్యాయతలు
జవాబు:
వాక్యం : తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమ, ఆప్యాయతలు కురిపించాలి.

ఇ) వన్నెచిన్నెలు
జవాబు:
వాక్యం : మా ఆవుదూడ వన్నెచిన్నెలు చూసి నేను మురిసిపోతాను.

ఈ) సమయసందర్భాలు :
జవాబు:
వాక్యం : సమయసందర్భాలు లేకుండా హాస్యంగా మాట్లాడడం నాకు నచ్చదు.

ఉ) హాయిసౌఖ్యాలు
జవాబు:
వాక్యం : తల్లిదండ్రులు, బిడ్డల హాయిసౌఖ్యాల గురించి శ్రద్ధ పెట్టాలి.

2. కింది పదాలను వివరించి రాయండి.

అ) విజయవంతం కావడం అంటే
జవాబు:
విజయవంతం కావడం అంటే తాను ప్రారంభించిన పని ఏ విఘ్నమూ లేకుండా పూర్తి అవడం.

ఆ) ఉలుకూ పలుకూ లేకపోవడం అంటే
ఉలుకూ పలుకూ లేకపోవడం అంటే ఎవరు ఏమి మాట్లాడినా, తన మనస్సులో ఏమి ఉన్నా, పైకి మాత్రం మాట్లాడకుండా, నోరు మూసుకు కూర్చోడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

3. కింద తెలిపిన వాటిని గురించి పాఠంలో ఏఏ పదాలతో వర్ణించారు?
అ) గద్దింపులు : కువకువ కూయడం
ఆ) పావురాలు : రకరకాల రంగురంగుల పావురాలు
ఇ) గువ్వలు : నీలికళ్లతో కువకువలాడడం
ఈ) పావురాల గుంపు : పెనుమేఘాలు
ఉ) పావురం మెడ : హరివిల్లు
ఊ) పుట్టిన పిల్లపక్షి : బలహీనమైన, నిస్సహాయమైన, అర్భకమైన
ఋ) చిత్రగ్రీవం ముక్కు : పొడవాటి, గట్టిపాటి, సూదిలాంటి బలమైన
ఎ) చిత్రగ్రీవం ఒళ్ళు : సముద్రపు నీలిరంగు
ఏ) చిత్రగ్రీవం మెడ ప్రాంతం : ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా

వ్యాకరణాంశాలు

1. కింది అలంకారాల లక్షణాలు రాయండి. అ) శ్లేష
జవాబు:
లక్షణం : అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెబితే ‘శ్లేష’ అనబడుతుంది.
ఉదా :
1) రాజు కువలయానందకరుడు
2) మానవ జీవనం సుకుమారం

ఆ) అర్ధాంతరన్యాసం :
జవాబు:
లక్షణం : విశేష విషయాన్ని, సామాన్య విషయంతో కాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో కాని సమర్థించి చెప్పడం. దీన్ని “అర్థాంతరన్యాసాలంకారం’ అంటారు.
ఉదా :
1) హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా!
2) మేఘుడు అంబుధికి పోయి జలం తెచ్చి ఇస్తాడు. లోకోపకర్తలకు ఇది సహజగుణం.

2. కింది ఛందోరీతుల లక్షణాలు రాయండి.
అ) సీసం
జవాబు:
సీసం – (లక్షణం ) :
1) సీసంలో నాల్గు పాదాలుంటాయి. ప్రతిపాదం 2 భాగాలుగా ఉంటుంది. పాదంలోని రెండు భాగాల్లోనూ, ఒక్కొక్క భాగంలో 4 గణాల చొప్పున ఉంటాయి. మొత్తం పాదంలోని 8 గణాల్లో, ఆరు ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు క్రమంగా ఉంటాయి.
2) యతి పాదంలోని రెండు భాగాల్లోనూ మూడవ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది. యతిలేనిచోట ప్రాసయతి చెల్లుతుంది.
3) సీసంలోని నాల్గు పాదాల తరువాత, ఒక తేటగీతి కాని లేక ఆటవెలది గాని తప్పనిసరిగా ఉంటుంది.
ఉదా :
సీ|| “హరిహర బ్రహ్మలఁ బురిటి బిడ్డలఁజేసి జోలఁ బాడిన పురంద్రీలలామ”

గమనిక :
పై పద్యంలో రెండు చోట్ల ప్రాస యతులు.

ఆ) ఆటవెలది
జవాబు:
ఆటవెలది – (లక్షణం ) :

  1. ఇది ‘ఉపజాతి’ పద్యం.
  2. ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
  3. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి. .
  4. 2, 4 పాదాల్లో వరుసగా ఐదు సూర్యగణాలు ఉంటాయి.
  5. ప్రతిపాదంలోనూ నాల్గవ గణంలోని మొదటి అక్షరంతో యతి. యతిలేని చోట “ప్రాసయతి” ఉంటుంది.
  6. ప్రాసనియమం పాటించనవసరంలేదు.
    ఉదా :
    ఆ||వె : “పొదలి పొదలి చదల బొంగారి పొంగారి
    మించి మించి దిశల ముంచి ముంచి”

ఇ) తేటగీతి
జవాబు:
తేటగీతి – (లక్షణం ) :
1) ఇది ‘ఉపజాతి’ పద్యం.
2) ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
3) ప్రతి పాదానికి వరుసగా 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య గణాలు ఉంటాయి.
4) నాలుగవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస యతి కూడా వేయవచ్చు.
5) ప్రాసనియమం లేదు.
AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం 1

3. కింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించండి.

అ) శ్రీమంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది.
జవాబు:
ఈ వాక్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది. ఈ

ఉపమాలంకార లక్షణం :
ఉపమాన, ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం ‘ఉపమాలంకారం’.

సమన్వయం : ఇందులో 1) ఉపమానం, 2) ఉపమేయం, 3) ఉపమావాచకం, 4) సమానధర్యం ఉంటాయి.

పై ఉదాహరణలో
1) మల్లెపూవు (ఉపమానం)
2) చొక్కా (ఉపమేయం)
3) వలె (ఉపమావాచకం)
4) తెల్లగా ఉంది (సమానధర్మం )

4. కింది పద్యపాదాలు పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం 2
గమనిక :
పై పద్యంలో గగ, భ, జ, స, అనే గణాలు వాడబడ్డాయి. ఒకటవ, మూడవ పాదాల్లో మూడేసి గణాలు ఉన్నాయి. రెండవ, నాల్గవ పాదాల్లో ఐదేసి గణాలున్నాయి.
ఒకటి, రెండు పాదాలు కలిసి మొత్తం 8 గణాలు (3 + 5 = 8)
రెండు, నాల్గు పాదాలు కలిసి మొత్తం 8 గణాలు (3 + 5 = 8)
ఒకటి, రెండు పాదాలు కలిపిన | రెండు, నాల్గు పాదాలు కలిపిన | గణాలలో,| 8 గణాలలో, ఆరవ గణం ‘జగణం’ ఉంది.
రెండు, నాల్గు పాదాల చివరి అక్షరం ‘గురువు’ ఉంది.
ఇలాంటి లక్షణాలు కల పద్యాన్ని “కందపద్యం” అంటారు.

కందము :
పద్య నియమాలు తెలిసికొందాం.

  1. ఈ పద్యంలో గగ, భ, జ, స, నల అనే గణాలు ఉంటాయి.
  2. మొదటి పాదం లఘువుతో మొదలయితే, అన్ని పాదాల్లో మొదటి అక్షరం లఘువు ఉండాలి. గురువుతో మొదటి పాదం మొదలయితే, అన్ని పాదాల మొదటి అక్షరం గురువు ఉండాలి.
  3. రెండు, నాల్గవ పాదాలలోని చివరి అక్షరం గురువుగానే ఉంటుంది.
  4. 1, 2 పాదాల్లో (3 + 5 = 8 గణాలు); 3, 4 పాదాల్లో (3 + 5 = 8) గణాలు ఉంటాయి. ఈ 8 గణాల్లో ఆరవ గణం తప్పక నలం కాని, జగణం కాని కావాలి.
  5. 2, 4 పాదాల్లో యతి ఉంటుంది. నాల్గవ గణం మొదటి అక్షరానికి, ఏడవ గణం మొదటి అక్షరానికి యతి ఉండాలి.
  6. ప్రాస నియమం ఉండాలి. (4 పాదాల్లో) 7) పద్యంలోని 1 + 2 పాదాలు కలిపిన 8 గణాల్లో బేసిగణం ‘జగణం’ ఉండరాదు.

అబ్యాసం
“వినదగు నెవ్వరు జెప్పిన” అనే పద్యానికి లక్షణ సమన్వయం చేయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం 3

సమన్వయం :

  1. మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు, మొత్తం 8 గణాలు ఉన్నాయి. ఈ పాదాలలో గగ, భ, జ, స, నల అనే గణాలే ఉన్నాయి.
  2. మొత్తం (1 + 2) పాదాలకు ఉన్న 8 గణాలలో ఆరవ గణం ‘నలం’ ఉంది. రెండవ పాదం చివర గురువు ఉంది.
  3. యతి 4, 7 గణాల మొదటి అక్షరాలకు సరిపోయింది. (వి – వి)
  4. ప్రాస నియమం ఉంది.
  5. బేసి గణంగా ‘జగణం’ లేదు.
    కాబట్టి ఇవి కంద పద్యపాదాలు.

అదనపు సమాచారము

సంధులు

1) ప్రపంచపు వెలుగు = ప్రపంచము + వెలుగు – పుంప్వాదేశ సంధి
2) ధాన్యపు గింజలు = ధాన్యము + గింజలు – పుంప్వాదేశ సంధి
3) ఉత్తరపు గాలి = ఉత్తరము + గాలి – పుంప్వాదేశ సంధి
4) నీలివర్ణపు ఈకలు = నీలివర్ణము + ఈకలు – పుంప్వాదేశ సంధి
5) సముద్రపు నీలిరంగు = సముద్రము + నీలిరంగు – పుంప్వాదేశ సంధి
6) చర్మపు పొర = చర్మము + పొర – పుంప్వాదేశ సంధి
7) జ్ఞానపు పావురాలు = జ్ఞానము + పావురాలు – పుంప్వాదేశ సంధి
8) అమాయకపు నల్లచీమ = అమాయకము + నల్లచీమ – పుంప్వాదేశ సంధి
9) మందిరాలు = మందిరము + లు – లులనల సంధి
10) వర్షాలు = వర్షము + లు – లులనల సంధి
11) మండుటెండ = మండు + ఎండ – టుగాగమ సంధి
12) నీలాకాశము = నీల + ఆకాశము – సవర్ణదీర్ఘ సంధి
13) శ్రద్ధాసక్తులు = శ్రద్ధా + ఆసక్తులు – సవర్ణదీర్ఘ సంధి
14) బాగోగులు = బాగు + ఓగులు – ఉత్వ సంధి
15) నాలుగంతస్తులు = నాలుగు + అంతస్తులు – ఉత్వసంధి
16) జలకాలాడు = జలకాలు + ఆడు – ఉత్వసంధి
17) చిట్టచివర = చివర + చివర – ఆమ్రేడిత సంధి
18) మొట్టమొదలు = మొదలు + మొదలు – ఆమ్రేడిత సంధి
19) పూరిల్లు = పూరి + ఇల్లు – ఇత్వ సంధి
20) నిస్సహాయము = నిః + సహాయము – విసర్గ సంధి
21) మనోహరం = మనః + హరము – విసర్గ సంధి
22) ముంజేయి = ముందు + చేయి – ప్రాతాది సంధి
23) పూఁదోట = పూవు + తోట – ప్రాతాది సంధి
24) తల్లిదండ్రులు = తల్లి + తండ్రి – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) మూడు వారాలు మూడు సంఖ్యగల వారాలు ద్విగు సమాసం
2) మూడు గంటలు మూడు సంఖ్యగల గంటలు ద్విగు సమాసం
3) మూడు నెలలు మూడు సంఖ్యగల నెలలు ద్విగు సమాసం
4) నాలుగడుగులు నాలుగు సంఖ్యగల అడుగులు ద్విగు సమాసం
5) రెండు ముక్కలు రెండు సంఖ్యగల ముక్కులు ద్విగు సమాసం
6) రెండు గుడ్లు రెండు సంఖ్యగల గుడ్లు ద్విగు సమాసం
7) ఇరవై నిమిషాలు ఇరవై సంఖ్యగల నిమిషాలు ద్విగు సమాసం
8) ఇరవై లక్షలు ఇరవై సంఖ్యగల లక్షలు ద్విగు సమాసం
9) పది లక్షలు పది సంఖ్యగల లక్షలు ద్విగు సమాసం
10) శ్రద్ధాసక్తులు శ్రద్ధయు, ఆసక్తియు ద్వంద్వ సమాసం
11) వన్నెచిన్నెలు వన్నెయు, చిన్నెయు ద్వంద్వ సమాసం
12) శక్తియుక్తులు శక్తియు, యుక్తియు ద్వంద్వ సమాసం
13) సుఖసౌకర్యాలు సుఖమును, సౌకర్యమును ద్వంద్వ సమాసం
14) అసంఖ్యాకం సంఖ్యలేనిది నఞ్ తత్పురుష సమాసం
15) అసంకల్పితం సంకల్పితం కానిది నఞ్ తత్పురుష సమాసం
16) అసాధ్యం సాధ్యం కానిది నఞ్ తత్పురుష సమాసం
17) అప్రయత్నం ప్రయత్నం కానిది నఞ్ తత్పురుష సమాసం
18) మహానగరం గొప్పనగరం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
19) యువరాజు యువకుడైన రాజు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
20) యువరాణి యువతియైన రాణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
21) పెంపుడు పావురాలు పెంచుకొంటున్న పావురాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
22) తెల్లజెండాలు తెల్లవైన జెండాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
23) నీలాకాశం నీలమైన ఆకాశం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
24) చిన్ని బృందాలు చిన్నవైన బృందాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
25) కులీన వంశము కులీనమైన వంశము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
26) దివ్య సంకల్పం దివ్యమైన సంకల్పము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
27) పెద్ద పక్షులు పెద్దవైన పక్షులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
28) మండుటెండ మండుతున్న ఎండ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
29) యథాస్థానం స్థానమును అతిక్రమింపక అవ్యయీభావ సమాసం
30) అతిసుందరం మిక్కిలి సుందరం అవ్యయీభావ సమాసం
31) వెలుగు వెల్లువ వెలుగుల యొక్క వెల్లువ షష్ఠీ తత్పురుష సమాసం
32) పావురాల బృందాలు పావురాల యొక్క బృందాలు షష్ఠీ తత్పురుష సమాసం
33) హరివిల్లు హరియొక్క విల్లు షష్ఠీ తత్పురుష సమాసం
34) దిశాపరిజ్ఞానం దిశల యొక్క పరిజ్ఞానం షష్ఠీ తత్పురుష సమాసం
35) చిత్రగ్రీవం చిత్రమైన గ్రీవము కలది బహుహ్రీహి సమాసం
36) భారతదేశం భారతము అనే పేరుగల దేశం సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
37) బాగోగులు బాగును, ఓగును ద్వంద్వ సమాసం

నానార్థాలు

1. మిత్రుడు : స్నేహితుడు, సూర్యుడు, శత్రుదేశపు రాజు
2. పుణ్యము : ధర్మము, నీరు, బంగారము

ప్రకృతి – వికృతులు

రాజ్ఞి – రాణి
విశ్వాసము – విసువాసము
ఆశ్చర్యం – అచ్చెరువు
ప్రాణం – పానం
దిశ – దెస
వంశము – వంగడము
పుణ్యము – పున్నెము
పక్షి – పక్కి
పిత్స – పిట్ట
కుడ్యం – గోడ
శక్తి – సత్తి
యుక్తి – ఉత్తి
సుఖం – సుకం
స్వతంత్రమ్ – సొంతము
ఆకాశము – ఆకసము
నిమేషము – నిముసము
ఆహారము – ఓగిరము
అద్భుతము – అబ్బురము
ముహూర్తము – మూర్తము
చిత్రం – చిత్తరువు

పర్యాయపదాలు

1. నగరము : పురము, పట్టణము, పురి, పత్తనము
2. ఏనుగు : కరి, హస్తి, వారణము, ఇభము
3. అద్భుతము : అబ్బురము, అచ్చెరువు, వింత
4. ఆకాశము : గగనము, అంబరము, నభము, మిన్ను
5. గింజ : బీజము, విత్తు, విత్తనము
6. ముఖము : మొహం, ఆస్యము, వక్రము, ఆననము, మోము
7. తల్లి : జనని, జనయిత్రి, మాత, అమ్మ
8. తండ్రి : జనకుడు, అయ్య, నాయన, పిత
9. కన్ను : అక్షి, నేత్రము, నయనం, చక్షువు

వ్యుత్పత్యర్థాలు

1. చిత్రగ్రీవము : చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది (పావురం)
2. పక్షి : పక్షములు (తెక్కలు) కలిది (పిట్ట)

రచయిత పరిచయం

పాఠ్యం పేరు : ‘చిత్రగ్రీవం’
పాఠ్య రచయిత : ధనగోపాల్ ముఖర్జీ (మూలం)
దాసరి అమరేంద్ర (అనువాద రచయిత)

దేని నుండి గ్రహింపబడింది : “చిత్రగ్రీవం” పుస్తకం నుండి

న్యూబెరీ మెడల్ : 1928లో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ‘న్యూ జెరీ మెడల్’ బహుమతిని ‘ధనగోపాల్ ముఖర్జీ’కి ఇచ్చారు.

న్యూ బెరీ మెడల్ బహుమతిని ఎవరికి ఇస్తారు? : అమెరికాలో బాలసాహిత్యంలో విశేష కృషి చేసినవారికి ఈ బహుమతిని ఇస్తారు.

ధనగోపాల్ ముఖర్జీ విశిష్టత : ఈయన ‘న్యూ జెరీ మెడల్’ బహుమతిని గెల్చుకున్న ఏకైక భారతీయ రచయిత.

ముఖర్జీ పుట్టుక : 1890లో కోల్ కతాలో

విద్యాభ్యాసం : ముఖర్జీ 19వ ఏటనే అమెరికా వెళ్ళి, కాలిఫోర్నియా’, ‘స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు.

ముఖ్య వ్యాపకాలు : రచనలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం.

రచనలు : జంతువులకు సంబంధించి తొమ్మిది రచనలు చేశారు.

ప్రాచుర్యం పొందిన రచనలు :
1) 1922లో రాసిన “కరి ది ఎలిఫెంట్”
2) 1924లో రాసిన “హరిశా ది జంగిల్ ల్యాడ్” చాలా ప్రసిద్ధములు.
3) 1928లో రాసిన ‘గోండ్ ది హంటర్’

పుట్టుక

కోల్‌కతా = కలకత్తా (పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రాజధాని.)
మహానగరం = పెద్ద పట్టణం
డజను = పన్నెండు
గిరిక్ ల పావురాలు = గిరికీలు కొట్టే పావురాలు
మచ్చిక చెయ్యడం = ప్రేమించడం (దగ్గరకు, తియ్యడం)
అలరించే = సంతోషపెట్టే
విశిష్టమైన = మిక్కిలి శ్రేష్ఠమైన
శతాబ్దాలు (శత + అజ్ఞాలు) = నూర్ల సంవత్సరాలు
నిరుపేదలు = మిక్కిలి బీదవారు
పూరిల్లు (పూరి + ఇళ్లు) = గడ్డితో నేసిన ఇళ్లు
ఆప్యాయత = ప్రీతి
ఆసక్తి = ఆపేక్ష
పూదోటలు (పూవు + తోటలు) = పూలతోటలు
ఫౌంటెన్లు = నీటిని పైకి వెదజల్లే యంత్రాలు
ఉండడం కద్దు = ఉండడం ఉంది
ఉల్లాసకరమైన = సంతోషాన్ని ఇచ్చే
గిరికీలు కొట్టు = గిరికీలు తిరిగే (గాలిలో చక్కర్లు కొట్టే)
సంకేతాలు = సంజ్ఞలు
అసంఖ్యాకమైన = లెక్కపెట్టలేనన్ని
నీలాకాశం (నీల + ఆకాశం) = నీలంరంగు ఆకాశం
పెనుమేఘాలు = పెద్ద మేఘాలు
బృందాలు = గుంపులు
చెక్కర్లు కొడతాయి = తిరుగుతాయి
బృహత్తర సమూహం = మిక్కిలి పెద్ద గుంపు
రూపొందుతాయి = రూపం సంతరించుకుంటాయి (తయారవుతాయి)
స్థూలంగా = దాదాపుగా
పరిమాణం = సైజు
ఆకృతి = ఆకారం
దిశా పరిజ్ఞానం = దిక్కుల యొక్క జ్ఞానం
విశ్వాసం = నమ్మకం
సన్నిహిత పరిచయం = దగ్గరి పరిచయం
వనసీమ = అరణ్యసీమ
గజరాజులు = శ్రేష్ఠమైన ఏనుగులు
ప్రాణం పెడతాయి = ప్రాణం ఇస్తాయి (బాగా ప్రేమిస్తాయి.)
అంతఃప్రేరణాబలం = మనస్సు కలిగించే ప్రేరణ యొక్క బలం
సహచరుడు = చెలికాడు
పంచకు = వసారాకు
చిత్రగ్రీవం = పావురం (చిత్రమైన కంఠం గలది)
విచిత్రవర్ణభరితం = విచిత్రమైన రంగులతో నిండినది
హరివిల్లు మెడగాడు = ఇంద్రధనుస్సు వంటి మెడ కలవాడు
ఉట్టిపడలేదు = స్పష్టంగా కనబడలేదు
వన్నెచిన్నెలు = విలాసాలు
ఆచూకీయే = జాడయే
అతిసుందరమైన = మిక్కిలి అందమైన

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
కోల్ కతా నగరంలోని పిల్లలు పక్షుల ప్రేమికులని ఎలా చెప్పగలరు?
జవాబు:
కలకత్తా నగరంలో ప్రతి మూడవ కుర్రాడి వద్ద కనీసం ఒక డజను వార్తలు మోసే పావురాలు, గిరిక్స్ పావురాలు, పిగిలిపిట్టలు, బంతి పావురాలూ ఉంటాయి. కాబట్టి కోల్ కతా నగరం పిల్లలు పక్షుల ప్రేమికులని చెప్పగలం.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో ఏఏ పక్షులు ఎక్కువగా ఉంటాయి? వాటి కోసం మీరేం చేస్తున్నారు?
జవాబు:
మా ప్రాంతంలో కాకులూ, చిలుకలూ ఎక్కువగా ఉంటాయి. రోజూ మధ్యాహ్నం నేను భోజనం తినే ముందు మా ఇంట్లో వండిన పదార్థాలు అన్నీ కలిపి ఒక ముద్ద చేసి, కాకికి పెట్టిన తరువాత నేను తింటాను. మా పెరడులోని జామచెట్టు కాయలు అన్నీ చిలుకలకే వదలి పెడతాను.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
పావురాల గురించి ఆశ్చర్యం కలిగించే విషయాన్ని తెలుసుకున్నారు కదా! అట్లే మిగతా పక్షుల్లో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమున్నాయి?
జవాబు:
కాకులకు మంచి స్నేహభావం ఉంటుంది. ఏదైనా ఒక కాకికి ప్రమాదం వస్తే మిగతా కాకులన్నీ అక్కడ చేరి, తమ బాధను అరుపుల ద్వారా తెలుపుతాయి. ఒక కాకికి ఆహారం దొరికితే, ఆ కాకి మిగతా వాటిని కూడా పిలుచుకు వచ్చి, ఆ ఆహారాన్ని తినేటట్లు చేస్తుంది.

ప్రశ్న 4.
విశ్వాసం ప్రదర్శించడం అంటే ఏమిటి?
జవాబు:
విశ్వాసం ప్రదర్శించడం అంటే యజమాని యందు ప్రేమను చూపించడం. యజమానికి ఏ కష్టమూ రాకుండా చూడడం. అవసరమైతే యజమాని కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం.

ప్రశ్న 5.
‘అంతః ప్రేరణాబలం’ అంటే ఏమిటి? దీనివల్ల మనం ఏం చేయగలం?
జవాబు:
‘అంతః ప్రేరణాబలం అంటే మనస్సు గట్టిగా ప్రేరేపించడం వల్ల చేసే కార్యం. ఒక్కొక్కప్పుడు మనకు అక్కడ పదిమందీ ఉన్నా, అందులో ఒక వ్యక్తిపైనే మక్కువ ఏర్పడుతుంది. అతడితోనే ప్రేమగా ఉంటాం. దానికి కారణం ఏమిటో తెలియదు. దానికి కారణం బహుశః అంతః ప్రేరణాబలం కావచ్చు. అంటే మన మనస్సు యొక్క ప్రేరణ.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

మొదలెడతాను = ప్రారంభిస్తాను
కులీన వంశానికి = శ్రేష్ఠమైన వంశానికి
అమోఘంగా = ఫలవంతంగా
వార్తాహరి = వార్తలను మోసుకువెళ్ళేది
రూపొందింది = రూపాన్ని పొందింది (తయారయ్యింది)
సంతరించుకుంది = సంపాదించుకుంది
త్రుటిలో = కొద్ది సేపట్లో
దుర్ఘటన = చెడ్డ సంఘటన
ఆకూ అలములు = ఆకులూ, తీగలు
యథాస్థానం = ఉన్నచోటున
దృఢంగా = బలిష్టంగా
తాకింది = తగిలింది
దారుణం = భయంకరం
ఛిన్నాభిన్నము = ముక్కలు ముక్కలు
సంగ్రహించడానికి = అపహరించడానికి
సంఘటన = పరిస్థితి
అడపాదడపా = అప్పుడప్పుడు
నిర్వహించేది = నెరవేర్చేది
పరిజ్ఞానం = పూర్ణజ్ఞానం
రూపొంది = ఏర్పడి
క్షుణ్ణంగా = బాగా (సంపూర్తిగా)
ఆహ్వానించడం = పిలవడం
తారాడటం = కదలియాడడం (తిరగడం)
నెట్టేసేది = గెంటేసేది
మహా ఆత్రంగా = మిక్కిలి వేగిరపాటుగా (తొందరగా)
స్పందన = కదలిక
దివ్యసంకల్పం = గొప్ప సంకల్పం
తల నిక్కించి = తల పైకెత్తి
నిస్సహాయమైన = ఏ సహాయమూలేని
అర్భకమైన = బలంలేని
నిస్సహాయత = శక్తిహీనత
మరుక్షణం = తరువాతి క్షణం
పొదవుకుంది = దాచుకుంది (కప్పుకుంది)

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
మీరు ఎప్పటికీ మరచిపోలేని రోజు ఏది? ఎందుకు?
జవాబు:
మా నాన్నగారు నాకు చేతి గడియారం, సైకిలు కొని ఇచ్చిన రోజును నేను ఎప్పటికీ మరువలేను.

ప్రశ్న 2.
తెలివిమాలిన పనులు అంటే ఏమిటి?
జవాబు:
తెలివిలేని మూర్ఖులు చేసే పనులను, తెలివిమాలిన పనులు అంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
మీ మీద మీకే ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఎందుకు?
జవాబు:
మా అమ్మగారు నన్ను సినిమాకు వెళ్ళవద్దన్నారు. మరునాటి పరీక్షకు చదువుకొమ్మన్నారు. అన్నీ చదివాను కదా అని, నా అభిమాన హీరో సినిమా కదా అని, సినిమాకు వెళ్ళాను. మరునాడు పరీక్షలో బాగా రాయలేక పోయాను. అప్పుడు నా మీద నాకే కోపం వచ్చింది.

ప్రశ్న 4.
పావురం గూడు ఎలా ఉందో తెలుసుకొన్నారు కదా! మీకు తెలిసిన పక్షి గూళ్లు ఎలా ఉంటాయో చెప్పండి. పక్షి గూళ్లన్నీ ఒకేలా ఉంటాయా?
జవాబు:
మా పెరటిలో కరివేపచెట్టుకు పిచ్చుక గూడు పెట్టింది. అది సన్నటి దారాల వంటి పీచుతో గూడు కడుతుంది. ఎండిన బీరకాయలా వేలాడుతూ ఉంటుంది. కొన్ని పక్షులు పుల్లముక్కలతోనూ, కొన్ని ఈత, కొబ్బరి వగైరా ఆకులతోనూ గూళ్లు కడతాయి. కాబట్టి అన్ని పక్షిగూళ్లు ఒకేలా ఉండవు.

ప్రశ్న 5.
‘దివ్య సంకల్పం చోటు చేసుకోవడం’ అంటే ఏమిటి?
జవాబు:
ఒకప్పుడు ఎందుకు చేస్తామో తెలియకుండానే కొన్ని, పనులు మనం చేస్తాం. సరిగ్గా ఆ సమయానికి చేయడం వల్ల ఆ పని చక్కగా పూర్తి అవుతుంది. చేసిన పని జయప్రదం అవుతుంది.

ఏదో దేవతల సంకల్పం ఉండడం వల్లనే ఆ పనిని సరిగ్గా అదే సమయంలో మొదలు పెట్టి ఉంటాం. దానినే దివ్య సంకల్పం చోటు చేసుకోవడం అంటారు.

చిత్రగ్రీవం చదువు

దృశ్యాలు = కనబడే వస్తువులు
వెలుగు వెల్లువ = కాంతి ప్రవాహం
అనురాగం = ప్రేమ
లాలిస్తే = బుజ్జగిస్తే
మోతాదు = హెచ్చుతగ్గూకాని పదార్థం
అరకొరజ్ఞానం = మిడిమిడి జ్ఞానం
దోహదం చేస్తాయి = ప్రోత్సహిస్తాయి
ఉత్పత్తి చేసిన – = పుట్టించిన
బాగోగులు (బాగు + ఓగులు)= మంచి చెడ్డలు
ఆహార సేకరణ = ఆహారం సంపాదన
నిమగ్నము = మునిగినది
ఏపుగా = సమృద్ధిగా
బొడిపెలు = చెట్టునందలి బుడిపులు
ఏకఖండంగా = ఒకే ముక్కగా
తునకలు = ముక్కలు
ఘనకార్యం = గొప్పపని
సందేహం = అనుమానం
స్టూలంగా = సుమారుగా (దాదాపుగా)
మందకొడి = మెల్లగా నడవడం (చురుకు లేకపోవడం)
నిరాటంకంగా = ఆటంకం లేకుండా
మండుటెండ = మండే ఎండ
పిల్లగాళ్లకు = పిల్లలకు
సంకోచం = మోమాటం
నిమ్మకు నీరెత్తినట్లు = గుట్టుచప్పుడు కానట్లు

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
పిల్లపక్షిని దానితల్లి ఎలా పెంచిందో తెలుసుకున్నారు కదా! మరి మిమ్మల్ని ఎవరు, ఎలా పెంచారో చెప్పండి.
జవాబు:
నేను మా అమ్మగారికి ఆమె 16వ సంవత్సరంలో పుట్టానట. నా చెల్లికీ, నాకూ కేవలం ఒక సంవత్సరం మాత్రమే తేడా ఉంది. మా చెల్లిని మా అమ్మ పెంచితే, నన్ను మా అమ్మమ్మ గారు పెంచి పెద్ద చేశారు.

ప్రశ్న 2.
“ఘనకార్యం చేయడం” అనే వాక్యం నుండి మీరేం గ్రహించారు? ఇలా దీన్ని ఇంకా ఏ ఏ సందర్భాలలో వాడతారు?
జవాబు:
మనం ఒక పనిని చేస్తాం. ఆ పనివల్ల నష్టం వస్తుంది. అప్పుడు పక్కవారు ‘చేశావులే పెద్ద ఘనకార్యం’ అని మనల్ని పరిహాసం చేస్తారు. ఏదైనా చాలా మంచి పని చేసినపుడు కూడా వారు ఘనకార్యం చేశారు అని పొగిడే సందర్భాల్లో కూడా దీన్ని వాడతారు.

ప్రశ్న 3.
“ఏ మాటకామాటే” అని ఏయే సందర్భాలలో ఉపయోగిస్తారు?
జవాబు:
“ఏ మాటకామాటే చెప్పుకోవాలి అని నిజం చెప్పేటప్పుడు చెపుతారు. ఒక వ్యక్తిలోని మంచి చెడ్డలను ఉన్నవి ఉన్నట్లు పైకి చెప్పేటప్పుడు, “ఏ మాటకామాటే” అనుకోవాలి అంటూ ప్రారంభిస్తారు.
ఉదా : ఏ మాటకా మాటే చెప్పుకోవాలి, మా అమ్మాయికి “అంత తెలివి లేదు.

ప్రశ్న 4.
‘పావురం’ కంటిలోని ప్రత్యేకతను గుర్తించారు కదా! ఇంకా ఇతర జంతువుల పక్షులకు సంబంధించిన ప్రత్యేకతలు ఏమున్నాయి?
జవాబు:
చీమలు పదార్థాలను కూడబెడతాయి. తేనెటీగలు తేనెను జాగ్రత్త చేస్తాయి. కుక్కలు వాసనను బట్టి వస్తువును గ్రహిస్తాయి. అందుకే కుక్కల సాయంతో నేరగాళ్లను పోలీసులు పట్టుకుంటున్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

పచార్లు చెయ్యడం = తిరగడం
నిరాశాభరితము = నిరాశతో నిండినది
చిట్టచివరకు (చివరకు + చివరకు) = ఆఖరుకు
సంకోచాన్ని = మిక్కిలి కలతను (మిక్కుటమైన సంతాపాన్ని)
అధిగమించి = దాటి
బాలెన్సు = సరితూగేలా చెయ్యడం
ప్రక్రియ = పని
అప్రయత్నంగా = ప్రయత్నం లేకుండా
శోభిల్లసాగింది = ప్రకాశింపసాగింది
మహత్తరమైన = మిక్కిలి గొప్పదైన
తతంగం = వ్యవహారం
పరిధిలో = పరిమితిలో
అసాధ్యం = సాధ్యం కానిది
మంద్రంగా = గంభీరంగా
నిర్మలంగా = ప్రశాంతంగా
బడుద్దాయ్ = బద్దకస్తుడు
ఉలుకూపలుకూ = మాటామంతీ
చిర్రెత్తుకొచ్చింది = కోపం వచ్చింది
ఫక్కీ = తీరు
గద్దించసాగింది = అదలించసాగింది (బెదరింప సాగింది)
స్వీయరక్షణ = తన రక్షణ
అసంకల్పితంగా = సంకల్పం లేకుండానే (అనుకోకుండా)
అవధులు = హద్దులు
జలకాలాడుతున్న = స్నానం చేస్తున్న
యథాలాపంగా = ఆకస్మికంగా
రొప్పసాగింది = అరవడం మొదలు పెట్టింది
ఉత్తేజంతో = గొప్ప తేజస్సుతో

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘నిమ్మకు నీరెత్తడం’ అని ఏ ఏ సందర్భాలలో వాడతారు?
జవాబు:
ఒక వ్యక్తి నవనవలాడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడంటారు.

ఒక వ్యక్తి విషయాన్ని కప్పిపుచ్చి, ఎవరికీ తెలియకుండా, మాట్లాడకుండా ఉన్నప్పుడు, నిమ్మకు నీరెత్తినట్లు మాట్లాడకుండా ఉన్నాడంటారు.

తనలో లోపమున్నా, అది పైకి తెలియకుండా కప్పిపెట్టి ఉంచినపుడు, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడంటారు.

ప్రశ్న 2.
‘మహత్తర ఘట్టానికి చేరుకోడం’ అంటే ఏమిటి ? దీనికి కొన్ని ఉదాహరణలు తెల్పండి.
జవాబు:
ఏదైనా గొప్పపనిని చేయడానికి ప్రయత్నిస్తాం. అది చివరికి ఫలించి పూర్తికావడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆ పని “మహత్తర ఘట్టానికి చేరుకొంది” అంటారు.

  1. గ్రామంలో దేవాలయం కట్టిద్దామని ప్రయత్నం చేస్తారు. విగ్రహ ప్రతిష్ఠ దానిలో జరుగుబోతూ ఉంటే “మహత్తర ఘట్టానికి చేరుకొంది” అంటారు.
  2. ప్రాజెక్టు నిర్మాణం జరిగి, ప్రారంభోత్సవానికి సిద్ధమైనపుడు మహత్తర ఘట్టానికి చేరుకొంది అంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
మే నెల చివరి రోజుల్లో వాతావరణం ఎలా ఉందో తెలుసుకొన్నారు కదా! చలికాలంలో వాతావరణం ఎలా ఉంటుందో మీ మాటల్లో వర్ణించండి.
జవాబు:
అది డిసెంబరు నెల. సాయంత్రం అయ్యేటప్పటికి చలి ప్రారంభం అవుతుంది. పిల్లలు, పెద్దలూ స్వెట్టర్లు వేసుకుంటారు. మంచినీళ్ళు కూడా తాగబుద్ధి పుట్టదు. రగ్గు కప్పినా చలి ఆగదు. చెట్లమీది నుండి పొగమంచు బొట్లు బొట్లుగా పడుతుంది. వర్షం వచ్చిందేమో అనిపిస్తుంది. పొగమంచు మూసివేయడంతో రోడ్డుమీద ప్రయాణాలు చేసేవారికి దారి కనబడదు. నీళ్ళపొయ్యి దగ్గరకు చిన్నా పెద్దా అంతా చేరతారు.

ప్రశ్న 4.
చిత్రగ్రీవం ఎగరడానికి దాని తండ్రిపక్షి ఏం చేసింది? తల్లిపక్షి ఏం చేసింది ? అట్లాగే చిన్న పిల్లలు నడక నేర్చుకోవడం ఎలా జరుగుతుందో చెప్పండి.
జవాబు:
చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి గద్దించింది. ఆ గద్దింపుల నుండి తప్పించుకోడానికి చిత్రగ్రీవం పక్క పక్కకు జరిగింది. చిత్రగ్రీవం మీద తండ్రి పక్షి, తన భారాన్ని అంతా మోపింది. చిత్రగ్రీవం కాలుజారింది. చిత్రగ్రీవం తన రక్షణకోసం, అప్రయత్నంగా రెక్కలు విప్పి గాలిలో ఎగిరింది. తల్లి పక్షి చిత్రగ్రీవానికి సాయంగా తానూ ఎగిరింది. ఎగరడం వల్ల రొప్పుతున్న చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి లాలించింది.

చిన్న పిల్లలు నడక నేర్చుకోడానికి వీలుగా పెద్దవారు చిన్న పిల్లల వేళ్లు పట్టుకొని దగ్గరుండి నడిపిస్తారు. గోడసాయం ఇచ్చి పిల్లల్ని నడిపిస్తారు. పిల్లలు పడిపోతే, వారిని దగ్గరకు తీసుకొని బుజ్జగిస్తారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 11th Lesson భిక్ష Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 11th Lesson భిక్ష

10th Class Telugu 11th Lesson భిక్ష Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

తం. తన కోపమే తన శత్రువు ,
తన శాంతమె తనకు రక్ష దయచుట్టంబౌఁ
దన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పద్యంలో శత్రువుగా దేన్ని పేర్కొన్నాడు? ఎందుకు?
జవాబు:
ఈ పద్యంలో కోపాన్ని శత్రువుగా పేర్కొన్నాడు. శత్రువు ఎలా మనకు నష్టం కల్గిస్తాడో, కష్టం కల్గిస్తాడో, అలాగే కోపం కూడా మనకు కష్ట నష్టాలను కల్గిస్తుంది.

ప్రశ్న 2.
శాంతి రక్షగా ఉంటుందనడంలో కవి ఉద్దేశమేమిటి?
జవాబు:
‘శాంతి’ అంటే కోపం వంటివి లేకపోవడం. శాంతగుణం ఉంటే, అదే మనలను రక్షిస్తుంది. శాంతం ఉంటే ఎవరితోనూ – మనకు తగవు రాదు. శాంతి మనకు రక్షణను కల్పిస్తుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
సంతోషాన్ని స్వర్గంగా కవి ఎందుకు భావిస్తున్నాడు?
జవాబు:
‘స్వర్గం’ అంటే దేవతల లోకం. స్వర్గ లోకంలో ఉండే వారికి దుఃఖాలు ఉండవు. సంతోషమే ఉంటుంది. కాబట్టి మన సంతోషమే మనకు స్వర్గం వంటిదని కవి చెప్పాడు.

ప్రశ్న 4.
కోపం వల్ల కలిగే అనర్థాలను గురించిన సంఘటనలు మీకేమైనా తెలుసా? చెప్పండి.
జవాబు:
1) కోషం వస్తే అనర్థాలు కలుగుతాయి. ఒక రోజున మా పక్క ఇంటివారు తమ వీధిని అంతా తుడిచి, ఆ తుక్కును మా ఇంటిముందు పోశారు. నేను వారిపై కోపపడి తిట్టాను. వాళ్ళు నన్ను కొట్టబోయారు. మా అమ్మగారు ఎలాగో సర్దిచెప్పారు.

2) నేను సైకిలు మీద వెడుతూ ఒకరోజు కాలు జారి, పక్కవారి బండి కింద పడ్డాను. నాకు దెబ్బలు తగిలాయి. అన్ని పక్కవారు నన్ను పట్టించుకోలేదు. నేను కోపంతో తగవుకు వెళ్ళాను. చివరకు ఒకరిపై ఒకరు పోలీసు కేసు పెట్టుకొన్నాం. మాకు వైద్యానికి, కేసులకు చాలా ఖర్చు అయ్యింది. కాబట్టి కోపం వల్ల అనర్థాలు కలుగుతాయి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది పద్యం చదవండి. శ్రీనాథుడు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడో తెల్పండి.
సీ॥ వచియింతు వేములవాడ భీమన భంగి
నుద్దండ లీల నొక్కొక్కమాటు
భాషింతు నన్నయభట్టు మార్గంబున
నుభయ వాక్రౌఢి నొక్కొక్కమాటు
వాకృత్తు తిక్కయజ్వ ప్రకారము రసా
భ్యుచిత బంధమున నొక్కొక్కమాటు
పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ
సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు

తే॥గీ॥ నైషధాది మహాప్రబంధములు పెక్కు
చెప్పినాడవు మాకు నాశ్రితుడ వనఘ
ఇపుడు చెప్పదొడంగిన యీ ప్రబంధ
మంకితము సేయు వీరభద్రయ్య పేర
(కాశీ || 1 – 18)
జవాబు:
ఈ పద్యం శ్రీనాథుడి కవిత్వ రచనా విధానాన్ని గూర్చి చెపుతోంది.

  1. శ్రీనాథుడు వేములవాడ భీమన అనే కవి వలె ఒక్కొక్కసారి ఉద్దండ లీలగా కవిత్వం చెపుతాడు.
  2. ఒక్కొక్కసారి నన్నయభట్టు కవి వలె ‘ఉభయ వాడ్రైఢి’తో కవిత్వం రాస్తాడు.
  3. ఒకసారి తిక్కన గారి వలె, రసాభ్యుచిత బంధముగా రాస్తాడు.
  4. ఒక్కొక్కసారి ప్రబంధ పరమేశ్వరుడైన ఎఱ్ఱన గారి వలె ‘సూక్తి వైచిత్రి’ని చూపిస్తాడు.
  5. నైషధము వంటి అనేక ప్రబంధాలు రాశాడు.
  6. రెడ్డిరాజులను ఆశ్రయించాడు.

ప్రశ్న 2.
‘అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న’ అనే అంశంపై తరగతిలో చర్చించండి.
జవాబు:
‘దానం’ అంటే ఇతరుడికి ఇవ్వడం. దానం చేస్తే పుణ్యం వస్తుందని చెపుతారు. ఈ జన్మలో దానం చేసుకుంటే తరువాతి జన్మలో భగవంతుడు మనకు తిరిగి ఇస్తాడని మన గ్రంథాలు చెపుతున్నాయి.

దశదానాలు, షోడశ మహాదానాలు చేయాలని చెపుతారు. అయితే దానాలు అన్నింటిలోకి ‘అన్నదానం’ గొప్పది అని పెద్దలు చెపుతారు. ఈ మాట సత్యమైనది. ఎదుటి వ్యక్తికి తృప్తి కలిగేటట్లు అన్నదానం చేయవచ్చు. అన్నదానం చేస్తే తిన్నవాడికి కడుపు నిండుతుంది. మరింతగా పెడతానన్నా అతడు తినలేడు. ఇతర దానాలు ఎన్ని చేసినా ఎంత విరివిగా చేసినా దానం పుచ్చుకున్న వాడికి తృప్తి కలుగదు. మరింతగా ఇస్తే బాగుండు ననిపిస్తుంది.

అన్నదానం చేస్తే తిన్నవాడి ప్రాణం నిలుస్తుంది. కాబట్టి అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అన్నమాట నిజం.

ప్రశ్న 3.
శ్రీనాథ కవి గురించి వివరించండి.
జవాబు:
శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో పేరు పొందిన పెద్దకవి. ఈయన తల్లిదండ్రులు భీమాంబ, మారయ్యలు. ఈయన కొండవీడును పాలించిన పెద్దకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు.

విజయనగరం చక్రవర్తి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ‘గౌడడిండిమభట్టు’ను ఓడించి రాయలచే కనకాభిషేకమును, ‘కవి సార్వభౌమ’ అనే బిరుదును అందుకున్నాడు.

ఈయన శృంగార నైషథం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి కావ్యాలు రచించాడు. ఈయన జీవిత విధానాన్ని, చమత్కారాన్ని తెలిపే పెక్కు చాటు పద్యాలు రచించాడు.

శ్రీనాథుడు సీస పద్య రచనకు ప్రసిద్ధి పొందాడు. ఈయన రాజమహేంద్రవరం రెడ్డిరాజుల కొలువులో ఆస్థానకవిగా ఉన్నప్పుడు కాశీఖండ, భీమఖండములు రచించాడు. ఉద్దండ లీల, ఉభయ వాతైఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి అనేవి శ్రీనాథుని కవితా లక్షణాలు.

ఈయన 15వ శతాబ్దివాడు. శ్రీనాథుడు చివరి రోజులలో రాజుల ఆశ్రయం లేక బాధలు పడ్డాడు. శ్రీనాథుడు ఆ బాల్య కవి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 4.
‘అకంఠంబుగ …………. శిలోంఛప్రక్రముల్ తాపసుల్!’ పద్యానికి ప్రతి పదార్థం రాయండి.
జవాబు:
ఇప్డు = ఇప్పుడు
ఆకంఠంబుగన్ : కంఠము దాకా (గొంతు దాకా)
మాధుకర భిక్షాన్నంబు = మాధుకర రూపమైన భిక్షాన్నాన్ని
భక్షింపగాన్ = తినడానికి
లేకున్నన్ = లేకపోయేసరికి
కడున్ = మిక్కిలి
అంగలార్చెదవు = అంగలు వేస్తున్నావు (గంతులు వేస్తున్నావు)
మేలే = మంచిపని యేనా?
లేస్స = బాగున్నదా?
శాంతుండవే = నీవు శాంత గుణం కలవాడవేనా !
నీవార ముష్టింపచుల్ = ఏ పూటకు ఆ పూట పిడికెడు నివ్వరి వడ్లు దంచుకొని తినేవారూ
శాకాహారులు = కాయ కూరలు మాత్రమే తినేవారూ
కందభోజులు = దుంపలు మాత్రమే తినేవారూ
శిలోంఛ ప్రక్రముల్; శిల = కోత కోసిన వరిమళ్ళలో జారిపడిన కంకులు ఏరుకొని వాటితో బ్రతికేవారూ
ఉంఛ ప్రక్రముల్ = రచ్చరోళ్ళ వద్ద వడ్లు దంచేటప్పుడు చుట్టూ జారిపడిన బియ్యపు గింజలు ఏరుకొనడమే జీవనంగా కలవారూ అయిన
తాపసుల్ = తపస్సు చేసుకొనేవారూ కటకటా అక్కట కటా ! (అయిన మునులు)
నీకంటెన్ = నీ కన్న
మతిహీనులే = తెలివి తక్కువ వారా ? (చెప్పు)

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) వ్యాసుని పాత్ర స్వభావాన్ని వివరించండి.
జవాబు:
వ్యాసుడు అఖిల విద్యలకూ గురువు. ఈయనకు పదివేలమంది శిష్యులు ఉండేవారు. ఈయన కాశీ నగరంలో శిష్యులకు విద్య నేర్పుతూ, భిక్షాటన చేసుకొంటూ జీవించేవాడు.

ఉదయమే లేచి పాపాత్ముడి ముఖం చూడడం వల్లనే తనకు భిక్ష దొరకలేదని వ్యాసుడు అనుకున్నాడు. సూర్యాస్తమయం అయిన తర్వాత, ఆయన ఆ రోజుకు తినేవాడు కాదు. బ్రాహ్మణ గృహాల వద్ద మాధుకర భిక్షతో జీవించేవాడు.

వ్యాసుడు సులభ కోపి. తనకు రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోయాడు. ఈయన శిష్యులు లేకుండా తాను ఒక్కడూ భుజించననే వ్రతం పట్టిన శిష్య ప్రేమికుడు. నిత్యం పవిత్ర గంగాస్నానం చేసేవాడు.

పార్వతీదేవిచేత మందలింపబడి, తన తప్పును గ్రహించిన ఉత్తముడు వ్యాసుడు.

ఆ) “నేడు నిన్నటికి మఱునాఁడు నిక్కువంబు” ఈ మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు? వీటి అంతరార్థమేమిటి?
జవాబు:
‘నేడు నిన్నటి మఱునాడు నిక్కువంబు” అన్న మాటలు, వేదవ్యాసుడు సామాన్య స్త్రీ రూపంలో కనబడిన పార్వతీదేవితో అన్నాడు. పార్వతీదేవి సామాన్య స్త్రీ రూపంలో కనబడి వేదవ్యాసుని మందలించి, తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది. అప్పుడు వ్యాసుడు ఆమెతో పై మాటలను అన్నాడు.

అంతరార్థం :
“ఈ రోజు నిన్నటి రోజుకు తరువాతి రోజు అన్నది నిజము” అని ఈ మాటకు అర్థం. అంటే నిన్న ఎలాగైతే భోజనం లేక పస్తు ఉన్నామో అలాగే ఈ రోజు కూడా, నిన్నటిలాగే పస్తు ఉంటామని దీని అంతరార్థం.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
వ్యాసుడు సకల విద్యలకూ గురువు. ఒకరోజు మధ్యాహ్న వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీ నగరంలో బ్రాహ్మణ వాడలలో భిక్షాటనం కోసం వెళ్ళాడు. ఏవో కారణాలు చెప్పి, ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఉపవాసం ఉందామనీ, మరుసటి రోజు భిక్ష తప్పక దొరుకుతుందనీ, వ్యాసుడు నిశ్చయించాడు.

ఈశ్వరుడి మాయవల్ల మరుసటి రోజున కూడా ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో భిక్షా పాత్రను నడివీధిలో పగులకొట్టి, కాశీ వాసులకు మూడు తరాల పాటు ధనం, మోక్షం, విద్య లేకపోవుగాక అని శపించబోయాడు.

ఇంతలో పార్వతీదేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమయి, వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది.

అప్పుడు వ్యాసుడు “సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు పదివేలమంది శిష్యులున్నారు. వారు తినకుండా నేను తినను. ఈ రోజు కూడా నిన్నటి లాగే పస్తుంటాను” అన్నాడు.

అప్పుడు పార్వతీదేవి నవ్వి “నీవు శిష్యులందరినీ వెంట తీసుకొని రా ! ఈశ్వరుడి దయతో ఎంతమంది వచ్చినా, కావలసిన పదార్థాలు పెడతాను” అని చెప్పింది.

వ్యాసుడు సరే అని, శిష్యులతో గంగలో స్నానం చేసి వచ్చాడు. పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి భోజనశాలలో వారందరికి భోజనం పెట్టింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ఆ) కోపం కారణంగా వ్యాసుడు కాశీ నగరాన్నే శపించాలనుకున్నాడు కదా ! “కోపం- మనిషి విచక్షణను నశింపజేస్తుంది”. అనే అంశం గురించి రాయండి.
జవాబు:
“కోపం వస్తే నేను మనిషిని కాను” అని అంటూ ఉంటారు. అది నిజమే. కోపం వస్తే తనను తాను మరచి, మనిషి రాక్షసుడు అవుతాడు. ఆ కోపంతో తాను ఏమి చేస్తున్నాడో, తెలిసికోలేడు. కోపంలోనే అన్నదమ్ములనూ, అక్క చెల్లెండ్రనూ, చివరకు కట్టుకొన్న భార్యనూ, కన్నపిల్లల్నీ కూడా చంపుతూ ఉంటారు. కాబట్టి కోపం మంచిది కాదు.

ఈ కథలో వ్యాసుడి అంతటి బ్రహ్మజ్ఞాని, రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోయాడు. భర్తృహరి నీతి శతకంలో “క్షమ కవచంబు క్రోధమది శత్రువు” అంటాడు. అంటే ఓర్పు కవచం లాంటిది.
కోపం శత్రువు లాంటిది అని అర్థం. శత్రువులాంటి కోపాన్ని విడిచిపెట్టాలి.

దుర్యోధనుడికి పాండవులపైన, భీముడి మీద కోపం. అందుకే వారితో తగవు పెట్టుకొని యుద్ధంలో తాను మరణించాడు. దేవతలపై కోపంతోనే, రాక్షసులు అందరూ మరణించారు. “కోపమునను ఘనత కొంచెమైపోవును” అని వేమన కవి చెప్పాడు. కాబట్టి మనిషి కోపాన్ని అణచుకోవాలి. కోపము మనిషికి శత్రువు వంటిది. “తన కోపమే తన శత్రువు” అంటాడు సుమతీ శతక కర్త. కాబట్టి కోపం విడిచిపెట్టాలి.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) “కోపం తగ్గించుకోడం మంచిది !” అనే అంశాన్ని బోధిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x

మిత్రుడు రఘునందను,
నీ లేఖ అందింది. నేనూ మా తల్లిదండ్రులూ క్షేమంగా ఉన్నాము. నీ లేఖలో, నీకు ప్రియ మిత్రుడైన సీతారామ్ తో నీకు తగవు వచ్చిందనీ, మీరిద్దరూ దెబ్బలాడుకున్నారని రాశావు. మీ ఇద్దరికీ దెబ్బలు తగిలాయని కూడా రాశావు.

నీ ఉత్తరం చూసి నేను చాలా బాధపడ్డాను. సహజంగా నీవు శాంత స్వభావుడవు. నీకు కోపం ఎందుకు వచ్చిందో రాశావు. అయినా దెబ్బలు తగిలే వరకూ మీరు తగవు లాడడం బాగోలేదు. ‘తన కోపమె, తన శత్రువు’ అని సుమతీ శతక కర్త రాశాడు. క్రోధం మనకు శత్రువని భర్తృహరి కూడా చెప్పాడు. అయినా నీకు అన్ని విషయాలు తెలుసు.

కోపం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవు పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామూ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
అవసరాల వెంకట్రావు,
10వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
విజయవాడ.

చిరునామా:
కె. రఘునందన్,
S/O కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4.1.104, మహారాణీ పేట,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్,

ఆ) భిక్ష, రక్ష పరీక్ష, సమీక్ష, వివక్ష – వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించే కవిత రాయండి.
జవాబు:
వచన కవిత :
ఉపదేశం
నేనిస్తా మిత్రమా సలహాలు నీకు లక్ష
తోడివారిపై పెంచుకోకు నీవు కక్ష
ఉండాలి మరి మనకు సది తితిక్ష
మంచి చెడ్డలు మనం చెయ్యాలి సమీక్ష
చెడ్డపనులు చేస్తే తప్పదు శిక్ష
ఉంటుంది మనపై దైవం పరీక్ష
ఉండాలి యోగ్యుడు కావాలనే దీక్ష
మనందరికి దేవుడే శ్రీరామరక్ష
ఎందుకు మనలో మనకు ఈ వివక్ష
పుట్టించిన దేవుడే చేస్తాడంత శిక్ష

III. భాషాంశాలు

పదజాలం

1) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) ద్వాఃకవాటంబు దెఱవదు వనిత యొకతె.
జవాబు:
1) ద్వాఃకవాటంబు : 1) ద్వారబంధము
2) ద్వారం తలుపు

2) వనిత : 1) స్త్రీ 2) పురంధీ 3) అంగన 4) పడతి 5) నారి

ఆ) ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువము.
జవాబు:
పసిడి : 1) బంగారము 2) సువర్ణము 3) కనకము 4) హిరణ్యము 5) పైడి

ఇ) పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపఁ దలంచెను.
జవాబు:
పారాశర్యుండు : 1) వ్యాసుడు 2) బాదరాయణుడు 3) సాత్యవతేయుడు

ఈ) ఇవ్వీటి మీద నాగ్రహము తగునె?
జవాబు:
ఆగ్రహము : 1) కోపము 2) క్రోధము 3) రోషము 4) కినుక

ఉ) అస్తమింపగ జేసినాడు అహిమకరుడు.
జవాబు:
అహిమకరుడు : 1) సూర్యుడు 2) రవి 3) ఆదిత్యుడు 4) భాస్కరుడు

ఊ) భుక్తిశాల : భోజనశాల
జవాబు:
భుక్తిశాల : పెళ్ళివారు భుకిశాలలో ఫలహారాలు తింటున్నారు.

2. కింది పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించి రాయండి.
అ) ద్వాఃకవాటము : ద్వారము తలుపు
జవాబు:
ద్వాఃకవాటము : దొంగలకు భయపడి, మా ఊళ్ళో అందరూ, రాత్రి తొందరగానే ద్వాఃకవాటములు బిగిస్తున్నారు.

ఆ) వీక్షించు : చూచు
జ. వీక్షించు : నేటి కాలంలో బాలురు సినిమాలను ఎక్కువగా వీక్షిస్తున్నారు.

ఇ) అంగన : స్త్రీ
జవాబు:
అంగన : ప్రతి పురుషుడి విజయము వెనుక, ఒక అంగన తప్పక ఉంటుంది.

ఈ) మచ్చెకంటి : చక్కని ఆడది
జవాబు:
మచ్చెకంటి : తెలుగు సినీ నటీమణులలో శ్రీదేవి చక్కని మచ్చెకంటి.

ఉ) కుందాడుట : నిందించుట
జవాబు:
కుందాడుట : గురువులు, శిష్యుల తప్పులను ఎత్తిచూపి, కుందాడుట మంచిది కాదు.

3) కింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి.
అ) వీడు ఏ వీడు వాడో గాని దుష్కార్యములను వీడు చున్నాడు.
జవాబు:
ఈ వాక్యంలో ‘వీడు’ అనే పదం మూడు అర్థాలలో వాడబడింది.
1. వీడు (నానార్థాలు) : 1) ఈ మనుష్యుడు 2) పట్టణము 3) వదలుట

ఆ) దేశ భాషలందు తెలుగు లెస్సయని రాయలు లెస్స గా బలికెను.
జవాబు:
ఈ వాక్యంలో ‘లెస్స’ అనే పదం రెండు అర్థాల్లో వాడబడింది.
2. లెస్స (నానార్థాలు) : 1) మేలు 2) చక్కన 3) మంచిది

ఇ) గురుని మాటలు విన్న ఇంద్రుడు కర్ణుని గురుడైన సూర్యుని గలిసి గురుయోజన చేయసాగినాడు.
జవాబు:
పై వాక్యంలో ‘గురుడు’ అనే మాట మూడు అర్థాలలో వాడబడింది.
3. గురుడు (నానార్థాలు) : 1) ఉపాధ్యాయుడు 2) తండ్రి 3) బలీయం

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

4. కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి.
అ) విద్య
క) విదియ
చ) విజ్ఞ
ట) విద్దె
త) విధ్య
జవాబు:
ట) విద్దె

ఆ) భిక్షము
క) బత్తెము
చ) బచ్చ
ట) బిచ్చ
త) బిచ్చము
జవాబు:
త) బిచ్చము

ఇ) యాత్ర
క) యతర
చ) జాతర
ట) జైత్ర.
త) యతనము
జవాబు:
చ) జాతర

ఈ) మత్స్యము
క) మచ్చీ
చ) మత్తియము
ట) మచ్చెము
త) మత్తము
జవాబు:
ట) మచ్చెము

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

5. కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలను రాయండి.

అ) గురుడు – అజ్ఞానమనెడి అంధకారమును తొలగించువాడు. (ఉపాధ్యాయుడు)
ఆ) వనజము – వనము(నీరు) నందు పుట్టినది. (పద్మము)
ఇ) అర్ఘ్యము – పూజకు తగిన నీరు.
ఈ) పాద్యము – పాదములు కడుగుకొనుటకు ఉపయోగించే నీరు.
ఉ) పారాశర్యుడు – పరాశర మహర్షి యొక్క కుమారుడు (వ్యాసుడు)

వ్యాకరణాంశాలు

1. కింది పాదాల్లోని సంధులను గుర్తించి, సంధి సూత్రాలను రాయండి.
అ) పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా !
జవాబు:
1. పుణ్యాంగన = పుణ్య + అంగన = సవర్ణదీర్ఘ సంధి

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

2. భిక్షయిడదయ్యె = భిక్ష + ఇడదయ్యె = యడాగమ సంధి

యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట అచ్చు కంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.

3. ఇడదయ్యె = ఇడదు + అయ్యె ఉత్వ సంధి

ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

4. ఇడదయ్యెఁగటా = ఇడదయ్యెన్ + కడ = (సరళాదేశ సంధి) లేక (ద్రుత ప్రకృతిక సంధి)

సరళాదేశ సంధి
సూత్రం 1 : ద్రుత ప్రకృతికము మీది పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి.
ఉదా : ఇడదయ్యెన్ + గటా

సూత్రం 2 : ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి.
ఉదా : ఇడదయ్యెఁగటా

ఆ) కాశి; యివ్వీటి మీద నాగ్రహము దగునె.
1. కాశి; యివ్వీటి మీద
కాశి; + ఇవ్వీటి మీద = యడాగమ సంధి

యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.
ఉదా : కాశియివ్వీటి మీద
2. ఇవ్వీటి మీద – ఈ + వీటి మీద = త్రిక సంధి

త్రిక సంధి
సూత్రం 1 : త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
సూత్రం 2 : ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు ఆచ్ఛిక దీరానికి హ్రస్వం వస్తుంది.
ఉదా : ఇవ్వీటి మీద
3. ఆగ్రహము దగునె – ఆగ్రహము + తగునే = గసడదవాదేశ సంధి

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమమీది పరుషాలకు గ స డ ద వలు బహుళంగా వస్తాయి.

4. అగునె – అగును . + ఏ = ఉత్వ సంధి

ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

ఇ) ఓ మునీశ్వర ! వినవయ్య యున్నయూరు.
1. మునీశ్వర – ముని + ఈశ్వర = సవర్ణదీర్ఘ సంధి

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

2. వినవయ్య యున్నయూరు – వినవయ్య + ఉన్న = యడాగమ సంధి

యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటే పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.

3. ఉన్నయూరు – ఉన్న + ఊరు = యడాగమ సంధి

యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.

2. కింది పద్యపాదాల్లో ఏయే ఛందస్సులున్నాయో గుర్తించి సమన్వయం చేయండి.

అ) మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యనరమ్మ విశ్వనా
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష 1 AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష 2
1. పై పద్యపాదంలో “న జ భ జ జ జ ర” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది “చంపకమాల” పద్యపాదం.
2. మొదటి అక్షరానికి, 11వ అక్షరానికి యతిస్థానం. “ము – ముం”.

ఆ) య్యాదిమశక్తి సంయమివరా ! యిటురమ్మని పిల్చెహస్త సం
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష 2
1. పై పద్యపాదంలో “భ ర న భ భ ర వ” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది “ఉత్పలమాల” పద్యపాదం.
2. మొదటి అక్షరం ‘య్యా’ కు, 10వ అక్షరం ‘రా’ కు, యతిస్థానం. (రా = ర్ + ఆ)

ఇ) నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష 3
1. ఇది ‘తేటగీతి’ పద్యపాదం
2. దీనిలో ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
3. మొదటి గణంలో మొదటి అక్షరానికి, నాలుగో గణ మొదటి అక్షరానికి యతిమైత్రి (న – క్షా)

3. కింది వాక్యాలను చదవండి.
అర్థాంతరన్యాసాలంకారం
అ) శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు.
వీరులకు సాధ్యము కానిది లేదు కదా !

ఆ) గొప్పవారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు.
పూవులతో పాటు దారాన్ని కూడా సిగనెక్కిస్తారు.

గమనిక :
ఈ రెండు వాక్యాల్లో ఒక విషయాన్ని మరో విషయంతో సమర్థిస్తున్నాం కదూ”!

మొదటి వాక్యంలో : శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించడం – (విశేష విషయం)
వీరులకు సాధ్యం కానిది లేదు కదా ! – (సామాన్య విషయం )
అంటే విశేష విషయాన్ని, సామాన్య విషయంతో సమర్థించాం.

ఇక రెండవ వాక్యంలో
గొప్పవారితో ఉన్న సామాన్యులను గౌరవించడం – (సామాన్య విషయం)
పూవులతో పాటు దారం సిగనెక్కటం – (విశేష విషయం)
అంటే దీంట్లో సామాన్య విషయాన్ని విశేష విషయంతో సమర్థించాం.

ఇలా విశేష సామాన్య విషయాలను పరస్పరం సమర్థించి చెప్పినట్లయితే, అటువంటి అలంకారాన్ని “అర్థాంతర న్యాసాలంకారం” అంటారు.

అర్ధాంతరన్యాసాలంకారం
లక్షణం :
విశేష విషయాన్ని సామాన్య విషయంతో గాని, సామాన్య విషయాన్ని’ విశేష విషయంతో గాని సమర్థించి చెప్పడమే ‘అర్థాంతరన్యాసాలంకారం’.

1. కింది లక్ష్యాలకు సమన్వయం రాయండి.

అ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.
మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా!
జవాబు:
సమన్వయం :
పై వాక్యాలలో “అర్థాంతరన్యాసాలంకారం” ఉంది. ఇందులో “హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు” అన్నది విశేష విషయం. “మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా” అన్న వాక్యం సామాన్య వాక్యం. ఇక్కడ సామాన్య వాక్యంచే, విశేష వాక్యం సమర్థింపబడింది. కాబట్టి ఈ వాక్యాలలో “అర్థాంతరన్యాసాలంకారం” ఉంది.

ఆ) మేఘుడంబుధికి పోయి జలంబు తెచ్చి ఇస్తాడు.
లోకోపకర్తలకిది సహజగుణము.
జవాబు:
సమన్వయం : పై వాక్యాలలో ‘అర్థాంతరన్యాసాలంకారం’ ఉంది. ఇందులో “మేఘుడంబుధికి పోయి జలంబు తెచ్చిఇస్తాడు” అన్నది విశేష వాక్యం. “లోకోపకర్తలకిది సహజ గుణము” అనేది సామాన్య వాక్యం. ఇక్కడ సామాన్యముచే విశేష విషయం సమర్థింపబడింది. కాబట్టి ఇక్కడ “అర్థాంతరన్యాసాలంకారం” ఉంది.

అదనపు సమాచారము

సంధులు

1) బీఱెండ = బీఱు + ఎండ – ఉత్వ సంధి
2) రమ్మని = రమ్ము + అని – ఉత్వ సంధి
3) పట్టపగలు = పగలు + పగలు – ద్విరుక్తటకారాదేశ సంధి
4) నట్టనడుము = నడుము + నడుము – ద్విరుక్తటకారాదేశ సంధి
5) కట్టనుగు = కడు + అనుగు – ద్విరుక్తటకారాదేశ సంధి
6) భిక్షాటనంబు = భిక్షా + అటనంబు – సవర్ణదీర్ఘ సంధి
7) పాయసాపూపములు = పాయస + అపూపములు – సవర్ణదీర్ఘ సంధి
8) బ్రాహ్మణాంగనలు = బ్రాహ్మణ + అంగలు – సవర్ణదీర్ఘ సంధి
9) పుణ్యాంగన = పుణ్య + అంగన – సవర్ణదీర్ఘ సంధి
10) పాపాత్ముని = పాప + ఆత్ముని – సవర్ణదీర్ఘ సంధి
11) కోపావేశము = కోప + ఆవేశము – సవర్ణదీర్ఘ సంధి
12) శాకాహారులు = శాక + ఆహారులు – సవర్ణదీర్ఘ సంధి
13) మునీశ్వర = ముని + ఈశ్వర – సవర్ణదీర్ఘ సంధి
14) కమలానన = కమల + ఆనన – సవర్ణదీర్ఘ సంధి
15) అభీప్సితాన్నము = అభీప్పిత + అన్నము – సవర్ణదీర్ఘ సంధి
16) బింబాస్య = బింబ + ఆస్య – సవర్ణదీర్ఘ సంధి
17) శాలాంతరము = శాలా + అంతరము – సవర్ణదీర్ఘ సంధి
18) సంజ్ఞాదరలీల = సంజ్ఞా + ఆదరలీల – సవర్ణదీర్ఘ సంధి
19) శిఖాధిరూఢ = శిఖా + అధిరూఢ – సవర్ణదీర్ఘ సంధి
20) కటకాభరణంబులు = కటక + ఆభరణంబులు – సవర్ణదీర్ఘ సంధి
21) శిలోంఛప్రక్రముల్ = శిల + ఉంఛప్రక్రముల్ – గుణసంధి
22) కబ్జవెట్టి = కట్ట + పెట్టి – గసడదవాదేశ సంధి
23) పూజచేసి = పూజ + చేసి – గసడదవాదేశ సంధి
24) అమ్మహాసాధ్వి = ఆ + మహాసాధ్వి – త్రిక సంధి
25) అయ్యా దిమశక్తి = ఆ + ఆదిమశక్తి – యడాగమ త్రిక సంధులు
26) ముత్తైదువ = ముత్త + ఐదువ – అత్వ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) మతిహీనులు మతిచేత హీనులు తృతీయా తత్పురుషం
2) భిక్షాపాత్రంబు భిక్ష కొఱకైన పాత్రము చతుర్థి తత్పురుష
3) భిక్షాటనము భిక్ష కొఱకు అటనము చతుర్థి తత్పురుష
4) భోజనశాల భోజనము కొఱకు శాల చతుర్దీ తత్పురుష
5) విప్రగృహవాటికలు విప్రగృహముల యొక్క వాటికలు షష్ఠీ తత్పురుష
6) విద్యాగురుడు విద్యలకు గురుడు షష్ఠీ తత్పురుష
7) ద్వాఃకవాటము ద్వారము యొక్క కవాటము షష్ఠీ తత్పురుష
8) బ్రాహ్మణాంగనలు బ్రాహ్మణుల యొక్క అంగనలు షష్ఠీ తత్పురుష
9) బ్రాహ్మణ మందిరములు బ్రాహ్మణుల యొక్క మందిరములు షష్ఠీ తత్పురుష
10) కోపావేశము కోపము యొక్క ఆవేశము షష్ఠీ తత్పురుష
11) శాలాంతరాళము శాల యొక్క అంతరాళము షష్ఠీ తత్పురుష
12) బీఱెండ బీఱు అయిన ఎండ విశేషణ పూర్వపద కర్మధారయం
13) అనుగుజెలులు ప్రియమైన చెలులు విశేషణ పూర్వపద కర్మధారయం
14) పుణ్యాంగన పుణ్యమైన అంగన విశేషణ పూర్వపద కర్మధారయం
15) అభీప్సితాన్నములు అభీప్సితమైన అన్నములు విశేషణ పూర్వపద కర్మధారయం
16) వనజనేత్ర వనజముల వంటి నేత్రములు గలది బహుపద సమాసం
17) లేదీగె బోడి లేదీగె వంటి శరీరము కలది బహువ్రీహి సమాసం
18) అహిమభానుడు వేడి కిరణములు గలవాడు బహువ్రీహి సమాసం
19) ముక్కంటి మూడు కన్నులు గలవాడు బహువ్రీహి సమాసం
20) మచ్చెకంటె మత్య్సము వంటి కన్నులు గలది బహువ్రీహి సమాసం
21) శాకాహారులు శాకములు ఆహారముగా గలవారు బహువ్రీహి సమాసం
22) కందభోజులు కందములు భోజనంగా కలవారు బహువ్రీహి సమాసం
23) చిగురుబోడి చిగురు వంటి శరీరము గలది బహువ్రీహి సమాసం
24) కమలానన కమలము వంటి ఆననము కలది బహువ్రీహి సమాసం
25) కాశికానగరము ‘కాశి’ అనే పేరు గల నగరము సంభావనా పూర్వపద కర్మధారయం
26) వేదపురాణ శాస్త్రములు వేదములును, పురాణములును, శాస్త్రములును బహుపద ద్వంద్వము
27) ఇందు బింబాస్య ఇందు బింబము వంటి ఆస్యము కలది బహువ్రీహి సమాసం
28) అర్ఘ్యపాద్యములు అర్ఘ్యమును, పాద్యమును ద్వంద్వ సమాసం
29) పుష్ప గంధంబులు పుష్పమును, గంధమును ద్వంద్వ సమాసం
30) క్షుత్పిపాసలు క్షుత్తు, పిపాస ద్వంద్వ సమాసం
31) మధ్యాహ్నము అహ్నము యొక్క మధ్యము ప్రథమా తత్పురుషం
32) మోక్షలక్ష్మి మోక్షము అనెడి లక్ష్మీ రూపక సమాసం
33) మూడుతరములు మూడైన తరములు ద్విగు సమాసం
34) కాశికా పట్టణము ‘కాశి’ అనే పేరు గల పట్టణం సంభావనా పూర్వపద కర్మధారయం

ప్రకృతి – వికృతి

శిష్యుడు – సిసువుడు
గృహము – గీము
విద్య – విద్దె
కార్యము – కర్జము
పుష్పము – పూవు, పువ్వు
గందము
స్వర్ణము – సొన్నము
పాయసము – పాసెము
బహు – పెక్కు
భక్తి – బత్తి
విశ్వాసము – విసువాసము
ముఖము – మొగము
బ్రాహ్మణుడు – బాపడు
రాత్రి – రాతిరి
లక్ష్మి – లచ్చి
పట్టణము – పట్నము
వేషము – వేసము
ఆహారము – ఓగిరము
తపస్వి – తపసి, తబిసి
రూపము – రూపు
పంక్తి – బంతి
శాల – సాల
ఛాత్రుడు – చట్టు

నానార్థాలు

1) కాయ : 1) చెట్టుకాయ 2) బిడ్డ 3) అరచేతిలో రాపిడివల్ల ఏర్పడిన పొక్కు
2) ఇల్లు : 1) గృహము 2) కుటుంబము 3) స్థానము
3) గృహము : 1) ఇల్లు 2) భార్య 3) రాశి
4) గురుడు : 1) తండ్రి 2) ఉపాధ్యాయుడు 3) బృహస్పతి
5) ముఖము : 1) మోము 2) ఉపాయము 3) ముఖ్యమైనది
6) బంతి : 1) కందుకము 2) ఒక జాతి పువ్వులచెట్టు 3) పంక్తి
7) రూపు : 1) ఆకారము 2) దేహము 3) కన్నెమెడలో బంగారు నాణెము
8) గంధము : 1) చందనము 2) గంధకము 3) సువాసన
9) కరము : 1) చేయి 2) తొండము 3) కిరణము
10) ఫలము : 1) పండు 2) ప్రయోజనం 3) లాభం
11) వీధి : 1) త్రోవ 2) వాడ 3) నాటక భేదము
12) లక్ష్మి : 1) రమ 2) సిరి 3) మెట్టదామర

పర్యాయపదాలు

1) అంగన : 1) వనిత 2)స్త్రీ 3) మహిళ
2) ఇల్లు : 1) గృహము 2) భవనము 3) మందిరము
3) పుష్పము : 1) పువ్వు 2) కుసుమము 3) ప్రసూనము
4) గంధము : 1) చందనము 2) మలయజము 3) గంధసారము
5) నెయ్యి : 1) ఆజ్యము 2) ఘృతము 3) నేయి
6) ముఖము : 1) వదనము 2) ఆననము 3) మొగము
7) గొడుగు : 1) ఛత్రము 2) ఆతపత్రము 3) ఖర్పరము
8) బ్రాహ్మణుడు : 1) భూసురుడు 2) విప్రుడు 3) ద్విజుడు

వ్యుత్పత్యర్థాలు

1) వనజనేత్ర : పద్మముల వంటి కన్నులు కలది. (స్త్రీ)
2) లేందీగె బోడి : లేత తీగ వంటి శరీరం కలది. (స్త్రీ)
3) అతిథి : తిథి, వార, నియమములు లేకుండా వచ్చేవాడు. (అతిథి)
4) పురం : గృహమును ధరించునది (గృహిణి)
5) అహిమభానుడు : చల్లనివి కాని కిరణములు గలవాడు. (సూర్యుడు)
6) ముక్కంటి : మూడు కన్నులు కలవాడు. (శివుడు)
7) పంచజనుడు : ఐదు భూతములచే పుట్టబడేవాడు. (మనిషి)
8) పార్వతి : పర్వతము యొక్క పుత్రిక. (గౌరి)
9) పారాశర్యుడు : పరాశర మహర్షి యొక్క కుమారుడు. (వ్యాసుడు)
10) వ్యాసుడు : వేదములను విభజించి ఇచ్చినవాడు. (వ్యాసమహర్షి)

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని గురు

* శ్రీనాథుడు సీస పద్య రచనకు ప్రసిద్ధి. శ్రీనాథుడు రచించిన ఏవైనా 5 పద్యాలు వేర్వేరు గ్రంథాల నుండి సేకరించండి. వాటిని రాయండి. తరగతిలో చదివి వినిపించండి. గోడ పత్రికలో ప్రదర్శించండి. ”
(శ్రీనాథుని సీస పద్యాలు )
జవాబు:
1. గుణనిధికి తల్లి చెప్పిన హిత వచనాలు శ్రీనాథుని “కాశీఖండము” నుండి.

సీ|| సచ్చో త్రియులు ననూచానులు సీమసీ థులునైన కులము పెద్దలఁ దలంచి
రాజమాన్యుడు సత్యరతుడు వినిర్మలా చారవంతుండు నైన జనకు దలచి
భాగ్యసంపదఁ బుణ్యపతి దేవతల లోన నెన్నంగఁ దగియెడు నన్నుదలచి
వేదశాస్త్ర పురాణ విద్యా నిరూఢులై వాసికెక్కిన తోడివారిఁ దలచి

తే|| చెడ్డయింటి చెదారమై శివుని కరుణ నివ్వటిలు నిర్వదేనేండ్ల నిన్ను దలచి
పదియు నార్వత్సరంబుల భార్యఁదలచి గోరతనములు మానురా ! గొడుకుఁగుఱ ! (కాశీ|| 4. ఆ. 91 ప)

2. పార్వతీదేవి చిరుతొండనంబి భార్య తిరువేంగనాంబి
వద్దకు, పచ్చిబాలెంతరాలు వేషంలో వచ్చుట
సీ|| ఫాల పట్టిక యందు భస్మత్రిపుండ్రంబుఁ గర్ణంబులను రాగి కమ్మదోయి
కంఠమందిత్తడి కంబంపుఁ గంటియ ఘన కుచంబుల మీదఁ గావిగంత
కటి మండలంబునఁ గరకంచుఁ బుట్టంబు కుడి సంది గిరి పెండ్లికొడుకుఁ గుఱ్ఱ
కేలు దామరయందుఁ గేదారవలయంబు జడకుచ్చుమీదఁ బచ్చడపుఁ గండ

తే|| సంతరించి పదాఱు వర్షముల వయసుఁ బచ్చి బాలెంతరాలు తాపసపురంధి
నంబి భామినిఁ దిరువెంగనాంబిఁ జేరి పాలు వోయింపు డమ్మ పాపనికి ననియె. (హర విలాసం – 2 ఆ. 94 ప)

3. భీమేశ్వర పురాణములోని పద్యం.
సీ|| శ్రీ భీమనాయక శివనామధేయంబు చింతింపనేర్చిన జిహ్వ జిహ్వ
దక్షవాటి పురాధ్యక్షమోహన మూర్తి చూడంగ నేర్చిన చూపు చూపు
దక్షిణాంబుధి తటస్థాయి పావన కీర్తి చే నింపనేర్చిన చెవులు చెవులు
తారక బ్రహ్మ విద్యాదాత య్దల విరులు పూన్సగ నేర్చు కరము కరము

గీ॥ ధవళకర శేఖరునకు ప్రదక్షిణంబు నర్గిఁదిరుగంగనేర్చిన యడుగులడుగు
లంబికానాయక ధ్యాన హర్షజలధి మధ్యమునఁ దేలియాడెడి మనసు మనసు. (భీమఖండం – 3 ఆ. 198 ప)

4. శృంగార నైషధం 2వ ఆశ్వాసం – 49 పద్యం.
(హంస, నల మహారాజుకు తన వృత్తాంతం చెప్పడం.)
సీ|| నవిన సంభవు సాహిణము వారువంబులు కులము సాములు మాకుఁ గువలయాక్షి
చదలేటి బంగారు జలరుహంబుల తూండ్లు భోజనంబులు మాకుఁ బువ్వు బోణి
సత్యలోకము దాక సకల లోకంబులు నాటపట్టులు మాకు నబ్జవదన
మధురాక్షరములైన మామాటలు వినంగ నమృతాంధసులే యోగ్యులనుంపమాంగి

తే|| భారతీదేవి ముంజేతి పలుకు జిలుక సమదగజయాన సబ్రహ్మచారిమాకు
వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల దరుణి ! నీయాన ఘంటాపథంబు మాకు. (శృంగార నైషధం – 2 ఆ. 49 ప)

5. శ్రీనాథుడు మరణించే సమయంలో చెప్పిన చాటు పద్యం
సీ|| కవిరాజు కంఠంబు కౌగిలించెను కదా పురవీధి నెదురెండఁ బొగడదండ
సార్వభౌముని భుజాస్తంభ మెక్కెను గదా నగరి వాకిట నుండు నల్లగుండు
ఆంధ్ర నైషధకర్త యంఘి యుగ్మంబునఁ దగిలి యుండెను గదా నిగళయుగము
వీరాభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యమందెను గదా వెదురు గొడియ

తే|| కృష్ణవేణమ్మ’ కొనిపోయె నింత ఫలము బిలబిలాక్షులు తినిపోయెఁదిలలు పెసలు
బొడ్డు పల్లెను గొడ్డేటి మోసపోతి నెట్లు చెల్లింతు డంకంబు లేడు నూర్లు. (చాటువు)

కవి పరిచయం

పాఠ్యభాగం పేరు : భిక్ష

ఏ గ్రంథం మండి గ్రహింపబడింది. ఆ సం : “కాశీఖండం” కావ్యంలోని సప్తమాశ్వాసం నుండి

కవి : శ్రీనాథుడు

కాలం : 1380-1470 (15వ శతాబ్దము)

ఎవరి ఆస్థాన కవి – : రాజమహేంద్రవరం రెడ్డిరాజుల కొలువులో ఆస్థాన కవి

తల్లిదండ్రులు : శ్రీనాథుడు ‘మారయ – భీమాంబ’ల ముద్దుబిడ్డడు.

బిరుదం : ‘కవి సార్వభౌమ’

ప్రతిభా పాండిత్యం : ఆంధ్ర కవులలో కవిత్రయం తరువాత, అంతటి ప్రతిభావంతుడైన కవి. ఈయన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో “విద్యాధికారి”గా ఉండేవాడు.

గౌడడిండిముని కంచుఢక్క పగులగొట్టడం : ప్రాధదేవరాయల ఆస్థానంలో ‘గౌడడిండిమభట్టు’ అనే గొప్ప పండితునితో వాదించి, ఆయనను ఓడించి కనకాభిషేకాన్ని, కవిసార్వభౌమ బిరుదును పొందాడు.

శ్రీనాథుని రచనలు : 1) మరుత్తరాట్చరిత్ర 2) శాలివాహన సప్తశతి 3) పండితారాధ్య చరిత్ర 4) కాశీఖండం 5) శృంగార నైషధం 6) హరవిలాసం 7) ధనంజయ విజయం 8) క్రీడాభిరామం 9) శివరాత్రి మహాత్మ్యం 10) పల్నాటి వీరచరిత్ర 11) నందనందన చరిత్ర అనేవి శ్రీనాథుడి రచనలు.

శ్రీనాథుని చాటువులు : శ్రీనాథుని చమత్కారానికీ, లోకానుశీలనకూ, రసజ్ఞతకూ, జీవన విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా ఉన్నాయి.

కవితా లక్షణాలు : ఉదందలీల, ఉభయవాతొడి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి

పద్యాలు – ప్రతిపదార్థాలు – బావాలు

I. అవగాహన – ప్రతిస్పందన

పద్యం -1

తే॥గీ॥ నెట్టుకొని కాయ బీఎండ పట్టపగలు
తాము శిష్యులు నిల్లిల్లు దపుకుండఁ
గాఠిగా విప్రగృహ వాటికల నొనర్చు
నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు.
ప్రతిపదార్థం :
అఖిల విద్యాగురుండు : అఖిల = సమస్తములయిన
విద్యా = విద్యలకునూ
గురుండు = గురువు అయిన వేదవ్యాస మునీంద్రుడు
తానున్ = తానునూ
శిష్యులున్ = శిష్యులునూ
పట్టపగలు : (పగలు + పగలు = పట్టపగలు) = పట్టపగటి యందు
బీజెండ (బీఱు + ఎండ) = తీక్షణమయిన ఎండ
నెట్టుకొని = అతిశయించి
కాయన్ = కాయుచుండగా
కాశికా విప్రగృహవాటికలన్ : కాశికా = కాశికా నగరము నందలి
విప్రగృహ = బ్రాహ్మణ గృహాలకు సంబంధించిన
వాటికలన్ = వాడలయందు (వీథుల యందు)
ఇల్లిల్లు = ప్రతి గృహాన్నీ
తప్పకుండన్ = విడువకుండా (ఏ ఇల్లునూ విడిచిపెట్టకుండా)
భిక్షాటనంబు (భిక్షా + అటనంబు) = భిక్ష కొఱకైన సంచారాన్ని
ఒనర్చున్ = చేయును (చేస్తూ ఉంటాడు)

భావం :
చతుర్దశ విద్యలకును గురువయిన వేదవ్యాస మునీంద్రుడు, శిష్యులతో కలిసి, పట్టపగలు పెరిగిన తీక్షణమైన ఎండలో, కాశీ నగరంలోని బ్రాహ్మణ వీధులలో భిక్ష కోసం ఏ ఇల్లూ విడిచిపెట్టకుండా, ప్రతి గృహానికి తిరుగుతున్నాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

పద్యం – 2

తే॥గీ॥ వండుచున్నారమనే నొక్క వనజనేత్ర
తిరిగి రమ్మమ వొక్క లేఁదీగెఁ బోఁడి
దేవకార్యంబు వేఁడమఁ దెఱవ యోర్తు
ద్వా: కవాటంబుఁ దెజవదు సవిత యొకతె
ప్రతిపదార్థం :
ఒక్క వనజనేత్ర = ఒక పద్మాక్షి; (వనజనేత్ర (వ్వు) పద్మముల వంటి కన్నులు కలది)
వండుచున్నారము = వంట చేస్తున్నాము
అనున్ = అన్నది
ఒక్క లేందీఁగె బోఁడి; ఒక్క = ఒక
లేదీగె బోడి – లేత తీగ వంటి శరీరము గల స్త్రీ
తిరిగి = మరల
రమ్మనున్; (రమ్ము + అనున్) = రమ్మని అన్నది
తెఱవయోర్తు; తెఱవ = స్త్రీ
ఓర్తు = ఒకామె
నేడు = ఆనాడు
దేవకార్యంబు = దేవతల పూజాకార్యం
అనున్ = అన్నది (పితృదేవతల కార్యము నాడు పితృదేవతలకు పెట్టకుండా భిక్ష వేయరాదు)
వనిత యొకతే = ఒక ఇల్లాలు
ద్వాః కవాటంబున్; ద్వాః = ద్వారము యొక్క
కవాటంబున్ = తలుపును
తెఱవదు = తెరవనే తెరవలేదు

భావం :
ఒక ఇల్లాలు “వండుతున్నాము” అన్నది. మరొక స్త్రీ “మరల రండి” అన్నది. ఇంకొక ఇల్లాలు ఈ రోజు దేవవ్రతం (దేవకార్యము) అని చెప్పింది. మరియొక ఇల్లాలు అసలు ద్వారబంధం యొక్క తలుపులు తెరవనేలేదు.

పద్యం -3

సీ॥ ముంగిట గోమయంబున గోముఖము దీర్చి
కడలు నాల్గుగ ముగ్గుకట్టు పెట్టి,
యతిథి వచ్చేవిల్పి యర్ఘ్యపాద్యము లిచ్చి
పుష్పగంధంబులఁ బూజు చేసి,
ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువమున
వన్నంబుమీఁద నెయ్యభిఘరించి,
ఫలపాయపాపూప బహుపదార్థములతో
భక్తి విశ్వాస తాత్పర్యగరిమఁ

తే॥ బెట్టుదురు మాధుకరభిక్ష భిక్షుకులకుఁ
గంకణంబులతో పూడిగములు రాయఁ
గద్రకరముల బ్రాహ్మణాంగనలు కాశి
నన్నపూర్ణ భవాని కట్టమఁగుఁ జెలులు
ప్రతిపదార్థం :
ముంగిటన్ (ముంగల + ఇల్లు = ముంగిలి) = ఇంటి ముందు భాగంలో
గోమయంబునన్ = ఆవు పేడతో
గోముఖము తీర్చి = అలికి
కడలు = అంచులు
నాలుగన్ = నాలుగు అయ్యేటట్లుగా (చతురస్రముగా)
ముగ్గు కట్టు పెట్టి, (మ్రుగ్గు కట్టు + పెట్టి) = ముగ్గు పెట్టి
అతిథిన్ = వచ్చిన అతిథిని
అచ్చోన్ = ఆ రంగవల్లి మధ్యంలో (ఆ చతురస్రంగా వేసిన ముగ్గు మధ్యలో)
నిల్పి = నిలిపి
అర్ఘ్యపాద్యములు = కాళ్ళు, చేతులు కడుగుకోడానికి నీళ్ళు (హస్తముల యందు అర్హ్యమును, పాదముల యందు పాద్యమును)
ఇచ్చి = ఇచ్చి
పుష్పగంధంబులన్ = పువ్వులతో, గంధముతో
పూజచేసి (పూజ + చేసి) = పూజించి
ప్రక్షాళితంబైన (ప్రక్షాళితంబు + ఐన) = బాగుగా కడుగబడిన
పసిడి, చట్టువమునన్ = బంగారు గరిటెతో
అన్నంబు మీదన్ = అన్నము పైన
నెయ్యి = నేతిని
అఘరించి = కొంచెం వేసి (అభిషరము చేసి అనగా కొద్దిగా చల్లి)
ఫలపాయసాపూప బహుపదార్దములతోన్; ఫల = పండ్లు
పాయస = పరమాన్నం
అపూప = పిండి వంటకాలు మొదలయిన
బహు = అనేకములైన
పదార్థములతోన్ = పదార్థాలతో
భక్తి విశ్వాస తాత్పర్యగరిమన్, భక్తి = పూజ్య భావము యొక్క
విశ్వాస = నమ్మకము యొక్క
తాత్పర్య = తత్పర భావము యొక్క (మక్కువ యొక్క)
గరిమన్ = పెంపుతో
కమ్రకరములన్ = ఇంపైన చేతులయందు
కంకణంబులతోన్ = ముత్యాలు, పగడాలు మొదలయిన వానిని గుచ్చి చేతికి కట్టుకొనే తోరాలతో
సూడిగములు = గాజులు
రాయన్ = ఒరసి కొనుచుండగా
కాశిన్ = కాశీ నగరమందు
అన్నపూర్ణ భవాని కట్టనుగు జెలులు; అన్నపూర్ణ = అన్నపూర్ణ అనే పేరుగల
భవాని = భవుని భార్యయైన పార్వతీ దేవి యొక్క
కట్టనుగు (కడు + అనుగు) = మిక్కిలి ప్రియురాండ్రైన
చెలులు = చెలికత్తెలయిన (స్నేహితురాండైన)
బ్రాహ్మణాంగనలు (బ్రాహ్మణ + అంగనలు) = బ్రాహ్మణ స్త్రీలు
భిక్షుకులకున్ = యతులకు; (భిక్ష అడిగేవారికి)
మాధుకర, భిక్షన్ = తేనెటీగను పోలిన, భిక్షను; (మాధుకరము అనే భిక్షను)
పెట్టుదురు = పెడతారు (వడ్డిస్తారు)

భావం :
వాకిట్లో ఆవుపేడతో చక్కగా అలికి, నాలుగు అంచులూ కలిసే విధంగా దానిపై ముగ్గుపెట్టి, ఆ ముగ్గు మధ్యలో, వచ్చిన అతిథిని నిలబెట్టి, వారికి కాళ్ళూ చేతులూ కడుగుకోడానికి నీళ్ళు ఇచ్చి, (అర్ఘ్య పాద్యములు ఇచ్చి), వారిని పూవులతో, గంధముతో పూజచేసి, కడిగిన బంగారు గరిటెతో అన్నంపై ఆవునేతిని అభిషరించి (చల్లి), పండ్లతో, పరమాన్నముతో, పలు రకాల పిండివంటలతో, భక్తి విశ్వాసాలు ఉట్టిపడే రీతిగా, చేతి తోరాలతో గాజులు ఒరసికొని ధ్వని చేస్తుండగా, తమ ఇంపయిన చేతులతో, కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు, యతీశ్వరులకు మాధుకర భిక్ష పెడుతూ ఉంటారు. ఆ ఇల్లాండ్రు అన్నపూర్ణా భవానికి ప్రియమైన స్నేహితురాండ్రుగా పేరు పొందారు.
విశేషాంశాలు:
1. అతిథి : (వ్యుత్పత్తి) = తిథి నియమాలు లేకుండా భోజన సమయానికి వచ్చేవాడు.

2. అర్ఘ్యం : (వ్యుత్పత్తి) = పూజకు తగినది
అష్టార్ధ్యములు : అర్ఘ్యములు ఎనిమిది రకములు. 1) పెరుగు 2) తేనె 3) నెయ్యి 4) అక్షతలు 5) గణిక 6) నువ్వులు 7) దర్భ 8) పుష్పము

3. పాద్యము : (వ్యుత్పత్తి) = పాదములకు అర్హమైనది (కాళ్ళు కడుగుకొనుటకు అర్హమైన నీరు)

4. మాధుకర భిక్ష : (వ్యుత్పత్తి) = మధుకరం అంటే తుమ్మెద. తుమ్మెద వివిధ పుష్పాలపై వ్రాలి, తేనెను గ్రహించి నట్లు, సన్న్యాసులు వివిధ గృహాలకు వెళ్ళి, ఆ ఇంటి గృహిణుల నుండి భిక్షాన్నములను స్వీకరిస్తారు. అందువల్ల సన్న్యాసులు స్వీకరించే భిక్షను ‘మాధుకర భిక్ష’ అంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

పద్యం -4

కం॥ ఆ పరమ పురంధ్రులయం
దే పుణ్యాంగవయు భిక్ష యిడదయ్యెఁ గటా !
రేపాడి మేలుకని యే
నే పాపాత్ముని ముఖంబు వీక్షించితివో?
ప్రతిపదార్థం :
ఆ, పరమ, పురంధ్రుల యందున్ ; ఆ = అటువంటి
పరమ = ముఖ్య మైన
పురంధ్రుల యందున్ = కుటుంబినులలో (మగడునూ, బిడ్డలునూ కల స్త్రీని ‘పురంధి’ అంటారు.)
ఏ పుణ్యాంగనయున్, (ఏ, పుణ్య + అంగనయున్) = ఏ పుణ్యవతియును
భిక్ష = భిక్షాన్నమును
ఇడదయ్యెన్ = పెట్టదాయెను (పెట్టలేదు)
కటా = అక్కటా !
ఏను = నేను
రేపాడి = తెల్లవారు జాముననే మేలుకొని
ఏ పాపాత్ముని = ఎటువంటి పాపి యొక్క
మోమును = ముఖాన్ని
ఈక్షించితినో; (ఈక్షించితిని + ఓ) = చూశానో

భావం :
అటువంటి పరమ పురంధ్రులలో ఏ యొక్క పుణ్య స్త్రీ కూడా నాకు భిక్ష పెట్టడానికి రాలేదు. నేను ఈనాడు ఉదయం నిద్రలేచి, ఎటువంటి పాపాత్ముని ముఖాన్ని చూశానో కదా !

విశేషాంశాలు:
1. పాపాత్ముని ముఖం చూడడం : దుర్మార్గుల ముఖం చూస్తే, చెడ్డ పరిణామాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఉదయం లేవగానే కాని, పాడ్యమి తిథినాడు చంద్రోదయాన్ని గమనించినప్పుడు కాని, ఇష్టమైన వాళ్ళ ముఖాలను చూస్తారు. అలాగే ఏదయినా పనిపై వెళ్ళేటప్పుడు, కులస్త్రీలు శకునంగా ఎదురువస్తే మంచిది అనే సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇటువంటి వాటిపై, నమ్మకం పోతూ ఉండడం గమనింపదగిన విషయం.

పద్యం – 5
తే॥గీ॥ ఉపవసింతుముగాక వేఁడుడిగి మడిగి
యస్తమించుచు మన్నవాఁ డమామ భామం
డెల్లి పారణకైవ లేదెట్లు మనకు?
మాధుకరభిక్ష బ్రాహ్మణ మందిరముల
ప్రతిపదార్థం :
ఉడిగి = (భిక్ష కోసం తిరగడం) మాని
మడిగి = అణగి యుండి
నేడు = ఈరోజు
ఉపవసింతుముగాక; (ఉపవసింతుము + కాక) = ఉపవాసం ఉందుము గాక !
అహిమభానుడు = వేడి కిరణములు గలవాడైన సూర్యుడు
ఆస్తమించుచునున్నవాడు; (అస్తమించుచున్ + ఉన్నవాడు) = అస్తమిస్తున్నాడు
ఎల్లి = రేపు
మనకున్ = మనకు
బ్రాహ్మణ మందిరములన్ = బ్రాహ్మణ గృహాలలో
మాధుకర భిక్ష – మాధుకర రూపమైన భిక్ష
పారణకైనన్ = ఉపవాసం ఉండి మరునాడు చేయు భోజనానికి అయినా
లేదెట్లు (లేదు + ఎట్లు) = లేకుండా ఎలా ఉంటుంది? (తప్పక లభిస్తుంది)

భావం :
ఇంక భిక్ష కోసం తిరగడం కట్టిపెట్టి, కడుపులో కాళ్ళు పెట్టుకొని మడిగి ఉండి, ఉపవాసం చేద్దాము. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ మందిరాలలో ఉపవాసం తర్వాత చేసే పారణ భోజనానికి సరిపడ భిక్ష దొరకక పోడు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘అతిథి దేవోభవ’ అంటే ఏమిటి?
జవాబు:
‘అతిథి దేవోభవ’ అంటే అతిథి దేవుడుగా గలవాడవు అగుము అని భావం. అంటే అతిథిని దేవునిగా భావించి పూజించుము అని సారాంశం.

ప్రశ్న 2.
ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్రకార్యంగా ఎందుకు భావించేవారు?
జవాబు:
సన్యాసులు, బ్రహ్మచారులు, మహర్షులు ‘భిక్షా’ వృత్తితో జీవించాలని, ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. వ్యాసమహర్షి వంటివారు పంచ భిక్ష స్వీకరించేవారు. అంటే కేవలం ఐదు గృహాలకు వెళ్ళి, ఐదుమంది నుండి మాత్రమే భిక్ష స్వీకరించేవారు. ఉపనయనం చేసినప్పుడు బ్రహ్మచారులు ముందుగా తల్లి నుండి, తరువాత తండ్రి నుండి భిక్షలు స్వీకరించాలి. సన్యాసులు వంటి వారు జీవనం కోసం వస్తువులు, ధనం, వగైరా దాచరాదని, వారు భిక్ష ద్వారా లభించిన దానినే తిని జీవించాలనీ, శాస్త్రాలు చెపుతున్నాయి. భిక్ష పెట్టినవారికి పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెప్పాయి. అందుకే ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్రకార్యంగా భావించేవారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
భిక్ష సమర్పించేటప్పుడు నాటికీ నేటికీ ఉన్న తేడాలేమిటి?
జవాబు:
భిక్ష సమర్పించేటప్పుడు పూర్వం గృహిణులు, తమ ఇంటివాకిలిని ఆవు పేడతో శుద్ధిచేసి, అక్కడ ముగ్గు పెట్టి, అతిథికి అర్ఘ్యపాద్యాలిచ్చి, పుష్ప గంధాలతో పూజచేసి, అన్నం మీద నెయ్యి అభిఘారం చేసి, పిండివంటలతో భక్తి విశ్వాసాలతో అతిథులకు పెట్టేవారు.

ఇప్పుడు భిక్ష పెట్టడం తక్కువ అయ్యింది. కేవలం కొంతమంది మాత్రం, ముష్టి పెడుతున్నారు. అది కూడా విసుగుకుంటూ, తప్పనిసరి పరిస్థితుల్లోనే బిచ్చగాండ్రకు ముష్టి వేస్తున్నారు. ముష్టి ఎత్తుకోడం, కొన్ని ప్రాంతాల్లో నేరంగా పరిగణింపబడుతోంది. నేడు దాన ధర్మాలు తగ్గిపోయాయి.

వచనం -6

అవి యారాత్రి గడపి మజువాఁడు మధ్యాహ్న కాలంబున ఆ శిష్యులుం దాను
వేటువేటు విప్రభవన వాటికల భిక్షాటవంబొనర్పంబోయి,
తొలువాఁటియట్ల ముక్కంటేమాయ వేమచ్చెకంటియు వంటకంబు
పెట్టకున్నఁ గటకటంబడి భిక్షాపాత్రంబు నట్టనడు వీధిం బగులవైచి కోపావేశంబున
ప్రతిపదార్థం :
అని = అట్లు చెప్పి
ఆ రాత్రి, గడపి = ఆ రాత్రి ఎలాగో వెళ్ళదీసి
మఱునాడు = తరువాతి రోజు
మధ్యాహ్నకాలంబునన్ = మధ్యాహ్న వేళయందు
శిష్యులున్ = శిష్యులునూ
తానున్ = తానునూ (వేద వ్యాసుడునూ)
వేఱువేఱన్ = విడివిడిగా
వేదవ్యాసుండు = వేద వ్యా సమహర్షి
విప్రభవన వాటికలన్; విప్ర భవన = బ్రాహ్మణ మందిరములు ఉన్న
వాటికలన్ = వాడలలో (వీథులలో)
భిక్షాటనంబు; (భిక్షా + ఆటనంబు) = భిక్ష కోసం సంచారం
ఒనర్పంబోయి (ఒనరన్ + పోయి) = చేయబోయి
తొలునాటియట్ల (తొలునాటి + అట్ల) – ముందురోజులాగే
ముక్కంటి మాయన్ = శివుని మాయచేత
ఏ మచ్చెకంటియున్ = ఏమీన నేత్రయును,
(మచ్చె కంటి : (వ్వు)) = చేపల వంటి కన్నులు కలది (స్త్రీ)
వంటకము = అన్నం
పెట్టకున్నన్ (పెట్టక + ఉన్నన్) = పెట్టకపోగా
కటకటంబడి = బాధపడి
భిక్షాపాత్రంబు = భిక్షా పాత్రను
నట్టనడు వీధిన్ = వీధి నట్టనడుమ (మధ్యలో)
పగులవైచి = పగులకొట్టి
కోపావేశంబునన్ (కోప + ఆవేశంబునన్)= కోపము యొక్క ఆవేశంతో

భావం :
అని వేదవ్యాసుడు, శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి, మరుసటి రోజు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులునూ, తానూ వేర్వేరుగా బ్రాహ్మణ వాడలలో భిక్షాటనం చేయసాగారు. కాని అంతకు ముందు రోజులాగే, విశ్వనాథుడి మాయవల్ల, ఏ ఇల్లాలు వారికి భిక్ష పెట్టలేదు. దానితో వ్యాసుడు బాధపడి, కోపంతో భిక్షాపాత్రను నట్టనడి వీధిలో ముక్కలు ముక్కలయ్యేటట్లు పగులకొట్టాడు. అంతటితో కోపావేశం దిగక.

పద్యం -7

తే॥ ( ధనములేకుండెదరు మూఁడు తరములందు
మూడు తరములఁ జెడుఁగాక మోక్షలక్ష్మి
విద్యయును మూడు తరముల వెడలవలయుఁ
పంచజనులకుఁ గారి పట్టణమున
ప్రతిపదార్థం :
కాశికాపట్టణమునన్ = కాశీ పట్టణము నందు
పంచ జనులకున్ = మనుష్యులకు (పంచభూత ములచే పుట్టువారు మనుష్యులు)
మూడు తరములన్ = మూడు తరముల పాటు
మోక్షలక్ష్మి = కైవల్య లక్ష్మి
చెడుఁగాక = చెడిపోవుగాక
మూడు తరములన్ = మూడు తరముల పాటు
విద్యయును = విద్య కూడా
వెడలవలయున్ – పోవాలి (నిష్క్రమించాలి)
మూడు తరముల యందున్ = మూడు తరముల పాటు
ధనము లేకుండెదరు. = ధనము లేకుండా ఉంటారు (పేదవారై ఉంటారు)

భావం :
కాశీ నివాసులకు ముదిరిన ఈ ధన మదం దిగిపోయే వరకు, “వీరు మూడు తరాల వఱకూ నిరుపేదలై ఉండాలి. మూడు తరాల వఱకూ వీరికి ముక్తి లక్ష్మి చెడిపోవాలి. మూడు తరాల వణుకూ వీరు చదువులేనివారు కావాలి.” అని వ్యాసుడు కాశీ నగరాన్ని శపించడానికి సిద్ధమయ్యాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

వచనం – 8

అవి పారాశర్యుండు పుత్పిపాసా పరవశుండై శపియింపం దలంచు
వనసరంబున నొక్క విప్రభవనంబు వాఁకిటం
బార్వతి ప్రాకృత వేషంబున
ప్రతిపదార్థం :
అని = ఈ విధంగా
పారాశర్యుండు = వ్యాసుడు (వ్య) పరాశర మహర్షి కుమారుడు (వేదవ్యాసుడు)
క్షుత్పిపాసాపరవశుండై; క్షుత్ = ఆకలితోనూ
పిపాసా = దప్పికతోనూ (నీరు త్రాగాలనే కోరికతోనూ)
పరవశుండై; (పరవశుండు + ఐ) = పరాధీనుడై (లొంగినవాడై)
శపియింపన్ = శపించడానికి
తలచు = ఊహించే
అవసరంబునన్ = సమయంలో
ఒక్క విప్రభవనంబు వాకిటన్; ఒక్క = ఒక
విప్రభవనంబు = బ్రాహ్మణ మందిరము యొక్క
వాకిటన్ = వాకిలి యందు (గృహ ద్వారమునందు)
పార్వతి = పార్వతీ దేవి
ప్రాకృత వేషంబునన్ = సామాన్య స్త్రీ వేషంలో

భావం :
అని ఆకలి దప్పులతో బాధపడుతున్న వ్యాసుడు శపించాలని ఆలోచిస్తున్న సమయంలో, ఒక బ్రాహ్మణ భవనం ద్వారము దగ్గర పార్వతీ దేవి సామాన్య స్త్రీ వేషంలో మందలించింది.

విశేషాంశాలు:
1. పారాశర్యుడు (వ్వ) : పరాశర మహర్షి కుమారుడు (వ్యాసుడు)

పద్యం – 9 : కంఠస్థ పద్యం

ఉ॥ వేదపురాణశాస్త్ర పదవి వదవీయసియైన పెద్దము
ఆదున కాళికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య
య్యాదను శక్తి సంయమివరా ! యిటు రమ్మని పిల్చి హస్తనం
జాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లవన్
ప్రతిపదార్థం :
వేదపురాణ శాస్త్ర పదవీ నదవీయసి యైన; వేద = వేదముల యందు
పురాణ = పురాణముల యందు
శాస్త్ర = శాస్త్రముల యందు ప్రతిపాదింపబడిన
పదవీ = జ్ఞానమునకు
నదవీయసియైన (న + దవీయసి + ఐన) = మిక్కిలి దూరము నందు లేని
పెద్ద ముత్తైదువ = పెద్దదైన పురంధి
కాశికా నగర హాటిక పీఠ శిఖాధిరూఢ; కాశికా నగర = కాశికా నగరము అనెడి
హాటక పీఠ = స్వర్ణ పీఠము యొక్క
శిఖా = శిఖరమందు
అధిరూఢ = అధిరోహించియున్న
అయ్యాదిమ శక్తి (ఆ + ఆదిమ శక్తి) : ఆ మొదటి శక్తి స్వరూపిణి
హస్త సంజ్ఞాదర లీలన్; హస్త సంజ్ఞా = చేతి సంజ్ఞ యందు వెల్లడి యవుతున్న
ఆదర = ఆదరముతో కూడిన
లీలన్ = విధముతో
రత్న ఖచితా భరణంబులు: రత్న = రత్నములతో
ఖచిత = పొదుగబడిన (కూడిన)
ఆభరణంబులు = నగలు
ఘల్లు ఘల్లనన్ = గల్లు గల్లుమని శబ్దము చేయు చుండగా
సంయమివరా = ఓ మునీశ్వరా !
ఇటురమ్ము + అని = ఇటు రమ్మని
పిల్చెన్ = పిలిచింది

భావం :
సకల వేదాలు, సకల పురాణాలు, సకల శాస్త్రములు నిర్దేశిస్తున్న మార్గానికి దగ్గరగా ఉన్న పెద్ద ముత్తైదువ, కాశీనగరం. అనే బంగారు పీఠంపై అధిరోహించిన ఆ ఆదిమశక్తి, తన చేతితో సంజ్ఞ చేసింది. ఆ సంజ్ఞలో ఆదరం కనబడింది. అప్పుడు ఆమె రత్నఖచితమైన ఆభరణాలు ఘల్లు ఘల్లుమని చప్పు డయ్యాయి. అలా ఘల్లుమంటుండగా, ఆమె ‘ఓ మునీశ్వరా ! ఇటు రమ్ము’ అని వ్యాసుని పిలిచింది.

పద్యం – 10: కంఠస్థ పద్యం

శా॥ ఆకంఠంబుగ విష్ణు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా
లేకున్నం గడు వంగలార్చెదవు మేలే ? లెప్ప ! శాంతుండవే !
నీ కంటెన్ మతిహీమలే కటకటా ! నీవార ముస్లించచుల్
శాకాహారులుఁ గందభోజులు, శిలాంఛప్రక్రముల్ తాపసుల్!
ప్రతిపదార్థం :
ఇప్డు= ఇప్పుడు
ఆకంఠంబుగన్ = కంఠము దాకా (గొంతు దాకా)
మాధుకర భిక్షాన్నంబు = మాధుకర రూపమైన భిక్షాన్నమును
భక్షింపగాన్ = తినడానికి
లేకున్నన్ (లేక + ఉన్నన్) = లేకపోయేసరికి
కడున్ = మిక్కిలి
అంగలార్చెదవు = అంగలు వేస్తున్నావు (తొట్రు పడుతున్నావు) (దుఃఖిస్తున్నావు)
మేలే (మేలు + ఏ) : నీవు చేసే పని మంచిదా?
లెస్స = బాగున్నదా?
శాంతుండవే (శాంతుండవు + ఏ) = నీవు శాంత గుణం కలవాడవేనా !
కటకటా = అక్కట కటా !
నీవార ముష్టింపచుల్ = ఏ పూటకు ఆ పూట పిడికెడు నివ్వరి వడ్లు దంచుకొని వండి తినేవారునూ
శాకాహారులు (శాక + ఆహారులు) : కాయ కూరలు మాత్రమే తినేవారునూ
కందభోజులు = దుంపలు మాత్రమే తినేవారునూ
శిలోంఛ ప్రక్రముల్; శిల = కోతకోసిన వరిమళ్ళలో జారీ పడిన కంకులు ఏరుకొని వాటితో బ్రతికేవారునూ
ఉంఛ ప్రక్రముల్ = రచ్చరోళ్ళ వద్ద వడ్లు దంచేటప్పుడు చుట్టూ జారిపడిన బియ్యపు గింజలు ఏరుకొనడమే జీవనంగా కలవారునూ అయిన
తాపసుల్ = తపస్సు చేసుకొనేవారు; (మునులు)
నీకంటెన్ = నీ కన్న
మతిహీనులే (మతిహీనులు + ఏ) = బుద్ధితక్కువ వారా? (తెలివి తక్కువ వారా?)

భావం :
ఇప్పుడు గొంతు దాకా తినడానికి మాధుకర భిక్షాన్నం దొరకలేదని నీవు ఇంతగా చిందులు వేస్తున్నావు కదా ! ఇది
మంచి పనియేనా ? బాగున్నది. నిజంగా నీవు శాంత | స్వభావుడవేనా ? పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారూ, శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకొనే వాళ్ళూ, వరి మళ్ళలో కంకులు ఏరుకొని బ్రతికేవాళ్ళూ, రోళ్ళ వద్ద జారిపడిన బియ్యం ఏరుకొని జీవించే వాళ్ళూ అయిన మునులు, నీ కంటె తెలివి తక్కువ వారా?

పద్యం – 11

తే॥గీ॥ మువీశ్వర ! వివవయ్య యున్న యూరుఁ
గన్నతల్లియు వొక్క రూపన్న రీతి
యటు విశ్లేషించి శివుని యర్థాంగలక్ష్మి
కాశి; యివ్విటి మీద వాగ్రహము దగునె?
ప్రతిపదార్థం :
ఓ మునీశ్వర (ముని + ఈశ్వరా) : ఓ మునీశ్వరుఁడా ! = (వేదవ్యాస మహర్షి !)
ఉన్నయూరున్ (ఉన్న + ఊరున్) = తాను ఉన్న ఊరును
కన్న తల్లియున్ = తనను కనిన తల్లియును
ఒక్కరూపు = ఒకే మాదిరి
అన్న రీతి = అనే రీతిని
వినవయ్య = నీవు వినలేదా?
అటు విశేషించి = అంతకంటెను విశేషించి
కాశి = కాశీ పట్టణం
శివుని = ఈశ్వరుని యొక్క
అర్థాంగ లక్ష్మి = భార్య
ఇవ్వీటిమీదన్ (ఈ + వీటిమీదన్) = ఈ కాశీనగరం మీద
ఆగ్రహము = కోపం
తగునె (తగును + ఎ) = తగునా?

భావం :
పెద్ద ముత్తైదువు రూపంలో ఉన్న పార్వతీ దేవి, వ్యాసుని “ఉన్న ఊరు కన్నతల్లితో సమానం” అనే రీతిని నీవు వినలేదా? అంతకంటెను విశేషించి శివుని అర్థాంగ లక్ష్మియైన ఈ కాశీనగరి మీద నీవు ఇంత కోపం చూపించడం తగునా?” అని మందలించింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

వచనం – 12

ఇట్టి కాళికావగరంబుమీద భిక్షలేకుండుట
కారణంబుగా వీయంత వాడు కటకటంబడి
శపియింపందలంచువే? విశేషించి యాఁకొన్న వాఁడవు
గావున నీ యవపరంబున నిన్ను హెచ్చు గుందాడుట
మము బోఁటి గృహిణులకు మెచ్చుగాదు. మా
యింటికిం గుడువ రమ్ము! కుడిచి కూర్చున్న
పిమ్మటం గొన్ని మాటలు నీతో వాడఁగలవనివ
నమ్మహాసాధ్వింగని, పారాశర్యుండిట్టులనియె –
ప్రతిపదార్ధం :
ఇట్టి కాశికా నగరంబు మీదన్ = ఇటువంటి కాశీ పట్టణం పైన;
భిక్ష లేకుండుట కారణంబుగాన్ = భిక్ష దొరకలేదన్న కారణంగా
నీయంతవాడు = నీ యంతటివాడు
కటకటంబడి = కోపగించుకొని
శపియింపన్ = శపించాలని
తలంచునే = అనుకుంటాడా?
బ్రాహ్మణుండవు గదా ! = నీవు బ్రాహ్మణుడవు గదా !
నీవేమన్ననున్ (నీవు + ఏమి + అన్నన్) = నీవు ఏమన్నా
చెల్లున్ = చెల్లుబడి అవుతుంది
అటు విశేషించి = అంతకంటెను విశేషంగా
ఆకొన్నవాడవు = ఆకలితో ఉన్నావు
కావునన్ = కాబట్టి
ఈ యవసరంబునన్ = ఈ సందర్భంలో
నిన్నున్ = నిన్ను
హెచ్చుకుందాడుట = నిందించడం; (నీతో వాదులాడటం )
మముబోటి = మా వంటి
గృహిణులకున్ – ఇల్లాండ్రకు
మెచ్చుగాదు = మెప్పు కలిగించదు
మా యింటికిన్ (మా + ఇంటికిన్) = మా ఇంటికి
కుడువన్ = తినడానికి
రమ్ము = రావయ్యా !
కొన్ని మాటలు = కొన్ని మాటలు
నీతోన్ = నీతో
ఆడన్ = పలుకవలసినవి
కలవు = ఉన్నాయి
అనినన్ = అనగా
అమ్మహాసాధ్విన్ (ఆ + మహాసాధ్విన్) = ఆ గొప్ప పతివ్రతను
కని = చూచి
పారాశర్యుండు = వేదవ్యాసుడు (పరాశరుని కుమారుడు)
ఇట్టులనియె (ఇట్టులు + అనియె) = ఈ విధంగా అన్నాడు

భావం :
“ఇటువంటి కాశీ నగరం మీద, కేవలం భిక్ష దొరకలేదని నీలాంటి ఉత్తముడు, బాధపడి శపించాలని అనుకోవచ్చా ; నీవు బ్రాహ్మణుడవు కాబట్టి, నీవు ఏమన్నా నీకు చెల్లుతుంది. పైగా నీవు ఆకలితో ఉన్నావు. కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా నిందించడం, మాలాంటి గృహిణులకు మర్యాద కాదు. మా ఇంటికి భోజనానికి రా, భోజనమైన తరువాత నీతో కొన్ని మాటలు మాట్లాడవలసి ఉన్నది.” అని పార్వతీ దేవి వ్యాసునితో చెప్పుగా, ఆ మహాసాధ్విని చూచి, వ్యాసుడు ఈ విధంగా అన్నాడు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
భిక్ష దొరకని వ్యాసుడు కోపగించాడు కదా ! దీనిపైన మీ అభిప్రాయమేమిటి?
జవాబు:
వ్యాసుడు వేదవేదాంగవేత్త. అష్టాదశ పురాణాలు రచించినవాడు. భారతం రచించినవాడు. అటువంటి వాడు కేవలం రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరంపై కోపించి శపించడానికి సిద్ధమయ్యాడు.

వ్యాసుడు కోపించడం, ధర్మం కాదు. లోకంలో ఎందరో మహర్షులు, తాపసులు నివ్వరి బియ్యం తిని జీవిస్తున్నారు. కొందరు శాకాహారంతో, కంద భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. కొందరు ఉంఛ వృత్తితో జీవిస్తున్నారు. కాబట్టి వ్యాసుని వంటి మహర్షి రెండు రోజులు పస్తు ఉండలేక, శివుని భార్యయైన కాశీ నగరాన్ని శపించబోవడం నేరం అని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
‘కోపం మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. దీన్ని గురించి మాట్లాడండి.
జవాబు:
కోపం వస్తే మనిషికి ఏది మంచిదో, ఏది చెడ్డదో గ్రహించే విచక్షణ శక్తి పోతుంది. ఈ మాటలో సత్యం ఉంది. విశ్వామిత్రుడు, దుర్వాసుడు వంటి మహర్షులు ఈ విధంగానే కోపంతో విచక్షణ కోల్పోయి, ఎన్నో చిక్కులకు లోనయ్యారని పురాణాలు చెపుతున్నాయి.

దుర్యోధనుడు పాండవుల పై కోపంతోనే విచక్షణ కోల్పోయి, నిండు సభలో ద్రౌపదిని అవమానించాడు. దుర్వాసుడు కోపంతోనే అంబరీషుని, ధర్మరాజును పరీక్షించబోయి, తానే కష్టపడ్డాడు. విశ్వామిత్రుడు వశిష్ఠునిపై కోపంతో తానే భంగపడ్డాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
ఉన్న ఊరును కన్న తల్లితో సమానమని ఎందుకు అంటారు?
జవాబు:
కన్నతల్లి మనకు కావలసిన దానిని, తాను గుర్తించి మన కడుపు నింపుతుంది. కన్నతల్లి తన బిడ్డలపై ఎప్పుడూ కోపగించుకోదు. పిల్లలను కన్నతల్లి బాగా ప్రేమగా చూసి, వారికి కావలసిన వాటిని ఇస్తుంది.

అలాగే మనం ఉన్న ఊరు కూడా, మనకు కావలసిన వాటిని సమకూరుస్తుంది. మనం ఉన్న ఊరిలో మనకు ప్రజలు అందరూ తెలిసిన వారు ఉంటారు. వారు తన తోడి వ్యక్తిని ప్రేమగా కన్నతల్లి వలె చూస్తారు. అందుకే “జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” అన్నారు.

కన్నతల్లిని విడిచి వెళ్ళకూడదు. అలాగే మనం ఉన్న ఊరును విడిచి పొరుగూరు పోకూడదు. పొరుగూరిలో మనం ఎన్నటికీ ఉన్న ఊరులో వలె సుఖంగా ఉండలేము. కన్నతల్లి, ఉన్న ఊరు సమానం.

పద్యం – 13

తే॥గీ॥ | అస్తమింపగఁ జేరినాఁ డహిమకరుడు.
శిష్యులేగాక యయుతంబు చిగురుఁబోడి
వ్రతము తప్పి భుజింపంగ వలమగాడు
వేఁడు విన్నటి మజువాఁడు విక్కువంబు
ప్రతిపదార్థం :
అహిమకరుడు = సూర్యుడు (చల్లనివి కాని కిరణములు కలవాడు)
అస్తమింపగన్ = అస్తమించడానికి
చేరినాడు = సమీపించాడు
ఏఁగాక (ఏన్ + కాక) = నేను కాకుండ
శిష్యులు = శిష్యులు
అయుతంబు = పదివేలమంది ఉన్నారు
వ్రతము తప్పి = వ్రతం విడిచిపెట్టి
భుజియింపన్ = భుజించడానికి
వలను కాదు = యుక్తం కాదు; (ఒప్పిదం కాదు)
చిగురుబోడి = చిగురు వంటి శరీరం గల దానా !
నేడున్ = నేడు కూడా
నిన్నటి = నిన్నటి రోజునకు
మఱునాడు = మరుసటి రోజే (అనగా నిన్న లాగే నేడూ పస్తు ఉండటమే)
నిక్కువంబు = నిజం

భావం :
తల్లీ ! పల్లవగాత్రీ ! సూర్యుడు అస్తమించడానికి సమీపించాడు. (సూర్యాస్తమయం కాబోతుంది). నేను కాక ఇంకా పదివేలమంది శిష్యులు ఉన్నారు. అందరితో కలిసి భుజించే వ్రతం ఉన్న నేను, నా వ్రతాన్ని విడిచి పెట్టి మీ ఇంట్లో ఒక్కడినీ భుజించలేను. ఈ రోజు కూడా నిన్నటి రోజుకు మరుసటి రోజే. (అంటే నిన్నటి లాగే ఈ రోజు కూడా ఉపవాసం నాకు తప్పదు. అని ధ్వ ని)

పద్యం – 14: కంఠస్థ పద్యం

చం॥ అనవుడు నల్లవవ్వి కమలానవ యిట్లము, లెప్పగాక, యో
మునివర! నీవు శిష్యగణముంగొని చయ్యవ రమ్ము విశ్వనా
థునికృప పేర్మి వెందట తిథుల్ చమబెంచినఁ గామధేనువుం
ఐవి గొనునట్లు పెట్టుదు వపారములైన యభిప్పితాన్నముల్
ప్రతిపదార్థం :
అనవుడున్ = వేదవ్యాసుడు ఇట్లు చెప్పగా
కమలానన (కమల + ఆనన) = పద్మం వంటి ముఖం గల ఆ ముత్తైదువ
అల్ల = కొంచెం
నవ్వి = నవ్వి
ఇట్లనున్ (ఇట్లు + అనున్) = ఇలా చెప్పింది
లెస్సగాక = మేలు అగునుకాక !
ఓ మునివర = ఓ మునీశ్వరుడా !
నీవు = నీవు
శిష్యగణమున్ = శిష్యులందరినీ
కొని = తీసుకొని
చయ్యనన్ = శీఘ్రంగా
రమ్ము = రమ్ము (మా ఇంటికి భోజనానికి రా)
విశ్వనాథుని = విశ్వనాథుడైన పరమేశ్వరుని యొక్క
కృపపేర్మిన్ = దయాతిశయం చేత (అధికమైన దయచేత)
ఎందరతిథుల్ (ఎందరు + అతిథుల్) = ఎంతమంది అతిథులు వచ్చినప్పటికీ
కామధేనువున్ = దేవతల కామధేనువును
పనిగొనునట్లు – స్వాధీనం చేసికొన్న విధంగా
అపారములైన (అపారములు + ఐన) = అంతులేని;
అభీప్సితాన్నముల్ (అభీప్సిత + అన్నముల్) = కోరిన పదార్థాలను
పెట్టుదున్ = పెడతాను

భావం :
వేదవ్యాసుడు ఇలా చెప్పగా, పద్మం వంటి ముఖం గల ఆ ముత్తైదువ చిఱునవ్వు నవ్వి “మంచిది. సరేలే. విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా, కామధేనువును కలిగియున్న యజమానురాలు రీతిగా, కోరిన పదార్థాలన్నీ నేను అనంతంగా పెట్టగలను. కాబట్టి నీ శిష్యులను తీసుకొని వెంటనే భోజనానికి రా” అన్నది.

వచనం – 15

అనిన వట్లకాక మహాప్రపాదంబని వేదవ్యాసుండు
శిష్యులం గూర్చుకొని భాగీరథికిం జని యువస్పర్శం
బాచరించి యేతెంచిన –
ప్రతిపదార్థం :
అనినన్ = అట్లు ముత్తైదువ చెప్పగా
అట్లకాక = అట్లే అగుకాక (అలాగే చేస్తాను)
మహాప్రసాదంబు + అని = మహానుగ్రహమని
వేదవ్యాసుండు = వేదవ్యాసుడు
శిష్యులన్ = శిష్యులను
కూర్చుకొని = కలుపుకొని (తన వెంటబెట్టుకొని)
చని = వెళ్ళి (గంగకు వెళ్ళి)
ఉపస్పర్శంబు = స్నానమును, ఆచమనమును
ఆచరించి = చేసి
ఏతెంచినన్= రాగా

భావం :
ఆ ముత్తైదువ అట్లు చెప్పగా “సరే మహాప్రసాదం” అని వేదవ్యాసుడు శిష్యులను తీసుకొని గంగానదికి వెళ్ళి స్నానం, ఆచమనం, పూర్తిచేసుకొని రాగా,

పద్యం – 16

తే॥గీ॥ గొడుగు పాగల గిలకలు గులకరింప
విందుబింబాస్య యెదురుగా వేగు దెంచి
ఛాత్ర సహితంబుగాఁ బరాశరతనూజు
బంతిపాగించే భుక్తిశాలాంతరమున
ప్రతిపదార్థం :
గొడుగు పాగల గిలకలు = గొడుగు పావకోళ్ల యొక్క గిలకలు (గొడుగుల వలెనుండు గుబ్బలు గల పావకోళ్ళు)
గులకరింపన్ = మ్రోగుతుండగా
ఇందు బింబాస్య (ఇందు బింబ + ఆస్య) = చంద్రబింబము వంటి ముఖం కల ఆ ఇల్లాలు
ఎదురుగాన్ = వ్యాసునకు ఎదురుగా
ఏగుదెంచి = వచ్చి (మునీశ్వరునకు ఎదురేగి)
ఛాత్ర సహితంబుగాన్ = శిష్య సమేతంగా
పరాశరతనూజు బంతి = పరాశరుని కుమారుడైన వ్యాసుడు మొదట కూర్చున్న బంతిని; (పంక్తిని)
భుక్తి శాలాంతరబునన్ (భుక్తిశాలా + అంతరమునన్) = భోజనశాల లోపల
సాగించెన్ = వడ్డన సాగించింది

భావం :
తాను ధరించిన గొడుగు పావుకోళ్ళ గిలకలు మ్రోగుతుండగా, చంద్రముఖియైన ఆ ముత్తైదువ, వారికి ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పింది. శిష్య సమేతంగా వేదవ్యాస మునీంద్రుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడు ఆమె ఆ పంక్తికి వడ్డన సాగించింది.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
భోజనానికి ఆహ్వానించిన గృహిణితో వ్యాసుడు పలికిన మాటలను బట్టి మీకేమి అర్థమయింది?
జవాబు:
వ్యాసుడు తన శిష్యులతో కూడా భిక్షాటనం చేసి, వాళ్ళతో కలసి భుజించేవాడని అర్థమయ్యింది. ఒకవేళ పగటి సమయంలో భిక్ష దొరక్కపోతే ఉపవాసం ఉండేవాళ్ళని అర్థమయింది.

వ్యాసుడు తన శిష్యులతో కలసి భుజించాలనే వ్రతం కలవాడని అర్థమయింది. శిష్యులను విడిచి పెట్టి తానొక్కడే భుజించాలనే స్వార్థపు ఆలోచన లేనివాడని అర్థమయింది. తనను ఆశ్రయించిన శిష్యుల బాగోగులను పట్టించుకొనేవాడని అర్థమయింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 2.
ఈ పాఠం ఆధారంగా నాటి గురుశిష్య సంబంధం గురించి వివరించండి.
జవాబు:
ఈ పాఠం ఆధారంగా చూస్తే నాటి గురుశిష్య సంబంధం విడదీయరానిదని తెలుస్తోంది. శిష్యులు ఎల్లప్పుడూ గురువుని ఆశ్రయించి ఉండేవారు. గురువులతో పాటు శిష్యులు కూడా భిక్షాటనం చేసి లభించిన ఆహారాన్ని అందరూ కలసి భుజించేవారు. ఒకవేళ సూర్యాస్తమయం లోపల భిక్ష లభించకపోతే ఆ రోజు ఉపవాసం ఉండేవాళ్ళు. గురువు మాటను శిష్యులు అతిక్రమించే వారు కాదు. గురువు తనకంటే ముందుగా శిష్యుల బాగోగులను గురించి పట్టించుకొనేవాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Lesson గోరంత దీపాలు Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 10th Lesson గోరంత దీపాలు

10th Class Telugu 10th Lesson గోరంత దీపాలు Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

జడ్డ ఆకలి అమ్మకి తెలుస్తుంది. ఈ తల్లులకు తమ ఆకలేకాదు, అనాథల క్షుద్బాధా తెలుసు. ఇంత తెలిసిన వీరంతా గొప్ప స్థితిమంతులేం కాదు. అలాంటప్పుడు లేనివారికి గుప్పెడు మెతుకులు పంచేదెలా? ఆలోచించగా ఆలోచించగా వారికొక దారి దొరికింది. రోజూ పిడికెడు గింజలు దాచాలన్న ఊహ కలిగింది. పిడికిలి జగిస్తే ఉద్యమం అవుతుంది. ఆ ఊళ్లో జనం పిడికిలి తెరిచారు. తమ దగ్గరున్న గింజల నుంచి ప్రతిరోజూ పిడికెడు పంచడం నేర్పారు. ఇవ్వడం సాయం, పంచడం మానవత్వం. సాటి మనుషుల ఆకలి తీర్చడం దైవత్వం.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరా ద్వారా మీరేం తెలుసుకున్నారు?
జవాబు:
సాటి మనుషుల ఆకలి తీర్చాలి అని తెలుసుకొన్నాం.

ప్రశ్న 2.
మానవత్వంతో చేసే పనులు ఏవి?
జవాబు:
మన దగ్గరున్న సంపదను ఇతరులకు పంచడం మానవత్వం. అనాథలను, అభాగ్యులను, పేదలను ఆదుకోవడం
మానవత్వంతో చేసేపని.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 3.
సహాయపడే గుణం, మానవత్వం కలిగిన వారి వల్ల సమాజానికి కలిగే మేలు ఏమిటి?
జవాబు:
సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా సహాయపడతారు. వారి వలన బలహీనులు రక్షించబడతారు. అందరికీ మేలు
జరుగుతుంది. సమాజంలో శాంతి నెలకొంటుంది. ఎంతోమంది జీవితాలలో వారు వెలుగులు నింపుతారు.

ప్రశ్న 4.
మీరు ఇతరులకు ఎప్పుడైనా సాయం చేశారా? ఎప్పుడు? ఎందుకు?
జవాబు:
నేను, ఇతరులకు చాలాసార్లు సాయం చేశాను. ఒకసారి మా స్నేహితుడు టిఫిను చేయకుండా పాఠశాలకు వచ్చాడు. కళ్ళు తిరుగుతున్నాయని చెప్పాడు. వెంటనే మాష్టారికి చెప్పాను. వెంటనే మాష్టారు బిస్కెట్లు, టీ తెప్పించి ఇచ్చారు. నీరసం తగ్గింది.
(గమనిక : తరగతిలోని ప్రతి విద్యార్థి తన అనుభవాన్ని చెప్పాలి.)

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
“గోరంత దీపాలు” అనే శీర్షిక ఈ పాఠానికి తగిన విధంగా ఉందా? ఎందుకు? సకారణంగా చర్చించండి.
జవాబు:
(గమనిక : విద్యార్థి తనకు శీర్షిక నచ్చితే నచ్చిందని సకారణంగా నిరూపించవచ్చును. నచ్చకపోతే ‘శీర్షిక తగదు’ అని సకారణంగా నిరూపించవచ్చును. రెండు అభిప్రాయాలను ఇస్తున్నాం. ఒక దానిని మాత్రమే గ్రహించండి.)

1) శీర్షిక తగినదే :
గోరంత దీపాలు పాఠంలో అనాథ శిశువులను వృద్దుడు చేరదీసి వారి జీవితాలను ఆనందమయం చేస్తున్నాడు. చాలామంది బాలబాలికలు ఆయన వద్ద ఆశ్రయం పొందుతున్నారు. వారందరు ఆయన ప్రేమాప్యాయతలతో పాటు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఆ పిల్లలంతా అనాథలే ? రైలు పెట్టెలు శుభ్రం చేసేవారు కొందరు, యాచన, చిన్న చిన్న దొంగతనాలు చేసిన వారు కూడా ఆ పిల్లల్లో ఉంటారు. వాళ్ళు ఈ విశాల ప్రపంచంలో దిక్కుమొక్కు లేక బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతుంటే చేరదీసి అక్కున చేర్చుకున్నాడా వృద్ధుడు. ఆ పసి పిల్లలందరు చిఱుగాలికి రెపరెపలాడే గోరంత దీపాల్లాంటివారు. ఆ గోరంత దీపాలకు కొండంత అండగా నిలబడ్డాడు వృద్ధుడు. వారికి ఆశ్రయం కల్పించి తీర్చిదిద్దుతున్నాడు వృద్ధుడు. ఈ కథలోని వృద్ధుడు చదువుతున్న వారపత్రికలోని కథ కూడా అనాథబాలుని కథే. అందుచేత ఈ పాఠానికి గోరంత దీపాలనే శీర్షిక తగిన విధంగా ఉంది.

2) శీర్షిక తగినది కాదు :
గోరంత దీపాలు పాఠంలో అనాథబాలలు కంటే వృద్ధుని ఔదార్యం ప్రధానమైనది. ఆ వృద్ధుని ఔదార్యాన్ని పదిమంది ఆదర్శంగా స్వీకరించాలి. ఈ శీర్షికలలో వృద్ధుని ఔదార్యం ఎక్కడా ధ్వనించదు. శీర్షిక ఎప్పుడు అంశంలోని ప్రధాన విషయాన్ని ధ్వనించేదిగా ఉండాలి. గోరంత దీపాలు అనేది అనాథ బాలల దీనస్థితిని తెలియజేస్తోంది తప్ప ఇక దేనిని తెలియచేయటం లేదు. అంతేకాక ఆ గోరంతదీపాలకే కొండంత అండగా నిలబడి తీర్చిదిద్దిన త్యాగమూర్తిని పట్టించుకోలేదు. పెరిగి పెద్దయ్యాక ఆ గోరంత దీపాలే ఆ వృద్ధుని పాదాలకు కృతజ్ఞతతో కన్నీటి అభిషేకాలు చేసారు. ఇంతటి మహోన్నతమైన త్యాగనిరతిని బాధ్యతను, మానవత్వాన్ని, శీర్షిక విస్మరించడం విజ్ఞులను ఆశ్చర్యపరుస్తుంది. శీర్షికను చూచిన మరుక్షణం ఉత్తేజం కలగాలి. కథలోని ఆశయం తెలియాలి. దీనికి మానవత్వపు పరిమళం అనే శీర్షిక పెట్టి ఉంటే సార్థకత చేకూరి ఉండేది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 2.
పాఠం చదవండి. “వేపచెట్టు” గురించి వివరించిన, వర్ణించిన వాక్యాలు ఏమేమి ఉన్నాయి? వాటిని గుర్తించి చదవండి.
జవాబు:
పాఠ్యాంశం మొదటి ఐదు వాక్యాలు వేపచెట్టుని వర్ణించాయి. వేపచెట్టును తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే చెట్టుగా వర్ణించారు. ఆ చెట్ల కొమ్మలను దరిద్రుడి గుండెల్లో నుండి పుట్టిన అంతులేని ఆశల్లా అభివర్ణించారు. నాలుగు కొమ్మలు నాలుగు దిక్కుల్లా బాగా విస్తరించాయని చెప్పారు. కలిగిన వాడికి బాగా కండపట్టినట్లు ఆ కొమ్మలు పూతా పిందెలతో నిండుగా ఉన్నాయని వర్ణించారు.

మధ్యలో ఎక్కడా వేపచెట్టు వర్ణన లేదు. చివరి నుండి రెండవ పేరాలో వేపచెట్టు వర్ణన ఉంది. అది ఆ వృద్ధుడు వచ్చిన మనిషితో వేపచెట్టు గురించి చెప్పాడు. వేపచెట్టు అనగానే చేదు అనే భావన మనసులో మొదలవుతుంది. కానీ వేపచెట్టుని ఆశ్రయిస్తే చల్లని నీడ నిస్తుంది.

కనీసం ప్రతీరోజు ఒక వేపకాయని నమిలిన అనేక దీర్ఘరోగాలు తగ్గుతాయి. వేపపుల్లతో పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు, నోటి జబ్బులు రావు. (పిప్పిపళ్ళు) (పుచ్చుపళ్ళు) ఉండవు.

ప్రశ్న 3.
పాఠంలోని కింది పేరాలు చదవండి. ఆ పేరాలలో వేటి గురించి వివరించారో తెల్పండి. ఆ పేరాల్లోని వివరణ/వర్ణనకు సంబంధించిన కీలక పదాలను రాయండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు 1

ప్రశ్న 4.
క్రింది వాక్యాలు చదవండి. ఎవరు, ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు?

అ) అవును బాబూ ! నిజంగా అతడు అదృష్టవంతుడే!
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని ఎప్పుడు వచ్చావని వృద్ధుడు అడిగితే అదృష్టవంతుడికి (వృద్ధుడికి) కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు అని అతను చెప్పిన సందర్భంలో తన పాదాలను కన్నీటితో అభిషేకం చేసిన వ్యక్తి నిజంగా అదృష్టవంతుడని చెప్తున్న సందర్భంలోని వాక్యమిది.

భావం:
వృద్ధుని ఆశ్రయంలో చక్కగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడిన అనాథ చాలా అదృష్టవంతుడు అని వృద్ధుని భావం.

ఆ). “పెట్టమన్న చోటల్లా కండ్లు మూసుకొని సంతకాలు పెడుతున్నాను. అనాథలయిన పిల్లలు, వాళ్ళ అధోగతికి దారితీస్తే పుట్టగతులుండవు” ఇది మాత్రం మనసులో పెట్టుకోండి !”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
తన గుమాస్తా తెచ్చిన చిట్టా పుస్తకంలో వృద్ధుడు సంతకాలు పెడుతూ, అతనితో మాట్లాడిన మాటలివి.

భావం:
అనాథ బాలల ఆశ్రమ చిట్టా పుస్తకాలలో వృద్ధుడు పరిశీలించకుండా సంతకాలు పెడుతున్నాడు. ఆ అనాథ పిల్లలకు సంబంధించిన ఖర్చులు దానిలో ఉంటాయి. ఆ లెక్కలలో తేడాపాడాలుంటే మహాపాపం. అందుచేత పాపభీతితో పనిచేయాలి అని వృద్ధుని మాటల సారాంశం.

ఇ) “అదృష్టవంతుడికి కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు!”
జవాబు:
పరిచయం:
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
కథా రచయితను వృద్ధుడు ఎప్పుడు వచ్చావు బాబు, అని అడిగినపుడు రచయిత చెప్పిన సమాధానమిది.

భావం:
అనాథను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించి అతని జీవితంలో కొండంత వెలుగును నింపి అతని కృతజ్ఞతకు పాత్రుడైన వృద్ధునికి అతడు కన్నీటితో నమస్కరించాడు అని భావం.

ఈ) “మీరెక్కడున్నా, నేనెక్కడున్నా తమ పాదాలకు ప్రణమిల్లే అవకాశాన్ని మహా అదృష్టంగా భావిస్తాను”.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
వృద్ధుని ఆశ్రయంలో చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొన్న వ్యక్తి బదిలీపై వేరే ఊరికి వెళుతూ 3 . వృద్ధుని పాదాలకు నమస్కరించి కృతజ్ఞతతో పలికిన వాక్యమిది.

భావం:
వృద్ధుడంటే ఆ వ్యక్తికి దైవంతో సమానం అని భావం.

ఉ) “అవి గోరంత దీపాలే కావచ్చు. ఏనాటికో ఒక నాటికి, అవి కొండంత వెలుగునిస్తాయి”.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
కథకుని ప్రశ్నకు సమాధానంగా వృద్ధుడు పలికిన వాక్యమిది. అనాథలను, వీథి బాలలను, కొడిగట్టిన దీపాలతో, వేపచెట్టుతో పోల్చి చెప్పుచున్న సందర్భములోని వాక్యమిది.

భావం:
అనాథలైన బాలలు గోరంత దీపాల వంటివారు. వారిని ఆదరించి కాపాడితే ఉన్నతులై కొండంత వెలుగును ఇస్తారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 5.
పేరా చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

బతకడానికి ఉద్యోగం వెతుక్కుంటారు కొందరు. జీవితానికి అర్థం వెతుక్కుంటారు మరికొందరు ….. లక్ష్మీకాంతం రెండో కోవకు చెందుతారు. ఒక బిడ్డ కన్నీరు తుడవడమే భాగ్యం. ఒక బిడ్డకు తల్లి కావడం ఇంకా భాగ్యం. అలాంటిది లక్ష్మీకాంతం అరవై ఎనిమిది మంది అనాథలకు అమ్మలా మారారు. వాళ్ళకు కంటిపాప అయ్యారు. పైపైన చేస్తే ఉద్యోగం అవుతుంది. హృదయంలో నుంచి చేస్తే మానవత్వం అవుతుంది. లక్ష్మీకాంతం మానవీయ మూర్తి. వీధి బాలలుగా ముద్రపడిన అనాథలకు విశాఖ వాకిట నేడొక అమృతహస్తం దొరికింది. కన్నతల్లి ఒడి దక్కినట్టయింది. వీళ్ళ జీవితాలకు అండగా నేనుంటానంటూ పోడూరి లక్ష్మీకాంతం ముందుకు వచ్చింది. మాటలు కాదు – గత పదేళ్ళుగా ఆప్యాయతానురాగాలను చేతల్లో చూపుతోంది. అరవై ఎనిమిది మంది వీధి బాలల (స్ట్రీట్ చిల్డ్రన్) కు అమ్మగా
అవతరించింది. కన్నబిడ్డల కంటే వీధి బాలలనే ఎక్కువగా చూసుకుంది.
ప్రశ్నలు:
అ) పై పేరా దేని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
పోడూరి లక్ష్మీకాంతం గారి ఔదార్యం గురించి తెలియజేస్తోంది. అనాథ బాలలను ఆమె ఆదుకొంటున్న విధానం గూర్చి తెలియజేస్తోంది.

ఆ) పై పేరాలోని కీలకపదాలను ఏరి రాయండి.
జవాబు:
(గమనిక : కీలకపదాలు అంటే ముఖ్యమైన పదాలు. పేరాలోని విషయం సూటిగా తెలియజేసే పదాలు అని గ్రహించండి.)
ఉద్యోగం వెతుక్కోవడం, అర్థం వెతుక్కోవడం, రెండో కోవ, కన్నీరు తుడవడం, తల్లి కావడం, అనాథ, కంటి పాప, మానవత్వం, మానవీయమూర్తి, వీధి బాలలు, ముద్రపడడం, అమృతహస్తం, తల్లి ఒడి, అండ, ఆప్యాయతానురాగాలు, అవతరించడం, కన్నబిడ్డలు.

ఇ) ‘అమృతహస్తం’ అనే పదానికి అర్థమేమిటి?
జవాబు:
‘అమృతం’ బాధలను రూపుమాపుతుంది. అలాగే అమృతం లాంటి చెయ్యిగల వారు అంటే పదిమందికి సహాయం చేసేవారు అని అర్థం. ఇతరుల కష్టాలను నివారించి, ఆదుకొనే వారని అర్థం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 6.
పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) వృద్ధుడి వద్దకు వచ్చిన కుర్రాడు ప్రవర్తించిన తీరు ఎలా ఉంది? రచయిత అతని ప్రవర్తనను ఏఏ వాక్యాలతో వివరించాడు.
జవాబు:
వృద్ధుని వద్దకు వచ్చిన కుర్రవాడు నిలబడి ఉన్నాడు. అతను నిలబడటంలో వినయం ఉట్టిపడుతోంది. అతని వేషంలో సంస్కారం ఉంది. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.

ఆ కుర్రవాడు వినయానికి మారుపేరుగా ఉన్నాడు. సంస్కారవంతంగా ప్రవర్తించాడు. వృద్ధుడు ఆశీర్వదిస్తుంటే కృతజ్ఞతా భావంతో ఉన్నాడు. అతనికి ఆనంద భాష్పాలు వచ్చాయి. వృద్ధుని పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. పైకి లేచి మళ్ళీ నమస్కరించాడు. అలా నమస్కరిస్తూనే నాలుగు అడుగులు వెనక్కు వేసి, శిరసువంచి నమస్కరించి హుందాగా వెళ్ళి పోయాడు. ఈ ప్రవర్తనను బట్టి ఆ కుర్రవాడు కృతజ్ఞత కలవాడని తెలుస్తోంది. ఆదర్శవంతమైన ప్రవర్తన కలవాడు. ఉపకారం పొందినవారెవరయినా, ఉపకారం చేసిన వారి పట్ల ఎలా ప్రవర్తించాలో ఆ కుర్రవాని ప్రవర్తన బట్టి తెలుసుకోవచ్చును.

రచయిత అతని ప్రవర్తనను చక్కటి పదాలతో భావస్పూరకంగా వర్ణించాడు. ఆ కుర్రవాడు నిలబడి ఉండడంలో వినయం ఉట్టిపడుతూ ఉంది. వేషంలో సంస్కారం ఉంది. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంది అని వర్ణించాడు. అతని కనుకొలుకుల్లో నిలచిన నీళ్ళు సంజెవెలుగులో ముత్యాలలా మెరుస్తున్నాయి. అనిర్వచనీయమైన కృతజ్ఞతాభావం అతని ముఖంలో దోబూచులాడుతూ ఉంది. ఆనందానుభూతిలో తడుస్తూ మూగబోయాడు. తనివితీరనట్లు మళ్ళీ ఒకసారి ఆ కుర్రవాడు అతని పాదాలను ఒడిసిపట్టుకున్నాడు. పాదాల మీద తలను ఆనించాడు. కన్నీటితోనే అతని పాదాలను కడుగుతున్నాడేమో అనే వాక్యాలతో అతని ప్రవర్తనను వివరించాడు.

కన్నీటితో నిండిన కండ్లను జేబురుమాలుతో వత్తుకున్నాడు. మళ్ళీ ఒకసారి రెండు చేతులు జోడించాడు. జోడించిన చేతులు జోడించుకున్నట్లే ఉంచుకుని అలాగే నాలుగు అడుగులు వెనక్కు వేశాడు. అక్కడ నిలబడి మళ్ళీ ఒకసారి శిరస్సు వంచి నమస్కరించాడు. గిరుక్కున వెనక్కు తిరిగి హుందాగా ముందుకు సాగిపోతున్నాడనే వాక్యాలతో అతని ప్రవర్తనను వర్ణించాడు.

ఆ) విద్యానగరం ఒక విద్యాలయం కదా! దాని ఆవరణ, వాతావరణం ఎలా ఉంది?
జవాబు:
విద్యానగరం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. అది దాదాపు రెండు, మూడు చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉంది. అక్కడ ఒక వేపచెట్టు, అంత కంటే పెద్దవైన రావి చెట్లున్నాయి. మట్టిమానులున్నాయి. జువ్వి చెట్లున్నాయి. రకరకాల పూల మొక్కలున్నాయి. కూరల తోటలున్నాయి. పాలపిట్టలు పరవశంగా పాడుకొంటుంటాయి.

ఆ ఆవరణలో బాలబాలికలకు వసతి గృహాలున్నాయి. అతిథులకు ప్రత్యేక సదుపాయాలతో గదులున్నాయి. వయోవృద్ధులకు వసతులు ఉన్నాయి. గ్రంథాలయం ఉంది. సాయంసమయాలలో పూజకు ప్రార్థనాలయం ఉంది. వేలాది మంది అనాథలు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని వందలమంది ఉపాధ్యాయులు ఆ అనాథలకు విద్య నేర్పుతున్నారు.

ఇ) వృద్దుడు చేస్తున్న సేవాకార్యక్రమం గురించి లోకం ఏమనుకునేది ? దానికి వృద్ధుడి ప్రతిస్పందన ఎలా ఉంది?
జవాబు:
పరులకు సేవ చేస్తున్నాననే పేరుతో స్వార్థం పెంచుకొన్న మనిషిగా వృద్ధుడిని లోకం నిందించింది, నోరు లేని పిల్లలకు అర్థాకలిగా అన్నం పెడుతున్నాడు. వాళ్ళ నోళ్ళు కొడుతున్నాడని కూడా ఆడిపోసుకొంది.

అయినా వృద్దుడు పట్టించుకోలేదు. పుండు మీద మాత్రమే కారం చల్లినా, ఉప్పు చల్లినా మంట పుడుతుంది. పుండ్లులేని దేహానికి మండదు కదా ! అలాగే తప్పు చేస్తుంటే లోకం అనే మాటలకు బాధపడాలి. తన తప్పేమీలేనపుడు ఆ మాటలు గాలిలో కలిసి పోతాయి. కాబట్టి లోకానికి భయపడి, మంచి లక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు. అలా విడిచి పెడితే అది చేతగానితనమే అవుతుంది.

ఈ) వారపత్రికలో చదివిన కథ ఏమిటి?
జవాబు:
వృద్ధుడు చదివిన కథలో దొరైరాజ్ పదేండ్ల కుర్రవాడు. అతడు రైలు పెట్టెలు తుడుస్తాడు. ప్రయాణీకులు దయతలచి ఇచ్చిన డబ్బులతో జీవితం గడుపుతాడు. ఇచ్చిన వారికి నమస్కారం చేస్తాడు. ఇవ్వకపోతే పట్టించుకోడు. అలాగే ఒక వ్యక్తి ముందు చేయి ఊపుతాడు. ఆ వ్యక్తి, దొరైరాజ్ ను ఆప్యాయంగా దగ్గరికి పిలుస్తాడు. పేరు అడుగుతాడు. నిర్లక్ష్యంగా తన పేరు చెబుతాడు దొరైరాజ్, చేతిలో చిల్లర పైసల్ని ఎగరేసుకొంటూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్న దొరైరాజ్ న్ను చూసి, ఆలోచనలో పడతాడు ఆ వ్యక్తి. ఇది ఆ కథ, అంటే జీవితం గడవక పోయినా, గడిచినా ఎవరి ధోరణి వారిది. ఎవ్వరూ తమ ధోరణిని మార్చుకోరు. ఆప్యాయతలు, అనురాగాలతో పనిలేదు. తమ నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టరు. అలాగ అనాథలైన పిల్లలను చేరదీయాలి. వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని ఉన్నా ఆ అనాథలు రావాలి కదా! మారాలి కదా ! అవకాశాలు వినియోగించుకోవాలి కదా !

ఉ) రైలు పెట్టెలో ఊడుస్తున్న బాలుడి గురించి వృద్ధుడు ఏం చేశాడు?
జవాబు:
రైలు పెట్టెలో ఊడుస్తున్న బాలుడిని పరీక్షించాలనుకొన్నాడు. నిద్రపోతున్నట్లు నటించాడు. ఆ పిల్లవానిని గమనించాడు. పనిలో శ్రద్ధను పరిశీలించాడు. ఆనందించాడు. ఐదు రూపాయిల కాగితం జారవిడిచాడు. దానిని ఆ కుర్రవాడు ఆ కాగితాన్ని తీసి, వృద్ధుని లేపి ఇచ్చేశాడు. అతని నిజాయితీ వృదుని ఆనంద సంభ్రమాలలో ముంచింది. ఒక పావలా ఇచ్చాడు. ఆ కుర్రవాడు అది అందుకొని, నమస్కరించాడు. తర్వాత తన పనిలో లీనమయ్యాడు. తర్వాత ఆ పిల్లవానిని పిలిచి, కుశలప్రశ్నలు వేశాడు. తనతో రమ్మన్నాడు. ఆలనాపాలనా చూశాడు. చదువు చెప్పించాడు. పెళ్ళి చేశాడు. ఉద్యోగం వచ్చింది. వాడు జీవితంలో స్థిరపడ్డాడు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “గోరంత దీపం” కథానిక ద్వారా మీరు గ్రహించిన ముఖ్యమైన ఐదు విషయాలు రాయండి.
జవాబు:
గోరంత దీపం కథానికలో వృద్ధుని ద్వారా అనాథలను అక్కున చేర్చుకొని, ఆదుకోవాలి అని తెలుసుకొన్నాము. ఆదుకొంటే ఆ గోరంత దీపాలే సమాజానికి కొండంత వెలుగునిస్తాయి అని తెలుసుకొన్నాము. కుర్రవాని పాత్ర ద్వారా, నిజాయితీతో, నిబద్ధతతో పనిచేయాలి అని తెలుసుకొన్నాం. మనకు ఉపకారం చేసిన వారిపట్ల కృతజ్ఞతతో ఉండాలి అని తెలుసుకొన్నాం. పెద్దలతో స్నేహంగా ఉండాలి. వారి అనుభవాలను వినాలి, వారు చెప్పే విషయాలు విని, ఆచరిస్తే జీవితంలో ఉన్నతులుగా గుర్తించబడతామని తెలుసుకొన్నాం, వేపచెట్టులోని ఔషధ గుణాలు కూడా తెలిసాయి.

ఆ) “ఆ కుర్రవాడి బతుకుమీద కూడా ఓ ప్రయత్నం చేయాలని సంకల్పించాను.” అన్న వృద్ధుడు ఏం ప్రయత్నం చేశాడు? దాని ఫలితం ఎలా ఉంది?
జవాబు:
వృద్ధుడు రైలు పెట్టెలోని అనాథబాలుని గమనించాడు. అతనికి పనిపై ఉన్న శ్రద్ధను గమనించాడు. తను చదివిన కథ దీనికి బలం చేకూర్చింది, ఆ పిల్లవాడి నిజాయితీ పరీక్షించాలనుకొన్నాడు. ఐదు రూపాయిలనోటు జారవిడిచి, నిద్రపోతున్నట్లు నటించాడు. ఆ కుర్రవాడు ఆ నోటును తీసి, వృద్ధుని నిద్రలేపి ఇచ్చేశాడు. కుర్రవాడికి ఒక పావలా ఇచ్చాడు. నమస్కరించి, తనపనిలో లీనమయ్యాడు కుర్రవాడు.
అతనికి ఉన్న పనిపట్ల శ్రద్ధ, కష్టపడే స్వభావం, నిజాయితీ వృద్ధునికి నచ్చాయి, చేరదీసి చదివించాడు. కష్టపడి చదువుకొన్నాడు. మంచి ఉద్యోగి అయ్యాడు. ఆ బాలుడి జీవితం స్థిరపడింది. వృద్ధుని ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది.

ఇ) “బాబూ! ఈ వయస్సులో చదువుకొంటే, ఆ వయస్సులో సంపాదించుకోవచ్చు”ఈ వాక్యం గురించి మీ అభిప్రాయాల్ని రాయండి.
జవాబు:
ఎవరైనా చిన్నతనంలో చదువుకోవాలి. బాల్యం జీవితానికి పునాది వంటిది. బాల్యంలోని ప్రవర్తనను బట్టి ఆ మనిషి
జీవితం ఉంటుంది. బాల్యంలో బాగా చదువుకొంటే, మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు. డబ్బు సంపాదించుకొని జీవిత మంతా సుఖపడవచ్చును. 100 సంవత్సరాల జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుకొంటే మిగిలిన 80 సంవత్సరాలూ సుఖపడవచ్చు. మొదటి ఇరవై సంవత్సరాలు చదువుకోకుండా, డబ్బులు సంపాదించుకొంటూ సుఖపడితే, మిగిలిన 80 సంవత్సరాలూ కష్టపడాలి. అందుకే ‘పిల్లలు బడికి – పెద్దలు పనికి’, ‘పనికెందుకు తొందర ? చదువుకో
ముందర’ అని ప్రభుత్వం నినాదిస్తోంది.

ఈ) ‘ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకాలే మన నేస్తాలు’ అనే వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జవాబు:
ఒంటరిగా ఉన్నప్పుడు తప్పని సరిగా పుస్తకాలే మన నేస్తాలు అనే వాక్యంతో ఎవరైనా ఏకీభవించాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. వాటిలో చెడు ఆలోచనలు కూడా రావచ్చును. ఏదైనా పుస్తకం చదువుకొంటే అటువంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉండదు. సమయం కూడా తెలియదు. జ్ఞానం పెంపొందుతుంది. పుస్తకాలలో కూడా మంచి ఉన్నత విలువలతో కూడిన వాటిని మాత్రమే చదవాలి. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఒంటరితనం మరచిపోతాం. “ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం” అని ఆర్యోక్తి. అందుచేత పుస్తకాలే మన నేస్తాలుగా చేసుకొంటే, ప్రపంచమంతా మన కుటుంబమవుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) “గోరంతదీపాలు” కథానికలోని వృద్ధుని పాత్ర స్వభావాన్ని, గొప్పదనాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
గమనిక :
ఏ పాత్ర స్వభావం రాయాలన్నా కథలోని ఆ పాత్ర ప్రవర్తన, మాటల తీరును గమనించాలి. ఆ విషయాన్నే సొంతమాటలలో రాయాలి.

వృద్ధుడు :
నేస్తాలు లేనపుడు పుస్తకాలే మన నేస్తాలని భావించే స్వభావం కలవాడు. కేవలం పుస్తకాలలో చదవడమే కాకుండా వాటిని నిజ జీవితంలో ఆచరణలో పెట్టే స్వభావం కలవాడు. పరోపకారి. ముఖ్యంగా అనాథలను, వృద్ధులను ఆదరిస్తాడు, అతిథులను గౌరవిస్తాడు. వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తాడు. దైవభక్తి కలవాడు, నీతి నిజాయితీలు కలవారిని, నిబద్ధతతో, శ్రద్ధతో పనిచేసే వారిని ఇష్టపడతాడు. పచ్చటి ప్రకృతిలో జీవించడమంటే ఇష్టపడతాడు.

గొప్పతనం :
ఒక అనాథను పరీక్షించాడు. అతని నీతి నిజాయితీలను తెలుసుకొన్నాడు, పనిపట్ల శ్రద్ధను గమనించాడు, చదివించాడు. పెళ్ళి చేశాడు. ఉద్యోగం వచ్చింది. అతను స్థిరపడ్డాడు. అనాథలోని మంచి గుణాలను గుర్తించి, తీర్చిదిద్దిన మహోన్నతుడు, ఒక్కడినే కాదు వేలాది మంది బాలబాలికలను తీర్చిదిద్దాడు. వందల మంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించిన మహానుభావుడు వృద్ధుడు.

ఆ) వృద్ధుడు, ప్రయోజకుడైన యువకుని మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? వారి మధ్య ఉన్న సంబంధాన్ని, అనురాగాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
(లేదా)
‘గోరంతదీపం’ కథానిక ద్వారా వృద్ధుడు, ప్రయోజకుడైన యువకుని మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో విశ్లేషిస్తూ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
వృద్ధునికి, యువకునికి మధ్య ఉన్న సంబంధం తల్లీ పిల్లల అనుబంధం కంటె గొప్పది. తండ్రీ తనయుల సంబంధం కంటే మిన్న, భగవంతునికి భక్తునికీ మధ్య ఉన్న సంబంధం వంటిది అని చెప్పవచ్చును. ఇద్దరు సత్పురుషుల మధ్య సంబంధం ఏర్పడితే అలాగే ఉంటుంది.

ప్రయోజకుడైన యువకుడు వృద్ధుని వద్ద నిలబడిన తీరు, అతని వేషం గమనిస్తే ఇది బోధపడుతుంది. భగవంతుడు ప్రత్యక్షమైతే, భక్తుడు ఎంత పరవశిస్తాడో అంతగా పరవశించాడు వృద్ధుని చూసిన యువకుడు. ఆ వృద్ధుని పాదాలకు కన్నీటితో అభిషేకం చేసిన తీరును గమనిస్తే అతనికి గల గౌరవభావన తెలుస్తుంది. అతనిని ఆశీర్వదిస్తున్న వృద్ధుని కళ్ళలోని ఆనందభాష్పాలు చూస్తే అతని పట్ల గల వాత్సల్యం తెలుస్తుంది. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వృద్ధుడికి తనకంటే కూడా ఆ కుర్రవాడంటేనే ఇష్టం. అలాగే ఆ కుర్రవానికీ, వారిద్దరి అనురాగాన్ని గమనిస్తే ఒకే ప్రాణం రెండు శరీరాలలో ఉందేమో అనిపిస్తుంది.

ఇద్దరూ అదృష్టవంతులే. అనాథ కుర్రవాడు అదృష్టవంతుడు కనుకనే వృద్ధుడు రైలు పెట్టెలో కనిపించాడు. చేరదీశాడు, ఆలనాపాలనా చూశాడు, చదువు చెప్పించాడు, పెండ్లి చేశాడు. ఉద్యోగం సంపాదించుకొందుకు దారి చూపాడు. ఎటో పోవలసిన జీవితం గౌరవంగా స్థిరపడింది.

వృద్ధుడు కూడా అదృష్టవంతుడే తన అంచనా తప్పు కాలేదు. తను పడిన శ్రమ ఫలించింది. అతని జీవితం బాగుపడింది. ప్రయోజకుడయ్యాక కూడా తనపట్ల కృతజ్ఞతతో ఉన్నాడు. జీవితాంతం ఉంటాడు. అటువంటి భక్తిప్రపత్తులు కలవాడు దొరకడం వృద్ధుని అదృష్టం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) ‘విద్యాలయం’ ఆవరణ ఎలా ఉందో పాఠంలో వర్ణించిన విధానం చదివారు కదా! దీని ఆధారంగా, మీరు మీ పాఠశాల గురించి లేదా ఒక పర్యాటక క్షేత్రాన్ని గురించి వర్ణించి రాయండి.
జవాబు:
పాఠశాల : మా పాఠశాల చాలా బాగుంటుంది. మా పాఠశాల సరస్వతీ మాత నిలయం. మా పాఠశాల ఆవరణచుట్టూ పచ్చటి చెట్లతో నిండి ఉంటుంది. పూల మొక్కలు వరుసలలో ఉంటాయి. క్రోటన్సు మొక్కలు పూల మొక్కలకు రక్షక భటులుగా ఉంటాయి. రకరకాల పళ్ళనిచ్చే చెట్లు కూడా ఉన్నాయి. దానిమ్మ, జామ, కమలా, బత్తాయి చెట్లు ఉన్నాయి. అరటి చెట్లు కూడా ఉన్నాయి.

మా పాఠశాలలో 20 తరగతి గదులున్నాయి. అన్ని గదులూ అందంగా అలకరించి ఉంటాయి. మచ్చుకైనా ఎక్కడా చెత్త కనబడదు. తరగతి గదులలోని గోడలకు పిల్లలు వేసిన బొమ్మల చార్టులు, కవితలు, కథల చార్టులు ఉంటాయి. మా పాఠశాల గోడ పత్రికలలో రోజూ ఏవేవో కథలూ, కవితలూ, కార్టూన్లూ, సూక్తులూ వచ్చి చేరుతుంటాయి. మా ఉపాధ్యాయులు జ్ఞాన జ్యోతులు. చిరునవ్వుతో పాఠాలు చెబుతారు. కథలు కూడా చెబుతారు. ఎన్నో మంచి విషయాలు చెబుతారు. మమ్మల్ని చెప్పమంటారు. ఆలోచించమంటారు.

మా పాఠశాల ఆటస్థలం 500 చదరపు గజాలు ఉంటుంది. అన్ని రకాల ఆటలు ఆడతాము. అనేకమైన ఆట వస్తువులు ఉన్నాయి. పెద్ద గ్రంథాలయం కూడా ఉంది. 6 బీరువాల పుస్తకాలు ఉన్నాయి. నాకు మా పాఠశాల అంటే చాలా ఇష్టం.

పర్యాటక క్షేత్రం :
తిరుపతి మంచి పర్యాటక క్షేత్రం. ఎంతో మంది భక్తులు రోజూ తిరుమలకు వస్తారు. తిరుమల కొండ నడిచి ఎక్కేటపుడు చాలా బాగుంటుంది. ఎంత దూరం నడిచినా తరగదు. కొండదారి, చుట్టూ అడవి. జింకలు కనబడతాయి. అవి భలే గంతులువేస్తూ పరుగెడతాయి. మోకాటి పర్వతం మెట్లు నిట్టనిలువుగా ఉంటాయి. ఆకాశంలో చందమామలాగా ఎక్కడో పైన గోవిందనామాలు కనిపిస్తుంటాయి. చుట్టూ అడవులలో దట్టమైన పొదలు, పెద్ద పెద్ద చెట్లు, తీగలు కనిపిస్తాయి. మా సైన్సు టీచర్లనడిగి వాటి పేర్లు, లక్షణాలు తెలుసుకొన్నాం. గుడిలోకి వెడితే శ్రమంతా మరచిపోతాం. అంత ప్రశాంతత. నాకైతే తిరుమల అంటే చాలా ఇష్టం. సువర్ణ ముఖీ నదిలో స్నానం చాలా బాగుంటుంది.
(గమనిక : విద్యార్థులు ఏ క్షేత్రాన్నినా వర్ణించవచ్చు. )

అ) పాఠంలో “దాదాపు రెండు, మూడు ……… పరవశంతో పాడుతున్నారు” పేరా చదవండి. దీనికి సంబంధించిన చిత్రం ీయండి. రంగులు వేయండి. కవిత రాయండి.
జవాబు:
(గమనిక : డ్రాయింగు మాష్టారు వద్ద చిత్రం నేర్చుకొని గీయాలి. రంగులు వేయాలి.)
కవిత :
విస్తీర్ణం చూడండి రెండు, మూడు చదరపు మైళ్ళూ
వేపచెట్టు, రావిచెట్లు, జవ్విచెట్లు, మర్రిచెట్లి పిట్టల లోగిళ్ళూ
పూల బాల పాదులలో కిలకిల లాడాలి
కూరల సుకుమారం తోటలలో కలకలలాడాలి.
సంజవెలుగు కెంజాయకు బంగారం తళతళలూ
అనుభూతుల హృదయాలకు అనురాగపు స్నానాలూ
నక్కినక్కి చక్కనైన చిలకమ్మా, కోకిలమ్మా
పాలపిట్ట, పరవశించి పాటలందుకొన్నాయి.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా కథల పుస్తకం నుంచి గాని లేదా ఏదైనా పత్రిక నుంచి గాని సామాజిక సేవ, మానవ సంబంధాలు, గురుశిష్య సంబంధం మొదలైన విషయాలకు సంబంధించిన మంచి కథను చదివి ఎంపిక చేయండి. దాన్ని రాసి ప్రదర్శించండి. అది మీకు ఎందుకు నచ్చిందో, దాంట్లోని గొప్పతనమేమిటో నివేదిక రాయండి.
జవాబు:
(గమనిక : కనీసం 10 వాక్యాలలో రాస్తే చాలును)

III. భాషాంశాలు

పదజాలం

1) ఈ కింద ఇచ్చిన రెండేసి పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.

అ) వినయం – విధేయత
జవాబు:
సొంతవాక్యం : వినయం – విధేయత నేర్పని చదువుల వలన ప్రయోజనం లేదు.

ఆ) రాజు – మకుటం
జవాబు:
సొంతవాక్యం : ధరణికి వెలుగు రాజు – మకుటం కాంతిని బట్టి ఉంటుంది.

ఇ) ప్రదేశం – ప్రశాంతత
జవాబు:
సొంతవాక్యం : నివాస ప్రదేశం – ప్రశాంతత కలిగినదైతే అన్ని సౌఖ్యాలూ ఉన్నట్లే.

ఈ) గుడిసె – దీపం
జవాబు:
సొంతవాక్యం : కనీసం గుడిసె – దీపం లేని బతుకులెన్నో దేశంలో ఉన్నాయి.

ఉ) ప్రయాణం – సౌకర్యం
జవాబు:
సొంతవాక్యం : ఈ రోజులలో ప్రయాణం – సౌకర్యంలేని ఊరులేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : సంజవెలుగులో తటాకంలోని నీరు కొత్త అందం సంతరించుకుంది.
సంజవెలుగు = సంధ్యా సమయంలో వెలువడే కాంతి.

అ) నా పుట్టిన రోజున మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకున్నాను.
జవాబు:
ఆశీర్వాదం : దీవెన

ఆ) రాజు ప్రకృతి అందాల్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు.
జవాబు:
తదేకంగా = అది ఒకటే (పని) అన్నట్లుగా

ఇ) శివ పుస్తకాలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు.
జవాబు:
కాలక్షేపం – సమయం గడపడం

ఈ) రాణి ముఖం నిండా పసుపు పులుముకుంది.
జవాబు:
పులుము = పూసు

ఉ) లత పాఠాన్ని చక్కగా ఆకళింపు చేసుకొంది.
జవాబు:
ఆకళింపు. – అవగాహన

3. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) రాజు – ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు
ఆ) సమయం – బుద్ధి, సంకేతము, ప్రతిజ్ఞ
ఇ) కృషి – స్త్రీ, సేద్యము, కరిసనము
ఈ) కన్ను ‘ – ఏరు, వలిపము, తీరు
ఉ) కొమ్మ – శాఖ, ఆడుది, కోటకొమ్మ
ఊ) ఆశ – దిక్కు కోరిక

4. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) పక్షి – నీడజము, ద్విజము, పతగము
ఆ) నేత్రం – అక్షి, చక్షువు, నయనం
ఇ) శిరస్సు – తలకాయ, నెత్తి, మస్తకము
ఈ) సూర్యుడు – అహిమకరుడు, భానుడు, భాస్కరుడు
ఉ) చెట్టు – తరువు, భూరుట్టు, వృక్షము
ఊ) కొండ – అచలము, శైల్యము, ఆహార్యము

5. కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.
అ) అతిథి – తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి భోజనమునకు వచ్చువాడు.
ఆ) అక్షరం – నాశనము పొందనిది (వర్ణము)
ఇ) పక్షి – పక్షములు కలది (విహంగము)
ఈ) మౌని – మౌనము దాల్చియుండువాడు (ఋషి)

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

6. అనాథలను చేరదీసే సంస్థలను అనాథ శరణాలయాలు అంటారు కదా ! ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. కింద ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని రాయండి.

అ) పక్షులను రక్షించే సంస్థ :
జవాబు:
పక్షి సంరక్షణ కేంద్రం

ఆ) జంతువులను రక్షించే సంస్థ :
జవాబు:
జంతు ప్రదర్శనశాల

ఇ) వృద్ధులను చేరదీసే సంస్థ :
జవాబు:
వృద్ధాశ్రమం

ఈ) మనోవైకల్యం గలవాళ్ళకు చేయూతనిచ్చే సంస్థ :
జవాబు:
మనోపునర్వ్యవస్థీకరణ సంస్థ

ఉ) కుష్ఠురోగుల పునరావాస కేంద్రం :
జవాబు:
కుష్టువ్యాధి నిరోధక మరియు ఆరోగ్య సంస్థ

వ్యాకరణాంశాలు

1) కింది పదాల్లోని పుంప్వాదేశ సంధి, టుగాగమ సంధి, అత్వ సంధి, ద్విరుక్తటకార సంధుల పదాలను గుర్తించి, విడదీసి సూత్రాలను రాయండి.
సరసంపుమాట, కట్టెదుట, చింతాకు, తూగుటుయ్యేల, నట్టడవి, ముద్దుటుంగరము, మధురంపుకావ్యం, పల్లెటూరు, రామయ్య

పుంప్వాదేశ సంధి : 2
1) సరసము + మాట = సరసంపుమాట
2) మధురము + కావ్యం – మధురంపు కావ్యం
సూత్రం :
కర్మధారయము నందు “ము” వర్ణకములకు పుంపులగు.

టుగాగమ సంధి :
1) తూగు + ఉయ్యేల = తూగుటుయ్యేల
2) పల్లె + ఊరు = పల్లెటూరు
3) ముద్దు + ఉంగరము = ముద్దుటుంగరము
సూత్రం :
కర్మధారయములందు ఉత్తున కచ్చు పరమగునపుడు టుగాగమంబగు.

అత్వసంధి :
1) రామ + అయ్య = రామయ్య
2) చింత + ఆకు = చింతాకు
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.

ద్విరుక్తటకారాదేశ సంధి :
1) కడు + ఎదుట = కట్టెదుట
2) నడు + అడవి = నట్టడవి
సూత్రం :
కులు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఐ, డ లకు అచ్చు పరమగునపుడు ద్విరుక్తటకారంబగు.

సకార త వర్గం శకార చ వర్గం
ఝు

శ్చుత్వ సంధి :
క్రింది ఉదాహరణలు పరిశీలించండి.
నిస్ + చింత = నిశ్చింత
సత్ + ఛాత్రుడు = సచ్చాత్రుడు
శరత్ + చంద్రికలు = శరచ్చంద్రికలు
జగత్ + జనని = జగజ్జనని
శార్జ్గిన్ + జయః – శార్జ్గియః

పై ఉదాహరణలలో మొదటి పదాల (నిస్, సత్, శరత్, జగత్, శార్జిన్) లో దాంతాలుగా ‘స’ కారం కాని, ‘త’ వర్గ కాని ఉంది. వాటికి ‘శ’ కారం కాని, ‘చ’ వర్గ (చ, ఛ, జ, ఝు, ఞ) కాని పరమైంది. శాంతి, ఛాత్రుడు, చంద్రిక, జనని, జయః లలో మొదటి అక్షరాలైన శ,చ,ఛ,జ పరమయ్యా యి. అప్పుడు వరుసగా “శ, ఛ, చ, జ, ఞ” లు ఆదేశమయ్యా యి కదా ! దీనిని సూత్రీకరిస్తే : ‘స’ కార ‘త’ వర్గ అక్షరాలకు ‘శ’ వర్ణ ‘చ’వర్గాలతో సంధి కలిస్తే ‘శ వర్ణ ‘చ’ వర్గాలే ఆదేశంగా వస్తాయి.

అభ్యాసం:
సత్ + జనుడు = సజ్జనుడు
సత్ + చరిత్రము = సచ్చరిత్రము

సూత్రం :
‘స’ కార ‘త’ వర్గ అక్షరాల (త, థ, ద, ధ, న) కు ‘శ’ వర్ణ, ‘చ’ వర్గాక్షరాలతో సంధి కలిస్తే ‘శ’ వర్ణ ‘చ’ వర్గాలే ఆదేశంగా వస్తాయి.

అదనపు సమాచారము

సంధులు

1) గ్రంథాలయం గ్రంథ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
2) ప్రార్థనాలయం = ప్రార్థన + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
3) ఆనందానుభూతి = ఆనంద + అనుభూతి – సవర్ణదీర్ఘ సంధి
4) జీవితానుభవం = జీవిత + అనుభవం – సవర్ణదీర్ఘ సంధి
5) పరహితార్థం = పరహిత + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
6) స్వార్థం = స్వ + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
7) వయోవృద్ధులు = వయః + వృద్ధులు – విసర్గ సంధి
8) అహరహం = అహః + అహం – విసర్గ సంధి (విసర్గ రేఫగా మారడం)
9) ఏమంటావు = ఏమి + అంటావు – ఇత్వ సంధి
10) ఏమనుకున్నావు = ఏమి + అనుకున్నావు – ఇత్వ సంధి
11) చేయెత్తి = చేయి + ఎత్తి – ఇత్వ సంధి
12) – కొండంత = కొండ + అంత – అత్వ సంధి
13) గొంతెత్తి = గొంతు + ఎత్తి – ఉత్వ సంధి –
14) పాదాలు = పాదము = లు – లులన సంధి
15) ముత్యాలు = ముత్యము + లు – లులన సంధి
16) అడ్డం పెట్టు = అడ్డము + పెట్టు – పడ్వాది సంధి
17) ఆశ్చర్యపడు = ఆశ్చర్యము + పడు – పడ్వాది సంధి
18) తదేకంగా = తత్ + ఏకంగా – జత్త్వ సంధి
19) భవిష్యజ్జీవితం = భవిష్యత్ + జీవితం – శ్చుత్వ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) వేపచెట్టు ‘వేము’ అనే పేరు గల చెట్టు సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
2) రావి చెట్టు ‘రావి’ అనే పేరు గల చెట్టు సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
3) నాలుగుదిక్కులు నాలుగైన దిక్కులు ద్విగు సమాసం
4) నాలుగు బారలు నాలుగైన బారలు ద్విగు సమాసం
5) రెండు చేతులు రెండైన చేతులు ద్విగు సమాసం
6) నాలుగడుగులు నాలుగయిన అడుగులు ద్విగు సమాసం
7) ఏడు గంటలు ఏడు సంఖ్య గల గంటలు ద్విగు సమాసం
8) రెండు రోజులు రెండు సంఖ్య గల రోజులు ద్విగు సమాసం
9) నికృష్ట జీవితం నికృష్టమైన జీవితం విశేషణ పూర్వపద కర్మధారయం
10) మహాయోగి గొప్పవాడయిన యోగి విశేషణ పూర్వపద కర్మధారయం
11) మహా మెరుపు గొప్పదయిన మెరుపు విశేషణ పూర్వపద కర్మధారయం
12) అరమోడ్పు కనులు అరమోడ్పయిన కనులు విశేషణ పూర్వపద కర్మధారయం
13) చిరునవ్వు చిన్నదయిన నవ్వు విశేషణ పూర్వపద కర్మధారయం
14) ముగ్గమనోహరం ముగ్ధము, మనోహరము విశేషణ ఉభయపద కర్మధారయం
15) సంజ వెలుగు సంజ యొక్క వెలుగు షష్ఠీ తత్పురుష సమాసం
16) గ్రంథాలయం గ్రంథములకు ఆలయం షష్ఠీ తత్పురుష సమాసం
17) కనుల పండువు కనులకు పండువు షష్ఠీ తత్పురుష సమాసం
18) మబ్బు తునకలు మబ్బు యొక్క తునకలు షష్ఠీ తత్పురుష సమాసం
19) చేతి చలువ చేతి యొక్క చలువ షష్ఠీ తత్పురుష సమాసం
20) జీవితానుభవం జీవితమందలి అనుభవం సప్తమీ తత్పురుష సమాసం
21) వయోవృద్ధులు వయస్సు చేత వృద్ధులు తృతీయా తత్పురుష సమాసం
22) ప్రార్థనాలయం ప్రార్థన కొఱకు ఆలయం చతుర్డీ తత్పురుషం
23) అనిర్వచనీయం నిర్వచనీయం కానిది నఞ్ తత్పురుషం
24) బాలబాలికలు బాలురును, బాలికలును ద్వంద్వ సమాసం
25) నిమీలిత నేత్రుడు నిమీలితములయిన నేత్రములు గలవాడు బహువ్రీహి సమాసం

ప్రకృతి – వికృతి

వేషము – వేసము
ఆశ – ఆస
ముఖం – మొగం
సంధ్య – సంజ
పుష్పము – పూవు, పువ్వు
దీపము – దివ్వె
సంధి – సంది
కథ – కత
మౌక్తికము – ముత్యము, ముత్తియము
భృంగారము – బంగారము
నిమిషము – నిముసము
పీఠము – పీట
శక్తి – సత్తి
భారము – బరువు
భంగము – బన్నము
స్నేహము – నెయ్యము
పేటిక – పెట్టె

పర్యాయపదాలు

1) చెట్టు : 1) వృక్షము 2) తరువు 3) మహీరుహము
2) ముత్యము : 1) మౌక్తికము 2) ముక్తాఫలము 3) ఆణి
3) కన్నీరు : 1) అశ్రువు 2) బాష్పము 3) అస్రము
4) కన్ను : 1) నేత్రము 2) నయనము 3) చక్షువు
5) ఓర్పు : 1) తాల్మి 2) సహనము 3) ఓరిమి

నానార్థాలు

1. ఆశ : కోరిక, దిక్కు
2. మాను : విడుచు, చెట్టు
3. పాదము : అడుగు, కాలు, పద్యపాదము, పాతిక
4. చిత్రము : చిత్తరువు, చమత్కారం, ఆట, ఆశ్చర్యము
5. సమయము : కాలము, శపథము, ఆజ్ఞ
6. కథ : కత, చెప్పడం, గౌరి
7. కద : దిక్కు, మరణము, ప్రక్క
8. అక్షరము : పరబ్రహ్మము, అక్కరము, నీరు, తపస్సు

రచయిత పరిచయం

కృష్ణారెడ్డి జననం :
పులికంటి కృష్ణారెడ్డి క్రీ.శ. 1931లో జన్మించారు. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలంలోని జక్కదన్న గ్రామం వీరి స్వగ్రామం. పులికంటి పాపమ్మ, గోవిందరెడ్డి వీరి తల్లిదండ్రులు. వీరిది వ్యవసాయ కుటుంబం. మధ్యతరగతి కుటుంబం.

పులికంటి నటజీవితం:
పులికంటి కృష్ణారెడ్డి మంచి నటుడు, బెల్లంకొండ రామదాసు రచించిన ‘పునర్జన్మ’ నాటకంలో వృద్ధుని పాత్ర ధరించడంతో ఆయన నటజీవితం ప్రారంభమైనది. నటునిగా చాలామందిచేత ప్రశంస లందుకొన్నాడు. మంచినటుడే కాక మంచి రచయిత కూడా.

రచనా వ్యాసంగం :
పులికంటి కృష్ణారెడ్డి పేరు వినగానే గుర్తు వచ్చేది కథా సాహిత్యం . 1960లో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడిన “గూడుకోసం గువ్వలు” ఆయన రచించిన మొదటి కథ. ‘నాలుగ్గాళ్ళ మండపం’ ఆయన మరో రచన. సుమారు 150 కథలు రచించారు.

అవీ – ఇవీ :
పులికంటి కృష్ణారెడ్డి మంచి బుర్రకథా కళాకారుడు. కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు మొదలైన అంశాల మీద సుమారు 100 బుర్రకథలను రచించాడు. వాటిని ప్రదర్శించి, అందరి మెప్పును పొందాడు. జనజీవనాన్ని ‘కళ్ళకు కట్టినట్టు రచనలు చేసిన దిట్ట. అంతేకాక, ఆయన జానపద కళాకారుడు, కవి. ప్రతిభాశాలియైన పులికంటి కృష్ణారెడ్డి గారు క్రీ.శ. 2007లో స్వర్గస్తులైనారు.

కఠిన పదాలకు అర్థాలు

బోదె = ప్రకాండము
కండ = మాంసము
కృతజ్ఞత = చేసిన మేలు మరచిపోకపోవడం
కనుకొలుకులు = కనుల చివరలు
యోగి = యోగాభ్యాసం చేయువాడు
మైలపరచడం = అశుచి చేయడం
బార = రెండుచేతులు పొడవుగా చాచిన మధ్యదూరం
తటస్థస్థితి = ఎటూకాని స్థితి
ఒడిసి = నేర్పుతో
మేరువు = బంగారు పర్వతం, దీనిపై దేవతలు విహరిస్తారు
విస్తీర్ణం = వ్యాపించిన ప్రాంతం
సంజ = సంధ్య
పరవశం = పరాధీనం
జోడించడం = జతచేయడం
చేతులు జోడించడం = నమస్కరించడం
హుందా = దర్జా
అతిథి = తిథితో నిమిత్తం లేకుండా వచ్చేవాడు
సదుపాయం = సౌకర్యం నివాసం
వసతి = ఉండే చోటు
మకుటం = కిరీటం
మారుపేరు = మరొక పేరు
లీనము = కలసిపోవడం, తన్మయం కావడం
గోరంత = చిన్నది
నిర్వర్తించడం = చేయడం
కొండంత = చాలా ఎక్కువ
అనుభూతి = అనుభవం
తేలిపోవడం = లీనమవడం
చెవిని పడడం = వినబడడం
బిలబిలా = అతి త్వరితముగా
గుమి = సమూహం
తెగిన గాలిపటం = తాడు విడిచిన
బొంగరం = ఎవరూ పట్టించుకోని అనాథ
మనిషి = విద్వాంసుడు
అక్షరసత్యం = కచ్చితమైన నిజం
స్మృతి = జ్ఞాపకం
వడదెబ్బ = వేడి తాకిడి
గుడ్డివెలుగు = తక్కువ వెలుగు
బుడ్డి దీపం = చిన్న దీపం
ఓనమాలు = అక్షరమాల
ధ్యేయం = లక్ష్యం
అహరహం = ప్రతిరోజు, నిరంతరం
పరహితం = ఇతరులకు మంచి
స్వార్థం = తన గురించి
గాలిలో కలిసిపోవడం = నాశనమైపోవడం, మిగలక పోవడం
కాచి వడబోయడం = బాగా అవగాహన చేసుకోవడం
పరమసత్యం = కచ్చితమైన నిజం
గాలివాటం = గాలి వీలు
నిదర్శనం = ఉదాహరణ
పరామర్శ = చక్కగా విచారించుట
ఏకాగ్రత = ఒకే విషయంపై దృష్టి నిలపడం

అలోచించండి- చెప్పండి

ప్రశ్న 1.
తల్లి ప్రేమ ఎలా ఉంటుంది? వివరించండి.
జవాబు:
తల్లి ప్రేమ నిర్మలంగా ఉంటుంది. తల్లి, తన బిడ్డలకు తనకు ఉన్నదంతా పెట్టాలని కోరుకుంటుంది. బిడ్డలకు తన పాలను ఇచ్చి పెంచుతుంది. తన కడుపు కూడా కట్టుకొని, బిడ్డలకు పెడుతుంది. తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదు.

ప్రశ్న 2.
వినయంతో నిలబడడం, వేషంలో సంస్కారం అంటే మీకేమర్థమైంది?
జవాబు:
వినయంతో నిలబడడంలో, ఎదుటి వ్యక్తి యందు, ఆ వ్యక్తికి గల గౌరవం, ప్రేమ, ఆదరం వెల్లడవుతాయి. వేషంలో సంస్కారం అంటే నిండుగా బట్టలు వేసుకోడం, చక్కగా నుదుట బొట్టు పెట్టుకొని మర్యాదస్తులు ధరించే దుస్తులు ధరించడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 3.
అనిర్వచనీయమైన కృతజ్ఞతాభావాన్ని ఎవరి పట్ల, ఎందుకు ప్రదర్శిస్తారు?
జవాబు:
మన జీవితాన్ని మంచి దారిలో పెట్టినవారిపై కృతజ్ఞత ప్రదర్శిస్తాము. ఎదుటి వ్యక్తి తమకు చేసిన గొప్ప మేలునకు ప్రతిగా, ఆ వ్యక్తి యందు వ్యక్తులు కృతజ్ఞతను ప్రదర్శిస్తారు. మనకు ఉపకారం చేసిన వారికి కృతజ్ఞత చెప్పడం, వారి యందు పూజ్యభావం కలిగి యుండడం అన్నవి, మానవుని సంస్కారానికి గుర్తులు.

ప్రశ్న 4.
మీ బడి, మీ ఇల్లు ప్రశాంతతకు మారుపేరుగా ఉండా లంటే ఏం చేయాలి ? ఏం చేయకూడదు?
జవాబు:
బడిలో పిల్లలు అల్లరి చేయరాదు. క్రమశిక్షణతో మెలగాలి. పిల్లలు గురువుల యందు గౌరవం కలిగి ఉండాలి. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల యందు గౌరవాదరాలు కలిగి ఉండాలి. అల్లరి పనులు, కొంటె పనులు చేయకూడదు. ఇంట్లో టి.వి ధ్వనిని బాగా పెంచరాదు. కోపంతో పరుష వాక్యాలు మాట్లాడరాదు. అప్పుడు ఇల్లు, బడి కూడా ప్రశాంతంగా ఉంటాయి.

ప్రశ్న 5.
విద్యాలయావరణం కనులపండువుగా ఉంది కదా? మీ కంటికి కనులపండువుగా ఏమేమి గోచరిస్తాయి?
జవాబు:
1) పద్మాలతో నిండిన చెరువును చూసినపుడు.
2) మా చెల్లి మంచి అందమైన గౌను వేసుకొని నగలు పెట్టుకున్నప్పుడు.
3) ఆగస్టు 15వ తేదీకి పాఠశాలను రంగు రంగు కాగితాలతో అలంకరించినపుడు.
4) సినిమాలలో అందమైన పార్కులలో, నటీనటులు నాట్యాలు చేస్తున్నప్పుడు, నాకు కనులపండువుగా ఉంటుంది.
(గమనిక : గ్రామం, బడి, ఇల్లు మొ|| వాటి గురించి విద్యార్థులంతా సొంతంగా మాట్లాడాలి.)

ప్రశ్న 6.
పెద్దల మాటలు, జీవితానుభవాలు అక్షరసత్యాలు ఎందుకో వివరించండి.
జవాబు:
పెద్దలు ఏది మాట్లాడినా తమ అనుభవాల నుండో, తాము చదివిన గ్రంథాల నుండో ఉదాహరిస్తారు. అవి వారి జీవితాన్ని ప్రభావితం చేసినవై ఉంటాయి. అవి పిల్లలకు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ‘పెద్దలమాట – చద్దిమూట’ అన్నారు పెద్దలు. పెద్దల మాటలు విని, ఆచరిస్తే కష్టాలు దరిదాపులకు రావు. వారి జీవితానుభవాలు కూడా పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. అవి పిల్లల జీవితాలకు దిక్సూచిల వంటివి. పెద్దలు తమ జీవితానుభవాలను పిల్లలకు చెప్పాలి. అందువల్ల పిల్లల జీవితాలు బాగుపడతాయి.

పరాకాష్ఠ = అత్యున్నత స్థితి
కుతూహలం = ఆత్రుత
వాయిదా = గడువు
గతాన్ని నెమరువేయడం = జరిగిన దానిని తలచుకోవడం
సందర్శనం = చూడడం
పుంగవము = ఎద్దు
పుంగవుడు = శ్రేష్ఠమైనవాడు
తలపు = ఆలోచన
ముగ్ధమనోహరం = అమాయకపు అందం
శ్రుతి = వినికిడి
నేస్తాలు = స్నేహితులు
అదిరిపడడం = భయపడడం
నివ్వెరపడు = ఆశ్చర్యపడడం
నిర్దాక్షిణ్యం = దయలేకపోవడం
పరధ్యానం = ఇతర ఆలోచన
నడివయస్సు = మధ్యవయస్సు (40-50 సం||లు)
పొదివి = జాగ్రత్తగా, అపురూపంగా
అథోగతి = హీనమైన స్థితి
పుట్టగతులుండవు = సర్వనాశనం
పొంతన = పోలిక
వేళకాని వేళ = అనువుకాని సమయం
మునుపు = పూర్వం
కుతూహలం = ఆత్రుత
నికృష్టం = అధమము
బుడతడు = చిన్నవాడు
నిర్లక్ష్యం = లక్ష్యం లేకపోవడం
ఉడాయించడం = పారిపోవడం
ధోరణి = విధానం
క్లుప్తం = సంక్షిప్తం, తగ్గించడం
ఏమరుపాటు = అకస్మాత్తుగా

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
సమయం, సందర్భం కలిసి రావడమంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు తెల్పండి.
జవాబు:
సమయం, సందర్భం కలిసి రావడమంటే, కాలమూ దానికి తగిన సంఘటన కలిసిరావడం. ఉదాహరణకు చదువుకొందుకు సరియైన సమయం ఉదయకాలం. ఉదయం 4 గంటల నుండి చదువుకొందుకు సరియైన సమయం. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏరకమైన అలజడులూ ఉండవు. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. అటువంటి సమయంలో చదువు కొంటే చదువు బాగా వస్తుంది. మంచి మంచి ఆలోచనలు వస్తాయి.

ఆ సమయంలో చదవాలంటే మెలుకువ రాదు. మెలుకువగా ఉండాలంటే కొంచెం కష్టం. కనుక ఉదయం 4 గంటలకు ఎవరైనా ప్రయాణమై వెడుతుంటే, ఎలాగూ నిద్రలేస్తాం. ఆ ప్రయాణ సందర్భంగా నిద్రలేస్తాం. కనుక మంచి సమయం, సందర్భం కలిసివచ్చాయి. అప్పుడు చదువుకోవడం మంచిది.

అలాగే, కంచి దైవదర్శనానికి వెడతాం. అది మంచి సమయం కనుక అక్కడ ఉన్న చూడదగిన ప్రదేశాలన్నీ చూస్తాం. దేవాలయాలు కూడా చూస్తాం. కంచిలో పట్టుబట్టలు నాణ్యమైనవి. చౌకగా దొరుకుతాయి. అంతదూరం వెళ్ళాం. పట్టుబట్టల దుకాణాలు చూశాం. ఆ సందర్భంలో నచ్చిన బట్టలు కూడా కొనుక్కొంటే సమయం, సందర్భం కలిసి వస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 2.
“తెలుగు వారికి తెలుగంటే బోలెడంత అభిమానం” దీన్ని గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
ఎవరి భాషపైన వారికి అభిమానం ఉంటుంది. ఈ విషయంలో తమిళనాడు వారే ఆదర్శవంతులు. వారు తమిళానికి ఇచ్చినంత గౌరవం ఏ భాషకూ ఇవ్వరు. వారు సాధ్యమైనంత వరకు తమిళంలోనే మాట్లాడతారు.

తెలుగు వారికీ తెలుగంటే అభిమానమే కాని, అంతేకాదు, మన వారికి పరభాషా వ్యా మోహం ఎక్కువ. తెలుగులో మాట్లాడడం నామోషీగా భావిస్తారు. పరభాషలలో మాట్లాడడం గొప్పతనంగా భావిస్తారు. తెలుగులో కూడా పరభాషా పదాలను ఎక్కువగా చేర్చి, మాట్లాడతారు. అది కొంతమంది తెలుగువారి పద్దతి.

తెలుగంటే ఎడతెగని అభిమానం కలవారు కూడా చాలామంది ఉన్నారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు, కళాకారులు మొదలైనవారు. వారు తెలుగులోనే ఎంతో చమత్కారం కల పదాలు ప్రయోగిస్తూ చక్కగా మాట్లాడతారు. ఎంతసేపైనా వినాలి అనిపిస్తుంది. తెలుగులోని తియ్యదనం చవిచూస్తే జన్మ ధన్యమౌతుంది. తెలుగు పలుకుల వెలదికి తేనెచినుకుల చిలకరింపులకు మనసు పులకరిస్తుంది.

ప్రశ్న 3.
పిల్లలు ఎందుకోసం వచ్చి ఉంటారు? ఆయన వారితో ఏం మాట్లాడి ఉంటారు? ఊహించండి.
జవాబు:
పిల్లలు తమకు కావలసిన అవసరాలను ఆ వృద్ధునికి చెప్పాలని ఆయన దగ్గరికి వారు వచ్చి ఉంటారు. వారు తమకు పుస్తకాలు కావాలనో, వారు బడిలో ఫీజు కట్టాలనో, వారికి దుస్తులు కావాలనో ఆయనను అడిగి ఉంటారు.

ప్రశ్న 4.
కథల పుస్తకాలు లేదా ఇతర పుస్తకాల్లో బొమ్మలు ఎందుకు వేస్తారు?
జవాబు:
పుస్తకంలోని విషయం దేని గురించి ఉందో అట్లపై బొమ్మ చెబుతుంది. కథలోని విషయం కళ్ళకు కట్టినట్లు తెలియజెప్పడానికే బొమ్మలు వేస్తారు. బొమ్మను చూపి కథ ఊహించుకోవచ్చు. కాని, కథ పూర్తిగా అవగాహనకు రాదు. అదేమిటో తెలుసుకోవాలనే తపన బయలు దేరుతుంది. ఆ తపన తీరాలంటే ఆ కథ తెలియాలి. ఆ కథ తెలియాలంటే చదవాలి. అందుచేత బొమ్మ చూస్తే, అది ఆ కథను చదివిస్తుంది.

క్రింది తరగతులలోని పాఠ్యపుస్తకాలలోని బొమ్మలు కూడా మమ్మల్ని ఇదే విధంగా ప్రేరేపించాయి. పాఠ్యపుస్తకం చేతికి రాగానే బొమ్మలు చూసేవాళ్ళం. ఆ బొమ్మలను బట్టి కథ ఊహించుకొని, ఆ పాఠం చదివేసేవాళ్ళం. పద్యాలైతే అర్థంగావు, కాని పాఠాలంటే భలే ఇష్టం. బొమ్మలు లేని పుస్తకం అలంకారాలు లేని మనిషిలా ఉంటుంది. సరిగ్గా సర్దుకోని ఇల్లులా ఉంటుంది. ఒక లక్ష్యం లేని జీవితంలా ఉంటుంది. బొమ్మలు పుస్తకాలకి ప్రాణం.

ప్రశ్న 5.
వృద్ధుడిని ఆకట్టుకొన్న బొమ్మ ఏమిటి? ఆ బొమ్మను చూసి ఎలాంటి అనుభూతిని పొందాడు?
జవాబు:
వృద్ధుడిని ఆకట్టుకొన్నది. రైలు పెట్టెలో యాచిస్తున్న కుర్రవాడి బొమ్మ, ఆ బొమ్మలోని కుర్రవాడిని చూడగానే రైలు పెట్టె తుడుస్తున్న కుర్రవాడిని తీసుకొనివచ్చి, చదివించి, ప్రయోజకుడిని చేయాలి అనిపించింది. అప్పుడు తన ఎదుట ఆ బొమ్మలోని కుర్రవాని వలె అనాథగా నిలుచున్నవాడే ఈ రోజు సంఘంలో గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకొంటూ బ్రతుకుతున్నాడు.

చాలామంది కథలలోను, నవలలలోనూ ఆదర్శ వంతమైన ఊహలు రాస్తారు. ఉపన్యాసాలలో కూడా ఆదర్శవంతమైన మాటలు చెబుతారు. కాని, ఆచరణలో శూన్యం. కొందరు మాత్రం ఆ కథలు విని, ఉపన్యాసాలు విని అలా చేస్తారు. కాని, ఈ వృద్దుడు చేసిన ఆదర్శ వంతమైన పనికి మూలం కథ. అందుచేత వృద్ధుడు తాను చేసిన పనికి చాలా ఆనందానుభూతిని పొందాడు. మాటలలో వర్ణించలేనంత సంతృప్తిని పొందాడు.

ప్రశ్న 6.
వారపత్రికలో వృద్ధుడు చదివిన కథ ఏమై ఉంటుంది?
జవాబు:
వారపత్రికలో వృద్ధుడు చదివిన కథ బహుశః “రైలు పెట్టెల్లో చిక్కుకొన్న అనాథ బ్రతుకు” అనే కథ అయి ఉండవచ్చు.

స్వభావం = తనయొక్క భావం
తటాలున = అకస్మాత్తుగా
ఇంటివాడవ్వడం = పెళ్ళి చేసుకోవడం
గాద్గదికం = బొంగురు
పూడుకపోవడం = మూసుకొనిపోవడం
దీర్ఘవ్యాధి = చాలాకాలం ఉండే వ్యాధి

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ణ జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైందేనా? ఎందుకు?
జవాబు:
సరైనది :
రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైనదే. ఎందుకంటే గృహహింస తట్టుకోలేక చాలామంది బాలలు ఇళ్ళలో నుండి పారిపోతారు. పిల్లల అభిప్రాయాలను పెద్దలు పట్టించుకోకపోయినా, వారికి ఇష్టంలేని పనులు చేయమని బలవంత పెట్టినా, కోప్పడినా పిల్లలు పారిపోతారు. తర్వాత వారు ఏ ముఠాలకో దొరుకుతారు. వారు, రైలు పెట్టెలు తుడిచే పనులు, భిక్షాటన, దొంగతనాలు మొదలైన వాటిలో ప్రవేశపెడతారు. ఇక ఆ పిల్లల జీవితాలు నికృష్టంగా తయారౌతాయి. తల్లి తండ్రులెవరో తెలియని అనాథ పిల్లల జీవితాలు కూడా ఇంతే, కొంతమంది పిల్లలను దొంగలు ఎత్తుకొనిపోయి కూడా ఇలాంటి పనులు చేయిస్తారు. అందుచేత వృద్ధుడి భావన సరైనది. సరైనది కాదు : రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైనది కాదు. ఎందుకంటే తను సుదీర్ఘమైన జీవితాన్ని చూసినవాడు, అనుభవం గడించిన వాడు. ఆ పిల్లలు అలాగ తయారు కావటానికి కారణం పెద్దలే. తమ పిల్లలను అపు రూపంగా చూసుకొంటే ఇలాంటి పరిస్థితులు రావు. దుర్వ్యసనాల పాలైన పెద్దలు పెట్టే బాధలను పిల్లలు భరించలేరు. కనీసం సమాజంలోని వాళ్ళు ఆ పిల్లలను పట్టించుకొని ఇళ్ళకు చేరిస్తే ఈ బాధలుండవు. కౌన్సిలింగ్ ద్వారా పిల్లల పెంపకంపై అవగాహన కలిగించాలి. లేదా చట్టప్రకారం చర్యలు తీసుకొనేలా చేయాలి. అన్నిటిపైనా అవగాహన గల ఆ వృద్ధుడు చేతగానివాడిలా బాధపడడం సమర్థనీయం కాదు. (సూచన : పై వానిలో ఒక అభిప్రాయమే గ్రహించాలి.
రెండూ గ్రహించకూడదు.)

ప్రశ్న 2.
“ప్రయత్నం చేసి ఫలితాలు సాధిస్తే ఆనందం కలుగు తుంది” దీంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
ఏ ప్రయత్నమూ లేకుండా కలిగే ఫలితం ఆనందం కలిగించదు. కష్టపడి పనిచేసి ఫలితాన్ని పొందితే చాలా ఆనందం కలుగుతుంది. ఎవరో చేసిన ప్రయత్నానికి ఫలితాన్ని మనం అనుభవించడమే దోపిడి అంటే అది మోసం, దగా, నయవంచన. మన ప్రయత్నం మనం చేసుకోవాలి. దానిలో కష్టాలు ఎదురుకావచ్చును. నష్టాలు రావచ్చును. బాధలు కలగవచ్చును. శ్రమ కలగవచ్చు. కొన్ని మాటలు కూడా పడవలసిరావచ్చును. కాని, ఫలితం అందుకోగానే అవన్నీ మరచిపోతాం. చాలా ఆనందం పొందుతాం. చాలా సంతృప్తి కలుగుతుంది. చాలా గర్వంగా ఉంటుంది. ఉప్పొంగి పోతాం. పడిన శ్రమంతా మరచిపోతాం. గంతులు వేస్తాం, ఇంత హడావుడికి కారణం? మన ప్రయత్నంతో సాధించుకోవడం. అందుకే దేనినైనా సాధించుకోవాలి తప్ప దక్కించుకోకూడదు. యాచించకూడదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 3.
అందరు పిల్లలూ తప్పనిసరిగా బడికి వెళ్ళి చదువుకోవాలి కదా ! మరి అలా ఎందుకు జరగడం లేదు?
జవాబు:
మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. బీదల సంఖ్య ఎక్కువ. చిన్న చిన్న వృత్తులతో పొట్టపోసుకొనేవారు చాలామంది ఉన్నారు. కుటుంబంలోని వారంతా కష్టపడి డబ్బు సంపాదించకపోతే రోజు గడవదు. అందుచేత పిల్లలను కూడా డబ్బు కోసం పనులకు పంపుతారు. సంపాదనలో పెడతారు. సంచార జాతులవారు తమ పిల్లలను తమ కూడా తిప్పుకొంటారు. అందుచేత వారి పిల్లలు కూడా బడులకు రాలేరు.

కొంతమంది పిల్లలు మొండితనం, అల్లరి, అతిగారాబం వలన బడులకు వెళ్ళరు. వెళ్ళినా అక్కడ అందరితోటి కలవలేక బడి మానివేస్తారు. చిన్నతనం నుండీ పెద్దలు సరిగా పట్టించుకోక దురలవాట్లకు బానిసలౌతారు.

కొన్ని కుటుంబాలలోని ఆడపిల్లలకు చిన్నతనంలోనే వివాహాలు చేసేస్తారు. అది కూడా బాలల విద్యాభ్యాసానికి ఆటంకంగా ఉంది. నిరక్షరాస్యత, నిరక్షరాస్యులకు అక్షరాల విలువ తెలియదు. తమకు చదువు లేకపోయినా చక్కగా గడుస్తోంది కదా ! దేనికీ లోటులేదు. అలాగే తమ పిల్లలకూ గడుస్తుంది అనే ఆలోచన. ఎంత చదువు చదివినా ఉద్యోగాలు రావు. అంతకంటే పని నేర్చుకొంటే నయం అనే భావన కూడా కారణం. బాలలు తప్పనిసరిగా బడికి రావాలంటే వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించాలి.

ప్రశ్న 4.
“గుండెల్లోని ఆనందం కరిగి ముత్యాల్లా కన్నీటి రూపంలో రావడం” అంటే, మీకేమి అర్థమైంది ? ఇది ఏ ఏ సందర్భాల్లో జరుగుతుంది ? మీ అనుభవాలు తెల్పండి.
జవాబు:
కన్నుల వెంట నీరు రెండు సందర్భాల్లో వస్తుంది. దుఃఖం కలిగితే వస్తుంది. అలాకాక ఆనందం ఎక్కువగా వస్తే కన్నుల వెంట నీటి బిందువులు ముత్యాల్లా రాలుతాయి. వాటినే ఆనందబాష్పాలు అంటారు.
మనం ఊహించని మంచి మేలు జరిగితే, మనకు ఆనందబాష్పాలు వస్తాయి. అలాగే మనం విజయం సాధిస్తే ఆనందబాష్పాలు వస్తాయి.

నా అనుభవాలు :

  1. నాకు 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు వచ్చింది. అప్పుడు నాకు ఆనందబాష్పాలు వచ్చా యి.
  2. నాకు పాటల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఆ బహుమతి ఇచ్చే సందర్భంలో ఆనాడు పాఠశాలకు వచ్చిన ముఖ్యమంత్రి గారి ఎదుట నాచే ఆపాట పాడించారు. ఆ బహుమతిని నాకు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చారు. ఆ సందర్భంలో నాకు ఆనందబాష్పాలు వచ్చాయి.

ప్రశ్న 5.
“ఒక వ్యక్తి బాధ్యతల్ని స్వీకరించే స్థితికి సమాజం ఎప్పుడు చేరుతుందో ?” అనే ఆవేదన సరైందేనా? ఎందుకు?
జవాబు:
సరైనది :
వ్యక్తి బాధ్యతను సమాజం స్వీకరించాలి. ఒక వ్యక్తిని రక్షించి, తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులది. వారు తమ బాధ్యతను విస్మరిస్తే, ఆ బాధ్యతను సమాజం స్వీకరించాలి. వారికి రక్షణ కల్పించాలి. వారికి విద్యాబుద్ధులు నేర్పాలి. అప్పుడు వారు ప్రయోజకు లౌతారు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతారు. ఆ విధంగా ఆదుకొందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ధనవంతులు కొన్ని ‘ఆశ్రయ భవనాలను’ నిర్మించాలి. కొంతమంది ఉద్యోగులను కూడా నియమించాలి. అప్పుడే ఈ సమాజంలో అనాథలు, నిర్భాగ్యులు, నికృష్టజీవనులు ఉండరు. ముఖ్యంగా భావిభారత పౌరుల జీవితాలు ఆనందమయం అవుతాయి.

సరైనదికాదు :
పదిమంది వ్యక్తులు కలిస్తేనే సమాజం. అనేకమంది ఊహలకు రూపకల్పన సమాజం. సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. రకరకాల అవసరాలు ఉన్నవారు ఉంటారు, అనేక రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఎవరి బాధలు వారివి. ఎవరి ఆనందాలు వారివి. ఒకరికి బాధకలిగితే, సమాజం ఓదార్చాలి. ధైర్యం చెప్పాలి. సహాయం చేయాలి. వెన్నుదన్నుగా నిలబడాలి. కాని, బాధ్యతలను స్వీకరించకూడదు. అది బద్ధకాన్ని నేర్పుతుంది. ఎవరి పిల్లలను వారు పెంచుకోవాలి. తీర్చిదిద్దుకోవాలి. ఆర్థికంగా కాని, సామాజికంగా కాని సహాయం కావాలంటే సమాజం ఇవ్వాలి అంతేకాని, పిల్లలను పెంచే బాధ్యత కూడా సమాజమే స్వీకరిస్తే, వారు సోమరులుగా తయారౌతారు. పిల్లలను పట్టించుకోని పెద్దలను శిక్షించాలి. పిల్లల సంరక్షణకు చట్టాలు చేయాలి. కఠినంగా అమలుపరచాలి. అప్పుడే భావి భారతం ఆనందమయం అవుతుంది. పెద్దలకు బాధ్యత తెలుస్తుంది.
( గమనిక : పై వాటిలో ఏ అభిప్రాయమైనా చెప్ప వచ్చును. రెండూ చెప్పకూడదు.)

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 9th Lesson మాణిక్యవీణ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 9th Lesson మాణిక్యవీణ

10th Class Telugu 9th Lesson మాణిక్యవీణ Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

“సౌందర్యం ఆరాధించేవాడా!
కవితలో, శిల్పంలో
పురుగులో, పుష్పంలో
మెరుపులో, మేఘంలో
సౌందర్యం ఆరాధించేవాడా!
జీవించేవాడా!
సుఖించేవాడా ! దుఃఖించేవాడా!
విహ్వలుడా ! వీరుడా!
ప్రేమించేవాడా!
వియోగీ! యోగీ! భోగీ! త్యాగీ!
ఆలోచనలు పోయేవాడా!
అనునిత్యం అన్వేషించేవాడా!
చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా
ఆకసంలో సముద్రంలో
అన్వేషించేవాడా!”

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది?
జవాబు:
ఈ కవిత మానవుని గురించి తెలుపుతుంది.

ప్రశ్న 2.
కవితలో పేర్కొన్న మానవుని ప్రత్యేక లక్షణాలేవి?
జవాబు:
కవితలో పేర్కొన్న మానవుడు – సౌందర్య ఆరాధకుడు, జీవించేవాడు, సుఖించేవాడు, దుఃఖించేవాడు, విహ్వలుడు, వీరుడు, ప్రేమికుడు, వియోగి, యోగి, భోగి, త్యాగి, ఆలోచనాపరుడు, అన్వేషకుడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 3.
మానవుణ్ణి ఎన్ని కోణాల్లో ఈ కవితలో దర్శించవచ్చు?
జవాబు:
మానవుణ్ణి 13 కోణాలలో ఈ కవితలో దర్శించవచ్చును.

ప్రశ్న 4.
మానవునికి వివిధ లక్షణాలు ఎలా సంక్రమించి ఉండవచ్చు?
జవాబు:
తన జీవన క్రమంలో, నిత్యం అన్వేషణలో, అభివృద్ధిలో మానవునికి అనేక లక్షణాలు సంక్రమించి ఉండవచ్చును.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
‘మాణిక్య వీణ’ శీర్షికన ఉన్న కవిత విన్న తర్వాత మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో చెప్పండి.
జవాబు:
మాణిక్య వీణ కవితను విన్నపుడు చాలా ఆనందం కలిగింది. మంత్రాలు-చింతకాయలు, చింతలు, యంత్రాలు, జబ్బులు, తంత్రాలు-రుగ్మతలు, అనవచ్చు – అనిపించనూవచ్చు, పొట్ట-పుట్ట, కట్టెదుట-నిట్టనిలువు, కట్టుకొని, అందచందాలు, రంగులను-రవళినీ, గుట్టాలు-జింకలు, మొక్కలు-నిక్కి, చక్కని నొక్కులు – చిక్కని పదాలు, చక్రం – చరిత్ర, చరచరా – విరచించిన, తప్పటడుగులు – తాండవం, కిలకిలలు – కలభాషలు, అలతి మాటలు – పదాలు, కలమ – కళలు, తళతళలు, జ్ఞానం – విజ్ఞానం – ప్రజ్ఞానం మొదలైన పదాలు చాలా బాగున్నాయి. ఆ పదాలను సందర్భానుసారంగా ఉపయోగించడం చాలా బాగుంది.

ఆదిమానవుని స్థాయి నుండి అంతరిక్ష పరిశోధకుని వరకు పురోగమించిన మానవజాతి మహాప్రస్థానంలోని ముఖ్యమైన రోజులను వర్ణించడం చాలా ఆనందపరచింది. మానవజాతి చరిత్రలోని ప్రతిరోజును విశ్లేషించి, మనం ఇప్పుడున్న స్థితి కోసం మన పూర్వులు పడిన కష్టాన్ని గుర్తుచేశారు. దీని వలన మన పూర్వుల పైన మన గౌరవం పెరుగుతుంది. మానవజాతిని మా నవజాతి అని కీర్తించి, నిరూపించిన మానవతావాది, మానవతావాది అయిన కవి గారిని అభినందించడం
మానవధర్మం.

ప్రశ్న 2.
‘మాణిక్య వీణ’ వచన కవితను భావయుక్తంగా చదవండి. దీని భావాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
వచన కవితను భావయుక్తంగా పాడడం, మీ గురువు గారి దగ్గర నేర్చుకొని పాడండి.

మాణిక్యవీణ (భావం సొంతమాటల్లో) (కవితా సారాంశం) :
మంత్రాలతో చింతకాయలు ఎలా రాలవో, అలాగే స్తుతి పద్యాల ధాటితో చింతలు తొలగిపోవు. యంత్రాలతో రోగాలు నయం కానట్లే, తంత్రాలతో సమాజ సమస్యలు దారికిరావు.

కడుపులో కేన్సరుతో సంఘం బాధపడుతూ ఉంటే, అంతరిక్షంలోకి రాకేట్లు పంపితే మాత్రం ఏం ప్రయోజనం ? మనిషి పుట్టగానే ప్రకృతిని చూసి ఆనందించాడు. దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అతడు ప్రయత్నించాడు. ప్రకృతిలోని రంగులనూ, ధ్వనులనూ అనుకరించాడు.

మానవుడు గుహలలో జీవించే ఆదిమకాలంలోనే, గోడలపై జంతువుల బొమ్మలు గీశాడు. ఎండిన చెట్లు చిగిర్చేలా పాడాడు. గజ్జెకట్టి నాట్యం చేశాడు. చక్కని తీరుగా పదాలు పాడుకున్నాడు.

‘చక్రం’ కనుక్కొన్న రోజు, ‘లిపి’ తో రాసిన రోజు, నిప్పును కనిపెట్టిన రోజు, చక్కగా నాట్యం చేసిన రోజు, మానవచరిత్రలో మంచిరోజులు. మానవుడు అర్థవంతమైన భాషలు నేర్చుకొన్న రోజు, చిన్నమాటలతో జానపద గీతాలు అల్లుకున్న రోజు, ధాన్యం పండించిన రోజు, కళలను పండించిన రోజు గొప్పరోజులు. మానవచరిత్రలో అవి అన్నీ పండుగరోజులు.

కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలసి, మానవుడిని మహోన్నతంగా నడిపిస్తాయి. ఈ విధంగా నేల నుండి ఎదిగి మానవుడు ఆకాశాన్ని అందుకున్న చిన్నవాడు. మానవుడు చిరంజీవి. అతి ప్రాచీనుడు.

అనాదిగా నడుస్తున్న ఈ మానవుడి జీవనయాత్రలో కళాకవితలూ, జ్ఞాన విజ్ఞానాలూ, మానవుడి వెంటనే ఉండి, అతనితో నడుస్తూ, అవే అతణ్ణి నడిపిస్తున్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 3.
పొట్లపల్లి రామారావు రాసిన కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులివ్వండి.
“ఎన్ని దినములు నీవు – ఇల గడిపినను ఏమి?
ఎన్ని జన్మాలింక – ఎదిరి చూచిన ఏమి?
ఎన్నాళ్లకైన నీ – ఔన్నత్యమును నీవే
సాధించవలెనోయి – శోధించవలెనోయి !
నీలోన వెలుగొందు – నీస్వశక్తిని మరచి –
పరుల పంచల జూడ – ఫలమేమి కలదోయి !”

అ) పై కవితకు పేరు పెట్టండి.
జవాబు:
1) స్వశక్తి
2) సాధన – శోధన
3) మానవా – మా ! నవా !
గమనిక :
కవితలోని సారాంశాన్ని బట్టి, విద్యార్థులు తమకు నచ్చిన, సరిపోయే పేరును దేనినైనా పెట్టవచ్చును.

ఆ) ఔన్నత్యం పొందడానికి కవి ఏం చేయాలని చెప్తున్నాడు?
జవాబు:
సాధించాలి. శోధించాలి. అప్పుడే ఔన్నత్యం పొందగలం అని కవి చెప్తున్నాడు.

ఇ) స్వశక్తికి, ఇతరులపై ఆధారపడడానికి గల తేడా ఏమిటి?
జవాబు:
ఎవరి సహాయసహకారాలను ఆశించకుండా, తను సొంతంగా చేయడం స్వశక్తి. దాని వలన ఆత్మవిశ్వాసం, గౌరవం, పనిచేసే తత్వం, పట్టుదల, ఓర్పు, నేర్పు మొ||వి పెరుగుతాయి. ఇతరులపై ఆధారపడితే పైన చెప్పినవేమీ ఉండవు.

ఈ) ‘పరులపంచ’ అనే పదంతో సొంతవాక్యాన్ని రాయండి.
జవాబు:
పరుల పంచ : దుర్యోధనుని కుటిలనీతి, దుర్మార్గం, మోసం వలన జూదంలో పాండవులు ఓడిపోయి, పరుల పంచల పాలయ్యారు.

ప్రశ్న 4.
ఈ పాఠంలోని “అంత్యప్రాసలున్న” పదాలు వకండి. అలాంటివే మరికొన్ని పదాలను రాయండి.
జవాబు:
పాఠంలోని అంత్యప్రాస పదాలు :
చింతకాయలు – చింతలు, జబ్బులు – రుగ్మతలు, అనవచ్చు – అనిపించనూవచ్చు, అననూవచ్చు – అనిపించనూ వచ్చు, ఆయత్తమయినాడు – గీసుకొన్నాడు, ఆరంభించినాడు – కట్టినాడు, పిక్కటిల్లేలా – చూచేలా, దినమో – శుభదినమో, రోజు – రోజు, మానవుడు – మానవుడు, విజ్ఞానం – ప్రజ్ఞానం.

మరికొన్ని అంత్యప్రాసలు :
సన్నిధి – పెన్నిధి, చూస్తా – వస్తా, చూసి – చేసి, కాలం – గాలం, ధీరత – శూరత, మమకారము – సహకారము, నీరు – మీరు, క్షీరము – నారము, వనజ – జలజ, కలతలు – మెలతలు, గిలిగింత – చికిలింత, జాతి – నీతి, పలక – గిలక, రానీ – పోనీ, నాది – నీది, వనధి – జలధి.

(గమనిక : పదంలోని చివరి అక్షరం గాని, చివరి రెండు లేక మూడు అక్షరాలు గాని ఒకే అక్షరాలుగా వచ్చేలా ఎన్ని పదాలైనా రాయవచ్చును.)

5. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.

అ) “మంత్రాలతో చింతకాయలు………………..” అని కవి వేటితో పోల్చాడు?
జవాబు:
“మంత్రాలతో చింతకాయలు రాలవు” అనే విషయంలోని మంత్రాలతో చింతకాయలు రాలనట్లే పద్యభయంతో చింతలు పారిపోవు అన్నాడు. యంత్రాలతో జబ్బులు తగ్గవు అన్నాడు. తంత్రాలతో సమాజ రుగ్మతలు పోవు అన్నాడు. పొట్టలోని పుట్టకురుపుతో సంఘం కలతపడుతుంటే అంతరిక్ష ప్రయోగాల వలన ఉపయోగం ఏమిటని ప్రశ్నించాడు.

పైవానిలో పద్యాలు, యంత్రాలు, తంత్రాలు, పొట్టలోని పుట్టకురుపుతో ఉన్న సంఘపు కలతను మంత్రాలతో పోల్చాడు. చింతలు పారిపోకపోవడం, జబ్బులు తగ్గకపోవడం, సమాజరుగ్మతలు పోకపోవడం, అంతరిక్ష ప్రయోగాల వలన ఉపయోగం లేకపోవడం అనే వాటిని చింతకాయలు రాలకపోవడంతో పోల్చాడు.

ఆ) కవి వేటిని శుభదినాలని వర్ణించాడు?
జవాబు:
చక్రం అభివృద్ధికి కారణం. అంతవరకు చాలా ప్రయాసతో చేసిన పనులను చక్రం కనుగొన్నాక సులువుగా చేశాడు మానవుడు. ఇంత అభివృద్ధి కారకమైన చక్రం కనుగొన్న రోజు నిజంగా అద్భుతమైన గొప్ప రోజు. అది మానవ చరిత్రలో శుభదినం.

నిప్పును కనుగొన్నాక మానవుని జీవన విధానం మారింది. అంతవరకు పచ్చిమాంసం, పచ్చి కూరలు, పచ్చి దుంపలు తిన్న మానవుడు వాటిని కాల్చుకొని తినడం ప్రారంభించాడు.

ఎప్పుడైతే నాలుకకు రుచి తగిలిందో అప్పుడే కళల వైపు దృష్టి మళ్ళింది. ఇక తప్పటడుగులు మానివేసి, తాండవం చేయడం మొదలు పెట్టాడు. ఇది పరిపక్వతకు, సమర్థతకు గుర్తు.

మానవుడు భాష నేర్చుకొన్నది నిజంగా శుభదినమే. పదాలు తనకు తాను అల్లుకొంటూ పదజాలాన్ని సృష్టించిన మానవుడు సాధించిన ప్రగతి సామాన్యమైనదికాదు. పదజాలం నుండే సమస్త సాహిత్యం ఏర్పడింది. అది మానవజాతి చరిత్రలో మంచిరోజు.

పంటలు పండించడానికి వ్యవసాయం చేసిన రోజు ఈనాటి ఆధునిక మానవుని ప్రతినిధులుగా మానవులను రూపొందించిన మంచిరోజు. ఇక మానవజాతి పూర్తిగా అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఏర్పడిన శుభదినం.

ఈ విధంగా మానవుడు సాధించిన అభివృద్ధికి ఆస్కారమైన రోజులన్నీ శుభదినాలే.

ఇ) మానవుణ్ణి శాశ్వతంగా నిల్పేవి ఏవి?
జవాబు:
మానవుడిని చరిత్రలో శాశ్వతంగా నిలిపే అతను సాధించిన అభివృద్ధి, పొందిన చైతన్యం మాత్రమే.

మానవుడు వేసిన కుడ్య చిత్రాలు అతడిని శాశ్వతుడిని చేశాయి. అతను పాడిన పాటలు, చేసిన నృత్యాలు అతని చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. ఘీంకరించడమేకాక చక్కని పదాలు పాడిన గొంతు మానవుణ్ణి శాశ్వతం చేసింది. అతను కనుగొన్న చక్రం, చిత్రలేఖనం అతను కనుగొన్న నిప్పు మానవుడికి శాశ్వత కీర్తిని తెచ్చాయి. అతను చేసిన తాండవం చరిత్ర పుటలలో శాశ్వతంగా స్థానం సంపాదించింది. కూతలు మాని మధురమైన భాష పలికిన రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. తేలికైన మాటలతో పాటలను అల్లుకొన్నరోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచింది. కళలను పండించిన రోజు, కవిత్వం చెప్పిన రోజు, అతని జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం మానవుణ్ణి శాశ్వతంగా నిలిపాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ఈ) విద్వాన్ విశ్వం గురించి, ఆయన కవితాశైలిని గురించి ఐదు వాక్యాలు రాయండి.
జవాబు:
వ్యక్తిగతం :
విద్వాన్ విశ్వం అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో లక్ష్మమ్మ, రామయ్య దంపతులకు క్రీ.శ. 1915లో జన్మించారు. ఆయన అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. ఆయన సంస్కృతాంధ్రాంగ్ల భాషలలో పండితుడు. ఆయన మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో అనేక హోదాలలో పనిచేశారు. భాష, సాహిత్యం , సమాజ నైతిక విలువలు మొదలైన అంశాలపై ‘అవి – ఇవి’, ‘తెలుపు – నలుపు’, ‘మాణిక్య వీణ’ వంటి శీర్షికలతో సంపాదకీయాలు రాశారు. ఆయన సాహితీవేత్త. రాజకీయ నాయకుడు, పత్రికా సంపాదకుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు. ‘ప్రేమించాను’ అనే నవల, ‘ఒకనాడు’, ‘పెన్నేటిపాట’ అనే కావ్యాలు రచించారు. కళాప్రపూర్ణ, డి.లిట్. పట్టాలు అందుకొన్నారు.

శైలి :
విశ్వం శైలి మధురమైనది. సామాన్య పాఠకునకు అర్థం అయ్యే పదాలు ప్రయోగిస్తాడు. తేలికైన సంస్కృత పదాలు ప్రయోగిస్తాడు. అంత్యప్రాసలకు ప్రాధాన్యం ఇస్తాడు.

II. వ్యక్తికరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) చరిత్రలో మైలురాళ్ళుగా నిల్చిన అంశాలేవి? ఇవి దేనికి ప్రతీకగా భావిస్తున్నావు?
జవాబు:
గుహలలో నివసించిన రోజులలో మానవుడు గీసిన కుడ్యచిత్రాలు చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. అది మానవునిలోని పరిశీలనాశక్తికి, కళాదృష్టికి ప్రతీకగా భావించవచ్చును.

అడవులలో సంచరించిన రోజులలోనే పాటలు పాడడం మానవుడు ప్రారంభించాడు. అది చరిత్రలో మైలురాయి. ఇది మానవునిలోని కళాదృష్టికి, పాటలు పాడాలి అనే అతని తపనకు ప్రతీక.

గులకరాళ్ళమీద కాలికి గజ్జెకట్టిన దృశ్యం చరిత్రలో మైలురాయి. అతనిలో నాట్య ప్రవృత్తికి, శాస్త్రీయ నృత్యాభిలాషకు ఇది ప్రతీక.

దిక్కులు పిక్కటిల్లేలా ఘీంకరించిన రోజు మానవచరిత్రలో మైలురాయి. ఇది అతని ధైర్యానికి, విజయానికి ప్రతీక. చక్కని నొక్కులతో చిక్కని పదాలు పాడిన రోజు కూడా చరిత్రలో మైలురాయి. అది మానవునిలోని రచనాశక్తికి ప్రతీక.

చక్రం కనుగొన్న రోజు, చిత్రలేఖనం చేసిన రోజు, నిప్పును కనుగొన్నరోజు, తప్పటడుగులు మాని తాండవమాడిన రోజు, కూతలు మాని మధురమైన భాష నేర్చిన రోజు, పాటలు రచించిన రోజు అన్నీ చరిత్రలో మైలురాళ్ళే. అవి అన్నీ మానవునిలోని అభివృద్ధి చెందాలనే కాంక్షకు, సాధించాలనే తపనకు, సుఖపడాలి అనే కోరికకు, భవిష్యత్తు గురించిన ఆలోచనలకు ప్రతీకలు.

ఆ) “మిన్నులు పడ్డ చోటి నుంచి……….. తిన్నగా ఎదిగి మిన్నందుకుంటున్న చిన్నవాడు మానవుడు” అని కవి వర్ణించాడు. ఈ వాక్యాల మీద నీ అభిప్రాయమేమిటి?
జవాబు:
మానవులకు చిన్నతనంలో ఒక కోరిక ఉంటుంది. దూరంగా చూస్తే, ఆకాశం భూమి కలసినట్లు కనిపిస్తుంది. అక్కడకు వెళ్ళి, ఆకాశం ముట్టుకోవాలని ఉంటుంది. కానీ, అది తీరదు.

ఆది మానవుడు జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధించాడు. ఎంతో అభివృద్ధిని సాధించాడు. కానీ మొదట్లో ఆదిమానవుడు ప్రకృతిని, ఆకాశాన్ని చూసి భయపడేవాడు. క్రమేణా భయం తగ్గింది. అంటే ప్రకృతిలో చాలా చిన్నవాడు మానవుడు. అటువంటివాడు అంతరిక్ష పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగాడు. అంటే చాలా అభివృద్ధిని సాధించాడు. ఇంకా సాధించవలసింది చాలా ఉంది.

అందుచేత “మిన్నందుకొంటున్న చిన్నవాడు” అన్నాడు కవి. మిన్నందుకోవడం బాగా ఉన్నత స్థితికి వెళ్ళడం. అంటే మానవుడు ఇంకా చాలా అభివృద్ధిని సాధించాలి అని కవి భావన. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న “చిన్నవాడు” అనడంలో మానవజాతి ఆవిర్భావం జరిగి తక్కువ కాలమే అయ్యిందని కవి భావన. ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు మానవజాతి పురోగమిస్తుంది అని కూడా కవి భావన. దినదినాభివృద్ధి చెందుతుందని, చెందాలని కవిగారి విశ్వాసం. ఆకాంక్ష.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ఇ) మానవ చరిత్రలో అన్నీ అసాధారణ పర్వదినాలే అనడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది?
జవాబు:
మానవచరిత్రలోని తొలి రోజులలో ఆదిమానవుడు జంతువులతో సమానంగా జీవించాడు. జంతువులకు, ప్రకృతిలోని వర్షాలకు, గాలులకు, ఉరుములకు, మెరుపులకు భయపడి బిక్కుబిక్కుమంటూ కొండగుహలలో బ్రతికాడు. అటువంటి మానవుడు భయం విడిచి పెట్టాడు. ధైర్యం పుంజుకున్నాడు. అసాధారణ పర్వదినాలను సృష్టించాడు. గోడలపై జంతువుల బొమ్మలు చిత్రించి ఒక పర్వదినం సృష్టించాడు. పాటలు పాడాడు. అతనిలోని కళాతృష్ణను వ్యక్తీకరించిన ఆ రోజు కూడా పర్వదినమే. కాలికి గజ్జె కట్టిన రోజు – మానవుని ఉత్సాహాన్ని గమనించిన ఆ రోజునూ కవి పర్వదినమన్నాడు. చక్కని పదాలతో పాటలను అల్లిన మానవునిలోని కవితాశక్తిని గమనించి, ఆ రోజును పండుగ దినంగా కవి భావించాడు. చక్రం కనుగొన్న రోజు నిజంగా మానవజాతికి పర్వదినమే. అక్కడనుండే మానవజాతి అసలైన అభివృద్ధి ప్రారంభమైంది. . కనుకనే దాన్ని పర్వదినమన్నాడు కవి. నిప్పును కనుక్కొని పండుగ రోజుకు కమ్మని వంటకాలు సిద్ధచేయడం మరి పండుగే కదా ! మానవజాతికి, అదే పేర్కొన్నాడు కవి.

తప్పటడుగులు మాని, తాండవం చేసిన రోజును మనిషిలో ఉప్పొంగిన ఉత్సాహానికి పరవశించిన పర్వదినంగా పేర్కొన్నాడు కవి. మధురభాష నేర్చుకొన్న రోజును మానవుల భావ వ్యక్తీకరణకు అవకాశం దొరికింది కనుక ఆ రోజును పర్వదినంగా కవి పేర్కొన్నాడు. తేలికైన మాటలతో పాటలల్లిన రోజున మానవునిలోని కవిత్వ రచనాశక్తి బయటపడింది కనుక దానిని కూడా పండుగరోజుగా కవి పేర్కొన్నాడు.

వరిధాన్యం పండించిన రోజు నాగరిక మానవుడు ఆవిర్భవించాడు కనుక, అది పర్వదినమన్నాడు కవి. కళలు, కవిత్వం, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం వికసించిన రోజులన్నీ మానవుల అభివృద్ధినీ, పురోగతినీ ప్రకటించిన రోజులే. కనుక అవి అన్నీ పర్వదినాలే అన్నాడు కవి.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడున్నాయని కవి వర్ణించాడు గదా ! దీనినెలా సమర్థిస్తావు?
జవాబు:
కళ :
ప్రకృతిలోని అందాలకు మానవుడు పరవశించాడు. దానిని అనుకరించడానికి ప్రయత్నించాడు. గుహలలో నివసించిననాడే గోడలపై జంతువుల బొమ్మలు చిత్రించాడు. అడవులలో నివసించే రోజులోనే మోడులు కూడా చిగురించేలా పాడాడు. గులకరాళ్ళ ములుకుల మీద గజ్జెకట్టి నాట్యం చేశాడు. ఇవి అన్నీ మానవునిలోని కళాశక్తికి నిదర్శనాలు. అందుచేత ‘కళ’ మానవ పురోగతిలో తోడుగా నిలిచి అతని మనసుకు ఉత్సాహాన్ని నింపింది.

కవిత :
ఘీంకరించడమే కాదు. చక్కని నొక్కులు గల చిక్కని పదాలతో పాటలు రచించి పాడుకొన్నాడు. నాలుగు గీతలతో ఒక చిత్రాన్ని రచించాడు. తప్పటడుగులు మాని శాస్త్రీయ నృత్యం చేశాడు. కూతలు మాని భాష నేర్చుకొన్నాడు. అలతి పదాలతో పాటలు అల్లుకొన్నాడు. ఇవి అన్నీ మానవునిలోని కవితాసక్తిని నిరూపిస్తున్నాయి. అందుచేత ‘కవిత్వం’ మానవ పురోగతిలో అడుగడుగునా తోడై కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఆహ్లాదాన్ని పెంచింది.

విజ్ఞానం :
మానవుని పురోగతిలో ‘విజ్ఞానం’ ప్రధానపాత్ర పోషించింది. కళ, కవిత్వాలు అతనిలోని విజ్ఞానాన్ని తట్టిలేపాయి. శోధించాడు, సాధించాడు. చక్రం కనుగొన్నాడు. కష్టంగా బరువులెత్తినవాడు సులువుగా బరువులను తరలించాడు. జీవితాన్ని తన విజ్ఞానంతో సుఖమయం చేసుకొన్నాడు. నిప్పును కనుగొన్నాడు. మానవజీవితంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. కమ్మని భోజనం దొరికింది. ధాన్యం పండించాడు. సౌఖ్యమంతమైన రోజులు సృష్టించాడు. అద్భుతాలెన్నో సృష్టించాడు. అంతరిక్ష పరిశోధనల దాకా అతని విజ్ఞానం పురోగమించింది. పురోగమిస్తుంది.

పై వాటిని పరిశీలిస్తే మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడై అతనిని ఆకాశమంత ఎత్తుకు పెంచాయి అనడం సమర్థనీయమే.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ఆ) మాణిక్య వీణ కవితా సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
‘మాణిక్య వీణ’ పాఠం ఆధారంగా మానవ పరిణామ క్రమాన్ని సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
మంత్రాలకు చింతకాయలు రాలవు. అట్లే పద్యం ధాటికి చింతలు పారిపోవు. కేవలం రోగాలను పరీక్షించే యంత్రాల వలన రోగాలు తగ్గవు. అట్లే ఏవేవో ఉపాయాల వలన సమాజంలోని రుగ్మతలు పోవు.

సృష్టిలో మానవుడు పుట్టిన లక్షల సంవత్సరాల క్రితమే ప్రకృతిని ప్రేమించాడు. ప్రకృతి అందాలకు పరవశించాడు. ఆనాడే ప్రకృతిని జయించాలనుకొన్నాడు. గుహలలో నివసించిన నాడే గోడల పై జంతువుల బొమ్మలను చిత్రించాడు.

అడవులలో ఆదిమానవుడు సంచరించిన నాడే పాటలు పాడాడు. నృత్యం చేశాడు. దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడమే కాదు చిక్కనైన పదాలతో చక్కని పాటలు పాడాడు.

చక్రం కనుగొన్నాడు. చరిత్రలో ఆ రోజు ప్రముఖమైనది. నాలుగు గీతలతో చక్కని బొమ్మను చిత్రించిన రోజు కూడా ప్రముఖమైనదే. నిప్పును కనుగొన్నాడు. అది మానవ జీవితంలో మార్పును తెచ్చిన శుభదినం. తప్పటడుగులు మాని, తాండవం చేసిన రోజు కూడా శుభదినం.

కూతలు మాని మధురమైన భాష నేర్చుకొన్న రోజు కూడా నిజంగా మంచిరోజు. తేలిక పదాలతో పాటలు అల్లుకొన్న రోజు చరిత్రలో పర్వదినం. వరి ధాన్యం పండించిన రోజు కూడా పర్వదినం. అన్నీ పర్వదినాలే.

అలాగ అన్నీ కలిసి, పెనవేసుకొన్నాయి. కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం మెరుపులై మానవుని నడిపించాయి. మిన్నులు పడ్డచోటు నుండి నిటారుగా ఎదిగాడు. ఆకాశమంత ఎత్తు ఎదిగాడు. అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాడు మానవుడు. అయినా ఇంకా చాలా అభివృద్ధి చెందవలసిన చిన్నవాడు మానవుడు.

ఏనాటి నుండో నడుస్తున్న ఈ సుదీర్ఘమైన మానవ జీవనయాత్రలో మానవుని వదలనివి కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం. మానవునితో నడిచేవీ, నడిపించేవీ అవే.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) నీ చుట్టూ ఉన్న పరిసరాల్లో, మానవ జీవితంలో కలిగిన మార్పులను, అభివృద్ధిని వర్ణిస్తూ పది పంక్తులకు తక్కువ కాకుండా ఒక కవితను రాయండి.
జవాబు:
రోడ్లన్నీ నాడు బురదతో జర్రు జర్రు
నేడు హారన్లతో బర్రు బర్రు
నాడు ధర మీదే మా చదువులు
నేడు ధరల మీదే మా చదువులు
నాడు మాస్టార్లంటే భయం భయం
నేడు విద్యాహక్కు చట్టమంటే ప్రియం ప్రియం
అప్పుడందరూ రైతులే, అన్నీ పొలాలే
ఇప్పుడందరూ నేతలే, అన్నీ బిల్డింగులే
అప్పుడు సినిమాలే ఎరగం
ఇప్పుడు సినిమాలే జగం
నాడు చదువంటే చాలా కష్టం
నేడు చదువంటే చాలా ఇష్టం
నాడు అదే స్వర్గం
నేడు ఇదో స్వర్గం.

ఆ) విద్వాన్ విశ్వం కవిత్వాన్ని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మహబూబ్ నగర్,
x x x x x

ప్రియమైన రాజేష్ కు,
నీ మిత్రుడు సురేష్ వ్రాయు లేఖ.
ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

విద్వాన్ విశ్వం రచించిన ‘మాణిక్య వీణ’ పాఠం చాలా బాగుంది. అది వచన కవిత. దానిలో ఉపయోగించిన ప్రాస పదాలు చాలా బాగున్నాయి. మానవజాతి పురోగతిని చాలా చక్కగా వర్ణించారు. సందర్భానికి తగిన పదాలు ప్రయోగించారు. కవితా వస్తువు కూడా ఎక్కడా కుంటుపడకుండా చాలా చక్కగా సాగింది.

‘మంత్రాలకు చింతకాయలు రాలతాయా !’ అనే నానుడితో కవిత ప్రారంభమౌతుంది. ఈ వాక్యంలోనే కవి చెప్పబోయే విషయాన్ని సూచించాడు. మానవ ప్రయత్నం లేకపోతే ఏ పనీ జరగదు అని చెప్పాడు. అదే ఆయన కవితాశిల్పం.

గోడలపై మానవుడు గీసిన బొమ్మల గురించి చెబుతూ, గుర్రాలు, జింకల బొమ్మలు చిత్రించాడన్నాడు. రెండూ వేగానికి సంకేతాలే. అంటే మానవుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాడని బొమ్మల ద్వారా చెప్పాడు. పదాల ద్వారా చెప్పకుండా, సంకేతాల ద్వారా చెప్పడం ఉత్తమ కవితా లక్షణం. దానిని నిరూపించాడు విశ్వం.

“మొక్కలు నిక్కి చూచేలా – చక్కని నొక్కులతో చిక్కని పదాలు పాడుకొన్నాడు” అనేది కూడా అద్భుతమైన వర్ణన. వృత్త్యనుప్రాసాలంకారం ప్రయోగించాడు. ఇలాగే జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం మూడూ సమానార్థకాలుగా కనిపిస్తాయి. ఒకదాని కంటే ఒకటి ఉన్నతమైనవి.

తప్పక నీవు ఈ కవిత చదువు. ఉంటా.

ఇట్లు
నీ స్నేహితుడు,
కె.సురేష్,

చిరునామా :
పేరు : జి. రాజేష్,
10వ తరగతి, సి. సెక్షన్, నెం. 4,
పాఠశాల : xxxxxx. గ్రామం : xxxxxx.
మండలం : xxxxxx. జిల్లా : xxxxxx.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

దిన, వార పత్రికల ఆధారంగా, మీకు నచ్చిన రెండు వచన కవితల్ని సేకరించి, అంశాల ఆధారంగా కింది పట్టికను పూరించండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 5

(గమనిక : ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రభూమి వంటి దినపత్రికలు వారానికి ఒకసారి కవితలు ప్రచురిస్తాయి. స్వాతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి మొదలైన వారపత్రికలలో ప్రతివారం ప్రచురిస్తారు. గమనించి, సేకరించి, పట్టిక నింపాలి.)

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాలు చదివి గీతగీసిన పదాలకు అర్థం రాయండి. పదాలతో సొంతకార్యాలు రాయండి.

అ) రోదసి లోకి దూసుకెళ్ళిన మరో ఉపగ్రహం
జవాబు:
రోదసి = అంతరిక్షం
సొంతవాక్యం : రోదసిలో పరిశోధిస్తే ఎన్నో అద్భుతాలు తెలుస్తాయి.

ఆ) విద్యార్థులంతా పరీక్షలకు ఆయత్తమవుతున్నారు.
జవాబు:
ఆయత్తమవు = సిద్ధపడు
సొంతవాక్యం : మేము తిరుపతికి వెళ్ళడానికి ఆయత్తమవుతున్నాము.

ఇ) రుగ్మత ఉన్న ఈ సమాజానికి మానవీయ విలువలతో చికిత్స అవసరం.
జవాబు:
రుగ్మత = రోగం
సొంతవాక్యం : రుగ్మత తగ్గాలంటే వైద్యం తప్పదు.

ఈ) కళవళపడటమెందుకు? నెమ్మదిగా జవాబు చెప్పు,
జవాబు:
కళవళపడటము = కలవరపడటము
సొంతవాక్యం : జీవితంలో కష్టాలకు కళవళపడటం మంచిదికాదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

2. పాఠం ఆధారంగా కింది వాక్యాలకు సమానమైన పదాల్ని వెతికి రాయండి.

ఒకరిని చూసి మరొకరు చేయడం
పనిచేయడానికి సిద్ధమవడం
అద్భుతంగా నాట్యమాడటం
పనిని మొదలుపెట్టడం

జవాబు:

ఒకరిని చూసి మరొకరు చేయడం అనుకరించడం
పనిచేయడానికి సిద్ధమవడం ఆయత్తమవడం
అద్భుతంగా నాట్యమాడటం తాండవమాడడం
పనిని మొదలుపెట్టడం తిన్నగా ఎదగడం

3. క్రింది జాతీయాలను ఏయే సందర్భాల్లో ప్రయోగిస్తారో తెలిపి సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
అ) మంత్రాలకు చింతకాయలు రాలడం :
జవాబు:
పనులు చేయకుండా కేవలం కబుర్లు మాత్రమే చెబితే ప్రయోజనం లేదని చెప్పే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం :
మంత్రాలకు చింతకాయలు రాలవు గానీ, పని మొదలుపెట్టండయ్యా.

ఆ) మిన్నందుకోడం :
జవాబు:
చాలా అభివృద్ధి చెందడం అనే అర్థంలో దీనిని ఉపయోగిస్తారు. ఆకాశం అందదు. కానీ, దానిని కూడా అందుకున్నాడంటే అతనికి అసాధ్యం లేదు కదా !
సొంతవాక్యం :
తెలివితేటలు పెంచుకుంటే మిన్నందుకోడం సాధ్యమే.

ఇ) గజ్జెకట్టడం :
జవాబు:
నాట్యం ప్రారంభించేవారు ముందుగా గజ్జె కట్టుకుంటారు. గజ్జె కట్టడం జరిగితే తప్పనిసరిగా నాట్యం చేస్తారని అర్థం. పనిలో చురుకుగా పాల్గొని అన్నీ తానై చేసేవారిని గూర్చి ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం :
రుద్రమదేవి కదనరంగంలో గజ్జెకట్టి కాళికలా నర్తించింది.

4. కింది పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలు రాయండి.
అ) మిన్ను :
1) ఆకాశం
2) నింగి

అ) తాండవం :
1) నాట్యం
2) నృత్యం

ఇ) రుగ్మత :
1) రోగం
2) జబ్బు

ఈ) జ్ఞానం :
1) తెలివి
2) మేధ

5. కింది రాశ్యాల్లోని వికృతి పదాలను గుర్తించి పాఠం ఆధారంగా ప్రకృతి పదాలు చేర్చి తిరిగి వాక్యాలు రాయండి.

అ) అమ్మ బాసలోనే నేను మాట్లాడతాను.
జవాబు:
వికృతి = బాస,
ప్రకృతి = భాష
వాక్యం : అమ్మ భాషలోనే నేను మాట్లాడతాను.

ఆ) మన కవులు రాసిన కైతలు భారతి మెడలో అలంకరించిన హారాలు.
జవాబు:
వికృతి = కైతలు, ప్రకృతి = కవితలు
వాక్యం : మన కవులు రాసిన కవితలు భారతి మెడలో అలంకరించిన హారాలు.

ఇ) విన్నాణము పెంచుకోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది.
జవాబు:
వికృతి = విన్నాణము, ప్రకృతి = విజ్ఞానము
వాక్యం : విజ్ఞానము పెంచుకోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది.

ఈ) సింహాలు గొబల్లో నిద్రిస్తున్నాయి.
జవాబు:
వికృతి = గొబ, ప్రకృతి = గుహ
వాక్యం : సింహాలు గుహల్లో నిద్రిస్తున్నాయి.

వ్యాకరణాంశాలు

1) కింది పదాల్లో నుగాగమ సంధి పదాలను గుర్తించి, విడదీసి సూత్రం రాయండి.
నిట్టనిలువు, తెల్లందనము, పోయేదేమి, తళుకుంగజ్జెలు, మహోపకారం, సరసపుఁదనము

నుగాగమ సంధి పదాలు :
1) తెల్లందనము
2) తళుకుంగజ్జెలు
3) సరసపుఁదనము
తెల్ల + తనము
సరసపు + తనము
తళుకు + గజ్జెలు

సూత్రము :
సమాసంబుల నుదంతంబులగు స్త్రీ సమంబులకు, పుం, పులకు పరుష సరళములు పరములగునపుడు నుగాగమంబగు.
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 1
( గమనిక : విద్యార్థుల సౌకర్యం కొఱకు మిగిలినవి కూడా క్రింద ఇవ్వబడ్డాయి.)

1) నిట్టనిలువు = నిలువు + నిలువు – ద్విరుక్తటకారదేశ సంధి
సూత్రం : ఆమ్రేడితము పరమగునపుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబుల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు.

2) పోయేదేమి = పోయేది + ఏమి – ఇత్వసంధి
సూత్రం : ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.

3) మహోపకారము = మహా + ఉపకారము – గుణసంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋలు పరమైతే వానికి క్రమంగా, ఏ, ఓ, అర్లు ఆదేశమగును.

2) కింది వాటిని జతపరచండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 2
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 3

3) కింది వాక్యాలను పరిశీలించండి.
అ) మిమ్ము మాధవుడు రక్షించుగాక !
AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 4
వివరణ :
పై వాక్యాలలో ఒకే శబ్దం వేర్వేరు అర్థాలను అందిస్తుంది. ఇలాగ విభిన్న అర్థాలు గల పదాలతో ఉండే దానిని ‘శ్లేషాలంకారం’ అంటారు. అంటే నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేషాలంకారం.

కింది లక్ష్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి, సమన్వయం చేయండి.
1. రాజు కువలయానందకరుడు.
అర్థం :
1. రాజు (దేశాన్ని పాలించే ప్రభువు) కువలయమునకు (భూమండలానికి) ఆనందకరుడు.
2. రాజు (చంద్రుడు) కువలయములకు (కలువలకు) ఆనందకరుడు.
వివరణ :
పై వాక్యంలో రాజు (పరిపాలకుడు, చంద్రుడు), కువలయం (భూమి, కలువ) అనేవి వేర్వేరు అర్థాలలో ప్రయోగించారు. కనుక అది శ్లేషాలంకారం.

2. నీవేల వచ్చెదవు.
అర్థం :
1. నీవు ఏల (ఎందుకు) వచ్చెదవు.
2. నీవు ఏల (పరిపాలించడానికి) వచ్చెదవు.
వివరణ :
పై వాక్యంలో ‘ఏల’ అనే పదాన్ని ఎందుకు’, ‘పరిపాలించడానికి’ అనే విభిన్న అర్థాలలో ప్రయోగించారు. కనుక, అది శ్లేషాలంకారం.

అదనపు సమాచారము

సంధులు

1) కట్టెదుట = కడు + ఎదుట – ద్విరుక్తటకారాదేశ సంధి
2) నిట్టనిలువు = నిలువు + నిలువు – ఆమ్రేడిత సంధి
3) గుర్రాలు = గుర్రము + లు – లులనల సంధి
4) పదాలు = పదము + లు – లులనల సంధి
5) మిన్నందుకొన్న = మిన్ను + అందుకొన్న – ఉత్వ సంధి
6) ఆయత్తమయినాడు = ఆయత్తము + అయినాడు – ఉత్వ సంధి
7) ఏమిటని = ఏమిటి + అని – ఇత్వ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) మానవ చరిత్ర మానవుల యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం
2) సమాజ రుగ్మతలు సమాజంలోని రుగ్మతలు షష్ఠీ తత్పురుష సమాసం
3) చక్కని నొక్కులు చక్కనైన నొక్కులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) చిక్కని పదాలు చిక్కనైన పదాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5) శుభదినం శుభమైన దినం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
6) తప్పటడుగులు తప్పు అయిన అడుగులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
7) అలతి మాటలు అలతియైన మాటలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
8) అనాది ఆదికానిది నఇ్ తత్పురుష సమాసం
9) అందచందాలు అందమును, చందమును ద్వంద్వ సమాసం

ప్రకృతి- వికృతి

కుడ్యము – గోడ
విజ్ఞానము – విన్నాణము
భాషలు – బాసలు
పద్యము – పద్దెము
కవిత – కైత
మూలిక – మొక్క
పర్వము – పబ్బము
గుహ – గొబ
యంత్రము – జంత్రము

పర్యాయపదాలు

1) మాట : 1) పలుకు 2) వచనము 3) ఉక్తి
2) అడుగు : 1) పాదం 2) చరణం 3) పదం
3) గుర్రాలు : 1) అశ్వములు 2) హయములు 3) తురంగములు
4) పొట్ట : 1) కడుపు 2) కుక్షి 3) ఉదరం
5) చింత : 1) చింతచెట్టు 2) ఆలోచన 3) దుఃఖము
6) మనిషి : 1) మానవుడు 2) నరుడు 3) మర్త్యుడు 4) మనుజుడు
7) దిక్కు : 1) దిశ 2) ఆశ 3 ) దెస 4) కడ
8) కాయ : 1) వీణకు అమర్చే సొరకాయ 2) చెట్టుకాయ 3) బిడ్డ 4) జూదపు సారె

కవి పరిచయం

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ 6
విద్వాన్ విశ్వం జననం జననీ జనకులు : అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. వీరిది అనంతపురం జిల్లాలోని తరిమెల గ్రామం. జననీ జనకులు లక్ష్మమ్మ, రామయ్య దంపతులు.

రచనలు : “ఇంత మంచి పెన్నతల్లి ఎందుకిట్లు మారెనో?
ఇంత మంది కన్నతల్లి ఎందుకెండి పోయెనో ?”
అని ఆవేదనతో ‘పెన్నేటిపాట’ను సృష్టించాడు. ‘ప్రేమించాను’ అనే నవల, ‘ఒకనాడు’, ‘పెన్నేటిపాట’ అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కలం నుండి జాలువారిన రచనలు.

పాండిత్యం – పత్రికలు : సంస్కృతాంధ్రాంగ్ల భాషా పండితులు విద్వాన్ విశ్వం. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. పత్రికా సంపాదకునిగా “అవి – ఇవి’, ‘తెలుపు – నలుపు’, ‘మాణిక్య వీణ’ మొదలైన శీర్షికలను భాష, సాహిత్యం , సమాజం, నైతిక విలువలు తదితర అంశాలపై సంపాదకీయాలు రాశారు. పత్రికల్లో వివిధ హోదాలలో పనిచేస్తూనే సంస్కృత భాషలోని అనేక గ్రంథాలు తెలుగులోకి అనువదించారు.

విశ్వం – విశ్వరూపం : సాహితీవేత్తగా, రాజకీయనాయకునిగా, పత్రికా సంపాదకునిగా బహుముఖీన దర్శనమిచ్చిన ప్రతిభాశాలి విద్వాన్ విశ్వం. ఆయన సాహిత్య సేవకు కళాప్రపూర్ణ, డి.లిట్. పట్టాలనందు కున్నాడు.

గేయాలు అర్థాలు భావాలు

1. అవగాహన – ప్రతిస్పందన

గేయం -1

మంత్రాలతో చింతకాయలు
రాలనప్పుడు పద్యం
సంత్రాసంతో చింతలు
పారిపోతాయా?
అర్థాలు :
సంత్రాసం = మిక్కిలి భయం
చింతలు = బాధలు

భావం:
మంత్రాలతో చింతకాయలు రాలవు. అలాగే పద్యం నిర్మాణంలోని యతులు, ప్రాసలు, గణాలు మొదలైన వాటికి భయపడితే ఆ భయంతో మనలోని వేదనలు, బాధలు తగ్గవు. అంటే మన బాధలు, భయాలను వచన కవితలోనైనా, వ్యక్తీకరించాలి. అలా వ్యక్తీకరిస్తేనే మనశ్శాంతి కలుగుతుంది.

గేయం -2

యంత్రాలతో జబ్బులు
వయం కానప్పుడు
తంత్రాలతో సమాజరుగ్మతలు
దారికి వస్తాయా?
ఆంటే అనవచ్చు,
ఔనని కొందలుతో
అనిపించనూ వచ్చు.
అర్థాలు:
తంత్రము = హేతువు
రుగ్మత = రోగం, జబ్బు

భావం :
రోగిని పరీక్షించే యంత్రాల వలన రోగాలు తగ్గవు. ఉపాయాలు, హేతువులు అన్వేషిస్తూ, కాలక్షేపం చేస్తే సమాజం లోని చెడు లక్షణాలు, దురాచారాలు నిర్మూలనం కావు. ఈ విషయాలను కొంతమంది ఆమోదిస్తారు. కొంతమంది ఇష్టం లేకపోయినా కాదనలేక ఔనంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

గేయం -3

పొట్టలోని పుట్టకురుపుతో సంఘం
కట్టెదుట కళవళపడి పోతుంటే
నిట్టనిలువున రోదసిలోనికి
కట్టలు కట్టుకొని దూసుకొనిపోయి
కట్టుకొని పోయేదేమిటని
అంటే అవమావచ్చు,
బావని కొందలతో
అనిపించమావచ్చు.
అర్థాలు:
పుట్టకురుపు = వ్రణము
కళవళపడు = కలతపడు
రోదసి = అంతరిక్షము
భావం :
మనిషిలోని చెడు లక్షణాలు, దురాచారాలు, మూఢ నమ్మకాలు అనే పుట్ట కురుపుతో కలతపడుతుంటే రాకెట్లను అంతరిక్షంలోకి పంపుతూ చేసే పరిశోధనల వలన ప్రయోజన మేముంది ? అదంతా వృథా అని కొంతమంది అనవచ్చును. కొంతమందిచేత అనిపించవచ్చును.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఈ కవితలో ప్రాస పదాలు ఏమున్నాయి?
జవాబు:
ఈ కవితలో చింతకాయలు- చింతలు, అనవచ్చు అనిపించనూవచ్చు, పొట్ట-పుట్ట, కట్టెదుట- నిట్టనిలువు, కట్టలు – కట్టుకొని, కాడు – మోడు, చక్కని – చిక్కని, మొక్కలు – నిక్కి కిలకిలలు – కలభాషలు, కలమ – కళలు, విజ్ఞానం – ప్రజ్ఞానం, చిరంజీవి – చిరంతనుడు, జ్ఞానం – విజ్ఞానం అనే ప్రాసపదాలు ఉన్నాయి.

ప్రశ్న 2.
“అంటే అనవచ్చు, ఔనని కొందఱతో అనిపించనూ వచ్చు” అనే వాక్యాల ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
ఒకదానికి ఇంకోదానికి ముడివేసి, కొంతమంది సమాజపు అభ్యున్నతినీ, శాస్త్ర పరిశోధనలనూ ప్రశ్నిస్తే ప్రశ్నించవచ్చును. వారి వాదానికి మద్దతుగా ఇంకా కొంతమందితో ఔననిపించవచ్చును. ఎంతమంది ప్రశ్నించినా, అడ్డు తగిలినా, వాద ప్రతివాదనలు చేసినా మానవజాతి పురోగమిస్తూనే ఉంటుంది. అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.

ప్రశ్న 3.
సమాజ రుగ్మతలు’ అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు చెప్పండి.
జవాబు:
సమాజ రుగ్మతలు’ అంటే సమాజానికి అనగా సంఘానికి పట్టిన జబ్బులు.

  1. అంటరానితనాన్ని పాటించడం
  2. కులమతభేదాలు పాటించడం
  3. మూఢనమ్మకాలు కలిగియుండడం
  4. అవినీతి దురాచారం
  5. కులసంఘాలు, మత సంఘాలు మొ||నవి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 4.
“పొట్టలోని పుట్టకురుపుతో సంఘం కట్టెదుట కళవళ పడిపోవడం” అంటే ఏమిటి?
జవాబు:
పొట్ట అంటే సంఘంలోని కీలకమైన స్థానాలు. పుట్టకురుపు అంటే ఎప్పటికీ తగ్గకుండా, వ్యాపించే గుణం కలిగిన పెద్ద ప్రణం. అంటే సమాజం అభివృద్ధికి కారకులు కావలసిన వారే అవినీతి, బంధుప్రీతితో సంఘాన్ని పాడుచేస్తున్నారు. అవినీతిని అంత మొందించాలని సామాన్యులు భావించినా, ఏమీ చేయలేని స్థితి. అందుచేత అవినీతి అనే పుట్టకురుపు సంఘమంతా వ్యాపిస్తోంది. మొత్తం సంఘాన్ని కలుషితం చేస్తోంది. దీనికితోడు, కుల, మత, ప్రాంత విభేదాలు, దురాచారాలు మొదలైనవి కూడా అవినీతిని ఆసరా చేసుకొని విజృంభిస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా మన సంఘం మన ఎదురుగానే మనలేక, ఎవరినీ ఏమనలేక కలవరపడుతోంది.

గేయం – 4

మనిషి కనువిచ్చినప్పుడే
నాని అందచందాలు చవిగొన్నాడు.
ఆనాడే ప్రకృతిని
ఆధీనం చేసుకోవడానికి
అందలి రంగులమా రవళిని
అనుకరించడానికి కూడా ఆయత్తమయివాడు.
గుహలలో వివసించేవాడే
గోడలపై గుర్రాలు, జింకలూ గీసుకున్నాడు
అర్థాలు :
కనువిచ్చుట – జ్ఞానం కలగడం) జన్మించడం
రవళి = ధ్వని
ఆయత్తము = సిద్ధము

భావం:
మానవ జన్మ ప్రారంభమైన తొలి రోజులలోనే ఆది మానవుడు ప్రకృతి అందచందాలను గమనించాడు. ఆనాడే ప్రకృతిని జయించడానికి ప్రయత్నించాడు. ప్రకృతిలోని రంగులనూ, అందాలనూ చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ప్రకృతిలోని పక్షులు, జంతువుల అరుపుల ధ్వనులను అనుకరించాడు. కొద్దిగా అభివృద్ధి చెంది గుహలలో నివసించి నప్పుడు ఆ గోడలపై గుజ్జాలూ, జింకలూ మొదలైన వేగంగా కదిలే జంతువుల బొమ్మలను చిత్రించాడు. ఆ బొమ్మల ద్వారా వేగవంతమైన తన అభివృద్ధిని అన్యాపదేశంగా చెప్పాడు.

గేయం – 5

కాడు వీడనప్పుడే
మోడులు చివురించేలా
పాడడం ఆరంభించినాడు
గులకతాల ములుకుమీదే
గొబ్బున కాలికి గల కట్టివాడు.
దిక్కులు పిక్కటిల్లేలా
ఘీంకరించుటే కాదు
మొక్కలు విక్కి చూచేలా
చక్కని నొక్కులలో
చిక్కని పదాలు పాడుకొన్నాడు.
అర్థాలు:
కాడు = అడవి
మోడు = ఎండిన చెట్టు
ములుకు = వాడియైన మొన
గొబ్బున = శీఘ్రంగా
నిక్కి = నిలబడి
నొక్కులు = వంపుసొంపులు
చిక్కని = గంభీరమైన, దట్టమైన
పదాలు = పాటలు

భావం:
కొంచెం అభివృద్ధి చెందిన ఆదిమానవుడు అడవిలో సంచరించినప్పుడే ఎండిన చెట్లు కూడా చిగురించేలా గొంతెత్తి పాడడం మొదలు పెట్టాడు. ఆ అడవిలో వాడియైన మొనదేలిన గులకరాళ్ల మీదనే శీఘ్రంగా కాలికి గజ్జెకట్టి ఆనందంతో నృత్యం చేశాడు. దిక్కులు పిక్కటిల్లేలా గర్జించాడు. క్రూరమృగాలను కూడా తన అరుపులతో భయపెట్టాడు. అంతేకాదు మొక్కలు కూడా తలయెత్తి చూచేలా చక్కని లయతో గంభీరమైన పదాలతో పాటలు పాడుకొన్నాడు.

గేయం -6

“చక్రం కనుక్కున్న రోజెంత
చరిత్రలో ప్రముఖ దివమో
చరచరా నాలుగు గీతలతో ఓ ఆకారం
విరచించిన రోజు అంతే ప్రముఖం
నిప్పును కనుక్కున్న నాడెంత శుభదినమో
తప్పటడుగులు మావి
తాండవం చేసిన వాడు అంతే శుభదినం.
అర్థాలు :
ప్రముఖము = ముఖ్యము
విరచించుట = ఉత్తమంగా రచించడం
శుభదినం = మంచి రోజు
తప్పటడుగులు = తడబడే అడుగులు
చరచరా = తొందరగా

భావం:
మానవ చరిత్రలో ఇంకా అభివృద్ధి చెందిన మానవుడు ‘చక్రం’ కనుగొన్న రోజు తన అభివృద్ధికి తొలిమెట్టు. చకచకా నాలుగు గీతలతో ఒక ఆకారాన్ని లిఖించిన రోజు కూడా అభివృద్ధికి సంకేత దినమే. ప్రముఖమైన రోజే, నిప్పును కనుగొన్న రోజు మానవజాతి పరిణామంలో గొప్ప శుభదినం. తడబడే అడుగులు మాని, శాస్త్ర బద్ధంగా ఉద్ధతమైన నృత్యం చేసిన రోజు కూడా అంతే శుభదినం.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ప్రకృతికీ, మనిషికీ ఉండే సంబంధం ఏమిటి?
జవాబు:
మనిషి కళ్ళు తెరవగానే తనచుట్టూ ఉన్న ప్రకృతి యొక్క అందచందాలకు పరవశుడయ్యాడు. ప్రకృతిని అతడు తన అధీనంలో ఉంచుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు. ప్రకృతిలోని రంగుల్నీ, ధ్వనుల్ని అనుకరించ డానికి ప్రయత్నం చేశాడు. ఈ విధంగా ప్రకృతితో మనిషి తాదాత్మ్యం చెందాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 2.
ఈ కవితలో పద సౌందర్యంతో వినసొంపుగా ఉన్న పదాలు ఏవి?
జవాబు:
ఈ కవితలో ప్రాస పదాలన్నీ పద సౌందర్యంతో వినసొంపుగా ఉన్నాయి. అంతేకాక ఎక్కువ పదాలు సౌందర్యవంతంగా ఉన్నాయి.
మంత్రాలు – సంత్రాలు, చింతలు – చింతకాయలు, సమాజ – రుగ్మతలు, యంత్రాలు – తంత్రాలు, అనవచ్చు – అనిపించనూవచ్చు, పొట్ట – పుట్ట, కట్టెదుట – కట్టలు కట్టుకొని, అననూవచ్చు – అనిపించనూవచ్చు. అందచందాలు, రంగులను – రవళినీ, కాడు – వీడు,
మోడు, గొబ్బున – గజ్జె కట్టడం, మొక్కలు • నిక్కి చక్కని నొక్కులు, చిక్కని పదాలు, చరచరా, విరచించిన,

తప్పటడుగులు, కిలకిలలు – కల భాషలు, అలతి – కలమ, కళలు, విజ్ఞానం – ప్రజ్ఞానం, తళతళలు, చిన్నవాడు, చిరంజీవి – చిరంతనుడు, మహాప్రస్థానం
మొదలైన’ పదాలు ఈ కవితలో పద సౌందర్యంతో వినసొంపుగా ఉన్నాయి.

ప్రశ్న 3.
చక్రం కనుగొనడం, నిప్పును కనుగొనడం చరిత్రలో అతి ముఖ్యమైనవని ఎందుకంటారు?
జవాబు:
1) చక్రం కనుగొనడం :
చక్రాన్ని కనుగొన్న తరువాతే బళ్ళు, రిక్షాలు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, రైళ్ళు, యంత్రాలు వగైరా వాడుకలోకి వచ్చాయి. నేటి పారిశ్రామిక అభివృద్ధి అంతా, ‘చక్రం’ తిరగడం మీదే ఆధారపడింది.

2) నిప్పును కనుగొనడం :
చెకుముకి రాయితో దూదిని వెలిగించి నిప్పును తయారుచేశారు. నిప్పు గురించి తెలియని ఆదిమానవుడు మొదట పచ్చి పదార్థాలు తిన్నాడు. పచ్చిమాంసం తిన్నాడు. నిప్పు కనిపెట్టాక పదార్థాలను ఉడకబెట్టి, రుచికరంగా తిన్నాడు. కాబట్టి, నిప్పును కనుగొనడం, చక్రంను కనుగొనడం అనేవి, ఆధునిక నాగరికతకు, మానవ ప్రగతికి సంకేతాలు.

ప్రశ్న 4.
‘తప్పటడుగులు మాని తాండవం చేసిననాడు శుభదినం’ అంటే ఏమిటి?
జవాబు:
చిన్నపిల్లలు తప్పటడుగులు వేస్తారు. నడకలు నేర్చాక తాండవ నృత్యం చేస్తారు. మనిషి రాతియుగంనాటి చీకటిని చీల్చుకొని, నవీన విజ్ఞానపు వెలుతురులోకి ప్రవేశించడాన్నే, తాండవ నృత్యంగా కవి సంకేతించాడు.

గేయం -7

కిలకిలలు మావి కలభాషలు నేర్చుకున్న రోజు
అలతి మాటలతో పదాలల్లుకున్న రోజు
కలను ధావ్యం పండించుకున్న రోజు
కళలను పండించుకున్న రోజు
అన్నీ గొప్ప రోజులే
మానవ చరిత్రలో
అన్నీ అసాధారణ పర్వదినాలే
అర్థాలు:
కలభాష = అవ్యక్త మధురమైన భాష
అలతి = తేలిక
కలమము = వరి పైరు
కళలు = విద్యలు
పర్వదినం = పండుగ

భావం :
మానవుడు, జంతువులు – పక్షులు లాగా అర్థంలేని కిలకిలలను మాని అవ్యక్త మధురమైన భాష నేర్చుకొన్న రోజు శుభదినం. తేలిక మాటలతో పదాలను అల్లుకున్న రోజు నిజంగా పండుగరోజు. 64 రకాల కళలను నేర్చుకొన్న రోజు మంచి రోజు. అవి అన్నీ గొప్ప రోజులే. మానవ చరిత్రలో అన్నీ అసాధారణమైన పర్వదినాలే.

గేయం – 8

అలా అలా కలగలిపి
పెనవేసుకొని
కళలూ కవితలూ
విజ్ఞానం ప్రజ్ఞానం
తళతళలతో తన్ను నడిపింపగా
మిన్నులు పడ్డ చోటునుండి
తిన్నగా ఎదిగి మిన్నందుకుంటున్న
చిన్నవాడు మానవుడు
చిరంజీవి మానవుడు
చిరంతనుడు మానవుడు
ఆవాదిగా నడుస్తున్న ఈ
మహాప్రస్థానంలో
అతగానివి వదలని
జతలు కళా కవితా
జ్ఞావం విజ్ఞానం
వానితో నడిచేవి
వానిని నడిపించేవీ అవే –
అవే కళా కవితా
జ్ఞావం విజ్ఞానం
ప్రజ్ఞానం
అర్థాలు:
విజ్ఞానం = విశేషమైన తెలివి
ప్రజ్ఞానం = మేధ
మిన్నులు పడ్డచోటు = సుదూరప్రాంతం (ఆకాశం భూమి కలిసినట్లు కనిపించే సుదూరప్రాంతం)
మిన్ను = ఆకాశం
చిరంజీవి = మరణం లేనివాడు
చిరంతనుడు = చాలాకాలపు వాడు (ప్రాతవాడు)
అనాది = బాగా పూర్వం
మహాప్రస్థానం = పెద్దదైన ప్రయాణం

భావం :
అలా అన్నీ కలగలిపి, ఒకదానితో ఒకటి పెనవేసు కొన్నాయి. కళలూ, కవితలూ, విశేషమైన తెలివి, మేధ అన్నీ మానవుని నడిపించాయి. దూరంగా దిక్కుల వైపు చూస్తే ఆకాశం, భూమి కలిసినట్లు కనిపిస్తుంది. అలాగ దానినే ఆదర్శంగా చేసుకొని, అభివృద్ధి చెంది ఆధునిక మానవుడు రోదసీలోకి ప్రయాణించాడు. అయినా మానవుడు ఇంకా అభివృద్ధి చెందుతున్న చిన్నవాడు. శాశ్వతమైనవాడు. చాలా పాతవాడు. చాలా పూర్వం నుండీ నడుస్తున్న ఈ సుదీర్ఘ ప్రయాణంలో మానవుని వదలనివి కళలు – కవితలు, జ్ఞానం – విజ్ఞానం, అవి మానవునితో అభివృద్ధి చెందుతున్నాయి. మానవునికి కర్తవ్యాన్ని బోధిస్తూ పురోగమింపచేస్తున్నాయి. అవే అవే కళాత్మకమైన కవిత్వం, జ్ఞానం, విజ్ఞానం కలగలిసిన ప్రజ్ఞానం.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
కవి వేటిని గొప్ప రోజులన్నాడు? ఎందుకు?
జవాబు:
మానవుడు
1) కిలకిలలు మాని కలభాషలు నేర్చుకొన్నరోజు
2) చిన్న చిన్న మాటలతో జానపదాలు అల్లుకొన్నరోజు
3) వరిధాన్యం పండించుకున్నరోజు
4) కళలను పెంపొందించుకున్న రోజు గొప్ప రోజులని కవి చెప్పాడు. ఎందుకంటే మానవుడు కళలను కవితలను ఆధారం చేసుకొని, విజ్ఞాన మార్గంలో ప్రయాణించాడు.

ప్రశ్న 2.
మీ దృష్టిలో ఏవి గొప్ప రోజులు? ఎందుకు?
జవాబు:
మాకు మంచి జరిగిన రోజులన్నీ మా దృష్టిలో గొప్ప రోజులే. ఎందుకంటే అవి మాకు ఆనందాన్ని, అభివృద్ధిని కలిగిస్తాయి. కనుక, మేము తొలిసారి నడక నేర్చుకొన్న రోజు గొప్పరోజు. ఎందుకంటే ఎవరి సహాయం లేకుండా నాకు నేనుగా ఈ రోజు నడవగలుగుతున్నాను. పరుగు పందేలలో పాల్గొంటున్నాను. బహుమతులు గెలుచుకొంటున్నాను. నాట్యం చేస్తున్నాను. చాలా పాటలకు నాట్యం చేయగలం.

మేము తొలిసారి మాటలు నేర్చుకొన్న రోజులు కూడా మా దృష్టిలో గొప్ప రోజులే. ఎందుకంటే మాటలు నేర్చుకోవడం వలననే నేడు మాట్లాడగలుగుతున్నాం.

తొలిసారి సైకిల్ తొక్కడం నేర్చుకొన్న రోజులు మరచిపోలేము. వేగంగా ప్రయాణించడానికి, గమ్యం చేరడానికి సైకిల్ బాగా ఉపయోగపడుతోంది.

మేము తొలిసారి ‘ఓనమాలు’ దిద్దిన రోజులు మరచిపోలేము. అలా నేర్చుకొన్న అక్షరాలే మాకీ వేళ జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడుతున్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 9 మాణిక్యవీణ

ప్రశ్న 3.
‘కళలూ, కవితలూ-పెనవేసుకోవడం’ అనే వాక్యాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు:
కళ అంటే అందం, విద్య అని అర్ధాలు. కవిత్వం అంటే భావాన్ని రసాత్మకంగా, ఆకర్షణీయంగా చెప్పడం. అంటే చక్కని పదాలతో, మంచి మంచి అలంకారాలతో ఒక భావాన్ని చెబితే అదే కళాత్మకమైన కవిత్వం అవుతుంది. చక్కని పదాలు, అలంకారాలు లేనిది కవిత్వం కాదు. అందుచేత కళ లేకపోతే కవిత్వానికి విలువ ఉండదు అని చెప్పవచ్చు.

కళలు 64 మానవుడు కష్టపడి సాధించినవి. మానవ జాతి అభివృద్ధిని సూచించేవి కళలు. మానవజాతి నిరంతరం కృషిచేసి కళలను సాధించింది. కళల వలన అభివృద్ధి, సంఘపరమైన గౌరవం మనిషికి లభిస్తుంది. అటువంటి కళలు నేర్చుకోవడంలో మానవుడు సాటిలేని ఆనందం పొందాడు. అటువంటి కళలను కవిత్వంలో చెప్పుకొని ఆనందించాడు. అంటే మానవ జీవితంలో కళలు, కవిత్వం పెనవేసుకొని పోయాయి. పాటకు సంగీతం అంటే స్వరం, లయ, గాన సరళి లేకపోతే బాగుండదు. అలాగే సాహిత్యం లేకపోతే అసలు బాగుండదు. కనుక పాటలో సంగీతం, సాహిత్యం ఎలా పెనవేసుకొని ఉంటాయో అలాగే మానవజీవితంలో కూడా కళలు, కవిత్వం విడదీయలేనంతగా కలసి పోయాయి.

ప్రశ్న 4.
“మిన్నందుకుంటున్న చిన్నవాడు” అని ఎందుకన్నాడు కవి?
జవాబు:
మానవుడు ఆదిమకాలంలో అనగా రాతియుగం రోజుల్లో నాగరికత లేకుండా జీవించేవాడు. అంటే బట్ట కట్టుకోవాలని కూడా తెలియని చిన్నపిల్లవాడిలా, చిన్నవాడుగా ఉండేవాడు.

ఇప్పుడు వైజ్ఞానిక యుగంలో కళలతో, కవిత్వంతో మిన్ను అందుకున్నాడు. అంటే ఆకాశం ఎత్తుకు పెరిగాడు. అంటే వైజ్ఞానికంగా అభ్యున్నతిని సాధించాడని భావం.

ప్రశ్న 5.
“కళా, కవితాజ్ఞానం, విజ్ఞానం ” అంటే ఏమిటి?
జవాబు:
‘కళ అంటే – తాను వెలుగుతూ ఇతరులను వెలిగించేది. ఈ కళలు 64. అందులో సుందరమైన సంగీతం, సాహిత్యం , చిత్రలేఖనం, నృత్యం వంటివి లలిత కళలు.

కవితాజ్ఞానం అంటే కవిత్వం రాయగలగడం. కవితను అర్థం చేసికోగలగడం. విజ్ఞానం అంటే, విశేషమైన తెలివి. ఇది శాస్త్ర సంబంధమైనది.

ఇవీ తెలుసుకోండి

చతుషష్టి కళలు (64కళలు):
1) ఇతిహాసము 2) ఆగమము
3) కావ్యము 4) అలంకారము
5) నాటకము 6) గాయకము
7) కవిత్వము 8) కామశాస్త్రము
9) దురోదరము 10) దేశభాష లిపి జ్ఞానము
11) లిపి కర్మము 12) వాచకము
13) అవధానము 14) సర్వశాస్త్రము
15) శకునము 16) సాముద్రికము
17) రత్యశాస్త్రము 18) రధాశ్వగజ కౌశలము
19) మల్లశాస్త్రము 20) శూదకర్మము
21) వోహము 22) గంధనాదము
23) ధాతువాదము 24) ఖనివాదము
25) రసవాదము 26) జలపాదము
27) అగ్నిస్తంభనము 28) ఖడ్గస్తంభనము
29) వాక్ స్తంభనము 30) వాయుస్తంభనము
31) వశ్యము 32) ఆకర్షణము
33) మోహనము 34) విద్వేషణము
35) ఉచ్ఛాటనము 36) మారణము
37) కాలవంచము 38) పరకాయ ప్రవేశం
39) పాదుకాసిద్ధి 40) వాక్సుద్ధి
41) ఇంద్రజాలము 42) అంజనము
43) దృష్టివంచనము 44) సర్వవంచనము
45) మణిసిద్ధి 46) చోరకర్మము
47) చిత్రక్రియ 48) లోహక్రియ
49) అశ్వక్రియ 50) మృత్రియ
51) దారుక్రియ 52) వేణుక్రియ
53) చర్మక్రియ 54) అంబరక్రియ
55) అదృశ్యకరణము 56) దుతికరణము
57) వాణిజ్యము 58) పాశుపల్యము
59) కృషి 60) అశ్వకరణము
61) ప్రాణిదుత్య కౌశలము 62) జలస్తంభనము
63) మంత్రసిద్ధి 64) ఔషధ సిద్ధి

చిరంజీవులు:
1) హనుమంతుడు
2) వ్యాసుడు
3) అశ్వత్థామ
4) విభీషణుడు
5) బలిచక్రవర్తి
6) కృపాచార్యుడు
7) పరశురాముడు

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 8th Lesson సముద్రలంఘనం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 8th Lesson సముద్రలంఘనం

10th Class Telugu 8th Lesson సముద్రలంఘనం Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ప్రశ్నలు – జవాబులు

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం 1
ప్రశ్న 1.
పై చిత్రంలో ఎవరెవరున్నారు?
జవాబు:
పై చిత్రంలో రామలక్ష్మణులు, వారి యెదుట సుగ్రీవుడు, హనుమంతుడు, మరో ఇద్దరు వానర శ్రేష్ఠులు ఉన్నారు.

ప్రశ్న 2.
ఎవరెవరి మధ్య సంభాషణ ఎందుకు జరుగుతున్నదో చెప్పండి.
జవాబు:
రామలక్ష్మణులకూ, సుగ్రీవునికీ మధ్య వారు ఒకరితో ఒకరు స్నేహం చేసుకోడానికి సంభాషణ జరుగుతోంది. సీతమ్మ జాడను తెలిసికొనివస్తానని సుగ్రీవుడు రామునికి చెప్పాడు. సుగ్రీవుని అన్న వాలిని చంపి, కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవునికి పట్టం కడతానని, రాముడు సుగ్రీవునికి మాట ఇచ్చాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ప్రశ్న 3.
‘సీత’ జాడ తెలుసుకున్నది ఎవరు? ఆయన ఏ మార్గంలో లంకకు చేరాడు?
జవాబు:
సీతమ్మ జాడను హనుమంతుడు తెలిసికొన్నాడు. హనుమంతుడు సముద్రంపై నుండి ఆకాశమార్గంలో ఎగిరి, లంకకు చేరాడు.

ఇవి చేయండి.

1. అవగాహన-ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను రాగ, భావయుక్తంగా చదవండి.
జవాబు:
మీ ఉపాధ్యాయుల సహాయంతో పాఠంలోని పద్యాలను, రాగముతో, భావం తెలిసేలా చక్కగా చదవడం నేర్చుకోండి.

ప్రశ్న 2.
‘కటకట……….. పోయన దగెగా’ – పద్యభావాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
కవులు సామాన్యంగా సముద్రాన్ని భూమి అనే స్త్రీ ధరించిన వస్త్రంలా ఉందని ఉత్ప్రేక్షిస్తారు. ఇక్కడ లంక చుట్టూ సముద్రం ఆవరించి ఉండడం వల్ల కవి, ఆ సముద్రాన్ని, లంకా నగరం కోటగోడ చుట్టూ, శత్రువులు రాకుండా తవ్విన లోతైన కందకమేమో అన్నట్లు ఉందని ఉత్ప్రేక్షించాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ప్రశ్న 3.
పాఠానికి ‘సముద్రలంఘనం’ శీర్షిక సరిపోయిందా? ఏ విధంగానో తెలపండి.
జవాబు:
ఈ పాఠంలో మహేంద్రగిరి నుండి త్రికూట పర్వతం మీదికి హనుమంతుడు ఎగిరి వెళ్ళిన ఘట్టాన్ని కవి వర్ణించాడు. హనుమంతుడు ఎగిరినప్పుడు ఏమయ్యిందో ఈ పాఠంలో చెప్పాడు.

హనుమంతుడు ఎగిరే ముందు ఏమి చేశాడో, ఈ పాఠంలో ఉంది. సముద్రం మీద వెడుతున్న హనుమంతుడు బాణంలా దూసుకుపోయాడని చెప్పాడు. ఎగిరి వెళ్ళేటప్పుడు అతని పిక్కల గాలి వేగానికి సముద్రం చీలిపోయి అది చూసేవారికి ఎలా కనిపించిందో కవి చెప్పాడు.

హనుమంతుడు మహేంద్రగిరి నుండి త్రికూటగిరికి దాటి వెళ్ళడం గురించి, ఈ పాఠంలో ఉంది. కాబట్టి ఈ పాఠానికి “సముద్రలంఘనం” అన్న పేరు చక్కగా సరిపోయింది.

II. వ్యక్తికరణ-సృజనాత్మకత

1. కింది భావం వచ్చే పద్యపాదాలు గుర్తించి, సందర్భం వివరించండి.
అ) ప్రవాహ తరంగాలు ఆకాశాని కెగిశాయి.
జవాబు:
“ఝరీతరంగఘట లెల్లెడల నుప్పరంబు లెగసి పడి” – అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుడు మహేంద్ర పర్వతంపై అడుగువేసి, ఎగరడంతో ఆ పర్వతం కంపించడంతో ఆ పర్వత శిఖరంపై గల సెలయేళ్ళ కెరటాలు అన్నీ, ఆకాశమునకు ఎగిరాయి అని కవి చెప్పిన సందర్భంలోనిది.

ఆ) ఒకచోట నిలబడి దక్షిణం వైపు చూశాడు.
జవాబు:
“ఒక్కచో నిల్చి దక్షిణ దిక్కుఁజూచి” – అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుడు సముద్రం మీదికి ఎగిరేటప్పుడు అతని వేగానికి పర్వత శిఖరాలు చలించాయి అనీ, హనుమంతుడు పర్వతాన్ని ఎక్కి అంతటా తిరిగాడనీ, ఒకచోట నిలబడి దక్షిణ దిశవైపు చూచాడనీ, కవి వర్ణించిన సందర్భంలోనిది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఇ) ఒక గొప్పధ్వని పుట్టింది.
జవాబు:
“ఒక మహారవం బుదయింపన్”- అనే పద్యపాదం, పై అర్థాన్ని ఇస్తుంది. కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడు అనే బాణం, గొప్ప ధ్వని వచ్చేలా, రాక్షసుల పట్టణం వైపు వేగంగా వెళ్ళిందని కవి చెప్పిన సందర్భంలోనిది.

ఈ) బలిచక్రవర్తి ఇంటి వాకిలా అన్నట్లున్నది.
జవాబు:
“బలిమందిరంబు వాకిలియొ యనఁగ” అన్న పద్యపాదం, పై భావాన్ని ఇస్తుంది. హనుమంతుని పిక్కల నుండి పుట్టిన గాలికి, సముద్ర జలం లోతుగా చీలింది. ఆ దృశ్యం ఆదిశేషుడు హనుమంతుని చూడ్డానికి వచ్చి తలుపులు తెరిచిన బలి చక్రవర్తి ఇంటివాకిలా? అన్నట్లు ఉందని కవి చెప్పిన సందర్భంలోనిది.

2. పాఠంలోని పద్యాలలో హనుమంతుని సముద్రలంఘనానికి సంబంధించిన వర్ణనలు ఉన్నాయి కదా! కవి కింది అంశాలను వేటితో పోల్చాడు? ఆ పద్యపాదాల కింద గీత గీయండి. చదవండి.

అ) హనుమంతుని అడుగులు
జవాబు:
అడుగులొత్తిన పట్లఁ బిడుగు మొత్తినయట్ల.

ఆ) హనుమంతుని చూపు
జవాబు:
భావిసేతు వచ్చుపడ లంకకడకును సూత్రపట్టుమాడ్కిఁ జూడ్కి వెలుఁగ

ఇ) హనుమంతుడు ఆకాశంలో ప్రయాణించడం ,
జవాబు:
విపరీతగతిన్ దోల దొరకొనెనొ, రవియిటు దేలం బెనుగాడితోడి తేరు

3. కింది పద్యం చదివి ప్రశ్నలకు సరైన సమాధానాన్ని కుండలీకరణాలలో ( ) రాయండి.
తే॥ గీ॥ పవన తనయ నీ వర్గము, స్వర్ణసమము
వాయుపుత్ర నీ వేగము, వాయుసమము
అసుర వనమును కాల్చు నీ వగ్నిసమము
రామదూత నీ చరితము, రమ్యమయము.

అ) ఆంజనేయుని దేహకాంతి స్వర్ణసమం కదా ! స్వర్ణమంటే
i) వెండి
ii) ఇత్తడి
iii) బంగారం
iv) రాగి
జవాబు:
iii) బంగారం

ఆ) హనుమంతుని వేగం దీనితో సమానమైంది.
i) విమానంతో
ii) పక్షితో
iii) గరుడునితో
iv) వాయువుతో
జవాబు:
iv) వాయువుతో

ఇ) అసురులు ఎవరంటే
i) దేవతలు
ii) పాములు
iii) రాక్షసులు
iv) గంధర్వులు
జవాబు:
iii) రాక్షసులు

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఈ) రమ్యచరితుడైన హనుమంతుడు ఈ విధంగా ప్రసిద్ధుడు.
i) శివదూతగా
ii) ఇంద్రదూతగా
iii) బ్రహ్మదూతగా
iv) రామదూతగా
జవాబు:
iv) రామదూతగా

ఉ) అసురవనాన్ని కాల్చే సమయంలో హనుమ ఎలాంటివాడు?
i) అగ్ని
ii) వాయువు
iii) ఇంద్రుడు
iv) రాముడు
జవాబు:
i) అగ్ని

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. అ) హనుమంతుడికి లంక ఎలా కనిపించింది?
జవాబు:
సహజంగా సముద్రం, భూదేవి నడుమునకు కట్టిన వస్త్రంలా శోభిస్తుంది. అటువంటి సముద్రం, లంక వైపుకు వచ్చి, దుష్టరాక్షసులున్న లంకా నగరం కోటకు, చుట్టూ త్రవ్విన కందకంలా ఇప్పుడు హనుమంతుడికి కనిపించింది.

ఆ) హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు ఎలా సిద్ధమై లంఘించాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి సిద్ధమై, గట్టిగా కొండపై ఒత్తి అడుగులు వేశాడు. తన తోకను అటు ఇటూ తిప్పాడు. తన చేతితో కొండను బలంగా చరిచాడు. గట్టిగా సింహనాదం చేశాడు. వాయుదేవునిలా పర్వత శిఖరాలు కదిలేలా తన శరీరాన్ని పెంచాడు. కొండపైకి ఎక్కి అటూఇటూ తిరిగాడు. తరువాత ఒకచోట నిలబడి, దక్షిణ దిక్కు వైపు చూశాడు.

ఇ) హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినప్పుడు సమీపంలోని వారికి ఏమనిపించింది?
జవాబు:
హనుమంతుడు కొండను అణగదొక్కి ఆకాశంపైకి ఎగిరి, ప్రయాణిస్తూ ఉంటే, సమీపంలోని వారికి, హనుమంతుడు ఎగిరినట్లు కాకుండా, ఒక పర్వతము ఎగిరినట్లు అనిపించింది.

ఈ) హనుమంతుడు లంకవైపు ఎలా ఎగిరాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, వంగి తన చేతులను నడుమునకు ఆనించి, తోకను ఆకాశ వీధిలోకి పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, గట్టిగా గాలి పీల్చి, తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగదొక్కి పైకి ఎగిరి లంఘించాడు. హనుమంతుడు అప్పుడు కొండ అనే విల్లు నుండి వెలువడిన బాణంలా లంక వైపుకు దూసుకుపోయాడు.

ఉ) మహావేగంతో వెడుతున్న హనుమంతుని చూసి దేవతలు ఏమనుకున్నారు?
జవాబు:
వాయుపుత్రుడైన హనుమంతుడు తన తోకతో పాటు ఎగరడం చూసి, దేవతలు “సూర్యుడు విపరీతమైన వేగంతో పెద్ద
కోడి ఉన్న తన రథాన్ని నడిపిస్తూ అటు వచ్చాడేమో” అనుకున్నారు.

5. కింది ప్రశ్నలకు ఐదేసి వాఠ్యాల్లో సమాధానాలు రాయండి.

అ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమై అడుగులు వేసినపుడు పెద్దపెద్ద కొండలు బద్దలై, చెట్లు పెకిలింపబడి, ఏనుగులూ, సింహాలూ పరుగులు పెట్టాయి. కొండ గుహలు ప్రతిధ్వనించాయి. దీన్ని బట్టి హనుమంతుని బలం ఎంతటిదో ఊహించి రాయండి.
జవాబు:
హనుమంతుని బలం వర్ణనా తీతం. అతడు కొండలను’ పిండి చేసేటంత బరువూ, శక్తి, బలం కలవాడు. అందుకే అతడు అడుగులు వేస్తే, పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. అతడు వాయుదేవుని అంత వేగం గలవాడు. అందుకే అతడు తోకను తిప్పితే, అక్కడి చెట్లు అన్నీ కూలిపోయి బయళ్ళు ఏర్పడ్డాయి. అతడు చేతితో గట్టిగా చరిస్తే ఏదో కర్రతో కొట్టినట్లు, క్రూర జంతువులు అన్నీ బెదరి పారిపోయాయి. అతడు సింహనాదం చేస్తే అక్కడి కొండ గుహలు ప్రతిధ్వనించాయి. దీన్ని బట్టి హనుమంతుని కంఠధ్వని, మహా గంభీరమైనదని తెలుస్తోంది.

హనుమంతుడు మహా బలవంతుడు, శక్తిమంతుడు అయినందువల్లనే తాను ఒక్కడూ, నూరు యోజనాల సముద్రం దాటి వెళ్ళి లంకిణిని చంపి, అశోక వనాన్ని భగ్నం చేసి, లక్షల కొద్దీ రాక్షసులను చంపి, లంకను అగ్నితో కాల్చి, రావణునికి బుద్ధి చెప్పి, సీత జాడను తెలిసికొని రాముని వద్దకు తిరిగివచ్చాడు.

ఆ) వానర సైన్యంలో ఎంతోమంది వీరులుండగా సముద్రలంఘనానికి హనుమంతున్లే ఎన్నుకోడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
మిగిలిన వానరులలో కొందరు తాము నూరు యోజనాల దూరం ఎగిరి వెళ్ళలేమన్నారు. మరికొందరు ఎగిరి వెళ్ళినా, తిరిగి రాలేమన్నారు.

హనుమంతుడికి బ్రహ్మ శాపం వల్ల తన బలం తనకు తెలియదు. అతడు వాయుదేవుని పుత్రుడు. అతడు వాయుదేవునితో సమాన బలం గలవాడు. 10 వేల యోజనాల దూరం దాటగలవాడు. అదీగాక శ్రీరాముడు హనుమంతుని బలాన్ని ముందే గుర్తించి, హనుమంతుని చేతికే, సీతమ్మకు ఇమ్మని, తన ఉంగరాన్ని కూడా ఇచ్చాడు.

హనుమంతునివల్లే ఆ కార్యం నెరవేరుతుందని జాంబవంతుడు సలహా చెప్పాడు. జాంబవంతుడు హనుమంతుని వెళ్ళి రమ్మని ప్రోత్సహించాడు. ఈ కారణంగా హనుమంతుణే, సముద్రలంఘనానికి వానరులు ఎన్నుకున్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

ఇ) హనుమంతుడు సముద్రలంఘనానికి ముందు చేసిన చేష్టల ఆంతర్యం ఏమై ఉంటుంది?
జవాబు:
సముద్రలంఘనానికి ముందు హనుమంతుడు గట్టిగా ఒత్తి అడుగులు వేసి, రాళ్ళను పగులకొట్టి, చెట్లను కూలగొట్టి, క్రూర జంతువులను సైతం పారిపోయేలా చేసి, గుహలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. ఆతని పాదాల ఒత్తిడికి పర్వత శిఖరాలు కంపించి పోయాయి.

హనుమంతుడు తన శక్తిని మిగిలిన వానరులకు, ఈ విధంగా చూపించాడు. తాను సీత జాడను తెలిసికొని రాగలనని తనవారికి ఆ విధంగా ధైర్యం కల్పించాడు. తాను మహాశక్తిమంతుడననీ, కొండల్ని పిండి చేయగలననీ నిరూపించాడు. తాను వాయుదేవుని అనుగ్రహం కలవాడినని, మిగిలిన వానరులకు తెలియపరచి, వారికి ధైర్యం కల్పించాడు. హనుమంతుడు తప్పక సీత జాడను తెలిసికొని రాగలడని, ముందుగానే తన తోటి వానరులకు ఈ విధంగా భరోసా ఇచ్చాడు. అందుకే హనుమంతుడు ఆ చేష్టలు చేశాడు.

ఈ) హనుమంతుడు ఆకాశంలోకి ఎగరగా సమీపంలోని వారికి ఒక పెద్ద కొండ ఎగిరిందా! అని అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో రాయండి.
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ముందు తన శరీరాన్ని బాగా పెంచాడు. పర్వదినాలలో ఉప్పొంగే సముద్రుడిలా శరీరాన్ని పెంచాడు. అతడు పర్వతమంత శరీరాన్ని ధరించాడు. హనుమంతుడు సముద్రం మీద ఎగిరేటప్పుడు అతని నీడ, పదియోజనాల పొడవు, ముప్ఫైయోజనాల వెడల్పు ఉందని రామాయణంలో చెప్పబడి ఉంది. అంత గొప్ప శరీరం కల హనుమంతుడు చూసేవారికి తెక్కలున్న పర్వతం వలె కనిపించాడు.

అందుకే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినప్పుడు ఒక పెద్ద కొండ ఎగిరిందా అని ప్రక్కనున్న వాళ్ళకి అనిపించింది.

6. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
హనుమంతుడు మహాబలవంతుడు. అతడు సముద్రాన్ని దాటేముందు శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపై అడుగులు వేశాడు. అప్పుడు పిడుగులు పడ్డట్లు అక్కడి రాళ్ళు పగిలిపోయాయి. హనుమంతుడు తోకను త్రిప్పినప్పుడు వచ్చిన గాలి వేగానికి అక్కడి చెట్లు కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే భయపడి క్రూర జంతువులు పారిపోయాయి. అతడు చేసిన సింహనాదానికి గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. కొండలపై సెలయేళ్ళ కెరటాలు ఎగసిపడి ఆకాశాన్ని తాకాయి. హనుమంతుడు పెరిగి మహేంద్ర గిరిపై నిలిచాడు.

హనుమంతుడు సముద్రాన్ని చూసి, చెవులు రిక్కించి, చేతులు నడుముకు ఆనించి, తన తోకను ఆకాశం వైపుకు పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, తాను నిలబడ్డ కొండను క్రిందకు అణగదొక్కి పైకి ఎగిరాడు. అప్పుడు చూచేవాళ్ళకు పర్వతం ఎగురుతున్నట్లు అనిపించింది. బాణంలా ధ్వని చేసుకుంటూ అతడు వేగంగా సముద్రం మీంచి ఎగిరాడు.

హనుమంతుని పిక్కల గాలి వేగానికి సముద్రం చీలి, రాముని కోప ప్రవాహం, లంకకు చేరడానికి తవ్విన కాలువలా కనిపించింది. ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలిలా కనిపించింది. సేతు నిర్మాణానికి త్రవ్విన పునాదిలా కనిపించింది.

ఆ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానాన్ని కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, కిందికి వంగి, తన చేతులను నడుముకు ఆనించి, తోకను ఆకాశం మీదికి పెంచి, తన పాదాలు దగ్గరగా పెట్టి, గాలి గట్టిగా పీల్చి, తాను నిలబడ్డ కొండను కిందకు అణగదొక్కి పైకి ఎగిరాడు.

హనుమంతుడు ఎగురుతూ ఉంటే, పర్వతము ఎగురుతున్నట్లు అనిపించింది. హనుమంతుడు విల్లు నుండి విడిచి పెట్టబడిన బాణంలా పెద్ద ధ్వనితో లంకవైపు దూసుకుపోయాడు.

హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు, సూర్యుడు కాడి ఉన్న తన రథాన్ని వేగంగా తోలుకు వస్తున్నాడేమో అనుకొన్నారు. హనుమంతుని పిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రం లోతుగా చీలింది. ఆ గాలి, పాతాళంలో ఉన్న పాములకు ఆహారం వచ్చిందేమో అనిపించింది.

హనుమంతుడి పిక్కల బలంతో వీచిన గాలి వేగానికి సముద్రం చీలినట్లు కాగా అది, రాముని క్రోధ రసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, రాబోయే కాలంలో కట్టే సేతువు పునాదిలా, ఆదిశేషుడు తలుపులు తెరిచిన బలిమందిరం వాకిలిలా కనిపించింది. ఆ విధంగా హనుమ త్రికూట పర్వత శిఖరం చేరాడు.

7. కింది అంశాల గురించి సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి.

1. హనుమంతుడి సముద్రలంఘనానికి ముందు వానరులందరూ మహేంద్రగిరికి చేరుకున్నారు. ఎవరు సముద్రాన్ని దాటగలరు? అనే చర్చ బయలుదేరింది. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు ఇతర వానరులు ఉన్నారు. వాళ్లు ఏమేమి మాట్లాడుకొని ఉంటారు? సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
మహేంద్రగిరి వద్ద హనుమంతుడు – జాంబవంతుడు – అంగదుడు
ఇతర వానరుల మధ్య సంభాషణ

అంగదుడు : వానరులారా ! మనలో ఎవరు సముద్రాన్ని దాటి, మా పినతండ్రి సుగ్రీవుని ప్రతిజ్ఞను నిలబెట్టగలరు? మీరు ఎంతెంత దూరం సముద్రం దాటగలరో చెప్పండి.

శరభుడు : యువరాజా ! నేను ముప్పై యోజనాల దూరం దాటగలను.

మైందుడు : యువరాజా ! నేను డెబ్బె యోజనాల దూరం వరకూ దాటగలను.

జాంబవంతుడు : మనము తప్పక రామకార్యం సాధించాలి. ఒకప్పుడు నాకు ఎగిరేందుకు మంచి బలం ఉండేది. నేనిప్పుడు ముసలివాణ్ణి అయ్యాను. నేను ఇప్పటికీ 100 యోజనాలు దూరం దాటగలను. కాని తిరిగి రాలేనేమో ? అంగదా ! నీవు నూరు యోజనాల దూరం దాటి తిరిగి వెళ్ళి రాగలవు. కాని యువరాజువైన నిన్ను మేము పంపగూడదు. నేను సరయిన వాణ్ణి మీకు చూపిస్తా.

అంగదుడు : తాతా ! జాంబవంతా ! మనలో సముద్రం దాటి తిరిగి రాగల వీరుణ్ణి మాకు చూపించు”.

జాంబవంతుడు : ఆంజనేయా ! నీవు రామ, సుగ్రీవులంతటి బలం కలవాడవు. నీవు చిన్నప్పుడే 300 యోజనాల దూరం ఎగిరి సూర్యుడిని చేరిన వాడవు. మన వానరులంతా దిగులుగా ఉన్నారు. నీవు సముద్రం దాటి తప్పక తిరిగి రాగలవు. వెళ్ళిరా ! నాయనా !

హనుమంతుడు : తాతా ! నీవు చెప్పినది నిజము. నేను గరుడునికి అనేక వేల పర్యాయాలు ప్రదక్షిణం చేయగలను. నేను సీతమ్మను చూడగలను. నేను వాయువుతో సమానుడిని. 10 వేల యోజనాలు దూరం వెళ్ళి రాగలను.

అంగదుడు : భేష్ ! ఆంజనేయా! నీవే మా విచారాన్ని తీర్చగలవు. నీవు సముద్రం దాటి వెళ్ళి సీతమ్మ జాడ తెలిసికొనిరా.

హనుమంతుడు : వానరులారా ! నన్ను దీవించండి.

జాంబవంతుడు : మంచిది నాయనా ! నీవు తప్పక కార్యం సాధిస్తావు. నీకు నా దీవెనలు. నాయనా వెంటనే బయలు దేరు.

హనుమంతుడు : మీరు ధైర్యంగా ఉండండి. నేను తప్పక కార్యం సాధించి వస్తా. మిత్రులారా ! సెలవు.
(లేదా)
మీ పాఠంలో హనుమంతుని శక్తి యుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ, అతని రచనలు చదవమని సలహా ఇస్తూ, మిత్రునికి ఒక లేఖ రాయండి.
జవాబు:

లేఖ

విశాఖపట్టణం,
x x x x x

 

మిత్రుడు ప్రసాదు,

మిత్రమా ! నీవు మన పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 8వ పాఠం ‘సముద్రలంఘనం’ చదివావని అనుకుంటున్నాను. ఈ పాఠం ‘అయ్యలరాజు రామభద్రుడు’ అనే మహాకవి రచించిన “రామాభ్యుదయము” అనే గ్రంథంలోనిది. రామాభ్యుదయంలోని కథ, సీతారామ కథయే. మన పాఠంలో హనుమంతుడు సముద్రం దాటిన ఘట్టమును కవి “అద్భుతంగా వర్ణించాడు.

రామభద్రుడు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. రామాయణము ఒక తియ్యని కావ్యము. ఈ రామాభ్యుదయంలో కవి హనుమంతుని శక్తిని, పరాక్రమాన్ని గొప్పగా వర్ణించాడు. ఈ కవి ‘సకల కథాసార సంగ్రహం’ అనే మరో గ్రంథం కూడా రచించాడట. నేను. ఈ రోజే “రామాభ్యుదయం” కావ్యం కొన్నాను. నీవు కూడా రామభద్రుని రచనలు తప్పక చదువు. ఆ కవిని గూర్చి, నీ అభిప్రాయం నాకు రాయి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. రఘునాథ్ బాబు,
మునిసిపల్ ఉన్నత పాఠశాల.

చిరునామా :
యస్. ప్రసాదు,
S/O. యస్. రమణారావుగారు,
ఇంటి నెం. 2-6-15, గాంధీపురం, కాకినాడ,
తూ||గో॥జిల్లా, ఆం.ప్ర.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

మీ పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశంలో లేదా మరే ఇతర కార్యక్రమంలోనో హనుమంతుని ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించాలి. ఇందుకోసం కావలసిన సామాగ్రిని తయారుచేయండి.
ఉదా : కిరీటం, గద, తోక మొదలగునవి. కావాల్సిన వాక్యాలను రాయండి, అభ్యాసం చేయండి, ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థికృత్యం

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానారక పదాలను ఖాళీలలో రాయండి.

అ) హనుమంతుడు కొండకొమ్మున నిలబడ్డాడు, ఆ …….. న అతడు సూర్యగోళంలా ఉన్నాడు. (కూటాగ్రము)
ఆ) వివరములో సర్పముంది. ఆ ……………….. లో చేయిపెట్టకు. (రంధ్రము)
ఇ) హనుమంతుడెగిరితే ధూళి నభమునకు ఎగిసింది. అది ……………. అంతటా వ్యాపించింది. తర్వాత …………….. లోని సూర్యుని కూడా కమ్మేసింది. (ఉప్పరము, ఆకాశము)

2. కింది ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాసి సొంత వాక్యాలలో ప్రయోగించండి.

అ) సముద్రాన్ని వార్ధి అని కూడా అంటారు.
జవాబు:
సముద్రము (ప్ర) – సంద్రము (వి)
సొంతవాక్యాలు:
ఓడలు సంద్రంలో తిరుగుతుంటాయి.

ఆ) దక్షిణ దిశ యముని స్థానం.
జవాబు:
దిశ (ప్ర) – దెస (వి)
సొంతవాక్యాలు:
రాజుగారి కీర్తి దెసలందు వ్యాపించింది.

ఇ) మంచి గొనములు అలవరచుకోండి.
జవాబు:
గుణములు (ప్ర) – గొనములు (వి)
సొంతవాక్యాలు:
మంచి గుణములు కలవారిని అందరు గౌరవిస్తారు.

ఈ) నిముసమైనా వృథా చేయకు.
జవాబు:
నిమిషము(ప్ర) – నిముసము (వి)
సొంతవాక్యాలు:
విద్యార్థులు నిమిషం వృథా కాకుండా చదువుకోవాలి.

ఉ) అగ్గిలో చేయిపెడితే కాలుతుంది.
జవాబు:
అగ్ని (ప్ర) – అగ్గి (వి)
సొంతవాక్యాలు:
అగ్నిలో ఏ వస్తువు వేసినా తగలబడిపోతుంది.

3. కింద ఇచ్చిన పదాలకు వ్యుత్పత్త్యర్థాలను జతచేయండి.

పదం వ్యుత్పత్త్యర్థం
అ) కార్ముకం 1. అపారమైన తీరం గలది.
ఆ) అమరుడు 2. దనువు అనే స్త్రీ యందు పుట్టినవాళ్ళు
ఇ) ఉదధి 3. జూలు కలిగినది.
ఈ) ప్రభంజనం 4. కర్మకారునిచే చేయబడినది.
ఉ) దానవులు 5. ఉదకము దీని యందు ధరించబడును.
ఊ) కేసరి 6. వృక్షశాఖాదులను విరగొట్టేది.
ఋ) ధరాధరం 7. మరణము లేనివారు.
ఋ) పారావారం 8. ధరను ధరించునది.

జవాబు:

పదం వ్యుత్పత్త్యర్థం
అ) కార్ముకం 4. కర్మకారునిచే చేయబడినది.
ఆ) అమరుడు 7. మరణము లేనివారు.
ఇ) ఉదధి 5. ఉదకము దీని యందు ధరించబడును.
ఈ) ప్రభంజనం 6. వృక్షశాఖాదులను విరగొట్టేది.
ఉ) దానవులు 2. దనువు అనే స్త్రీ యందు పుట్టినవాళ్ళు
ఊ) కేసరి 3. జూలు కలిగినది.
ఋ) ధరాధరం 8. ధరను ధరించునది.
ఋ) పారావారం 1. అపారమైన తీరం గలది.

వ్యాకరణాంశాలు

సంధులు, సమాసాలు

1. కింది పదాలు విడదీసి సంధి పేరు రాయండి.
అ) హరియపుడు
జవాబు:
హరి + అపుడు . – – (హరి + య్ + అపుడు) – యడాగమం.

ఆ) కూటాగ్రవీధి
జవాబు:
కూట + అగ్రవీధి = (అ + అ = ఆ) – – సవర్ణదీర్ఘ సంధి

ఇ) పురాభిముఖుడు
జవాబు:
పుర + అభిముఖుడు = (అ + అ = ఆ) ‘ – సవర్ణదీర్ఘ సంధి

ఈ) అణగదొక్కి
జవాబు:
అణగన్ + తొక్కి = (‘త’ – ‘ద’ గా మారింది) – సరళాదేశ సంధి

ఉ) వాడుగొట్టె జ. వాడు + కొట్టి = (‘క’ – ‘K’ గా మారింది) – గసడదవాదేశ సంధి

ఊ) నీవుడక్కరివి
జవాబు:
నీవు + టక్కరివి : ‘ట’ – ‘డ’ గా మారింది) – గసడదవాదేశ సంధి

ఋ) వారు వోరు
జవాబు:
వారు + పోరు = (‘ప’ – ‘వ’ గా మారింది) – గసడదవాదేశ సంధి

బ) రారుగదా
జవాబు:
రారు + కదా = (‘క’ – ‘X’ గా మారింది) – గసడదవాదేశ సంధి

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

2) పాఠ్యాంశం నుండి షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణలు రాయండి. వాటికి విగ్రహవాక్యాలు రాయండి.
ఉదా : కూటాగ్రము : కూటము యొక్క అగ్రము – షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:

సమాసములు విగ్రహవాక్యము సమాసనామము
1) తరంగ ఘటలు తరంగముల యొక్క ఘటలు షష్ఠీ తత్పురుష సమాసం
2) తమ తండ్రి తమ యొక్క తండ్రి షష్ఠీ తత్పురుష సమాసం
3) కూటకోటులు కూటము యొక్క కోటులు షష్ఠీ తత్పురుష సమాసం
4) గాడ్పు కొడుకు గాడ్పు యొక్క కొడుకు షష్ఠీ తత్పురుష సమాసం
5) ధరణీ కటి తటము ధరణి యొక్క కటి తటము షష్ఠీ తత్పురుష సమాసం
6) వప్ర పరిఘ వప్రమునకు పరిఘ షష్ఠీ తత్పురుష సమాసం
7) గాడ్పువేల్పుపట్టి గాడ్పువేల్పునకు పట్టి షష్ఠీ తత్పురుష సమాసం
8) ఏటిజోటి మగడు ఏటి జోటి యొక్క మగడు షష్ఠీ తత్పురుష సమాసం
9) శ్రవణ ద్వంద్వంబు శ్రవణముల యొక్క ద్వంద్వము షష్ఠీ తత్పురుష సమాసం
10) కటిసీమ కటి యొక్క సీమ షష్ఠీ తత్పురుష సమాసం
11) నభీవీథి నభస్సు యొక్క వీథి షష్ఠీ తత్పురుష సమాసం
12) పురాభిముఖంబు పురమునకు అభిముఖము షష్ఠీ తత్పురుష సమాసం
13) సురగరుడ దురవలోకము సురగరుడులకు దురవలోకము షష్ఠీ తత్పురుష సమాసం
14) కరువలి వేలుపు కొడుకు కరువలి వేలుపునకు కొడుకు షష్ఠీ తత్పురుష సమాసం
15) పవనజ జంఘ పవనజ జంఘ షష్ఠీ తత్పురుష సమాసం
16) పవనాశనకోటి పవనాశనుల యొక్క కోటి షష్ఠీ తత్పురుష సమాసం
17) రఘువరేణ్యుడు రఘువంశజులలో వరేణ్యుడు షష్ఠీ తత్పురుష సమాసం
18) రఘువరేణ్య క్రోధరసము రఘువరేణ్యుని యొక్క క్రోధరసము షష్ఠీ తత్పురుష సమాసం
19) సేతుబంధము సేతువు యొక్క బంధము షష్ఠీ తత్పురుష సమాసం
20) బలిమందిరము బలి యొక్క మందిరము షష్ఠీ తత్పురుష సమాసం

అలంకారాలు :

శబ్దాలంకారాల్లో వృత్త్యనుప్రాస, అంత్యానుప్రాస లాంటివే మరికొన్ని ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం.
1. ముక్తపదగ్రసం:
కింది పద్యాన్ని పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.
కం. మన వేటికి నూతనమా !
తన మానినిఁ బ్రేమఁ దనకుఁ దక్కితి ననుమా
నను మానక దయ దనరం
దనరంతులు మాని నరసధవు రమ్మనవే.

పై పద్యంలోని ప్రత్యేకతను గమనించారు కదా!

1) పద్యంలో మొదటి పాదం చివర ఉన్న తనమా అనే అక్షరాలు, రెండవపాదం మొదట తిరిగి ప్రయోగింపబడ్డాయి.
2) రెండవ పాదము చివర ఉన్న ననుమా అనే మూడు అక్షరాలు, మూడవ పాదం మొదట తిరిగి ప్రయోగింపబడ్డాయి.
3) మూడవ పాదము చివరన ఉన్న దనరం అనే మూడక్షరాలు, తిరిగి నాల్గవ పాదం మొదట ప్రయోగింపబడ్డాయి.
4) ఈ విధంగా ముందు పాదం చివర విడిచిపెట్టబడ్డ పదాలే, తరువాతి పాదాల మొదట తిరిగివచ్చాయి.

ముక్తపదగ్రస్త అలంకారం:

1) ఒక పద్యపాదంగాని, వాక్యంగాని ఏ పదంతో పూర్తి అవుతుందో, అదే పదంతో తర్వాత పాదం
(లేక)
వాక్యం మొదలవుతుంది. దీన్నే ‘ముక్తపదగ్రస్త అలంకారం’ అంటారు.

2. యమకము :
కింది వాక్యాలు పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.

అ) లేమా ! దనుజుల గెలువఁగలేమా
(లేమ’ అంటే స్త్రీ ; ‘గెలువగలేమా’ అంటే గెలవడానికి మేము ఇక్కడ లేమా (అంటే ఉన్నాం ‘ కదా!) అని భావము.

ఆ) ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది.
(‘తోరణం’ అంటే ద్వారానికి కట్టే అలంకారం ; ‘రణం’ అంటే యుద్ధము.

గమనిక :
పై రెండు ఉదాహరణములలోనూ, ఒకే పదం, అర్థభేదంతో ప్రయోగించబడింది. దీనినే ‘యమకాలంకారం’ అంటారు.

యమకము :
(వివరణ) రెండు లేక అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదములు, తిరిగి తిరిగి అర్థభేదంతో వస్తే అది ‘యమకాలంకారము’.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

3. లాటానుప్రాస: కింది కవితా భాగాలను/ వాక్యాలను చదవండి. ప్రత్యేకతను గమనించండి.

అ) హరి భజియించు హస్తములు హస్తములు.
గమనిక :
పై వాక్యంలో హస్తములు అనే పదము ఒకే ఆద్దంతో వరుసగా రెండుసార్లు వచ్చాయి.

ఇక్కడ హస్తములు అన్న పదం యొక్క అర్థము ఒకటే అయినా, వాటి తాత్పర్యము భేదముంది. అందులో ‘హస్తములు’ అనే మొదటి పదానికి ‘చేతులే’ అని భావము. ‘హస్తములు’ అనే రెండవసారి వచ్చిన దానిని, నిజమైన చేతులు అని భావము.

ఆ) చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ
గమనిక :
ఇక్కడ ఈ వాక్యంలో ‘సేవ’ అనే పదము రెండుసార్లు వచ్చింది. వాటి అర్థాలు సమానమే. కాని తాత్పర్యం వేరుగా ఉంటుంది.

అందులో మొదటి ‘సేవ’ అనే పదానికి, సేవించుట అని భావము. రెండవ ‘సేవ’ అనే పదానికి, ‘నిజమైన సేవ’ అని తాత్పర్యము.

పై రెండు సందర్భాల్లోనూ ఒకే పదం అర్థంలో తేడా లేకున్నా భావంలో తేడా ఉండేటట్లు ప్రయోగించారు. ఈ విధంగా ఒకే పదాన్ని, అర్థం ఒకటే అయినా తాత్పర్యభేదంతో ప్రయోగించడాన్ని ‘లాటానుప్రాసాలంకారం’ అంటారు.

4 నుగాగమ సంధి:
కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.

అ) చేయునతడు
జవాబు:
చేయు + అతడు

ఆ) వచ్చునప్పుడు
జవాబు:
వచ్చు + అప్పుడు
గమనిక :
చేయు, వచ్చు అనే క్రియలకు చివర ‘ఉత్తు’ ఉంటుంది. అనగా హ్రస్వమైన ‘ఉ’ కారము ఉంది. వీటికి అచ్చు కలిసింది. అతడు, అప్పుడు అనే పదాల మొదట, ‘అ’ అనే అచ్చు ఉంది. ఆ విధంగా క్రియాపదాల చివరన ఉన్న ఉత్తుకు, అచ్చు పరమైతే, అప్పుడు ఆ రెండు పదాలలోనూ లేని ‘స్’ అనే హల్లు, కొత్తగా వస్తుంది. ఆ విధంగా కొత్తగా వచ్చిన ‘స్’ అనే హల్లును, ‘నుగాగమము’ అంటారు. ‘న్’ ఆగమంగా వచ్చింది. అంటే దేనినీ కొట్టివేయకుండా కొత్తగా వచ్చి చేరింది. దీనినే ‘నుగాగమ సంధి’ అంటారు.

నుగాగమ సంధి సూత్రం:
ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి, అచ్చు పరమైతే నుగాగమం వస్తుంది. కింది. ఉదాహరణలు విడదీసి, లక్షణాలు సరిచూడండి –

1. పోవునట్లు
జవాబు:
పోవు + అట్లు : ఇక్కడ ‘పోవు’ అనే క్రియ యొక్క చివర ‘ఉత్తు’ ఉంది. దానికి ‘అట్లు’ అన్న దానిలోని ‘అ’ అనే అచ్చు కలిసింది. నుగాగమ సంధి సూత్ర ప్రకారము, ‘పోవు’ అనే ఉదంత తద్ధర్మార్థక విశేషణానికి, అచ్చు పరమై నుగాగమం వచ్చింది.
ఉదా : పోవు + న్ + అట్లు = పోవునట్లు = నుగాగమ సంధి.

2. కలుగునప్పుడు
జవాబు:
కలుగు + అప్పుడు అని విడదీయండి.

ఇక్కడ ‘కలుగు’ అనేది, ఉత్తు చివర కల తద్ధర్మార్థక క్రియా విశేషణము, ఆ ఉదంత తద్ధర్మార్థక విశేషణానికి, “అప్పుడు” అనే శబ్దములోని ‘అ’ అనే అచ్చు పరమయ్యింది. నుగాగమము వచ్చింది.
ఉదా : కలుగు + న్ + అప్పుడు = కలుగునప్పుడు = (నుగాగమ సంధి)

పైన చెప్పిన సందర్భంలోనే గాక, మణికొన్ని స్థలాల్లో సైతమూ ‘సుగాగమం’ వస్తుంది. కింది పదాలను పరిశీలించండి.

అ) తళుకు + గజ్జెలు
1) నుగాగమ సంధి సూత్రము (2) : సమాసాలలో ఉదంతములైన స్త్రీ సమాలకు, పు, ంపులకు, పరుష సరళములు పరములైనప్పుడు నుగాగమం వస్తుంది.
ఉదా : తళుకు + న్ + గజ్జెలు (‘తళుకు’ అనే ఉదంత స్త్రీ సమ శబ్దానికి, సరళము పరమై నుగాగమం)

2) ద్రుతమునకు సరళ స్థిరములు పరములైనప్పుడు, లోప సంశ్లేషలు విభాషనగు.
ఉదా : 1) తళుకు గజ్జెలు (ద్రుత లోపము)
2) తళుకున్దజ్జెలు (సంశ్లేషము)

3) సూత్రము : వర్గయుక్సరళములు పరములైనప్పుడు ఒకానొకచో ద్రుతమునకు పూర్ణబిందువును కనబడుతుంది.
ఉదా : తళుకుంగజ్జెలు (పూర్ణబిందువు)

పుంప్వాదేశ, నుగాగమ సంధులు:
ఆ) ఉన్నతము + గొడుగు
1) పుంప్వాదేశ సంధి సూత్రము : కర్మధారయములలో మువర్ణకమునకు పు, ంపులగు.
ఉదా : ఉన్నతంపు గొడుగు

2) నుగాగమ సంధి సూత్రము (3) : సమాసాలలో ఉదంతాలైన స్త్రీసమాలకు పు, ంపులకు, పరుష సరళాలు పరములైతే నుగాగమం వస్తుంది.
ఉదా : ఉన్నతపు + న్ + గొడుగు

అ) ద్రుతమునకు సరళ స్థిరములు పరములయినప్పుడు, లోప సంశ్లేషలు విభాషనగు. .
ఉదా : ఉన్నతంపు గొడుగు (ద్రుతలోపము)

ఆ) వర్గయుక్సరళములు పరములైనపుడు ఒకానొకచో ద్రుతమునకు పూర్ణబిందువు కనబడుతుంది.
ఉదా : ఉన్నతంపుం గొడుగు (ద్రుతమునకు పూర్ణ బిందువు)

అభ్యాసము : కింది ఉదాహరణలు పరిశీలించి, లక్షణాలు సరిచూడండి

1) సరసపున్దనము = (సరసము + తనము)
సూత్రము : 1) కర్మధారయములందు మువర్ణమునకు పుంపులగు
సరసపు + తనము = పుంప్వాదేశము

నుగాగమ సంధి సూత్రము (4) : ఉదంత స్త్రీ సమములకు, పుంపులకు, అదంత గుణవాచకములకు తనంబు పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా : సరసపు + న్ + తనము (పుంపులకు, తనము పరమై, నుగాగమం వచ్చింది)

అ) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
సరసపు + న్ + దనము (సరళాదేశము) .

ఆ) ద్రుతంబునకు సరళ స్థిరంబులు పరంబులగునపుడు లోప సంశ్లేషలు విభాషణగు
ఉదా : సరసపున్దనము (సంశ్లేషరూపము)

2) తెల్లన్దనము = తెల్ల + తనము
సూత్రము : ఉదంత స్త్రీ సమంబులకు, పుంపులకు, అదంత గుణవాచకంబులకు తనంబు పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా : తెల్ల + న్ + తనము (అదంత గుణవాచకమైన ‘తెల్ల’ శబ్దానికి తనము పరమైనందున, నుగాగమం)

అ) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు
ఉదా : తెల్ల + న్ + దనము (సరళాదేశము)

ఆ) ద్రుతమునకు సరళ స్థిరములు పరములగునపుడు లోప సంశ్లేషలు విభాషనగు
ఉదా : తెల్లన్దనము (సంశ్లేష రూపము) షష్ఠీ తత్పురుష సమాసాల్లో నుగాగమ సంధి.
నుగాగమ సంధి (5)

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

6. కింది పదాలను విడదీసి, పరిశీలించండి.
అ) విధాతృనానతి – (విధాత యొక్క ఆనతి) = విధాతృ + ఆనతి
ఆ) రాజునాజ్ఞ – (రాజు యొక్క ఆజ్ఞ) = రాజు + ఆజ్ఞ
గమనిక :
1) పై సమాస పదాలకు విగ్రహవాక్యాలను పరిశీలిస్తే, అవి షష్ఠీ తత్పురుష సమాసానికి చెందినవని తెలుస్తుంది.
2) పై రెండు ఉదాహరణలలోనూ సమాసాలలోని పూర్వపదాల చివర “ఋకారం”, “ఉత్తు” ఉన్నాయి.
3) షష్టీ సమాసపదాల్లో, ఉకార, ఋకారములకు అచ్చు పరమైతే నుగాగమము వస్తుంది.

నుగాగమ సంధి సూత్రము : షష్ఠీ సమాసము నందు, ఉకార ఋకారములకు అచ్చు పరమైనపుడు నుగాగమంబగు.
అ) విధాతృ + న్ + ఆనతి = విధాతృనానతి
ఆ) రాజు + న్ + ఆజ్ఞ = రాజునాష్ట్ర

పూర్వస్వరం స్థానంలో ‘ఋ’కారం, ఉత్తు ఉన్నాయి. వీటికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వచ్చింది. అంటే – షష్టీ తత్పురుషాల్లో ఉకారానికి, ఋకారానికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వస్తుంది.

అదనపు సమాచారము

సంధులు

1. ఎల్లెడలన్ = ఎల్ల + ఎడలన్ – అకారసంధి
2. ఎగసినట్లు = ఎగసిన + అట్ల – అకారసంధి
3. విప్పినయట్ల = విప్పిన + అట్ల – యడాగమ సంధి
4. కొట్టినయట్ల = కొట్టిన + అట్ల – యడాగమ సంధి
5. ఎగసినయట్ల = ఎగసిన + అట్ల – యడాగమ సంధి
6. మొత్తినయట్ల = మొత్తిన + అట్ల – యడాగమ సంధి
7. బిట్టూది = బిట్టు + ఊది – ఉత్వసంధి
8. గట్టెక్కి = గట్టు + ఎక్కి – ఉత్వసంధి
9. కెళ్లవుల కెల్లన్ = కెళవులకున్ + ఎల్లన్ – ఉకార వికల్ప సంధి
10. పాయవడు = పాయ + పడు – గసడదవాదేశ సంధి
11. అక్కొండ = ఆ + కొండ – త్రికసంధి
12. అచ్చెల్వ = ఆ + చెల్వ – త్రికసంధి
13. అయ్యుదధి = ఆ + ఉదధి – యడాగమ, త్రిక సంధులు
14. సూత్రపట్టు = సూత్రము + పట్టు – పడ్వాది మువర్ణలోప సంధి
15. దవాగ్ని = దవ + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
16. పురాభిముఖంబు = పుర + అభిముఖంబు – సవర్ణదీర్ఘ సంధి
17. పవనాశన కోటి = పవన + ఆశన కోటి – సవర్ణదీర్ఘ సంధి
18. బంధాను రూపంబు = బంధ + అనురూపంబు – సవర్ణదీర్ఘ సంధి
19. కూటాగ్రవీథి = కూట + అగ్రవీథి – సవర్ణదీర్ఘ సంధి
20. మహోపలములు = మహా + ఉపలములు – గుణసంధి
21. నభీవీథి = నభః + వీథి – విసర్గ సంధి
22. యశోవసనంబు = యశః + వసనంబు – విసర్గ సంధి
23. దిక్కుఁజూచి = దిక్కున్ + చూచి – సరళాదేశ సంధి
24. అరుగఁజూచి = అరుగన్ + చూచి – సరళాదేశ సంధి
25. అడంగఁ దొక్కి = అడంగన్ + త్రొక్కి – సరళాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. మహోపలములు గొప్పవైన ఉపలములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. బలుగానలు బలము గల కాననములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. దవాగ్ని దవము అనే అగ్ని తన సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
4. మహావివరము గొప్పదైన వివరము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. క్రోధరసము క్రోధము అనే పేరు గల రసము సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
6. నల్లని వల్వ నల్లనైన వలువ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రకృతి – వికృతి

భిదురకము – పిడుగు
జంఘ – జంగ
నిమిషము – నిముసము
గుహ – గొబ
ఉపరి – ఉప్పరము
కార్యము – కర్జము
అగ్ని – అగ్గి
పుత్రుడు – బొట్టె
ఘట్టము – గట్టు
వీథి – వీది
యశము – అసము
రూపము – రూపు
బంధము – బందము
ఆశ – ఆస
త్వర – తొర
శరము – సరుడు
కుల్య – కాలువ
సముద్రము – సంద్రము
దిశ – దెస
గుణములు – గొనములు

పర్యాయపదాలు

1. తోక : పుచ్చము, లాంగూలము, వాలము
2. అంభోధి : సముద్రము, ఉదధి, పారావారము, ఏటిజోటి మగడు, అంబుధి, కడలి
3. కార్ముకం : విల్లు, ధనుస్సు, శరాసనం, సింగిణి
4. నింగి : ఆకాశం, మిన్ను, గగనము, నభము, ఉప్పరము
5. రవి : సూర్యుడు, దివాకరుడు, దినకరుడు, ప్రభాకరుడు
6. వల్వ : వస్త్రము, వలువ, పటము, వసనము
7. వివరం : రంధ్రము, బిలము, కలుగు
8. మందిరము : భవనము, గృహము, ఇల్లు, సదనము, ఆలయము
9. తేరు : రథము, అరదము, స్యందనము, శతాంగము
10. అమరులు : దేవతలు, సురలు, నిర్దరులు, గీర్వాణులు, త్రిదశులు, వేల్పులు
11. పవనజుడు : హనుమంతుడు, ఆంజనేయుడు, గాడ్పుపట్టి, కరువలి వేలుపు కొడుకు, గాడు వేల్పు పట్టి, హనుమ
12. హరి : వానరము, కోతి, మల్లు, కపి, మర్కటము
13. పవనము – : వాయువు, గాడ్పు, గాలి, అనిలము, ప్రభంజనము, సమీరము, కరువలి
14. శ్రవణము : చెవి, కర్ణము, శ్రుతి, శ్రోత్రము
15. తండ్రి : జనకుడు, అయ్య, నాయన, నాన్న
16. కొండ : పర్వతము, గిరి, నగము, గట్టు, అద్రి
17. నభము . : ఆకాశము, మిన్ను, గగనము.

వ్యుత్వత్వరాలు

1. ధరాధరము : భూమిని ధరించునది – పర్వతము
2. తరంగము : దరిచేరినది – అల
3. కపి : చలించేది – కోతి
4. గాడ్పుకొడుకు : వాయువు యొక్క కొడుకు – హనుమంతుడు
5. పారావారము : అపారమైన తీరము గలది – సముద్రము
6. దానవులు : దనువు అనెడి స్త్రీ వల్ల పుట్టినవారు – రాక్షసులు
7. గాడ్పు వేల్పు పట్టి : వాయుదేవుని కొడుకు – హనుమంతుడు
8. ఏటిజోటి మగడు : నదీ కాంతకు భర్త – సముద్రుడు
9. అంబుధి : ఉదకములను ధరించునది – సముద్రము
10. హరి : 1. చీకటిని హరించేవాడు – సూర్యుడు
2. భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు – విష్ణుమూర్తి
3. గజాదులను హరించునది – సింహము
11. కార్ముకము : యుద్ధ కర్మ కొఱకు సమర్థమైనది – విల్లు
12. కరువలి వేల్పు కొడుకు : గాలిదేవుని పుత్రుడు – హనుమంతుడు
13. పవనజుడు : వాయువునకు పుట్టినవాడు – హనుమంతుడు
14. పవనాశనులు : గాలి ఆహారముగా కలవి – సర్పములు
15. ఉదధి : ఉదకములను ధరించునది – సముద్రము
16. ప్రభంజనుడు : వృక్షశాఖాదులను విరుగగొట్టేవాడు – వాయువు
17. కరి : కరము (తొండము) కలది – ఏనుగు
18. ఝరి : కాలక్రమమున స్వల్పమైపోవునది – ప్రవాహము

నానార్థాలు

1. వీధి : త్రోవ, వాడ, పంక్తి
2. హరి : విష్ణువు, సింహము, కిరణము, కోతి, పాము, గుఱ్ఱము
3. నిమిషము : టెప్పపాటు, తెప్ప వేసేటంత కాలము, పూవులు ముడుచుకొనడం
4. శరము : బాణము, నీరు, రెల్లు –
5. పురము : పట్టణము, ఇల్లు, శరీరము, మరణము
6. రవి : సూర్యుడు, జీవుడు, కొండ, జిల్లేడు చెట్టు
7. రసము : పాదరసము, శృంగారాది రసములు, విషము, బంగారు
8. బలి : గంధకము, ఒక చక్రవర్తి, కప్పము

కవి పరిచయం

పాఠ్యభాగం : ‘సముద్రలంఘనం’

దేనినుండి గ్రహింపబడింది : “రామాభ్యుదయము” ఆరవ ఆశ్వాసం నుండి.

కవి : అయ్యలరాజు రామభద్రుడు.

కాలం : రామభద్రుడు 16వ శతాబ్దివాడు.

ఏ ప్రాంతము వాడు : కడపజిల్లా ఒంటిమిట్ట ప్రాంతంవాడు.

ఎవరికి అంకితం : అయ్యలరాజు రామభద్రకవి, తన ‘రామాభ్యుదయ కావ్యాన్ని అళియ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితం ఇచ్చాడు.

అష్టదిగ్గజకవి : రామభద్రుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్దానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు.

ఇతర రచన : ఈ కవి మరొక రచన, “సకల కథాసార సంగ్రహం”

రామాభ్యుదయ కావ్య విశిష్టత : రామాభ్యుదయ కావ్యం, ప్రబంధరీతిలో ఎనిమిది ఆశ్వాసాల కావ్యం. ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. ఈ కావ్యంలో శ్రీరాముడి చరిత్ర ఉంది. రామాయణంలో ‘ఉత్తర కాండ’ను మాత్రం ఈ కవి వ్రాయలేదు.

బిరుదులు : ఈ కవికి ‘చతురసాహిత్య లక్షణ చక్రవర్తి’, “ప్రతివాది మదగజపంచానన” అనే బిరుదులు ఉన్నాయి.

ఆ కవితా సామర్థ్యం : రామభద్రుని కవితా సామర్థ్యం అంతా చమత్కారంతో కూడినదని, ఆయన వర్ణనల ద్వారా వెల్లడి అవుతుంది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

అవగాహన – ప్రతిస్పందన

పద్యం – 1

సీ|| అదుగు లొత్తినపట్లఁ బిదుగు మొత్తినయట్ల
బహుమహెపలములు పగిలి పడగం
దోఁక త్రిప్పినపట్ల మూఁక విప్పినయట్ల
బలుగాన లిలఁ గూలి బయలు గాఁగఁ
గేలం దట్టినపట్లఁ గోల గొట్టినయట్ల
గరికేసరాదులు గలంగి పఱవ
రంతు చూపినపట్ల వంతు మోపినయట్ల
గుహలు ప్రతిధ్వనుల్ గ్రుమ్మరింపఁ

తే.|| గంపితధరాధరాధిత్యకారరీత
రంగఘట లెల్లెడల నుప్పరంబు లెగసి
పడి తడిపి కార్యదాహవిభ్రాంతకపుల
యుల్లములతో దవాగ్నులంజల్లజేయ,
ప్రతిపదార్థం :
అడుగులు + ఒత్తినపట్లన్ = (హనుమంతుడు సముద్ర లంఘనం చేయడానికి) అడుగులు, నొక్కి పెట్టి వేసిన చోట
పిడుగు మొత్తినయట్ల = పిడుగు మీద పడిన విధంగా
బహుమహోపలములు; బహు = అనేకములైన
మహా + ఉపలములు = పెద్ద పెద్ద రాళ్ళు
పగిలి పడగన్ = ముక్కలై పడుచుండగా
తోక త్రిప్పినపట్లన్ = తన తోకను (హనుమంతుడు)
మూక విప్పినయట్లన్ = చెదరగొట్టినట్లుగా
బలుకానలు – పెద్ద పెద్ద అడవులు
ఇలఁగూలి (ఇలన్ + కూలి) = నేలపై కూలి
బయలుగాగన్ (బయలు + కాగన్) = ఆ ప్రదేశములు చెట్లు చేమలు లేని శూన్య ప్రదేశములు కాగా
కేలన్ = తన చేతితో
తట్టినపట్లన్ = తాకిన స్థలములలో
కోలన్ = కఱ్ఱతో
కొట్టినయట్లన్ – కొట్టిన విధంగా
కరి కేసరాదులు = ఏనుగులు, సింహాలు మొదలయిన
క్రూర జంతువులు

గమనిక :
‘కరి, కాసరారులు’ అని ఇక్కడ ఉండాలి. (శబ్ద రత్నాకరంలో ఇలానే ఉంది. (కాసర + అరులు) అనగా ఎనుబోతులకు శత్రువులయిన సింహాలు అని భావము. ‘కేసర’ + ఆదులు అన్న చోట, కేసర అంటే సింహము కాదు కేసరి అంటేనే సింహము)

కలగి, పఱవన్ = కలతపడి, పరుగెత్తి పోగా
రంతు చూపిన పట్లన్ = (హనుమ) సింహనాదము చేసిన చోట

గమనిక :
‘రంతు చూపుట’ అంటే సింహనాదము చేయడం అని సూర్యరామాంధ్ర నిఘంటువు).

వంతుమోపినయట్లన్ = పోటీ పడినట్లుగా
గుహలు = కొండ గుహలు
ప్రతిధ్వ నుల్ = ప్రతిధ్వనులను
క్రుమ్మరింపన్ = పోతపోయగా
కంపిత ధరాధరాధిత్యకాఝరీ తరంగ ఘటలు; కంపిత = కదల్పబడిన (హనుమంతుని పాదాల విన్యాసానికి కంపించిన)
ధరాధర = పర్వతము యొక్క
అధిత్యకా = ఎత్తైన నేలమీది
ఝరీ = సెలయేళ్ళ
యందలి = కెరటముల యొక్క
ఘటలు = సమూహములు;
ఎల్లెడలన్ (ఎల్ల + ఎడలన్) = అన్ని చోటులందును
ఉప్పరంబులు = ఆకాశమంత ఎత్తుకు
ఎగసిపడి = లేచిపడి
తడిపి = (ఆ ప్రదేశాలను) తడిపి
కార్యదాహ విభ్రాంత కపుల; కార్య దాహ = సీతాన్వేషణ కార్యము అనే అగ్నితో
విభ్రాంత = క్షోభపడిన
కపుల = వానరుల యొక్క
ఉల్లములతోన్ = మనస్సులతో పాటు
దవాగ్నులన్ = అక్కడనున్న దావాగ్నులను సైతము
చల్లఁజేయన్ (చల్లన్ + చేయన్) = చల్లపరచగా (చల్లార్చాయి)

భావం :
సముద్రాన్ని దాటడానికి సిద్ధమైన హనుమంతుడు, అడుగులు నొక్కిపెట్టి వేస్తున్నప్పుడు, పిడుగులు పడ్డట్లుగా పెద్ద పెద్ద రాళ్ళు పగిలి పడిపోయాయి. వేగంగా తన తోకను తిప్పినప్పుడు వచ్చిన గాలికి, పెద్ద పెద్ద అడవులు సైతం చెదరగొట్టబడిన విధంగా చెట్లు లేని శూన్యప్రదేశములుగా ఏర్పడ్డాయి. చేతితో చరిస్తే కల్టుతో కొట్టినట్లు, ఏనుగులు, సింహాలు మొదలయిన క్రూర జంతువులు కలత చెంది, పరుగులు పెట్టాయి. హనుమంతుడు సింహనాదం చేసినప్పుడు, పోటీపడుతూ గుహలు ప్రతిధ్వనించాయి. అక్కడ కొండల కంపనాల వల్ల, కొండ నేలలపై ఉన్న సెలయేళ్ళ కెరటాలు, ఆకాశానికి అంటేటట్లు ఎగసిపడ్డాయి. అవి దావాగ్నులతోపాటు, రామకార్యము పూర్తి చేయాలని తపించిపోతున్న వానరుల మనస్సులలోని మంటలను సైతమూ చల్లార్చాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 2

తే॥గీ॥ | ఒడలు వడసిన తమతండ్రి వడువు దోప
రయమునకుఁ గూటకోటులన్నియుఁ జలింపఁ
బెరింగి గిరి గాడ్పుకొడు కెక్కి తిరిగి తిరిగి
యొక్క చో నిల్చి దక్షిణదిక్కుల జూచి.
ప్రతిపదార్థం :
ఒడలు వడసిన (ఒడలు + పడసిన) = శరీరమును ధరించిన
తన తండ్రి = తన తండ్రియైన వాయుదేవుని
యొక్క
వడువు = విధము
తోపన్ = కన్పడేటట్లుగా
రయమునకున్ = వేగానికి
కూటకోటులు = పర్వత శిఖరాలు
అన్నియున్ – అన్నియునూ
చలింపన్ = కదలగా
పెరిగి = పెద్ద రూపంతో పెరిగి
గిరిన్ = పర్వతమును
గాడ్పుకొడుకు = వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
ఎక్కి = ఎక్కి
తిరిగి తిరిగి = అటూ ఇటూ దానిపై తిరిగి
ఒక్కచోస్ = ఒకచోట
నిల్చి = నిలబడి
దక్షిణ దిక్కున్ = దక్షిణ దిశను
చూచి = చూసి (చూశాడు)

భావం :
హనుమంతుడు శరీరాన్ని ధరించిన వాయుదేవుడా అనేటట్లు పర్వత శిఖరాలు అన్నీ కదలిపోయేటట్లు పెరిగి పర్వతము పైకెక్కి తిరిగి తిరిగి, ఒకచోట నిలబడి దక్షిణ దిక్కు వైపుకు చూశాడు.
అలంకారం : ఉత్ప్రేక్షాలంకారం

పద్యం -3

క॥ కటకట! ధరణీకటితట
పట మనిపించుకొనఁ గన్న పారావారం
బిటు వచ్చి కుటిలదానవ
పుటభేదనవప్రపరిఖపో యనఁ దగెఁగా
ప్రతిపదార్థం :
కటకట = అయ్యయ్యో !
ధరణీకటితట పటము; ధరణీ = భూదేవి యొక్క
కటితట = నడుమున (కట్టిన)
పటము = వస్త్రము
అనిపించుకొనన్ = అని చెప్పుకొనేటట్లు
కన్న = కనిపించేటటువంటి
పారావారంబు = సముద్రము
ఇటువచ్చి = ఇక్కడకు వచ్చి (ఈ లంకకు వచ్చి)
కుటిల = మోసగాడైన
దానవ = రాక్షస రాజైన రావణుని యొక్క
పుటభేదనవ = పట్టణమైన లంకకు
వప్ర పరిఖ పో = కోటగోడ చుట్టునూ ఉన్న, అగడ్త ఏమో
అనన్ = అనేటట్లుగా
తగెఁగా = తగినట్లు ఉన్నది కదా !

భావం:
అయ్యోయ్యో ! భూదేవి నడుమునకు కట్టిన వస్త్రమువలె శోభిల్లే సముద్రము, ఈ దిక్కునకు వచ్చి, ఈ దుష్ట రాక్షసుల పట్టణమైన లంకకు కందకము (అగడ్త) అనేటట్లు అమరి ఉన్నది కదా !

పద్యం -4

ఆ॥ గాడ్పు వేల్పుపట్టి గట్టెక్కి యుక్కునఁ
జూచె సూటి నేటి జోటిమగని
భావిసేతు వచ్చుపడ లంకకడకును
సూత్రపట్టుమాడ్కి జూద్కు వెలుఁగు
ప్రతిపదార్ధం :
గాడ్పు, వేల్పు పట్టి = వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
గట్టెక్కి (గట్టు + ఎక్కి) = పర్వతమును ఎక్కి (మహేంద్రగిరిని ఎక్కి)
ఏటిజోటి మగనిస్; ఏటిజోటి = నదీ కాంతలకు (నదులు అనే స్త్రీలకు)
మగనిన్ = భర్తయైన సముద్రుని
భావి సేతువు = రాబోయే కాలంలో శ్రీరామునిచే కట్టబడే వారధి
అచ్చుపడన్ = ఏర్పడడానికి
లంకకడకును = లంకా నగరము వఱకూ
సూత్రపట్టుమాడ్కిన్ = తాడు (దారము) పట్టుకొన్న విధంగా
చూడ్కి = తన కంటి చూపు
వెలుగన్ = ప్రకాశింపగా
సూటిన్ = నిటారుగా (నిదానముగా)
ఉక్కునన్ = స్థిరముగా
చూచెన్ = చూచాడు

భావం :
వాయుదేవుని ముద్దుల కుమారుడైన హనుమంతుడు, కొండను ఎక్కి రాబోయే కాలంలో శ్రీరాముడు కట్టబోయే సేతువును ఏర్పాటు చేయడానికి కొలత తీసుకోడానికి పట్టుకొన్న దారమా అన్నట్లుగా, సూటిగా సముద్రుని చూచాడు.
అలంకారము : ఉత్ప్రేక్షాలంకారము

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 5 : కంఠస్థ పద్యం

మ|| | తన చూ పంబుధిమీఁదఁ జాచి శ్రవణద్వంద్వంబు రిక్కించి వం
చిన చంచద్భుజముల్ సముత్కటకటినీ మంబులన్ బూన్చి తోఁ
క నబోవీథికిఁ బెంచి యంపు లిజీయంగాఁ బెట్టి చిట్టూది గ్ర
క్కున నర్కొంద యడంగండ్రొక్కి పయికిం గుప్పించి లంఘించుచోవ్
ప్రతిపదార్థం :
తన చూపు = తన కంటి చూపును
అంబుధిమీదన్ = సముద్రంపై
చాచి = బాగా ప్రసరింపజేసి
శ్రవణ ద్వంద్వంబున్ = చెవుల జంటను (తన చెవులు రెండింటినీ)
రిక్కించి = నిక్కించి (నిక్కపొడిచేటట్లు చేసి)
వంచిన = కొంచెము వంచిన
చంచద్భుజముల్ (చంచత్ + భుజముల్) = కదలుతున్న చేతులను
సముత్కటకటిసీమంబులన్; సముత్కటి = మిక్కిలి విశాలమైన
కటీ సీమంబులన్ = మొలపై భాగములందు
పూన్చి = గట్టిగా ఉంచి
తోకన్ = తన తోకను
నభోవీథికిన్ = ఆకాశములోనికి
పెంచి = ఎత్తుగా పెంచి
అంఘ్రులు = పాదములు
ఇటీయంగాఁ బెట్టి (ఇటీయంగాన్ + పెట్టి) = బిగించి పెట్టి
బిట్టూది (బిట్టు + ఊది) = గట్టిగా గాలి పీల్చి
గ్రక్కునన్ = వెంటనే
ఆ క్కొండ (ఆ + కొండ) = ఆ మహేంద్ర పర్వతము
అడంగన్ = అణగి పోయేటట్లు
త్రొక్కి = కాళ్ళతో తొక్కిపెట్టి
పయికిన్ = ఆకాశములోనికి
కుప్పించి = ఎగిరి
లంఘించుచోన్ = దూకేటప్పుడు

భావం:
హనుమంతుడు తన కంటి చూపును సముద్రము వైపు ప్రసరింపజేశాడు. రెండు చెవులు రిక్కించి, వంగి కదలుతున్న చేతులను తన విశాలమైన నడుముపై ఆనించాడు, తోకను ఆకాశవీధికి పెంచి, తన రెండు పాదాలు దగ్గరగా పెట్టి, గట్టిగా గాలి పీల్చాడు. తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగదొక్కి పైకి ఎగిరి దూకాడు.

పద్యం -6

కం॥ గిరి గ్రుంగంద్రొక్కి చెంగున
హరి నింగికి దాంటుగొనిన హరిహరి యవుడా
హరి యెగసినట్లు దోంచం
గిరి యెగానయట్లు తోఁచెం గౌళవుల కెల్లన్.
ప్రతిపదార్థం :
గిరిన్ = పర్వతమును (మహేంద్ర పర్వతాన్ని)
క్రుంగన్ = భూమిలోకి దిగిపోయేటట్లు
త్రొక్కి = త్రొక్కి
చెంగునన్ = ‘చెంగ్’ మనే ధ్వనితో
హరి = వానరుడయిన హనుమంతుడు
నింగికిన్ = ఆకాశములోకి
దాటుగొనినన్ = దూకగా
హరిహరి = ఆశ్చర్యము, ఆశ్చర్యము
అపుడు = ఆవేళ (ఆ సమయములో)
ఆ హరి = ఆ వానరుడైన ఆంజనేయుడు
ఎగసినయట్లు (ఎగసిన + అట్లు) = పైకి ఎగిరినట్లు
తోచక = అనిపించక
కెళవులకున్ + ఎల్లన్ = దూరం నుండి చూసేవారు అందఱికీ
గిరి = పర్వతము
ఎగసినయట్లు (ఎగసిన + అట్లు) = ఎగిరినట్లుగా
తోఁచెన్ = అనిపించింది (హనుమంతుడు పర్వతము అంత పరిమాణంలో ఉన్నాడని భావము)

భావం :
ఆంజనేయుడు ఆ విధంగా కొండను అణగదొక్కి, ఆకాశం పైకి ఎగిరినపుడు, హనుమంతుడు ఎగిరినట్లు కాకుండా, ఒక పర్వతము ఎగిరినట్లుగా, దూరం నుండి చూసిన వారికి అనిపించింది.

పద్యం -7

కం॥ గిరికారు కనిర్గమై
హరిశర మపు దసురవరపురాభిముఖంబై
సురగరుదదురవలోక
త్వరతో అనె నొకమహారవం బుదయింపన్
ప్రతిపదార్థం :
గిరికార్ముక నిర్గతమై; గిరీకార్ముక = పర్వతము అనే ధనుస్సు నుండి
నిర్గతము + ఐ = వెలువడినదై
హరిశరము = వానరుడు అనే బాణం
అపుడు = అప్పుడు
అసురవరపురాభిముఖంబై; అసుర వర = రాక్షసరాజయిన రావణాసురుని
పుర = లంకా పట్టణానికి
అభిముఖంబు + ఐ = ఎదురై
సురగరుడదురవలోక త్వరతోన్; సుర = దేవతలకును
గరుడ = గరుడ పక్షులకును
దురవలోక = చూడశక్యముకాని
త్వరతోన్ = వేగముతో
ఒక మహారవంబు = ఒక గొప్ప ధ్వని
ఉదయింపన్ = పుట్టే విధంగా
చనెన్ = వెళ్ళింది

భావం :
కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడు అనే బాణము, గొప్ప ధ్వనితో రాక్షస రాజైన రావణుని పట్టణమైన లంకానగరం వైపు వెళ్ళింది. అది దేవతలకు కాని, గరుడులకు కాని చూపునకు అందనంత వేగంతో దూసుకుపోయింది.

గమనిక :
పై పద్యంలో శ్లేషాలంకారము ఉంది. దీనికి మరో అర్థం, ఇలా చెప్పవచ్చు. గమనించండి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 8 సముద్రలంఘనం

పద్యం – 8

కం|| వాలంబుఁ దానుఁ గరువలి
వేలుపుల గొడు కరుగం జూచి విపరీతగతిన్
దోల దొరఁకొనెనొ రవి యిటు
దేలం టెనుగాడితోదితే రని రమరుల్
ప్రతిపదార్థం :
కరువలివేలుపుఁ గొడుకు= వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు
వాలంబున్ = తోకయునూ
తానున్ = తానునూ
అరుగఁజూచి; (అరుగన్ + చూచి) = వెడుతుండగా చూసి
అమరుల్ = దేవతలు
విపరీతగతిన్ = గొప్ప వేగముతో
రవి = సూర్యుడు
ఇటు = ఈ వైపు
తేలన్ = గాలిలో తేలేటట్లు
పెనుగాడితోడి; (పెను + కాడి తోడి) = పెద్దకాడితో ఉన్న (పెద్ద నాగలితో ఉన్న)
తేరు = రథమును
తోలన్ = తోలడానికి
దొరకొనెన్ = పూనుకున్నాడేమో
అనిరి = అన్నారు

భావం :
వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు, తోకతో ఎగరడం చూసిన దేవతలు, “సూర్యుడు చాలా వేగంతో పెద్దకాడి ఉన్న రథాన్ని నడిపిస్తూ, అలా వచ్చాడేమో” అనుకున్నారు.

పద్యం – 9

కం|| పవనణజంఘాసంభవ
పవనము వడింగదలిఁ బాయవడ నదంచి మహా
వివరమునకుం జారంబడి
పవనాశనకోటి నాశపణచి గమించెన్
ప్రతిపదార్థం :
పవనజ జంఘాసంభవ పవనము; పవనజ = వాయుపుత్రుడైన హనుమంతుని యొక్క
జంఘా = కాలి పిక్కల నుండి
సంభవ = పుట్టిన
పవనము = గాలి
వడిన్ = వేగంగా
కడలిన్ = సముద్రమును
పాయవడన్ (పాయ + పడన్) = చీలిపోయేటట్లు
అడచి = అణచి
మహా వివరమునకున్ = గొప్ప రంధ్రములోకి (గొప్ప కన్నములోకి)
చొరంబడి = ప్రవేశించి
పవనాశన కోటిన్ (పవన + అశన + కోటిన్) = గాలిని ఆహారంగా భుజించే పాముల గుంపును
ఆశపఱచి = అశపెట్టి (తమకు కావలసిన ఆహారము తమ దగ్గరకు వస్తోంది అన్న ఆశను కల్పించి)
గమించెన్ = వెళ్ళిపోయింది

భావం :
వాయుసుతుడైన హనుమంతుని కాలి పిక్కల నుండి పుట్టిన గాలి, వేగంగా సముద్రాన్ని చీలుస్తూ, లోతుకు ప్రవేశించింది. ఆ గాలి సముద్రపు అడుగున ఉన్న పాతాళంలో నివసిస్తూ గాలియే ఆహారం గల పాములకు, ఆహారం వచ్చిందేమో అనే ఆశను కలిగించి వెళ్ళింది. (హనుమంతుడు ఎగిరే ప్రదేశమంతా క్రింద సముద్రములో చీలి పాతాళలోకము కనబడుతోందని భావము.)

పద్యం – 10

సీ| | రఘువరేణ్యక్రోధరసము లంకకు ముట్టం
గ్రోవ్వారు కాలువ ద్రవ్వె ననంగ
నాగామి సేతుబంధానురూపంబుగాఁ
జేయు గుణావర్తమో యనంగ
నవయతో వసనంబు లవని కర్పించి య
చ్చెల్వ నల్లనివల్వ చించె ననఁగఁ
దనుఁ జూద శేషుందు తలుపులు దెఱచిన
బలిమందిరంబు వాకిలియొ యనంగ

తే॥॥ నొక నిమిష మాత్ర మప్పుదయ్యుదధి నడుమ
నుకువది తోంచె నదరంటం చి పఱచు
నలఘుణంఘా ప్రభంజనంబులఁ దనర్చి
యతండు వ్రాలెఁ ద్రికూటకూటాగ్రవీథి.
ప్రతిపదార్థం :
రఘువరేణ్యక్రోధరసము; రఘువరేణ్య = రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క
క్రోధరసము = కోపము అనే నీరు
లంకకున్ = లంకా పట్టణానికి
ముట్టన్ = చేరడానికై
క్రొవ్వారు = అందమైన
కాలువన్ = కాలువను
త్రవ్వెననగన్ (త్రవ్వెన్ + అనగన్) = త్రవ్వినారా అనేటట్లు
ఆగామి సేతుబంధాను రూపంబుగాన్; ఆగామి = రాబోయే కాలంలో కట్టబోయే
సేతుబంధ = వారధి నిర్మాణానికి
అనురూపంబుగాన్ = తగిన విధంగా
చేయు = చేసే
గుణావర్తమోయనంగన్ (గుణావర్తమో + అనంగన్) = పునాది గొయ్యియా అన్నట్లుగానూ
నవయశోవసనంబులన్; నవయశః = క్రొత్త కీర్తులు అనే
వసనంబులన్ = వస్త్రములను
అవనికిన్ = భూదేవికి
అర్పించి = ఇచ్చి
అచ్చెల్వ (ఆ + చెల్వ) = ఆ భూదేవి యొక్క
నల్లని వల్ప = నల్లని వస్త్రాలను (చీరను)
చించెననగన్ | = చింపివేసినాడా అనేటట్లునూ
తనున్ = తనను
చూడన్ = చూడ్డానికి
శేషుండు = ఆదిశేషుడు
తలుపులు దెఱచిన; (తలుపులు + తెఱచిన) = తలుపులు తెరచిన
బలిమందిరంబు = బలిచక్రవర్తి ఇంటి
వాకిలియొ యనంగన్ (వాకిలి + 1 + అనంగన్) = వాకిలియా అనే విధంగా
ఒక్క నిమిషము = ఒక క్షణ కాలము
అప్పుడు = అప్పుడు
అయ్యుదధినడుమన్ (ఆ + ఉదధి, నడుమన్) = ఆ సముద్రము యొక్క మధ్యలో
నఱకువడి = నఱకుడు పడినట్లు (తెగిన విధంగా, చీలినట్లు)
తోచెన్ = కనబడింది
అదరంటన్ = గాఢముగా
చలచిపఱచు = కొట్టి వెడుతున్న
జంఘా ప్రభంజనములన్; జంఘా = కాలి పిక్కల బల వేగముతో
ప్రభంజనములన్ = వేగంగా లేచిన పెను గాలులతో
తనర్చి = అతిశయించి
అతడు = ఆ హనుమంతుడు
త్రికూటకూటాగ్రవీధిన్; త్రికూట = త్రికూట పర్వతము యొక్క
కూట + అగ్రవీధిన్ = శిఖరము యొక్క పైభాగముపై
వ్రాలెన్ = వ్రాలాడు.

భావం :
శ్రీరాముని క్రోధరసము, లంకకు చేరేటట్లుగా కాలువ త్రవ్వినారా అనేటట్లును, రాబోయే కాలంలో నిర్మించే సేతు బంధనానికి అనుగుణంగా త్రవ్విన పునాది గొయ్యి, అనేటట్లును, క్రొత్తదైన కీర్తి వస్త్రాలను భూదేవికి అర్పించి, అంతకు ముందు ఆమె ధరించిన నల్లని వస్త్రాలను చింపివేశాడా అన్నట్లును, హనుమంతుని చూడడానికై ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలియా అన్నట్లును, ఒక నిమిషము సముద్రము మధ్య చీలినట్లు కనబడింది. ఇలా గాఢంగా కొట్టివెడుతున్న పిక్కల బలవేగంతో లేచిన గాలులతో, అతిశయించి హనుమంతుడు, త్రికూట పర్వత శిఖరముపై వ్రాలాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 7th Lesson మా ప్రయత్నం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 7th Lesson మా ప్రయత్నం

10th Class Telugu 7th Lesson మా ప్రయత్నం Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ఈ శతాబ్ది నాదే అని సగర్వంగా ప్రకటించుకున్న మహాకవి శ్రీశ్రీ. వారి మహాప్రస్థానం ఆధునిక తెలుగు సాహిత్యంలో దీపస్తంభంగా నిలబడింది. అటువంటి ప్రసిద్ధ కవితాసంపుటికి ప్రఖ్యాత రచయిత చలం ‘యోగ్యతాపత్రం’ అనే పేరుతో గొప్ప ముందుమాట రాశాడు. ఆ పీఠికలోని ప్రతి వాక్యం సాహితీ అభిమానుల నాలుకల మీద నాట్యం చేసింది. అందులోని కొన్ని వాక్యాలను చూడండి!

“తన కవిత్వానికి ముందుమాట రాయమని శ్రీశ్రీ అడిగితే,
కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చలం.”
“నెత్తురూ, కన్నీళ్ళూ కలిపి కొత్త టానిక్ తయారుచేశాడు
శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి.”

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరా ఏ విషయాన్ని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం పీఠిక (ముందుమాట) గురించి పై పేరా తెలియజేస్తోంది.

ప్రశ్న 2.
శ్రీశ్రీ పుస్తకానికి ఎవరు ‘ముందుమాట’ రాశారు?
జవాబు:
శ్రీశ్రీ పుస్తకానికి చలం ‘ముందుమాట’ ను రాశారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 3.
ముందుమాట ఎందుకు రాస్తారు?
జవాబు:
ఒక పుస్తకంలోని విషయాన్ని సమీక్షిస్తూ ముందుమాట రాస్తారు. ఆ పుస్తకంలోని మంచి, చెడులను గూర్చి ముందుమాట రాస్తారు. పుస్తకంలోని కీలకమైన విషయాలను, ఆశయాలను, తాత్వికతను తెలియజేయడానికి ముందుమాట రాస్తారు.

ప్రశ్న 4.
‘చలం’ శ్రీ శ్రీ గురించి రాసిన వాక్యాలు చదివారు కదా ! దీన్నిబట్టి శ్రీశ్రీ కవిత్వం ఎలా ఉంటుందని భావిస్తున్నారు?
జవాబు:
శ్రీశ్రీ కవిత్వాన్ని ఎవరూ తూచలేరు. శ్రీశ్రీ కవిత్వం చాలా ఉన్నతమైనది. బరువైన భావాలతో ఉంటుంది. విప్లవాత్మకమైనది. దానిలో పీడితులు, అనాథలు, దోపిడీకి గురౌతున్నవారి బాధలు, కన్నీళ్ళు ఉంటాయి. కర్షక, కార్మిక వీరుల కష్టాలు ఉంటాయి. ప్రపంచంలో దగాపడినవారి గాథలు ఉంటాయి. శ్రామిక వర్గపు పోరాటాలు, బాధలు, కన్నీళ్ళు ఉంటాయి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

1. పాఠం ఆధారంగా కింది అంశాలపై మాట్లాడండి.
అ) ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా గుర్తించవచ్చా? చర్చించండి.
జవాబు:
ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీలు ప్రభావితం చేశారు. అందుచేత ఇరవయ్యో శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా గుర్తించవచ్చును.

ప్రపంచ వ్యాప్తంగా ఇరవయ్యో శతాబ్దంలో స్త్రీలు విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయాది రంగాలలో ప్రధాన పాత్ర వహించారు.

లుక్రేటియా మాట్, ఎలిజిబెత్ కేడీ స్టాండన్ అనే ఇద్దరు మహిళలు కలిసి 1848లో న్యూయార్క్ లో ‘స్త్రీల స్వాతంత్ర్య ప్రకటన’ రూపొందించారు.

1850లో లూసీస్టోన్ అనే మహిళ ‘జాతీయ స్త్రీల హక్కులు’ రూపొందించారు.

భారతదేశంలో రాజారామమోహనరాయ్ ‘సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించాడు. మహాత్మాగాంధీ స్త్రీల అక్షరాస్యత, హక్కుల గురించి పోరాడాడు. 20వ శతాబ్దంలో ఎంతోమంది స్త్రీలు ఉపాధ్యాయినులు, నర్సులు, గుమస్తాలు, ఎయిర్ హోస్టెస్టు మొదలైన ఉద్యోగాలలో చేరారు.

మేరీక్యూరీ రేడియం, పొలోనియంలపై పరిశోధనలు చేసింది. ఆమె మొట్టమొదటి నోబెల్ బహుమతిని పొందిన మహిళ. రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తగా 20వ శతాబ్దపు చరిత్రలో ప్రథమస్థానంలో నిలిచింది.

మార్గరెట్ శాంగర్ కుటుంబ నియంత్రణ ఉద్యమం నడిపింది. స్త్రీలకు కుటుంబ నియంత్రణపై అవగాహన కలిగించింది. స్త్రీ, శిశు సంక్షేమానికి కృషి చేసింది.

భారతదేశాన్ని 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ఇందిరాగాంధీ ప్రపంచంలో 2వ మహిళా . ప్రధాని. తొలి మహిళా ప్రధాని సిరిమావో భండారు నాయకే (శ్రీలంక).

ఈ విధంగా అనేకమంది మహిళామణులు 20వ శతాబ్దాన్ని తమదిగా చేసుకొని చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారు.

ఆ) మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో కింది వాటిలో ఏ అంశంపై ఏమేం మాట్లాడతారు?
1) బాలికా విద్య – ఆవశ్యకత
2) నీకు నచ్చిన మహిళ – గుణగణాలు
3) మహిళల సాధికారత – స్వావలంబన
4) పురుషులతో దీటుగా మహిళల ప్రగతి నిజమేనా?
జవాబు:
1) బాలికా విద్య – ఆవశ్యకత
“ఒక తల్లి విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్య నేర్చుకొంటుంది” అన్నారు విజ్ఞులు.

బాలికలు విద్య నేర్చుకొంటే సమాజానికి చాలా మంచిది. ఎందుకంటే సమాజంలో కుల, మతాలతో పనిలేకుండా వివక్షకు గురయ్యేది స్త్రీ. ఎటువంటి దురాచారానికైనా మొదట బలి అయ్యేది స్త్రీయే. సంసారానికి దిక్సూచి స్త్రీయే. అటువంటి స్త్రీ విద్యావంతురాలైతే ఆమె తనకు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటిస్తుంది. తన కుటుంబానికి, తనకు న్యాయం చేసుకొంటుంది. అందుచేత బాలికా విద్య ప్రోత్సహించ తగినది. బాలికా విద్య సంఘ సంస్కరణకు తొలిమెట్టు. “ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్” అన్నట్లుగా స్త్రీలకు విద్య నేర్పితే ఎంతటి ఉన్నత స్థానాలనైనా అధిరోహించ
గలుగుతారు.

2) నీకు నచ్చిన మహిళ – గుణగణాలు

కస్తూరిబా గాంధీ :
11 ఏప్రిల్ 1869లో పోర్బందర్ లో జన్మించింది. గోకుల్ దాస్, విరాజ్ కున్వెర్బా కపాడియా దంపతులకు జన్మించింది. 1882లో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ (మహాత్మాగాంధీ) తో వివాహమయ్యింది.

1897లో భర్తతో కలసి దక్షిణాఫ్రికాకు వెళ్ళింది. అక్కడ తన భర్తతో అనేక ఉద్యమాలలో పాల్గొంది. జైలుకు వెళ్ళింది. భారతదేశం వచ్చాక, భర్తతో కలసి భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొంది. ఇక్కడ కూడా అనేకసార్లు జైలుకు వెళ్ళింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పినా వినలేదు. భరతమాత దాస్యశృంఖలాలను ట్రెంచడానికి తన కృషి మానలేదు. దేశ ప్రజలను చైతన్యవంతులను చేసింది. దేశం కోసం అహర్నిశలూ కృషి చేసింది. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయ్యింది. ఆరోగ్యం ఇంకా క్షీణించింది. గుండె నొప్పి వచ్చింది. అయినా దేశసేవ మానలేదు. విశ్రాంతి తీసుకోలేదు. మాతృదేశ సేవలో చివరి నిమిషం వరకూ గడిపింది. 22-2-1944లో తుదిశ్వాస విడిచింది. భరతమాత ముద్దులపట్టిగా చరిత్రలో లిఖించబడిన నారీమణి కస్తూరిబా గాంధీ.
(సూచన : గ్రంథాలయం నుండి వివరాలు సేకరించి విద్యార్థులు తలొకరి గురించి మాట్లాడాలి.)

3) మహిళల సాధికారత – స్వావలంబన
మహిళలకు సాధికారత చదువు వలన మాత్రమే వస్తుంది. మహిళలకు సాధికారత వచ్చినట్లైతే దేశం పురోగమిస్తుంది. మహిళలకు విద్యా, ఉద్యోగ, ఆస్తి హక్కులను ప్రాథమిక హక్కులలో చేర్చాలి. స్వావలంబన అంటే తమకు తామే అభివృద్ధి చెందడం. తమ కాళ్ళపై తాము నిలబడడం. ప్రభుత్వం స్త్రీలకు విద్యా ప్రోత్సాహకాలు కల్పించాలి. వారి స్వావలంబనకు వడ్డీలు లేని ఋణాలు మంజూరు చేయాలి. ఆర్థికంగా పుంజుకొనే అవకాశం కల్పించాలి. రాజకీయ పదవులలో ఎక్కువగా మహిళలను నిలపాలి. మహిళలకు సాధికారత, స్వావలంబన కల్పిస్తే, ప్రపంచ దేశాలలో భారత్ అగ్రగామి అవుతుంది. అవినీతి అంతమవుతుంది.

4) పురుషులతో దీటుగా మహిళల ప్రగతి నిజమేనా?
పురుషులతో దీటుగా మహిళల ప్రగతి కొంతవరకే నిజం. విద్యారంగంలో మహిళలు, మగవారికి దీటుగానే కాదు, అధిగమించి తమ ఆధిక్యతను చాటుకొంటున్నారు. క్రీడలలో కూడా మగవారితో దీటుగా ఉంటున్నారు. ఉద్యోగాలలో కూడా మగవారికి దీటుగానే ఉంటున్నారు. కాని, ఎంత ప్రగతిని సాధించినా, ఎంత దీటుగా నిలబడినా మగవారి పెత్తనం తప్పదు. ఒక మహిళ పదవిని చేపట్టినా, ఆమె భర్త, అన్న, తండ్రి, కొడుకు ఎవరో ఒకరు పెత్తనం చెలాయిస్తారు. రాజకీయంగా ఒక మహిళ సర్పంచ్ గా ఎన్నికైనా పెత్తనం ఆమెది కాదు. ఆమె ఇంటి మగవారిదే. ఆమె అలంకార ప్రాయంగానే మిగిలిపోతోంది. పల్లెటూళ్ళలో ఇది మరీ ఎక్కువ.
ఈ విధానం మారినపుడే మహిళల ప్రగతి నిజమైన ప్రగతి అవుతుంది. లేకపోతే అదంతా బూటకపు ప్రగతే.

2. ఈ కింది వాక్యాలు పాఠ్యాంశంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి సందర్భాల్ని వివరించండి.

అ) సంప్రదాయ చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడా పౌడర్ అద్దినట్లు అద్దుతుంటారు.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్లు రచించిన ‘మహిళావరణం’ గ్రంథం ‘ముందుమాట’ నుండి గ్రహింపబడిన “మా ప్రయత్నం” పాఠంలోనిది.

సందర్భం :
ఉద్యమాలు, చరిత్రలలో స్త్రీల పాత్ర గురించి రచయిత్రులు వివరిస్తున్న సందర్భంలోని వాక్యమిది.

భావం:
చరిత్రకారులు స్త్రీలను చరిత్రలో అక్కడక్కడ అలంకారానికి మాత్రమే రాశారు తప్ప, స్త్రీల గురించి పూర్తిగా రాయలేదు.

ఆ) ఊహలకూ, ఆలోచనలకూ లేని పరిమితులు పనిలో ఉన్నాయి.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్లు రచించిన ‘మహిళావరణం’ గ్రంథం ‘ముందుమాట’ నుండి గ్రహింపబడిన “మా ప్రయత్నం” పాఠంలోనిది.

సందర్భం :
రచయిత్రులు ‘మహిళావరణం’ పుస్తక రచనలో ఏర్పడిన ఇబ్బందులను వివరిస్తున్న సందర్భంలోని వాక్యమిది.

భావం:
సమాజంలో ప్రతిదాన్నీ మార్చటానికి సమాయత్తమైన స్త్రీల సమూహం ఇచ్చిన ప్రేరణ కలిగించిన ఊహలను, ఆలోచనలను పుస్తక రూపంలోకి తేవడంలో అనేక కారణాలు పరిమితులను ఏర్పరచాయి.

ఇ) శాల్యూట్లన్నీ హీరోలకే, హీరోయిన్లు ఆ తర్వాతే… ఇదీ మన సమాజ విధానం.
జవాబు:
పరిచయం:
ఈ వాక్యం ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్లు రచించిన ‘మహిళావరణం’ గ్రంథం ‘ముందుమాట’ నుండి గ్రహింపబడిన “మా ప్రయత్నం” పాఠంలోనిది.

సందర్భం :
రచయిత్రులు షావుకారు జానకి గారిని ఇంటర్వ్యూ చేసినపుడు ఆమె పలికిన వాక్యమిది.

భావం:
సినిమాలలో నటించిన హీరోలకిచ్చిన ప్రాధాన్యం, గౌరవం హీరోయిన్లకివ్వదు సమాజం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

3. కింది గద్యం చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

50వ దశకపు రెండవ భాగం నుంచీ డెబ్బయవ దశాబ్దం వరకూ రచయిత్రులు ఒక వెల్లువలా తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తారు. ఆచంట శారదాదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, మాలతీ చందూర్, లత, శ్రీదేవి, వాసిరెడ్డి సీతాదేవి, రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, యద్దనపూడి సులోచనారాణి, ఆనందారామం , డి. కామేశ్వరి, బీనాదేవి మొదలైన రచయిత్రుల పేర్లు ఇంటింటా వినిపించే పేర్లయ్యాయి. రచయిత్రుల నవలలతో నవలా సాహిత్యానికి తెలుగులో విస్తృతమైన మార్కెట్ ఏర్పడింది. రచయితలు ఆడవారి పేర్లతో తమ రచనలను ప్రచురించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1980వ దశకం తెలుగు సాహిత్యంలో స్త్రీల దశాబ్దంగా చెప్పవచ్చు. నవలా సాహిత్యంలో అరవయ్యవ దశాబ్దంలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న రచయిత్రులు 80వ దశాబ్దంలో కవిత్వంలో, కథలలో తమ ముద్ర వేశారు. అంతవరకు కవిత్వం తమదనుకునే పురుషుల భ్రమలను బద్దలు కొట్టారు. కవిత్వం రాయడమేకాదు – అంతవరకు కవిత్వంలోకి రాని స్త్రీల అణచివేతలోని పలు కోణాలను తమ కవితావస్తువుగా స్వీకరించారు.

అ) తెలుగు సాహిత్యంలో రచయిత్రులు ఏ కాలంలో వెల్లువలా వచ్చారు?
జవాబు:
50వ దశకపు రెండవ భాగం నుంచీ డెబ్బెవ దశాబ్దం వరకూ రచయిత్రులు తెలుగు సాహిత్యంలో వెల్లువలా తెలుగు
సాహిత్యాన్ని ముంచెత్తారు.

ఆ) 80 వ దశకం స్త్రీల దశాబ్దమని ఎలా చెప్పగలవు?
జవాబు:
80వ దశకంలో స్త్రీలు నవలా సాహిత్యంతో బాటు కవిత్వం, కథలలో కూడా తమ ముద్ర వేశారు. స్త్రీల అణచివేతలోని పలుకోణాలను తమ కవితా వస్తువుగా స్వీకరించారు. అంతవరకు కవిత్వం తమదనుకొనే పురుషుల భ్రమలను బద్దలు కొట్టారు. కనుక 80వ దశకం స్త్రీల దశాబ్దమని చెప్పవచ్చును.

ఇ) స్త్రీవాద కవయిత్రులు సాధించిన విజయాలు ఏమిటి?
జవాబు:
‘నీలిమేఘాలు’ రెండవ ఉత్తమ స్త్రీ వాద కవితా సంకలన ప్రచురణ, ఓల్గా రచనలు, అనేకమంది స్త్రీవాద రచయిత్రుల ప్రవేశం మొదలైనవి స్త్రీవాద కవయిత్రులు సాధించిన విజయాలు.

ఈ) స్త్రీవాద సాహిత్యంలో ఏ వస్తువులు ప్రాధాన్యం వహించాయి?
జవాబు:
స్త్రీల శరీర రాజకీయాలు, కుటుంబ అణచివేత ప్రాధాన్యం వహించాయి.

ఉ) పై పేరాకు అర్థవంతమైన శీర్షికను పెట్టండి.
జవాబు:
రచయిత్రులు – కవయిత్రులు, స్త్రీవాదం, స్త్రీల దశాబ్దం.

సూచన : పై మూడింటిలో ఏదైనా శీర్షికగా పెట్టవచ్చును. పై పేరాలో ప్రధినంగా చర్చించిన విషయానికి సరిపోయే విధంగా ఏ శీర్షికమైనా పెట్టవచ్చును. ప్రతి విద్యార్థి వేరు వేరు శీర్షికలు పెట్టేలాగా ప్రోత్సహించాలి)

4. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అ) సంపాదకులు మహిళావరణం పుస్తకాన్ని ఎందుకు తీసుకురావాలనుకున్నారు?
జవాబు:
గత శతాబ్దపు చరిత్ర నిర్మాతలుగా స్త్రీలది తిరుగులేని స్థానమని రచయిత్రులకు అనిపించింది. ఐతే దానిని సాధికారికంగా, సోదాహరణంగా నిరూపించటానికి ఎంతో అధ్యయనం అవసరం. ఎంతో సమయం కూడా పడుతుంది. అంతకంటే ముందుగా ఈ శతాబ్దంలో భిన్న రంగాలలో కీలక స్థానాలలో కీలక సమయాలలో పనిచేసి, అక్కడ తమ ముద్ర వేసిన వందమంది స్త్రీల ఫోటోలతో, వారి సమాచారంతో ఒక పుస్తకం తీసుకురావాలని రచయిత్రులు భావించారు. అదే ‘మహిళావరణం’.

ఆ) మహిళావరణం రచయిత్రులు ఏఏ రంగాలకు చెందిన స్త్రీల వివరాలు సేకరించాలనుకున్నారు.
జవాబు:
మొదటిసారి చదువుకొన్న స్త్రీలు, మొదటగా వితంతు వివాహం చేసుకొనే సాహసం చేసిన స్త్రీలు, స్త్రీ విద్య కోసం ఉద్యమించిన స్త్రీలు, ఉద్యమాలలో చేరి జైలుకు వెళ్ళేందుకు తెగించిన స్త్రీలు, నాటకం, సినిమా, రేడియో వంటి రంగాలలోకి తొలిసారి అడుగిడిన స్త్రీలు, మొదటి తరం డాక్టర్లు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, నృత్య కళాకారిణులు, విద్యాధికులు
మొదలైన స్త్రీల వివరాలు సేకరించి మహిళావరణం పుస్తకంలో పొందుపరచాలని రచయిత్రులు భావించారు.

ఇ) మహోన్నతులైన స్త్రీల విశేషాలు సేకరిస్తున్న సందర్భంలో సంపాదకులు పొందిన అనుభూతులు ఏంటి?
జవాబు:
మహోన్నతులైన స్త్రీల విశేషాలు సేకరిస్తున్న సందర్భంలో సంపాదకులు చాలామంది స్త్రీలను కలిశారు. వాళ్ళతో మాట్లాడుతుంటే ఉత్సాహంగా ఉండేవారు. వాళ్ళ అనుభవాలు వింటుంటే వారికి ఉద్వేగం కలిగేది. చరిత్రను వారు సంపాదకుల ముందుపరిచేవారు. సరిదె మాణిక్యాంబ గారు, అప్పుడు తమ కులం వారిని ఆడవద్దన్నారని, తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారనీ, వారి వృత్తి, పొలాలు, జీవనం అన్నీ లాగేసుకొన్నారనీ చెప్పినప్పుడు సంపాదకులకు కళ్ళు చెమర్చాయి.

నాటక రంగంలోకి కుటుంబ స్త్రీలు రావాలంటారు. కానీ, తామూ కుటుంబ స్త్రీలమే కదా ! ఏ స్త్రీ అయినా కుటుంబం నుండి కాక, ఎక్కడ నుండి వస్తుందని పావలా శ్యామల గారు కోపంగా అడిగినప్పుడు పితృస్వామ్య వ్యవస్థ స్త్రీలను మర్యాద – అమర్యాద పరిధులలో బంధించి తనకనుకూలంగా మాత్రమే వాళ్ళ కదలికను నియంత్రించే విధానమంతా సంపాదకుల కళ్ళకు కట్టింది.

హీరోలకే శాల్యూట్ లని, హీరోయిన్లు ఆ తర్వాతే, చివరకు మిగిలేది హీరోగారి గొప్పతనమే అని షావుకారు జానకి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినపుడు సంపాదకులకు చరిత్రను తిరిగి రాయాలనే కోరిక బలంగా కలిగింది.

సంపాదకులు 118 మంది మహోన్నత స్త్రీల సమాచారం సేకరిస్తూ, 118 సందర్భాల కంటే ఎక్కువ సార్లు ఉద్వేగానికి గురి అయ్యారు.

ఈ) మహిళావరణం పుస్తకంలోకి ఎంతో మంది స్త్రీలను తీసుకోవాలని ఉన్నా, కొద్దిమందిని మాత్రమే ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
ఈ శతాబ్దంలో విశేష కృషి చేసి, చరిత్ర నిర్మాతలుగా ప్రసిద్ధికెక్కిన మహోన్నతులైన స్త్రీలను అందరినీ, ‘మహిళావరణం’ పుస్తకంలోకి తీసుకురావాలనుకున్నారు. అన్ని రంగాలలోకీ దృష్టి సారించాలనుకున్నారు. కానీ, ఆర్ధిక పరిస్థితులు సహకరించలేదు. కనీసం రెండు వందల మందినైనా చేర్చాలనుకొన్నారు. వీలుపడక 100 మందిని మాత్రమే చేర్చాలనుకొన్నారు. అయితే, ఆ సంఖ్య వారికి తృప్తినివ్వలేదు. అందుచేత 118 మందిని చేర్చారు.

ఆ 118 మందిని ఎంపిక చేయడం కూడా చాలా కష్టం. ప్రతి రంగంలో తమదంటూ ఒక ముద్రవేసిన వారిని ఎంచుకోవాలి. అంటే ఆ రంగంలో నిష్ణాతులైన వారిని ఎంచుకోవాలి. వారిలో కొందరు మరణించి ఉండవచ్చు. వారి వివరాలు సేకరించాలి. బ్రతికున్నవారితో మాట్లాడాలి. వారి మాటలు, ఫోటోలు రికార్డు చేయాలి. ఇంటర్వ్యూలు చేయాలంటే, మరణించినవారి విషయంలో కుదరదు. పుస్తకంలో విలువైన ఇంటర్వ్యూలకు చోటు చాలదు. అందువల్ల ఇంటర్వ్యూలు తీసుకొని, వేయకపోవడం బాగుండదు. ఇంతా శ్రమపడినా ఆర్థికంగా నిధులు లేవు. అందుచేత క్లుప్తత తప్పదు.

మొత్తం మీద సమయం లేక, ఆర్థిక పరిస్థితి బాగోలేక, ఉత్సాహం ఉన్న కొద్దిమందిని మాత్రమే ఎంపిక చేశారు.

ఉ) మహిళావరణం పుస్తకం ప్రచురణలో సంపాదకులకు సహాయపడిన వారెవరు?
జవాబు:
మహిళావరణం పుస్తకానికి ప్రతి దశలోనూ అనేకమంది తమ సహాయసహకారాలను సంపాదకులకు అందించారు. పుస్తక రూపకల్పనకు సంపాదకులు ఎందరినో సంప్రదించారు.

భరత్ భూషణ్ చాలా ఉత్సాహంగా ఫోటోలు తీశారు. అనారోగ్యాన్ని కూడా లెక్కచేయలేదు. జీవించిలేనివారి ఫోటోలను కూడా ఆయన సేకరించారు. ఆయన తను ఒప్పుకొన్న పనిని సంతృప్తిగా, సంతోషంగా పూర్తి చేశారు.

ఎస్.ఆర్. శంకరన్, అక్కినేని కుటుంబరావు గార్లు సంపాదకుల కంటే సీరియస్ గా ఆలోచించారు. ప్రతి సందర్భంలో సంపాదకులను తరచి, తరచి ప్రశ్నించి, మేము ఎంచుకొన్న వారిని గురించి ఎందుకు ఎంచుకొన్నారనీ, ఎంచుకోని వారిని ఎందుకు విడిచారని ప్రశ్నించారు. చక్కటి సలహాలిచ్చారు. నాగార్జున చక్కటి “గ్లోసరీ” తయారుచేశారు. చేకూరి రామారావు గారు భాషా విషయంలో సంపాదకులకు చక్కటి సలహాలనిచ్చారు. పుస్తకం విషయానికి తగినట్లు అందంగా, గంభీరంగా, హుందాగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దినవారు రాజ్ మోహన్ తేళ్ళ గారు. డిజైన్లో, ఆర్ట్ వర్క్ లో ఒక పరిపూర్ణత సాధించడానికి ఆయన చాలా శ్రమపడ్డారు. అనుకున్న సమయానికి పుస్తకాన్ని అందించడానికి రాజ్ మోహన్ విశేష కృషి చేశారు.

నీనా జాదవ్, కంచ రమాదేవి, భరత్ భూషణ్ తో పాటు వెళ్ళి జీవిత విశేషాలు సేకరించారు. అవి అన్నీ ఒక క్రమ పద్ధతిలో భద్రపరిచారు. పద్మిని, సుజాత, సుబ్బలక్ష్మి ఇంగ్లీషులో పుస్తకాన్ని కంప్యూటరు మీద కంపోజ్ చేశారు. బీనా కూడా చాలా పనుల బాధ్యత తీసుకొని, సంపాదకులకు వెసులుబాటు కల్పించింది.

II. వ్యక్తికరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” దీంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జవాబు:
“సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” అనేదానితో ఏకీభవిస్తాను. ఎందుకంటే –

స్త్రీని సాధారణంగా కుటుంబానికి అంటిపెట్టుకొని ఉండే వ్యక్తిగానే పరిగణిస్తారు. తండ్రి చాటున లేదా భర్త చాటున ఉండి ఉద్యమాలలో వారికి చేదోడు వాదోడుగా ఉన్నట్లుగానే స్త్రీలను చిత్రీకరించారు. చరిత్ర నిర్మాతలుగా పురుషులు కీర్తింపబడతారు. వారి సహాయకులుగా స్త్రీలను చరిత్రలో పేర్కొంటారు. కానీ, స్త్రీలను చరిత్ర నిర్మాతలుగా రాయరు. అక్కడక్కడా కొందరిని పేర్కొన్నా, పెద్దగా పట్టించుకోరు. సమాజం ఏర్పరచిన అడ్డంకులను అధిగమించినా, గుర్తింపు లేదు. తమకోసం, దేశంకోసం, సమూహంగా స్త్రీలు చేసిన పోరాటాలకు చరిత్ర గుర్తింపు నివ్వలేదు. స్త్రీలు పడిన సంఘర్షణలకూ, సాధించిన విజయాలకూ గుర్తింపు దొరకదు. చరిత్రలో వారి ఉనికి తునాతునకలైపోయింది.

మొత్తం సామాజికాభివృద్ధి క్రమంలో విడదీయలేని భాగంగా వారిని చూడకుండా వారి జీవిత కథలను విడిగా చరిత్రలో చూపుతారు. ఇలాంటి స్త్రీలు వేళ్ళమీద లెక్కపెట్టగలిగినంత మంది కూడా మన చరిత్ర పుస్తకాలలో కనిపించరు. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి స్త్రీలకు చరిత్రలో స్థానం లేదు. ఉన్న చరిత్ర స్త్రీల ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబించే చరిత్ర కాదనే విమర్శ ఉంది.

స్త్రీ విద్యను ప్రోత్సహించిన పురుషులకు చరిత్రలో స్థానం దక్కింది. కానీ, మొదటిసారి చదువుకున్న సామాన్య స్త్రీలకు చరిత్రలో స్థానం దక్కలేదు. వితంతు వివాహ్లాలకు నడుంకట్టిన పురుషులకు చరిత్రలో పెద్దపీట వేశారు కానీ, మొదటగా వితంతు వివాహం చేసుకొన్న స్త్రీలు చరిత్రలో కనబడరు. అలాగే ప్రతి ఉద్యమంలోనూ స్త్రీలను చరిత్రలో తక్కువగా చూపారు. కనుక “సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” అనే సంపాదకుల అభిప్రాయంతో ఏకీభవిస్తాను.

“సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు” అనే దానితో ఏకీభవించను. ఎందుకంటే –

చరిత్రలో ఎవరి గొప్పతనం వారిదే. చరిత్ర నిర్మాతలుగా ఎవరు ఉంటే వారినే పేర్కొంటారు తప్ప చరిత్రకారులకు పక్షపాతం ఉండదు.

చరిత్రలో మహాత్మాగాంధీకి ఎంత స్థానం ఉందో, కస్తూరిబా గాంధీకి కూడా చరిత్ర నిర్మాతగా అంత స్థానం దక్కింది. : కస్తూరిబా గాంధీని చరిత్ర నిర్మాతగా ప్రపంచం గౌరవించింది. ఆమెకు సమున్నత స్థానం ఇచ్చింది.

మదర్ థెరిసా కూడా తన సేవల ద్వారా సేవా రంగంలో అపూర్వమైన చరిత్ర సృష్టించింది. ఆమె తండ్రి పేరు మీద ఈ చరిత్రలో స్థానం సంపాదించలేదు. థెరిస్సాను చరిత్ర నిర్మాతగానే గుర్తించారు. గౌరవించారు. నేటికీ గౌరవిస్తున్నారు.

దానగుణంలో డొక్కా సీతమ్మ గారు (పి.గన్నవరం, తూ! గోదావరి జిల్లా) చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కారు. బ్రిటిషు ప్రభుత్వం కూడా ఆమెను గౌరవించింది. ఇందిరాగాంధీ కూడా తనకు తానుగానే చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కింది.

కల్పనా చావ్లా అంతరిక్ష పరిశోధనలలో తనకు తానే సాటి అనిపించుకొని చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధి కెక్కింది. శకుంతలాదేవి గణితశాస్త్రంలో చరిత్ర నిర్మాతగా ప్రసిద్ధి కెక్కింది.

వ్యాపార రంగం, సినిమా రంగం, ఉద్యమాలు, విద్య, వైద్యం, ఎందులో చూసినా చరిత్ర నిర్మాతలుగా ప్రసిద్ధి కెక్కిన స్త్రీలు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినవారు కాదు వేలమంది ఉన్నారు.

కనుక “స్త్రీలకు చరిత్ర నిర్మాతలుగా తగిన గుర్తింపు దొరకదు” అనే సంపాదకుల అభిప్రాయంతో నేను ఏకీభవించను.

(సూచన: పై రెండు అభిప్రాయాలలో ఏ ఒక్క దినినైనా గ్రహించవచ్చును. రెండింటిని మాత్రం గ్రహించకూడదు.)

ఆ) రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి “మహిళావరణం” అనే పేరు సరిపోయిందని భావిస్తున్నారా? ఎందుకు?
జవాబు:
రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి “మహిళావరణం” అనే పేరు సరిపోయిందని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పుస్తకం రచించిన ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్, ముగ్గురూ స్త్రీలే. ఈ పుస్తకంలో 118 మంది వివిధ రంగాలకు చెందిన మహోన్నతులైన స్త్రీలనే పేర్కొన్నారు. స్త్రీలు నడిపిన ఉద్యమాలు, స్త్రీల కొరకు స్త్రీలు చేసిన పోరాటాలు పేర్కొన్నారు. కనుక దీనికి “మహిళావరణం” అనే పేరు సరిపోయిందని భావిస్తున్నాను.

రచయిత్రులు సంకలనం చేసిన పుస్తకానికి, “మహిళావరణం” అనే పేరు సరిపోలేదు అని భావిస్తున్నాను ఎందుకంటేకేవలం మహిళల వలన కానీ, కేవలం పురుషుల వలన కానీ ఏ ఉద్యమాలూ నడవవు. నడిచినా విజయాన్ని సాధించలేవు. సమస్య మహిళలదైనా, పురుషులదైనా అందరూ కలసి ఉద్యమం చేస్తేనే విజయవంతమౌతుంది. ఈ పుస్తకంలో పేర్కొన్న ప్రతి ఉద్యమంలోనూ మహిళలతోపాటు పురుషులు కూడా పాల్గొనే ఉంటారు. అంతెందుకు ? ఈ పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చిన దగ్గర నుండి పుస్తకం ప్రచురణ పూర్తయి చేతిలోకి వచ్చే వరకూ ఎంతమంది స్త్రీల, పురుషుల కష్టం ఉందో సంపాదకులే స్వయంగా రాశారు. కనుక ఈ పుస్తకానికి మహిళావరణం కాక వేరే పేరు పెట్టి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.
సూచన: పై అభిప్రాయాలు రెండూ పంచకూడదు. ఏ ఒక్క దినినైనా గ్రహించవచ్చును.)

ఇ) “ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్నీ !” అని స్త్రీల గురించి రచయిత్రులు ఎందుకు పేర్కొన్నారు?
జవాబు:
అప్పుడు తమ కులంవారిని ఆడవద్దన్నారనీ, తర్వాత అన్ని కులాల వారిని ఆడమన్నారనీ సరిదె మాణిక్యాంబ గారు చెప్పారు. వారి వృత్తి, పొలాలు, జీవనం అన్నీ తీసేసుకున్నారని ఆమె చెప్పారు. ఇప్పుడు అదే జీవనోపాధిగా అన్ని కులాల వాళ్ళు బతుకుతున్నారు. అది తప్పు కాదా ? అని ఆమె ప్రశ్నించారు.

నాటక రంగంలోకి కుటుంబ స్త్రీలు రావాలంటారు. తామంతా కుటుంబ స్త్రీలం కామా ? ఏ స్త్రీయైనా కుటుంబంలోంచి కాకుండా ఎక్కడ నుండి వస్తుంది ? అని పితృస్వామ్య వ్యవస్థని నిలదీశారు పావలా శ్యామల గారు.

శాల్యూట్లన్నీ హీరోలకేనా ? హీరోయిన్లు పట్టరా ? హీరో గొప్పతనం ఉంటే సినిమాలు ఆడేస్తాయా ? అని షావుకారు జానకిగారు సినీ రంగంలోని పురుషాధిక్యతను ప్రశ్నించారు.

ఈ రకంగా ప్రతివాళ్ళు స్త్రీలను తక్కువగా చూసినందుకు చరిత్రను కడిగి పారేశారు. అందుచేతనే “ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్నీ” అని రచయిత్రులు పేర్కొన్నారు. వారి ఆవేశంలో అర్థముంది. వారి ప్రశ్నలో పరమార్ధముంది. వారు ప్రశ్నించిన తీరులో అంతరార్థముంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలగడానికి గల కారణాలను వివరించండి.
(లేదా)
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలగడానికి గల కారణాలను “మా ప్రయత్నం” పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
సామాజికంగా 20వ శతాబ్దంలో స్త్రీలు చాలా పెద్ద మార్పులు తెచ్చారు. నిజానికి ఈ శతాబ్దం స్త్రీలది అని చెప్పవచ్చును. అన్ని రంగాలలో స్త్రీలు చరిత్ర నిర్మాతలుగా ఉన్నారు. ప్రతి రంగంలో స్త్రీలు తమదంటూ ఒక ముద్రను వేశారు.

కొందరైతే చరిత్ర సాగిన క్రమాన్ని ప్రశ్నించారు. సరిదె మాణిక్యాంబ గారు తమ కులం వారిని ఆడవద్దన్నందుకు ఆవేదన చెందారు. తర్వాత అన్ని కులాల వాళ్ళూ ఆడలేదా ? అని తీవ్రంగా ప్రశ్నించారు. నాటక రంగంలో తమను చిన్న చూపు చూసినందుకు పావలా శ్యామల గారు ఊరుకోలేదు. పితృస్వామ్య వ్యవస్థపై ధ్వజమెత్తారు. శాల్యూట్లన్నీ హీరోలకేనా? అంటూ షావుకారు జానకిగారు సినీ పరిశ్రమని కడిగి పారేశారు. ఈ విధంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు చరిత్రను ప్రశ్నించారు.

ఆయా రంగాలలో స్త్రీలు చేసిన కృషి, వాళ్ళు వేసిన ముద్ర, మొట్టమొదటిగా ఒక ప్రత్యేక రంగంలో అడుగుపెట్టినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న సంక్లిష్ట సందర్భాలు, ప్రజలలో వారికున్న స్థానం, వీటిని . అన్నిటినీ పరిగణనలోకి తీసుకొంటే చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారు.

సమాజంలోని ప్రతిదాన్నీ మార్చటానికి స్త్రీలు చరిత్రలో సమాయత్తమయ్యారు. దేశంకోసం, తమకోసం, సంఘసంస్కరణ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. తాము ముందు వరుసలో ఉండి ఎన్నో ఉద్యమాలు నడిపారు. ఎందరినో ప్రభావితులను చేశారు. స్త్రీలు రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి.

మొదట చదువుకొన్న స్త్రీ, మొదట వితంతు వివాహం చేసుకొన్న స్త్రీలే నిజమైన చరిత్ర నిర్మాతలు. ఉద్యమాలలో చేరి జైలుకు వెళ్ళిన స్త్రీలు నిజమైన చరిత్ర నిర్మాతలు. నాటకం, సినిమా, రేడియో వంటి రంగాలలోకి మొదటిసారి అడుగుపెట్టిన స్త్రీలు నిజమైన చరిత్ర నిర్మాతలు.

అందువల్లనే చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలిగింది.

ఆ) “ఈ స్త్రీలందరూ ఈ చరిత్రను నిర్మించేందుకు ఎంత మూల్యం చెల్లించారో తలచుకుంటే మా గుండెలు బరువెక్కాయి” అనడంలో పీఠికాకర్తల ఆంతర్యం ఏమిటి?
జవాబు:
చరిత్రకారులు స్త్రీలకు తగిన గుర్తింపు నివ్వలేదు. పితృస్వామ్య వ్యవస్థ, పురుషాధిక్యత స్త్రీలను తక్కువగానే చూసింది. అయినా స్త్రీలు వెనుకంజ వేయలేదు. స్త్రీల ఉద్యమాలు ఈ విషయాన్ని ప్రశ్నించాయి. విలువా, గుర్తింపూ లేకపోయినా స్త్రీలు దేశం కోసం, తమ కోసం ఉద్యమాలు చేశారు. ఎంతోమంది స్త్రీలు సమాజపు కట్టుబాట్లను ప్రశ్నించారు. సమాజాన్ని ఎదిరించి విద్యాభ్యాసం చేశారు. వితంతువులు పునర్వివాహాలు చేసుకొన్నారు. ఉద్యమాలలో తెగించి పాల్గొన్నారు. జైళ్ళకు :. వెళ్లడానికి కూడా భయపడలేదు. నాటకం, సినిమా, రేడియో వంటి రంగాలలోకి మొదటిసారి అడుగుపెట్టిన స్త్రీలకు వారి కుటుంబాల నుండీ, సమాజం నుండీ ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో ఊహించుకొంటేనే భయం వేస్తుంది. మొదటి తరం డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, నృత్య కళాకారిణులు మొదలైన వారంతా ఎన్నో బాధలు పడి ఉంటారు. ఎన్నో ఈసడింపులకు గురై ఉంటారు. ఎన్నెన్నో అవమానాలను ఎదుర్కొని ఉంటారు. ఇంకెన్నో సూటిపోటి మాటలను ధరించి ఉంటారు. ఎంతో ఆవేదన చెంది ఉంటారు. ఎన్నో కోల్పోయి ఉంటారు.

అయినా ధైర్యం కోల్పోలేదు. పట్టుదల వీడలేదు. సంస్కరణలను వదిలి పెట్టలేదు. ఉద్యమాలు ఆపలేదు. తమ కోసం, దేశం కోసం పరితపిస్తున్నారు. ఉద్యమిస్తున్నారు. ఉద్యమాలే ఊపిరిగా స్త్రీలు చేసిన సాహసాలు తలుచుకొంటే ఒళ్ళు పులకరిస్తుంది. వారు పడిన బాధలు ఊహించుకొంటే హృదయం ద్రవిస్తుంది.

అటువంటి చరిత్ర నిర్మాతలైన స్త్రీల బాధలను, అనుభూతులను వారి మాటలలోనే సంపాదకులు విన్నారు. సరిదె మాణిక్యాంబ గారు తమ కులం వారిని ఆడవద్దన్నపుడు ఆమెకు కలిగిన ఆవేదన, తర్వాత అన్ని కులాల వారూ ఆడినపుడెవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో రెట్టింపయింది. షావుకారు జానకిగారు ఎంత గొప్ప నటి అయినా హీరోలకే గౌరవాలు దక్కినపుడు ఆమె వేదన వర్ణనాతీతం. నాటక రంగంలో తమను తక్కువ చూపు చూసినందుకు పావలా శ్యామల గారి బాధను చెప్పడానికి మాటలు చాలవు.

అప్పటి కందుకూరి రాజ్యలక్ష్మి గారు వితంతు పునర్వివాహాల కోసం ఉద్యమించారు. స్త్రీ విద్యకోసం తపించారు. ఆమె నుండి మేకప్ రంగంలో స్త్రీలకు స్థానం కోసం పోరాడిన శోభాలత వరకూ అందరూ కొత్త వెలుగుల కోసం తాపత్రయపడిన వారే. అందరూ ఎంతో కొంత మూల్యం చెల్లించినవారే. అందుకే అవన్నీ స్వయంగా పరిశీలించిన సంపాదకుల హృదయాలు బాధతో బరువెక్కాయి. వారి మాటలలోని ఆంతర్యం అదే.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఒక ప్రముఖ స్త్రీవాద రచయిత్రి మీ పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వస్తున్నారు. వారిని మీరు ఏమి ప్రశ్నించదలచుకున్నారో ఆ ప్రశ్నల జాబితా రాయండి.
జవాబు:
నమస్కారాలండీ, మా పాఠశాల వార్షికోత్సవానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. మీ వంటి పెద్దవారు మా పాఠశాలకు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండీ. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి, మా సందేహాలు తీర్చుకోవాలని, విద్యార్థులందరం కలిసి ఒక జాబితా రూపొందించాం. ఇవండీ ఆ ప్రశ్నలు –
ప్రశ్నల జాబితా:

  1. మీ పేరు మా అందరికీ తెలుసు. అయినా మీ నోటితో మీ పేరు వినాలని మా కుతూహలం. మీ పేరు చెప్పండి.
  2. మీదే ఊరండీ?
  3. మీ చిన్నతనంలో మీరే స్కూలులో చదివారు?
  4. అది ప్రభుత్వ పాఠశాలా? ప్రైవేటుదా?
  5. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మీపై కోప్పడేవారా?
  6. మీరు అల్లరి చేసేవారా?
  7. ఎవరితోనైనా ఫైటింగులు చేసేవారా?
  8. మీరు ఎక్కడి వరకూ చదివారు? మీ విద్యావిశేషాలు చెప్పండి.
  9. స్త్రీవాద రచయిత్రిగా మీరు మారడానికి కారణాలేమిటి?
  10. మీరు స్త్రీవాద రచయిత్రిగా స్త్రీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు ఏ విధమైన పరిష్కారాలు చెబుతారు?
  11. స్త్రీవాద రచయిత్రుల వలన సమాజానికేమిటి ఉపయోగం?
  12. మీ రచనల పేర్లు చెప్పండి. వాటిలోని విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పండి.
  13. మీ భర్త గారూ, పిల్లలూ మిమ్మల్ని స్త్రీవాద విషయంలో ప్రోత్సహిస్తారా?
  14. ఇప్పుడు కూడా ఇంట్లో మగవారి మాటే చెల్లుతుంది కదా ! దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
  15. మీరు మాకిచ్చే సందేశం చెప్పండి.
  16. మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్త్రీవాద రచయిత్రులెవరు? ఎందుకు?
  17. మీరు మగవారి రచనలు చదువుతారా? చదవరా?
  18. మీ వంటి రచయిత్రి మా పాఠశాలకు వచ్చి, మా సందేహాలు తీర్చినందుకు ధన్యవాదాలండీ. నమస్కారమండీ.

ఆ) మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
(మహిళలే మహిని వేల్పులు )
మనలను తన కడుపులో పెట్టుకొని, నవమాసాలు మోసి, కని, పెంచిన అమ్మ ఒక స్త్రీ. ప్రతి స్త్రీలోనూ అమ్మనే చూడాలని రామకృష్ణ పరమహంస ఉద్బోధించారు. ఉపనిషత్తులు ‘మాతృదేవోభవ’ అని తల్లికి మొదటి స్థానం ఇచ్చి దైవంగా పూజించమన్నాయి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, మొత్తం ప్రపంచంలోని ఏ భాషకు చెందిన సాహిత్యమైనా స్త్రీని గౌరవించమని బోధించింది. కానీ, స్త్రీని చిన్నచూపు చూడమని ఏ సాహిత్యమూ చెప్పలేదు. చెప్పకూడదు. చెప్పదు.

స్త్రీలను చిన్నచూపు చూడడం, ఆడపిల్ల కదా అని వివక్షతతో మాట్లాడడం కుసంస్కారానికి నిదర్శనం. ఆడపిల్లలకు చురుకుతనం ఎక్కువ ఉంటుంది. సహజసిద్ధంగానే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఓర్పు ఎక్కువ. నేర్పు ఎక్కువ. అటువంటి బాలికలను ప్రోత్సహించాలి. చదవించండి. వివక్షతకు గురి చేయకండి.

ఇప్పటి సినిమాల ప్రభావమో ఏమోకాని, స్త్రీలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇది మన సమాజానికి సిగ్గుచేటు. ప్రపంచానికి ‘గీత’ ను బోధించిన భారతీయులు ‘గీత’ను దాటడం తగదు. ఎక్కడైనా స్త్రీలకు అన్యాయం జరుగుతుంటే తిరగబడండి. శత్రుదేశపు స్త్రీని కూడా తల్లిలాగ భావించిన శివాజీ మనకు ఆదర్శం. స్త్రీని దేవతగా భావిద్దాం . తల్లిగా, సోదరిగా గౌరవిద్దాం. మన సంస్కారాన్ని ప్రపంచమంతా చాటిద్దాం. ఎక్కడ స్త్రీలు ఆనందంగా ఉంటారో అక్కడ దేవతలు ఆనంద తాండవం చేస్తారు.

రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, జోన్ ఆఫ్ ఆర్క్, చాంద్ బీబీ వంటి వీరనారులు ఉద్భవించిన ఈ భూమిమీద పుట్టిన నీవు అబలవా ! సబలవా ! నిన్ను నీవు నిరూపించుకో! నువ్వు వేసే ప్రతి అడుగూ కావాలి దుర్మార్తులకు దడుపు. నిన్ను నువ్వే కాపాడుకో! తెగించు ! పోరాడు ! మేమున్నాం భయపడకు! నారీలోకపు విజయ పతాకం చేబూను! అందుకో ! జయజయ ధ్వానాలు.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన మహిళల ఫోటోలను, జీవిత విశేషాలను సేకరించి, ఒక మోడల్ “మహిళావరణం”
పుస్తకాన్ని తయారుచేయండి. ప్రదర్శించండి.
జవాబు:
1. సుసన్నా అరుంధతీరాయ్ (రచయిత్రి – సంఘసంస్కర్త) :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 5
మొట్టమొదటిసారిగా తన రచన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి 1997 లో ‘బ్రిటన్ వారిచ్చే ‘బుకర్ ప్రైజ్’ ను గెలుచుకున్న భారతీయ మహిళ. 1961 నవంబరు 25న బెంగాల్ లో జన్మించి కేరళ, కొట్టాయంలోని ‘అయ్ మానమ్’ గ్రామంలో పెరిగింది. ‘ఆమె చాలామందికి స్ఫూర్తి ప్రదాత. చిన్నతనం నుండి బాలికగా, స్త్రీగా ఎన్నో ఇబ్బందులను, అడ్డంకులను అధిగమించి ఈ స్థాయికి చేరింది. పేదలు, అణగారిన వర్గాల తరఫున గొంతెత్తి ‘అధికారం’ తో మాట్లాడాలంటే ఈమెకి ఈమే సాటి. 2004లో ఈమె సిడ్నీ అరుందరాయ్) శాంతి బహుమతిని కూడా గెలుచుకుంది.

2. శకుంతలాదేవి :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 6
మానవ కంప్యూటర్ – గణితంలో ఎంత కష్టమైన సమస్యనైనా ఎటువంటి యంత్ర సహాయం లేకుండానే సాధించగలిగే అసమాన ప్రతిభ కలిగిన స్త్రీ. 1939 లో కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. చాలా దేశాలు ఈవిడ ప్రతిభను ప్రదర్శించడానికి తమ దేశాలకు ఆహ్వానించాయి. 1995లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈమె పేరును 26వ పేజీలో లిఖించారు.

3. అనిబిసెంట్ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 7
లండన్లో జన్మించిన ఐరిష్ మహిళ. 1893 వ సం||లో భారతదేశానికి వచ్చారు. ఈమె ప్రఖ్యాతిగాంచిన విద్యావేత్త, జర్నలిస్టు, సోషల్ వర్కర్, మరియు ఆధ్యాత్మికవేత్త. ఈమె థియోసాఫికల్ సొసైటీ (దివ్యజ్ఞాన సమాజం) ను స్థాపించారు. భారతదేశంలో స్వాతంత్ర్యపోరాట కాలంలో హోమ్ రూల్ లీగ్ ను ప్రారంభించారు. అంతేగాక, న్యూ ఇండియా’ కు సంపాదకత్వం వహించారు. భారతీయ బాలుర స్కౌట్ అసోసియేషను కూడా ప్రారంభించారు. 86 సం||ల వయస్సులో ఈమె మరణించారు.

4. కరణం మల్లేశ్వరి :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 8
భారతదేశ వెయిట్ లిఫ్టర్. ఒలింపిక్స్ లో భారతదేశం తరఫున మెడల్ సాధించిన తొలి మహిళ. 2000 సం||రం సిడ్నీ ఒలింపిక్స్ లో ఈమె పతకాన్ని సాధించింది. 1994 – 95 సం||రానికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును పొందింది. మహిళ అయివుండి పురుషులు ఎక్కువగా పాల్గొనే వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్ పతకం గెలవడమంటే ఎన్ని కష్టనష్టాలకు ఓర్చి ఉంటుందో ఊహించండి.

5. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 9
మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి 1916 సెప్టెంబరు 16న మధురైలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో నైటింగేలని అంటారు. ఈమె 1954లో ‘పద్మభూషణ్’, 1974లో రామన్ మెగసెసె అవార్డు, 1975లో ‘పద్మ విభూషణ్’ లతో గౌరవించబడ్డారు. 1998లో ‘భారతరత్న’ అవార్డును కూడా పొందారు. మహిళలు అంతగా బయటకి రాని రోజుల్లోనే ఆమె సంగీత కచేరీలు చేశారు. 88 సం|| రాల వయసులో ఈమె మరణించారు.

6. ఇందిరాగాంధీ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 10
మొట్టమొదటి మహిళా ప్రధాని, అలహాబాదులో జన్మించారు. 13 సంవత్సరాల వయసులోనే ‘వానరసేన’ ను స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధీరురాలు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నపుడు బ్యాంకుల జాతీయీకరణ, బంగ్లాదేశ్ కు స్వేచ్ఛ, 20 పాయింట్ ప్రోగామ్ మొదలైనవి అమలుచేశారు. ఆమె భారతరత్న పురస్కారాన్ని 1971లో పొందారు. 1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీ తన సొంత గార్డులచే కాల్చి చంపబడ్డారు. ఈమె తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన మహిళ.

7. కల్పనాచావ్లా :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 11
జననం 1 – 7 – 1961, మరణం 1 – 2 – 2003. ఇండియన్ అమెరికన్ వ్యోమగామి. కొలంబియా స్పేస్ షటిల్ లో మరణించిన ఏడుగురు వ్యోమగాములలో ఈమె కూడా ఒకరు. ఈమెకు నాసా అనేక మెడల్స్ ఇచ్చింది. మరణం తథ్యమని తెలిసినా కూడా స్పేస్ షటిల్ లో ఆమె ప్రవర్తన, ధైర్యం చిరస్మరణీయం.

8. మేథాపాట్కర్ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 12
ఈమె 1954 డిసెంబరు 1న జన్మించారు. సామాజికవేత్త. ప్రముఖ పర్యావరణవేత్త, ముంబై వాసి. ‘నర్మదా బచావో’ ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు. 1991లో రైట్ లైవ్లీహుడ్ అవార్డును పొందారు.

9. తస్లీమా నస్క్రీన్ :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 13
ఈమె 1962 ఆగస్టు 25న బంగ్లాదేశ్ లో జన్మించారు. ప్రముఖ ఫెమినిస్టు. మతాలకతీతంగా స్త్రీకి స్వేచ్ఛ, సమానత్వాలు ఉండాలని ‘అక్షర యుద్ధం’ చేస్తున్నారు. ఈమె వ్రాసిన ‘లజ్జ’ అనే పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. దీని మూలంగా ఆమె అనేక దాడులకు గురయింది. ఆమె ప్రస్తుతం బంగ్లాదేశ్ ను వదిలిపెట్టి ప్రవాసంలో జీవితాన్ని గుడుపుతున్నారు.

10. కిరణ్ బేడి :
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 14
ఈమె 1949 జూన్ 9న జన్మించారు. విశ్రాంత ఐ.పి.ఎస్ ఆఫీసరు. మొట్టమొదటి మహిళా ఆఫీసరు. 1994లో రామన్ మెగసెసె అవార్డు గ్రహీత. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో జన్మించారు. తన విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న మహిళ.

III. భాషాంశాలు

పదజాలం

1) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) సామాన్యంగా చరిత్ర నిర్మాతలుగా స్త్రీలకు గుర్తింపు దొరకదు.
జవాబు:
స్త్రీ : 1) పడతి 2) వనిత 3) ముదిత

ఆ) అందరికీ ఒక పద్ధతి పాటించడమే బాగుంటుంది.
జవాబు:
పద్దతి : 1) విధానం 2) కరణి 3) చందము

ఇ) ఎన్నో అనుభవాలు స్మరణలోకి తెచ్చుకున్నాను.
జవాబు:
స్మరణ : 1) జ్ఞప్తి 2) గుర్తు 3) తలపు

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

2) ఈ పాఠంలో శబ్దాలంకారం ఉన్న వాక్యాలను గుర్తించి రాయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 1
జవాబు:
1) కొత్త సహస్రాబ్దంలోకీ, శతాబ్దంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో గడిచిన
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 2
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 3

3) పాఠం ఆధారంగా కింది జాతీయాలు ఏ సందర్భాలలో వాడతారో వివరించండి.

అ) గుండెలు బరువెక్కడం :
జవాబు:
విపరీతమైన మానసిక బాధ కలిగినపుడు ఈ జాతీయం ఉపయోగిస్తారు.
సొంతవాక్యం : పేదల పాట్లు చూస్తే, ఎవరికైనా గుండెలు బరువెక్కడం సహజం.

ఆ) నీరు కారిపోవడం :
జవాబు:
పాడైపోవడం, నిరుత్సాహపడడం, ఆశలన్నీ అడుగంటిపోవడం వంటి సందర్భాలలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

సొంతవాక్యం :
కురుక్షేత్రంలో అర్జునుడు నీరు కారిపోవడం చూసి, కృష్ణుడు గీతోపదేశం చేశాడు.

ఇ) కనువిప్పు :
జవాబు:
‘జ్ఞానం’ కలగడం అనే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

సొంతవాక్యం :
గీతోపదేశంతో అర్జునుడికి కనువిప్పు కలిగింది.

ఈ) కాలధర్మం చెందడం :
జవాబు:
కాల ప్రవాహంలో ఏదైనా నశింపక తప్పదు. అలాగే ‘మరణించడం’ అనే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. .

సొంతవాక్యం :
ఎంతోమంది రోడ్డు ప్రమాదాలలో కాలధర్మం చెందడం రోజూ జరుగుతోంది.

ఉ) తునాతునకలు :
జవాబు:
ముక్కముక్కలవడం, పూర్తిగా దెబ్బతినడం అనే సందర్భాలలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

సొంతవాక్యం :
ఈ మధ్య రోడ్డు ప్రమాదాలలో చాలా బస్సులు తునాతునకలయ్యాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

4) కింది పదాలను గురించి వివరించండి.
అ) సామాజిక మార్పు :
జవాబు:
సమాజంలో ఈ రోజు ఉన్న ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, ధర్మాలు తర్వాత మారిపోవచ్చును. ఇలా సమాజంలో కలిగే మార్పును సామాజిక మార్పు అంటారు.

సొంతవాక్యం :
సామాజిక మార్పు వలన బాల్యవివాహాలు తగ్గాయి.

ఆ) విజయోత్సవం :
జవాబు:
విజయం లభించినందుకు చేసుకొనే పండుగ.

సొంతవాక్యం :
ఎన్నికలలో నెగ్గినవారు విజయోత్సవాలు చేసుకొన్నారు.

ఇ) సామాజికాభివృద్ధి :
జవాబు:
సమాజపరమైన అభివృద్ధి.

సొంతవాక్యం :
విద్య సామాజికాభివృద్ధికి దోహదం చేస్తుంది.

ఈ) సాంస్కృతిక వారసత్వం :
జవాబు:
సంస్కృతి అంటే ఒక సమాజపు ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, వినోదాలు మొ||నవి. సాంస్కృతికము అంటే సంస్కృతికి సంబంధించింది. సాంస్కృతిక వారసత్వం అంటే సంస్కృతికి సంబంధించిన వాటి కొనసాగింపు.

సొంతవాక్యం :
మన భారతీయ సాంస్కృతిక వారసత్వం కుటుంబ వ్యవస్థ.

ఉ) అగ్రతాంబూలం :
జవాబు:
ఒక రంగానికి చెందిన లేదా ఒక గ్రామానికి లేదా ఒక సమాజానికి చెందిన వారిలో ఉన్నతునిగా గుర్తించడం.

సొంతవాక్యం :
కవులలో కాళిదాసుదే అగ్రతాంబూలం.

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించి రాయండి.
ఉదా : మీరు రావద్దు నిషేధార్థక వాక్యం

అ) దయచేసి నన్ను కాపాడు. – ప్రార్ధనార్థక వాక్యం
ఆ) మీరు రావచ్చు. – అనుమత్యర్థక వాక్యం
ఇ) వారందరికి ఏమైంది? – ప్రశ్నార్థక వాక్యం
ఈ) నేను తప్పక వస్తాను. – నిశ్చయార్థక వాక్యం
ఉ) ఆహా ! ఎంత బాగుంది ! – ఆశ్చర్యార్థక వాక్యం
ఊ) వారు వెళ్ళవచ్చా? – సందేహార్థక వాక్యం

2. కింద ఇచ్చిన సంధులు – పదాల మధ్య సంబంధాన్ని గుర్తించి వాటిని జతచేసి, సూత్రాలు రాయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం 4

3. కింద ఇచ్చిన సమాసాలు – పదాలు వేటికి ఏవి వర్తిస్తాయో గుర్తించి, ఆయా పదాలకు సంబంధించిన సమాసాలను, విగ్రహవాక్యాలు రాయండి.

సమాసం పేరు సమాస పదం
తృతీయా తత్పురుష సమాసం వితంతు వివాహం
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం విద్యాధికులు
షష్ఠీ తత్పురుష సమాసం గంగానది
ద్విగు సమాసం ముప్పయి సంవత్సరాలు
ద్వంద్వ సమాసం స్త్రీ పురుషులు భారతదేశం

 

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) వితంతు వివాహం వితంతువు యొక్క వివాహం షష్ఠీ తత్పురుష సమాసం
2) విద్యా ధికులు విద్యచేత అధికులు తృతీయా తత్పురుష సమాసం
3) గంగానది గంగ అను పేరు గల నది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
4) ముప్పయి సంవత్సరాలు ముప్పయి అయిన సంవత్సరాలు ద్విగు సమాసం
5) స్త్రీపురుషులు స్త్రీలును, పురుషులును ద్వంద్వ సమాసం
6) భారతదేశం భారత్ అనే పేరు గల దేశము సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

4. కింది ఉదాహరణలు ఏయే అలంకారాలకు చెందినవో గుర్తించండి. సమన్వయం రాయండి.

అ) సుదతీ నూతన మదనా!
మదనాగతురంగ పూర్ణమణిమయసదనా!
సదనామయ గజ రదనా!
రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహా!
జవాబు:
ఈ పద్యంలో ‘ముక్తపదగ్రస్తము’ అనే అలంకారం ఉంది.

వివరణ :
పై పద్యంలోని మొదటి పాదం ‘మదనా’ తో పూర్తయింది. రెండవ పాదం ‘మదనా’ తో మొదలయింది. ఆ ‘సదనా’తో పూర్తయింది. మూడవ పాదం ‘సదనా’ తో ప్రారంభమయింది. ‘రదనా’ తో పూర్తయింది. నాలుగవ పాదం ‘రదనా’ తోనే ప్రారంభమయింది. సమన్వయం : మొదటి పాదం చివరి పదంతో రెండవ పాదం, రెండవ పాదం చివరి పదంతో మూడవ పాదం, మూడవ పాదం చివరి పదంతో నాల్గవ పాదం ప్రారంభమయ్యాయి. విడిచిన (ముక్త) పదాన్నే మళ్ళీ గ్రహించారు కనుక పై పద్యంలో ముక్తపదగ్రస్తాలంకారం ఉంది.

ఆ) మానవా! నీ ప్రయత్నం మానవా?
జవాబు:
దీనిలో యమకాలంకారం ఉంది.
వివరణ :
ఒకే పదం అర్థభేదంతో ప్రయోగిస్తే అది ‘యమకాలంకారం’ అంటారు. సమన్వయం : పై వాక్యంలో మొదట ప్రయోగించిన ‘మానవా!’ అనేది ‘మనిషీ’ అనే అర్థంలో ప్రయోగించబడింది. రెండవసారి ప్రయోగించిన ‘మానవా’ అనేది ‘విడిచిపెట్టవా’ అనే అర్థంలో ప్రయోగించబడింది. ఇలాగ ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించబడింది. కనుక అది యమకాలంకారం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

ఇ) తండ్రి ! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి.
జవాబు:
దీనిలో లాటానుప్రాసాలంకారం కలదు.
వివరణ :
ఒకే పదం అర్థంలో భేదం లేకున్నా భావంలో తేడా ఉండేలా ప్రయోగిస్తే అది లాటానుప్రాసాలంకారం. సమన్వయం : పై వాక్యంలో ‘తండ్రి’ అనే పదం మూడు సార్లు ప్రయోగించబడింది. మూడు పదాలకు ‘నాన్న’ అనే అర్థం. కానీ, ‘తండ్రి తండ్రి’ అంటే ‘అటువంటి తండ్రి మాత్రమే నిజమైన తండ్రి’ అని భావం. అర్థంలో భేదం లేకపోయినా భావంలో భేదం ఉంది. కనుక అది లాటానుప్రాసాలంకారం.

5. కింది సమాస పదాలను వాటి విగ్రహవాక్యాలను పరిశీలించండి.
అధ్యలూ భావ సమాసం

సమాస పదం విగ్రహవాక్యం ప్రథమ పదం
అ) ప్రతిదినము దినము, దినము (ప్రతి – అవ్యయం)
ఆ) యథాశక్తి శక్తిననుసరించి (యథా – అవ్యయం)
ఇ) ఆబాలగోపాలం బాలుడి నుండి గోపాలుడి వరకు (ఆబాల – అవ్యయం)
ఈ) మధ్యాహ్నం అహ్నం యొక్క మధ్యభాగం (మధ్య – అవ్యయం)
ఉ) అనువర్షం వర్షముననుసరించి (అను – అవ్యయం)

(సూచన : కొందరు ‘మధ్యాహ్నం’ను ‘అహ్నము యొక్క మధ్యము’ అని విగ్రహవాక్యంతో ప్రథమా తత్పురుష సమాసంగా చెప్పారు.)

పైన పేర్కొన్న 5 సమాస పదాలలోనూ పూర్వపదాలైన ప్రతి, యథా, ఆబాల, మధ్య అనేవి అవ్యయాలు. లింగ, విభక్తి, వచనాలు లేనివి అవ్యయ పదాలు.

ఇటువంటి అవ్యయ భావంతో ఏర్పడిన సమాసాలు కనుక పైవి అవ్యయీభావ సమాసాలు.

6. కింది ఉదాహరణలకు విగ్రహవాక్యాలు రాయండి.

అ) అనుకూలం – కూలముననుసరించి – అవ్యయీభావ సమాసం
ఆ) యథామూలం – మూలమును అనుసరించి అవ్యయీభావ సమాసం
ఇ) ప్రతిమాసం – మాసం, మాసం అవ్యయీభావ సమాసం

అదనపు సమాచారము

సంధులు

అ) పాఠంలోని కొన్ని సంధులు
1) సహస్రాబ్దం = సహస్ర + అబ్దం – సవర్ణదీర్ఘ సంధి
2) శతాబ్దం = శత + అబ్దం – సవర్ణదీర్ఘ సంధి
3) సామాజికాభివృద్ధి = సామాజిక + అభివృద్ధి – సవర్ణదీర్ఘ సంధి
4) సాధికారం = స + అధికారం – సవర్ణదీర్ఘ సంధి
5) విద్యాధికులు = విద్యా + అధికులు – సవర్ణదీర్ఘ సంధి
6) సోదాహరణం = స + ఉదాహరణం – గుణసంధి
7) విజయోత్సవం = విజయ + ఉత్సవం – గుణసంధి
8) జీవనోపాధి = జీవన + ఉపాధి – గుణసంధి
9) సంస్కరణోద్యమం = సంస్కరణ + ఉద్యమం – గుణసంధి
10) శతాబ్దపు చరిత్ర = శతాబ్దము + చరిత్ర – పుంప్వాదేశ సంధి
11) మొదటి తరపు డాక్టరు = మొదటితరము + డాక్టరు – పుంప్వాదేశ సంధి
12) ప్రవాహపు వేగం = ప్రవాహము + వేగం – పుంప్వాదేశ సంధి
13) అద్దినట్లు = అద్దిన + అటు – అత్వ సంధి
14) ఏముంటుంది = ఏమి + ఉంటుంది – ఇత్వ సంధి
15) గురయ్యారు = గురి + అయ్యారు – ఇత్వ సంధి
16) బరువెక్కాయి = బరువు + ఎక్కాయి – ఉత్వసంధి
17) గుర్తుంచుకుంటాం = గుర్తు + ఉంచుకుంటాం – ఉత్వసంధి
18) మేమంతా = మేము + అంత – ఉత్వసంధి
19) జగన్నాథ జగత్ + నాథ – అనునాసిక సంధి
20) ఆశ్చర్యపడతాం = ఆశ్చర్యము + పడతాం – పడ్వాది సంధి
21) తాపత్రయపడిన + తాపత్రయము + పడిన – పడ్వాది సంధి
22) మొట్టమొదటగా = మొదటగా + మొదటగా – ఆమ్రేడితద్విరుక్త -టకారాదేశసంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) ఆంధ్రదేశము ‘ఆంధ్ర’ అనే పేరుగల దేశము సంభావనా పూర్వపద కర్మధారయం
2) స్థలకాలాలు స్థలమును, కాలమును ద్వంద్వ సమాసం
3) విద్యాధికులు విద్యచేత అధికులు తృతీయా తత్పురుష సమాసం
4) స్త్రీల శతాబ్దం స్త్రీల యొక్క శతాబ్దం షష్ఠీ తత్పురుష సమాసం
5) శతాబ్దపు చరిత్ర శతాబ్దము యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం
6) జీవిత విధానం జీవితము యొక్క విధానం షష్ఠీ తత్పురుష సమాసం
7) రథచక్రాలు రథము యొక్క చక్రాలు షష్ఠీ తత్పురుష సమాసం
8) చరిత్ర నిర్మాత చరిత్ర యొక్క నిర్మాత షష్ఠీ తత్పురుష సమాసం
9) భిన్నరంగాలు భిన్నములైన రంగాలు విశేషణ పూర్వపద కర్మధారయం
10) కీలకస్థానాలు కీలకమైన స్థానాలు విశేషణ పూర్వపద కర్మధారయం
11) ముఖ్యవివరాలు ముఖ్యమైన వివరాలు విశేషణ పూర్వపద కర్మధారయం
12) సామాన్య స్త్రీలు సామాన్యులైన స్త్రీలు విశేషణ పూర్వపద కర్మధారయం
13) ప్రతికూల పరిస్థితులు ప్రతికూలములైన పరిస్థితులు విశేషణ పూర్వపద కర్మధారయం
14) కొత్తకలలు కొత్తవైన కలలు విశేషణ పూర్వపద కర్మధారయం
15) ప్రతిరంగము రంగము, రంగము అవ్యయీభావ సమాసం

పీఠిక రచయితుల పరిచయం

1) ఓల్గా :
ప్రముఖ రచయిత్రి. ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం నిర్వహించారు. ఈమె పలు పురస్కారాలను, అవార్డులను అందుకొన్నారు. వీరి ‘స్వేచ్ఛ’ నవల ప్రసిద్ధి పొందింది.

2) వసంత కన్నబిరాన్ :
ఈమె మానవ హక్కులు, స్త్రీ సమానత్వం కోసం కృషి చేస్తున్నారు. నేషనల్ అలయెన్స్ ఆఫ్ ఉమెన్, ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరంలో పనిచేస్తున్నారు.

3) కల్పన కన్నబిరాన్ :
‘సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్ మెంట్’ (హైదరాబాద్) సంచాలకులుగా పనిచేస్తున్నారు. జెండర్ స్టడీస్, క్రిమినల్ లో విస్తృత అధ్యయనం, పరిశోధనలు చేశారు.

కఠిన పదాలకు అర్థాలు

1వ పేరా

సహస్ర + అల్లం = వెయ్యి సంవత్సరాలు
పరామర్శ = చక్కని విచారణ
స్మరించుకోవడం = గుర్తు చేసుకోవడం
ఉత్సవం = పండుగ

2వ పేరా
రాణించిన = ఒప్పిన

3వ పేరా
సంఘర్షణ = రాపిడి
జగన్నాథ రథచక్రాలు = కాలగమనం (కాలం భగవత్స్వరూపం కనుక విష్ణువు రథచక్రాలు)
మూల్యం = వెల
గుండెలు బరువెక్కడం = చాలా బాధ కలగడం
ప్రేరణ = సిద్ధపరచడం

4వ పేరా
ప్రెసిడెన్సి = ఆధిపత్యము

అలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
కాలాన్ని పరామర్శించడం అంటే ఏమిటి?
జవాబు:
పరామర్శ అంటే చక్కని విచారణ అని అర్థం. కాలాన్ని పరామర్శించడం అంటే కాలాన్ని చక్కగా విచారించడం. కాలం నాలుగు రకాలు.

  1. భూతకాలం,
  2. భవిషత్ కాలం,
  3. వర్తమాన కాలం,
  4. తద్దర్శకాలం

నాలుగు కాలాలలో స్త్రీల పరిస్థితి గురించి కూలం కషంగా విచారించడం. దానికి కారణాలు, పరిష్కారాలు అన్వేషించడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 2.
గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా ఎలా చెప్పుకోవచ్చు?
జవాబు:
గడిచిన శతాబ్దంలో అంటే 20వ శతాబ్దంలో చాలా మంది స్త్రీలు అనేక రంగాలలో విజయాలు సాధించారు. రాజకీయ రంగంలో అనిబిసెంట్, మార్గరెట్ థాచర్, ఇందిరాగాంధీ, సిరిమావో భండారు నాయకే మొదలైన వారు. అలాగే విద్యా, వైద్య, సేవా, పరిశోధనా, క్రీడా రంగాలలోనే గాక అనేక రంగాలలో ఆణిముత్యాల వంటి స్త్రీలు ఉన్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాలలో స్త్రీలు పోటీపడి అభివృద్ధిని సాధించిన శతాబ్దం కనుక గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా చెప్పుకోవచ్చును.

ప్రశ్న 3.
చరిత్ర ఎలా రూపుదిద్దుకుంటుంది ?
జవాబు:
చరిత్ర చాలా రకాలుగా రూపుదిద్దుకొంటుంది. ఒక ప్రాంతానికి చెందిన మానవుల సాంస్కృతిక రూప కల్పనను, అభివృద్ధిని బట్టి సాంస్కృతిక చరిత్ర రూపుదిద్దుకొంటుంది. మానవుల భాషా వికాసాన్ని భాషాచరిత్ర అంటారు. అలాగే రాజకీయ మార్పులను బట్టి రాజకీయ చరిత్ర ఏర్పడుతుంది. అంటే సామాజికంగా జరిగిన దానిని చరిత్ర అంటారు.

ప్రశ్న 4.
మూల్యం చెల్లించడమంటే అర్థం ఏమిటి?
జవాబు:
మూల్యం అంటే విలువ అని అర్థం. మూల్యం చెల్లించడమంటే విలువ చెల్లించడమని సామాన్యార్థం. ఒక వస్తువును తీసుకొన్నప్పుడు దానికి సమానమైన విలువ గల డబ్బు గాని, సరుకు గాని చెల్లించాలి. అంటే మనం కూడా దానితో సమాన విలువ గలది కోల్పోవాలి. అలాగే ఏదైనా చెడు పని చేస్తే దానికి సమానమైన పరపతిని కోల్పోతాం. అదే మూల్యం చెల్లించడమంటే.

ప్రశ్న 5.
‘సామాన్యుల సాహసం అసామాన్యమనిపించింది’ అని రచయిత్రులు అనడానికి కారణాలు ఏమిటి ?
జవాబు:
సాధారణంగా సామాన్యమైన స్త్రీ తన కుటుంబంతో సర్దుకుపోతుంది. పూర్వకాలపు స్త్రీ తన కుటుంబం గురించి తప్పు, తన గురించి, తన సుఖం గురించి ఆలోచించలేదు. ఇది సామాన్య స్త్రీల స్వభావం. వారేదైనా అందుకు భిన్నంగా ప్రవర్తించినా, ఆలోచించినా అనేక చికాకులు వారికి కలిగేవి. వాస్తవ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతాయి. అటువంటి ప్రతికూల పరిస్థితులతో తలపడుతూ, కొత్త జీవిత విధానాలను కనుగొనాలంటే ఎంత కష్టం ? అటువంటి పరీక్షలకు నిలబడి, ఎదురొడ్డి తమ కలలను సాకారం చేసుకొన్న పూర్వకాలపు సామాన్య స్త్రీల సాహసం రచయిత్రులకు అసామాన్యమనిపించింది.

5వ పేరా
నిష్ణాతులు కాలధర్మం విపులము క్లుప్తం నీరు కారడం
= పూర్తిగా తెలిసినవారు = మరణం = సవిస్తరము = సంక్షిప్తం = నిరుత్సాహపడటం

6వ వరా
ఉద్వేగం = కలత నొందుట

9వ పేరా
తాపత్రయం = బాధ (ఆధ్యాత్మికం, అధిభౌతికం, అధిదైవికం అను మూడూ తాపత్రయం)

10వ పేరా
పితృస్వామ్యం = తండ్రికి అధికారంగల వ్యవస్థ
కళ్ళకు కట్టింది = బాగా అర్థమైంది

11వ పేరా
అనువైన = తగిన

12వ పేరా
వెసులుబాటు = తీరుబడి
అడుగు పెట్టడం = ప్రారంభించడం

14వ పేరా
గ్లోసరీ = సాంకేతిక పదముల నిఘంటువు, పదకోశం
అమూల్యమైన = విలువైన

అలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘ముద్రవేయడం’ అంటే ఏమిటి?
జవాబు:
ముద్ర అంటే ఒకదాన్ని శాశ్వతంగా ఉండేలా చేయడం. మానవ స్వభావాలు అనేక రకాలు. కొందరికి, కొన్ని ఆశయాలు ఉంటాయి. ఆ ఆశయాలు సామాన్యులవైతే, అవి వారితోనే ఉంటాయి. వారి కుటుంబాల పైనే ఆ ఆశయాల ముద్రలు ఉంటాయి. అదే నాయకులవైతే, వాటి ముద్రలు సమాజంలో ఉంటాయి. ఏ రంగంలోనైనా, ఆ రంగంలో విశేష కృషి చేసినవారి ఆశయాలు, ఆలోచనలు కార్యరూపంలో శాశ్వతంగా ఉంటాయి. అంటే వారు ఆ రంగంలో తమదైన ముద్ర వేశారని అర్థం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 7 మా ప్రయత్నం

ప్రశ్న 2.
సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలగడమంటే ఏమిటి?
జవాబు:
సంస్కరణోద్యమం అనేది రథం. అది వేగంగా నడవాలంటే మార్పులు అనే చక్రాలు కావాలి. ఈ మార్పులు జరిగేటపుడు కొందరికి బాధ కలుగుతుంది. ఒకప్పుడు సమాజానికి తప్పుగా కనిపించింది, కొన్నాళ్ళకు ఒప్పుగా కనబడుతుంది. కానీ, ఆ తప్పుగా కనబడిన రోజులలో ఎంతోమంది బాధపడతారు. ఉదాహరణకు ఒకప్పుడు స్త్రీ సినిమాలలో నటించడం తప్పు. కానీ నేడు కాదు. ఆనాటి సంస్కరణోద్యమాలు దానిని తప్పు పట్టడం వలన ఎంతోమంది స్త్రీలు వేదన చెందారు. ఎన్నో కుటుంబాలు తీవ్రమైన మానసిక వ్యధను అనుభవించాయి. అదే సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలగడమంటే అర్థం.

ప్రశ్న 3.
“ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్రను మార్చటానికి” అని స్త్రీల గురించి రచయిత్రులు ఎందుకన్నారు?
జవాబు:
కేవలం సంఘసంస్కరణ, చరిత్రను మార్చడం మగవారికే సాధ్యం అనుకొంటే పొరబాటు. అనేకమంది స్త్రీలు చరిత్రను మార్చటానికి ప్రశ్నించారని రచయిత్రుల ఉద్దేశం. కందుకూరి రాజ్యలక్ష్మిగారు స్త్రీ విద్య గురించి ఉద్యమించారు. బాల్య వివాహాలను ప్రతిఘటించారు. భర్త చనిపోయిన స్త్రీలకు మళ్ళీ వివాహాలు చేయాలని పోరాడారు. చేశారు. అలాగే ఎంతోమంది స్త్రీలు మార్పుకోసం పోరాడారు. తమ జీవితాలలో, సామాజిక జీవనరంగంలో కొత్త అర్థాలనూ, వెలుగులనూ సృష్టించాలని తాపత్రయపడ్డారు. కనుకనే “ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్రను మార్చటానికి” అని స్త్రీల గురించి రచయిత్రులు అన్నారు.

ప్రశ్న 4.
కొత్త అర్థాలు, వెలుగుల సృష్టి ఎలా సాధ్యమవుతుంది?
జవాబు:
గతంలో సామాజికంగా స్త్రీల జీవితాలలో కొత్తదనం ఉండేది కాదు. అంటే స్త్రీలు కేవలం చాకిరీకి, పిల్లలను కనడానికే అని పూర్వకాలపు సమాజం భావించేది. కానీ విద్య, ఉద్యోగం మొదలైన వాటిలో అభివృద్ధిని సాధించి, స్త్రీలు తమ జీవితాలలో కొత్త అర్థాలను సాధించారు. అలా కొత్త అర్థాలు సాధించి తమ జీవితాలలో స్త్రీలు జ్ఞానజ్యోతులను వెలిగించుకున్నారు. ఆ జ్ఞానజ్యోతుల వెలుగులలో నూతన ఉత్తేజంతో జీవితాలను ఆనంద మయం చేసుకొంటున్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 6th Lesson శతక మధురిమ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 6th Lesson శతక మధురిమ

10th Class Telugu 6th Lesson శతక మధురిమ Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

రాజేశ్ : రవీ! బాగున్నావా!

రవి : బాగున్నాను రాజేశ్. నువ్వేం చేస్తున్నావు? మన చిన్ననాటి మిత్రులు ఎవరైనా కలుస్తున్నారా?

రాజేశ్ : ఆ! ఆ! అందరూ కలుస్తున్నారు. సంతోష్ లాయరైనాడు. భాను టీచరైనాడు. మధు వ్యాపారం చేస్తున్నాడు. సుభాష్ రాజకీయనేతగా ఎదిగాడు. ఇలా అందరూ ఒక్కో రంగంలో నీతి నిజాయితీలతో రాణిస్తున్నారు.

రవి : చిన్నప్పుడు మనం చదివిన చదువు, పొందిన జ్ఞానం ఊరికే పోతుందా? ఆ చదువుల ఫలితం, గురువుల దీవెనలు అన్నీ కలిస్తేనే మన అభివృద్ధి.

రాజేశ్ : ఔనౌను! ముఖ్యంగా శతక పద్యాలలోని నీతులు మన వ్యక్తిత్వానికి బాటలు వేశాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి కదూ!

రవి : బాగా చెప్పావు రాజేశ్! శతక పద్యాలు నేటికీ మార్గదర్శకాలు. మీ పిల్లలకు కూడా నేర్పించు బాగా!

రాజేశ్ : నేర్పుతున్నాను. సరే రవీ! బస్సు వచ్చింది. మళ్ళీ కలుద్దాం.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సంభాషణను బట్టి వారు ఎవరని భావిస్తున్నారు?
జవాబు:
సంభాషణను బట్టి వారు ఇద్దరూ చిన్ననాటి మిత్రులనీ, ఒకే బడిలో ఒకే తరగతిలో కలసి చదువుకున్నారని భావిస్తున్నాను.

ప్రశ్న 2.
వారి అభివృద్ధికి కారణాలేవి?
జవాబు:
చిన్నప్పుడు వారు చదివిన చదువు, అప్పుడు నేర్చుకున్న జ్ఞానం వారి అభివృద్ధికి కారణాలు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
వ్యక్తిత్వాన్ని ఏవి తీర్చిదిద్దుతాయి?
జవాబు:
శతక పద్యాల్లోని నీతులు (సూక్తులు) వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.

ప్రశ్న 4.
ఏవి నేటి తరానికి మార్గదర్శకాలని రవి చెప్పాడు?
జవాబు:
‘శతక పద్యాలు’, నేటితరానికి మార్గదర్శకాలని రవి చెప్పాడు.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

1. కింది అంశాల గూర్చి మాట్లాడండి.

అ) ఆచారం :
‘ఆచారము’ అంటే ఒక సంఘములోని సభ్యుల్లో సాంప్రదాయకంగా ఉన్న, ప్రామాణికమైన ప్రవర్తనా పద్దతి. నిషేధమే ఆచారానికి మూలం. ఆచారం, మానవజాతి యొక్క ప్రాచీనమైన వ్రాయబడని ధర్మశాస్త్రం. ఒక వ్యక్తి ఒక పనిని నిత్యమూ చేస్తే, అది ‘అలవాటు’. అదే జాతి పరంగానో, సంఘ పరంగానో చేస్తే, ‘ఆచారం’ అవుతుంది.

ఈ ఆచారాలు, జాతి జీవన విధానాన్ని తెలుపుతూ, ఆ జాతిని నైతికపతనం నుండి కాపాడవచ్చు. ఈ ఆచారాలు క్రమంగా తమ అంతశ్శక్తిని పోగొట్టుకొని, చెడు ఫలితాలకు దారి తీస్తున్నాయి.

ఆ) సత్కార్యం :
‘సత్కార్యం’ అంటే మంచి పని. ఏ పని చేస్తే సంఘం సంతోషిస్తుందో అది సత్కార్యం. వేదంలో చెప్పిన పని, ‘సత్కార్యం’ – ఒక పేదవాడిని ఆదరించి అన్నం పెడితే అది సత్కార్యం.

  1. దానాలు చేయడం
  2. గుడులు కట్టించడం
  3. ధర్మకార్యాలు చేయడం
  4. తోటలు నాటించడం
  5. ఒక బ్రాహ్మణుడికి పెండ్లి చేయించడం
  6. చెరువులు త్రవ్వించడం
  7. మంచి సంతానాన్ని కనడం – అనే వాటిని సత్కార్యాలని, వాటినే సప్తసంతానాలని అంటారు.

ఇ) న్యాయం:
న్యాయమునే ‘ధర్మము’ అని కూడా అంటారు. ఈ న్యాయము కాలానుగుణముగా మారుతుంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క న్యాయపద్ధతి ఉంటుంది. ఈ న్యాయాన్ని కాపాడేవి న్యాయస్థానాలు. న్యాయస్థానాలు ఏది న్యాయమో, ఏది అన్యాయమో నిర్ణయిస్తాయి. లోకములోనూ, శాస్త్రమునందూ ప్రసిద్ధమైన ఒక దృష్టాంత వాక్యాన్ని “న్యాయము” అంటారు.

ఈ) దాస్యం :
‘దాస్యము’ అంటే సేవ. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సేవ చేస్తారు. ఇంట్లో అంట్లు, చెంబులు తోమి పాచి పని చేయడం కూడా ‘దాస్యమే’. కద్రువకు ఆమె సవతి వినత, దాస్యం చేసింది.

2. పాఠంలోని పద్యాలు ఆధారంగా కింది వాక్యాలకు తగిన పద్యపాదం గుర్తించండి.

అ) అనామకమై నశించడం
జవాబు:
‘నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు’.

ఆ) సముద్రాన్ని తియ్యగా మార్చడం
జవాబు:
‘తీపు రచింపన్ లవణాబ్దికిన్ మధుకణంబుం జిందు యత్నించు’.

ఇ) సముద్రంలో కాకిరెట్ట
జవాబు:
………………… అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచుఁ గాకి రెట్ట యిడినందున నేమి”

3. కింది పద్యాలను పాదభంగం లేకుండా పూరించండి.
సూచన : పధ్యంలో 4 పాదాలలోని ప్రతిపాదం పాఠ్యపుస్తకంలో ఎక్కడికి పూర్తయిందో అక్కడికే పూర్తవ్వాలి. రెండవ అక్షరం ప్రాస. ఆ ప్రాస ఒక అక్షరం పొల్లు ఉంటుంది. దానిని తదంతో గుర్తుపెట్టుకోవాలి. గణాలు కూడా గుర్తు పెట్టుకొంటే, రాసేటపుడు పాదభంగం రాదు.

అ) నీరము ………………… కొల్చువారికిన్
జవాబు:
ఉ|| నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చునా
నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
బౌరుష వృత్తులి టధము మధ్యము నుత్తము గొల్చువారికిన్.

ఆ) తన దేశంబు …………. భక్త చింతామణీ!
జవాబు:
మ|| తన దేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్సదాచారముల్
తన దేహాత్మల నెత్తెఱంగున సదాతానట్లు ప్రేమించి, త
ద్ఘనతా వాప్తికి సాధనంబులగు సత్కార్యమ్ములన్ జేయఁగా
ననుహౌ బుద్ధి యొసంగుమీ ప్రజకు దేవా! భక్త చింతామణీ!

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

4. కింది పద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు, జనులకుఁ గలుషమడచు
కీర్తి ప్రకటించు, చిత్త విస్పూర్తి జేయు
సాధుసంగంబు సకలార్థ సాధకంబు.
ప్రశ్నలు :
అ) సూక్తి అంటే ఏమిటి?
జవాబు:
సూక్తి అంటే ‘మంచిమాట’.

ఆ) కీర్తి ఎలా వస్తుంది?
జవాబు:
సాధుసంగము వలన అనగా మంచివారితో స్నేహంగా ఉండడం వల్ల ‘కీర్తి’ వస్తుంది.

ఇ) సాధుసంగం వల్ల ఏం జరుగుతుంది?
జవాబు:
సాధుసంగం సకల ప్రయోజనాలనూ సాధించి పెడుతుంది.

ఈ) ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షికగా “సాధుసంగం” అనేది తగియుంటుంది.

సూచన:
పధ్యంలో దేని గురించి అధినంగా చెప్పారో అని శీర్షికగా పెట్టాలి, దేనికైనా సరే సుభాషితం , సూక్తి వంటి శీర్షికలు పెట్టి వచ్చును.

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాత్యాల్లో జవాబులు రాయండి.

అ) కాలిన ఇనుముపై నీళ్ళు పడితే ఆవిరిగా మారుతాయని తెలుసుకదా! అలాగే, మనుషులు ఎవరిని చేరితే ఎలా అవుతారో. సోదాహరణంగా రాయండి.
జవాబు:
కాలిన ఇనుము మీద నీళ్ళు పడితే ఆవిరైపోయి, అవి పూర్తిగా నశిస్తాయి. ఆ నీళ్ళు తామరాకుపైన పడితే ముత్యాల్లా ప్రకాశిస్తాయి. ఆ నీళ్ళే సముద్రంలోని ముత్యపుచిప్పలో పడితే, ముత్యాల్లా మారతాయి. దీనిని బట్టి మనిషి అధములలో చేరితే అధముడు అవుతాడు. కాలిన ఇనుముపై నీళ్ళవలె, అతడు అనామకుడవుతాడు. మనిషి మధ్యములలో చేరితే, మధ్యముడు అవుతాడు. అపుడు తామరాకుపై నీరులా ముత్యమువలె కనిపిస్తాడు. మనిషి ఉత్తములతో చేరితే, ఉత్తముడు అవుతాడు. అపుడు ముత్యపు చిప్పలో పడిన నీరు వలె, ‘ముత్యము’ అవుతాడు.

ఆ) ధర్మవర్తనులను నిందించడం వల్ల ప్రయోజనం లేదు అనే విషయాన్ని సోదాహరణంగా రాయండి.
జవాబు:
ధర్మాన్ని పాటించే ధర్మవర్తనుడిని, ఒక నీచుడు మిక్కిలి హీనంగా నిందించినా, ఆ ధర్మవర్తనుడికి ఏ మాత్రమూ లోటురాదు. ఎందుకంటే అమృత సముద్రముపై నుండి కాకి ప్రయాణము చేస్తూ ఆ సముద్రములో ఆ కాకి రెట్ట వేస్తుంది. అంతమాత్రము చేత ఆ సముద్రానికి ఏమీ లోటు రాదు. అలాగే, ధర్మాత్ముడిని నీచుడు నిందించినా, ఆ ధర్మమూర్తికి లోటు రాదు.

ఇ) “కరిరాజున్” అనే పద్యభావాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మూర్ఖులను అమృతధారలవంటి మాటలతో సమాధాన పరిచేవాడూ, మదపుటేనుగును తామర తూడునందలి దారములతో బంధించాలని ఆలోచించేవాడూ, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని బ్రద్దలు చేయాలని యత్నించేవాడూ, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తియ్యగా మార్చాలనుకొనేవాడూ, సమానులు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాత్యాల్లో జవాబులు రాయండి.

అ) సజ్జన లక్షణాలు పేర్కొనండి.
జవాబు:
సజ్జన లక్షణాలు : –

  1. మనిషి ఉత్తములతో స్నేహం చేయాలి. అలా చేస్తే ముత్యపు చిప్పలో ముత్యంలా అతడు శోభిస్తాడు.
  2. అమృత ధారల వంటి తియ్యటి మాటలతో, మూర్యుడికి బోధించడం మానుకోవాలి.
  3. తనకున్న దానితోనే అనాథలనూ, నిరుపేదలనూ ప్రేమతో లాలిస్తూ వారికి అన్నం పెట్టాలి.
  4. తన దేశాన్నీ, తన మతాన్నీ, భాషనూ, ఆచారాన్ని అభిమానించే బుద్ధి కలిగి ఉండాలి.
  5. ఇతరులు తనకు కీడు చేసినా, వారికి అపకారము చేయకుండా, ఉపకారమే చేయాలి.
  6. ధర్మవర్తనులను ఎప్పుడూ తాను నిందించకూడదు.
  7. పరద్రవ్యాన్ని ఆశించి, చెడు పనులు చేయకూడదు.
  8. వరదల్లో మునిగిపోయే పొలాన్ని దున్నకపోవడం, కరవు వచ్చినపుడు చుట్టాల ఇళ్ళకు వెళ్ళకపోవడం, రహస్యాన్ని ఇతరులకు వెల్లడించకపోవడం, పిరికివాడిని సేనానాయకునిగా చేయకపోవడం అనేవి సజ్జన లక్షణాలు.

ఆ) నైతిక విలువలంటే ఏమిటి? మీరు గమనించిన విలువల్ని పేర్కొనండి.
జవాబు:
‘నైతిక విలువలు’ అంటే నీతి శాస్త్రానికి సంబంధించిన విలువైన మంచి పద్ధతులు అని భావము. వీటినే ఆంగ్ల భాషలో ‘Moral Values’ అంటారు. అంటే అమూల్యమైన నీతులు అని అర్థము. మనిషి ఎలా నడచుకోవాలో నీతి శాస్త్రము చెపుతుంది. నీతి శాస్త్రంలో చెప్పిన, ధర్మశాస్త్రంలో చెప్పిన నీతులను పాటించడం, నైతిక విలువలను పాటించడం అంటారు.
నేను గమనించిన నైతిక విలువలు :

  1. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించడం.
  2. స్త్రీలను అందరినీ కన్నతల్లులవలె, సోదరీమణులవలె గౌరవించడం, ఆదరించడం.
  3. కులమత భేదాలను పాటించకుండా, తోటి విద్యార్థులనందరినీ సోదరులుగా, విద్యార్థినులను సోదరీమణులుగా ఆదరించాలి. గౌరవించాలి.
  4. మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకున్నట్లే, మన గ్రామాన్ని, పాఠశాలను, మనకు ఉన్న నీటి వసతులను, రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలి. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలి.
  5. అహింసా మార్గాన్ని ఎప్పుడూ చేపట్టకూడదు. గాంధీజీ వలె ఒక చెంపపై కొడితే, రెండవ చెంప చూపాలి. జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి.
  6. మత్తుపదార్థాలు సేవించకపోవడం, చెడు అలవాట్లకు బానిసలు కాకపోవడం అనేవి మంచి నైతిక విలువలుగా నేను భావిస్తున్నాను.

3. కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) పేదలకు దానం చేయటం వల్ల మనం పొందే మేలును గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

(మిత్రుడికి లేఖ)

తిరుపతి,
XXXXXX.

మిత్రుడు శశిభూషణకు, / మిత్రురాలు కమలకు,

ఉభయ కుశలోపరి. నీవు రాసిన లేఖ చేరింది. మనం నైతిక విలువలను పాటించాలని రాశావు. సంతోషము. మన ఇరుగు పొరుగువారిలో ఎందరో పేదలు ఉంటారు. భగవంతుడు మానవులు అందరిలోనూ ఉంటాడు. కాబట్టి మనుషులు అంతా దైవంతో సమానం.

ముఖ్యంగా పేదవారికి, మనకు ఉన్నంతలో దానం చేయాలి. మన తరగతిలోని పేదవారికి పుస్తకాలు, పెన్నులు, నోట్సులు దానం చెయ్యాలి. పరీక్ష ఫీజులు కట్టడానికి వారికి డబ్బు సాయం చెయ్యాలి. వైద్య సహాయం కోసం డబ్బులు అడిగే వారికి తప్పక ఇవ్వాలి.

పేదలకు దానం చేస్తే మరుసటి జన్మలో మనకు భగవంతుడు మరింతగా ఇస్తాడు. పేదల ముఖాల్లో ఆనందం కనబడేలా చేస్తే, మన జీవితాలు సుఖసంతోషాలకు నిలయం అవుతాయి. నేను నాకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను.

నీవు కూడా చెయ్యి.

ఇట్లు
నీ ప్రియ మిత్రుడు, / మిత్రురాలు,
సాయికుమార్. / శశికళ.

చిరునామా :
కె. శశిభూషణ్, / కె. కమల,
S/o వెంకటేష్, / D/o వెంకటేష్ఆ
ర్యాపురం, రాజమహేంద్రవరం,
తూర్పుగోదావరి జిల్లా,

(లేదా)

ఆ) పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వచ్చారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనల గురించి తెలుసుకోవడానికి పిల్లలు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు? ఇంటర్వ్యూకు అవసరమైన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:
ఇంటర్వ్యూ ప్రశ్నావళి :

  1. శతక కవులకు సుస్వాగతం. తెలుగు భాషలో శతకాలు ఎన్ని రకాలో దయచేసి చెప్పండి.
  2. మన తెలుగులో మొదటి శతక కర్త ఎవరు?
  3. మకుటం అంటే ఏమిటి?
  4. మకుటం లేని శతకాలు మనకు ఉన్నాయా? ఉంటే అవి ఏవి?
  5. నీతి శతకాల ప్రత్యేకత ఏమిటి?
  6. భక్తి శతకాలు మీరు ఏమైనా వ్రాశారా?
  7. భక్తి శతకాల్లో దాశరథీ శతకం ప్రత్యేకత ఏమిటి?
  8. కాళహస్తీశ్వర శతకంలో భక్తి ఎక్కువా? రాజదూషణ ఎక్కువా?
  9. ‘సుమతీ శతకం’ ప్రత్యేకత ఏమిటి?
  10. కృష్ణ శతకాన్ని ఎవరు రచించారు?
  11. మీకు నచ్చిన శతకం ఏమిటి?
  12. మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?
  13. ఛందోబద్ధం కాని తెలుగు శతకం ఏది?

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

పాఠశాల గ్రంథాలయంలో శతకపద్యాలున్న పుస్తకాలు తీసుకొని చదవండి. వాటిలో ఏవైనా ఐదు శతకపద్యాలను, వాటి భావాలను రాసి ప్రదర్శించండి.
జవాబు:
1) సుమతీ శతకం :
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

భావం :
పాముకు విషం తలలో ఉంటుంది. తేలుకు విషం తోకలో ఉంటుంది. దుర్మార్గుడికి మాత్రం తల, తోక అని కాకుండా నిలువెల్లా ఉంటుంది.

2) కృష్ణ శతకం :
దేవేంద్రు డలుక తోడను
వావిరిగా రాళ్ళవాన వడి గురియింపన్
గోవర్ధనగిరి యెత్తితి
గోవుల గోపకుల గాచుకొఱకై కృష్ణా !

భావం:
ఓ కృష్ణా ! దేవేంద్రుడు కోపంతో రాళ్ళవానను వేగంగా కురిపించాడు. అప్పుడు నీవు ఆవులను, గోపాలురను రక్షించడానికి మందరపర్వతాన్ని ఎత్తిపట్టుకున్నావు.

3) వేమన శతకం:
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడవడైన నేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం :ఓ వేమనా ! గంగిగోవు పాలు గరిటెడు చాలు. గాడిదపాలు కుండెడు ఉంటే మాత్రం, ఏం ప్రయోజనం ఉంటుంది? భక్తితో పట్టెడు అన్నం పెడితే చాలు కదా !

4) కుమార శతకం:
ఆచార్యున కెదిరింపకు;
బ్రోచిన దొర నింద సేయబోకుము; కార్యా
లోచనము లొంటిఁ జేయకు
మాచారము విడువబోకుమయ్య కుమారా !

భావం:
కుమారా ! గురువు మాటకు ఎదురు చెప్పవద్దు. నిన్ను పోషించే యజమానిని నిందించకు. ఒంటరిగా కార్యమును గూర్చి ఆలోచింపకు. మంచి నడవడికను వదలిపెట్టకు.

5) గువ్వలచెన్నా శతకం ::
కలకొలది ధర్మ ముండిన
గలిగిన సిరి కదలకుండు, కాసారమునన్
గలజలము మడువులేమిని
గొలగల గట్టు తెగిపోదె గువ్వలచెన్నా !

భావం :
సిరిసంపదలకు తగినట్లుగా, దానధర్మాలు చేస్తే, ఆ సంపద పెరుగుతుంది. చెరువులోని నీటికి సరియైన వినియోగం లేకపోతే, గట్లు తెగిపోతాయి కదా !

III. భాషాంశాలు

పదజాలం

1) కింది పదాలకు అర్థాలు రాసి, వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : ఉత్తములు = గొప్పవారు
సొంతవాక్యం :
ఉత్తములు ధనిక, పేద భేదాలు చూపరు.

అ) ముష్కరుడు = దుష్టుడు
సొంతవాక్యం :
ఢిల్లీ నగరములో అత్యాచారాలు చేసే ముష్కరుల సంఖ్య పెరుగుతోంది.

ఆ) లాలన = బుజ్జగించడం
సొంతవాక్యం :
తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా లాలన చేయకూడదు.

ఇ) ఘనత = గొప్పతనము
సొంతవాక్యం : రామభక్తియే, కంచర్ల గోపన్న ఘనతకు ముఖ్యకారణము.

ఈ) మర్మము = రహస్యము
సొంతవాక్యం :
దేశమర్మములను విదేశ గూఢచారులకు ఎన్నడూ తెలుపరాదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

2) కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.

అ) భాస్కరుడు : కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
ఆ) పయోనిధి : దీని యందు నీరు నిలిచియుంటుంది. (సముద్రము)
ఇ) దాశరథి : దశరథుని యొక్క కుమారుడు (రాముడు)

3) కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : ఈశ్వరుడు : 1) శివుడు 2) శంకరుడు.
వాక్య ప్రయోగము :
శివుడు కైలాసవాసి. ఆ శంకరుని “ఈశ్వరా! కాపాడు” అని వేడుకుంటే పాపాలు పోతాయి.

అ) లక్ష్మి : 1) కమల 2) హరిప్రియ 3) పద్మ 4) ఇందిర.
వాక్య ప్రయోగము :
‘కమల‘ వైకుంఠ నివాసిని. హరిప్రియను భక్తులు ‘పద్మ‘ అని, ‘ఇందిర‘ అని పిలుస్తారు.

ఆ) దేహం : 1) శరీరము 2) కాయము 3) గాత్రము.
వాక్య ప్రయోగము :
ఆమె శరీరము ఆహారము లేక ఎండిపోయింది. ఆ కాయమునకు బలమైన తిండి పెడితే, ఆ గాత్రము తిరిగి చక్కనవుతుంది.

ఇ) నీరము : 1) జలము 2) ఉదకము 3) పానీయము.
వాక్య ప్రయోగము :
ఆ గ్రామం చెరువులో జలము లేదు. ఉదకము కోసం గ్రామస్థులు నూయి తవ్వినా పానీయము పడలేదు.

ఈ) పయోనిధి : 1) సముద్రము 2) కడలి 3) సాగరము.
వాక్య ప్రయోగము :
జాలరులు వేటకు సముద్రము మీద పడవపై వెళ్ళారు. కడలిలో తరంగాలు హెచ్చుగా ఉండి ఆ పడవ సాగరములో మునిగిపోయింది.

4) కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాల్లోని ప్రకృతి – వికృతుల్ని గుర్తించి పట్టికగా కూర్చండి.

అ) మూర్ఖులకు నీతులు చెప్పడం వల్ల ఆ మొరకులకు లోకువ అవుతాము.
ఆ) సిరిని కురిపించు లచ్చిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీలక్ష్మిని పూజించాలి.
ఇ) న్యాయము తప్పి చరించరాదు. నాయమును కాపాడుట మన కర్తవ్యం.
జవాబు:
ప్రకృతి – వికృతి
అ) మూర్ఖులు – మొరకులు
ఆ) శ్రీ – సిరి
ఇ) న్యాయము – నాయము

వ్యాకరణాంశాలు

1. కింది సందర్భాలలో పునరుక్తమయిన హల్లులను పరిశీలించండి. అవి వృత్త్యనుప్రాస అలంకారాలవునో, కాదో చర్చించండి.

అ) నీ కరుణాకటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము.
ఆ) అడిగెదనని కడువడిఁజను
నడిగినఁదను మగుడనుడుగడని నడయుడుగున్.
ఇ) మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే.
ఈ) చూరుకు, తేరుకు, యేరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్.

వృత్త్యను ప్రాసాలంకారం :
‘లక్షణం’ : ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అక్షరాలు కాని, అనేకసార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యను ప్రాసాలంకారం’ అంటారు. వృత్తి అంటే ఆవృత్తి; ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం.

అ) “నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము”.
సమన్వయం :
పై వాక్యంలో, ‘క్ష’ అనే అక్షరం, మూడుసార్లు ఆవృత్తి చెందింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాసాలంకారం’.

ఆ) ‘అడిగెదనని కడుడిఁజను
డిగినఁదను మగునుడుగడని నయుడుగున్’.
సమన్వయం :
పై పద్యపాదంలో ‘డ’ అనే హల్లు పలుమార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాసాలంకారం’.

ఇ) ‘మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే’.
సమన్వయం :
పై వాక్యములో బిందు పూర్వక ‘ద’ కారము పలుమార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాసాలంకారం’.

ఈ) చూరుకు, తేరుకు, మీరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్’.
సమన్వయం :
పై వాక్యములో, ‘ర’ అనే హల్లు పలుమార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఈ వాక్యంలో ‘వృత్త్యనుప్రాస’ అలంకారం ఉంది.

విసర్గ సంధి

2. సంస్కృత పదాల మధ్య ‘విసర్గ’ మీద తరచు సంధి జరుగుతూ ఉంటుంది. అది వేర్వేరు రూపాలుగా ఉండటం గమనిద్దాం.

కింది ఉదాహరణలు విడదీసి చూడండి..
అ) నమోనమః
ఆ) మనోహరం
ఇ) పయోనిధి
ఈ) వచోనిచయం

1. పై సంస్కృత సంధి పదాలను విడదీస్తే, ఈ కింద చెప్పిన మార్పు జరిగిందని గుర్తింపగలం.
అ) నమః
ఆ) మనః + హరం
ఇ) పయః + నిధి
ఈ) వచః + నిచయం
సూత్రము :
అకారాంత పదాల విసర్గకు శషసలు, వర్గ ప్రథమ, ద్వితీయాక్షరాలు (క ఖ చ ఛట ఠ త థ ప ఫ లు) కాక మిగతా అక్షరాలు కలిస్తే, అకారాంత పదాల మీదున్న విసర్గ లోపించి, అకారం ‘ఓ’ కారంగా మారింది.

గమనిక :
ఈ ఉదాహరణలలో మొదటి పదాలు, అకారాంతాలుగా ఉన్నాయి. అకారాంత పదాల మీదున్న విసర్గ లోపించి, అకారం ‘ఓ’ కారంగా మారింది.
అ) నమోనమః
ఆ) మనోహరం
ఇ) పయోనిధి
ఈ) వచోనిచయం

2. కింది పదాలు కలిపి, మార్పును గమనించండి.

అ) మనః + శాంతి = మనశ్శాంతి
ఆ) చతుః + షష్టి = చతుషష్టి
ఇ) నభః + సుమం = నభస్సుమం

గమనిక :
పై సంధి పదాలను కలుపగా, వరుసగా మనశ్శాంతి, చతుషష్టి, నభస్సుమం – అనే రూపాలు ఏర్పడ్డాయి. అంటే విసర్గ తరువాత ‘శ, ష, స’లు ఉంటే, విసర్గలు కూడా శషసలుగా మారి ద్విత్వాలుగా తయారవుతాయి.

3. కింది పదాలను విడదీయండి.
అ) ప్రాతఃకాలము = ప్రాతస్ + కాలము – ప్రాతఃకాలము
ఆ) తపఃఫలము = తపస్ + ఫలము – తపఃఫలము

గమనిక :
పై ఉదాహరణములలో సకారము (‘స్’) విసర్గగా ప్రయోగింపబడింది.
నమస్కారము, శ్రేయస్కరము, వనస్పతి మొదలయిన మాటలలో ‘స్’ కారము విసర్గగా మారలేదు.
1) శ్రేయస్ + కరము = శ్రేయస్కరమ
2) నమస్ + కారము = నమస్కారము
3) వనస్ + పతి = వనస్పతి మొ||నవి.

4. కింది పదాలను కలిపి, మార్పును గమనించండి.
ఉదా: అంతః + ఆత్మ = అంతరాత్మ

అ) దుః + అభిమానం = దురభిమానం
ఆ) చతుః + దిశలు = చతుర్దిశలు
ఇ) ఆశీః + వాదము + ఆశీర్వాదము
ఈ) పునః + ఆగమనం + పునరాగమనం
ఉ) అంతః + మథనం = అంతర్మథనం

గమనిక:
పై విసర్గ సంధులలో 1) అంతః, 2) దుః, 3) చతుః, 4) ఆశీః, 5) పునః మొదలయిన పదాలకు, వర్గ ప్రథమ, నమః ద్వితీయాక్షరాలు, శ, ష, స లు గాక, మిగతా అక్షరాలు కలిస్తే విసర్గ రేఫ(ర్)గా మారడం గమనించండి.

5. కింది పదాలు విడదీయండి.
ఉదా:
ధనుష్కోటి = ధనుః + కోటి (ధనుస్ + కోటి)

అ) నిష్ఫలము = నిః + ఫలము (నిస్ + ఫలము)
ఆ) దుష్కరము = దుః + కరము (దుస్ + కరము)
ఇస్ (ఇః), ఉస్ (ఉః)ల విసర్గకు క, ఖ, ప, ఫ లు కలిసినప్పుడు, విసర్గ (స్) ‘ష’ కారంగా మారుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

6. కింది పదాలు విడదీయండి.
ఉదా:
నిస్తేజము = నిః + తేజము
అ) దుశ్చేష్టితము = దుః + చేష్టితము
ఆ) ధనుష్టంకారము = ధనుః + టంకారము
ఇ) మనస్తాపము = మనః + తాపము
విసర్గకు చ, ఛలు పరమైతే ‘శ’ గా, ట, ఠ లు పరమైతే ‘ష’ గా, త, థ లు పరమైతే ‘స’ గా మారుతుంది.

7. పై ఉదాహరణలన్నీ పరిశీలించిన మీదట, విసరసంధి ఆఱు విధాలుగా ఏర్పడుతున్నదని తెలుస్తున్నది.

i) అకారాంత పదాల విసర్గకు, వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు అనగా (క చట తప; ఖ, ఛ, ఠ, థ ఫ); శ, ష, సలు గాక, మిగతా అక్షరాలు కలిసినప్పుడు విసర్గ లోపించి ‘అ’ కారం ‘ఓ’ కారంగా మారుతుంది.
ii) విసర్గకు శ, ష, స లు పరమైనప్పుడు శ, ష, స లుగా మారుతుంది.
iii) విసర్గమీద క, ఖ, ప, ఫ లు వస్తే, విసరకు మార్పు రాదు (సంధి ఏర్పడదు).
iv) అంతః, దుః, చతుః, ఆశీః, పునః మొదలయిన పదాల విసర్గ, రేఫ (5) గా మారుతుంది.
v) ఇస్, ఉన్ల విసర్గకు, క, ఖ, ప, ఫలు పరమైతే, విసర్గ ‘ష’ కారంగా మారుతుంది.
vi) విసర్గకు చ, ఛలు పరమైతే ‘శ’ కారం; ట, ఠలు పరమైతే ‘ష’ కారం; త, థలు పరమైతే ‘స’ కారం వస్తాయి.

అదనపు సమాచారము

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి :

1) లవణాబ్ది = లవణ + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి
2) సుధాధారానుకారోక్తులు = సుధాధారా + అనుకారోక్తులు – సవర్ణదీర్ఘ సంధి
3) దేహాత్మలు = దేహా + ఆత్మలు – సవర్ణదీర్ఘ సంధి
4) శ్రీకాళహస్తీశ్వరుడు = శ్రీకాళహస్తి + ఈశ్వరుడు – సవర్ణదీర్ఘ సంధి
5) హింసారంభకుండు = హింసా + ఆరంభకుడు – సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి:

1) ధారానుకారోక్తులు = ధారానుకార + ఉక్తులు – గుణ సంధి

3. జశ్వ సంధి:

1) ‘సదాచారము = సత్ + ఆచారము – జశ్వ సంధి

తెలుగు సంధులు

4. అత్వ సంధులు :

1) ఇచ్చినంతలో = ఇచ్చిన + అంతలో – అత్వ సంధి
2) ఊరకుండినన్ = ఊరక + ఉండినన్ – అత్వ సంధి
3) ఇడినందునన్ = ఇడిన + అందునన్ – అత్వ సంధి
4) వఱదైన = వఱద + ఐన – అత్వ సంధి

5. ఇత్వ సంధి:

1) అదెట్లు = అది +ఎట్లు – ఇత్వ సంధి

6. ఉత్వ సంధులు:

1) ముత్యమట్లు = ముత్యము + అట్లు – ఉత్వ సంధి
2) కాదని = కాదు + అని – ఉత్వ సంధి
3) కఱవైనను = కఱవు + ఐనను – ఉత్వ సంధి

7. యడాగమ సంధులు :
1) బుద్ధి యొసంగు = బుద్ధి + ఒసంగు – యడాగమ సంధి
2) రెట్టయిడు = రెట్ట + ఇడు – యడాగమ సంధి

8. త్రిక సంధులు :

1) అమ్మహాత్ముడు = ఆ + మహాత్ముడు – త్రిక సంధి
2) ఇద్దరణిన్ = ఈ + ధరణిన్ – త్రిక సంధి
3) ఎత్తెఱంగున = ఏ + తెఱంగున – త్రిక సంధి
4) అయ్యెడన్ = ఆ + ఎడన్ – యడాగమ త్రిక సంధులు

9. గసడదవాదేశ సంధులు :

1) జాతుల్సెప్పుట = జాతుల్ + చెప్పుట – గసడదవాదేశ సంధి
2) మర్మము సెప్పకు = మర్మము + చెప్పకు – గసడదవాదేశ సంధి
3) అపకారము సేయడు = అపకారము + చేయడు – గసడదవాదేశ సంధి
4) మణిత్వము గాంచు = మణిత్వము + కాంచు – గసడదవాదేశ సంధి

10. సరళాదేశ సంధులు (ద్రుతప్రకృతిక సంధులు) :

1) శుక్తిలోఁబడి = శుక్తిలోన్ + పడి – సరళాదేశ సంధి
2) ఉత్తముఁగొల్చు = ఉత్తమున్ + కొల్చు – సరళాదేశ సంధి
3) మధుకణంబుం జిందు = మధుకణంబున్ + చిందు – సరళాదేశ సంధి
4) మూర్ఖులఁదెల్పు = మూర్ఖులన్ + తెల్పు – సరళాదేశ సంధి
5) లాలనఁజేసి = లాలనన్ + చేసి – సరళాదేశ సంధి
6) లక్ష్మిఁబొందు = లక్ష్మి న్ + పొందు – సరళాదేశ సంధి
7) కీడుఁజేయగాన్ = కీడున్ + చేయగాన్ – సరళాదేశ సంధి
8) కవ్వముఁబట్టి = కవ్వమున్ – సరళాదేశ సంధి
9) తరువగఁజొచ్చు = తరువగన్ + చొచ్చు – సరళాదేశ సంధి

11. నుగాగమ సంధి:

1) తనర్చు నా నీరము = తనర్చు + ఆ నీరము – నుగాగమ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) భక్త చింతామణి భక్తులకు చింతామణి షష్ఠీ తత్పురుష సమాసం
2) పరహితము పరులకు హితము షష్ఠీ తత్పురుష సమాసం
3) సుధాధార సుధయొక్క ధార షష్ఠీ తత్పురుష సమాసం
4) మధుకణంబు మధువు యొక్క కణము షష్ఠీ తత్పురుష సమాసం
5) తంతు సంతతులు తంతువుల యొక్క సంతతులు షష్ఠీ తత్పురుష సమాసం
6) కరిరాజు కరులకు రాజు షష్ఠీ తత్పురుష సమాసం
7) దయా పయోనిధి దయకు పయోనిధి షష్ఠీ తత్పురుష సమాసం
8) స్వ భాష తమ యొక్క భాష షష్ఠీ తత్పురుష సమాసం
9) కరుణాపయోనిధి కరుణకు పయోనిధి షష్ఠీ తత్పురుష సమాసం
10) నళినీ దళ సంస్థితము నళినీ దళము నందు సంస్థితము సప్తమీ తత్పురుష సమాసం
11) లవణాబ్ధి లవణ సహితమైన అభి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
12) చిక్కని పాలు చిక్కనైన పాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
13) ధర్మవర్తన ధర్మమైన వర్తన విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
14) నీచ వాక్యములు నీచమైన వాక్యములు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
15) తప్త లోహము తప్తమైన లోహము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
16) ఉరువజ్రంబు గొప్పదైన వజ్రంబు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
17) పౌరుష వృత్తులు పురుషులకు సంబంధించిన వృత్తులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
18) శిరీష పుష్పములు శిరీషము అనే పేరు గల పుష్పములు సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
19) దీన దేహులు దీనమైన దేహము గలవారు బహుప్రీహి సమాసము
20) అనామకము పేరు లేనిది నజ్ బహుజొహి సమాసము

ప్రకృతి – వికృతులు

నీరమ్ – నీరు
మౌక్తికము – ముత్తియము
రాట్టు – రేడు
వజ్రమ్ – వజ్జిరము
పుష్పమ్ – పూవు
మూర్యుడు – మొఱకు
లక్ష్మి – లచ్చి
భాష – బాస
కార్యము – కర్ణము
రూపము – రూపు
శ్రీ – సిరి
యుగము – ఉగము
భీరుకుడు – పిటికి
యుగమ్ – ఉగము
హితమ్ – ఇతము
న్యాయము – నాయము
ధర్మము – దమ్మము
కాకము – కాకి

వ్యుత్పత్యర్థాలు

1. వజ్రము : అడ్డము లేకపోవునట్టిది (వజ్రము )
2. పుష్పము : వికసించేది (పుష్పము)
3. ధరణి : విశ్వమును ధరించేది (భూమి)
4. ఈశ్వరుడు : స్వభావముచేతనే ఐశ్వర్యము కలవాడు (శివుడు)
5. భాస్కరుడు : కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
6. పయోనిధి : దీనియందు నీరు నిలిచియుండునది (సముద్రము)
7. పయోధి : నీటికి ఆధారమైనది (సముద్రము)

పర్యాయపదాలు

1. పయోనిధి : పయోధి, జలనిధి, సముద్రము, ఉదధి.
2. లక్ష్మి : పద్మ, కమల, రమ, లచ్చి,
3. ఈశ్వరుడు : ఈశుడు, శివుడు, శంభువు, పినాకి, ముక్కంటి,
4. కరి : ఏనుగు, హస్తి, సామజము, ఇభము, దని.
5. కాకి : వాయసము, చిరజీవి, అరిష్టము.
6. నీరము : నీరు, జలము, ఉదకము.
7. పుష్పము : పూవు, ప్రసూనము, కుసుమము, సుమము, విరి.
8. ముత్యము : మౌక్తికము, పాణి, ముక్తాఫలము, ముత్తియము.
9. అబ్ది : సముద్రము, జలధి, ఉదధి, పారావారము.
10. ధరణి : భూమి, ధర, జగత్తు, జగము, క్షోణి, కాశ్యపి.
11. దేహం : శరీరము, కాయము, గాత్రము, వపువు.
12. సుధ : అమృతము, పీయూషము.
13. కఱవు : కాటకము, క్షామము.

నానార్థాలు

1. కరి : ఏనుగు, కోతి, ఎనిమిది, సాక్షి.
2. రాజు : ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు.
3. దళము : ఆకు, సేన, సగము, గుంపు.
4. ప్రభ : వెలుగు, పార్వతి, ప్రభల సంబరము, సూర్యుని భార్య.
5. సంతతి : కులము, సంతానము, పుత్ర పౌత్ర పారంపర్యము.
6. కణము : నీటిబొట్టు, బాణము, కొంచెము, నూక, కణత.
7. సుధ : అమృతము, సున్నము, ఇటుక, చెముడు మొక్క.
8. ఈశ్వరుడు : ప్రభువు, శివుడు, భర్త, భగవంతుడు.
9. లక్ష్మి : శ్రీదేవి, కలువ, పసుపు, ముత్యము, జమ్మిచెట్టు.
10. సాధనము : సాధించుట, ధనము, తపము, ఉపాయము.
11. పట్టు : గ్రహణము, అవకాశము, బంధుత్వము, పట్టుదల.
12. శ్రీ : లక్ష్మి, ఐశ్వర్యము, అలంకారము, విషము, సాలిపురుగు, ఒక రాగము.
13. యుగము : జంట, రెండు, బండికాడి, వయస్సు.
14. ద్రవ్యము : ధనము, ఇత్తడి, ఔషధము, లక్క.

కవయిత్రి, కపుల పరిచయం

1) కవి పేరు : ఏనుగు లక్ష్మణకవి

రచించిన శతకం : సుభాషిత రత్నావళి

అనువాద శతకం : ఇది సంస్కృతము నుండి తెలుగులోకి అనువదింపబడిన శతకము. భర్తృహరి మహాకవి సంస్కృత భాషలో ‘సుభాషిత త్రిశతి’ అనే పేరున మూడు శతకాలు రచించాడు. వాటినే ఏనుగు లక్ష్మణకవి ‘సుభాషిత రత్నావళి’ అనే పేరున అనువదించాడు.

కాలము : క్రీ.శ. 1720 – 1780 మధ్యకాలము.

నివాసము : ఈయన తూర్పు గోదావరి జిల్లా ‘పెద్దాడ’ గ్రామంలో నివసించారు.

ఇతర గ్రంథాలు :
1) రామేశ్వర మాహాత్మ్యం,
2) విశ్వామిత్ర చరిత్ర,
3) గంగా మాహాత్మ్యం,
4) రామవిలాసం,
అనేవి వీరి ప్రసిద్ధ రచనలు.

2) కవయిత్రి : తరిగొండ వెంగమాంబ

రచించిన శతకం : తరిగొండ నృసింహ శతకం

కాలం : ఈమె 18వ శతాబ్దానికి చెందిన కవయిత్రి.

జన్మస్థలం : చిత్తూరు జిల్లా ‘తరిగొండ’ గ్రామము.

భక్తి జీవనం : ఈమె బాల్యము నుండి భగవద్భక్తురాలు.

రచనలు : ఈమె తరిగొండ నృసింహ శతకం, శివనాటకం, ‘నారసింహ (ఊహాచిత్రం) విలాసకథ’ అనే యక్షగానాలు, ‘రాజయోగామృతం’ అనే ద్విపద కావ్యం, శ్రీ వేంకటాచల మాహాత్మ్యం, అష్టాంగ యోగసారం, వాశిష్ఠ రామాయణం అనే పద్యకావ్యాలు రచించి ప్రసిద్ధి పొందింది.

3) కవి పేరు : వడ్డాది సుబ్బారాయ కవి (వసురాయకవి)

రచించిన శతకం : భక్తచింతామణి శతకం

కాలం : 20వ శతాబ్దం

ప్రసిద్ధి : వీరు “వసురాయకవి”గా ప్రసిద్ధులు.

ఉద్యోగం : రాజమహేంద్రవరంలోని ఫస్టుగ్రేడ్ కళాశాలలో ఆంథ్రోపన్యాసకులుగా పనిచేశారు.

భక్తచింతామణి శతకం : వీరు ‘హిందూ జన సంస్కారిణి’ అనే పత్రికలో మొదట “భక్త చింతామణి” పేర 80 పద్యాలు వ్రాశారు. తరువాత దాన్ని భక్తచింతామణి శతకంగా వీరు పూర్తిచేశారు.

రచనలు : వీరి ‘వేణీ సంహారము’ నాటకానువాదము చాలా ప్రసిద్ధి పొందింది. ‘ప్రబోధ చంద్రోదయం’ అనే మరో నాటకం, నందనందన శతకం, భగవత్కీర్తనలు- అనేవి వీరి ఇతర రచనలు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

4) కవి పేరు : మారద వెంకయ్య
ఈయనను మారన వెంకయ్య’ అని, ‘మారవి’ అని కూడా కొందరు అంటారు.

రచించిన శతకం : “భాస్కర శతకము”

కాలము : క్రీ.శ. 1650 – 1600 మధ్య కాలంలో ఇతడు జీవించి ఉంటాడని విమర్శకుల అభిప్రాయం.

భాస్కర శతకం విశిష్టత : సుమతీ శతకం, వేమన శతకం తరువాత మంచి ప్రచారంలో ఉన్న నీతి శతకాలలో ‘భాస్కర శతకం’ మొదటిది. ఇందులో పద్యాలు అకారాది క్రమంలో ఉన్నాయి. దృషాంత అలంకారం ప్రయోగించడం వల్ల భావపుషికి సాయపడుతుంది. దృషాంత పూర్వక నీతిబోధ హృదయంపై చెరగని గాఢముద్ర వేస్తుంది. ‘భాస్కర శతకము’ తెలుగులో వెలసిన మొదటి దృష్టాంత శతకము.

5) కవి పేరు : కంచర్ల గోపన్న

రచించిన శతకం : ‘దాశరథీ శతకం’. ఇది ‘దాశరథీ కరుణాపయోనిధీ’ అనే మకుటంతో రచింపబడింది.

కాలము : 17వ శతాబ్దానికి చెందిన కవి.

కంచర్ల గోపన్న విశిష్టత : ఈయనకు ‘రామదాసు’ అనే పేరు ఉంది. ఈయన భద్రాచలంలో శ్రీరామునికి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయించాడు. సీతారామలక్ష్మణులకూ, హనుమంతునికీ ఆభరణాలు చేయించాడు. ఈయనను తానీషా గోలకొండ కోటలో బంధించాడు. ఈయన శ్రీరామునిపై అనేక కీర్తనలు వ్రాశాడు. అవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి పొందాయి. ఈయన శ్రీరామ భక్తాగ్రగణ్యుడు.

6) కవి పేరు : ధూర్జటి

రచించిన శతకం : ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’. ఇది శ్రీకాళహస్తీశ్వరా ! అనే మకుటంతో వ్రాయబడింది.

కాలము : క్రీ.శ. 16వ శతాబ్దము వాడు. ధూర్జటి మహాకవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజకవులలో ఒకడిగా ఉండి, అనేక సత్కారాలు పొందాడు.

ఇతర గ్రంథము : ఈయన “కాళహస్తి మాహాత్మ్యము” అనే కావ్యాన్ని ప్రబంధ శైలిలో వ్రాశాడు. ఈయన శుద్ధ శైవుడు. పరమ శివభక్తుడు. అపార మహిమగల కవి. రాజులనూ, రాజసేవనూ నిరసించాడు.

7) కవి పేరు : బద్దెన

శతకం పేరు : ‘సుమతీ శతకము’. ‘సుమతీ’ అనే మకుటంతో ఈ శతకం వ్రాయబడింది.

కాలము : 13వ శతాబ్దము

సుమతీ శతక విశిష్టత : సుమతీ శతక రచనా విధానం, లలితంగా ఉంటుంది. ఈ శతకం లలితమైన శబ్దాలతో, హృదయంగమైన శైలిలో సరళంగా ఉంటుంది. భావాలు సులభంగా పఠితుల మనస్సులకు హత్తుకొనేటట్లు ఈ శతకం ఉంటుంది. తరువాతి కాలంలో కందములలో వ్రాయబడ్డ శతకాలకు ఈ సుమతీ ‘శతకం’ ఆదర్శంగా నిలిచింది. ఆనాటి సమకాలీన ప్రజల జీవిత విధానాన్ని, వారి మనస్తత్వాన్ని బద్దెన బోధించిన నీతులు అద్దముల వలె ప్రతిఫలిస్తున్నాయి.

అవగాహన – ప్రతిస్పందన

పద్యం – 1 : కంఠస్థ పద్యం

ఉ॥ వీరము తప్తలోహమున నిల్చి యవాచకమై వశించు వా
వీరము ముత్యమట్లు వళివీదళ సంగీతమై తవర్చునా
నీరమె శక్తిలో(బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభవ్
బౌరుష వృత్తులి బ్లధము మధ్యము మత్తము గొల్చువారికిన్.
– ఏనుగు లక్ష్మణకవి
ప్రతిపదార్థం :
నీరము = నీరు
తప్తలోహమునన్ = కాల్చిన ఇనుము నందు
నిల్చి = నిలబడి
అనామకమై = పేరులేనిదై
నశించున్ = నశిస్తుంది
ఆ నీరము = ఆ నీరే
నళినీదళ సంస్థితమై ; నళినీదళ = తామర ఆకునందు
సంగీతము + ఐ = ఉన్నదై
ముత్యమట్లు (ముత్యము + ఆట్లు) = ముత్యమువలె
తనర్చున్ = అలరిస్తుంది (భాసిస్తుంది)
ఆ నీరము = ఆ నీరే
శుక్తిలోఁబడి (శుక్తిలోన్ + పడి) = ముత్యపు చిప్పలో పడి (సముద్రములోని ముత్యపు చిప్పలో పడినట్లయితే)
సమంచిత ప్రభన్; సమంచిత = మిక్కిలి ఒప్పిదమైన
ప్రభన్ = ప్రకాశముతో
మణిత్వమున్ = మణియొక్క రూపమును ; (మణి యొక్క స్వభావమును)
కాంచున్ = పొందుతుంది;
అధమున్ = అధముని (నీచుని)
మధ్యమున్ = మధ్యముని
ఉత్తమున్ = ఉత్తముడిని
కొల్చువారికిన్ = సేవించేవారికి
పౌరుష వృత్తులు ; పౌరుష = పురుషునకు సంబంధించిన
వృత్తులు = నడవడులు (బ్రతుకు తెరువులు)
ఇట్లు = ఈ విధంగానే ఉంటాయి.

భావం:
కాల్చిన ఇనుము మీద నీళ్ళుపడితే, ఆవిరైపోయి, పేరు లేకుండా పోతాయి. ఆ నీళ్ళే తామరాకు పైన పడితే, ముత్యమువలె కన్పిస్తాయి. ఆ నీళ్ళే ముత్యపు చిప్పలలో పడితే, మణులవలె (ముత్యములవలె) మారతాయి. అలాగే మనిషి అధముడిని సేవిస్తే, తాను కూడా అధముడు ఔతాడు. మధ్యముడిని సేవిస్తే, మధ్యముడు ఔతాడు. ఉత్తముడిని సేవిస్తే, తాను కూడా ఉత్తముడౌతాడు.

పద్యం – 2 : కంఠస్థ పద్యం

మ॥ కరిరాజువ్ బిసతంతు సంతతులచే గట్టన్ విజృంభించు వాఁ
దురు వజ్రంబు శిరీష పుష్పములచే సహించు భేదింపఁదీ
పురచింపన్ లవణాఫ్రికన్ మధుకణంబుం ఇందు యత్నించు ని
ధరణిన్ మూర్ఖులఁ దెల్పువెవ్వడు సుధాధారామకారోక్తులన్
– ఏనుగు లక్ష్మణకవి
ప్రతిపదార్థం :
ఎవ్వడు = ఎవడు;
సుధాధారానుకారోక్తులన్; సుధాధారా = అమృత ధారలను
అనుకార = పోలునట్టి;
ఉక్తులన్ = మాటలతో
ఇద్దరణిన్ (ఈ + ధరణిన్) = ఈ భూమండలములో
మూర్చులన్ = మూర్ఖులను;
తెల్పున్ = స్పష్టపరుస్తాడో (సమాధాన పరుస్తాడో)
వాడు = వాడు
కరిరాజున్ = మదపు టేనుగును ;
బిసతంతు సంతతులచేన్ ; బిసతంతు = తామర తూడునందలి దారముల యొక్క
సంతతులచేన్ = సమూహముచే
కట్టన్ = కట్టడానికి
విజృంభించున్ = ప్రయత్నిస్తాడు
ఉరువజ్రంబున్ = గొప్ప వజ్రపుమణిని
శిరీషపుష్పములచేన్ = దిరిసెన పూవులతో
భేదింపన్ – బ్రద్దలు చేయడానికి
ఊహించున్ = ఆలోచిస్తాడు
లవణాభికిన్ (లవణ + అబ్ధికిన్) = ఉప్పు సముద్రానికి
తీపు రచింపన్ = తియ్యన చేయడానికి (తీయగా చేయడానికి)
మధుకణంబున్ = తేనె బొట్టును
చిందు యత్నించున్ = ఒలికించడానికి ప్రయత్నిస్తాడు

భావం:
మూర్ఖులను అమృతధారలవంటి మాటలతో సమాధాన పరిచేవాడూ, మదపుటేనుగును తామర తూడునందలి దారములతో బంధించాలని ఆలోచించేవాడూ, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని బ్రలు చేయాలని యత్నించేవాడూ, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తియ్యగా మార్చాలనుకొనేవాడూ, సమానులు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఉత్తమ లక్షణాలు ఏవి?
జవాబు:
తల్లిదండ్రులనూ, గురువులనూ, పెద్దలను గౌరవించడం, సత్యమునే మాట్లాడడం, సకాలంలో తనకు ఉన్న పనులు చేయడం, ధర్మమార్గాన్ని పాటించడం, బీదలనూ, అనాథులనూ ఆదుకోవడం, దానధర్మాలు చేయడం, చక్కగా చదువుకోవడం, తోటివారిపై కరుణ, జాలి కలిగియుండడం, తనకున్న దానిలో కొంత ప్రక్కవారికి ఇవ్వడం, మొదలైనవి ఉత్తమ లక్షణాలు.

ప్రశ్న 2.
మీకు తెలిసిన లోహాల పేర్లు చెప్పండి.
జవాబు:
ఇనుము, వెండి, బంగారము, ఇత్తడి, కంచు, రాగి, స్టెయిన్లెస్ స్టీలు, తగరము, సీవెండి మొదలైనవి నాకు తెలిసిన కొన్ని లోహాలు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
మూర్ఖుల స్వభావం ఎలాంటిది?
జవాబు:
మూర్యుడు మొండి పట్టుదల గలవాడు. అతడికి విషయము తెలియదు. ఇతరులు చెపితే అతడు వినడు. తెలియని వాడికి చెప్పవచ్చు. తెలిసినవాడికి మరింత సులభంగా చెప్పవచ్చు. కాని మూర్ఖుడికి చెప్పడం, ఎవరికీ శక్యం కాదు. ఇసుక నుండి నూనెను తీయగలము. ఎండమావిలో నీరు త్రాగగలము. కాని మూర్ఖుడి మనస్సును మాత్రం సంతోషపెట్టలేము.

ప్రశ్న 4.
‘ధరణి’ అనే పదానికి పర్యాయపదాలు చెప్పండి.
జవాబు:
భూమి, అచల, రస, విశ్వంభర, అనన్త, స్థిర, ధర, ధరిత్రి, ధరణి, క్షోణి, కాశ్యపి, క్షితి, సర్వంసహ, వసుమతి, వసుధ, ఉర్వి, వసుంధర, పృథివి, పృథ్వి, అవని, మేదిని, మహి, ఇల, విపుల, జగతి, రత్నగర్భ, భూత ధాత్రి, కుంభిని, క్షమ, పుడమి, నేల మొదలైనవి ధరణి అనే పదానికి పర్యాయపదములు.

పద్యం – 3 : కంఠస్థ పద్యం

ఉ॥పట్టుగ నీశ్వరుండు తన పాలిట మండిపుడిచ్చినంతలో
దిట్టక దీనదేహలమ దేటగ లాలవఁ జేసి, యన్నమున్
బెట్టు వివేకి మానసముఁ బెంపావరించుచు మారకుండినన్
గుట్టుగ లక్ష్మి(బొందుఁ; దరిగొండపృసింహ! దయాపయోనిధీ!
– తరిగొండ (తరికుండ) వెంగమాంబ
ప్రతిపదార్థం :
దయాపయోనిధీ = దయకు సముద్రుడవైన వాడా ! (సముద్రమంత గొప్ప దయ కలవాడా !)
తరిగొండ నృసింహ : తరిగొండ గ్రామంలో వెలసిన ఓ నృసింహ స్వామీ!
వివేకి = వివేకము గలవాడు
ఈశ్వరుండు = భగవంతుడు
పట్టుగన్ = దృఢముగా
తన పాలిటనుండి = తన పక్షమున ఉండి
ఇపుడు = ఈ జన్మములో
ఇచ్చినంతలోన్ = తనకు ప్రసాదించిన దానిలోనే
దీనదేహులను = దరిద్రులను
తిట్టక = నిందింపక (కసురుకోక)
దేటగన్ = ఇంపుగా (ఆప్యాయంగా)
లాలనఁజేసి = (దీనులను)లాలించి (బుజ్జగించి)
అన్నమున్ = అన్నాన్ని
పెట్టున్ = పెడతాడు
మానసమున్ = తన మనస్సును (అతడు)
పెంపొనరించుచున్ (పెంపు+ఒనరించుచున్) = ఆనందింపజేసికొంటూ (సంతోషపరచుకుంటూ)
ఊరకుండినన్ (ఊరక+ఉండినన్) = (తనకు ఇమ్మని ఏమీ) అడుగకుండా ఊరకున్నప్పటికీ
గుట్టుగన్ = రహస్యంగా
లక్ష్మిన్ = ఐశ్వర్యాన్ని
పొందున్ = పొందుతాడు

భావం :
ఓ దయా సముద్రుడా ! తరిగొండ నృసింహదేవా! వివేకి అయినవాడు, తనకు భగవంతుడు ప్రసాదించిన దానిలోనే నిరుపేదలను కసరుకోక, ఆప్యాయతతో లాలిస్తూ వారికి అన్నము పెడతాడు. అతడు మనసులో ఆనందపడుతూ ఉంటే, అతడు తనకు పెట్టమని అడుగకపోయినా, లక్ష్మీదేవి రహస్యంగా అతడిని వచ్చి చేరుతుంది.

పద్యం – 4 : కంఠస్థ పద్యం

మ|| తన దేశంబు స్వభాష వైజమతమున్ ఆస్మత్సదాచారముల్
తన దేహాత్మల ఎత్తెలుంగువ పదా రావట్లు ప్రేమించి, త
దృవతావాప్తికి సాధనంబులగు సత్కార్యమ్ములన్ జేయఁగా
నమవా బుద్ధి యొసంగుమీ ప్రజకు దేవా! భక్త చింతామణి!
– వడ్డాది సుబ్బరాయకవి
ప్రతిపదార్థం :
దేవా = ఓ దైవమా !
భక్త చింతామణీ = భక్తులకు చింతామణి రత్నంవలె కోరిన కోరికలను ఇచ్చేవాడా!
తన దేహాత్మలన్; (తన దేహ + ఆత్మలన్) తన దేహ = తన శరీరాన్ని
ఆత్మలన్ = ఆత్మలను
ఎత్తెఱంగునన్ (ఏ + తెలుంగునన్) – ఏ విధంగా మనిషి ప్రేమిస్తాడో,
అట్లు = ఆ విధంగానే
తన దేశంబున్ = తన దేశాన్ని
స్వభాషన్ = తన భాషను
నైజమతమున్ = తన మతాన్ని
అస్మత్ సదాచారముల్; అస్మత్ = తన యొక్క
సదాచారముల్, (సత్ + ఆచారముల్) = మంచి ఆచారములను
సదా = ఎల్లప్పుడునూ
తాను = తాను
ప్రేమించి = ప్రేమతో చూసి
తద్ఘనతా వాప్తికిన్; (తత్ +ఘనతా+అవాప్తికిన్) తత్ = ఆ దేశము, భాష, మతము సదాచారములు అనేవి
ఘనతా = గొప్పతనమును
అవాప్తికిన్ = పొందడానికి
సాధనంబులగు = సాధనములయిన
సత్కార్యములన్ = మంచి పనులను
చేయగాన్ = చేయడానికి
అనువౌ (అనువు+ఔ) = తగినటువంటి
బుద్దిన్ = బుద్ధిని
ప్రజకున్ = దేశప్రజలకు
ఒసంగుమీ = ఇమ్ము

భావం :
భక్తుల పాలిటి చింతామణి రత్నం వంటి వాడవైన ఓ స్వామీ ! ఎవరైనా తన శరీరాన్ని, ఆత్మనూ ఏవిధంగా అభిమానిస్తూ ఉంటారో, ఆవిధంగానే తన దేశాన్ని, తన భాషనూ, తన మతాన్ని, తన మంచి ఆచారాలనూ కూడా అభిమానించే టట్లు, వాటి ఔన్నత్యానికి సాధనాలయిన మంచి పనులను చేసేటట్లూ తగిన బుద్ధిని ప్రజలకు ప్రసాదించు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఎవరిని ఆదరించాలి? లక్ష్మి ఎప్పుడు వచ్చి చేరుతుంది?
జవాబు:
దీనులనూ, అనాథలనూ, కష్టములలో ఉన్నవారినీ మనం ఆదరించాలి. దీనులను ఆదరించి, వారికి అన్నము పెడితే లక్ష్మి తనంతట తానుగా మనలను వచ్చి చేరుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 2.
మంచి పనులకు అవసరమైన బుద్ది అనగా ఏమిటో వివరించండి.
జవాబు:
మంచి పనులకు అవసరమైన బుద్ధి, అంటే తన దేశాన్ని, తన మతాన్ని, తన భాషను, తన దేశ ప్రజలను ప్రేమించే మనస్తత్వం కలిగియుండడం. అలాగే ఇరుగుపొరుగు వారిపై జాలి, కరుణ, దయ, ఆర్థత కల్గియుండడం. ఇరుగు పొరుగు వారి కష్టసుఖాలలో తాము పాలు పంచుకోవాలి. తాను నమ్మిన దైవాన్ని పూజించాలి. తోటి ప్రజలను అన్నదమ్ములవలె అక్కాచెల్లెండ్రవలె, ఆదరించగలిగిన మనస్తత్వం ఉండాలి. ఉన్నంతలో తోటివారికి దానధర్మాలు చేయగలగాలి.

పద్యం – 5 : కంఠస్థ పద్యం

చం॥ ఉరుగుణవంతుఁ దొడ్లు తన కొండపకారము చేయునపుడుం
బరహితమే యొనర్చు వాక పట్టువ నైవను గీడుఁజేయగా
తెలుగదు; విక్కి మేకద యదెట్లనఁ గవ్వముఁబట్టి యెంతయున్
దరువగ జొచ్చినం బెరుగు తాలిమివీయదె వెన్న భాస్కరా!
– మారద వెంకయ్య
ప్రతిపదార్థం :
భాస్కరా = ఓ సూర్య భగవానుడా !
ఒడ్లు = ఇతరులు
తనకున్ = తనకు
ఒండు = ఒక
అపకారము = కీడు
చేయునప్పుడున్ = చేస్తున్నప్పుడు కూడ
ఉరుగుణవంతుడు = గొప్ప గుణములు కలవాడు
పరహితమే (పరహితము + ఏ) = ఇతరులకు మేలునే
ఒనర్చున్ = చేస్తాడు
ఒక పట్టునన్+ఐనన్ = ఒక సమయమునందైనా ఎప్పుడైనా)
కీడున్ = కీడును
చేయఁగాన్ (చేయన్+కాన్) = చేయడానికి
ఎఱుగడు = తెలియదు
నిక్కమేకద = అది నిజమే కదా !
అదెట్లనన్ (అది+ఎట్లు+అనన్) = అది ఎలాగున అంటే
కవ్వమున్ పట్టి = కవ్వమును చేతితో పట్టుకొని
ఎంతయున్ = మిక్కిలిగా (అధికంగా)
తరువగఁ జొచ్చినన్ (తరువగన్+చొచ్చినన్) = (పెరుగును) చిలుకుతున్నా
పెరుగు = పెరుగు
తాలిమిన్ = ఓర్పుతో
వెన్నన్ = వెన్నను
ఈయదె (ఈయదు +ఎ)= ఇస్తుంది కదా !

భావం :
పెరుగును మానవులు కవ్వమును చేతపట్టి ఎంతగా చిలుకుతున్నప్పటికీ అది ఓర్చుకొని చిలుకుతున్న వారికి వెన్ననే ఇస్తుంది. అలాగే గుణవంతుడు తనకు ఇతరులు కీడు చేస్తున్నప్పటికీ వారికి అపకారము చేయకుండా తాను పరోప కారమే చేస్తాడు.

పద్యం – 6 : కంఠస్థ పద్యం

చం॥ స్థిరతర ధర్మవర్తనఁ బ్రసిద్దికి వెక్కివని నొక్కము
ష్కరుఁ డతి విచవాక్యములఁ గాదని పల్కిన నమ్మహాత్ముఁడుం
గొంతవహింపఁ డయ్యెడ, వకుంఠిత పూర్ణ మధాపయోధిలో
వరుగుచుఁ గాకి రెట్ట యిడి వందున వేమి కొంత భాస్కరా!
– మారద వెంకయ్య
ప్రతిపదార్థం :
భాస్కరా = ఓ సూర్యుడా !
ఒక ముష్కరుడు = ఒక దుష్టుడు (నీచుడు)
స్థిరతర ధర్మవర్తనన్; స్థిరతర = మిక్కిలి స్థిరమైన
ధర్మవర్తనన్ = న్యాయ ప్రవర్తన చేత;
ప్రసిద్ధికి నెక్కినవానిన్ = పేరుపడిన వానిని
అతి నీచవాక్యములన్ = మిక్కిలి హీనములైన మాటల చేత
కాదని (కాదు + అని) = తిరస్కరించి
పల్కినన్ = మాట్లాడినా
అయ్యెడన్ (ఆ+ఎడన్) = ఆ సమయమందు
అమ్మహాత్ముడున్ (ఆ +మహాత్ముడున్) = ఆ గొప్పవాడును
కొఱతన్ = లోపమును
వహింపడు = పొందడు
ఎట్లనినన్ = ఎలాగునా అంటే
కాకి = కాకి
అరుగుచున్ = ఆకాశము నుండి ఎగిరివెడుతూ
అకుంఠిత పూర్ణసుధాపయోనిధిలోన్, అకుంఠిత = అడ్డులేని
పూర్ణ = నిండినదైన
సుధాపయోనిధిలోన్ = అమృతసముద్రములో
రెట్ట = మలము (పక్షిమలము)
ఇడినందునన్ = వేసినంత మాత్రముచేత
ఏమి కొఱంత – (ఆ సముద్రానికి వచ్చిన) లోపము ఏమిటి? (లోపమూ ఏమీ లేదు)

భావం:
ధర్మ ప్రవర్తనతో పేరుపొందిన మానవుడిని, ఒక నీచుడు, మిక్కిలి నీచమైన మాటలతో తిరస్కరించినంత మాత్రముచేత ఆ ధర్మాత్మునికి లోపము కలుగదు. అమృత సముద్రము మీదుగా ఎగిరివెళ్ళే కాకి ఆ సముద్రములో రెట్టవేసినంత మాత్రముచేత ఆ సముద్రమునకు ఏమియు లోపము రాదు కదా !
గమనిక : అలంకారము : దృష్టాంతాలంకారము

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఇతరులకు మేలు చేస్తే మనకు కలిగే ప్రయోజనమేమిటి?
జవాబు:
ఇతరులకు మేలు చేస్తే మనకు భగవంతుడు మేలు చేస్తాడు. మనవల్ల మేలు పొందినవారు మనలను అవసర సమయాల్లో తమ ప్రాణాలు అడ్డువేసి కాపాడతారు. ఒకరికొకరు సాయం చేసుకుంటే దేశ ప్రజలంతా సుఖసౌఖ్యాలలో ఓలలాడతారు.

ప్రశ్న 2.
మహాత్ముల గుణాలు ఎటువంటివి?
జవాబు:
ఇతరులు తమకు అపకారము చేసినా మహాత్ములు మాత్రం ఉపకారమే చేస్తారు. వారు ఎప్పుడూ ఇతరులకు అపకారం తలపెట్టరు. సర్వకాల సర్వావస్థల యందూ మహాత్ములు తమ ధనమాన ప్రాణాలను పరహితము కోసమే వినియోగిస్తారు. ఇతరుల నుండి మహాత్ములు ప్రత్యుపకారమును కోరుకోరు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
తాలిమి వల్ల ఉపయోగమేమిటి?
జవాబు:
తాలిమి అంటే ఓర్పు. “ఓర్పు’ కవచము వంటిది. ఓర్పు మనకు . ఉన్నట్లయితే అది మన శరీరానికి మనము ధరించిన కవచమువలె మనల్ని కాపాడుతుంది. ఓర్పు అనేది మంచి గుణం. ఓర్పు ఉన్నవారికి శత్రువులు ఉండరు.

పద్యం – 7 : కంఠస్థ పద్యం

ఉ॥ చిక్కవిపాలపై మిసిమిఁ చెందిన మీగడ పంచదారతో
మెక్కిన భంగి నీ విమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పశ్చిరంబువ సమాహిత దావ్యమనేటి దోయిటవ్
దక్కా నటంచు బుచ్చెదను దాశరథీ కరుణాపయోనిధీ !
– కంచర్ల గోపన్న
ప్రతిపదార్థం :
కరుణాపయోనిధీ = దయాసముద్రుడవైన
దాశరథీ = దశరథుని కుమారుడైన ఓ శ్రీరామచంద్రా !
చిక్కని పాలపైన్ = చిక్కనైన పాలమీద నున్న
మిసిమి చెందిన = మిసమిసలాడుతున్న
మీగడన్ = మీగడను
పంచదారతోన్ = పంచదారతో కలిపి
మెక్కిన భంగిన్ = తిన్న విధంగా; (తినే విధముగా)
నీ విమల మేచకరూప సుధారసంబున్; నీ = నీ యొక్క
విమల = అచ్చమైన
మేచక = నల్లని
రూప = ఆకారము అనే (నీలమేఘచ్ఛాయతో కూడిన రూపము అనే)
సుధారసంబున్ = అమృతరసమును;
నా = నాయొక్క
మక్కువ = ప్రేమ అనే
పళ్ళెరంబునన్ = భోజన పాత్రములో (పళ్ళెములో (కంచములో) ఉంచుకొని)
సమాహిత దాస్యము = శ్రద్ధతో కూడిన సేవ అనే
దోయిటన్ = దోసిలియందు
దక్కెను = చిక్కింది (లభించింది)
అటంచున్ = అనుకుంటూ
జుఱ్ఱెదను = జుఱ్ఱుతూ త్రాగుతాను (ఇష్టముతో తింటాను)

భావం :
దయాసముద్రుడవైన ఓ దశరథనందనా ! శ్రీరామా! చిక్కని పాలమీద మిసమిసలాడునట్టి మీగడను పంచదారతో కలిపి తిన్నవిధంగా, నీ నీలమేఘచ్ఛాయతో కూడిన రూపము అనే అమృతరసమును, ప్రేమ అనే పళ్ళెమందు ఉంచుకొని, శ్రద్ధతో కూడిన సేవ అనే దోసిలి యందు పెట్టుకొని ఇష్టంగా జుజ్జుతూ త్రాగుతాను.

పద్యం – 8 : కంఠస్థ పద్యం

శా॥ జాతుల్పిప్పుట, సేవచేయుట మృషల్ సంధించుట వ్యాయామం
బ్యాతింబొందుట, కొండిగాడవుట, పాంపారంభకుండాట, మి
ధ్యా తాత్పర్యము లాడు టన్నియుఁ బరద్రవ్యంబు వారించి, యా
శ్రీ తా నెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వరా !
– ధూర్జటి
ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా = ఓ శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరుగల స్వామి !
జాతుల్సెప్పుట; (జాతుల్ + చెప్పుట) = జాతకములు చెప్పడం;
సేవచేయుట = రాజులకుగాని, ఇతరులకు గాని సేవలు చేయుటయు
మృషల్ సంధించుట = అసత్యములు (అబద్దాలు) కల్పించడమూ
అన్యాయాపఖ్యాతిన్; (అన్యాయ + అపఖ్యాతిన్) – అన్యాయ ప్రవర్తన ద్వారా చెడ్డ పేరును
పొందుట = పొందుటయూ
కొండెకాడవుట; (కొండెకాడు + అవుట) = చాడీలు చెప్పేవాడు కావడమూ
హింసారంభకుండౌట; (హింసా + ఆరంభకుడు + ఔట) = హింసా ప్రయత్నమునకు ఉపక్రమించుటయు
మిధ్యాతాత్పర్యములాడుట; (మిధ్యా తాత్పర్యములు+ఆడుట) = ఉన్నవీ, లేనివీ తలు మాట్లాడుటయు;
అన్నియున్ = పై చెప్పినవన్నియునూ
పరద్రవ్యంబున్ = ఇతరుల ధనమును
ఆశించి = కోరి చేయునట్టివే కదా !
ఆ శ్రీ = అలా సంపాదించిన లక్ష్మి (సంపద)
తాను = తాను
ఎన్ని యుగంబులు = ఎన్ని యుగాలపాటు
ఉండగలదో = సంపాదించిన వాడివద్ద ఉంటుందో (ఉండదుకదా!)

తాత్పర్యం :
శ్రీకాళహస్తీశ్వరా ! ప్రజలు పరధనమును కోరి, జాతకములు చెప్పడం, రాజుల సేవలు చేయడం, అన్యాయంగా అపఖ్యాతిని పొందడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవీ, లేనివీ మాట్లాడడం మొదలయిన పనులు చేస్తున్నారు. ఈ పనులన్నీ ఇతరుల ద్రవ్యాన్ని ఆశించి చేసేవే. ఆ ద్రవ్యము మాత్రము ఎన్నాళ్ళు ఉంటుంది ? తాను కూడా శాశ్వతంగా బ్రతికి యుండడు కాబట్టి ఈ చెడుపనులు చేయడం నిరర్షకం.

పద్యం – 9

క॥ వఱదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడ కేగకుమీ
పరులకు మర్మము పెప్పకు
పితికి దళవాయితనముఁ బెట్టకు సుమతీ!
– బద్దెన
ప్రతిపదార్థం :
సుమతీ = ఓ మంచి బుద్ధి కలవాడా !
వఱదైన; (వఱద + ఐన) = వజద వస్తే మునిగిపోయే
చేనున్ = పొలమును
దున్నకు = సేద్యానికి దున్నవద్దు
కఱవైనను; (కఱవు + ఐనను) = కఱవు వచ్చినట్లయితే
బంధుజనుల కడకున్ = చుట్టాల వద్దకు
ఏగకుమీ = వెళ్ళవద్దు
పరులకున్ = ఇతరులకు
మర్మము + చెప్పకు = (ఇంటి) రహస్యాన్ని చెప్పవద్దు
పిఱికికిన్ = పిఱికివాడికి
దళవాయితనమున్ = సైన్యాధిపత్యమును
పెట్టకు = కల్పించకు (ఇవ్వవద్దు)

భావం :
ఓ మంచిబుద్ధి కలవాడా ! వఱదలు వస్తే మునిగిపోయే పొలమును దున్నవద్దు, కణవు వచ్చినపుడు బంధువుల ఇండ్లకు వెళ్ళవద్దు. రహస్యాన్ని ఇతరులకు చెప్పవద్దు. వీటికివాడికి సేనానాయకత్వమును ఇవ్వవద్దు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
భగవద్దర్శనం వలన కలిగే అనుభూతులు చెప్పండి.
జవాబు:
భగవంతుడిని దర్శనం చేసుకుంటే మన మనస్సులు సంతోషంతో నిండిపోతాయి. మన మనస్సులోని దుఃఖం తొలగిపోతుంది. మన కలతలన్నీ తీరిపోతాయి. ఆనందంతో మన కన్నుల వెంట ఆనందబాష్పాలు వస్తాయి. ఆనందంతో మన మనస్సులు తేలిఆడుతాయి. మన బాధలన్నీ పోయి, మనస్సు తేలిక పడుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 2.
జాతకాలను నమ్మవచ్చా? ఎందుకు?
జవాబు:
జాతకాలు చెప్పడం చాలా కాలంగా ఉంది. అదొక శాస్త్రము. సరైన పుట్టిన వేళ, నక్షత్రము, హోర తెలిస్తే, కొంతవఱకూ జాతకం చెప్పవచ్చు. కాని జాతకాలు అన్నీ నిజము కావు. జాతకములపై పిచ్చి పనికిరాదు. చక్కగా జ్యోతిశ్శాస్త్రం తెలిసిన పండితులు సైతమూ నేడు లేరు. కాబట్టి అదే పనిగా పెట్టిగా నేడు జాతకాలను నమ్మడం అవివేకం.

ప్రశ్న 3.
ఇంటి గుట్టు ఎవరికి, ఎందుకు చెప్పకూడదు?
జవాబు:
‘ఇంటి గుట్టు’ అంటే మన ఇంటిలోని రహస్యము. రహస్యమును ఎప్పుడూ ఇతరులకు చెప్పకూడదు. ‘ఇంటిగుట్టు లంకకు చేటు’ అన్న సామెత మనకు ఉంది. లంకాధిపతి తమ్ముడైన విభీషణుడు రాముడితో చేరి, లంకలోని రహస్యాలను రాముడికి చెప్పి రావణుడి పతనానికి కారణం అయ్యాడు. అందువల్లనే ఇంటి గుట్టును ఇతరులకు ఎప్పుడూ చెప్పరాదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 5th Lesson ధన్యుడు Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 5th Lesson ధన్యుడు

10th Class Telugu 5th Lesson ధన్యుడు Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

లఘుపతనతుండు మంథరునితో నిట్లనియె. “చెలితాఁడా! యీ మూషిక రాజును నీవు మిక్కిలి | సమ్మానింపుము. ఇతఁడు పుణ్యకరులలోపల ధురీణుఁడు, గుణరత్నాకరుఁడు, హిరణ్యకుఁ డనువాఁడు. ఈతని గుణములు శేషుఁడు సహితము వర్ణింపజాలఁడు. నే నేపాటివాడఁను” అని పలికి మొదటి నుండి హిరణ్యకుని వృత్తాంతము సర్వము వినిపించెను. అంతట మంథరుఁడు హిరణ్యకుని మిక్కిలి సమ్మానించి యిట్లనియె. “హిరణ్యతా! నీవు నిర్జన వనమునందు వాసము చేయుటకు నిమిత్తమేమి ? చెప్పుము” అని యడిగెను. హిరణ్యకుఁడిట్లనియె.

ఈ ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఇలాంటి శైలిలో ఉన్న పాఠాలను చదివారా? లేదా? (ఈ రూపంలో ఉన్న మీకు తెలిసిన పుస్తకాల పేర్లు చెప్పండి.)
జవాబు:
ఇలాంటి భాషతో ఉన్న పాఠాలను చదివాము. 7వ తరగతిలో ‘దురాశ పాఠమును చదివాము. అది పరవస్తు చిన్నయసూరి గారు రచించిన నీతిచంద్రిక లోనిది. 9వ తరగతిలో ‘స్వభాష’ పాఠం చదివాము. ఇది పానుగంటి గారి రచన.

పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు రచించిన సాక్షి వ్యాసాలు ఇటువంటి రచనే. కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించిన సంధి, విగ్రహం ఇటువంటివే. అడవి బాపిరాజు గారు, కోలాంచల కవి, ఏనుగుల వీరాస్వామి, మధిర సుబ్బన్న దీక్షితులు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మొదలైన వారి రచనలు ఇట్టివే.

ప్రశ్న 2.
మంథరుడు ఎవరి వృత్తాంతాన్ని విన్నాడు?
జవాబు:
మంథరుడు హిరణ్యకుని వృత్తాంతాన్ని విన్నాడు. దానిని లఘుపతనకుడు చెప్పాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 3.
హిరణ్యకుని నివాసమెక్కడ?
జవాబు:
హిరణ్యకుని నివాసము నిర్జన వనము.

ప్రశ్న 4.
హిరణ్యకుడు తన నివాసం గురించి ఏం చెప్పి ఉంటాడు?
జవాబు:
“హిరణ్యకా! నీవు నిర్జన వనము నందు వాసము చేయుటకు నిమిత్తమేమి? చెప్పుము” అని మంథరుడు అడిగిన దానిని బట్టి ఆ నిర్జన వనము హిరణ్యకుని నివాసము కాదని తెలుస్తోంది. అక్కడకు చేరకముందు హిరణ్యకునిది మంచి నివాసమే అయి ఉండును. అక్కడ ఏదో బాధ కలగడం వలన దాని మకాం నిర్జన వనానికి మారి ఉండును. బహుశా ఆ కారణాలన్నీ మంథరునితో చెప్పి ఉంటాడు.
(ఇంకా అనేక ప్రశ్నలడిగి పిల్లలందరిచేత మాట్లాడించాలి.)

1. అవగాహన-ప్రతిస్పందన

ప్రశ్న 1.
చూడాకర్ణుని మాటలను బట్టి మీకర్ణమైన విషయమేమి? దానిపై మీ అభిప్రాయమేమిటో చెప్పండి.
జవాబు:
చూడాకర్ణుని మాటలను బట్టి ధనము కలవాడే బలవంతుడని తెలిసింది. ధనముగల వాడే పండితుడు. ధనము లేకపోతే బలహీనుడౌతాడు. ధనము ఉంటే బలం పెరుగుతుందని, ధనవంతునికి సాధ్యము కానిది లేదని తెలిసింది. అన్ని ‘ శుభములకు ధనమే మూలమని చూడాకరుని అభిప్రాయమని అతని మాటలను బట్టి తెలిసింది.

కేవలం ధనం ఉంటే గొప్పవాడు కాదని నా అభిప్రాయం. ఎంత ధనం ఉన్నా వివేకం లేకపోతే ప్రయోజనం లేదు. ఆ వివేకం రావాలంటే విద్య కావాలి. ‘విద్యా ధనం సర్వ ధన ప్రధానమ్’ అని ఆర్యోక్తి. అందుచేత విద్యను మించిన ధనం లేదు. మూర్యుడు తన ఇంటిలోనే గౌరవింపబడతాడు. ధనవంతుడు తన గ్రామంలోనే గౌరవింపబడతాడు. రాజు తన రాజ్యంలోనే గౌరవింపబడతాడు కానీ, విద్యావంతుడు భూమండలమంతా గౌరవింపబడతాడు. మంచి పనుల కోసం ధనాన్ని విడిచిపెట్టాలి. కాని, ధనం కోసం కీర్తిని, మంచి పనులను, విద్యను, వివేకాన్ని విడిచిపెట్టకూడదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 2.
“ఆహా! ధనలోభము సర్వయాపదలకు మూలము కదా!” ఈ విషయాన్ని సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
ధనం పట్ల పిసినిగొట్టుతనం అన్ని కష్టాలకు, ప్రమాదాలకు మూలమని దీని భావం.

సమర్థన:
ధనమును ఖర్చు పెట్టనిదే సౌఖ్యం దొరకదు. ధన సంపాదనే ధ్యేయంగా ఉంటే గౌరవం పోతుంది. కీర్తి పోతుంది. ఆరోగ్యం పాడవుతుంది. ధనం కోసం మంచి, చెడు మరచిపోతాము. స్నేహితులు, బంధువులు అందరినీ పోగొట్టుకుంటాము. విలువైన జీవితకాలంలో సంపాదించవలసిన జ్ఞానం సంపాదించలేము. అన్నిటినీ కోల్పోతాము. ధనం మాత్రమే మిగులుతుంది. అందుచేత ధనలోభం మంచిది కాదు.

వ్యతిరేకత :
ధనమును మితిమీరి ఖర్చు చేయడం దారిద్ర్యానికి దగ్గర దారి. ధనం లేకపోతే ఎవరూ పలకరించరు. సమాజంలో గౌరవస్థానం ఉండదు. హోదా ఉండదు. ధనం లేకపోతే ఏ పుణ్యకార్యాలు చేయలేము. దానధర్మాలకు ధనం కావాలి. పేదవాని కోపం పెదవికి చేటు. ధనవంతుని కోపం ధరణికే చేటు. ధనలోభం గలవారే ముందు తరాల వారికి కూడా సంపదను కూడబెట్టగలరు. ధనలోభం గలవారే లక్ష్మీపుత్రులు. సిరిసంపదలతో తులతూగుతారు. నచ్చిన ఆహారం తినగలరు. చక్కగా, విలాసవంతంగా బ్రతకగలరు. అనారోగ్యం వచ్చినా ఖరీదైన వైద్యం చేయించుకోగలరు. అందుకే “పశువుకు తిన్నది బలం. మనిషికి ఉన్నది బిలం” అన్నారు. కలిమి కలవాడే కలవాడు. లేనివాడు లేనివాడే కదా!

ప్రశ్న 3.
ఈ పాఠానికి పెట్టిన శీర్షికను విశ్లేషిస్తూ చెప్పండి.
జవాబు:
ఈ పాఠానికి ఉన్న శీర్షిక ‘ధన్యుడు’. ధన్యుడు ఎవరనేది పాఠ్య రచయిత స్పష్టంగా చెప్పాడు. ‘ఉదరముకయి పరుల గోఁజక ప్రాప్తిలాభమునకు సంతోషించువాఁడొక్కడు లోకమందు ధన్యుడు’ అని మూడవ పేరాలో హిరణ్యకుని చేత రచయిత (చిన్నయసూరి) చెప్పించాడు.

సన్న్యాసికి ధనం మీద వ్యామోహం ఉండకూడదు. కాని, చూడాకర్ణుడనే సన్న్యాసికి ధనమే గొప్పదనే భావం ఉంది. ధనహీనుని చేయడానికి హిరణ్యకుని బాధించాడు. అతని వేషం సన్న్యాసి వేషం, మనసు మాత్రం క్రూరమైనది.

హిరణ్యకుడు ధనం పోగుచేసినాడు. అది పోగానే జ్ఞానం కలిగింది. తన పొట్ట నింపుకోవడానికి ఇతరులను బాధించకూడదనే జ్ఞానం పొందాడు. ధన్యుడయ్యాడు.

ధన్యుడు కావాలంటే వేషం కాదు, ఆత్మ పరిశీలన కావాలి. ఆత్మ పరిశీలనతో తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి . అని చెప్పకుండానే పాత్రల ద్వారా, సన్నివేశాల ద్వారా నిరూపించిన ఈ పాఠానికి ‘ధన్యుడు’ అనే శీర్షిక చక్కగా సరిపోయింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 4.
ఈ కింది వాక్యాలు ఎవరు, ఎవరితో అన్నారో గుర్తించి రాయండి.

అ) “అనృత మాడుట కంటె మౌనము మేలు.”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పరవస్తు చిన్నయసూరి రచించిన నీతిచంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహింపబడిన ధన్యుడు అను పాఠంలోనిది.

సందర్భం :
చూడాకర్ణుని చేతిలో తన సర్వస్వము కోల్పోయిన హిరణ్యకుడు ఒక అడవిలో ఉండెను. తన గతమును మంథరునితో చెప్పుచున్న సందర్భంలో పలికిన వాక్యమిది. భావం : అసత్యము పలకడం కంటే మౌనంగా ఉండడం మంచిది.

ఆ) “దీని కేమైనను నిమిత్తము లేక మానదు.”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పరవస్తు చిన్నయసూరి రచించిన నీతిచంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహింపబడిన ధన్యుడు అను పాఠంలోనిది.

సందర్భం :
చంపకవతి అనే పట్టణంలోని చూడాకర్ణుని వద్దకు వీణాకర్ణుడు వచ్చాడు. మాటలలో చూడాకర్ణుడు తను చిలుకకొయ్య పై పెట్టిన ఆహారాన్ని హిరణ్యకుడు కాజేస్తున్న విషయం చెప్పాడు. ఒక ఎలుక చిలుక
కొయ్యపైకి ఎగరడానికి బలమైన కారణమేదో ఉండాలని వీణాకర్ణుడు పలికిన సందర్భంలోని వాక్యమిది.

భావం :
ఒక ఎలుక చిలుకకొయ్య అంత ఎత్తు ఎగరడానికి తప్పనిసరిగా ఏదో కారణం ఉంటుంది.

ఇ) “సత్సంగతి కంటే లోకమందు మేలేదియు లేదు.”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పరవస్తు చిన్నయసూరి రచించిన నీతిచంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహింపబడిన ధన్యుడు అను పాఠంలోనిది.

సందర్భం :
తన గతమును మంథరునితో హిరణ్యకుడు చెప్పాడు. తన సర్వస్వం కోల్పోయి అరణ్యానికి చేరానన్నాడు. ఆ నిర్జనారణ్యంలో లఘుపతనకునితో తనకు స్నేహం ఏర్పడడం తన అదృష్టమని చెప్తూ పలికిన వాక్యమిది.

భావం :
మంచివారితో స్నేహం కంటే మంచిదేదీ ఈ లోకంలో లేదు.

ప్రశ్న 5.
కింది పద్యాన్ని చదివి, భారాన్ని పూరించండి.
“ఒక్కడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి కార్యమైన దాఁ
జక్కనొనర్చుఁగారవు లసంఖ్యులు పట్టిన ధేనుకోటులం
జక్కగనీక తబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కవడంగ జేసి తుదముట్టఁడె యొక్క కిరీటి భాస్కరా!

భావం:
………………………. ఎంతటి పని ఐనా ……………………… ఆవుల మందను .. ……………… తన బాణాలతో ఆ బలమైన …………….. అర్జునుడే కదా!
జవాబు:
ఒక బలవంతుడు చాలు ఎంతటి పని అయినా చేయడానికి. కౌరవులనేకమంది పట్టిన ఆవుల మందను విడిపించాడు. వాడియైన , 5 బాణాలతో ఆ బలమైన సైన్యాన్ని బాధించి, విజయం సాధించినవాడు అర్జునుడే కదా !

II. వృశికరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) “సంసార విషవృక్షమునకు రెండు ఫలము లమృతతుల్యములు” పాఠాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని గురించి వివరించండి.
జవాబు:
సంసార విషవృక్షానికి రెండు ఫలాలు అమృతంతో సమానమైనవి. అవి :

  1. కావ్యమునందలి అమృతము వంటి మంచి విషయమును తెలుసుకొనడం.
  2. మంచివారితో స్నేహం.

ప్రస్తుత పాఠం పరిశీలించినట్లైతే హిరణ్యకుడు సంసారంపై వ్యామోహంతో చాలా సంపాదించి దాచాడు. అంటే సంసారమనే విషవృక్షానికి తనను తానే బఁ “ని చేసుకొన్నాడు. ఆ ధనమదంతో చూడాకర్ణుని ఆహారాన్ని చిలుక కొయ్యపైకి ఎగిరి కాజేసేవాడు. ఎంతో గర్వంతో బ్రతికాడు. ఆ సన్న్యాసిని ముప్పుతిప్పలు పెట్టాడు.

సంపాదించినదంతా పోయింది. చూడాకర్ణుడు ఎలుక కలుగును త్రవ్వి, దాని సంపదంతా హరించాడు. అప్పటితో హిరణ్యకుని ధన గర్వం తగ్గింది. వీణాకర్ణుని మాటలతో అజ్ఞానం పోయింది. ధనం కలవాడే బలవంతుడు. ధనం లేనివాడు మరణించినట్లే అని వీణాకర్ణుడు చెప్పాడు. దానితో పర ధనం మీద వ్యా మోహం విడిచిపెట్టి అడవికి చేరాడు. ఆ సన్న్యాసి చెప్పిన మంచిమాటలు కావ్యామృతం వంటివి.

రెండవ ఫలం సజ్జన స్నేహం. అది లఘుపతనకునితో స్నేహం. లఘుపతనకుని వంటి ఉత్తమునితో స్నేహం ఏర్పడింది. దానితో హిరణ్యకునికి పరిపూర్ణంగా జ్ఞానం కలిగింది. ఈ విధంగా హిరణ్యకుడు ధన్యుడయ్యాడు.

ఆ) “వివేకహీనుడైన ప్రభువును సేవించుటకంటె వనవాస ముత్తమం” – దీని ఔచిత్యాన్ని గురించి చర్చించండి.
జవాబు:
వివేకవంతుడైన ప్రభువు తన వారి గురించి ఆలోచిస్తాడు. తనను సేవించే వారి సౌఖ్యానికి ప్రాధాన్యం ఇస్తాడు. సేవకులకు సౌఖ్యాలు కల్పిస్తే నిరంతరం ప్రభువు సేవలో అప్రమత్తులై ఉంటారు.

వివేకహీనుడైన ప్రభువు తనగురించి ఆలోచిస్తాడు. తన సౌఖ్యమే చూసుకొంటాడు. తన సేవకులను పట్టించుకోడు. సేవకులకు జీతభత్యాలను సక్రమంగా ఇవ్వడు. దానితో అర్ధాకలి బ్రతుకులు తప్పవు. అర్ధాకలి భరించలేక డబ్బుకోసం తప్పులు చేయాలి. అంటే ప్రభు ద్రోహానికి పాల్పడాలి. అది మహాపాపం. మన శక్తియుక్తులన్నీ రాజు క్షేమానికి ఉపయోగపడాలి. కాని, వివేకహీనుడైన ప్రభువు విషయంలో అది సాధ్యం కాదు. అందుచేత అటువంటి ప్రభువు సేవను విడిచిపెట్టి వనవాసం చేయడం నయం. అడవిలో దుంపలు, పళ్ళు తింటూ దైవధ్యానం చేసుకొంటూ మునుల వలే జీవించడం మంచిది. వివేకహీనుడైన ప్రభువు రక్షించడు. అడవిలోనూ రక్షణ ఉండదు. కాని, వివేకహీనుడైన ప్రభువును సేవించలేక పాపాలు చేయాలి. అడవిలో అయితే పుణ్యం సంపాదించుకోవచ్చు. అందుచేత వివేకం లేని ప్రభువును సేవించడం కంటే వనవాసమే మంచిది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ఇ) చిన్నయసూరిని గూర్చిన విశేషాలు రాయండి.
జవాబు:

  1. పరవస్తు చిన్నయసూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో “శ్రీ పెరంబుదూర్”లో జన్మించాడు. ఈయన మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.
  2. ఈయన తమిళం, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి పండితుడు. ‘సూరి’ అనేది ఈయన బిరుదు.
  3. చిన్నయసూరి బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహం వంటి గ్రంథాలు రాశాడు. ఈయన రాసిన బాలవ్యాకరణం నేటికీ ప్రామాణిక గ్రంథం.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) ‘అర్థనాశం, మనస్తాపం, గృహమందలి దుశ్చరితం, వంచనం, పరాభవం’ – ఈ పదాల గురించి మీరు ఏరకంగా అర్థం చేసుకున్నారో సోదాహరణంగా రాయండి.
జవాబు:
అర్థనాశం :
అర్థనాశం అంటే డబ్బు నశించిపోవడం, కష్టపడి సంపాదించినదంతా, తనకు, తనవారికి కాకుండా పోవడం. ‘ధన్యుడు’ కథలో హిరణ్యకుడు ఎంతో కష్టపడి, ఎన్నో రోజులు కూడబెట్టాడు. కూడబెట్టిన ధనమంతా తన కలుగులో దాచుకొన్నాడు. చూడాకర్ణుడు గునపంతో ఆ కలుగు తవ్వి ఆ సంపదంతా కొల్లగొట్టాడు. హిరణ్యకునికి అర్థనాశం కలిగింది.

మనస్తాపం :
మనసుకు బాధ కలగడం. చేయని తప్పుకు నిందమోపినా మనస్తాపం కలుగుతుంది. సంపదంతా పోయినా మనస్తాపం కలుగుతుంది. హిరణ్యకుని సంపదంతా పోవడం వలన మనస్తాపం కలిగింది.

గృహమందలి దుశ్చరితం :
మన ఇంట్లో అందరూ సమాజంలో మంచి పేరు తెచ్చుకొంటే ఆనందం. ఎవరైనా కొందరు చెడ్డ పేరు తెచ్చుకొంటే అది ఇంట్లో వారందరినీ బాధిస్తుంది. సమాజంలో ఆ ఇంటికి గౌరవం తగ్గుతుంది. అందరూ చులకనగా చూస్తారు. హిరణ్యకుని సంపద పోయాక అక్కడ ఉండలేక అడవికి వెళ్లిపోయింది.

వంచనం:
వంచనం అంటే మోసం. మనం మోసం చేయడం తప్పు. మోసపోవడం అవమానం. హిరణ్యకుడు రోజూ చూడాకర్ణుని వంచించి ఆహారం దొంగిలించాడు. తన సంపద పోయాక ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు.

పరాభవం :
పరాభవం అంటే అవమానం. పరాభవం జరిగితే ఎవరికీ చెప్పుకోకూడదు. చెప్పుకొంటే గౌరవం పోతుంది. ఈ పాఠంలో హిరణ్యకుని సంపదంతా చూడాకర్ణుడు కొల్లగొట్టాడు. అప్పుడు హిరణ్యకునికి విరక్తి కలిగింది. పరాభవం జరిగినచోట ఉండకూడదని అడవిలోకి మకాం మార్చాడు.

ఆ) మంథరుని మాటలను మీరు సమర్థిస్తారా? ఎందుకు?
జవాబు:
మంథరుడు “ధనము, యౌవనము, నిత్యములు కావనీ, జీవితం బుడగవంటిదనీ సత్యము” చెప్పాడు. ధనము ఏదో రకంగా పోవచ్చు. వయస్సు తరిగి పోయి, మరణం వస్తుంది. ప్రాణం, నీటిమీద బుడగలా ఎప్పుడయినా పోవచ్చు. ఇవన్నీ కఠోర సత్యములు.

అందువల్ల బుద్ధిమంతుడు ధనము, యౌవనము, ప్రాణము ఉన్నప్పుడే, ధర్మములు చేయాలి. లేకపోతే తరువాత బాధపడవలసి వస్తుంది. కాబట్టి మంథరుని మాటలను, నేను గట్టిగా సమర్థిస్తాను.

3. కింది అంశాలకు సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) చూడాకర్ణునికి, వీణాకర్ణునికి మధ్య జరిగిన మాటలను సంభాషణా రూపంలో రాయండి.
జవాబు:
చూడాకర్ణుడు : రండి, మిత్రమా ! వీణాకర్ణా! కూర్చోండి.

వీణాకర్ణుడు – : (కూర్చొని) ఏమిటి విశేషాలు?

చూడాకర్ణుడు : (గిలుక కల్బుతో నేలమీద కొడుతూ) ఏమున్నాయి. మీరు రావడమే విశేషం.

వీణాకర్ణుడు : అదేమిటి ? అలా నేలపై కొడుతున్నారెందుకు?

చూడాకర్ణుడు : ఎలుకను బెదిరించడానికి,

వీణాకర్ణుడు : మరి, పైకి చూస్తున్నారెందుకు?

చూడాకర్ణుడు : ప్రతిరోజూ చిలుకకొయ్యమీద దాచుకొన్న అన్నం ఒక ఎలుక తినేస్తోంది. దాని బాధ పడలేకపోతున్నాను.

వీణాకర్ణుడు : చిలుకకొయ్య ఎక్కడ? ఎలుక ఎక్కడ? అంత చిన్న ఎలుక అంత ఎత్తు ఎగురుతోందా? అయితే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది.

చూడాకర్ణుడు : చాలాకాలం నుండీ ఎలుక ఒక కన్నంలో ఉంది. దానికి కారణం తెలియట్లేదు. తవ్వి చూస్తాను.

వీణాకర్ణుడు : ఏమైనా దొరికిందా?

చూడాకర్ణుడు : చూడండి! ఎంత ఆహారం దాచిందో. దీని బలమంతా ఈ సంపదే. ఈ సంపదంతా లాగేస్తాను.

వీణాకర్ణుడు : పూర్తిగా లాగేయండి. ఏదీ వదలకండి.

చూడాకర్ణుడు : చూడండి. పూర్తిగా ఖాళీ చేసేశాను. ఇంక దీని పని అయిపోయింది.

వీణాకర్ణుడు : ఆ ఎలుక చూడండి. ఎంత మెల్లిగా కదులుతోందో ! బక్కచిక్కిపోయింది కదా ! ఎందుకంటారండీ! అంతలా కృశించిపోయింది.

చూడాకర్ణుడు : ధనం కలవాడే బలవంతుడు. ధనం ఉన్నవాడే పండితుడు.

వీణాకర్ణుడు : ధనం లేకపోతే ఏమవుతుంది?

చూడాకర్ణుడు : ధనం లేకపోతే నిరంతరం బాధగా ఉంటుంది. ఆ బాధలో బుద్ది పనిచేయదు. బుర్ర పనిచేయకుంటే అన్ని పనులూ పాడవుతాయి. సమస్తం శూన్యమవుతుంది.

వీణాకర్ణుడు : దరిద్రం అంత బాధాకరమా?

చూడాకర్ణుడు : దారిద్ర్యం చాలా బాధాకరం. అంతకంటే మరణం మంచిది.

వీణాకర్ణుడు : ఇవి విని, ఎలుక వెళ్ళిపోతోందండోయ్.

చూడాకర్ణుడు : ఇంక ఆ ఎలుక రాదు. దాని పీడ నాకు విరగడయ్యింది. అందుకే ‘ఊరక రారు మహాత్ములు’ అన్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ఆ) ఈ కథను ఓ చిన్న నాటికగా రాయండి.
జవాబు:
పాత్రలు – చూడాకర్ణుడు, వీణాకర్ణుడు, లఘుపతనకుడు, మంథరుడు, హిరణ్యకుడు.

మంథరుడు : లఘుపతనకా ! మిత్రమా! ఎవరీ కొత్త మిత్రుడు?

లఘుపతనకుడు : స్నేహితుడా ! ఇతను చాలా పుణ్యాత్ముడు. చాలా గొప్పవాడు.

మంథరుడు : ఈ కొత్త మిత్రుని పేరు?

లఘుపతనకుడు : హిరణ్యకుడు. పేరుకు తగ్గట్టే బంగారంలాంటివాడు,

మంథరుడు .: నా స్నేహితుడికి స్నేహితుడవంటే నాకూ స్నేహితుడివే.

హిరణ్యకుడు : అలాగే ! మిత్రమా ! మన ముగ్గురమింక ప్రాణ స్నేహితులం.

మంథరుడు : నీ గురించి చెప్పలేదు. ఈ నిర్ణనవనంలో ఎందుకున్నావు?

హిరణ్యకుడు : అదొక పెద్ద కథ. నా జీవితం ఇప్పటికి కుదుటపడింది.

మంథరుడు : ఏఁ ఏమయ్యింది? మిత్రుని వద్ద దాపరికమా?

హిరణ్యకుడు : లేదు. లేదు. నిన్ను , నా గతంలోకి తీసుకువెళతాను. పద. (చూడాకర్ణుడు, వీణాకర్ణుడు ఉంటారు.)

చూడాకర్ణుడు : మిత్రమా! వీణాకర్ణా! రండి. రండి.

వీణాకర్ణుడు : ఈ చంపకవతీ నగరం వస్తే మిమ్మల్ని చూడందే వెళ్లలేను.

చూడాకర్ణుడు : ఏమిటి విశేషాలు?

వీణాకర్ణుడు : ఏవో మంచి విషయాలు చెబుతారనే వచ్చాను.

చూడాకర్ణుడు : (గిలుక కర్రతో నేలపై కొడుతూ, చిలుకకొయ్య వైపు చూస్తుంటాడు.)

వీణాకర్ణుడు : ఇదేమైనా ఆధ్యాత్మిక సాధనా?

చూడాకర్ణుడు : అదేమీ లేదు. నా తలరాత.

వీణాకర్ణుడు : అదేమిటి?

చూడాకర్ణుడు : ఏం చెప్పనండీ ! ఆ చిలుకకొయ్యపై ఉన్న భిక్షాన్న శేషాన్ని ఒక ఎలుక తినేస్తోంది.

వీణాకర్ణుడు : ఒక ఎలుక అంత ఎత్తు ఎగురుతోందంటే, తప్పకుండా దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది.

చూడాకర్ణుడు : అది ఒక కన్నంలో ఉండి, నా ఆహారం దోచుకొంటోంది.

వీణాకర్ణుడు : ఆ కలుగులోనే దాని సంపద ఉంటుంది. తవ్వండి.

చూడాకర్ణుడు : (తవ్వినట్లు నటిస్తూ) అమ్మో ! అమ్మో ! ఎంత సంపద? తవ్వేకొలదీ వస్తోంది. ఇంక దీని పని అయిపోయింది. (ఇంతలో హిరణ్యకుడు కృశించి, మెల్లగా తిరుగుతుంటాడు.)

వీణాకర్ణుడు : పాపం! హిరణ్యకుని చూశారా? ఎంత నీరసపడ్డాడో!

చూడాకర్ణుడు : ధనము కలవాడే బలవంతుడు. ధనం కలవాడే పండితుడు. ధనమే సర్వ శ్రేయాలకు మూలం.

వీణాకర్ణుడు : మరి, ధనం లేకపోతే?

చూడాకర్ణుడు : (నవ్వుతూ) ధనం లేకపోతే నిరంతరం బాధ కలుగుతుంది. ఆ బాధతో వివేకం నశిస్తుంది. వివేకం లేకపోతే ఏ పనీ సాధించలేము. అందరూ దూరమౌతారు.

హిరణ్యకుడు : (ఆలోచిస్తూ తనలో) నిజమే ! ఈ బాధ ఎవరికీ చెప్పుకోలేను. ఈ అవమానం భరించలేను. అయినా ఇక్కడే ఉంటాను. మళ్ళీ సంపాదిస్తాను.

వీణాకర్ణుడు : అదుగోనండోయ్. ఆ ఎలుక మిమ్మల్ని వదల్లేదండోయ్.

చూడాకర్ణుడు : దీని అంతు చూస్తా. (ఎలుకపై కర్ర విసిరాడు)

హిరణ్యకుడు : (తనలో) అమ్మో! చచ్చాను. హమ్మయ్య తప్పించుకొన్నాను. ఇంక ఈ ధనవ్యామోహం వదిలేస్తా. నిర్జనవనానికి పోతాను. ఆ భగవంతుడే కాపాడుతాడు. (మంథరుడు, హిరణ్యకుడు అడవిలో ఉంటారు.)

మంథరుడు : కళ్లకు కట్టినట్లుగా మీ గతం చెప్పారు.

హిరణ్యకుడు : ఇప్పుడు మీ స్నేహంలో నాకది ఒక పీడకల.

లఘుపతనకుడు : మీ ఇద్దరూ నన్ను వదిలేశారు.

మంథరుడు, హిరణ్యకుడు : ప్రాణాలైనా వదుల్తాం కానీ, స్నేహాన్నీ, మంచి స్నేహితులనీ వదలలేం.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

పాఠశాల గ్రంథాలయంలో పంచతంత్ర కథల పుస్తకంలోని కథలను చదవండి. మీకు నచ్చిన కథను మీ సొంతమాటల్లో రాసి ప్రదర్శించండి.
జవాబు:
మితిమీరిన ఆశ (పంచతంత్ర కథ)
ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. సింహం, పులి వంటి జంతువులు వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తిని, అది జీవించేది.

ఒకరోజు ఒక వేటగాడు లేడిని చంపి, దాన్ని భుజాన వేసుకొని వస్తున్నాడు. ఇంతట్లో అతడికి ఒక పెద్ద అడవి పంది కనిపించింది. అతడు గురి చూసి పందిపై బాణం వేశాడు. బాణం గురి తప్పింది. పందికి గట్టి గాయం అయ్యింది. పంది కోపంతో వేటగాడిమీదికి దూకి, వాడిని చంపింది. పంది కూడా ప్రాణం విడిచింది. ఒక పాము పంది కాళ్ళ కిందపడి నలిగి చచ్చింది.

ఇంతలో ఆ దారినే వస్తూ నక్క చచ్చి పడియున్న మనిషినీ, పందినీ, పామునూ, లేడినీ చూసింది. ఒక్కసారిగా దానికి ఎంతో మాంసం దొరికింది. దానికి అసలే దురాశ గదా! వేటగాడి బాణంకు ఒక నరం బిగించి ఉంది. మిగిలిన మాంసం తరువాత తినవచ్చు. ముందు ఆ నరం తిందాము అనుకుంది నక్క.

నరాన్ని నక్క కొరికింది. బిగించిన ఆ నరం తెగి, ఊపుగా సాగి, నక్క గుండెను బలంగా తగిలింది. నక్క వెంటనే మరణించింది.

కథలోని నీతి : దురాశ దుఃఖానికి చేటు.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాలకు అర్థాన్ని మీ సొంత పదాల్లో రాయండి.

అ) బుద్ధిహీనత వల్ల సమస్తకార్యములు నిదాఘ నదీపూరములట్లు వినాశము నొందును.
జవాబు:
నిదాఘము అంటే వేసవికాలం. నదీ పూరములు అంటే నదులలోని నీటి ప్రవాహాలు, నిదాఘ నదీపూరములు అంటే మండువేసవిలో నదులలోని నీటి ప్రవాహాలు.

పని నెరవేరాలంటే వివేకం కావాలి. అంటే ఏది మంచో, ఏది చెడో తెలియాలి. వివేకం లేకపోతే అన్ని పనులూ వేసవిలో నదీ జలప్రవాహాలవలె ఆవిరైపోతాయి. అంటే పనులన్నీ పాడవుతాయి

ఆ) ధనమును బాసిన క్షణముననే లాతివాఁడగును.
జవాబు:
ధనము ఉంటే స్నేహితులు ఎక్కువవుతారు. అవసరమున్నా, లేకపోయినా అందరూ పలకరిస్తారు. ఇక బంధువులైతే ఏదో వంకతో వస్తారు. బంధువులు కానివారు కూడా ఆ ధనవంతుడు మావాడే అని చెప్పుకొంటారు. మా ఊరువాడు, మా జిల్లా వాడు, మా రాష్ట్రం వాడు, మా దేశం వాడే అని చెప్పుకొంటారు.

కాని ధనం పోతే ఎవ్వరూ పలకరించరు. పరిచయం లేనట్లు ఉంటారు. అందరికీ పరాయివాడు (లాతివాడు) అవుతాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ఇ) పరధనాపహరణము కంటె దిరియుట మంచిది.
జవాబు:
పరధనము పాము వంటిది. ఇతరుల వస్తువులను వేటినీ దొంగిలించకూడదు. మనకి ఉన్న దానితోటే తృప్తి పడాలి. ‘ లేకపోతే యాచించుట (తిరీయుట) మంచిది. అంటే పరధనాన్ని దొంగిలించడం మంచిది కాదు. అంతకంటె యాచన ద్వారా జీవించడం నయం.

ఈ) ఉదరమునకయి పరుల గోజక ప్రాప్త లాభమునకు సంతోషించు వాఁడొక్కడు లోకమందు ధన్యుడు.
జవాబు:
మన ఉదరము నింపుకోవడానికి అంటే మనం జీవించడం కోసం ఇతరులను పీడించకూడదు. దొరికిన దానితో సంతృప్తి పడుతూ ఆనందంగా జీవించేవాడే ధన్యుడు. అంటే సంతోషమనేది సంతృప్తిని బట్టి ఉంటుంది. కాని, సంపదని బట్టి ఉండదు.

2. కింది పదాలకు ప్రకృతి – వికృతులను పాఠం నుండి వెతికి ఆ వాక్యాలను రాయండి.
అ) బోనం : భోజనము
జవాబు:
అతడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలో బెట్టి చిలుకకొయ్యమీద నుంచి నిద్రపోవును.

ఆ) శబ్దం : సద్గు
జవాబు:
నేను సద్దు చేయక దానిమీది కెగిరి ప్రతిదినమావంటకము భక్షించి పోవుచుండును.

ఇ) కర్షం : కార్యము
జవాబు:
బుద్దిహీనత వలన సమస్త కార్యములు నిదాఘ నదీపూరములట్లు వినాశము నొందును.

ఈ) గీము : గృహము
జవాబు:
పుత్ర, మిత్ర, విరహితుని గృహమును, మూర్చుని చిత్తమును శూన్యములు.

ఉ) గారవం : గౌరవము
జవాబు:
సేవా వృత్తి మానమును వలె, యాచనా వృత్తి సమస్త గౌరవమును హరించును.

ఊ) చట్టం : శాస్త్రము
జవాబు:
వాడే సర్వశాస్త్రములు చదివిన వాడు.

ఋ) దమ్మము : ధర్మము
జవాబు:
వాడే సర్వ ధర్మము లాచరించినవాడు.

ఋ) సంతసం : సంతోషము
జవాబు:
ఉదరముకయి పరుల గోజక ప్రాప్తి లాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు.

3. వ్యుత్పత్త్యర్థాలు రాయండి.

అ) పుత్రుడు
జవాబు:
పున్నామ నరకము నుంచి రక్షించువాడు

ఆ) దేహి
జవాబు:
దేహాన్ని ధరించినవాడు

ఇ) ఈశ్వరుడు
జవాబు:
ఐశ్వర్యము ఉన్నవాడు

ఈ) మూషికము
జవాబు:
అన్నాదులను దొంగిలించునది

4. నానార్థాలు రాయండి.

అ) వివరము
జవాబు:
వివరణము, దూషణము

ఆ) వనము
జవాబు:
అడవి, నీరు, గుంపు

ఇ) ఫలము
జవాబు:
పండు, ప్రయోజనము, సంతానం

ఈ) అమృతము
జవాబు:
సోమరసము, వసనాభి, పరబ్రహ్మము

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

5. పర్యాయపదాలు రాయండి.

అ) జంతువు
జవాబు:
పశువు, జింక, అన్వేషణము

ఆ) మూర్ధము
జవాబు:
మస్తకము, శీర్షము, ఉత్తమాంగము

ఇ) బలము
జవాబు:
అంబ, బిరుదు, సత్తువ

ఈ) వివరము
జవాబు:
రంధ్రం, బిలం, కలుగు

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లోని సంధి పదాలను గుర్తించి, వాటిని విడదీయండి. అవి ఏ సంధులో సూత్రయుక్తంగా తెల్పండి.

అ) అందుఁ జూడాకర్ణుఁడను పరివ్రాజకుఁడు గలడు.
సంధి పదాలు :

  1. అందుఁజూడాకర్ణుఁడు
  2. చూడాకర్ణుఁడను
  3. పరివ్రాజకుఁడు గలడు.

వివరణ :
సరళాదేశ సంధి

1) అందున్ + చూడాకర్ణుఁడు
సూత్రము 1: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.

అందున్ + చూడాకర్ణుఁడు
సూత్రము 2 : ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి.

అందుంజూడాకర్ణుఁడు (పూర్ణబిందు రూపం)
అందుఁజూడాకర్ణుఁడు (అర్ధబిందు రూపం)
అందున్టూడాకర్ణుఁడు (సంశ్లేష రూపం)
అందుజూడాకర్ణుఁడు (విభాష వలన మార్పు రాని రూపం)

2) చూడాకర్ణుఁడను
వివరణ : ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
చూడాకర్ణుఁడు + అను – (ఉ + అ = అ)

3) పరివ్రాజకుఁడు గలడు
వివరణ : గసడదవాదేశ సంధి
సూత్రము : ప్రథమ (డు, ము, వు, లు) మీది పరుషములకు (క, చ, ట, త, ప లకు) గ, స, డ, ద, వలు బహుళంబుగానగు.

పరివ్రాజకుఁడు + కలడు = పరివ్రాజకుఁడు గలడు.

ఆ) తడవులఁ బట్టి ఈ యెలుక విడువక వాసము చేయుచున్నది.
సంధి పదాలు :

  1. తడవులఁబట్టి
  2. ఈ యెలుక
  3. చేయుచున్నది

1) తడవులన్ + పట్టి
వివరణ : సరళాదేశ
సంధి సూత్రము 1: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
తడవులన్ + బట్టి

సూత్రము 2 : ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.
తడవులంబట్టి (పూర్ణబిందు రూపం)
తడవులఁబట్టి (అరబిందు రూపం)
తడవులనబట్టి (సంశ్లేష రూపం)
తడవుల్బట్టి (విభాష వలన మార్పు రాని రూపం)

2) ఈ యెలుక
వివరణ : యడాగమం
ఈ + ఎలుక = ఈ యెలుక.
సూత్రము : సంధి లేనిచోట స్వరంబుకంటే పరమయిన స్వరమునకు యడాగమంబగు.

3) చేయుచున్నది
వివరణ : ఉత్వసంధి
చేయుచు + ఉన్నది = చేయుచున్నది.
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

పై వాక్యాలలో సరళాదేశ, గసడదవాదేశ, ఉత్వ సంధులు, యడాగమము ఉండటాన్ని గమనించారు కదా ! ఈ పాఠంలో సరళాదేశ, గసడదవాదేశ సంధి పదాలు ఇంకా ఏమేమున్నాయో గుర్తించి, సంధి సూత్రాలను రాయండి.

1. సరళాదేశ సంధి
సూత్రములు :

  1. ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
  2. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.

పాత్రలోఁబెట్టి = పాత్రలోన్ + పెట్టి
అడుగగాఁజూడాకర్ణుడు = అడుగగాన్ + చూడాకర్ణుడు
తడవులఁబట్టి = తడవులన్ + పట్టి
సంపాదించుకొనఁ జాలక = సంపాదించుకొనన్ + చాలక
ఉండగాఁజూచి = ఉండగాన్ + చూచి
పరులతోఁ జెప్పికోలును = పరులతోన్ + చెప్పికోలును
ప్రకాశింపఁజేయ = ప్రకాశింపన్ + చేయు
చేయఁదగదు = చేయన్ + తగదు
అపహరణము కంటెఁ దిరియుట = అపహరణము కంటెన్ + తిరియుట
వలనఁ దప్పిపోయినది = వలనన్ + తప్పిపోయినది
నన్నుఁ గఱ్ఱతో = నన్నున్ + కఱ్ఱతో
ఇంకఁదావు = ఇంకన్ + తావు
నన్నుఁ గాపాడకుండునా = నన్నున్ కాపాడకుండునా
వనములోఁ గాయగసరులు = వనములోన్ + కాయగసరులు

2) గసడదవాదేశ సంధి
సూత్రము :
ప్రథమమీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.
పట్టణము గలదు = పట్టణము + కలదు
ధనము గలవాడె +ధనము + కలవాడె
మూలము గదా = మూలము + కదా
కాణాచి గాదు = కాణాచి + కాదు
మోఁదులు వడి = మోదులు + పడి

3) గసడదవాదేశ సంధి
సూత్రము :
ద్వంద్వంబునందు పదంబుపయి పరుషములకు గసడదవలగు.
పెట్టువోతలు = పెట్టు + పోత
కాయగసరులు = కాయ + కసరు

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

2. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసాలను పేర్కొనండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) ఉదా :
చంపకవతి పట్టణము
చంపకవతి అనే పేరుగల పట్టణము సంభావనా పూర్వపద కర్మధారయము
ఆ) మహాభాగ్యము గొప్పదైన భాగ్యము విశేషణ పూర్వపద కర్మధారయము
ఇ) సేవావృత్తి సేవయే వృత్తి అవధారణ కర్మధారయ సమాసం
ఈ) పదాబ్జములు అబ్జముల వంటి పదములు ఉపమాన ఉత్తరపద కర్మధారయము
ఉ) కలువకన్నులు కలువల వంటి కన్నులు ఉపమాన పూర్వపద కర్మధారయము
ఊ) మామిడిగున్న గున్నయైన మామిడి విశేషణ ఉత్తరపద కర్మధారయము
ఎ) మృదుమధురము మృదువును, మధురమును విశేషణ ఉభయపద కర్మధారయము

3. పుంప్వాదేశ సంధి
కింది పదాలు విడదీయండి. మార్పును గమనించండి.
ఉదా :
అచ్చపు పూలతోట = అచ్చము + పూలతోట
అ) నీలపు గండ్లు = నీలము + కండ్లు
ఆ) ముత్తెపుసరులు = ముత్తెము + సరులు
ఇ) సరసపుమాట = సరసము + మాట

పైనున్న అన్ని సంధులలోనూ మొదటి పదం విశేషణం, రెండవ పదం విశేష్యం (నామవాచకం). అంటే పైవన్నీ కర్మధారయ సమాసాలే కదా! సంధి జరిగినపుడు మొదటి పదంలో చివరగల ‘ము’ లోపించింది. దానికి బదులుగా ‘పు’ వచ్చింది. ఒక్కొక్కసారి పూర్ణబిందు పూర్వక పు (ంపు) కూడా రావచ్చును. ‘పు’, ‘ంపు’ ఆదేశమవ్వడాన్ని పుంప్వాదేశం అంటారు. అందుకే దీన్ని పుంప్వాదేశ సంధి అన్నారు.

దీనికి సూత్రము:
కర్మధారయంబున ‘ము’ వర్ణకమునకు పు, పులగు.
అ) సింగప్తుకొదమ = సింగము + కొదమ
ఆ) ముత్యపుచిప్ప = ముత్యము + చిప్ప
ఇ) కొంచపునరుడు = కొంచము + నరుడు

4. వచనంలో శైలీ భేదం :
కింది వాక్యాలు చదవండి. భేదాలు గమనించండి.

అ) ఆ పరివ్రాజకుడు సెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనయితిని.
ఆ) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.
ఇ) ఆ సన్యాసి జెప్పింది యిని శానా దుక్కమొచ్చింది.

మొదటి వాక్యం , ప్రాచీన శైలిని తెలుపుతుంది. దీనినే ‘గ్రాంథికం’ అని కూడా అంటారు. ‘ధన్యుడు’ పాఠమంతా ఈ శైలిలోనే నడుస్తుంది.

రెండవ వాక్యం శిష్టవ్యవహార శైలిని అనుసరించి ఉంది. ఇది విద్యావంతులు ఉపయోగించేది.

మూడవ వాక్యం నిరక్షరాస్యులు ఉపయోగించే పద్ధతి. ఇది స్థానిక మాండలిక పదాలతో ఉంటుంది.

కాలాన్ననుసరించి, ప్రాంతాన్ననుసరించి, సందర్భాన్ని బట్టి భాషను ఉపయోగించే విధానంలో మార్పు ఉంటుంది. ఇది భాషలో వైవిధ్యమేగాని, గొప్ప, తక్కువ అనే సంకుచిత దృష్టికూడదు.

కనుక పై మూడూ అనుసరించ తగినవే. ఏదీ ఎక్కువా కాదు, ఏదీ తక్కువా కాదు దేని సొగసు దానిదే.

సాధారణంగా శిష్టవ్యవహారిక శైలినే చాలామంది ఈ రోజుల్లో రచయితలు ఉపయోగిస్తున్నారు. ఈ మార్పులలో ‘ంబు’, ‘ము’లు పోయి ‘0’ వస్తుంది.

ఉదా : కాలంబు, కాలము – ప్రాచీన గ్రాంథికం
కాలం – వ్యవహారికం
చూచి, వ్రాసి మొ||నవి – ప్రాచీన గ్రాంథికం
చూసి, రాసి మొ||నవి – వ్యవహారికం
యడాగమం, సరళాదేశాలు, గసడదవాదేశాలు – ప్రాచీన గ్రాంథికం
విసంధిచేయడం – వ్యవహారికం

కింది వాక్యాలను ఆధునిక వ్యవహార శైలిలోకి, స్థానిక మాండలిక శైలిలో మార్చండి.
గమనిక :
ఈ మార్పులు చేసేటప్పుడు ‘ము’ వర్ణాలు, బిందుపూర్వక ‘బు’ కారాలు (ంబు), యడాగమాలు, క్రియారూపాలు (చేయును, జరుగును, చూడుము ……… వంటివి మారడాన్ని) గమనించండి.

అ) వివేకహీనుడయిన ప్రభువును సేవించుట కంటె వనవాసముత్తమము.
జవాబు:
వ్యవహారికం :
వివేక హీనుడైన ప్రభువును సేవించడం కంటే వనవాసం ఉత్తమం.

ఆ) ఎలుక ప్రతిదినము చిలుకకొయ్య మీఁదికెగిరి పాత్రమునందున్న యన్నము భక్షించి పోవుచున్నది.
జవాబు:
వ్యవహారికం :
ఎలుక ప్రతిదినం చిలక్కొయ్య మీకెగిరి పాత్రలోని అన్నం భక్షించి పోతోంది.

ఇ) బుద్ధిహీనత వలస సమస్త కార్యములు నిదాఘ నదీపూరములట్లు వినాశము నొందును.
జవాబు:
వ్యవహారికం : బుద్ధిహీనత వల్ల సమస్త కార్యాలు నిదాఘ నదీపూరాలు లాగా వినాశమౌతాయి.

అదనపు సమాచారము

సంధులు

1) యాతనావహము = యాతనా + ఆవహము – సవర్ణదీర్ఘ సంధి
2) దైవానుకూల్యము = దెవ + ఆనుకూల్యము – సవర్ణదీర్ఘ సంధి
3) ధనాపహరణము = ధన + అపహరణము – సవర్ణదీర్ఘ సంధి
4) స్వాశ్రయము = స్వ + ఆశ్రయము – సవర్ణదీర్ఘ సంధి
5) సర్వాపదలు = సర్వ + ఆపదలు – సవర్ణదీర్ఘ సంధి
6) కర్మానురూపము = కర్మ + అనురూపము. – సవర్ణదీర్ఘ సంధి
7) శిలాంతరాళము = శిలా + అంతరాళము – సవర్ణదీర్ఘ సంధి
8) జీవనార్ధము = జీవన + అర్థము – సవర్ణదీర్ఘ సంధి
9) వచనామృతము = అమృతము – సవర్ణదీర్ఘ సంధి
10) శోకాగ్ని = శోక + అగ్ని – సవర్ణదీర్ఘ సంధి
11) చిరకాలోపార్జితము = చిరకాల + ఉపార్జితము – గుణసంధి
12) సత్వోత్సాహములు = సత్త్వ + ఉత్సాహములు – గుణసంధి
13) అతిసంచయేచ్చ = అతిసంచయ + ఇచ్ఛ – గుణసంధి
14) చెడగరపుబోడ = చెడగరము + బోడ – పుంప్వాదేశ సంధి
15) యావజ్జీవము = యావత్ + జీవము – శ్చుత్వసంధి
16) ఏమది = ఏమి + అది – ఇత్వ సంధి
17) ఏమయినను = ఏమి + అయినను – ఇత్వ సంధి
18) ప్రయాసపాటు = ప్రయాసము + పాటు – పడ్వాది సంధి
19) ఆయాసంపాటు = ఆయసము + పాటు – పడ్వాది సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) సత్వోత్సాహములు సత్త్వమును, ఉత్సాహమును ద్వంద్వ సమాసం
2) జవసత్త్వములు జవమును, సత్త్వమును ద్వంద్వ సమాసం
3) బంధుమిత్రులు బంధువులును, మిత్రులును ద్వంద్వ సమాసం
4) పెట్టుబోతలు పెట్టు, పోత ద్వంద్వ సమాసం
5) ధనహీనుడు ధనముచేత హీనుడు తృతీయా తత్పురుష సమాసం
6) వివేకహీనుడు వివేకముచే హీనుడు తృతీయా తత్పురుష సమాసం
7) దైవానుకూల్యము దైవము యొక్క అనుకూల్యము షష్ఠీ తత్పురుష సమాసం
8) కుసుమ స్తబకము కుసుమముల యొక్క స్తబకము షష్ఠీ తత్పురుష సమాసం
9) ధనాపహరణము ధనము యొక్క అపహరణము షష్ఠీ తత్పురుష సమాసం
10) యమలోకము యముని యొక్క లోకము షష్ఠీ తత్పురుష సమాసం
11) శిలాంతరాళము శిల యొక్క అంతరాళము షష్ఠీ తత్పురుష సమాసం
12) అమృత తుల్యము అమృతముతో తుల్యము తృతీయా తత్పురుష సమాసం
13) ధనలోభము ధనమందు లోభము సప్తమీ తత్పురుష సమాసం
14) సజ్జన సంగతి సజ్జనుల యొక్క సంగతి షష్ఠీ తత్పురుష సమాసం
15) మహాభాగ్యము గొప్ప అయిన భాగ్యము విశేషణ పూర్వపద కర్మధారయం
16) సర్వశ్రేయములు సర్వములయిన శ్రేయములు విశేషణ పూర్వపద కర్మధారయం
17) అనృతము ఋతము కానిది నఇ్ తత్పురుష సమాసం
18) రెండు ఫలములు రెండైన ఫలములు ద్విగు సమాసం
19) మిత్రలాభము మిత్రుల వలన లాభము పంచమీ తత్పురుష
20) సంచయేచ్ఛ సంచయమునందు ఇచ్చ సప్తమీ తత్పురుష సమాసం

పర్యాయపదాలు

1) అమృతము : 1) సుధ 2) పీయూషము
2) భోజనము : 1) తిండి 2) ఆహారము 3) అశనము
3) ఎలుక : 1) మూషికం 2) ఆఖనికం 3) ఖనకం 4) ఎలక
4) బలము : 1) శక్తి 2) పరాక్రమము 3) పౌరుషము
5) సన్న్యాసి : 1) పరివ్రాజకుడు 2) భిక్షువు 3) బోడ 4) యతి
6) ధనము : 1) అర్థం 2) ద్రవ్యం 3) విత్తం 4) ధనం
7) గృహము : 1) ఇల్లు 2) భవనము 3) మందిరము
8) అన్నము : 1) వంటకం 2) కూడు 3) బువ్వ
9) బుద్ధి : 1) ప్రజ్ఞ 2) మతి 3) ప్రజ్ఞానం 4) మేధ 5) ధిషణ
10) స్నేహితుడు : 1) మిత్రుడు 2) చెలికాడు 3) మిత్రము

నానార్థాలు

1) వాసము : 1) వెదురు 2) బట్ట 3) ఇల్లు 4) కాపురం
2) నిమిత్తము : 1) కారణం 2) శకునము 3) గుటి
3) నామము : 1) పేరు 2) బొట్టు 3) ప్రాతిపదిక
4) ప్రభువు : 1) స్వామి 2) సమర్థుడు 3) అధిపుడు
5) ధర్మము : 1) న్యాయం 2) విల్లు 3) స్వభావం
6) ప్రాణము : 1) జీవుడు 2) గాలి 3) చైతన్యం
7) పుణ్యము : 1) సుకృతం 2) ఆకాశం 3) నీరు 4) పూవు
8) ఫలము : 1) పండు 2) ప్రయోజనం 3) సంతానం
9) వనము : 1) అడవి 2) నీరు 3) గుంపు
10) లోకము : 1) జనం 2) స్వర్గం వంటి లోకము 3) చూపు
11) మిత్రుడు : 1) స్నేహితుడు 2) సూర్యుడు
12) శాస్త్రము : 1) తర్కము మొదలయిన శాస్త్రములు 2) చట్టం 3) ఆజ్ఞ
13) ఆశ : 1) దిక్కు 2) కోరిక
14) ఉదరము : 1) కడుపు 2) నడుము 3) యుద్ధం
15) గృహము : 1) ఇల్లు 2) భార్య 3) గృహస్థాశ్రమం
16) జీవనము : 1) బ్రతుకుట 2) గాలి 3) నీరు
17) గౌరవము : 1) బరువు 2) గొప్పదనము 3) మన్నన, మర్యాద
18) బలము : 1) సత్తువ 2) సైన్యం 3) బలాత్కారం

వ్యుత్పత్తరాలు

1) సన్న్యా సి : సర్వమూ న్యాసం (వదలివేసిన) చేసినవాడు.
2) పరివ్రాజకుడు : అన్నింటినీ పరిత్యజించిపోయేవాడు (సన్న్యాసి)
3) మూషికము : అన్నాదులను దొంగిలించునది (ఎలుక)
4) నిదాఘము : దీనియందు జనము మిక్కిలి దహింపబడతారు (గ్రీష్మ ఋతువు
5) పుత్తుడు : పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు (కుమారుడు)
6) దేహి : దేహమును (శరీరాన్ని) ధరించినవాడు (మనిషి)
7) ఈశ్వరుడు : స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు (శివుడు)
8) మిత్రుడు : సర్వభూతముల యందు స్నేహయుక్తుడు (సూర్యుడు)
9) లఘుపతనకుడు : తేలికగా ఎగిరేది (కాకి)

రచయిత పరిచయం

రచయిత :
ఈ పాఠ్యాంశ రచయిత పేరు పరవస్తు చిన్నయసూరి. క్రీ.శ. 1809లో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని శ్రీ పెరంబుదూరులో జన్మించాడు. తల్లి శ్రీనివాసాంబ, తండ్రి వేంకట రామానుజాచార్యులు. చిన్నయసూరి మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితులుగా పని చేశారు.

రచనలు :
పద్యానికి నన్నయ, గద్యానికి చిన్నయ అని లోకోక్తి. ‘సూరి’ అనేది వీరి బిరుదు. సూరి అంటే పండితుడు అని అర్థం. అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం,
పరవస్తు చిన్నయసూరి శబ్దలక్షణసంగ్రహము బాలవ్యాకరణం, నీతిచంద్రిక మొదలైన గ్రంథాలు 1809 – 1882) రచించారు.

రచనా శైలి :
ఈయన రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకొనేలా ఉంటుంది. గ్రాంథిక రచన. ఈయన వ్రాసిన బాలవ్యాకరణం ప్రామాణిక గ్రంథం. నీతిచంద్రిక – బాలవ్యాకరణాలు లక్ష్య – లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధి పొందాయి. తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్లభాషలలో సూరి మంచి పండితుడు.

కఠిన పదాలకు అర్థాలు

సన్న్యాసి = కామ్యకర్మలను విడిచినవాడు
వాసము = నివాసము
తట్టు = కొట్టు
పరివ్రాజకుడు = సర్వమును విడిచి పెట్టినవాడు(సన్న్యాసి)
చిలుకకొయ్య = బట్టలు తగిలించుకొనుటకు గోడకు కొట్టబడిన చిలుక ఆకారపు కొయ్య (Hanger)
లాఁగ = రంధ్రము
మీదు = పైన
తడవు = చిరకాలము
ఉపద్రవము = విప్లవము
నిమిత్తము = కారణము
వివరము = రంధ్రము
గుద్దలి = గునపము
చిరకాలము = చాలా కాలం
ఆర్జితము = సంపాదింపబడినది
సత్యము = బలము
కృశించి = బక్కచిక్కి
శ్రేయము = శుభము
నిదానము = అసలు కారణము
తొంటి = మొదటి
జవము = వేగము

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

స్వజాతి = తన జాతి
అర్థ పరిహీనుడు = ధనము లేనివాడు, దరిద్రుడు
నిరంతరము = ఎల్లప్పుడు
ఖేదము = దుఃఖము
నిదాఘము = వేసవి
పూరము = జల ప్రవాహము
మేధ = తెలివి
మిత్రులు = స్నేహితులు
విరహితము = లేనిది
ఆపాతము = పడుట
యాతన = బాధ
ఆవహము = కూడినది
వేదన = బాధ
ఆకరము = చోటు
నామము = పేరు
వచోధోరణి = మాట్లాడే పద్ధతి
లాంతివాడు = రాయివాడు, అన్యుడు
ఖిన్నుడు = భేదము పొందినవాడు, బాధితుడు
యుక్తము = తగినది
వంచనము = మోసము
పరాభవము = అవమానము
అనుకూల్యము = అనుకూలమైనది
మానవంతుడు = పౌరుషం కలవాడు
స్తబకము = గుత్తి
మూరము = తల, శిరస్సు
యాచన = ముష్టి
గర్హితము = నిందింపబడినది
మ్రుక్కడి = అల్పము, అల్పుడు
తొఱుఁగుట = విడచుట
అనృతము = అసత్యము, అబద్ధము
అపహరణము = దొంగతనము
తిరియుట = బిచ్చమెత్తుట, యాచించుట
నింద్యము = నిందింపతగినది
నానావిధములు = అనేక విధాలు
విచారించి = ఆలోచించి
అర్ధసంగ్రహము = ధన సంపాదన
లోభము = పిసినిగొట్టుతనము
మోహము = అజ్ఞానము, వలపు
ఉత్పాదించును = పుట్టించును
జ్వలనము = అగ్ని
అనంతరము = తరువాత
వర్జనము = విడిచిపెట్టుట
దిగనాడుట = విడిచి పెట్టుట
ఉదరము = పొట్ట
పరులు = ఇతరులు
తత్ + తత్ + కర్మ + అనురూపము = ఆయా పనులకు తగినట్లుగా
గోఁజక = పీడింపక
దేహి = దేహము కలవాడు, మానవుడు
ప్రయాస = కష్టము, శ్రమ
నిరర్థకము = వృథా
తావు = స్థానము
కాణాచి = నిలయము
చెడగరపుబోడ (చెడగరము =క్రూరము) (బోడ = సన్యా సి) = క్రూరుడైన సన్యాసి
మోదులు = దెబ్బలు
విజన ప్రదేశము = జనులు లేని చోటు
అంతరాళము = లోపలి భాగము
శిల = రాయి
కసరు = పిందె (లేతకాయ)
పడియ = నీటిగుంట
సజ్జన సంగతి = సజ్జనులతో కలియుట
తుల్యము = సమానం
అమృత రసపానము = అమృత రసమును త్రాగుట

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఎక్కడి ఎలుక ? ఎక్కడి చిలుకకొయ్య? అనడంలో అంతరార్థం ఏమై ఉంటుంది?
జవాబు:
సాధారణంగా అంతరం ఎక్కువ ఉండేవాటి పట్ల ఈ విధంగా ప్రయోగిస్తారు. ఎలుక నేలపైనా, రంధ్రాల లోనూ ఉంటుంది. గోడను నిలువుగా ఎక్కువ దూరం ఎలుక ప్రాకలేదు. చిలుకకొయ్య గోడకి మధ్యలో ఉంటుంది. అటువంటి చిలుకకొయ్య పైకి ఎలుక చేరడం అసంభవం. అది సాధ్యం కానిది ఎలాగ సాధ్యమైంది అనేది దీనిలో అంతరార్థం. అలాగే ‘నక్క ఎక్కడ ? నాక లోకము (స్వర్గం) ఎక్కడ ?’ అని కూడా అంటారు.

ప్రశ్న 2.
“ధనము సర్వశ్రేయములకు నిదానము”. మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
ఏ శుభకార్యం చేయాలన్నా ధనం కావాలి. ధనం లేకపోతే ఏ పనీ చేయలేము. అందుకే ప్రతి పుణ్య కార్యానికి అసలు కారణం ధనమే. అన్నదానం, భూదానం, గృహదానం మొదలైన ఏ దానం చేయాలన్నా ధనం కావాలి. చెరువు త్రవ్వించడం, దేవాలయాలు నిర్మించడం, పాఠశాల, ఆసుపత్రి మొదలైనవి నిర్మించడం ధర్మకార్యాలు. కాని ధనం లేకపోతే ఏ ధర్మకార్యాలు చేయలేము. అందుకే సర్వశ్రేయాలకు అసలు కారణం ధనం. మన ఉన్నతత్వానికి, గౌరవానికి, మర్యాదకు మన ధనమే అసలు కారణం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 3.
‘దారిద్ర్యము సర్వశూన్యము’ అనే మాటను బట్టి మీకేమర్థమయింది?
జవాబు:
దారిద్ర్యము అంటే బీదతనము. సర్వశూన్యము అంటే ఏమి లేనిది. అంటే ఇంటిలో పదార్థములు లేకుండా పోతాయి. అందువల్ల సుఖసంతోషాలు పోతాయి. దుఃఖము కలుగుతుంది. భార్యాబిడ్డలకు, కడుపునిండా తిండి పెట్టలేము. కాబట్టి దారిద్ర్యము అన్నింటినీ లేకుండా చేస్తుందని భావము.

ప్రశ్న 4.
ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు. ఎట్లు?
జవాబు:
ఆశ అన్ని అనర్ధాలకు మూలం. ఆశ పడినది దొరకకపోతే కోపం వస్తుంది. కోపంలో విచక్షణ కోల్పోతాము. పిసినిగొట్టుతనం పెరుగుతుంది. ఆశ మితిమీరితే అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం వలన గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగితే ఎవ్వరితోటి స్నేహం చేయలేము. అందుచేత ఆశను విడిచిపెడితే సత్పురుషుడౌతాడు. మితిమీరిన ఆశ పనికి రాదు.

ప్రశ్న 5.
ధనహీనుడై నలుగురిలో నుండరాదు. ఎందుకు?
జవాబు:
ధనహీనుడు అంటే ధనం లేనివాడు. ధనం ఉన్నప్పుడు సమాజంలో గౌరవం ఉంటుంది. హోదా ఉంటుంది. స్నేహితులు ఉంటారు. బంధువులు చేరతారు. అందరూ పలకరిస్తారు. నలుగురూ చేరతారు. కాని, ధనం లేకపోతే ఎవ్వరూ మాట్లాడరు. స్నేహితులు, బంధువులు కూడా పలకరించరు. గౌరవం, హోదా ఉండవు. ఇటువంటి అవహేళనలకు గురి అవుతూ నలుగురిలో ఉండ కూడదు. ఎవరూ తెలియని ప్రదేశంలో ఉంటే ధనము లేనివాని ఆత్మాభిమానం దెబ్బ తినదు.

ప్రశ్న 6.
‘మనసు గట్టి పరచుకోవటం’ అంటే ఏమిటి?
జవాబు:
మనస్సు చంచలమైనది. అది ఇష్టం వచ్చినట్లు సంచరిస్తుంది. గట్టి పెంచుకోవడం అంటే మనస్సును దృఢము చేసికోవడం, నిశ్చయం చేసుకోవడం అని అర్థం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 7.
‘చచ్చిన తరి వెంట రాబోదు’ అనడంలో మీకేమరమైంది?
జవాబు:
మనిషి చచ్చిపోయే సమయంలో అతడు సంపాదించిన ధనం వగైరా అతడి వెంట వెళ్ళదు. కాబట్టి తాను ధనాన్ని హాయిగా వెచ్చించి, కడుపు నిండా తినాలి. ఇతరులకు ఇంత పెట్టాలి. ఇతరులకు ఇవ్వక, తాను తినక, దాచిన డబ్బు చచ్చిపోయేటప్పుడు ఆ వ్యక్తి వెంట వెళ్ళదు అని నాకు తెలిసింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 4th Lesson వెన్నెల Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 4th Lesson వెన్నెల

10th Class Telugu 4th Lesson వెన్నెల Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ఈ కవిత చదవండి.
కొండకోనల్లో
నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెడుతున్న
సెలయేరు
కాలుజారి లోయలో పడిపోయింది.
అది చూసి
ఆకులు చాటుచేసుకొని,
మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి.
ఇదంతా చూస్తున్న సూరీడు
పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ
పడమటి కొండల వెనక్కి
పడిపోయాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ కవిత దేన్ని వర్ణిస్తున్నది?
జవాబు:
సూర్యాస్తమయాన్ని వర్ణిస్తున్నది. సూర్యాస్తమయంతో బాటు సెలయేరును, పూలమొగ్గలను కూడా వర్ణిస్తున్నది.

ప్రశ్న 2.
సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడమంటే ఏమిటి?
జవాబు:
సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడమంటే సూర్యాస్తమయం జరిగిందని సూచన.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
సెలయేరు కొండకోనల మీద నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెత్తడం అంటే మీకేమని అర్థమయ్యింది?
జవాబు:
ప్రాణులకు జవసత్వాలను, ప్రకృతికి అందాలను, ఉత్సాహాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. సూర్యకాంతి సమస్త జీవులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహారాన్ని అందిస్తుంది. ఆహారంతో కడుపు నిండితే ఆనందం కలుగుతుంది. ఆనందం వలన తుళ్ళుతూ, నవ్వుతూ ఉంటాం. దీనికి సంకేతంగానే సెలయేరు కొండకోనల మీద నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెత్తడం వర్ణించబడింది. అందుకే సూర్యాస్తమయ వర్ణనలో సెలయేరు కాలుజారి లోయలో పడిపోయిందని వర్ణించారు.

ప్రశ్న 4.
వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలేవి?
జవాబు:
వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వలన మనోవికాసం కలుగుతుంది. ఒక విషయానికి అనేక విషయాలతో కల అనుబంధం తెలుస్తుంది. ఈ కవితలో సూర్యాస్తమయ వర్ణనలో భాగంగా సెలయేరును, మొగ్గలను చాలా చక్కగా వర్ణించారు.

సూచన :
ఇదే విధంగా ఉపాధ్యాయుడు అనేక ప్రశ్నలు వేస్తూ, వారిచేత ఎక్కువగా మాట్లాడిస్తూ సమాధానాలు రాబట్టాలి.

అవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
పాఠంలో వెన్నెలను వర్ణించడం గమనించారు కదా ! ప్రకృతిలోని వివిధ సందర్భాలను వర్ణించడం వల్ల మీకు కలిగే అనుభూతులను తరగతిలో చరించండి.
జవాబు:
తెలతెలవారుతుంటే రకరకాల పక్షుల కిలకిలారావాలు వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. చల్లటి పైరగాలి శరీరానికి తగులుతుంటే ఆ హాయి గిలిగింతలు గొలుపుతుంది. చేలు, తోటలతో పచ్చగా ఉన్న పరిసరాలు చూస్తుంటే పరవశం కలుగుతుంది. పిల్ల కాలువలు, సెలయేళ్లు, నదులు, సముద్ర తీరాలలో ప్రొద్దుటే తిరగాలి. ఆ అందం వర్ణించలేము. హిమాలయ పర్వతాలను ఎంతోమంది మహాకవుల నుండి సామాన్యుల వరకు తనివితీరా దర్శించారు. వర్ణించారు.

సూర్యుడు పడమటికి వాలుతుంటే, అది ఒక అద్భుతమైన సుందర దృశ్యం. సూర్యాస్తమయాన్ని సముద్రతీరంలో చూస్తే చాలా బాగుంటుంది. ఎంతోమంది చిత్రకారుల కుంచెలకు పని కల్పిస్తున్న అద్భుత సన్నివేశాలెన్నో ప్రకృతిలో ఉన్నాయి.

ప్రశ్న 2.
మీకు నచ్చిన ఒక సందర్భాన్ని వర్ణించండి.
జవాబు:
మాది కోనసీమలోని ఒక చిన్న గ్రామం. ఎటుచూసినా కొబ్బరి తోటలే. ఆ పచ్చని కొబ్బరాకులను చూస్తే భూమాత తన సౌభాగ్యానికి గర్వించి, స్వర్గానికి సవాలుగా ఎగరేసిన జెండాలలా కనిపిస్తాయి. సరిహద్దుల రక్షణకు, భారతదేశ బలపరాక్రమాలకు ప్రతీకలుగా నిలబడిన మన భారత సైన్యంలా కనిపిస్తాయి కొబ్బరిచెట్ల వరుసలు. ఉట్టిమీద దాచిన పాలు, పెరుగు, మిఠాయిలలా కనిపిస్తాయి కొబ్బరికాయలు.
( సూచన : ఇదే విధంగా ప్రతి విద్యార్థి తన సొంతమాటలలో నచ్చింది వర్ణించాలి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
ఎఱ్ఱన రాసిన కింది పద్యం చదవండి.

సీ|| కలఁడు మేదిని యందుఁ గలఁ డుదకంబులఁ
గలఁడు వాయువునందుఁ గలఁడు వహ్నిఁ
గలఁడు భానుని యందుఁ గలఁడు సోముని యందుఁ
గలఁ డంబరంబునఁ గలఁడు దిశలఁ
గలఁడు చరంబులఁ గలఁ డచరంబులఁ
గలఁడు బాహ్యంబున గలఁడు లోన
గలఁడు సారంబులఁ గలఁడు కాలంబులఁ
గలఁడు ధర్మంబులఁ గలడు క్రియలఁ

తే॥నీ॥ గలఁడు కలవాని యందును, గలఁడు లేని
వాని యందును, గలఁడెల్లవాని యందు
నింక వేయును నేల సర్వేశ్వరుండు .
కలఁడు నీయందు నాయందుఁ గలఁడు కలఁడు
(నృసింహపురాణం-పంచమాశ్వాసం-78)

అ) పై పద్యంలో చాలా సార్లు పునరుక్తమైన పదమేది?
జవాబు:
పై పద్యంలో ‘కలడు’ అనే పదం 22 సార్లు కలదు.

ఆ) పునరుక్తమైన పదం పలుకుతున్నప్పుడు, వింటున్నప్పుడు మీకు కల్గిన అనుభూతిని చెప్పండి.
జవాబు:
‘కలడు’ అనే పద్యాన్ని ప్రతి పాదంలోను సుమారుగా 4 సార్లు ప్రయోగించారు. ఈ పద్యం ‘కలడు’ తో ప్రారంభమై’ ‘కలడు’ తోనే ముగిసింది. ‘కలడు’ అని అనేకసార్లు చెప్పారు అంటే తప్పనిసరిగా అది దైవం గురించే. దేవుడు ‘కలడు’ అని చెప్పాలంటే ప్రతి వస్తువును పరిశీలించి దైవతత్వాన్ని తెలుసుకొన్నవారికి మాత్రమే సాధ్యం. సృష్టిలోని ప్రతి వస్తువులోను పరమాత్మను సరిదర్శించాలి అని ఈ పద్యం చెబుతోంది. నాకైతే ఈ పద్యం వింటున్నప్పుడు దైవాన్ని సందర్శించినంత ఆనందం (బ్రహ్మానందం) కలిగింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ఇ) గీత గీసిన మాటల అర్థాలు తెలుసుకోండి.
జవాబు:
మేదిని = భూమి
ఉదకంబు = నీరు
వాయువు = గాలి
వహ్ని = అగ్ని
భానుడు = సూర్యుడు
సోముడు = చంద్రుడు
అంబరము = ఆకాశం
దిశలు = దిక్కులు
చరంబులు = కదిలేవి (జంతువులు, పక్షులు మొ||నవి.)
అచరంబులు = కదలనివి (పర్వతాలు, చెట్లు మొ||నవి.)
బాహ్యంబు = పై భాగము (కంటికి కనబడే భౌతిక వస్తువులు)
లోన = కంటికి కనబడనివి (ఆత్మ, మనస్సు, ప్రాణం మొ||నవి)
సారంబులు = సారవంతమైనవి
కాలంబులు = భూతభవిష్యద్వర్తమానాది సమయములు
ధర్మంబులు = నిర్దేశించబడిన స్వభావాలు
క్రియలు = పనులు
కలవాడు = ధనవంతుడు
లేనివాడు = పేదవాడు
నీయందు = ఎదుటి వానియందు
నాయందు = కర్తయందు
ఇప్పుడు పోతన రాసిన కింది పద్యం చదవండి.

మ|| | కలఁడంబోధిఁ గలండు గాలిఁ గలఁ డాకాశంబునన్ కుంభినిన్
గలఁ డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలఁ డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటన్
గలఁ డీశుండు గలండు తండ్రి ! వెదకంగా నేల నీయాయెడన్.

(శ్రీమదాంధ్ర మహాభాగవతం-సప్తమస్కంధం-78)

అ. ఎఱ్ఱన పద్యంలో మీరు గుర్తించిన పదాలకు ఈ పద్యంలో ఉన్న సమానార్థకాలేవి?
జవాబు:
ఎఱ్ఱన – పోతన
మేదిని – కుంభిని
ఉదకంబు – అంభోధి
వాయువు – గాలి
వహ్ని = అగ్ని
భానుడు – ఖద్యోతుడు
సోముడు – చంద్రుడు
అంబరము – ఆకాశం
దిశలు – దిశలు
బాహ్యంబు – త్రిమూర్తులు, త్రిలింగ వ్యక్తులు
ఎల్లవానియందు – అంతటన్
సర్వేశ్వరుడు – ఈశుండు
కాలంబులు – పగళ్ళు, నిశలు
వేయునునేల – ఈయాయెడన్

ఆ) రెండు పద్యాలను పోల్చి చూడండి.
జవాబు:
ఎఱ్ఱన ‘సీస పద్యం’లో రచించిన భావాన్ని పోతన ‘శార్దూలం’లో రచించాడు. ఎఱ్ఱన ప్రస్తావించిన వాటిని చాలా వరకు (13 పదాలు) పోతన ప్రస్తావించాడు. ఇద్దరు కవులూ ‘కలడు’ అనే పదంతోటే పద్యం ప్రారంభించారు. ‘కలడు’ అనేది ఎఱ్ఱన 22 సార్లు ప్రయోగించాడు. పోతన 9 సార్లే ప్రయోగించాడు. ఎఱ్ఱన చెప్పిన ధర్మాలు, క్రియలు, చరాచరాలు, ధనిక – పేద వంటివి పోతన వదిలేసి, అన్నిటికీ సరిపడు ఒకే పదం ‘ఓంకారం’ ప్రయోగించాడు. దైవం ఉండేది ఓంకారంలోనే. అందుకే దానిని ప్రస్తావించి పోతన తన భక్తిని చాటుకొన్నాడు.

4. పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదవండి. .
జవాబు:

చ|| సురుచిరతారకాకుసుమశోభి నభోంగణభూమిఁ గాలమ
న్గరువపు సూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్
సరసముగా నటింపఁగ నిశాసతి కిత్తిన క్రొత్తతోఁపుఁబెం
దెర యన నొప్పి సాంధ్యనవదీధితి పశ్చిమదికటంబునన్.

 

చ| దెసలను కొమ్మ లొయ్య నతిబీర్ఘములైన తరంబులన్ బ్రియం
బెసఁగఁగ నూఁది నిక్కి రజనీశ్వరుఁ డున్నతలీలఁ బేర్చు నా
కస మను వీరి భూరుహము కాంతనిరంతర కారణా లస
త్కుసుమ చయంబు గోయుట యనఁ బ్రాణి సముత్సుకాకృతిన్.

 

చ|| వడిగొని చేతులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁ బు
ప్సోడి దలమెక్కి తేనియలు పొంగి తరంగలుఁగాఁ జలంగి పైఁ
బడు నెలడింటిదాఁటులకుఁ బండువులై నమసారభంబు లు
గడువుగ నుల్లసిల్లె ఘనకైరవషండము నిండు వెన్నెలన్.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

5. రెండో పద్యానికి ప్రతిపదార్థం ఈ కింద ఉన్నది. ఇదే విధంగా 5, 7 సంఖ్యగల పద్యాలకు ప్రతిపదార్థాలు రాయండి.
2వ పద్యం (సురుచిరతార …… పశ్చిమదిక్తటంబునన్.)
జవాబు:
ప్రతిపదార్ధం :
సురుచిర = చాలా అందమైన
తారకా = చుక్కల
కుసుమ = పూల (చే)
శోభి = మనోజ్ఞమైనదైన
నభః = ఆకాశమనే
అంగణభూమిన్ = రంగస్థలం (వేదిక) పై
కాలము + అన్ = కాలం అనే
గరువపు = గొప్ప
సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు)
జతనంబున = ప్రయత్నపూర్వకంగా
దిక్పతికోటి = దిక్పాలకుల సమూహం
ముందటన్ = ముందు (ఎదుట)
సరసముగా = చక్కగా (యుక్తంగా)
నటింపగ = నాట్యం చేయడానికి సిద్ధపడిన
నిశాసతికిన్ = రాత్రి అనే స్త్రీకి
ఎత్తిన = నిలిపిన (పట్టిన)
క్రొత్త = కొత్తదైన
తోఁపున్ = ఎర్రని
పెన్ + తెర = పెద్ద తెర
అనన్ = అన్నట్లుగా
పశ్చిమ దిక్ + తటంబునన్ = పడమటి తీరంలోని (పడమటి దిక్కున)
సాంధ్య = సంధ్య సంబంధించిన (సంధ్యాకాలపు)
నవ దీధితి = కొత్త వెలుగు
ఒప్పెన్ = ప్రకాశించింది

5వ పద్యం (దెసలను ………… సముత్సుకాకృతిన్.)
జవాబు:
ప్రతిపదార్థం :
ఆకసమను = ఆకాశమనెడు
పేరి = పేరుగల
భూరుహము = చెట్టున
దెసలను = దిక్కులనెడు
కొమ్మలు = కొమ్మలలో గల
తారకా = నక్షత్రాలనెడు
లసత్ = ప్రకాశించు
కుసుమచయంబున్ = పూల సమూహమును
కోయుటకు = త్రుంచుటకు
ఒకోయనన్ = కదా ! అనునట్లు
ఒయ్యన్ = వెంటనే
రజని + ఈశ్వరుడు = రాత్రికి ప్రభువైన చంద్రుడు
ప్రియంబు = ఇష్టము
ఎసగన్ = ఎక్కువ కాగా
ఊది = నిశ్శ్వాసించి(గాలిని ఊది)
నిక్కి = నిలబడి
నిరంతర = ఎల్లపుడు
కాంత = కాంతులతో
అతిదీర్ఘములైన = మిక్కిలి పొడవైన
కరంబులన్ = చేతులతో (కిరణములతో)
సముత్సుకాకృతిన్ = మిక్కిలి ఉత్సాహమే రూపు దాల్చినట్లు
ప్రాకెన్ = ప్రాకెను

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

7వ పద్యం (వడిగొని తేకు ………… వెన్నెలన్.)
జవాబు:
ప్రతిపదార్థం :
నిండు వెన్నెలన్ = పండు వెన్నెలలో
ఘన = గొప్పవైన
కైరవ షండము = కలువల సమూహం
వడిన్ = వేగంతో
కొని = పూని
ఱేకులు = పూల ఱేకులు
ఉప్పతిల = అతిశయించగా
వాలిన = కిందికి దిగిన (వాడిపోయిన)
కేసరముల్ = దిద్దులు
తలిర్పన్ = అతిశయించునట్లుగా
పుప్పొడి = పుప్పొడి యొక్క
తలము = పై భాగమును
ఎక్కి = అధిరోహించి
తేనియలు = మధువులు
పొంగి = ఉప్పొంగి
తరంగలుగాన్ = ప్రవాహాలుగా
చెలంగి = విజృంభించి
పైన్ = పైన
పడు = పడుచున్న
నెల = చంద్రుడు అనెడు
తేటి =తుమ్మెద
దాటులకున్ = కలయికలకు
పండువులై = (కనుల) పండువలవుతూ
ఉగ్గడువుగ = ఎక్కువగా
నవ సౌరభంబులు = క్రొత్త సువాసనలు
ఉల్లసిల్లె = ప్రకాశించెను.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “కాటుక గ్రుక్కినట్టి కరవటంబన జగదండఖండ మమరె” ఈ మాటలు కవి ఏ సందర్భంలో పేర్కొన్నాడో వివరించండి.
జవాబు:
ఈ మాటలు ఎఱ్ఱన రచించిన నృసింహపురాణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన ‘వెన్నెల’ అను పాఠంలోనిది. దిక్కులు, ఆకాశం, భూమిని చీకటి ఆక్రమించిన విధానాన్ని వివరిస్తున్న సందర్భంలో కవి ప్రయోగించిన మాటలివి. ఈ లోకమనెడు బ్రహ్మాండ భాగము కాటుక భరిణెలాగా ఉందని భావం.

ఆ) ఈ పాఠంలో కవి వెన్నెలను వర్ణించడానికి ఏయే అంశాల నెన్నుకున్నాడో తెల్పండి.
జవాబు:
సూర్యాస్తమయాన్ని, పద్మాలు ముడుచుకొనడాన్ని కవి వర్ణించాడు. సాయంసంధ్యలో పడమటి వెలుగును వర్ణించాడు. చంద్రోదయాన్ని కూడా రమణీయంగా వర్ణించాడు. 3 పద్యాలలో, వెన్నెల వర్ణించడానికి ముందు అంశాలను వర్ణించాడు. తర్వాతి పద్యంలో చంద్రకాంతి వ్యాప్తిని వర్ణించాడు. ‘వెన్నెల’ దృశ్యం వర్ణించడానికి బలమైన పూర్వరంగం కళ్లకు కట్టినట్లు వర్ణించి వర్ణనకు మంచి పునాది వేశాడు. ప్రబంధములకు కావలసిన వర్ణనా నైపుణ్యమిదే. అందుకే ఎఱ్ఱనకు ‘ప్రబంధపరమేశ్వరుడు’ అనెడి బిరుదు కలిగింది. తర్వాతి కవులందరూ ఎఱ్ఱనలోని ఈ వర్ణనా క్రమ నైపుణ్యాన్ని అనుకరించారు.

2. క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) పద్య భావాలను ఆధారంగా చేసుకొని పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి.
(లేదా)
తుమేదల బృందానికి పండుగ చేసిన వెన్నెల ఎలా విజృంభించిందో రాయండి.
మనోహరంగా, ధీరగంభీరంగా వెన్నెల ఎలా విస్తరించిందో రాయండి.
ఆబాల గోపాలానికి ఆత్మీయ బంధువైన చందమామ వెలుగైన వెన్నెల ఎలా విజృంభించిందో పాఠ్యభాగం ఆధారంగా వర్ణించండి.
జవాబు:
సూర్యాస్తమయమయ్యింది, పద్మం ముడుచుకొంది. పడమట సంధ్యారాగ కాంతి కనబడింది. చీకటి బాగా పెరిగి దిక్కులూ, భూమ్యాకాశాలూ కలిసిపోయి కాటుక నింపిన బరిణెలా విశ్వం కనిపించింది.

చంద్రోదయం :
చంద్రుడు ఉదయించాడు. వెన్నెల ప్రవాహం పాలసముద్రంలా పొంగి ఆకాశాన్ని ముంచెత్తింది. చంద్రబింబం ఆ పాలసముద్రంలో గుండ్రంగా చుట్టుకొన్న ఆదిశేషుడి శయ్యలా, చంద్రుడిలోని మచ్చ ఆ శయ్య మధ్యన ఉన్న విష్ణువులా కనబడింది.

ఆ వెన్నెలలో కలువల రేకులు విచ్చుకున్నాయి. కలువ పూలలో తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. తుమ్మెదలకు విందు చేస్తూ పూల పరిమళాలు బయలుదేరాయి.

చంద్రకాంత శిలల వానలతో, చకోరాల రెక్కల స్పర్శలతో, స్త్రీల చిరునవ్వుల కాంతులతో అతిశయించి, దిక్కులన్నింటినీ ముంచెత్తి వెన్నెల’ సముద్రంలా వ్యాపించింది. ఆ వెన్నెల అనే సముద్రపు నీటి నుండి చంద్రుడు ఆవిర్భవించాడు.

ఆ విధంగా అందంగా, గంభీరంగా, నిండుగా చంద్రుని వెన్నెల వ్యాపించింది.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) ఈ పాఠంలోని వర్ణనల్లాగే మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యాన్ని గాని, సన్నివేశాన్ని గాని, సమయాన్ని గాని వర్ణిస్తూ రాయండి.
ఉదా : సూర్యోదయం/ సూర్యాస్తమయం.
జవాబు:
సూర్యోదయం :
చీకటి అనే అజ్ఞానంలో తడబడుతూ అనేక అవలక్షణాలకు ఆలవాలమైన వానికి జ్ఞానం ప్రసాదించే సద్గురువులా సూర్యుడు తూర్పుతలుపు తీస్తున్నాడా అన్నట్లు వెలుగు రేఖలు వస్తున్నాయి. ఆ లేత వెలుగు సోకగానే లోకమంతా ఉత్సాహం ఉరకలేసింది. పక్షుల కిలకిలలు, లేగదూడల గెంతులు, అంబారవాలు, పిల్లల మేలుకొలుపులు, సంధ్యావందనాదులు, ఒకటేమిటి అప్పటి వరకు బద్దకంగా, నిస్తేజంగా నిద్రించిన యావత్ప్రపంచం దైనందిన క్రియలకు బయల్దేరింది. కొలనులలో తామరపూలు పరవశంతో తమ ఆప్తుని చూడటానికి రేకులనే కళ్లతో ఆత్రంగా నింగిని పరికిస్తున్నాయి. ఆ పూల అందాలను చూసి పరవశించిన తుమ్మెదలు ఝంకారం చేస్తూ తేనెల వేటకు ఉపక్రమించాయి.

రైతులు బద్దకం వదిలి నాగలి భుజాన వేసుకొని పొలాలకు బయల్దేరారు. మహిళలు కళ్ళాపి జల్లి వాకిట రంగ వల్లికలు తీరుస్తున్నారు. పిల్లలు పుస్తకాలు ముందేసుకొని ఆవులిస్తూ చదవడం మొదలుపెట్టారు.

లేత సూర్యకిరణ ప్రసారంతో చైతన్యం పెరిగిన జీవరాశి జీవనయాత్రకు నడుం బిగించింది.

సూర్యాస్తమయం :
నవ్వుతూ, తుళ్ళుతూ జీవితమంతా గడిపిన వ్యక్తిని వార్ధక్యం ఆవహించినట్లుగా, తుపాసులో సర్వం కోల్పోయిన వ్యక్తి జీవితంలాగా, వైభవం కోల్పోయిన చక్రవర్తిలాగా సూర్యుడు తన వేడిని, వాడిని ఉపసంహరించు కొంటున్నాడు. పక్షులు గబగబా గూళ్లకు చేరుకొంటున్నాయి. మేతకు వెళ్ళిన పశువులమందలు, ఇళ్లకు చేరుతున్నాయి. ఎక్కడి పనులక్కడ ఆపి, కర్షకులు తల పైన పచ్చగడ్డి మోపులతో ఇళ్లకు ప్రయాణమయ్యారు. నిషేధాజ్ఞలు జారీ అయినట్లు సూర్యుడు బెరుకుబెరుకుగా పడమటి కొండలలోకి పారిపోయాడు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబంలా ప్రపంచం కళా విహీనమయ్యింది. దరిద్రుడిని కష్టాలు ఆక్రమించినట్లుగా లోకాన్ని చీకటి ఆక్రమిస్తోంది. క్రూరత్వానికి, దుర్మార్గానికి, అన్ని పాపాలకు చిరునామా అయిన చీకటి దర్జాగా నవ్వుకొంటోంది. దండించే నాథుడు లేని లోకంలో అరాచకం ప్రబలినట్లుగా సూర్యుడు లేకపోవడంతో చీకటి విజృంభిస్తోంది, మూర్ఖుల ప్రేలాపనలతో సజ్జనులు మౌనం వహించినట్లుగా మెల్లగా పడమటి తలుపులు మూసుకొని సూర్యుడు చీకటిని చూడలేక నిష్క్రమించాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ఆ) పాఠం ఆధారంగా ఎఱ్ఱన రచనా శైలి గురించి 10 వాక్యాలు రాయండి.
జవాబు:
ప్రబంధ పరమేశ్వరుడనే బిరుదు గల ఎఱ్ఱన వర్ణనలు అద్భుతంగా చేస్తాడు. వర్ణనాంశానికి తగిన పదాలను, పద్యవృత్తాలను ఎన్నుకొంటాడు.

‘ఇను ససమాన తేజు’ అనే పద్యంలో సూర్యుని చూచినట్లు ‘భృంగ తారకాల’ను చూడలేని పద్మిని కళ్లుమూసుకొన్నట్లు పర్ణించాడు. దీనిని ‘చంపకమాల’ వృత్తంలో వర్ణించాడు. ‘చంపకము’ అంటే సంపెంగపువ్వు అని అర్థం. పద్యంలో ‘భృంగము’ అని పదం ప్రయోగించాడు. భృంగము అంటే తుమ్మెద అనే అర్థం. తుమ్మెద అన్ని పూలపైనా వాలుతుంది. తానీ సంపెంగపై వాలదు. సంపెంగ వాసనకు తుమ్మెదకు తలపోటు వచ్చి మరణిస్తుంది. ఆ విషయం అన్యాపదేశంగా చెప్పడానికే చంపకమాల వృత్తంలో చెప్పాడు, అంటే తుమ్మెదకు ప్రవేశం లేదని చెప్పే పద్యం కదా!

అలాగే పద్మిని అనేది కూడా ఒక జాతి స్త్రీ, పద్మినీజాతి స్త్రీ తన భర్తను తప్ప పరపురుషుల గూర్చి విసదు, చూడదు, ఇక్కడ తామర పువ్వు సూర్యుని తప్ప ఇతరులను (తుమ్మెదలను) చూడడానికి అంగీకరించక కళ్లు మూసుకొంది. అందుకే తామరకు ‘పద్మిని’ అని ప్రయోగించాడు.

(ఇదే విధంగా ప్రతి పద్యంలోనూ విశేషాలు ఉన్నాయి.)

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

‘నరసింహస్వామి కథ’ నేపథ్యంతో వచ్చిన గ్రంథాలు, వివరాలను ఈ కింది పట్టికలో రాయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 1

III. భాషాంశాలు

పదజాలం

1) కింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి, వాటిని అర్థవంతంగా సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
అ. భరతమాత స్మితకాంతి అందరినీ ఆకట్టుకున్నది.
జవాబు:
స్మితకాంతి = నవ్వుల వెలుగు
సొంతవాక్యం :
ముద్దులొలికే పసిపాప నవ్వుల వెలుగులో ఇల్లు కళకళలాడుతుంది.

ఆ. మేఘం దివి నుండి భువికి రాల్చిన చినుకుపూలే ఈ వర్షం.
జవాబు:
దివి = ఆకాశం
సొంతవాక్యం :
ఆకాశం నక్షత్రాలతో పెళ్ళి పందిరిలా శోభిల్లుతోంది.

ఇ. కష్టాలు మిక్కుటమై రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
జవాబు:
మిక్కుటము = ఎక్కువ
సొంతవాక్యం :
కోపం ఎక్కువైతే ఆరోగ్యం పొడవుతుంది.

ఈ. రజనీకరబింబం రాత్రిని పగలుగా మారుస్తున్నది.
జవాబు:
రజనీకరబింబం = చంద్రబింబం
సొంతవాక్యం :
పున్నమినాడు నిండైన చంద్రబింబం చూసి సముద్రం ఉప్పొంగుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

2) నిఘంటువు సాయంతో కింది పదాలకు నానార్థాలు వెతికి రాయండి.’
అ. వెల్లి = ప్రవాహము, పరంపర
ఆ. కుండలి = పాము, నెమలి, వరుణుడు
ఇ. నిట్టవొడుచు = ఉప్పొంగు, రోమాంచితమగు, విజృంభించు

3) కింది మాటలకు పర్యాయపదాలు రాయండి.
అ. చాడ్పు = పగిది, విధము , వలె
ఆ. వెల్లి = ప్రోతస్సు, వెల్లువ, ప్రవాహము
ఇ. కైరవం = తెల్లకలువ, కుముదము, గార్దభము, చంద్రకాంతము, సృకము, సోమబంధువు
ఈ. కౌముది . . వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక
ఉ. చంద్రుడు = శశి, నెలవంక, అబారి
ఊ. తమస్సు/తమం = చీకటి, ధ్వాంతము, తిమిరము

4) కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి.
అ. సంధ్య – సంజ
ఆ. దిశ – దెస
ఇ. ధర్మము – దమ్మము
ఈ. రాత్రి – రాతిరి, రేయి
ఉ. నిశ – నిసి

5) కింది వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. అ, సంధ్య
అ. గరువము – గర్వము
ఆ. జతనము – యత్నము
ఇ. దెస – దిశ
ఈ. ‘చందురుడు – చంద్రుడు

వ్యాకరణాంశాలు

1. కింది సంధులకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో గుర్తించి, వాటిని విడదీసి సూత్రాలు రాయండి.

అ) సవర్ణదీర్ఘ సంధి
సూత్రము :
అ, ఇ, ఉ, ఋ లకు అవే (సవర్ణ) అచ్చులు పరములయినచో వానికి దీర్ఘములు వచ్చును. పాఠంలో గుర్తించినవి.

రజని + ఈశ్వరుడు = రజనీశ్వరుడు – (ఇ + ఈ = ఈ)
కులిశ + ఆయుధుని = కులిశాయుధుని – (అ + ఆ = ఆ)
ఉత్సుక + ఆకృతిన్ = ఉత్సుతాకృతిన్ (అ + ఆ = ఆ)
చంద్రిక + అంభోధి = చంద్రికాంభోధి – (అ + అ = అ)

ఆ) గుణసంధి
సూత్రము :
అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైన వానికి క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశమగును. పాఠంలో గుర్తించినవి.
దివస + ఇంద్రు = దివసేంద్రు – (అ + ఇ = ఏ)
చంద్రకాంత + ఉపలంబుల = చంద్రకాంతో పలంబుల – (అ + ఉ = ఓ)
నుత + ఇందు = నుతేందు – (అ + ఇ = ఏ)

ఇ) ఉత్వసంధి
సూత్రము :
ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు పాఠంలో గుర్తించినవి.
పొమ్ము + అనన్ = పొమ్మనన్ – (ఉ + అ = అ)
మీలనము + ఒంద = మీలనమొంద – (ఉ + ఒ = ఒ)
తిలకము + అనగ = తిలకమనగ – (ఉ + అ = అ)
కుంభము + అనగ = కుంభమనగ – (ఉ + అ = అ)
దీపము + అనగ = దీపమనగ – (ఉ + అ = అ)
కబళము + అనగ = కబళమనగ – (ఉ + అ = అ)
చంద్రుడు + ఉదయించె = చంద్రుడుదయించె – (ఉ + ఉ = ఉ)
నిస్తంద్రుడు + అగుచు = నిస్తంద్రుడగుచు – (ఉ + అ = అ)
ఇట్లు – ఉదయించి = ఇట్లుదయించి – (ఉ + ఉ = ఉ)
దీర్ఘములు + ఐన = దీర్ఘములైన – (ఉ + ఐ = ఐ)
ప్రియంబు + ఎసగగ = ప్రియంబెనగగ – (ఉ + ఎ – ఎ)
ఈశ్వరుడు + ఉన్నతలీల = ఈశ్వరుడున్నతలీల – (ఉ + ఉ = ఉ)
ఆకసము + అను = ఆకసమను – (ఉ + అ = అ)
కోయుటకు = ఒకో = కోయుటకొకో – (ఉ + ఒ – ఒ)
కలంకము + అత్తటిన్ = కలంకమత్తణిన్ – (ఉ + అ = అ)
ఱేకులు + ఉప్పతిల = ఱేకులుప్పతిల – (ఉ + ఉ = ఉ)
తలము + ఎక్కి = తలమెక్కి (ఉ + ఎ = ఎ)
పండువులు + ఐ = పండువులె – (ఉ + ఐ = ఐ)
సౌరభంబులు + ఉగ్గడువుగ = సౌరభంబులుగడువుగ – (ఉ + ఉ = ఉ)
ఇట్లు + అతి = ఇట్లతి – (ఉ + అ = అ)

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

2. కింది పదాలు విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలు రాయండి.

అ) అత్యంత = అతి + అంత – యణాదేశ సంధి.
సూత్రం :
ఇ, ఉ, ఋలకు అసవర్ణాచ్చులు పరమైన వానికి య,వ,రలు ఆదేశంగా వస్తాయి.

ఆ) వంటాముదము = వంట + ఆముదము – అత్వసంధి
సూత్రం :
అత్తునకు సంధి బహుళంబుగానగు.

ఇ) ఏమనిరి = ఏమి + అనిరి – ఇత్వసంధి
సూత్రం :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.

ఈ) అవ్విధంబున = ఆ + విధంబున – త్రికసంధి
సూత్రం :

  1. ఆ, ఈ, ఏలు త్రికమనబడును.
  2. త్రికంబుమీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
    ఆ + వ్విధంబున
  3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు’ డాచ్చికంబగు దీర్ఘమునకు హ్రస్వంబగు.
    అవ్విధంబున

3. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి.

అ) నలుదెసలు – నాలుగైన దెసలు – ద్విగుసమాసం
లక్షణం : సమాసంలోని పూర్వపదం సంఖ్యావాచకమైతే అది ద్విగు సమాసం. నలు (నాల్గు) అనేది సంఖ్యావాచకమైన పూర్వపదం కనుక ఇది ద్విగు సమాసం.

ఆ) సూర్యచంద్రులు – సూర్యుడును, చంద్రుడును – ద్వంద్వ సమాసం లక్షణం : సమాసంలోని రెండు పదాలకూ ప్రాధాన్యం ఉంటే అది ద్వంద్వ సమాసం.
సూర్యుడు, చంద్రుడు అనే రెండు పదాలకూ ప్రాధాన్యం ఉంది కనుక ఇది ద్వంద్వ సమాసం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

4. కింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి, సమన్వయం చేయండి.

అ) అభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు
నీట నిట్టలముగ నిట్టవొడిచె.
జవాబు:
ఈ పద్యపాదములందు రూపకాలంకారం ఉన్నది.

సమన్వయం :
ఇక్కడ వెన్నెల అనే సముద్రము నుండి చంద్రుడు నిండుగా ఆవిర్భవించాడు అని చెప్పబడింది. పై పద్యపాదాల్లో ఉపమేయమైన వెన్నెలకు ఉపమానమైన సముద్రానికి అభేదం చెప్పబడింది. అందువల్ల ఇక్కడ రూపకాలంకారం ఉంది.

లక్షణం :
ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పినట్లయితే దానిని రూపకాలంకారం అంటారు.

5. పాఠంలోని తేటగీతి పద్యాన్ని గుర్తించి లక్షణాలతో సమన్వయం చేసి చూడండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 2
లక్షణాలు:

  1. 4 పాదాలుంటాయి.
  2. ప్రతి పాదంలోను ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
  3. యతి – 4వ గణం యొక్క మొదటి అక్షరం.
  4. ప్రాస నియమం కలదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 3

బొదలి పొదలి … అనే పద్యంలోని ‌రెండు పాదాలు పరిశీలించి లక్షణ సమన్వయం చేయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 4

పై పద్యపాదాల్లో ప్రతి పాదానికి ఐదు గణాలుంటాయి. కాని,
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 5

(‘హ’ గణాన్నే ‘గలం’ అనడం వాడుకలో ఉన్నది. ‘వ’ గణాన్ని ‘లగం’ అన్నట్లు.)
యతి ప్రాస, నియమాలు, తేటగీతికి సంబంధించినవే దీనికీ వర్తిస్తాయి.
లక్షణాలు :

  1. ఇది ఉపజాతి పద్యం. దీనికి 4 పాదాలుంటాయి.
  2. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి.
  3. 2, 4 పాదాల్లో ఐదూ సూర్యగణాలే ఉంటాయి.
  4. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి. యతిలేని చోట ప్రాసయతి చెల్లుతుంది.
  5. ప్రాస నియమం పాటించనవసరం లేదు. న

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 6

మొదటి పాదం వలెనే 3వ పాదం ఉంది.
దీనిలో కూడా 3 సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు వరుసగా ఉన్నాయి.
రెండవ పాదం వలెనే 4వ పాదం ఉంది.
దీనిలో కూడా 5 సూర్యగణాలు వరుసగా ఉన్నాయి.
4 పాదాలలోనూ యతి 4వ గణం మొదటి అక్షరం.
1వ పాదం – పొ, పొం 2వ పాదం – మించి – ముంచి (ప్రాసయతి)
3వ పాదం – అ – అం 4వ పాదం – నీ – ని (ట్ట)

అదనపు సమాచారము

సంధులు

1) జగదండఖండము = జగత్ + అండఖండము – జశ్వసంధి
2) తదంతరము = తత్ + అంతరము జత్త్వసంధి
3) కాటుకగ్రుక్కిన = కాటుక + క్రుక్కిన – గసడదవాదేశ సంధి
4) నిట్టవొడిచే = నిట్ట + పొడిచే – గసడదవాదేశ సంధి
5) గ్రుక్కినట్టి = గ్రుక్కిన + అట్టి – అత్వసంధి
6) అత్తఱిన్ = ఆ = తఱిన్ – త్రికసంధి
7) గర్వంపుదాటులు = గర్వము + దాటులు – పుంప్వాదేశ సంధి
8) గరువపుసూత్రధారి = గరువము + సూత్రధారి – పుంప్వాదేశ సంధి
9) వేడ్క యొనర్చె = వేడ్క + ఒనర్చె – యడాగమ సంధి
10) లీలనమొందఁజేసె = లీలనమొందన్ + చేసె – సరళాదేశ సంధి
11) పెందెర = పెను + తెర – సరళాదేశ సంధి
12) నభోంగణము = నభః + అంగణము – విసర్గ సంధి
13) అంతరంగము = అంతః + అంగము , – విసర్గ సంధి
14) రంజనౌషధము = రంజన + ఔషధము వృద్ధి సంధి

సమాసాలు
AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల 7

ప్రకృతి – వికృతులు

1) సత్త్వము – సత్తువ
2) రాత్రి – రాతిరి, రేయి
3) యత్నము – జతనము
4) దిశ – దెస
5) ఆకాశము ఆకసము
6) స్రవణము – సోన
7) మాణిక్యము – మానికము
8) శంక – జంకు
9) విష్ణుడు – వెన్నుడు

పర్యాయపదాలు

1) కుసుమము : 1) సుమం 2) పుష్పం 3) పువ్వు
2) లలన : 1) సతి 2) స్త్రీ 3) ఇంతి
3) లోచనము : 1) నేత్రం 2) నయనం 3) కన్ను
4) చంద్రుడు : 1) రజనీశ్వరుడు 2) సుధాంశుడు 3) సోముడు
5) తోయధి : 1) అంభోధి 2) పయోనిధి 3) సముద్రం

నానార్థాలు

1) కరము : 1) చేయి 2) తొండం 3) కిరణం
2) తరంగము : 1) కెరటం 2) వస్త్రం 3) గుఱ్ఱపు దాటు
3) ఇనుడు : 1) సూర్యుడు 2) ప్రభువు

వ్యుత్పత్త్యర్థాలు

1) వనజాతము : నీటి నుండి పుట్టునది (పద్మం)
2) రజనీశ్వరుడు : రాత్రులకు ప్రభువు (చంద్రుడు)
3) రజనీకరుడు : రాత్రిని కలుగచేసేవాడు (చంద్రుడు)
4) పన్నగము : పాదములచే పోవనిది (పాము)
5) సుధాకరుడు : అమృతమయములైన కిరణాలు కలవాడు (చంద్రుడు)
6) భూరుహము : భూమి నుండి మొలచునది (చెట్టు)

కవి పరిచయం

కవిత్రయం :
సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించిన 18 పర్వాల మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎఱ్ఱన అనే ముగ్గురు మహాకవులు తెలుగులోకి అనువదించారు. దీనిలో నన్నయ రెండున్నర పర్వాలు, తిక్కన 15 పర్వాలు, ఎఱ్ఱన అరణ్యపర్వశేషం (నన్నయ వదిలిన భాగం) రచించారు.

ఎఱ్ఱన :
పోతమాంబిక, సూరనార్యుల పుత్రుడు. 14వ శతాబ్దంలో ప్రథమార్ధంలో అంటే క్రీ.శ 1300-1360 సం||లలో ఎఱ్ఱన జీవించాడు. ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి.

ఎఱ్ఱన రచనలు :
అరణ్యపర్వశేషం, నృసింహపురాణం, రామాయణం, హరివంశం మొదలగు గ్రంథాలను రచించాడు. వీటిలో రామాయణం ప్రస్తుతం లభించడం లేదు. ‘రామాయణం’, ‘హరివంశం’లను ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. అరణ్యపర్వశేషాన్ని నన్నయ అంకితమిచ్చిన రాజరాజనరేంద్రునిపై గౌరవంతో ఆయనకే అంకితమిచ్చాడు. నృసింహపురాణాన్ని అహోోబిల నృసింహస్వామికి అంకితమిచ్చాడు.

ఎఱ్ఱన వర్ణనలు :
ఎఱ్ఱన రచనలో వర్ణనలు అధికంగా ఉంటాయి. తదనంతర కాలంలో వర్ణనాత్మకమైన కావ్యాలు రావడానికి ఎఱ్ఱన వర్ణనలే ప్రేరణ. ప్రబంధాలలోని అష్టాదశ (18) వర్ణనల్లోని చాలా వర్ణనలు నృసింహపురాణంలో కనిపిస్తాయి. ఎఱ్ఱన నృసింహపురాణ ప్రభావం పోతన మీద విశేషంగా ఉంది. పోతన భాగవతంలోని సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలో ఈ ప్రభావం కనిపిస్తుంది.

బిరుదులు :
ప్రబంధ వర్ణనలకు మొదటివాడు కనుక ‘ప్రబంధ పరమేశ్వరుడు’ అను బిరుదు కలదు. శివభక్తుడగుటచేత ‘శంభుదాసుడు’ అను బిరుదు పొందాడు.

గురువు :
ఎఱ్ఱన గురువు గారి పేరు శంకరస్వామి,

అవగాహన – ప్రతి స్పందన

పద్యం -1
చ|| | ఇను ససమానతేజు దివసేంద్రుఁ గనుంగొనుమాడ్కిఁ జూడఁగాఁ
జన దొరు సల్పతేజు నను చాద్పునఁ జంచలభృంగతారకా
ఘన వనజాతలోచనము గ్రక్కున మీలన మొందఁజేసెఁబ
ద్మిని పతిభక్తి సత్త్వమున మేలిమికిం గుణి దానపొమ్మనన్.
ప్రతిపదార్థం :
అసమాన తేజున్ = సాటిలేని కాంతి గలవానిని
దివస + ఇంద్రున్ = పగటికి రాజును (అయిన)
ఇనున్ = సూర్యుని
కనున్ + కొనుమాడ్కిన్ = చూచునట్లుగా
పద్మిని = పద్మము (కమలము)
అల్పతేజుని = అల్పమైన తేజస్సు కలవానిని
ఒరున్ = ఇతరుని
చూడగాన్ = చూచుటకు
చనదు = ఒప్పదు
అను = అనెడు
చాడ్పునన్ = విధముగా
చంచల = చలించుచున్న
భృంగ = తుమ్మెదలనెడు
తారకా = తారకల యొక్క
ఘన = గొప్పదనమును (చూడక)
పతిభక్తి = భర్తపై ఇష్టం (సూర్యునిపై అభిమానము)
సత్త్వమున = బలమున
మేలిమికిన్ = గొప్పదనమునకు
గుటి = లక్ష్యము (ఉదాహరణ)
తాన = తానే (కమలమే)
పొమ్ము + అనన్ = పో అనగా (తాను మాత్రమే అనునట్లు)
గ్రక్కున = వెంటనే
వనజాత = కమలము
లోచనము = కన్నును
మీలన మొందన్ = మూసుకొనునట్లు
చేసెన్ = చేసెను

భావం :
పద్మము పతిభక్తిలో సాటిలేనిదా అనినట్లుండెను. అసమాన తేజస్సు కలవాడు, దినరాజు అయిన సూర్యుని చూచితిని. ఆ విధంగా అల్ప తేజస్సు గల ఇతరులను చూడను. చలించుచున్న తుమ్మెదలనెడు తారకలను చూడను అనునట్లుగా గొప్పవైన తన కన్నులను పద్మము వెంటనే మూసుకొన్నది.

పద్యం – 2: కంఠస్థ పద్యం

*చం. సురుచిరతారకాకుసుమశోభి సభాంగణభూమిఁ గాలను
పరువపు మాత్రధారి జతనంబున దికృతికోటి ముందటన్
సరసముగా నటింపగ విశానతి కెత్తిన క్రొత్తతోఁపుఁబెం
దెరయన నొప్పి సాంధ్యనవదీధితి పశ్చిమదిక్తటంబునన్.
ప్రతిపదార్థం :
సురుచిర తారకాకుసుమ శోభి నభోంగణ భూమిన్; సురుచిర = చాలా అందమైన
తారకా = నక్షత్రాలనే (చుక్కలనే)
కుసుమ = పూలచే
శోభి = అలంకరింపబడిన
నభః = ఆకాశమనే
అంగణభూమిన్ = రంగస్థలంపై (వేదికపై)
కాలమన్ (కాలము + అన్) = కాలం అనే
గరువపు సూత్రధారి; గరువపు = గొప్ప
సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు) (నాటకం ఆడించేవాడు)
జతనంబునన్ = ప్రయత్నపూర్వకంగా
దిక్పతికోటి ముందటన్; దికృతికోటి = దిక్పాలకుల సమూహం
ముందటన్ = ముందు (ఎదుట)
సరసముగాన్ = చక్కగా (తగువిధంగా)
నటింపగన్ = నటించడానికి (నాట్యం చేయడానికి సిద్ధపడిన)
నిశాసతికిన్ = రాత్రి అనే స్త్రీకి (అడ్డంగా)
ఎత్తిన = నిలిపిన (పట్టిన)
క్రొత్తతోఁపుపెందెర; క్రొత్త = క్రొత్తదైన
తోఁపు= ఎర్రని రంగు గల (తోపు రంగు గల)
పెందెర (పెను + తెర) : పెద్ద తెర యేమో
అనన్ = అన్నట్లుగా
పశ్చిమ దిక్తటంబునన్; పశ్చిమదిక్ = పడమటి దిక్కు యొక్క
తటంబునన్ = తీరంలోని
సాంధ్య నవదీధితి; సాంధ్య = సంధ్యకు సంబంధించిన (సంధ్యాకాలపు)
నవదీధితి = కొత్త వెలుగు
ఒప్పెన్ = ప్రకాశించింది

భావం :
ప్రకాశించే చుక్కలనే పూవులతో అలంకరింపబడిన ఆకాశం అనే రంగస్థలం మీద, కాలం అనే గొప్ప సూత్రధారి (దర్శకుడు) ప్రయత్నం వల్ల, దిక్పాలకుల సమూహం ముందు, రాత్రి అనే స్త్రీ రసవంతముగా నాట్యం చేయడానికి రాగా, ఆమె ముందు పట్టుకొన్న లేత ఎరుపు రంగు (తోపు రంగు) తెర ఏమో అనేటట్లుగా, సంధ్యాకాలపు కొత్త కాంతి, పడమట దిక్కున ప్రకాశించింది.

విశేషం :
సంధ్యాకాలమయ్యింది. పడమటి దిక్కున ఆకాశం ఎఱుపురంగులో కనబడుతోంది. ఆకాశంలో నక్షత్రాలు వచ్చాయి. రాత్రి వస్తోంది. అది తన చీకటిని సర్వత్రా వ్యాపింపచేస్తుంది.

కవి సంధ్యాకాలం వెళ్ళిన తర్వాత జరిగిన మార్పుల్ని కాలము అనే సూత్రధారి ఆడించిన నాటక ప్రదర్శనగా ఊహించాడు.

  1. ఇక్కడ కాలము అనేది సూత్రధారుడు వలె ఉంది.
  2. సంధ్యాకాలంలో పడమటి దిక్కున కన్పించిన ఎజ్యని కాంతి, నాటకంలో కట్టిన ఎఱ్ఱని తోపురంగు తెరలా ఉంది.
  3. చుక్కలతో కూడిన ఆకాశం, పువ్వులతో అలంకరించిన నాట్య రంగస్థలంలా ఉంది.
  4. రాత్రి అనే స్త్రీ, ‘నర్తకి’ వలె ఉంది.

రాత్రి అనే స్త్రీ చేయబోయే నాట్యానికి రంగస్థలం మీద కట్టిన ఎల్లరంగుతోపు తెరవలె పడమటి దిక్కున ఆకాశంలో సంధ్యాకాంతి కనబడింది.

కవి సంధ్యాకాలాన్ని పూర్వపు నాటక సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ అద్భుతంగా వర్ణించాడు.

పద్యం – 3
తే॥ | పొదలి యొందొండ దివియును భువియు దిశలుఁ
బొదివి కొనియుందు చీకటిప్రోవు వలన
మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్టి
(కరవటంబన జగదందఖండ మమరి.
ప్రతిపదార్థం :
పొదలి = వృద్ధి చెంది
దివియును = ఆకాశమును
భువియు = భూమియును
దిశలున్ = దిక్కులును
ఒండు + ఒండు + అ = ఒకదానితో ఒకటి
పొదివికొని + ఉండు = దగ్గరకు చేర్చుకొని ఉన్నటువంటి
చీకటిప్రోవు = చీకటి యొక్క కుప్ప
వలన = వలన
మిక్కుటంబుగన్ = ఎక్కువగా
కాటుకన్ = (నల్లని) అంజనమును
క్రుక్కినట్టి = నిండా కూరినటువంటి
కరవటంబు + అన : భరిణె అనునట్లు (కాటుక భరిణ వలె)
జగత్ = లోకమనెడు
అండఖండము – బ్రహ్మాండములోని భాగము
అమరె = ఏర్పడినది (ఉన్నది)

భావం :
ఆకాశం, భూమి, దిక్కులు, చీకటి ఒకదానిలో ఒకటి కలిసిపోయాయి. చీకటి ఈ లోకము అనెడు బ్రహ్మాండ భాగం కాటుక భరిణలాగ ఉంది.

వచనం -4
అంత,
అంత = అంతట

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
రెండో పద్యంలో కవి దేనిని దేనితో పోల్చాడు? ఎందుకు?
జవాబు:
చుక్కలను పూలతో, ఆకాశమును వేదికతో, కాలమును సూత్రధారితో, దిక్పాలకులను రసజ్ఞులైన ప్రేక్షకులతో, రాత్రిని నాట్యకత్తెతో, పడమటి సంధ్య వెలుగును పరదాతో కవి పోల్చాడు.

ఎందుకంటే నక్షత్రాలకు పూలకు రాలే గుణం, అందగించే గుణం, ప్రకాశించే గుణం, ఆకర్షించే గుణం, అందీ అందనట్లు మురిపించే గుణం ఉంటుంది.

ఆకాశము-వేదిక విశాలమైనవి. అలంకరింప బడినవి. నటులకు తప్ప ఎవరికీ స్థానం లేనివి.

కాలానికి సూత్రధారికి పరిమితి లేదు. ఎవరైనా లోబడవలసిందే. ‘దిక్పాలకులు-ప్రేక్షకులు’, సాక్షులు. వేదిక చుట్టూ ఉండి చూస్తారు.

‘రాత్రి – నాట్యకత్తె’ తనవంతు పూర్తవగానే వెళ్ళిపోవాలి. వేదికంతా వీరి అధీనంలోనే ఉంటుంది.

“సంధ్య – పరదా’ పరిస్థితిని బట్టి వెలుగు-చీకటుల గతులు మార్చుకొంటాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 2.
ఆకాశాన్ని కవి ఏమని వర్ణించాడు? రాత్రివేళ చుక్కలతో కూడిన ఆకాశాన్ని చూస్తే మీకెలా అన్పిస్తుంది?
జవాబు:
ఆకాశాన్ని కవి చక్కగా అలంకరింపబడిన వేదికతో పోల్చాడు. చుక్కలతో ఉన్న ఆకాశం-చుక్కల చీరలో, సంక్రాంతికి ముగ్గులు పెట్టడానికి గాను చుక్కలు పెట్టిన వాకిలిలా, పిండి వడియాలు పెట్టిన వస్త్రంలా, రేఖా గణితపు నల్లబల్లలాగా, వినాయకచవితికి కట్టే పాలవెల్లిలా, అనేక జంతువుల (మేషం, వృషభాది రాశులు) వలె, ఇంకా అనేక విధాల కనిపిస్తుంది.

పద్యం – 5 : కంఠస్థ పద్యం

*చ దెసలను కొమ్మ లొయ్య వతిదీర్ఘములైన కరంబులన్ బ్రియం
వినఁగఁగ మాది విక్కి రణవీశ్వరుఁ డుప్పతలీలఁ బేర్చు నా
కన మమ పేరి భూరుహము శాంతనిరంతర తారకాలస
త్కుసుమ చయంబు గోయుటకొకో యవఁ బ్రాఁకె సముత్సుకాకృతిన్.
ప్రతిపదార్ధం :
రజనీశ్వరుడు (రజనీ + ఈశ్వరుడు) = రాత్రికి ప్రభువైన చంద్రుడు
దెసలను (దెసలు + అను) = దిక్కులు అనే
కొమ్మలు = కొమ్మలను
ఒయ్యన్ = మెల్లగా
అతిదీర్ఘములైన = మిక్కిలి పొడవైన
(అతిదీర్ఘములు + ఐన) కరంబులన్ = కిరణాలు అనే (తన) చేతులతో
ప్రియంబు + ఎసగగన్ = మిక్కిలి ప్రేమతో
ఊది = పట్టుకొని
నిక్కి = పైకి లేచి
ఉన్నత లీలన్ = ఎత్తయిన విధంగా
పేర్చు = అతిశయించిన (విస్తరించిన)
ఆకసము = ఆకాశం
అను పేరి = అనే పేరు గల
భూరుహము = చెట్టు యొక్క
కాంతనిరంతర తారకా లసత్కుసుమచయంబు; కాంత = ఇంపైన (మనోహరమైన)
నిరంతర = మిక్కిలి దగ్గరగా ఉన్న
తారకా = నక్షత్రాలు అనే
లసత్ = ప్రకాశిస్తున్న
కుసుమచయంబు = పుష్ప సమూహాన్ని
కోయుటకున్ + ఒకో + అనన్ = కోయడం కోసమా అన్నట్లుగా సముత్సుకాకృతిన్ (సముత్సుక + ఆకృతిన్)
సముత్సుక = మిక్కిలి ఆసక్తి గల
ఆకృతిన్ = ఆకారంతో
ప్రాకెన్ = (ఆకాశంలోకి) వ్యాపించాడు.

భావం:
చంద్రుడు, దిక్కులనే కొమ్మలను మెల్లగా తన పొడవైన కిరణాలనే చేతులతో ఇష్టంగా పట్టుకొని, పైకి లేచి ఆకాశం అనే పేరుతో ఉన్న చెట్టు యొక్క మనోహరమైన నక్షత్రాలు అనే పువ్వులను కోయడం కోసమా అన్నట్లుగా, మిక్కిలి ఆసక్తిగా ఆకాశంలోకి పాకాడు. (చంద్రుని కాంతి ఆకాశమంతా వ్యాపించిందని భావం)
అలంకారం :రూపకం, ఉత్ప్రేక్ష.

పద్యం – 6

ఉ॥ వెన్నెలవెళ్లి పాల్కడలి వేఁకదనంబునఁ బేర్చి దిక్కులున్
మిన్నును ముంప నందు రజనీకరబింబము కుందరీ భవ
త్పన్నగతల్పకల్పనము భంగిఁ దనర్చిం దదంతరంబునన్
వెన్ను నిభంగిఁ జూద్కులకు వేర్మయొనర్చెఁ గలంత మత్తజిన్.
ప్రతిపదార్థం :
వెన్నెల వెల్లి = వెన్నెల ప్రవాహమనెడు
పాల్కడలి = పాల సముద్రము
ప్రేకదనంబున = భారముతో
పేర్చి = ఏర్పరచి (ప్రసరింపచేసి)
దిక్కులున్ = దిశలును
మిన్నును = ఆకాశమును
ముంప నందు = ముంచగా
రజనీకర బింబము = చంద్రబింబం
కుండలీభవత్ = చుట్టలు చుట్టుకొనియున్న
పన్నగతల్ప = శేషపాన్పు
కల్పనము భంగి = కల్పింపబడిన విధముగా
తనర్చెన్ = ప్రకాశించెను
ఆ + తటిన్ = ఆ సమయంలో
తత్ = దాని (శేష పాన్పువంటి చంద్రుని)
అంతరంబునన్ = లోపల గల
కలంకము = మచ్చ
చూడ్కులకు = చూపులకు
వెన్నుని భంగి = విష్ణువు వలె
వేడ్క = వేడుకను
ఒనర్చెన్ = కలిగించెను

భావం :
వెన్నెల ప్రవాహం పాల సముద్రం లాగ ఉంది. అది అన్ని దిక్కులను, ఆకాశాన్ని ముంచెత్తుతోంది. ఆ సమయంలో చంద్రుడు చుట్టలు చుట్టుకొన్న ఆదిశేషువులాగ ఉన్నాడు. చంద్రునిలోని మచ్చ నల్లని విష్ణువు వలె ఉంది.

ఇది తెలుసుకోండి :
విష్ణువు నల్లగా ఉంటాడు. ఆయన పవ్వళించే శేషుడు తెల్లగా ఉంటాడు. శివుడు తెల్లగా ఉంటాడు. ఆయన మెడలో ధరించే వాసుకి నల్లగా ఉంటుంది.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
“చంద్రోదయాన్ని” చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?
జవాబు:
అమ్మ జోలపాటను గుర్తుకు తెస్తుంది. అమ్మ తినిపించిన గోరుముద్దలు గుర్తుకు వస్తాయి. పాలమీగడ, పెరుగుబిళ్ళ గుర్తుకు వస్తుంది. ఎలాగైనా చంద్రమండలం పైకి వెళ్ళి, అక్కడ ఏముందో చూడాలనిపిస్తుంది.

ప్రశ్న 2.
నిండు పున్నమినాడు చంద్రబింబాన్ని చూస్తే ఏమేమి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాము?
జవాబు:
ఆ వెన్నెలలో తనివితీరా ఆదుకోవాలనిపిస్తుంది. చంద్రుణ్ణి చూస్తూ పరుగెడితే మనకూడా చంద్రుడు వస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఆకాశంలో పెద్ద మెర్క్యురీ లైటు ఉన్నట్లుగా అనిపిస్తుంది. చంద్రుడు చల్లని సూర్యుడిలా కనిపిస్తాడు. ఆ వెన్నెలలో చదువుకోగలనో లేదో చూడాలనిపిస్తుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
పౌర్ణమి నాటి కలువలను చూస్తుంటే కలిగే ఆనందం ఎలా ఉంటుంది?
జవాబు:
పిండారబోసినట్లుగా తెల్లని వెన్నెలలో కలువలు ఉన్న కొలనును చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. సున్నితమైన రేకులతో ఉన్న కలువలను చేతితో తాకాలనిపిస్తుంది. వాటితో బుగ్గలపై రాసుకోవాలని పిస్తుంది. వాటిని కెమెరాతో ఫోటోలు తీసి దాచుకోవాలని పిస్తుంది. వీడియో తీసుకోవాలనిపిస్తుంది. వెన్నెలలో కలువలను చూస్తుంటే, చదువు-మార్కులు, ఆటలుపాటలు, అల్లరి-గిల్లికజ్జాలు, తిండి-నిద్ర ఏమీ గుర్తురానంత ఆనందం కలుగుతుంది.

ప్రశ్న 4.
‘రజనీకర బింబం’ అని కవి దేన్ని గురించి అన్నాడు?
జవాబు:
రజనీకర బింబం అని కవి చంద్రుని గురించి అన్నాడు. వెన్నెల పాలసముద్రంలా, చంద్రుడు పాలసముద్రంలోని ఆదిశేషునిలాగా, చంద్రునిలోని మచ్చ విష్ణువులాగా కనిపించిందని కవి అన్నాడు.

పద్యం – 7 : కంఠస్థ పద్యం

*చ వడిగొని చేకులుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁబు
పాడి దలమెకి, తేనియలు పొంగి తరంగలుగా జెలంగి పైఁ
ఐదు నెలదేఁటిదాఁటులకు బండువులై నవసారభంబు లు
గ్గడుపున మల్ల సిల్లె ఘనకైరవషండము నిండువెన్నెలన్.
ప్రతిపదార్థం :
ఘనకైరవషండము: ఘన ఘన = గొప్పవైన
కైరవ = కలువ పూల యొక్క
షండము = సముదాయం
నిండు వెన్నెలన్ = ఆ నిండైన వెన్నెలలో
వడిగొని = వేగం కలిగి (వేగంగా)
ఱేకులు = (తమ) పూలరేకులు
ఉప్పతిలన్ = విచ్చుకొనగా
వాలిన = కిందికి వాలిన
కేసరముల్ = కింజల్కములు (తామరపువ్వు బొడ్డు చుట్టూ ఉండే అకరువులు)
తలిర్సన్ = తలఎత్తి కన్పడగా
పుప్పొడిన్ = పుప్పొడితో
దలమెక్కి = దళసరియయి (రేకులు దళసరి అయి)
తేనియలు = మకరందాలు
పొంగి = పొంగి
తరంగలుగాన్ = కెరటాలుగా
చెలంగి = విజృంభించి
పైఁబడు = తమపైన వాలేటటువంటి
ఎలతేటి = లేత తుమ్మెదల
దాఁటులకున్ = గుంపులకు
పండువులై = విందు చేసేవయి
నవసౌరభంబులు – క్రొత్త పరిమళాలు
ఉగ్గడువుగన్ = మిక్కిలి అధికంగా
ఉల్లసిల్లెన్ = బయలుదేరాయి

భావం :
ఆ నిండు వెన్నెలలో కలువల రేకులు బాగా విచ్చు కున్నాయి. వాలిన కేసరాలు తలలెత్తాయి. పుప్పొడితో రేకులు దళసరియై, తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. కలువలపై వాలే తుమ్మెదల గుంపులకు విందు చేస్తూ, కొత్త సువాసనలు అధికంగా బయలుదేరాయి.

అలంకారం : స్వభావోక్తి

పద్యం – 8

సీ॥ | కరఁగెడు నవచంద్రకాంతోపలంబుల
తఱచు సోనలఁ గడు దలముకొనుచుఁ
జటుల చకోరసంచయముల యెఱకల
గర్వంపుదాఁటులఁ గడలుకొనుచు
విరియు కైరవముల విపుల రంధ్రములపైఁ
దీవంబుగాఁ గ్రమ్మి త్రిప్పుకొనుచుఁ
గామినీజనముల కమనీయవిభ్రమ
స్మితకాంతిలహరుల మెందుకొనుచుఁ

ఆ॥వె॥ బొదలిపొదలి చదలఁ బొంగారి పొంగారి
మించి మించి దిశలు ముంచిముంచి
యభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు
నీట నిట్టలముగ నిట్టవొదిచె.
ప్రతిపదార్థం :
అభినుత = మిక్కిలి పొగడబడిన
ఇందు = చంద్రుని
చంద్రిక = వెన్నెల అనెడు
అంభోధి = సముద్రము
కరగెడు = కరుగుతున్న
నవ = క్రొత్తదైన
చంద్రకాంత = చంద్రకాంతములనెడు
ఉపలంబుల = ఱాళ్ళను
తఱచు = ఎక్కువగా
సోనలన్ = తుంపరలతో (అల్ప వర్షంతో)
కడు = ఎక్కువగా
తలముకొనుచున్ = తడుపుతూ
చటుల = చలించు
చకోరపక్షుల = చక్రవాక పక్షుల
సంచయముల = సమూహముల యొక్క
ఎఱకల = ఱెక్కల
గర్వంపుదాటులన్ = గర్వము గల కదలికలను
కడలుకొనుచు = అతిశయిస్తూ
విరియ = విరబూసిన
కైరవముల = కలువల
విపుల = ఎక్కువైన (అధికమైన)
రంధ్రముల పైన్ = రంధ్రాల మీద
తీవ్రంబుగాన్ = ఎక్కువగా
క్రమ్మి = ఆవరించి
త్రిప్పుకొనుచున్ = (తనవైపు) ఆకర్షిస్తూ
కామినీజనముల = స్త్రీల యొక్క
కమనీయ = అందమైన
విభ్రమ = అలంకారాదుల కాంతి
స్మిత = చిరునవ్వుల
కాంతిలహరుల = వెలుగు కెరటాలను
మెండుకొనుచున్ = ఎక్కువ చేస్తూ
పొదలి పొదలి = పెరిగి పెరిగి
చదలన్ = ఆకాశంలో
పొంగారి పొంగారి = పొంగిపొంగి (ఉప్పొంగి)
మించిమించి = బాగా అతిశయించి
దిశలు = దిక్కులు
ముంచిముంచి = బాగా మునుగునట్లు చేసి
నీటు + అ = మురిపముతో
నిట్టలముగ = అధికంగా
నిట్టవొడిచే = ఉప్పొంగెను.

భావం :
బాగా పొగడబడిన చంద్రకాంతి అనే సముద్రం ప్రపంచాన్ని ముంచింది. అది చాలా వ్యాపించింది. ఆకాశంలో ఉప్పొంగింది. దిక్కులు ముంచింది. చంద్రకాంత శిలలను తన ప్రవాహపు తుంపరలతో తడిపింది. చక్రవాక పక్షుల రెక్కల గర్వపు కదలికలను పెంచింది. విరబూస్తున్న కలువల రంధ్రాలపై వ్యాపించి తనవైపు ఆకర్షిస్తోంది. స్త్రీల అందమైన ఆభరణాల కాంతులను, వారి చిరునవ్వుల కాంతులను పెంచుతోంది.

వచనం -9

వ॥ ఇట్లతిమనోహర గంభీరధీరంబైన సుధాకర కాంతి
పూరంబు రాత్రి యను తలంపు దోఁవనీక తమంబను
నామంబును విననీక యవ్యక్తయను శంక నంకురింపనీక
లోచనంబులకు నమృత సేచనంబును, శరీరంబునకుఁ
జందనా సారంబును, నంతరంగంబునకు నానంద
తరంగంబును నగుచు విజృంభించిన సమయంబున
ప్రతిపదార్థం :
ఇట్లు = ఈ విధంగా (పైన పేర్కొన్న విధంగా)
అతి మనోహర = చాలా అందమైన
గంభీర = గంభీరమైన (నిండైన)
ధీరంబు + ఐన = ధైర్యము కలిగిన (అన్నిచోట్ల వ్యాపించిన)
సుధాకర = చంద్రుని (అమృత కిరణుని)
కాంతి పూరంబు = కాంతి సమూహము
రాత్రి + అను = రేయి అనెడు
తలంపున్ = ఆలోచనను
తోపనీక = తోచనివ్వక
తమంబను = చీకటి అనెడు
నామంబును = పేరును
వినన్ + ఈక = విననివ్వక
అవ్యక్త + అను = పరమాత్మ అను
శంకన్ = అనుమానమును
అంకురింపనీక = పుట్టనివ్వక
లోచనంబులకు = కళ్లకు
అమృతసేచనంబును = అమృతాభిషేకమును
శరీరంబునకున్ = శరీరానికి
చందన + ఆసారంబును = గంధపు వర్షమును
అంతరంగంబునకును = ఆత్మకును (మనస్సునకు)
ఆనంద = ఆనందమనెడు
తరంగంబును = కెరటమును
అగుచు = అవుతూ
విజృంభించిన = అతిశయించిన
సమయంబున = సమయంలో

భావం :
ఈ విధంగా వెన్నెల చాలా అందంగా ఉంది. గంభీరంగా ఉంది. ధైర్యంగా ఉంది. ఆ వెన్నెల రాత్రి అనే ఆలోచన కూడా రానివ్వడం లేదు. చీకటి అనే పేరు కూడా విననివ్వడం లేదు. పరమాత్మ అనే ఆలోచన కూడా పుట్టనివ్వడం లేదు. కళ్లకు ఆ వెన్నెల అమృతాభిషేకం చేస్తోంది. శరీరానికి మంచి గంధంలాగ ఉంది. అంతరాత్మకు బ్రహ్మానంద ప్రవాహం లాగ ఉంది.

ఇది తెలుసుకోండి:
వెన్నెల మన కళ్లకు అందంగా కనిపిస్తూ, రాత్రి అనే ఆలోచన రానివ్వక అమృతాభిషేకం చేసింది. శరీరానికి గంభీరంగా కనిపిస్తూ, భయం కలిగించే చీకటి అనే పేరును విననివ్వక గంధపు వర్షమైంది. ఆత్మకు కావలసినంత ధైర్యంగా కనిపిస్తూ, దైవాన్ని స్మరించే స్థితిని దాటించి, బ్రహ్మానందాన్ని కల్గించింది.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
వెన్నెలను చూసిన కలువలు ఎలా ప్రతిస్పందించాయి?
జవాబు:
పండు వెన్నెలలో కలువలు తమ రేకులు అతిశయించగా వాడిపోయిన కేసరాలు ప్రకాశించాయి. పుప్పొడి పైన తేనె పొంగి ప్రవహించింది, పైన పడుతున్న చంద్రుని కలయికలతో పరవశించే కలువలు కనులపండువగా ఆనందంతో, క్రొత్త సౌరభాలతో ప్రకాశించాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 4 వెన్నెల

ప్రశ్న 2.
చంద్రుడు తన వెన్నెలతో ప్రపంచానికి ఆహ్లాదాన్ని ఎలా కలిగించాడు?
జవాబు:
ఆకాశమనే వృక్షానికి దిక్కులనే కొమ్మలలో గల నక్షత్రాలనే పూలను కోయుటకు చంద్రుడు నిలబడి పొడవైన తన కిరణాల (చేతుల) తో ఉత్సాహంగా కనిపిస్తూ ప్రపంచానికి ఆనందం కలిగించాడు.

వెన్నెల అనే పాలసముద్రంలో చంద్రుడు ఆదిశేషుని లాగా కనిపించాడు. చంద్రునిలోని మచ్చ శ్రీమహా విష్ణువులాగా కన్పించి భక్తులకు కూడా ఆనందాన్ని కలిగించాడు.

వెన్నెల చంద్రకాంత శిలలకు, చక్రవాక పక్షులకు, కలువలకు, అందమైన స్త్రీలకు, సమస్త చరాచర జగత్తుకీ ఆనందం కలిగిస్తోంది.

ప్రపంచానికి రాత్రి అనే ఆలోచన రానివ్వక, చీకటి అనే పేరు కూడా వినపడనివ్వకుండా, పరమాత్మను కూడా స్మరింపనీయక అమితమైన బ్రహ్మానందాన్ని వెన్నెల కలిగిస్తోంది.

ప్రశ్న 3.
‘పొదలి పొదలి చదలఁ బొంగారి పొంగారి మించి మించి దిశలు ముంచి ముంచి’ అనే పాదంలోని పద సౌందర్యం గురించి చెప్పండి.
జవాబు:
పొదలి, పొంగారి, మించి, ముంచి అనే పదాలు వ్యవధానం లేకుండా ప్రయోగించడం వలన పద్య పాదానికి చాలా అందం వచ్చింది. ఈ శబ్దాలు ఈ పద్యపాదానికి అలంకారాలు. ఇది ఛేకానుప్రాసా
లంకారంతో శోభిస్తోంది.

ప్రశ్న 4.
‘మనోహర గంభీర ధీరంబైన సుధాకర కాంతి పూరంబు’ దీని భావం ఏమిటి?
జవాబు:
మనస్సును ఆకర్షించగల అందమైన, గంభీరమైన, ధైర్యము గలిగిన అమృత కిరణుడైన చంద్రుని కాంతి ప్రవాహము.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 3rd Lesson జానపదుని జాబు Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 3rd Lesson జానపదుని జాబు

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

ప్రియసఖా!
నీ లేఖ అందింది. పట్నం జీవితం ఎలా ఉంటుందో అందులో వర్ణించావు. పల్లెటూరి జీవితాన్ని చిత్రిస్తూ ఉత్తరం రాయమన్నావు. నీది ఉత్తమమైన వాంఛ. ఒకచోటి జీవిత విధానంలో మరొకచోటి జీవిత విధానాన్ని నిత్యమూ పోల్చి తెలుసుకొంటూ ఉండాలి. మంచి చెడ్డలు, హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఈ వాంఛ నీకు కలిగినందుకు అభినందిస్తున్నాను. నీ పట్న జీవితం నా పల్లెటూరి జీవితంతో పోలిస్తే పరస్పర విరుద్ధంగా ఉంటుంది. నా జీవిత విధానాన్ని గురించి రాయడమంటే పల్లెటూళ్ళ జీవిత విధానాన్ని గురించి రాయడమన్నమాట. పల్లెటూళ్ళు, అక్కడి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? విద్యుద్దీపాలతో, పంఖాలు ఉన్న మేడలలో హాయిగా సుఖించే నీకు ఏమి తెలుస్తుంది? నీకుమా గ్రామ జీవితం అర్థం కావాలంటే, మా ఇంటికి ఒకసారి రా! ఈ పూరి గుడిసెలో ఒక్కరోజు ఉండు.

ఇటు,
నీ మిత్రుడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఉత్తరాన్ని ఎవరు, ఎవరికి రాసి ఉంటారు?
జవాబు:
పల్లెటూరులో నివసించే వ్యక్తి పట్నంలో నివసించే తన మిత్రునికి ఉత్తరం రాసి ఉంటాడు.

ప్రశ్న 2.
దేని గురించి రాశాడు?
జవాబు:
పట్నవాసపు జీవితాన్ని, పల్లెటూరి జీవితంతో పోల్చి రాశాడు. పల్లెటూరి జీవితంలోని బాధలు రాశాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 3.
లేఖను చదివారు కదా? మీరు ఏం గ్రహించారు?
జవాబు:
లేఖా రచయిత పల్లెటూరి వాడు. పేదవాడు. పట్నవాసంలో సుఖం ఉందని అతని భావన. పల్లెటూరి జీవితం, పట్నవాసపు జీవితం పరస్పర విరుద్ధమైనవని అతని భావం.

ప్రశ్న 4.
పల్లెటూళ్ళ, పట్టణాల జీవితాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయని ఎందుకన్నారు?
జవాబు:
పల్లెటూరి జీవితంలో సుఖం తక్కువ. ఆధునిక సౌఖ్యాలు తక్కువగా ఉంటాయి. కానీ, మనుషుల మధ్య స్నేహం ఎక్కువ. కలిసిమెలిసి ఉంటారు. ఒకరి కష్టసుఖాలలో అందరూ పాలు పంచుకొంటారు. ఆడుతూ పాడుతూ పనిపాటలు చేసుకొంటారు. హాయిగా కబుర్లు చెప్పుకొంటారు. విశాలమైన ఇళ్ళు ఉంటాయి. అరుగులు ఉంటాయి. ఆ అరుగులపై కూర్చొని కబుర్లు చెప్పుకొంటారు. స్వార్థం తక్కువ. చాలామంది వ్యవసాయంపైన జీవిస్తారు. పగలంతా శ్రమ పడతారు. రాత్రంతా హాయిగా నిద్రపోతారు. వాతావరణ కాలుష్యం ఉండదు. ప్రకృతిలో లీనమై జీవిస్తారు.

పట్టణాలలో జీవితాలు సుఖంగా ఉంటాయి. ఆధునిక సౌఖ్యాలు ఎక్కువ. కాని, ఎవరి స్వార్థం వారిది. ఎవరూ ఎవరినీ పట్టించుకోరు. మాట్లాడుకోరు. సహాయ సహకారాలు ఉండవు. ఇరుకు గదులలో నివాసాలు. చాలామంది ఉద్యోగులే. మితిమీరిన కాలుష్యం అన్ని రకాల కాలుష్యాలకు నిలయం. ప్రకృతితో సంబంధంలేని జీవితాలు. అంతా . తొందరే. విపరీతమైన రద్దీ, కంగారు, హడావుడి పరుగులు.

ప్రశ్న 5.
పల్లెటూళ్ళ గురించి మీకు తెల్సింది చెప్పండి.
జవాబు:
అమ్మ ఒడిలోని కమ్మదనం పల్లెటూర్లలో ఉంది. తెలుగు భాషలోని తీయదనం అక్కడే ఉంది. పక్షుల కిలకిలారావాలతో మెలుకువ వస్తుంది. చెట్ల సందులలోంచి సూర్యోదయం చూడముచ్చటగా ఉంటుంది. లేగదూడల గంతులు బాగుంటాయి. కబుర్లు చెప్పుకొంటూ పొలాలకు వెళ్ళే రైతులతో సందడిగా ఉంటుంది. పిల్లలు చదువుల కోసం స్కూళ్ళకు వెడతారు. ఒకటే అల్లరి, అరుపులు, గోలగోలగా ఉంటుంది.

సాయంత్రం అందరూ ఇళ్ళకు చేరతారు, స్నానాలు చేసి, భోజనాలు చేస్తారు. పిల్లల ఆటలు, పాటలు. పెద్దల కబుర్లు, వేళాకోళాలు, వెక్కిరింతలు, నవ్వులు. నిద్రకుపక్రమిస్తారు. కల్మషం లేని మనుషులు. కాలుష్యం లేని వాతావరణం. దొరికిన దానితో తృప్తి పడతారు. పెడతారు. తింటారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
పల్లె గొప్పదా? పట్నం గొప్పదా? మీరైతే దేన్ని సమర్థిస్తూ మాట్లాడతారు? ఎందుకు?
జవాబు:
పల్లె గొప్పది :
స్నేహం ఎక్కువ. మనుషుల మధ్య చక్కటి అనుబంధాలు ఉంటాయి. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. కలసిమెలసి ఉంటారు. కష్టసుఖాలలో పాలుపంచుకొంటారు. కల్మషం ఉండదు. వాతావరణం కాలుష్యం ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. రణగొణ ధ్వనులు ఉండవు. ట్రాఫిక్ సమస్యలు ఉండవు. కమ్మటి గేదె పెరుగుతో అన్నం తినవచ్చు. తాజాకూరలు దొరుకుతాయి. ఎవర్ని పలకరించినా నవ్వుతూ మాట్లాడతారు. పల్లె తల్లిలాంటిది. తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రతగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది. పల్లెను నమ్మినవాడే తెలివైనవాడు. పల్లెటూరే భూలోకస్వర్గం.

పట్నం గొప్పది :
చదువుకు బాగుంటుంది. చాలా కాలేజీలు, స్కూళ్ళు, లైబ్రరీలు ఉంటాయి. చదువుకొనేందుకు చాలా అవకాశాలు ఉంటాయి.. సేద తీరడానికి పార్కులు ఉంటాయి. సినిమాహాళ్ళు ఉంటాయి. అప్పుడప్పుడు సర్కర్లు కూడా ఉంటాయి.

చదువుకొన్నాక మంచి ఉద్యోగానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతిభ చూపిస్తే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కూడా వస్తుంది. హాయిగా, సుఖంగా జీవించవచ్చు. చక్కటి నివాసాలు ఉంటాయి. రోడ్లు కూడా బాగుంటాయి. 24 గంటలూ జనంతో కలకలలాడుతూ ఉంటుంది. ఏ వస్తువైనా దొరుకుతుంది. ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్ళాలన్నా వాహనాలు దొరుకుతాయి. భయం ఉండదు. పెళ్ళివారిల్లులా సందడిగా ఉంటుంది.

(సూచన : విద్యార్థులలో ఎవరికి ఏది ఇష్టమైతే దానిని గొప్పదిగా చెప్పవచ్చు. )

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 2.
గతంతో పోలిస్తే నేడు వ్యవసాయం చేసేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? తెల్సుకొని చర్చలో పాల్గొనండి.
జవాబు:
వ్యవసాయం చేయాలంటే ఓర్పు కావాలి. శారీరకంగా కష్టపడాలి. రాత్రనక, పగలనక కష్టపడాలి. చాలా బాధలుపడాలి.

కాని, ఇప్పటివారికి ఓర్పు తక్కువ. కష్టపడే తత్వం తగ్గింది. నిరంతరం శ్రమపడే స్వభావం లేదు. సుఖవాంఛ పెరిగింది. సులువుగా డబ్బు సంపాదించాలనే కోరిక పెరిగిపోయింది. పట్నవాసపు మోజు పెరిగింది. చదువుకొని, ఉద్యోగం చేయాలనే కోరిక పెరిగిపోయింది. వ్యవసాయంలో నష్టాలు కూడా కారణం. సరైన ధర రాదు. అప్పులతో బాధపడాలి. కూలిరేట్లు పెరిగిపోయాయి. ఖర్చులు పెరిగిపోయాయి. సౌఖ్యం తక్కువ. కష్టం ఎక్కువ. అందుకే వ్యవసాయం చేయడానికి నేడు ఇష్టం చూపించటం లేదు.

ప్రశ్న 3.
కింది వాక్యాలు చదవండి. వీటిని ఏ సందర్భంలో ఎవరు అన్నారు?
అ) అన్నాయ్! ఈ లెక్క చెప్పి పడుకోకూడదా !
జవాబు:
పరిచయం : ఈ వాక్యం డా|| బోయి భీమన్న రచించిన “ జానపదుని జాబు” అనే పాఠంలోనిది.
సందర్భం : రచయితను నిద్రపొమ్మని వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు, ఆయన చెల్లెలు రచయితతో పలికిన వాక్యమిది.
భావం : రచయిత చెల్లెలు తనకు లెక్క చెప్పమని అడిగింది.

ఆ) “అయితే యీ రూపాయిని గుణించి అణాలు చేయి.”
జవాబు:
పరిచయం : ఈ వాక్యం డా|| బోయి భీమన్న రచించిన “జానపదుని జాబు” అనే పాఠంలోనిది.
సందర్భం : రచయిత తన చెల్లికి లెక్క చెప్పే సందర్భంలో, రచయిత తల్లి, ఆయన చెల్లితో పలికిన వాక్యమిది.
భావం : రూపాయిని అణాలుగా చేయాలంటే పుస్తకాలు, తెలివి. అక్కర్లేదు. దుకాణం వద్దకు వెడితే వస్తుంది. ఆచరణలో ఉపయోగించే చదువు కావాలని భావం.

ఇ) “వరిచేలో నీరుపడ్డది, నీవు రావాలి.”
జవాబు:
పరిచయం : ఈ వాక్యం డా|| బోయి భీమన్న రచించిన “జానపదుని జాబు” అనే పాఠంలోనిది.
సందర్భం : నిజజీవితానికి, చదువులకూ గల సంబంధం రచయిత ఆలోచిస్తున్న సందర్భంలో కోటయ్య రచయితతో పలికిన వాక్యమిది.
భావం : కోటయ్య వరిచేలో నీరు పడింది. రచయిత సహాయం కోరి వచ్చాడు.

4. (బోయి భీమన్న రాసిన “ధర్మం కోసం పోరాటం” లోని) కింది పేరా చదవండి. పేరాలోని కీలకమైన ఐదు పదాలను గుర్తించండి.

పనిచేస్తూ ఉంటే అనుభవం కలుగుతూ ఉంటుంది. అనుభవాన్ని మళ్ళీ ఆచరణలో పెడితే, పని మరింత చక్కగా సాగుతుంది. అప్పుడు అనుభవానికి మరింత పదునూ, కాంతి లభిస్తుంది. వాస్తవ జ్ఞాన సముపార్జన పద్ధతి ఇది. వాస్తవ జ్ఞానమే సరియైన జ్ఞానం. వాస్తవ జ్ఞానం ఎడతెగని పని ద్వారా, పరిశీలన ద్వారా లభిస్తుంది. వాస్తవ జ్ఞానం దేశకాల ప్రాంతానుగుణమై ఉంటుంది. దేశకాల ప్రాంతానుగుణంగా మారుతుంది. మన వస్త్రధారణ, వివాహాలు, పరిపాలన విధానాలు, ఈ విధంగా విభిన్న విషయాన్ని తీసుకొని మనం పరిశీలించినా, ఈ సత్యం కనిపిస్తుంది. మంచి చెడ్డలు, ఆచార వ్యవహారాలు, విధి విధానాలు అన్నీ దేశకాల ప్రాంతానుగుణంగా ఎలా మారిపోతున్నాయో స్పష్టమవుతుంది. మార్పుకు అతీతమైంది ఏదీ ఈ లోకంలో లేదు.
జవాబు:
కీలకపదాలు :
కీలకపదాలు అంటే ఆ పేరాకు ప్రాణం వంటి పదాలు. ఆ పదాలకు వ్యాఖ్యానము, విశ్లేషణ పేరాలో కనబడుతుంది. అంటే ఆ పదాలు లేకపోతే ఆ పేరాకు సమగ్రమైన విలువ ఉండదు. ఈ పేరాలోని కీలక పదాలు కింద ఉన్నాయి గమనించండి.
1) పని
2) అనుభవం
3) జ్ఞానం
4) పరిశీలన
5) మార్పు

పై పేరా ఆధారంగా కింది వాక్యాలలో ఏవి సరైనవో (✓) ద్వారా గుర్తించండి.

అ) అనుభవం వల్ల మన పనితీరు మెరుగుపడుతుంది. ( ✓ )
ఆ) ‘జ్ఞానం’ అనేది చదివితే, వింటే లభించేది. ( ✗ )
ఇ) వాస్తవ జ్ఞానం స్థిరంగా ఉండదు. అది కాలానుగుణంగా మారుతుంటుంది. ( ✓ )
ఈ) అనుభవం, పరిశీలన వల్ల వాస్తవ జ్ఞానం సిద్ధిస్తుంది. ( ✓ )
ఉ) మన ఆచార వ్యవహారాలు, విధి విధానాలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. ( ✗ )

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

5. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) జానపదుని లేఖలో కవి ఏ ఏ విషయాలను గురించి రాశారు?
జవాబు:
పల్లెటూరి చమత్కారాలు వివరించాడు. సరదాగా జరిగే వాదప్రతివాదనలు వివరించాడు. మానవ మనస్తత్వం, చదువులను విశ్లేషించాడు. పొలం పనులలో సాధక బాధకాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు.

ఆ) వ్యవసాయదారుల కష్టాన్ని కవి ఏమని వివరించారు?
జవాబు:
వ్యవసాయ కూలీలు, రైతులు అనేక కష్టాలుపడతారు. ముందు దుక్కి దున్నుతారు. విత్తనాలు చల్లుతారు. నీటి కొరకు పోటీపడతారు. కూలి గురించి పోటీపడతారు. ఆకుమడికి కాపలా కాస్తారు. రాత్రీ, పగలూ చేలోనే ఉంటారు. జెర్రులూ, తేళ్ళూ కుడతాయి. పాములు కరుస్తాయి. వానా, బురదా లెక్కచేయకుండా చేస్తారు. ఎరువులు వేస్తారు. కలుపు తీస్తారు. అన్ని జాగ్రత్తలతో పంట పండిస్తారు. పంటను ఎలుకలు, చిలుకలు తినేయకుండా కాపాడతారు. చివరకు ఆ పండిన ధాన్యం భూస్వామికి కొలిచి అప్పగిస్తారు. తమ కడుపులు కాల్చుకొంటారు. తమ కన్నీళ్ళు అలాగే ఉంటాయి. ఎంత రాతి గుండెనైనా కరిగించే కష్టాలు వారివి అని రచయిత తన లేఖలో వ్యవసాయదారుల జీవితాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు.

ఇ) చదువుకొన్న వాళ్ళ గురించి, పట్టణవాసుల గురించి కవి ఏమని ప్రస్తావించారు?
జవాబు:
పట్టణంలో కాలం కచ్చితంగా పాటిస్తారు. పట్నం వాళ్ళు, పల్లెటూరి వాళ్ళు కష్టపడి సంపాదించిన దానిని తింటారు. ఎన్నో సుఖాలు అనుభవిస్తారు. ఆ సుఖాలన్నీ పల్లెటూరి వారు కష్టపడి సమకూర్చినవే.

ఈ) జానపదుడు తన పట్టణం మిత్రుణ్ణి పల్లెటూరుకు ఎందుకు రమ్మని ఆహ్వానించాడు?
జవాబు:
పల్లెటూరి వాళ్ళు పడే కష్టాన్ని చూడడానికి రమ్మన్నాడు. ఆ కష్టాలు తొలగిపోతే పల్లెటూళ్ళు, మానవ సంఘానికి ఇచ్చే ఆనందాన్ని అవగాహన చేసుకొనేందుకు రమ్మన్నాడు. పల్లెటూళ్లో దొరికే నారింజపళ్ళూ, వెలపళ్ళూ, కొబ్బరి కురిడీలూ మొదలైనవి తినడానికి రమ్మన్నాడు.

ఉ) బోయి భీమన్న గురించి సొంతమాటల్లో రాయండి.
(లేదా )
‘జానపదుని జాబు’ పాఠ్యభాగ రచయిత గురించి రాయండి.
జవాబు:
బోయి భీమన్న 19 సెప్టెంబర్, 1911లో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో జన్మించారు. తన రచనల ద్వారా సమాజంలో మార్పు కోసం ప్రయత్నించారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేశారు. డా|| బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి, పాలేరు,

జానపదుని జాబులు, రాగవైశాఖి, పిల్లీశతకం, ధర్మం కోసం పోరాటం మొదలైనవి 70కి పైగా రచనలు చేశారు. పాలేరు నాటకం చాలామంది జీవితాలను మార్చింది.

‘గుడిసెలు కాలిపోతున్నాయ్’ రచనకు 1975లో ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’, ‘గౌరవ డాక్టరేట్’ను ప్రదానం చేసింది. 1991లో రాజ్యలక్ష్మీ అవార్డు వచ్చింది.

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “ఏమీ పని లేకపోవడమే బద్దకానికి కారణం” దీనిపై మీ అభిప్రాయం తెల్పండి.
జవాబు:
పని ఉంటే తిండి పైనా, నిద్రపైనా ధ్యాస ఉండదు. పని లేకపోతే ఏదైనా తినాలనిపిస్తుంది. తిండి ఎక్కువైతే నిద్ర వస్తుంది. నిద్ర ఎక్కువైతే మత్తుగా ఉంటుంది. ఆ మత్తునే బద్దకం అంటారు. బద్దకం అలవాటైతే, పని ఉన్నా చేయలేం. అందుచేత బద్దకం అలవాటు చేసుకోకూడదు. పని లేకపోతే ఏదైనా పని కల్పించుకొని చేయాలి.

ఆ) “కాలం చాలా విలువైంది” ఎందుకు?
జవాబు:
ధనం పోయినా తిరిగి సంపాదించుకోవచ్చును. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించవచ్చును. పరువు పోయినా, ప్రవర్తన మార్చుకొని, మంచి పనులు చేసి తిరిగి సంపాదించవచ్చును. కాని, కాలం గడిచిపోతే తిరిగి సంపాదించలేం. గడిచిపోయిన ఒక్క సెకను కూడా తిరిగిరాదు. బాల్యంలో సంపాదించవలసిన జ్ఞానం అప్పుడే సంపాదించాలి. చదువు, ఆటలు, పాటలు, ధనం, కీర్తి ఏదైనా సరే సకాలంలో సంపాదించాలి. కాలం గడిచిపోయాక బాధపడినా ప్రయోజనం లేదు. అందుకే కాలాన్ని వృథా చేయకూడదు. సక్రమంగా వినియోగించుకోవాలి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ఇ) చదువుకున్నవాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్నాలలో సౌఖ్యాలు అనుభవిస్తున్నారన్న రచయిత అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
సూచన : రచయిత అభిప్రాయంతో కీభవించవచ్చు. వికీభవించక పోవచ్చును. అందుచేత రెండు అభిప్రాయాలు ఇవ్వబడ్డాయి. మీకు నచ్చిన ఒక అభిప్రాయాన్నే గ్రహించండి.
జవాబు:
i) రచయిత అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే విద్యార్థులు కళాశాలలో, పాఠశాలలో, ఉన్నత విద్యలోనూ అనేక సదుపాయాలు పొందుతున్నారు. ఆ విద్యార్థులకు ఆ సదుపాయాలన్నీ ప్రభుత్వం కల్పిస్తోంది. దానికి ఖర్చయ్యేది ప్రభుత్వ ధనం. అంటే పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బు కదా ! మరి, పేద ప్రజల డబ్బుతో సదుపాయాలు పొంది, చదువుకొన్నవాళ్ళు పట్నాలకు వెడుతున్నారు. అక్కడ హాయిగా సుఖపడుతున్నారు. పల్లెటూర్ల వైపు కన్నెత్తి చూడరు. తమ అభివృద్ధికి కారకులైన సామాన్యులను పట్టించుకోరు. ధన సంపాదనలో మునిగిపోతారు.

ఉదాహరణకు ఒక డాక్టరు తయారవ్వాలంటే కనీసం 50 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఆ డబ్బంతా ప్రజాధనమే. కాని, చదువు పూర్తయ్యాక పల్లెటూర్లో ఉండడానికి ఎవ్వరూ అంగీకరించరు. వైద్యశాలల్లో డాక్టర్లు లేక, మందులు లేక పల్లెటూరి రోగులు అనేక బాధలు పడుతున్నారు కదా ! చాలా వృత్తులు ఇలాగే ఉన్నాయి. అందుచేత రచయిత అభిప్రాయం నూటికి నూరుపాళ్ళూ సమర్థించతగినది.

ii) “చదువుకొన్న వాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ, పట్నాలలో సౌఖ్యాలు అనుభవిస్తున్నారు” అన్న రచయిత అభిప్రాయంతో ఏకీభవించను. ఎందుకంటే చదువుకొన్న వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేదలు ఉంటారు. దళితులు ఉంటారు. కూలిపని చేసుకొనే వారి కుటుంబాల నుండి వచ్చిన వారుంటారు. లేఖా రచయిత కూడా పేద దళిత వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. చదువుకొన్నవాడు.

అన్ని ఉద్యోగాలూ పట్నాలలోనే లేవు. ఉపాధ్యాయులు, రెవెన్యూ, పోలీసు మొదలైన ఉద్యోగాలు పల్లెటూళ్ళలోనివే. పోలీసు వంటి ఉద్యోగం ప్రాణాలతో చెలగాటం కూడా. నిరంతరం ప్రమాదపుటంచున వారి జీవితాలు ఉంటాయి. అందర్నీ రక్షిస్తారు. కాని, వారికి రక్షణ లేదు.

చదువుకొన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగులు అందరూ పట్నాలలోనే లేరు. పల్లెటూళ్ళలోనూ ఉన్నారు. భయంకరమైన అడవులలో, కొండలలో కూడా ఉద్యోగులు ఉన్నారు. కనుక రచయిత అభిప్రాయంతో నేను ఎట్టి పరిస్థితులలోనూ ఏకీభవించను.

ఈ) “కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది” అని అనడంలో రచయిత ఉద్దేశం ఏమై ఉంటుంది?
(లేదా)
‘కష్టం ఒకళ్ళది ఫలితం మాత్రం మరొకళ్ళది’ అని రచయిత అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుందో “ జానపదుని జాబు” అనే పాఠం ఆధారంగా రాయండి. .
జవాబు:
పల్లెటూరి వాళ్ళు ఎంతో కష్టపడతారు. కూలిపని చేస్తారు. పస్తులు ఉంటారు. రెక్కలు ముక్కలు చేసుకొని వ్యవసాయం చేస్తారు. రాత్రనక, పగలనక అనేక కష్ట నష్టాల కోర్చి పంటను పండిస్తారు. కంటికి రెప్పలా కాపాడతారు. కాని, పండించిన దానిలో ఎక్కువ భాగం ఆ పొలం సొంతదారునకు ఇవ్వాలి. వాళ్ళు కష్టపడకుండా తీసుకొంటారు. హాయిగా అనుభవిస్తారు.

ఈ విధానం మారాలని రచయిత ఉద్దేశం. దున్నేవానిదే భూమి కావాలనేది రచయిత ఉద్దేశం. పేదరికం పోవాలంటే, పేదలకు భూమిపై హక్కు ఉండాలనేది రచయిత ఉద్దేశం.

ఉ) “పల్లెటూళ్ళు కన్నీళ్ళు పెడుతున్నవి” దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్నారు మహాకవి గుఱజాడ అప్పారావు అలాగే పల్లెటూళ్ళు అంటే, పల్లెటూళ్ళలోని మనుషులు అని అర్థం. పల్లెటూరిలో చాలామంది రైతులే ఉంటారు. వారు ఎండనక వాననక, పగలనక రాత్రనక చేలల్లో కష్టపడతారు. దుక్కి దున్నుతారు. నీరు పెడతారు. విత్తనాలు చల్లుతారు. చీడపీడల నివారణకు ఎరువులు వేస్తారు. కలుపుతీస్తారు. పంట పండిస్తారు. కుప్ప నూర్చుతారు. ఆ పండిన పంటంతా భూస్వామికి ఇస్తారు. తాము మాత్రం పస్తులుంటారు. వారికి కన్నీళ్ళే మిగులుతున్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి పల్లెటూళ్ళు రోజు రోజుకూ తమ ఉనికిని, సంస్కృతిని, ఆత్మను కోల్పోతున్నాయి. ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి? ఇవి కలకలలాడాలంటే మనం ఏం చేయాలి?
జవాబు:
పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉండాలంటే, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. ‘దున్నేవాడిదే భూమి’ కావాలి. పండించిన పంటకు సరైన ధర రావాలి. ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. నీటి సదుపాయం ఉండాలి. రైతులకు జీవితబీమా ఉండాలి. అప్పుడు వ్యవసాయంపై జనానికి మక్కువ పెరుగుతుంది. పట్నపు వలసలు ఆగుతాయి. పల్లెలు కళకళలాడతాయి. పల్లెలు కళకళలాడితే ప్రభుత్వ ఖజానాలో కాసులు గలగలలాడతాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది.

ఉనికి :
పల్లెటూళ్ళలో బ్రతుకు తెరువు లేక జనం పట్నాలకు వలసపోతున్నారు. జనం లేక పల్లెటూళ్ళు వెలవెలబోతున్నాయి. ఉన్న కొద్దిపాటి జనానికి పనులు లేవు. వ్యవసాయం చేసినా నష్టాలు తప్పడం లేదు. వారు కూడా పట్నాలకో, ఇతర దేశాలకో ‘పనికోసం’ వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. అందుకే ఉనికి కోల్పోతున్నాయి.

సంస్కృతి :
పల్లెటూరిలో చాలామంది వ్యవసాయదారులు ఉంటారు. ధాన్యపుగింజలకు లోటుండదు. తిండికి లోటు ఉండదు. అందుచేత ఎవరికైనా క్రొత్తవారికి కడుపునిండా తిండి పెట్టేవారు. ఆదరించేవారు, ఆప్యాయంగా పలకరించేవారు. పాడి పశువులుంటాయి. కనుక పాలు, పెరుగు, నెయ్యి సమృద్ధిగా ఉండేవి. ప్రతి ఇంటా ఇవి సమృద్ధిగా ఉండేవి. క్రొత్తవారికి ఉచితంగా ఇచ్చేవారు. ఇది పల్లెటూరి సంస్కృతి.

కాని వ్యవసాయంలో కన్నీరే మిగులుతోంది. పశుపోషణ తలకు మించిన భారమౌతోంది. అందుచేత పల్లెటూళ్ళు తమ సంస్కృతిని కోల్పోతున్నాయి. అసలే జనాలు లేరు. ఉన్నవారికి బాధలు. ఇక సంస్కృతి ఎలా నిలబెట్టుకొంటారు.

ఆత్మ :
పల్లెటూరికి ఆత్మ ఆత్మీయత. ఎవరినైనా ఆత్మీయంగా పలకరించడం పల్లెటూరి లక్షణం. కేవలం పలకరించడమే కాదు, వారి కష్ట సుఖాలలో పాల్గొనడం, పదిమందికీ పెట్టడం, గలగలా నవ్వడం, చకచకా పనులు చేయడం. కల్మషం, మోసం తెలియకపోవడం, ఇవన్నీ పల్లెటూరి లక్షణాలు.

కాని, పట్నవాసపు పోకడలు నేడు బాగా పెరిగిపోయాయి. అందుచేత ‘అమాయకత్వం’ స్థానంలో ‘మాయకత్వం’ వచ్చింది. మాయకత్వం ఉన్నచోట పై పేరాలో లక్షణాలేవీ ఉండవు. అందుచేతనే పల్లెటూరికి ‘ఆత్మ’ కూడా తొందరగా కనుమరుగవుతోంది.

పల్లెటూళ్ళు కళకళలాడాలంటే వాటి ఉనికి, సంస్కృతి, ఆత్మలను కాపాడాలి. కేవలం ఉపన్యాసాల వల్ల ఇవి సాధ్యం కావు. పట్టుదలతో కృషి చేయాలి. సమాజాన్ని పూర్తిగా సంస్కరించాలి.

ఆ) ‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు’ దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి.
(లేదా)
“పల్లెటూరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది.” మీ అభిప్రాయం తెల్పండి.
(లేదా)
పల్లె జీవితంలోని అనుకూల అంశాలను వివరిస్తూ పది వాక్యాలలో ఒక వ్యాసం రాయండి.
జవాబు:
పల్లెటూళ్ళలో ట్రాఫిక్ సమస్యలు ఉండవు. రణగొణ ధ్వనులు ఉండవు. అందుచేత ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద పెద్ద కర్మాగారాలుండవు. వాహనాల పొగ ఉండదు. అందుచేత కాలుష్యం ఉండదు. కాలుష్యం లేని నివాసమే స్వర్గం కదా ! జనాభా తక్కువ కనుక సమస్యలుండవు. ఇరుకు ఉండదు. చక్కగా పచ్చటి ప్రకృతి, ఎటుచూసినా వరిచేలు, జొన్నచేలు, మొక్కలు, చెట్లతో కళకళలాడుతూ ఉంటుంది. హాయిగా అమ్మ ఒడిలోని కమ్మదనం అంతా పల్లెటూరి జీవితంలో అనుభవించవచ్చును.

ఎవర్ని పలకరించినా ఆప్యాయంగా మాట్లాడతారు. కష్ట సుఖాలలో చేదోడు వాదోడుగా ఉంటారు. దొంగల భయం ఉండదు. పక్షుల కిలకిలలతో రోజు ప్రారంభమౌతుంది. వెన్నెలలో ఆటలతో, కబుర్లతో, కథలతో, నవ్వులతో, నిద్రమంచం పైకి చేరతాం.

ఇంతకంటే సౌఖ్యవంతమైన జీవితం ఎక్కడా ఉండదు. అందుకే పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు అని కచ్చితంగా చెప్పవచ్చును.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) మీరు చూసిన పల్లెటూరులోని మనుష్యుల మధ్య సంబంధాలు, అక్కడి ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి.
జవాబు:

మసకపల్లి,
X X X XX

ప్రియమైన రాంబాబుకు,
సూరిబాబు వ్రాయునది.
ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలుస్తాను. మొన్న వేసవి సెలవులలో నేను కోనసీమలోని ఆదుర్రు వెళ్లాను. అక్కడ చాలా బాగుంది. ఆ విశేషాలు రాస్తాను.

అమలాపురం డివిజన్లో మామిడికుదురు మండలంలోని గ్రామం ఆదుర్రు. ఊరంతా పచ్చటి పంటపొలాలు. ఎటుచూసినా తివాచీ పరచినట్లుగా కనిపిస్తాయి. అంతేకాకుండా కొబ్బరిచెట్లు చాలా ఉన్నాయి. బారులు తీరి నిలబడిన సైనికుల్లా ఉంటాయి. ఇంకా రకరకాల పూలమొక్కలు, చెట్లు ఉన్నాయి. అవి అన్నీ చూస్తుంటే అస్సలు సమయం తెలియదు. ఆ ఊర్లో నది ఉంది. దాని పేరు వైనతేయ నది. ఆ నది ఒడ్డున బౌద్ధస్థూపం ఉంది. ఎత్తుగా ఉంది. అక్కడ బుద్ధునికి సంబంధించినవి ఉన్నాయట. చాలా పెద్ద పెద్ద ఇటుకలున్నాయి. పెద్ద మట్టి చెట్టు ఉంది. దాని ఊడలతో ఉయ్యాల ఊగాము. భలే సరదాగా ఉంది. ఆ చెట్లపై ఎన్నో పక్షులున్నాయి. అవి చేసే గోల భలే తమాషాగా ఉంది.

అక్కడ ఎవరిని పలకరించినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఉపాధ్యాయులు నరసింహంగారు అనే పెద్దాయన ఆ ఊరు మొదట నిర్మింపబడిందని చెప్పారు. ‘ఆది ఊరు’ కనుక ఆదుర్రు అయింది అన్నారు. రెండు నెలల సెలవులు ఇట్టే అయిపోయాయి.

ఈసారి సెలవులకి మనిద్దరం కలసి వెళదాం. నువ్వెక్కడికైనా వెళ్ళావా? లేదా? రిప్లై రాయి. మీ అమ్మగారికి, నాన్నగారికి నా నమస్కారములని చెప్పు. ఇక ఉంటాను మరి. టా…టా…

ఇట్లు
నీ స్నేహితుడు,
సూరిబాబు.

చిరునామా:
మంత్రి ప్రగడ రాంబాబు, 10వ తరగతి నెం. 12,
ఎస్.డి.వి.ఆర్.ఆర్. హైస్కూలు,
కోలంక, తాళ్ళరేవు (మండలం), తూ! గో|| జిల్లా,

ఆ) ఈ పాఠం ఆధారంగా కొన్ని నినాదాలు, సూక్తులు రాయండి.
జవాబు:

1. నినాదాలు : 2. సూక్తులు:
1) వలసలు మానండి, పల్లెలు నిలపండి. 1) రైతు దేశానికి వెన్నెముక.
2) వ్యవసాయం చేద్దాం, ఆత్మగౌరవంతో జీవిద్దాం. 2) పల్లెటూర్లే దేశానికి పట్టుగొమ్మలు.
3) అప్పుకు భయపడకు, ఆశను పెంచుకో. 3) పల్లెను, తల్లిని కాపాడాలి.
4) పల్లెటూర్లే మనదేశ ధాన్యాగారాలు. 4) అన్నం పెట్టే తల్లివంటిదే పల్లె,
5) పల్లెటూరిని, తల్లిని విడిచిపెట్టకు. 5) పల్లెటూరులో జీవితం ప్రశాంతం.
6) పల్లెలు పచ్చగా ఉంటేనే మన బతుకులు పచ్చగా ఉంటాయి.
7) రణగొణ ధ్వనులు లేని పల్లెటూర్లు ప్రశాంతమైన పడకటిళ్ళు.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

అందమైన పల్లెటూరు ఎలా ఉంటుందో ఊహించండి. ప్రకృతి శోభలతో అలరారే అలాంటి గ్రామసీమ చిత్రాన్ని సేకరించండి. దాన్ని వర్ణిస్తూ, వివరాలను రాసి ప్రదర్శించండి. మీ మిత్రులు కూడా ఇలాగే రాస్తారు కదా! వీటితో “అందమైన గ్రామ సీమలు” అనే పుస్తక సంకలనం చేయండి. దానికి ముఖచిత్రం కూడా గీయండి. విషయసూచిక, ముందు మాట రాసి ప్రదర్శించండి.
జవాబు:
( అందమైన గ్రామాలు (సంకలన గ్రంథం) )
ముఖచిత్రం :
ప్రతి వర్ణనలోని విషయం వచ్చేలా ఉండాలి. (అట్ట)

అట్టపైన :
గుబురుగా ఉన్న చెట్ల సందులలోంచి సూర్యోదయం. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు. పెంకుటిళ్ళు, పాకలు చిత్రించాలి. పొలం పనులకు వెళ్ళే స్త్రీ, పురుషులను చిత్రించాలి. గంతులేస్తున్న లేగదూడలను చిత్రించాలి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 4

III. భాషాంశాలు :

పదజాలం

1. కింది పదాలు చూడండి. వాటికి సంబంధించిన పదాలతో కలపండి.
ఉదా : రైల్వేస్టేషను, …………., ……….., చేరుకోడం.
జవాబు:
రైల్వే స్టేషను, టిక్కెట్టు, ప్రయాణం, చేరుకోడం.

అ) వర్షాకాలం, ………….., ………………… ధాన్యం.
జవాబు:
వర్షాకాలం, విత్తడం, నూర్చడం, ధాన్యం.

ఆ) మడిదున్నడం, …………., …………., పంట.
జవాబు:
మడిదున్నడం, నీరు పెట్టడం, వరినాటడం, పంట.

ఇ) పాఠశాల, …………, ………… జీవితంలో స్థిరపడడం.
జవాబు:
పాఠశాల, చదువు, ఉద్యోగం, జీవితంలో స్థిరపడడం.

ఈ) లేఖ, ………….., ……………, చేరడం.
జవాబు:
లేఖ, విషయం , చిరునామా, చేరడం.

ఉ) పనిచేయడం, …….., ……., ఆనందంగా జీవించడం.
జవాబు:
పనిచేయడం, సంపాదించడం, ఖర్చు పెట్టడం, ఆనందంగా జీవించడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

2. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) పొద్దస్తమానం
ఆ) చమత్కారం
ఇ) సాన్నిధ్యం
ఈ) కష్టఫలం
ఉ) కడుపులు మాడ్చుకొను
ఊ) అడుగున పడిపోవు

అ) పొద్దస్తమానం : పొద్దస్తమానం పనిచేస్తే, ‘రాత్రి బాగా నిద్ర పడుతుంది.
ఆ) చమత్కారం : చమత్కారంగా మాట్లాడే వారంటే నాకిష్టం.
ఇ) సాన్నిధ్యం : భక్తులు దేవుని సాన్నిధ్యంలో ఆనందపడతారు.
ఈ) కష్టఫలం ” : ఎవరి కష్టఫలం వారికి మధురంగా ఉంటుంది.
ఉ) కడుపులు మాడ్చుకొను : కొంతమంది కడుపులు మాడ్చుకొని పిల్లలను చదివిస్తారు.
ఊ) అడుగున పడిపోవు : జ్ఞానం విషయంలో అడుగున పడిపోవడం పనికిరాదు.

3. కింది పదాలు/ వాక్యాలను వివరించి రాయండి.

అ) పురిటిలోనే సంధి కొట్టడం :
సాధారణంగా ‘సంధి’ అనే వ్యాధి వచ్చినవారు బ్రతకరు. ఇది వృద్ధాప్యంలో వస్తుంది. ‘సంధి’ అంటే ‘మతి చలించడం’ అని చెప్పవచ్చును. ‘సంధి’ వచ్చినవారు సంబంధంలేని మాటలు మాట్లాడతారు. ఇది కూడా ఒకరకపు వాతరోగంగా ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది.

పురిటిలో ఏ రకమైన వాతరోగమైనా రావచ్చును. కాని, ‘సంధి వాతరోగం’ రాదు. అటువంటిది పురిటి శిశువుకు ‘సంధి వాతం’ రావడం జరిగితే ఆ శిశువు బ్రతకదు.

అదే విధంగా ప్రారంభంలోనే పాడైపోయిన పని గురించి వివరించేటపుడు ఈ జాతీయం ఉపయోగిస్తారు.

సొంతవాక్యం :
చదువుదామని పుస్తకం తీయగానే కరెంటు పోవడంతో పురిటిలోనే సంధి కొట్టినట్లయింది ఈ రోజు చదువు.

ఆ) కలుపుతీయడం :
చేలలో వేసిన పంటతో బాటు అనవసరమైన మొక్కలు కూడా పెరుగుతాయి. ఈ అనవసరమైన మొక్కలను ‘కలుపు మొక్కలు’ అంటారు. చేనుకు వేసిన ఎరువును ఈ కలుపు మొక్కలు కూడా తీసుకొంటాయి. బాగా పెరుగుతాయి. వీటి వలన చేనుకు బలం తగ్గుతుంది. అందుచేత అనవసరమైన మొక్కలను (కలుపు మొక్కలను) పీకి, పారవేస్తారు. దీనినే కలుపు తీయడం అంటారు.

అలాగే సమాజంలో ఉంటూనే, సమాజాన్ని పాడుచేసేవారిని కూడా కలుపు మొక్కలు అంటారు.

సొంతవాక్యం :
1) చేలో కలుపు తీయడానికి నలుగురు కూలీలు కావాలి.
2) లంచగొండులైన కలుపు మొక్కలను ఏరిపారేస్తేనే సమాజం బాగుపడుతుంది.

ఇ) గ్రామోద్ధరణం :
గ్రామానికి ఉన్న సమస్యలను పరిష్కరించడాన్నే గ్రామోద్దరణం అంటారు. ఉదాహరణకు మురుగునీటి సమస్యను నివారించడం, విద్యుత్తు, ఆసుపత్రి, మంచినీరు మొదలైనవి కల్పించడం.

సొంతవాక్యం :
“గ్రామోద్ధరణమే దేశోద్ధరణం” అన్నారు గాంధీజీ.

ఈ) ఉన్నదంతా ఊడ్చుకపోవడం :
ఊడ్చుకపోవడం అంటే పూర్తిగా నాశనం కావడం. అధిక వర్షాలు, గాలివాన వంటి ఉపద్రవాలతో పంటలు నష్టపోగా, ఇంతలో వరదలు, ఉప్పెనలు వంటివి వచ్చి, పూర్తిగా పంటలు కొట్టుకుపోవడం వంటివి జరిగితే “ఉన్నదంతా ఊడ్చుకుపోయిందని” అంటారు. పూర్తిగా నష్టం కలిగించిందని భావం.

వ్యాకరణాంశాలు

1. కింది. వాక్యాల్లోని సంధులను విడదీసి, సంధి సూత్రంతో సమన్వయం చేయండి.
అ) ఆహాహా! ఎంత వైపరీత్యము !
ఆ) జంతు ప్రదర్శనశాలలో ఏమేమి చూశావు ?
ఇ) అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.
ఈ) వెన్నెల పట్టపగలును తలపిస్తున్నది.

సంధి పదాలు :
ఆహాహా, ఏమేమి, అక్కడక్కడ, వెన్నెల, పట్టపగలు, తలెత్తవచ్చు, తలపిస్తున్నది.
వివరణ :

ఆమ్రేడిత సంధి
సూత్రము : అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తఱచుగానగు.

సూచన : ఒక పదం రెండుసార్లు ఉచ్చరిస్తే, రెండవదానిని ఆమ్రేడితం అంటారు. ఇక్కడ అత్వ, ఇత్వ, ఉత్వ సంధులు చెప్పకూడదు. ఆమ్రేడిత సంధి మాత్రమే చెప్పాలి.
ఆహా + ఆహా ఆహాహా (ఆ + ఆ = ఆ)
ఏమి + ఏమి = ఏమేమి (ఇ + ఏ = ఏ)
అక్కడ + అక్కడ = అక్కడక్కడ (అ + అ = అ)

ఆమేడిత సంధి

సూత్రము :
ఆమ్రేడితము పరమగునపుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణంబుల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు. కడ, చివర, తుద, మొదలైనవి కణాదులు.
పగలు + పగలు = పట్టపగలు

ప్రాతాది సంధి
సూత్రము :
అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొకచో గానంబడియెడి.

వివరణ :
ప్రాతాదుల తొలియచ్చుమీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగానగు – ఈ సూత్రం ద్వారా ప్రాతాదులలో . ‘వెల్ల’ అనే పదం లేకపోయినా పైన వ్రాసిన సూత్రం వలన ‘ల్ల’ కు లోపం వస్తుంది. వెల్ల + నైల = వెన్నెల

అత్వ సంధి
సూత్రము :
అత్తునకు సంధి బహుళంబుగానగు.
తల + ఎత్తవచ్చు . – తలెత్తవచ్చు (అ + ఎ = ఎ)

ఉత్వ సంధి
సూత్రము :
ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు.
తలపు + ఇస్తు + ఉన్నది = తలపిస్తున్నది – (ఉ + ఇ = ఇ, ఉ + ఉ = ఉ)

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

2. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.

అ) రాము పాఠం చదివాడు. రాము పాఠం అర్థం చేసుకున్నాడు.
జవాబు:
రాము పాఠం చదివి, అర్థం చేసుకున్నాడు.

ఆ) వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు. వైద్యుడు మందులు ఇస్తాడు.
జవాబు:
వైద్యుడు ప్రథమ చికిత్స చేసి, మందులు ఇస్తాడు.

ఇ) అక్క టీవీ చూస్తున్నది. అక్క నృత్యం చేస్తున్నది.
జవాబు:
అక్క టీవీ చూస్తూ, నృత్యం చేస్తున్నది.

3. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.
అ) రామకృష్ణుడు గురువు. వివేకానందుడు శిష్యుడు.
జవాబు:
రామకృష్ణుడు మరియు వివేకానందుడు గురుశిష్యులు.

ఆ) సీత సంగీతం నేర్చుకుంటున్నది. సీత నృత్యం నేర్చుకుంటున్నది.
జవాబు:
సీత సంగీతం మరియు నృత్యం నేర్చుకుంటున్నది.

ఇ) రంగారావుకు పాడటమంటే ఆసక్తి. రంగారావుకు వినడమంటే విరక్తి.
జవాబు:
రంగారావుకు పాడటమంటే ఆసక్తి మరియు వినడమంటే విరక్తి.

ఈ) శ్రీను బడికి వచ్చాడు. జాన్ రెడ్డి బడికి వచ్చాడు. హస్మత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీను, జాన్‌ రెడ్డి మరియు హస్మతలు బడికి వచ్చారు.

ఉ) ఆయన కవి. ఆయన గాయకుడు. ఆయన విద్యావేత్త.
జవాబు:
ఆయన కవి, గాయకుడు మరియు విద్యావేత్త. ప్రాతాది సంధి

4. కింద గీత గీసిన పదాలను విడదీయండి. మార్పులు గమనించండి.
అ) పూరెమ్మ అందంగా ఉన్నది.
ఆ) గురుశిష్యులు పూదోటకు వెళ్ళారు.
ఇ) రవికి పాల మీఁగడ అంటే చాలా ఇష్టం.
ఈ) కొలనులో కెందామరలు కొత్త శోభను వెదజల్లుతున్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

సంధి జరిగిన తీరును గమనించండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 1

అదనపు సమాచారము

సంధులు

1) నెచ్చెలి = నెఱ + చెలి – ప్రాతాది సంధి
2) మాయమ్మ = మా + అమ్మ – యడాగమ సంధి
3) మామయ్య = మామ + అయ్య – అత్వ సంధి
4) స్వార్థాన్ని = స్వ + అర్థాన్ని – సవర్ణదీర్ఘ సంధి
5) సంవత్సరాది = సంవత్సర + ఆది – సవర్ణదీర్ఘ సంధి
6) చైత్రారంభం = చైత్ర + ఆరంభం – సవర్ణదీర్ఘ సంధి
7) గ్రామోద్ధరణము = గ్రామ + ఉద్ధరణము – గుణసంధి
8) పట్నాలు = పట్నము + లు – లలనల సంధి
9) సౌఖ్యాలు = సౌఖ్యము + లు – లులనల సంధి
10) మనోహరము = మనః + హరము – విసర్గ సంధి
11) పల్లెటూరు = పల్లె + ఊరు – టుగాగమ సంధి

గమనిక : ‘పల్లె’ అన్నచోట ఉత్వం లేదు. ఎత్వం ఉంది. అయినా టుగాగమం వచ్చింది.

ప్రకృతి – వికృతి

ఆశ్చర్యము – అక్కజము, అచ్చెరువు
స్నేహము – నేస్తము, నెయ్యము
ఆలస్యము – ఆలసము
రాశులు – రాసులు
నిద్ర – నిద్దుర
నిత్యము – నిచ్చలు
సఖా – సకుడు
పక్షము – పక్క
హృదయము – ఎద, ఎడద
గర్భము – కడుపు

సమాసాలు 
AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 2
AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 3

రచయిత పరిచయం

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు 5
నివాసం :
డా॥ బోయి భీమన్న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామవాసి. 19 సెప్టెంబర్, 1911లో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు.

భీమన్న మాట :
“ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు – పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు”, “ఈనాడు సాహిత్యమంటే కులం, మతం, వర్గం, ముఠా” అని తన కలం ద్వారా, గళం ద్వారా అనేకమార్లు వెలిబుచ్చారు.

భీమన్న బాట :
ఒకవైపు జాషువా, మరోవైపు శ్రీశ్రీ. ఇద్దరూ సాహిత్య చక్రవర్తులే, వారిద్దరి శైలి సాహితీ లోకాన్ని ఉర్రూతలూగిస్తోంది. అయినా భీమన్న తన శైలితో ప్రకంపనలు పుట్టించారు. అనేక సాహితీ ప్రక్రియలతో బడుగుల, దళితుల జీవితాలు చిత్రించారు. చైతన్యం కలిగించారు.

భీమన్న పట్టు :
అస్పృశ్యత రాజ్యమేలుతున్న రోజులవి. ఎన్నో కష్టాలు, మరెన్నో అడ్డంకులు. అన్నీ అధిగమించాడు. విద్యనభ్యసించాడు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ బోధనలతో ప్రభావితుడయ్యాడు. తన కలం ద్వారా అస్పృశ్యతను రూపుమాపాలి అని ఆలోచించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. జర్నలిస్టుగా పనిచేశాడు. 1940-45 మధ్యకాలంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు.

రచనలు :
తన 11వ ఏట రచనలు ప్రారంభించారు. గుడిసెలు కాలిపోతున్నాయ్, పాలేరు, జానపదుని జాబులు, రాగవైశాఖి, పిల్లీశతకం, ధర్మంకోసం పోరాటం మొ||నవి 70కి పైగా రచనలు చేశారు. ఈయన రచించిన ‘పాలేరు’ ఎంతోమంది పేదలు, దళితుల కుటుంబాలలో వెలుగులు నింపింది. ఎంతోమంది తమ పిల్లలను పాలేరు వృత్తి మాన్పించారు. పాఠశాలల్లో చేర్పించారు. ‘పాలేరు’ నాటక స్ఫూర్తితో విద్యనభ్యసించిన వారెందరో ఉన్నత స్థానాలను అధిష్ఠించారు.

అవార్డులు – రివార్డులు :
డా|| బోయి భీమన్నగారు రచించిన “గుడిసెలు కాలిపోతున్నాయ్” రచనకు 1975లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును, గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 1991లో చెన్నైలోని ‘రాజ్యలక్ష్మీ ఫౌండేషన్’ వారు ‘రాజ్యలక్ష్మి’ అవార్డుతో సత్కరించారు. 1978 నుండి 1984 వరకు రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా ఉన్నారు.

ఆస్తమయం :
విద్యావేత్త, సాహితీవేత్త, జర్నలిస్టు మొ॥ అనేకవిధాల బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. సమసమాజ నిర్మాణం కోసం పాటుపడ్డారు. అటువంటి మహామనీషి అనారోగ్యంతో డిశంబర్ 16, 2005న స్వర్గస్తులయ్యారు.

కఠిన పదాలకు అర్థాలు

కరకట్టు = కరెక్ట్ (correct) – సరియైనది
నిరుద్యోగం = ఉద్యోగం లేకపోవడం దీపం బుడ్డి – చిన్నమూతి గల వెడల్పైన (దీపం) పాత్ర
అణా = 6 పైసలు (పాతకాలపు నాణెం)
దుకాణం = పచారీ కొట్టు
పక్షం = తరపు
సాన్నిధ్యం = దగ్గరగా ఉండడం
తర్కం = వాదన
మినపకుడుం = వాసెనపోలు (మినప పిండి, వరినూకతో కలిపి ఆవిరిపై ఉడికించే ఇడ్లీ వంటిది)
అయ్య = తండ్రి
అంతరం = తేడా
తట్టింది = తోచింది
గుణించి = లెక్కించి
దమ్మిడీ = 5 కాసుల నాణెము (లేక) రెండు కాసుల నాణెము (లేక) 4 పైసా
దేవుళ్ళాడటం = ప్రాధేయపడడం
కాళ్ళు పట్టుకోవడం = దీనంగా బ్రతిమాలడం
సఖా = స్నేహితుడా !
త్రిప్పలు = బాధలు
కట్టడి = ఆంక్ష
అధోగతి = హీనమైన స్థితి
చందం = విధం
చీమకుట్టిన చందం = కొద్దిపాటి బాధ కలిగినట్లు
తొలకరించడం = తొలిసారి వర్షం పడడం (ఆషాఢమాసంలోని జల్లులు)
జైలు = ధాన్యం కొలత
ఇనాందారు = భూమి కలవాడు
నానుట = బాగా తడిసిపోవడం
ఏడు = సంవత్సరం
పురిటిలోనే సంధి కొట్టడం = ప్రారంభంలోనే పని పాడవ్వడం
అర్థ హృదయుడు = దయగల మనస్సు కలవాడు
బోదె = చిన్నకాలువ
అంతర్వేది వెళ్ళగానే = మాఘశుద్ధ ఏకాదశికి అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, అది పూర్తవ్వగానే

ఇవి తెలుసుకోండి

1 దమ్మిడీ = ½ పైసా
3 దమ్మిడీలు = 1 కాని (లేదా) 1 డబ్బు
2 కానులు = 1 ఏగాని (లేదా) అర్ధణా
2 అర్ధణాలు = అణా (6 పైసలు)
2 అణాలు = బేడ
2 బేడలు= 1 పావలా
2 పావలాలు = అర్ధ రూపాయి
2 అర్ధ రూపాయిలు = 1 రూపాయి

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
లేఖలు ఎప్పుడెప్పుడు రాస్తారు? ఎందుకు?
జవాబు:
సమాచారాన్ని ఇతరులకు తెలియజేయడానికి లేఖలు రాస్తారు. అనేక సందర్భాలలో లేఖలు రాస్తాం. పెండ్లి సమాచారాన్ని తెలియజేయడానికి శుభలేఖలు రాస్తాం. ఇళ్ళల్లో జరిగే శుభ, అశుభకార్యాల సమాచారం బంధుమిత్రులకు తెలియజేయడానికి లేఖలు రాస్తాం. మన ఇళ్ళలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించడానికి లేఖలు రాస్తాం.

వస్తువులు కొనడానికి, దూర ప్రాంతాలలోని దుకాణాలకు, కంపెనీలకు లేఖలు రాస్తాం. మనకు రావలసిన బాకీల వసూళ్ళకు కూడా లేఖలు రాస్తాం. కార్యాలయాలలో సమాచారం తెలుసుకునేందుకు లేఖలు రాస్తాం. కార్యాలయం నుండి మనకు కావలసిన కాగితాలు తీసుకునేందుకు లేఖలు రాస్తాం.

ప్రశ్న 2.
“అస్థిర భావం” అంటే మీకేమి అర్థమైంది?
జవాబు:
భావం అంటే మన ఆలోచనల ద్వారా ఏర్పడిన అభిప్రాయం. స్థిరభావం అంటే శాశ్వతమైన, కచ్చితమైన అభిప్రాయం. అస్థిర భావం అంటే శాశ్వతం కాని, కచ్చితం కాని అభిప్రాయం.
ప్రస్తుతం పాఠ్యాంశాన్ని బట్టి ఒక కచ్చితమైన ప్రణాళికతో కూడిన అభిప్రాయం లేనిదే అస్థిర భావం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 3.
మన చదువులు దైనందిన జీవితంలో ఉపయోగ పడతాయని భావిస్తున్నారా? ఎలా?
జవాబు:
మన చదువులు దైనందిన జీవితంలో ఉపయోగ పడతాయి. ఎందుకంటే పాఠ్యాంశంలోని ప్రతి అంశంపైనా సొంతంగా ఆలోచిస్తున్నాం. సొంత మాటలతో చెబుతున్నాం. విశ్లేషిస్తున్నాం. వ్యాఖ్యా నిస్తున్నాం. చర్చిస్తున్నాం. వాదప్రతివాదనలు చేస్తున్నాం. సొంతమాటలలోనే రాస్తున్నాం. ప్రతి సబ్జెక్టులోను ఇదే విధానం కొనసాగుతోంది. అందుచేత ఇప్పుడు మా తరగతి గది ఒక ప్రపంచపు నమూనా.

ఇదే విధానం డిగ్రీ వరకు కొనసాగితే మంచిది. అపుడు నిజజీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకూ భయపడం. మేమే ఆలోచించి పరిష్కరిస్తాం. పిల్లల అభిప్రాయాలకు, మాటలకు, విశ్లేషణలకు, వ్యాఖ్యానాలకు, చర్చలకు అవకాశం కల్పించే చదువులే దైనందిన జీవితంలో ఉపయోగపడతాయి.

ఉదాహరణకు ఈ పాఠంలో గ్రామాలలోని ‘పేదరికం’ గురించి తెలుసుకున్నాం. దాని నివారణా పాయాలు తరగతి గదిలో చర్చించాం. మా అభిప్రాయాలు, చర్చ మా పెద్దలకు చెప్పాం . గ్రామాలలో పేదలను కలుసుకొని వారి పేదరికానికి కారణాలు తెలుసు కొన్నాం. పరిష్కార మార్గాలు సూచించాం. అవి ఎంత వరకు సఫలం అయ్యాయో కొన్నాళ్ళు గడిచాక తెలుసు
కొంటాం. లోపాలుంటే సవరించుకొంటాం.

ప్రశ్న 4.
మీరు చదువు పూర్తయిన తరువాత ఏం చేస్తారు? ఏం కావాలనుకుంటున్నారు?
జవాబు:
(సూచన : పిల్లలందరూ వారి వారి అభిలాషలు చెప్పాలి. వారు ఎన్నుకొనే రంగాలు చెప్పనివ్వాలి.)
ఏ వృత్తి చేపట్టినా సమాజానికి ఉపయోగపడాలి. నీతిగా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. లంచగొండితనం పనికిరాదు. సమర్థంగా పనిచేయాలి. ఆదర్శవంతంగా ఉండాలి.

ప్రశ్న 5.
ఈ రోజుల్లో మనుషుల్లో స్వార్థం ఎందుకు పెరుగుతోంది?
జవాబు:
ప్రక్కవారిని పట్టించుకొనే తీరిక లేదు. స్నేహం చేయరు. ఆటలు లేవు. సామూహిక కార్యక్రమాలు లేవు. ఒకరి కష్ట సుఖాలలో వేరొకరు పాల్గొనడం లేదు.

నేను, నా కుటుంబం అనే భావం పెరిగింది. అందుచేతనే స్వార్థం పెరుగుతోంది. సుఖాలు అనుభవించాలనే కోరిక కూడా కారణం. ఒంటరిగా ఉంటే ఎక్కువ సుఖాలు అనుభవించవచ్చును అనే ఆలోచన. పైవన్నీ స్వార్థం పెరగడానికి కారణాలు.

ప్రశ్న 6.
“పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైంది.” దీనిపై మీ అభిప్రాయాలు తెల్పండి.
జవాబు:
పల్లెటూరి జీవితం చాలా బాగుంటుంది. పక్షుల కిలకిలలతో మెలుకువ వస్తుంది. ఎటుచూసినా పచ్చని చెట్లు, వరి పొలాలు కన్పిస్తాయి. పిల్ల కాలువలలో చేపల మిలమిలలూ, ఉదయకాలపు లేత ఎండలో నీటి తళతళలూ, లేగదూడల గంతులు, పొలాలకు వెళ్ళే వారి హడావుడి, పిల్లల అల్లరి, నీటి బిందెలతో స్త్రీలు, చక్కటి వాతావరణం. కలుషితం కాని వాతావరణం. కల్మషం తెలియని మనుషుల పలకరింపులతో పల్లెటూరి జీవితం చక్కగా ఉంటుంది. ఎవరిని పలకరించినా నవ్వుతూ మాట్లాడతారు. చక్కటి కథలు చెబుతారు.

ప్రశ్న 7.
‘కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది’ అంటే మీకేమి అర్థమైంది ? దీన్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు?
జవాబు:
పగలనక, రాత్రనక చేనులో కష్టపడేవాడు రైతు. అతను అనేక కష్టనష్టాలకోర్చి పంటను పండిస్తాడు. రెక్కలు ముక్కలయ్యేలాగా పనిచేస్తాడు. చలిలో, మంచులో తడుస్తాడు. పంటను కంటికి రెప్పలాగా కాపాడతాడు. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొంటాడు. ఇంటిని, కుటుంబాన్ని పట్టించుకోడు. అంత కష్టపడి సంపాదించిన పంటనూ భూస్వామికి అప్పగించేస్తాడు. తను, తన కుటుంబం పస్తులుంటారు.

ఇల్లు కట్టే కూలీలు కూడా అంతే. ఎంతో కష్టపడి ఇల్లు కడతారు. చక్కటి మేడ కడతారు. వాళ్ళు మాత్రం పూరిగుడిసెల్లో ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు, కూలిపనులు చేసేవారి జీవితాలు అన్నీ ఇంతే, కష్టం వాళ్ళది, ఫలితం యజమానులది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 8.
చలిమంటలు వేసుకుంటూ, రైతులు కబుర్లు చెప్పు కొంటారు కదా! వాళ్ళు ఏఏ విషయాల గురించి కబుర్లు చెప్పుకుంటారు? ఊహించండి.
జవాబు:
వ్యవసాయం గురించి చెప్పుకొంటారు. పొలం గట్ల గురించి చెప్పుకొంటారు. కూలిరేట్ల గురించి చెప్పు కొంటారు. దుక్కి టెద్దుల గురించి, వాటి అనారోగ్య సమస్యల గురించి చెప్పుకొంటారు. పాడి పశువుల గురించి చెప్పుకొంటారు. పశుగ్రాసం, దాణా గురించి చెప్పుకొంటారు. పంట పండించడంలో పాట్లు, చీడ పీడలు, చేలగట్ల గురించి చెప్పుకొంటారు. పంటరేట్లు గురించి బాధపడతారు. అప్పుల గురించి వేదన పడతారు. అప్పులు తీరే మార్గాలు అన్వేషిస్తారు. అప్పులు ఇచ్చిన వాళ్ళు పెట్టే బాధల గురించి చెప్పుకొంటారు. రాజకీయాలు, లోకాభిరామాయణం మాట్లాడుకొంటారు. అక్కడ అన్ని విషయాలు చెప్పుకొంటారు.

ప్రశ్న 9.
పల్లెటూళ్ళకు వెళితే మనం ఏ ఏ విషయాలు తెలుసు కోవచ్చు?
జవాబు:
మానవత్వం తెలుస్తుంది. స్నేహం విలువ తెలుస్తుంది. కలసిమెలసి ఉండడమెలాగో తెలుస్తుంది. పక్షుల కిలకిలలు, జంతువుల కలకలలు తెలుస్తాయి. పచ్చటి ప్రకృతికి దగ్గరగా ఉండవచ్చు. హాయిగా ఉండవచ్చు. కలుషితం కాని స్వచ్చమైన వాతావరణంలో జీవించ వచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే, అమ్మ చేతి గోరు ముద్దలు తిన్నట్లు ఉంటుంది. అమ్మ జోలపాట వింటున్నట్లుంటుంది. తాత చెప్పే కథల మాధుర్యం తెలుస్తుంది. నాన్న తోడులోని భరోసా తెలుస్తుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 2nd Lesson అమరావతి Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 2nd Lesson అమరావతి

10th Class Telugu 2nd Lesson అమరావతి Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

సీ॥ సూర్యాది గ్రహరాశి సుప్రభాతము పల్కి
కరముల స్పృశియించు పురము నిలను
కృష్ణాతరంగిణీ కృతశుద్ధ పావన
గంభీరత నలరు కనక నగరి
బుద్ధాది మౌనీంద్ర పుణ్యపాదములతో
పరమపావనమైన పురము భువిని
రాజాధిరాజుల రాజధానిగ వెల్గి
యాంధ్ర జాతికి వన్నె యమరపురము

తే॥గీ॥ తెలుగు వెలుగుల జిలుగులు చిలకరించి
కలుములవెలది నిలయమై బలిమిబెంచి
సకలసురల యాశీస్సుల సారమౌచు
విశ్వయవనికపై వెల్లు వీటిఁగనుడు

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పద్యములోని నగరం ఏ నది ఒడ్డున ఉంది?
జవాబు:
పై పద్యంలోని నగరం కృష్ణానది ఒడ్డున ఉంది.

ప్రశ్న 2.
పద్యంలో ఏ పట్టణం గురించి చెప్పారు?
జవాబు:
పద్యంలో అమరావతి పట్టణం గురించి చెప్పారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ప్రశ్న 3.
పద్యంలోని పట్టణం ఏ భాషాప్రాంతంలో ఉండి ఉంటుంది?
జవాబు:
పద్యంలోని పట్టణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా కృష్ణానదీ తీరంలో “ఆంధ్ర” భాషా ప్రాంతంలో ఉంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

1. ఈ కింది అంశాలను గురించి చర్చించండి.

అ) ఇప్పటివరకు మీరు ఏఏ నగరాలు చూశారు? మీరు చూసిన నగరాలలో మీకు నచ్చిన అంశాలను, నచ్చని అంశాలను తెలుపండి.
జవాబు:
నేను మా తాతగారితో మార్చి 2వ తేదీన విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నం చాలా అందమైన నగరం. నాకు చాలా నచ్చింది. మరునాడు మార్చి 3వ తేదీన కళాభారతికి వెళ్ళాము. అక్కడ సంగీత కచేరీ జరుగుతోంది.

కళాభారతిని 1991 మార్చి 3వ తేదీన స్థాపించారని మా తాతగారు చెప్పారు. సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు సుసర్ల శంకర శాస్త్రిగారి కలలకు ప్రతీకగా కళాభారతి 11 మే, 1991న ప్రారంభించబడిందని కూడా మా తాతగారు చెప్పారు. ఇంకా కైలాసగిరి, రామకృష్ణా బీచ్, షిప్ యార్డు మొ||వి చూశాను. అన్నీ బాగున్నాయి.

కాని, రోడ్లన్నీ గతకులమయంగా ఉన్నాయి. మురికికాలువ కంపు కూడా ఎక్కువ. ట్రాఫిక్ చాలా ఎక్కువ. అది నాకు నచ్చలేదు.

నేను మా మావయ్యతో మేలో చెన్నై వెళ్ళాను.
చెన్నైలో మెరీనా బీచ్, గాంధీ బీచ్, ప్లానిటోరియం, జంతు ప్రదర్శన శాల, క్వీర్లాండ్, మహాబలిపురం మొదలైనవి చూశాను. చాలా బాగున్నాయి. కాని, ఎండ వేడి ఎక్కువ. ఆటోరేట్లు ఎక్కువ. అదే నాకు నచ్చలేదు.

నేను మా బావతో ఏప్రిల్ లో ఒకసారి విజయవాడ వెళ్ళాను.
అక్కడ కృష్ణానది, ప్రకాశం బ్యారేజి చాలా బాగున్నాయి. అక్కడ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నివసించిన ప్రాంతం చూశాను, చాలా పొంగిపోయేను.

కాని, జనాభా చాలా పెరిగి పోతున్నారు. కులాల పట్టింపు కొందరిలో కన్పించింది. అది నాకు నచ్చలేదు.

ముందు సంవత్సరం జూన్లో బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో ఎటుచూసినా పచ్చదనం, ఉద్యానవనాలు కనిపిస్తాయి. అందుకే దానిని భారతదేశపు ఉద్యానవనాల, నగరం అంటారట. లాల్ బాగ్, కబ్బన్ పాలు చాలా బాగున్నాయి. బెంగళూరులో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.

కాని, రోడ్లపై రద్దీ ఎక్కువ. జీవన వ్యయం కూడా చాలా ఎక్కువ. సిటీ బస్సులు, ఎ.సి. బస్సులు కూడా ఎక్కువగా కనిపించాయి. వాటి చార్జీలు కూడా మామూలు బస్సుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది నాకు నచ్చలేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఆ) నగర నిర్మాణంలో ఏఏ మౌళిక వసతులు ఏర్పాటు చెయ్యాలి?
జవాబు:
నగర నిర్మాణంలో అధునాతన సౌకర్యాలను ఏర్పాటుచేయాలి. మంచినీటి వసతి కల్పించాలి. భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యం కలిగించాలి. జనాభాకు తగిన ఆసుపత్రులు నిర్మించాలి. విద్యా సదుపాయం కలిగించాలి. భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలి. మార్కెట్ యార్డులు నిర్మించాలి. పటిష్టమైన రోడ్లు ఉండాలి. రవాణా వ్యవస్థ ఉండాలి. నివసించడానికి, కార్యాలయాలకు ప్రమాణాలననుసరించి భవంతులు నిర్మించాలి. పార్కులు ఏర్పాటు చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకు నిలబడే విధంగా నగర నిర్మాణం జరగాలి.

2. ఈ పాఠం ఆధారంగా కింది విషయాలను వివరించండి.
అ) శాతవాహనులు,
అ) భిక్షువు,
ఇ) చైత్యం,
ఈ) శిల్పకళ,
ఉ) ఆరామం
జవాబు:
అ) శాతవాహనులు :
క్రీ.పూ. 230 ప్రాంతంలో శాతవాహనులు స్వతంత్ర రాజులయ్యారు. శాతవాహన వంశస్థాపకుని సోదరుడు కన్హు (కృష్ణ) క్రీ.పూ. 207 నుండి క్రీ.పూ. 189 వరకు పాలించాడు.

కన్షుని వారసుడైన మొదటి శాతకర్ణి అశ్వమేధంతోబాటు అనేక యజ్ఞయాగాదులు జరిపించాడు. శాతవాహన వంశానికి చెందిన 30 మంది పాలకుల జాబితా పురాణాలలో ఉంది.

గౌతమీపుత్ర శాతకర్ణినే శాలివాహనుడు అంటారు. ఇతను శాతవాహనుల ప్రతిష్ఠను బాగా పెంచాడు. ఈయన గొప్ప హిందూ మతాభిమాని. 78లో విక్రమాదిత్యుని ఓడించి శాలివాహనయుగం లేదా శకయుగానికి నాంది పలికాడు. ఇప్పటికీ మారాఠీ ప్రజలు శాలివాహన యుగాన్నే అనుసరిస్తున్నారు. శాతవాహన చక్రవర్తులలో హాలుడు గాథా సప్తశతిని రచించి ప్రసిద్ధిపొందాడు.

శాతవాహనులు కట్టించిన కట్టడాలు, స్తూపాలు నేటికీ కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలలో ఉన్నాయి. అమరావతిలోని బౌద్ధస్తూపం చాలా ప్రసిద్ధిచెందింది. మహాయాన బౌద్ధం, ఆంధ్ర శిల్పకళ శాతవాహనుల వర్తక వాణిజ్యాల వలన ఆగ్నేయాసియాకు వ్యాపించాయి.

ఆ) భిక్షువు :
భిక్షువు అంటే యాచకుడు అని అర్థం. అంటే యాచన చేసి జీవించు సన్యాసి. భిక్షువుకు ఇల్లు, సంసారం మొదలైనవేమీ ఉండవు. కేవలం దైవ ధ్యానంతో సమయాన్ని గడుపుతాడు. తక్కువగా భుజిస్తాడు.

ఇ) చైత్యం :
చైత్యం అంటే బౌద్ధాలయం. ఈ బౌద్ధాలయంలో బౌద్ధ భిక్షువులు బుద్ధుని బోధనలను గూర్చి ఉపన్యాసాలు ఇస్తారు. ధ్యానం చేసుకొంటారు. బుద్ధుని ధర్మబోధనలను, జీవితాన్ని తెలియజేసే కీర్తనలు పాడతారు.

ఈ) శిల్పకళ :
శిల్పము అంటే రాతితో కాని, కర్రతో కాని, లోహాలతో కాని తయారుచేసే బొమ్మలు. ఆ బొమ్మలను తయారుచేయడంలో ప్రదర్శించే నైపుణ్యాన్ని శిల్పకళ అంటారు. శిల్పాలను రకరకాల ఆకారాలలో తయారుచేస్తారు. రకరకాల భంగిమలలో కూడా శిల్పాలను తయారుచేస్తారు.

ఉ) ఆరామం :
ఆరామం అంటే తోట, విహరించే ప్రాంతం లేదా విశ్రాంతి తీసుకొనే ప్రాంతం. బౌద్ధారామాలంటే బౌద్ధులు విశ్రాంతి తీసుకొనే ప్రాంతాలు.

3. కింది పేరాను చదివి, ఐదు ప్రశ్నలు తయారుచేయండి.

మా గ్రామానికి ప్రభుత్వం రవాణా సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యం, తపాలా, టెలిఫోన్ సౌకర్యం కలిగించింది. ఒక గ్రంథాలయం కూడా ఉంది. సామూహిక టెలివిజన్ కార్యక్రమాలు చూసే అవకాశముంది. రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థ కూడా ఉంది. మా గ్రామంలో ప్రతి ఇంట్లో చెట్లున్నాయి. మా గ్రామ మహిళామండలి, యువజన సంఘాలు గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. మా ఊరిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రావణమాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో అన్ని మతాలవాళ్ళూ కలిసి పాల్గొంటారు.
జవాబు:
ప్రశ్నలు:

  1. గ్రామానికి ఏయే సౌకర్యాలున్నాయి?
  2. గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న సంస్థలేవి?
  3. గ్రామంలోని దేవుడు పేరేమిటి?
  4. ఆ గ్రామంలో టెలివిజన్ ఉందా?
  5. పై పేరాకు తగిన శీర్షికను పెట్టండి.

II. వ్యక్తీకరణ సృజనాత్మకత

1. ఈ కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) రాజధాని నగరమంటే ఏమిటి? రాజధాని నగరానికి, మామూలు నగరాలకు గల తేడా ఊహించి రాయండి.
(లేదా )
రాజధాని నగరానికి, మామూలు నగరాలకు తేడాలుంటాయి’ – సమర్థిస్తూ వివరించండి.
జవాబు:
ఒక రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ పరిపాలించే పాలక వ్యవస్థ కేంద్రీకృతమై ఉండే నగరాన్ని రాజధాని నగరం అంటారు.

రాజధాని నగరం మామూలు నగరం
1) అత్యున్నత స్థాయి పరిపాలకులు, అధికారులు నివాసం ఉంటారు. 1) పాలకుల ప్రతినిధులు, క్రిందిస్థాయి అధికారులు ఉంటారు.
2) పరిపాలనా కార్యాలయాలు ఉంటాయి. 2) చిన్న కార్యాలయాలు ఉంటాయి.
3) జనాభా చాలా ఎక్కువ ఉంటుంది. 3) జనాభా కొంత తక్కువ ఉంటుంది.
4) సందర్శకుల సంఖ్య ఎక్కువ. 4) సందర్శకుల సంఖ్య తక్కువ.
5) రాష్ట్రం లేదా దేశానికి నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉంటుంది. 5) ఎక్కడైనా ఉంటుంది.
6) భద్రత ఎక్కువ. 6) సామాన్యమైన భద్రత కలిగి ఉంటుంది.
7) విద్యా, వైద్య మొదలైన సదుపాయాలు ఆధునికంగా ఉంటాయి. 7) సామాన్యమైన విద్యా, వైద్య సదుపాయాలుంటాయి.
8) రహదారులు పటిష్టంగా ఉంటాయి. 8) రహదారులు సామాన్యంగా ఉంటాయి.

ఆ) వివిధ పరిపాలకుల ఆశయాలూ, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ఎలా ప్రభావం చూపాయి?
జవాబు:
అమరావతిని మొదట పాలించిన వారు శాతవాహనులు. వీరి ప్రభావం వల్ల హిందూ సంస్కృతి పరిఢవిల్లింది. క్రీ.పూ. 230 ప్రాంతంలో శాతవాహనులు స్వతంత్ర రాజులయ్యారు. మొదటి శాతకర్ణి యజ్ఞయాగాదులకు చాలా ధనం ఖర్చు పెట్టాడు. అశ్వమేధంతో పాటు అనేక యజ్ఞయాగాదులు జరిపించాడు. ఈ విధంగా శాతవాహనుల వైదిక సంస్కృతి అమరావతిపై ప్రభావం చూపింది.

ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినుల హిందూమత సంస్కృతి సంప్రదాయాలు అమరావతిపై ప్రభావాన్ని చూపాయి. అమరేశ్వరాలయ ప్రతిష్ఠ అమరారామంగా విఖ్యాతి కలగడం జరిగింది.

కోట బేతరాజు పాలనలో ఓరుగల్లుతో కూడా సంబంధ బాంధవ్యాలేర్పడ్డాయి. ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, వంటి అనేక మంది పాలనలో ముస్లిం సంస్కృతి కూడా వేళ్ళూనుకొంది.

గౌతమబుద్ధుని సందర్శనతో బౌద్ధమతం, తర్వాతి కాలంలో జైనమత సంస్కృతి సంప్రదాయాలు అమరావతిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఇ) ఆచార్య నాగార్జునుని గురించి మీకు తెలిసిన విషయాలను రాయండి.
జవాబు:
నాగార్జునుడు బౌద్ధ మతాచార్యుడు. శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. సుహృల్లేఖ, రత్నావళి అనే గ్రంథాలు వారి స్నేహబంధానికి గుర్తులు. ఆ గ్రంథాలలో ప్రకటించిన. భావాలు వారి ఆత్మీయతను తెలియజేస్తాయి. నాగార్జునుడు ధరణికోటలోనూ, నందికొండ ప్రాంతంలో గల బౌద్దారామాల్లో నివసించేవాడు. ఆయన విజయపురిలో శ్రీ పర్వత విద్యాపీఠం స్థాపించాడు. అక్కడ దేశ విదేశాల విద్యార్థులు విద్యార్జన చేసేవారు. ఆ విశ్వవిద్యాలయంలో 7700 మంది బౌద్ధ భిక్షువులుండేవారట. అక్కడ ఆచార్య బుద్ధ ఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ధర్మశాస్త్రం, రాజనీతి, సాహిత్యం మొదలైనవి బోధించేవారు.

ఈ) అమరావతిలోని శిల్పాల గొప్పతనమేమిటి?
జవాబు:
శరీరధర్మ శాస్త్రాన్ని అనుసరించి, శిల్పాలు, చిత్రాలు రూపొందించడం అనేది, ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దంలో ప్రారంభం అయ్యింది. కాగా అమరావతిలో క్రీ.శ. మొదటి శతాబ్దిలోనే, శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపొందింది. చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు, శిల్పకళలోనూ ప్రదర్శింపబడడం, అమరావతి శిల్పాల విశిష్టత.

అజంతా, ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉన్నాయని పురావస్తు శాఖవారు గుర్తించారు. శిల్పకళా పరిశోధనలో మంచి నైపుణ్యం ఉన్న ఫెర్గూసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు, గొప్పగా ఉన్నాయని ఋజువు చేశాడు. అమరావతి శిల్పంలో ఆనందం, క్రోధం, విషాదం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి
భావాలు స్పష్టంగా కన్పిస్తాయి. గాంధార, మధుర, శిల్పకళ రీతులతో సమానంగా, అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది.

2. ఈ కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానం రాయండి.

అ) అమరావతి సాంస్కృతిక వైభవాన్ని వివరించండి.
జవాబు:
అమరావతిని అనేక మంది పరిపాలించారు. వారి విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. అందువల్లనే అమరావతిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అంటారు.

అమరావతిలో బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాలు, సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి.

అమరావతిని శాతవాహనులు తొలిసారిగా పాలించారు. వారు వైదిక సంప్రదాయాన్ని అనుసరించారు. యజ్ఞయాగాదులు చేశారు. దానితో అమరావతిలో వైదిక సంస్కృతి వెల్లివిరిసింది.

క్రీస్తు పూర్వం గౌతమబుద్ధుడు అమరావతిని సందర్శించాడు, దానితో అమరావతి పరమ పవిత్రమైంది. బౌద్ధమత సంస్కృతీ సంప్రదాయాలు కూడా అమరావతిలో నెలకొన్నాయి. తర్వాతి కాలంలో శైవమతం వ్యాపించింది. ఆ కాలంలోనే పంచారామాలలో ఒకటైన ‘అమరారామం ‘లో ‘అమరలింగేశ్వరాలయం’ ఏర్పడింది. శైవమత సంస్కృతి కూడా కలిసింది.

రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతి దగ్గరలో వైకుంఠపురంలో వేంకటేశ్వరాలయం నిర్మించాడు. అది వైష్ణవ మత సంస్కృతికి సంకేతం.

ఇదే విధంగా జైన, ముస్లిం, క్రైస్తవ మత సంస్కృతులు కూడా అమరావతి సాంస్కృతిక వైభవంలో పాలుపంచుకొన్నాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఆ) రాజధానిగా వెలుగొందిన అమరావతి గొప్పతనాన్ని విశ్లేషించండి.
జవాబు:
శాతవాహనుల రాజధానిగా క్రీస్తు పూర్వమే అద్భుతంగా అభివృద్ధి చెందిన మహానగరం అమరావతి. అశోకునికి పూర్వమే అమరావతిలో బౌద్ధస్తూపం ఉంది. మెగస్తనీసు తన ‘ఇండికా’ గ్రంథంలో అమరావతి గురించి ప్రస్తావించాడు.

ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు మొదలైన వారి పరిపాలనలో అమరావతి దినదినాభివృద్ధి చెందింది. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారు కూడా అమరావతిని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. అంటే సుమారు 1800 సంవత్సరాలు రాజధానిగా విరాజిల్లింది అమరావతి.

అమరావతిని రాజధానిగా చేసుకొని చాలామంది పరిపాలన సాగించారు. ఆయా ప్రభువుల పాలనలలో కాలానుగుణంగా అనేక మార్పులు పొందింది. అనేక మంది పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. అందుచేత అమరావతి ఆంధ్రప్రదేశ్ కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. హిందూ, ముస్లిం, బౌద్ధ, జైన, క్రైస్తవ మత సంప్రదాయాలతో సర్వమత సమ్మిళిత నగరంగా అమరావతి రాజధానిగా వెలుగొందింది.

ఇ) “అమరావతీ నగర అపురూప శిల్పాలు …….” అనడంలోని ఔచిత్యాన్ని వివరించండి.
(లేదా)
“అమరావతీ నగర అపురూప శిల్పాలు” గురించి వ్యాసం రాయండి.
జవాబు:
అమరావతిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శిల్ప సంపద సృష్టించబడింది. అమరావతిలోని శిల్పకళా నైపుణ్యాన్ని చూసి, ‘ఫెర్గూసన్’ ఆశ్చర్యపడ్డాడు. ఫెర్గూసన్ శిల్పకళా నిపుణుడు. ప్రపంచంలోని అనేక రకాల శిల్పాలను పరిశోధించాడు. ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణికి చెందిన శిల్పాలుగా అమరావతీ శిల్పాలను ఋజువులతో నిరూపించాడు.

శరీరధర్మశాస్త్రాన్ననుసరించి శిల్పాలు రూపొందించడం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దిలో ప్రారంభమయింది. కాని, అమరావతిలో ఒకటవ శతాబ్దిలోనే ప్రదర్శించారు. చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు అమరావతి శిల్పాలలో కనిపిస్తాయి.

ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు అమరావతీ శిల్పాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అమరావతీ శిల్పాలు గాంథార, మధుర శిల్పాలతో సమానంగా ప్రసిద్ధిచెందాయి.

అంతటి మహోన్నతమైన శిల్పాలు అమరావతిలో ఉన్నందువల్లనే ఒక సినీ కవి “అమరావతీ నగర అపురూప శిల్పాలు” అన్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

3. ఈకింది అంశాల గురించి సృజనాతకంగా/ప్రశంసిస్తూ రాయండి.
అ) అమరావతిలో అద్భుత శిల్పసంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
జవాబు:

(లేఖ )

అమలాపురం,
x x x x x

గౌరవనీయులైన శిల్పిగారికి,
10వ తరగతి విద్యార్థిని సరళ నమస్కరించి వ్రాయు లేఖ.

అమరావతికి వేసవి సెలవులలో వెళ్ళాను. అక్కడ శిల్పాలు చూశాను. అద్భుతమైన మీ శిల్పకళా నైపుణ్యాన్ని అక్కడి సందర్శకులందరూ వేనోళ్ళ పొగుడుతున్నారు.

కోపం, ప్రేమ, ఆరాధన మొదలైన హావభావాలన్నీ ఆ శిల్పాలలో స్పష్టంగా కన్పించాయి. ఫెర్గూసన్ వంటి , గొప్ప పరిశోధకుని ప్రశంసలు అందుకొన్న మీరు చాలా గొప్పవారు.

మీ వంటి గొప్ప శిల్పులను కన్న ఆంధ్రమాత ధన్యురాలు. మళ్ళీ దసరా సెలవులలో మా స్నేహితులతో వస్తాను. మా పాఠ్యపుస్తకంలోని ‘అమరావతి’ పాఠంలో మీ శిల్ప నైపుణ్యం తెల్పారు. మీరు తయారుచేసిన శిల్పాల గొప్పతనాన్ని కూడా తెలుసుకొన్నాం.

నమస్కారాలతో,
కె. సరళ వ్రాలు.

చిరునామా :
శ్రీ. సి. రాజు, శిల్పి
అమరావతి,
నవ్యాంధ్ర రాజధాని, ఆంధ్రప్రదేశ్.

(లేదా)
అమరావతి పాఠం చదివినప్పుడు మీకు కలిగిన అనుభూతిని వివరిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
కవిత :
మన అమరావతి
తరతరాల వైభవాల చిరునామా !
నవ్యాంధ్ర జాతి కలల సిరుల పంట
భావితరాల సౌభాగ్యాల ఖరారు నామా !
పెట్టుబడుల ప్రవాహాల నిలయమంట
అపురూప శిల్పకళా స్వరూపాల ఖజానా !
అదే మన అమరావతి
కృష్ణా తరంగిణీ పావన జమానా !
అదే అదే మన అజరామరమైన అమరావతి.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

అమరావతీ శిల్పాల చిత్రాలను సేకరించండి, ప్రదర్శించండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి 1

III. భాషాంశాలు

పదజాలం

1. ఈ కింది పదాలకు అర్ధాలు గ్రహించండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : చేరువ = దగ్గర
సొంతవాక్యం : ఉపాధ్యాయుని చేరువలో ఉంటే విజ్ఞానం పెరుగుతుంది.

అ) జగజేగీయమానం : లోకముచే మిక్కిలి కొనియాడబడినది.
సొంతవాక్యం : ఆగ్రాలోని తాజ్ మహల్ సౌందర్యము జగజేగీయమానమైనది.

ఆ) వైభవోపేతం = వైభవంతో కూడినది
సొంతవాక్యం : రాణివారి వైభవోపేతమైన క్రొత్త బంగళా, ప్రజలను బాగా ఆకర్షిస్తోంది.

ఇ) పునీతం = పవిత్రం
సొంతవాక్యం : గంగానదీ స్నానంతో, మా శరీరం పునీతం అయ్యింది.

ఈ) ముగ్గులు = మురిసిపోయినవారు
సొంతవాక్యం : తాజ్ సౌందర్యాన్ని చూసి యాత్రికులు నేటికీ ముగ్గులు అవుతున్నారు.

2. ఈ కింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : కీర్తి : యశస్సు, ఖ్యాతి
1) మన ఆంధ్రప్రదేశ్ కీర్తిపతాకం వినువీథులలో రెపరెపలాడాలి.
2) ఎంతోమంది ఖ్యాతి గడించినవారు ఆంధ్రప్రదేశ్ యశస్సును పెంచినారు.

అ) కాణాచి : 1) నివాసం, 2) స్థావరం, 3) నెలవు, 4) బస

1) కాణాచి : ఆంధ్రప్రదేశ్ కళలకు కాణాచి.
2) నివాసం : మేరు పర్వతం దేవతల నివాసం.
3) స్థావరం : గిర్ అడవులు సింహాలకు స్థావరం.
4) నెలవు : వ్యవసాయం కష్టాలకు నెలవు.
5) బస : కైలాసం శివునికి బస.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఆ) శ్రేణి : 1) పరంపర, 2) పంక్తి, 3) వరుస

1) శ్రేణి : శ్రీరాముడు అత్యుత్తమ శ్రేణిలోని పరిపాలకుడు.
2) పరంపర : కవుల పరంపరలో మొదట లెక్కింపదగినవారు నన్నయగారు.
3) పంక్తి : భోజనాలకు పంక్తిలో కూర్చున్నారు.
4) వరుస : ప్రార్థనా సమావేశంలో విద్యార్థులు వరుసలలో నిలుచున్నారు.

ఇ) రాజు : 1) భూపాలుడు 2) జనపాలుడు 3) ప్రభువు 4) నృపాలుడు 5) ఏలిక

1. రాజు : అయోధ్య దేశానికి రాజు దశరథుడు.
2. భూపాలుడు : ప్రజల కష్టాలను భూపాలుడు తీర్చాలి.
3. జనపాలుడు : కరవు కాటకాలు రాకుండా జనపాలుడు నదులకు ఆనకట్టలు కట్టించాలి.
4. ప్రభువు : ప్రజలు ప్రభువులను గౌరవించాలి.
5. నృపాలుడు : మథిలా నగరానికి నృపాలుడు జనక మహారాజు.
6. ఏలిక : ఈ దేశానికి ఏలిక ధర్మాత్ముడు.

ఈ) పురము : 1) పురి 2) పట్టణము 3) నగరము

1. పురము : మీ పురములో కాయకూరలు చౌకగా దొరుకుతున్నాయి.
2. పురి : అయోధ్యాపురిలో ప్రజలు సుఖసంతోషాల్లో తేలిపోయేవారు.
3. పట్టణము : మీ పట్టణములో అన్ని వస్తువులూ కొరతగా ఉన్నాయి.
4. నగరము : మీ నగరములో పాడిపంటలకు లోటు లేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఉ) సందేహం : 1) సంశయము 2) శంక 3) అనుమానము

1. సందేహం : నీకు సందేహాలు ఎక్కువగా వస్తున్నాయి.
2. సంశయము : ఈ సంశయములను మీ గురువులనడిగి తీర్చుకో.
3. శంక : ఈ విషయంలో నీకు శంక ఏమిటో చెప్పు.
4. అనుమానము : దేవుడు ఉన్నాడనే విషయంలో అనుమానము లేదు.

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లో ఉన్న ‘అనునాసిక’, ‘పడ్వాది’ సంధుల పదాలను గుర్తించి విడదీయండి. సూత్రం రాయండి.

అ) ఎక్కడ కూర్చున్నది మరచిపోయి తన్మయులమై చూసేవాళ్ళం.
జవాబు:
తన్మయులమై : తత్ + మయులమై = అనునాసిక సంధి
సూత్రము :
వర్గ ప్రథమాక్షరాలకు ‘న’ గాని, ‘మ’ గాని, పరమైనపుడు, వాని అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

ఆ) నీవు సందేహపడనవసరం లేదు.
జవాబు:
సందేహపడవలసిన = సందేహము + పడవలసిన = పడ్వాది సంధి
సూత్రము :
పడ్వాదులు పరమైనప్పుడు మువర్ణానికి లోపపూర్ణ బిందువులు విభాషగా వస్తాయి.

ఇ) పురాణ వాజ్మయం చూసి భయపడకు. చదివి ఆనందపడు.
జవాబు:
1. వాజ్మమం = వాక్ + మయం (అనునాసిక సంధి)
సూత్రము :
వర్గ ప్రథమాక్షరాలకు, ‘న’గాని, ‘మ’గాని పరమైనపుడు వానికి అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

2. భయపడక = భయము + పడక (పడ్వాది సంధి) (మువర్ణలోప సంధి)
సూత్రము :
పడ్వాదులు పరమైనపుడు మువర్ణానికి లోపపూర్ణ బంధువులు విభాషగా వస్తాయి.

3. ఆనందపడు = ఆనందము + పడు = పడ్వాది సంధి
సూత్రము :
పడ్వాదులు పరమైనపుడు మువర్ణానికి లోపపూర్ణ బిందువులు విభాషగా వస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ఈ) సన్నుతి చేయి.
జవాబు:
సన్నుతి = సత్ + నుతి = అనునాసిక సంధి
సూత్రము :
వర్గ ప్రమాక్షరాలకు, ‘న’గాని, ‘మ’గాని, పరమైనపుడు వాని అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

ఉ) రాణ్మణి యుద్ధంలో భంగపడడు.
జవాబు:
రాణ్మణి = రాట్ + మణి = అనునాసిక సంధి
సూత్రము :
వర్గ ప్రథమాక్షరాలకు ‘న’గాని, ‘మ’గాని, పరమైనపుడు వాని అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

2. కింది వాక్యాలను ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చండి.
అ) ‘నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను’, అని అమ్మతో అన్నాను.
జవాబు:
నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను. (పరోక్ష కథనం)

ఆ) ‘నీకివ్వాల్సింది ఏమీలేదు’, అని నాతో అతడన్నాడు.
జవాబు:
నాకివ్వాల్సింది ఏమీలేదని నాతో అతడన్నాడు. (పరోక్ష కథనం)

ఇ) సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.
జవాబు:
“సుందరకాండ చదువు” అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. (ప్రత్యక్ష కథనం)

ఈ) వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాశ్ ఊరికెళ్ళాడని.
జవాబు:
వాళ్ళమ్మ చెప్పింది “భానుప్రకాశ్ ఊరికెళ్ళాడు” అని (ప్రత్యక్ష కథనం)

ఉ) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరనుకుంటున్నారు.
జవాబు:
అందరనుకుంటున్నారు “ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది” అని (ప్రత్యక్ష కథనం)

3. అర్థాలంకారాల్లోని మరొక అలంకారాన్ని తెలుసుకుందాం.
ఉదా :
i) వాడు తాటిచెట్టంత పొడవు ఉన్నాడు.
ii) దేవాలయ గోపురాలు ఆకాశానికంటుతున్నాయి

పై వాక్యాల్లో వాడి ఎత్తును, గోపురాల ఎత్తులను ఉన్న ఎత్తు కంటే ఎక్కువ చేసి చెప్పడం జరిగింది కదా ! అంటే అతిశయంగా చెప్పడం అన్నమాట. ఇలా చెప్పటాన్ని అతిశయోక్తి అంటారు.

అతిశయోక్తి అలంకార లక్షణం : విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం.

కింది లక్ష్యాలను పరిశీలించండి. అలంకారం గుర్తించండి.
(కింది పద్యం సీత అశోకవనంలో హనుమంతుని విరాడ్రూపం చూసిన సందర్భంలోనిది.)

అ) కం. చుక్కలు తల పూవులుగా ,
నక్కజముగ మేనుబెంచి యంబర వీధిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదము నొందె నత్మస్థితిలోన్

భావము :
నక్షత్రాలు, తన తలలో ధరించిన పువ్వుల వలె కనబడే విధంగా ఆశ్చర్యం కలిగేటట్లు హనుమంతుడు తన శరీరాన్ని పెంచి ఆకాశవీధిలో గొప్పగా కనబడ్డాడు. అప్పుడు సీత చూచి ఆనందాన్ని పొందింది.

గమనిక :
హనుమంతుడు ఆకాశాన్ని తాకేలా, ఆకాశంలో నక్షత్రాలు ఆయన తలలోని పువ్వుల వలె కనబడ్డాయి అని అతిశయంగా చెప్పడం వల్ల ఇది “అతిశయోక్తి” అలంకారం.

ఆ) మా పొలంలో బంగారం పండింది.
గమనిక :
మంచి పంట పండింది అని చెప్పడానికి బదులు, బంగారం పండిందని అతిశయోక్తిగా చెప్పడం జరిగింది. అందువల్ల “అతిశయోక్తి అలంకారం”.

అదనపు సమాచారము

సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి:

1. విద్యాలయములు = విద్యా + ఆలయములు = సవర్ణదీర్ఘ సంధి
2. మహితాభిమానము = మహిత + అభిమానము = సవర్ణదీర్ఘ సంధి
3. మహావేశము = మహా + ఆవేశము = సవర్ణదీర్ఘ సంధి
4. నవ్యాంధ్ర = నవ్య + ఆంధ్ర = సవర్ణదీర్ఘ సంధి
5. శతాబ్ది = శత + అబ్ది = సవర్ణదీర్ఘ సంధి
6. శతాబ్దం = శత + అబ్దము = సవర్ణదీర్ఘ సంధి
7. కాలానుగుణంగా = కాల + అనుగుణంగా = సవర్ణదీర్ఘ సంధి
8. మతాచారాలు = మత + ఆచారాలు = సవర్ణదీర్ఘ సంధి
9. అమరారామం = అమర + ఆరామం = సవర్ణదీర్ఘ సంధి
10. మతాచార్యుడు = మత + ఆచార్యుడు = సవర్ణదీర్ఘ సంధి
11. బౌద్దారామాలు = బౌద్ధ + ఆరామాలు = సవర్ణదీర్ఘ సంధి
12. విద్యాలయం = విద్యా + ఆలయం = సవర్ణదీర్ఘ సంధి
13. విద్యార్థులు = విద్యా + అర్థులు = సవర్ణదీర్ఘ సంధి
14. విద్యార్జన = విద్య + ఆర్జన = సవర్ణదీర్ఘ సంధి
15. బోధనాంశములు = బోధన + అంశములు = సవర్ణదీర్ఘ సంధి
16. మతానుయాయులు = మత + అనుయాయులు = సవర్ణదీర్ఘ సంధి
17. జ్ఞానార్జన = జ్ఞాన + ఆర్జన = సవర్ణదీర్ఘ సంధి
18. పంచారామాలు = పంచ + ఆరామం = సవర్ణదీర్ఘ సంధి
19. పట్టాభిషేకము = పట్ట + అభిషేకము = సవర్ణదీర్ఘ సంధి
20. చిరాయువు = చిర + ఆయువు = సవర్ణదీర్ఘ సంధి
21. అజరామరత్వము = అజర + అమరత్వము = సవర్ణదీర్ఘ సంధి
22. పరమావధి = పరమ + అవధి = సవర్ణదీర్ఘ సంధి
23. అశేషాంధ్రులు = అశేష + ఆంధ్రులు = సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి :

24. అమరలింగేశ్వరస్వామి = అమరలింగ + ఈశ్వరస్వామి = గుణసంధి
25. వైభవోపేతము = వైభవ + ఉపేతము = గుణసంధి
26. మహోజ్జ్వలము = మహా + ఉజ్జ్వలము = గుణసంధి

3. యణాదేశ సంధి:

27. అత్యాధునికము = అతి + ఆధునికము = యణాదేశ సంధి
28. అత్యద్భుతము = అతి + అద్భుతము = యణాదేశ సంధి
29. అత్యున్నతశ్రేణి = అతి + ఉన్నత శ్రేణి = యణాదేశ సంధి

4. పుంప్వాదేశ సంధి :

30. రాష్ట్రపు రాజధాని = రాష్ట్రము + రాజధాని = పుంప్వాదేశ సంధి
31. సున్నపురాయి = సున్నము + రాయి = పుంప్వాదేశ సంధి

5. పడ్వాది సంధి:

32. భద్రపఱచిన = భద్రము + పఱచిన = పడ్వాదిసంధి (మువర్ణలోప సంధి)

6. జశ్వ సంధి :

33. తదనంతరము = తత్ + అనంతరము = జత్త్వసంధి

7. ఆమ్రేడిత సంధి :

34. చెల్లాచెదరు = చెదరు + చెదరు = ఆమ్రేడిత సంధి

సమాసాలు
AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి 2

వ్యుత్పత్యర్థాలు

1. హర్మ్యము : మనోహరముగా ఉండేది (మేడ)
2. చైత్యం : పాషాణాదులచే కట్టబడేది (బౌద్ధస్తూపం)
3. ఆరామం : ఇందులో క్రీడిస్తారు (ఉపవనము)
4. కవి : చాతుర్యంగా వర్ణించేవాడు (కవి)
5. అక్షతలు : క్షతము లేనివి (అక్షింతలు)
6. సాక్షి : ఏదేని ఒక కార్యాన్ని స్వయంగా చూసినవాడు
7. శరీరము : రోగాదులచే హింసింపబడి శిధిలమయ్యేది (దేహము)
8. విద్యార్థులు : విద్యలను కోరి వచ్చేవారు (శిష్యులు)

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

ప్రకృతి – వికృతి

పట్టణము – పట్నము
అక్షతలు – అక్షింతలు
కవి – కయి
కీర్తి – కీరితి
యాత్ర – జాతర
భక్తులు – బత్తులు
ఫలక – పలక
విద్య – విద్దె
ద్వీపము – దిబ్బ
సాక్షి – సాకిరి
స్వామి – సామి
పర్వము – పబ్బము
ప్రాంతము – పొంత
రూపము – రూపు
విశ్వాసము – విసువాసము
వక్రము – వంపు
హృదయాలు – ఎడదలు
చిత్రము – చిత్తరువు

పర్యాయపదాలు

1. పట్టణము : నగరము, నగరి, పత్తనము, పురము, పురి, ప్రోలు
2. సన్న్యా సి : భిక్షువు, యతి, ముని, మౌని, పరివ్రాజకుడు
3. హృదయము : ఎడ, ఎడద, డెందము
4. పేరు : నామధేయము, ఆఖ్య, సంజ్ఞ, అభిధానము
5. గురువు : ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఒజ్జ, ఆచార్యుడు
6. దీపము : దివియ, దివ్వె, దివిటీ, తిల్లిక, దీపిక
7. రాజు : ఏవిక, ప్రభువు, రాయలు, టేడు, జనపాలుడు
8. కీర్తి : యశస్సు, యశము, పేరు, సమాఖ్య
9. కానుక : కానిక, బహుమతి, ఉపద, బహుమానము
10. యవనిక : తెర, పరదా, తిరస్కరిణి
11. గాథ : కథ, కథానిక, ఆఖ్యాయిక
12. ప్రభువు : . రాజు, ఏలిక, జేడు, భూపాలుడు
13. సంపద : సిరి, లచ్చి, విభూతి, ఐశ్వర్యము
14. శరీరము : కళేబరము, గాత్రము, తనువు, మెయి

నానార్థాలు

1. అవధి : హద్దు, కాలము, ఏకాగ్రత
2. ఇంద్రుడు : దేవేంద్రుడు, శ్రేష్ఠుడు, ప్రభువు, ఈశ్వరుడు
3. ఈశ్వరుండు : ప్రభువు, శివుడు, పరమాత్మ, భర్త
4. కవి : కావ్య కర్త, శుక్రుడు, వాల్మీకి, ఋషి, నీటికాకి
5. కళ : శిల్పము, అందము, వడ్డీ, చంద్రుడిలో 16వ భాగము, చదువు
6. గురువు : ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, తాత
7. చైత్యము : గుడి, భవనము, సభ, బౌద్ధాలయము, శిశువు
8. తీర్థము : పుణ్యోదకము, పుణ్యనది, ఘట్టము, పుణ్యక్షేత్రం
9. పేరు : నామము, ప్రసిద్ధి, భూషణము, పెద్దది
10. రాజు : ప్రభువు, క్షత్రియుడు, చంద్రుడు, ఇంద్రుడు
11. యాత్ర : జాతర, ముట్టడి, ఉత్సవము, పోవుట
12. శాసనము : రాజు దానము చేసిన భూమికి, వ్రాసియిచ్చే కవులు, ఆజ్ఞ, శాస్త్రము, అధికారము

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

కఠిన పదాలకు అర్థాలు

సంతతి = సంతానము
మహిత = గొప్పదైన
అభిమానము = ఆత్మగౌరవము
దివ్యము = శ్రేష్ఠమైనది
ఆముఖము = ప్రారంభము
స్ఫూర్తి = పరిపూర్ణత
తీవరించు = త్వరితపరచు
నవ్యము = క్రొత్తది
వైభవం = గొప్పతనము
ప్రబలం = ప్రసిద్ధి
వంశజులు = వంశములో జన్మించినవారు
వైభవ + ఉపేతము = వైభవోపేతము గొప్పతనముతో కూడినది

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
శాతవాహనులకంటే పూర్వమే అమరావతిని పరిపాలించిన రాజవంశాలేవి?
జవాబు:
శాతవాహనుల కంటే పూర్వమే ఆంధ్రదేశాన్ని కొన్ని రాజవంశాలు పరిపాలించాయి. వారిలో సమగోప, గోబధ, నరన, కంవాయల రాజవంశాలు ప్రముఖమైనవి.

ప్రశ్న 2.
అమరావతిని అభివృద్ధిపరచిన రాజవంశాలేవి?
జవాబు:
శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కోటబేతరాజ వంశాలు అమరావతిని అభివృద్ధి పరిచారు.

ప్రశ్న 3.
అమరావతిపై ఏయే మత సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి?
జవాబు:
బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలు అమరావతిపై కనిపిస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

స్పర్శ = తాకిడి
పునీతం = పవిత్రం
ధాతువు = వాతము మొదలైనవి. ఇవి 7 విధాలు : శుక్లము, శోణితము, మాంసము, ఎముక, చర్మము, చీము, మెదడు.
చైత్యం = బౌద్ధాలయము
ఆరామం = తోట (విశ్రాంతి కొరకు నిర్మించే కట్టడం)
ఆర్జన = సంపాదన
తీర్థంకరులు = జైనులు
అలరారడం = ప్రకాశించడం
పంచారామాలు = ఐదు శైవ క్షేత్రాలు –

  1. ద్రాక్షారామము
  2. భీమారామము
  3. సోమారామము
  4. అమరారామము
  5. కొమరారామము

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
బుద్ధుడి ధాతువుల మీద ఎలాంటి నిర్మాణం కట్టారు?
జవాబు:
బుద్ధుడి ధాతువుల మీద మహాచైత్యం నిర్మించారు. దాని చుట్టూ అద్భుతమైన కళాఖండాలున్నాయి. బుద్ధుని జీవిత గాథను చెక్కారు.

ప్రశ్న 2.
ఆచార్య నాగార్జునుణ్ణి గురించి చెప్పండి.
జవాబు:
నాగార్జునుడు బౌద్ధమతాచార్యుడు. శాతవాహనుల కుల గురువు. ఆయన ధరణికోట, నందికొండ ప్రాంతాలలో ఉన్న బౌద్ధారామాలలో నివసించేవాడు.

ప్రశ్న 3.
అమరావతి దగ్గరలోని వైకుంఠపురంలో ఏ ఆలయం ఉంది?
జవాబు:
వైకుంఠపురంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాడు.

ప్రశ్న 4.
అమరావతిని సందర్శించిన విదేశీ యాత్రికులు ఎవరెవరు?
జవాబు:
క్రీ.శ. 640లో చైనా యాత్రికుడు హ్యూయత్సాంగ్ అమరావతి సందర్శించాడు. క్రీస్తు పూర్వంలో గ్రీకు రాయబారి మెగస్తనీసు అమరావతిని సందర్శించాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

కాణాచి = ఆటపట్టు, నిలయం
స్తూపం = మట్టి మొదలగు వాని దిబ్బ
సమున్నతం = గొప్పదైన (ఎత్తైన)
కాలగర్భంలో కలిసిపోవడం = నశించిపోవడం
ప్రస్ఫుటం = వికసించునది (స్పష్టం)

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
దీపాల దిన్నె గురించి చెప్పండి.
జవాబు:
అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నపుడు అక్కడి బౌద్ధ భిక్షువులు ప్రతిరోజూ అక్కడ వేలాదిగా దీపాలను వెలిగించేవారట. అందువలన ఆ ప్రదేశానికి దీపాల దిన్నె అనే పేరు వచ్చింది. ఇది అమరావతి శివారు ప్రాంతంలో ఉంది. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని దీపాల దిన్నెపై చెక్కించాడు. ఈ విధంగా అనేకమంది శిల్పాలను చెక్కడానికి వితరణ ఇచ్చారు – వారి పేర్లు కూడా దీపాల దిన్నె వద్ద శాసనాలలో చెక్కారు.

ప్రశ్న 2.
అమరావతి శిల్పకళకు సంబంధించిన శిల్పాలు ఎక్కడెక్కడ లభించాయి?
జవాబు:
కొన్ని శిల్పాలు అమరావతి శివారు ప్రాంతంలో దీపాల దిన్నె వద్ద మెకంజీకి లభించాయి. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని నాగార్జున కొండ, దంతగిరి, నేల కొండపల్లి, ధూళికట్ట, భట్టిప్రోలు మొదలైన ప్రదేశాలలో కొన్ని శిల్పాలు లభించాయి.

ప్రశ్న 3.
అమరావతి శిల్పాలలోని గొప్పతనం ఏమిటి?
జవాబు:
అమరావతిలో క్రీ.శ. మొదటి శతాబ్దిలోనే శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపొందింది. కేవలమూ చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు, శిల్పకళలోనూ చూపించడం, అమరావతి శిల్పాల విశిష్టత. శిల్పకళా పరిశోధనలో గొప్ప నైపుణ్యం కల ‘ఫెర్గూసన్’ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు, అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని ఋజువు చేశాడు. అమరావతి శిల్పంలో ఆనందము, క్రోధము, విషాదము, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు సుస్పష్టంగా కనిపిస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 2 అమరావతి

చిరాయువు = దీర్ఘాయుర్దాయము కలది
అజరామరం = శాశ్వతం (ముసలితనం, మరణం లేని)
సంప్రోక్షణ = పరిశుద్ది చేయుట
అహర్నిశలు = పగలూ, రాత్రీ (ఎల్లప్పుడూ)
అశేషాంధ్రులు = మొత్తం ఆంధ్రులంతా
భాసిల్లు = ప్రకాశించు
ఆకాంక్ష = కోరిక

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
అమరావతి పేరులో చిరాయువును ఎలా నింపుకుంది?
జవాబు:
అమరావతి అంటే ‘చావు లేనిది’ అని అర్ధము. అమరులు అంటే దేవతలు. వారు చిరాయువు కలవారు. అమరావతి అనే పేరులో అమర శబ్దము చిరాయువు అనే అర్థాన్ని తెలుపుతుంది.

2. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకోవడానికి కారణమేమిటి?
జవాబు:
‘అమరావతి పేరులో చిరాయువును నింపుకొంది. వ్యవసాయ, వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరంగా విలసిల్లింది. నవ్యాంధ్రకు కేంద్ర బిందువు అమరావతి. అనేక మతాల సామరస్యం గల ప్రాంతం అమరావతి. పవిత్రమైన కృష్ణానదీ తీరంలో ఉన్న పరమపావనమైనది కనుకనే అమరావతిని నవ్యాంధ్రకు రాజధానిగా ఎంపిక చేసుకోవడం జరిగింది.

3. నవనగరాలు ఏవి?
జవాబు:
1. పర్యాటక నగరంగా ‘ఉండవల్లి’
2. ఆరోగ్య నగరంగా ‘కృష్ణయ్య పాలెం’
3. ఎలక్ట్రానిక్ నగరంగా ‘బేతపూడి’
4. విజ్ఞాన నగరంగా ‘శాఖమూరు’
5. విద్యానగరంగా ‘అయినవోలు’
6. పరిపాలనా నగరంగా ‘రాయపూడి’
7. న్యాయ నగరంగా ‘నేలపాడు’
8. క్రీడా నగరంగా ‘అబ్బరాజుపాలెం’
9. ఆర్థిక నగరంగా ‘ఉద్దండరాయపాలెం’
10. ఆధ్యాత్మిక నగరంగా “అనంతవరం పరిసరాలు”

కొత్త హంగులతో అభివృద్ధి చెందబోతున్నాయి. వీటినే నవనగరాలు అంటారు.