AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson సుందరకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson సుందరకాండ

10th Class Telugu ఉపవాచకం 5th Lesson సుందరకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి నమ్మకం. హనుమంతుడు అదే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముడి భావన కూడా అదే.
ఆ) హనుమంతుడు (రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు.
ఇ) సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు.
ఈ) అందుకే తనపేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు.
జవాబులు
అ) సీతాన్వేషణను సఫలం చేయగల సమర్ధుడు హనుమంతుడేనని సుగ్రీవుని నమ్మకం. హనుమంతుడూ అంతే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముడి భావన కూడా అదే.
ఈ) అందుకే తన పేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు.
ఇ) సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు.
ఆ) హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు.

2. అ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. శ్రీరాముని స్మరించుకుని నమస్కరించాడు.
ఆ) హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమచేతితో లంకిణి పై ఒకదెబ్బవేశాడు.
ఇ) హనుమంతుని పరీక్షించడానికి వచ్చిన ‘సురస’ అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.
ఈ) శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు.
జవాబులు
ఈ) శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు.
ఇ) హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన ‘సురస’ అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.
ఆ) హనుమంతుడు. మహనాదం చేస్తూ ఎడమ చేతితో లంకిణిపై ఒక్కదెబ్బవేశాడు.
అ) ఒక వానరుడు వచ్చి లంకిణిని జయించినప్పుడు రాక్షసులకు కీడుమూడుతుందని బ్రహ్మ చెప్పాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

3. అ) శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది.
ఆ) రావణునిలో ఆవేశం పెల్లుబికింది. రెండు నెలల గడువు విధించాడు.
ఇ) రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు.
ఈ) సీత దగ్గరికి వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసుమార్చే ప్రయత్నం చేశాడు.
జవాబులు
ఇ) రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు.
ఈ) సీత దగ్గరకి వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసుమార్చే ప్రయత్నం చేశాడు.
అ) శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది.
ఆ) రావణునిలో ఆవేశం పెల్లుబికింది. రెండు నెలలు గడువు విధించాడు.

4. అ) శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది.
ఆ) సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు.
ఇ) హనుమంతుడు శ్రీరాముడి రూపగుణాలను వివరించాడు. శ్రీరాముడి ముద్రికను సమర్పించాడు.
ఈ) కొంగుముడి విప్పి అందులోని దివ్యచూడామణిని హనుమంతునికిచ్చింది.
జవాబులు
ఆ) సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు.
ఇ) హనుమంతుడు శ్రీరాముడి రూపగుణాలను వివరించాడు. శ్రీరాముడి ముద్రికను సమర్పించాడు.
ఈ) కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడామణిని హనుమంతునికిచ్చింది.
అ) శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది.

5. అ) ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు.
ఆ) విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పుపెట్టాడు.
ఇ) హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలియదిప్పమన్నాడు రావణుడు.
ఈ) మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవంతుడు దానిని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగివస్తున్నాడని ప్రకటించాడు.
జవాబులు
అ) ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు.
ఇ) హనుమంతుణి తోకకు నిప్పంటించి లంకంతా కలియదిప్పమన్నాడు రావణుడు.
ఆ) విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పు పెట్టాడు.
ఈ) మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవతుడు దానిని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని ప్రకటించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

6. అ) అంగద హనుమదాదాలు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు.
ఈ) సముద్రంపై సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలచాడు.
జవాబులు
ఈ) సముద్రం పై సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలచాడు.
ఇ) రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
అ) అంగద హనుమదాదాలు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు.

7. అ) వానరులు మధువనాన్ని ధ్వంసం చేశారు.
ఆ) శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది సీత.
ఇ) సీత కోరికపైన హనుమంతుడు రాముడి గుణరూపాలను వివరించాడు.
ఈ) ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
జవాబులు
ఆ) శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది.
ఈ) ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) సీత కోరికపైన హనుమంతుడు రాముడి గుణరూపాలను వివరించాడు.
అ) వానరులు మధువనాన్ని ధ్వంసం చేశారు.

8. అ) రావణుని తేజస్సును చూచి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు.
ఆ) శ్రీరామునికి దూరమై బ్రతకడం కన్నా శరీరాన్ని విడవడం మంచిదని సీత తలచింది.
ఇ) హనుమంతుడు సీతతో తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు.
ఈ) అంతఃపురంలో ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా నిద్రపోవడం హనుమంతుడు చూశాడు.
జవాబులు
ఈ) అంతఃపురంలో ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా నిద్రపోవడం హనుమంతుడు చూశాడు.
అ) రావణుని తేజస్సును చూచి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు.
ఆ) శ్రీరామునికి దూరమై బ్రతకడం కన్నా శరీరాన్ని విడవడం మంచిదని సీత తలచింది.
ఇ) హనుమంతుడు సీతతో తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు.

9. అ) లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో చల్లార్చుకున్నాడు.
ఆ) హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు.
ఇ) హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఈ) హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు.
జవాబులు
ఇ) హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఈ) హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు.
అ) లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో చల్లార్చుకున్నాడు.
ఆ) హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

10. అ) హనుమంతుడు లంకలో చిత్రవిచిత్రమైన ఇళ్ళను చూశాడు.
ఆ) అంతవరకు వెతకని అశోకవనాన్ని వెతకాలనుకున్నాడు హనుమంతుడు.
ఇ) సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది.
ఈ) హనుమ లంకిణిని చంపి లంకలో ప్రవేశించాడు.
జవాబులు
ఈ) హనుమ లంకిణిని చంపి లంకలో ప్రవేశించాడు.
అ) హనుమంతుడు లంకలో చిత్రవిచిత్రమైన ఇళ్ళను చూశాడు.
ఆ) అంతవరకు వెతకని అశోకవనాన్ని వెతకాలనుకున్నాడు హనుమంతుడు.
ఇ) సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది.

11. అ) హనుమంతుడు మందహాసం చేస్తూ లంకిణిపై బలంగా కొట్టాడు.
ఆ) హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాడు.
ఇ) హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు.
ఈ) త్రికూట పర్వతంపై ఉన్న లంకను చేరాడు హనుమంతుడు.
జవాబులు
ఈ) త్రికూట పర్వతంపై ఉన్న లంకను చేరాడు హనుమంతుడు.
అ) హనుమంతుడు మందహాసం చేస్తూ లంకిణిపై బలంగా కొట్టాడు.
ఇ) హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు.
ఆ) హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాడు.

12. అ) నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కళ్ళల్లో ఆనందాశ్రువులు వచ్చాయి.
ఈ) రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
జవాబులు
ఇ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కళ్ళల్లో ఆనందాశ్రువులు వచ్చాయి.
అ) నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు.
ఈ) రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీతకు శుభశకునాలు తోచాయి.

పాత్ర స్వభావాలు

1. త్రిజట :
త్రిజట విభీషణుని కూతురు. రాక్షస స్త్రీలను అదలించింది. తనకు వచ్చిన కలను చెప్పింది. ‘వేయి హంసలతో కూడిన పల్లకిమీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చునట్లు చూశాను. సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతంమీద సీత కూర్చోవడం చూశాను. నూనెపూసిన శరీరంతో రావణుడు నేలమీద పడి ఉండటం చూశాను. ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రములు కట్టి, రావణుని మెడకు తాడుకట్టి దక్షిణంవైపుగా ఈడ్చుకువెళ్ళడం చూశాను. వరాహం మీద రావణుడు, మొసలిమీద ఇంద్రజిత్తూ, ఒంటిమీద కుంభకర్ణుడు దక్షిణదిశగా వెళ్ళడం చూశాను. లంక చిన్నాభిన్నం కావడం చూశాను’ అన్నది. స్వప్నంలో విమానదర్శనం కావడాన్ని బట్టి సీత సిద్ధిస్తుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందనీ చెప్పింది.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
‘దూతను చంపడం రాజనీతి కాదు’ అని పలికిన విభీషణుని మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు రావణునికి హితోపదేశం చేశాడు. అది రావణునికి నచ్చలేదు. హనుమంతుడిని సంహరించమని ఆదేశించాడు. అది విని విభీషణుడు దూతను చంపడం రాజనీతి కాదని, రావణునికి సూచించాడు.

ఈ విభీషణుని మాటల ద్వారా విభీషణుడు రాక్షస వంశంలో జన్మించినా గొప్ప రాజనీతి కలవాడని గ్రహించాను. ఆవేశంతో కాకుండా ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకోవాలని గ్రహించాను. రాజు ఎల్లప్పుడు రాజనీతిని అనుసరించి పాలించాలని, మంచి మాటలు చెప్పే మంత్రులు రాజుకు అవసరమని గ్రహించాను.

ప్రశ్న 2.
త్రిజట సీతను ఓదార్చిన విధానం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రావణుడు అశోకవనంలో ఉన్న సీతను సమీపించాడు. అనేక రకాలుగా ప్రలోభ పెట్టాడు. తీవ్రంగా భయపెట్టాడు. చంపుతానని బెదిరించాడు. ఆ సమయంలో దుఃఖిస్తున్న సీతను విభీషణుని కుమార్తె అయిన త్రిజట ఓదార్చింది. ఆమెలో ధైర్యాన్ని నింపింది.

త్రిజట సీతను ఓదార్చడం ద్వారా ఎన్నో విషయాలను గ్రహించాను. త్రిజట రాక్షస వంశంలో జన్మించినా ఉత్తమ గుణములు కల మహిళగా గుర్తించాను. ఆపదల్లోను, దుఃఖంలో ఉన్నవారిని ఆదుకోవాలని, వారిలో ధైర్యం నింపాలనిగ్రహించాను. త్రిజట మాటల వల్లనే సీత ధైర్యంగా జీవించగలిగిందని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
మైనాకుడు హనుమంతుడిని విశ్రాంతి తీసుకొనమని ప్రార్థించిన తీరును బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
మైనాకుడు వాయుదేవుని అనుగ్రహం వల్ల సముద్రంలో దాగియున్నాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించాడు. మార్గమధ్యలో మైనాకుడు హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నించాడు. హనుమంతుడు మైనాకుడిని స్పృశించి ముందుకు వెళ్ళాడు.

ఈ సన్నివేశం ద్వారా చేసిన ఉపకారాన్ని మరువకూడదని, దూరప్రయాణం చేసేవారికి విశ్రాంతిని ఇచ్చి, అతిథి మర్యాదలతో సత్కరించాలని గ్రహించాను. అంతేగాక కార్యరంగంలో దిగినవాడు అవిశ్రాంతంగా పనిచేయాలని, మార్గమధ్యలో కలిగే అంతరాలకు లోనుకాకూడదని కూడా గ్రహించాను.

ప్రశ్న 4.
ఆత్మహత్య కన్నా బతికి యుండటమే ఎన్నో విధాల మంచిదని, బాధల్లో నిరుత్సాహ పడకూడదనే విషయం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు లంకలో సీతను అన్వేషించాడు. ఎక్కడా కనిపించలేదు. నిరాశతో హనుమంతుడు ఆత్మహత్య చేసుకోవాలని ముందుగా అనుకొని తరువాత మనసు మార్చుకున్నాడు. ఆత్మహత్య కన్నా బతికి యుండటమే మంచిదని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు.

ఈ సన్నివేశం ద్వారా ఆత్మహత్య ఎన్నటికీ మంచిదికాదనీ గ్రహించాను. మానవుడు ఆలోచనాపరుడు, వివేకవంతుడు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోవాలని, సమస్యలకు పరిష్కారాలను అన్వేషించాలని గ్రహించాను. కష్టాలకు, దుఃఖాలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని గ్రహించాను.

ప్రశ్న 5.
హనుమంతుడుపిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని కుదించుకుని ఎడమకాలును పెట్టి లంకలో ప్రవేశించిన హనుమంతుని ప్రవర్తన ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరాడు. పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలో ప్రవేశించాడు. ఎడమకాలిని ముందుగా లంకలో పెట్టి ప్రవేశించాడు.

దీని ద్వారా హనుమంతుని సమయస్ఫూర్తిని గుర్తించాను. పిల్లి అపశకునానికి ప్రతీక అని, ఎడమకాలు ముందుగా పెడితే ఆ ప్రాంతానికి అనర్థం కలుగుతుందని గ్రహించాను. హనుమంతుని రాక లంకా నగర వినాశనానికి కారణమైందని గ్రహించాను. శత్రువుల ప్రాంతంలోనికి వెళ్ళేముందు ఎడమకాలు ముందుగా పెట్టడం శ్రేష్ఠమని కూడా గ్రహించాను.

ప్రశ్న 6.
హనుమంతుడు రావణునితో “ఓయీ ! సీతను రామునికి అప్పగించు లేనిచో అనర్ధం తప్పదు” అని హెచ్చరించాడు. దీని ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. చివరకు హనుమంతుడు రావణుని సమీపానికి వచ్చాడు. సీతను రామునికి అప్పగించి క్షేమంగా ఉండమని హెచ్చరించాడు. లేకపోతే అనర్హం కలుగుతుందని హెచ్చరించాడు.

ఈ హనుమంతుని మాటలనుబట్టి శ్రీరాముడు అమిత పరాక్రమవంతుడని, శ్రీరామునితో వైరం అన్ని విధాలుగా అనర్ధం కలుగుతుందని గ్రహించాను. రామదూతగా చక్కగా వ్యవహరించాడని కూడా గ్రహించాను. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంటే యుద్ధాలు తప్పుతాయని కూడా గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాలలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
హనుమంతుడు మొట్టమొదట చూసినప్పుడు సీతాదేవి ఎలా ఉంది?
జవాబు:
హనుమంతుడు లంకంతా వెదికాడు. సీత కనబడలేదు. శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలినమైన వస్త్రాలతో సీత ఉంది. ఆమె కృశించి ఉంది. దీనావస్థలో ఉంది. ఆమె ఆభరణాలను బట్టి హనుమ ఆమెను సీతగా నిర్ధారించుకొన్నాడు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరామ కార్యం నిమిత్తం హనుమంతుడు లంకకు యే విధంగా చేరాడు?
జవాబు:

  1. సుగ్రీవుని ఆజ్ఞమేరకు హనుమంతుడు మిగిలిన వానర వీరులతో దక్షిణ దిక్కుకు శ్రీరామ కార్యం నిమిత్తం బయలుదేరి సముద్రపు ఒడ్డుకు చేరాడు.
  2. జాంబవంతుడు, అంగదుడు మొదలగు వానర ప్రముఖుల ప్రోత్సాహంతో హనుమంతుడు సముద్ర లంఘనానికి పూనుకున్నాడు.
  3. హనుమంతుడు దేవతలందరికి నమస్కరించి తన శరీరాన్ని పెంచి, తోకను ఆకాశము పైకి రిక్కించి నడుం మీద చేతులు ఆనించి, గట్టిగా గర్జించి, పాదాలతో పర్వతాన్ని తొక్కి పైకి లంఘించాడు.
  4. హనుమంతుడు ఆ విధంగా సముద్రం మీద ఎగురుతుండగా సముద్ర గర్భంలోనున్న మైనాకుడు హనుమకు సాయం చేయాలన్న కోరికతో పైకి వచ్చి హనుమంతుని మార్గానికి అడ్డము వచ్చాడు.
  5. హనుమంతుడు మైనాకుణ్ణి చేతితో తాకి తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు.
  6. హనుమంతుణ్ణి పరీక్షించాలని “సురస” అనే నాగమాత ప్రయత్నించి అతని సూక్ష్మబుద్ధిని మెచ్చుకుంది.
  7. “సింహిక” అనే రాక్షసి హనుమంతుణ్ణి మింగాలని చూసి అతని చేతిలో మరణించింది.
  8. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి, లంకలో కాలుపెట్టాడు.
  9. రాత్రివేళ అన్వేషణకు అనువయిన సమయమని చీకటి పడేదాకా వేచియున్నాడు.
  10. చీకటి పడగానే లంకలో ప్రవేశించబోగా లంకిణి అడ్డగించింది.
  11. లంకిణిని ఒక దెబ్బతో నేలకూల్చాడు.
  12. లంకిణి హనుమంతుని చేతిలో ఓడింపబడి అతనికి దారి వదిలింది.
  13. ఈ విధంగా హనుమంతుడు సీత కొరకు అన్వేషించాలని లంకకు చేరాడు.

ప్రశ్న 2.
హనుమ సముద్రలంఘనం చేసిన విధానం వివరించండి.
జవాబు:
మహాబలవంతుడైన హనుమ, సముద్రం దాటడానికి ముందు దేవతలు అందరికీ నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్దగా గర్జించాడు. చేతులు నడుముపై పెట్టాడు. అంగదాది వీరులతో తాను రామబాణంలా లంకకు వెడతానన్నాడు.

సముద్రం పై నుండి వెడుతున్న హనుమంతుడికి సాయం చేద్దామని సముద్రుడు అనుకున్నాడు. రామకార్యం మీద వెడుతున్న హనుమకు శ్రమ కలుగకూడదని, సముద్రంలోని మైనాకుణ్ణి సముద్రుడు బయటకు రమ్మన్నాడు. మైనాకుడి శిఖరాలపై హనుమ కొంచెం విశ్రాంతి తీసికొంటాడని సముద్రుడు అనుకున్నాడు.

మైనాకుడు పైకి లేచాడు. మైనాకుడు తనకు అడ్డు వస్తున్నాడని హనుమ అనుకొని, తన వక్షంతో అతడిని గెంటివేశాడు. మైనాకుడు మానవరూపంతో పర్వత శిఖరంపై నిలబడి, సముద్రుడి కోరికను హనుమకు చెప్పాడు. హనుమ, సంతోషించాడు. తనకు సమయం లేదని, చేతితో మైనాకుణ్ణి హనుమ తాకి వెళ్ళాడు.

తరువాత హనుమంతుడిని పరీక్షించడానికి సురస అనే నాగమాత వచ్చి, హనుమ సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని, అతడిని ఆశీర్వదించింది. సింహిక అనే రాక్షసి, హనుమను మ్రింగాలని చూసింది. కాని హనుమంతుడు గోళ్ళతో సింహికను చీల్చివేశాడు.

ఇలా హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
సీతాదేవిని హనుమంతుడు తొలిసారి సందర్శించినపుడు అతడు పొందిన ఆనందాన్ని విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీతను వెతుకుతూ, రావణుడి అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ గొప్ప అందంతో ఉన్న రావణుడి భార్య మండోదరిని చూసి, సీత అని భ్రాంతిపడ్డాడు. తాను సీతను చూశానని హనుమ ఆనందంతో గంతులు వేశాడు. కొద్దిసేపటికే తన ఆలోచన తప్పు అనుకున్నాడు.

తరువాత హనుమ అశోకవనం అంతా, సీతకోసం వెతికాడు. శింశుపా వృక్షం ఎక్కాడు. ఆ చెట్టు క్రింద మాసిన బట్టలు కట్టుకొన్న ఒక స్త్రీని హనుమ చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె దీనావస్థలో ఉంది. ఆమె సీతయే అని, హనుమ అనుకున్నాడు.

అతడు ఆమె ధరించిన ఆభరణాలు చూశాడు. రాముడు చెప్పిన వాటితో అవి సరిపోయాయి. దానితో ఆమె సీతయే అని హనుమంతుడు గట్టిగా నిశ్చయించాడు.

సీతాదేవిని చూడగానే హనుమంతుడి కళ్ళ నుండి ఆనందభాష్పాలు జారాయి. శ్రీరాముడిని మనస్సులో స్మరించుకొని, హనుమంతుడు నమస్కరించాడు.

ప్రశ్న 4.
త్రిజటా స్వప్నం గురించి రాయండి.
జవాబు:
‘త్రిజట’ విభీషణుని కూతురు. రావణుడు సీతను అశోకవనంలో ఉంచి, రాక్షస స్త్రీలను ఆమెకు కాపలాగ పెట్టాడు. వారిలో ‘త్రిజట’ కూడ ఉంది. రావణుని భర్తగా అంగీకరించడానికి సీతను ఒప్పించమని రావణుడు రాక్షస స్త్రీలకు చెప్పాడు. రాక్షస స్త్రీలు సీతకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. లేకపోతే చంపుతామని వారు సీతను బెదిరించారు. సీత ఎంతో ఏడ్చింది.

అంత వరకూ నిద్రపోతున్న త్రిజట లేచి తనకు కల వచ్చిందని అక్కడున్న రాక్షస స్త్రీలకు చెప్పింది. కలలో వేయి హంసల పల్లకిపై రామలక్ష్మణులు కనబడ్డారని, సీత తెల్లని పర్వతం మీద కూర్చుందనీ వారికి చెప్పింది. రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని, ఒక నల్లని స్త్రీ రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపు ఈడ్చుకువెడుతోందని కూడా చెప్పింది. రావణుడు పందిమీద దక్షిణ దిశగా వెళ్ళడం తాను కలలో చూశానని, లంకానగరం చిన్నాభిన్నం కావడం తాను చూశానని త్రిజట తోడి రాక్షస స్త్రీలకు చెప్పింది.

తనకు కలలో విమానం కనబడింది. కాబట్టి సీత కోరిక సిద్ధిస్తుందనీ, రావణుడికి వినాశం, రాముడికి జయం కలుగుతుందనీ త్రిజట చెప్పింది. త్రిజట ఉత్తమురాలు.

ప్రశ్న 5.
లంక దహనానికి అసలు కారకులెవరు? ఎలా? విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీత జాడను తెలుసుకున్నాక, రావణుడి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రావణుడు పంపిన రాక్షస వీరులను అందరినీ హనుమ చంపాడు. చివరకు ఇంద్రజిత్తు హనుమను బ్రహ్మాస్త్రంతో బంధించి, రావణుడి వద్దకు తీసుకువెళ్ళాడు.

రావణుడు హనుమంతుడిని చంపమని ఆజ్ఞాపించాడు. దూతను చంపడం భావ్యం కాదని, ఇతర పద్ధతులలో దండింపవచ్చునని విభీషణుడు అన్న రావణునికి చెప్పాడు.

హనుమంతుడి తోకకు నిప్పు అంటించి, లంక అంతా తిప్పమని రాక్షసులకు రావణుడు చెప్పాడు. వారు బట్టలు హనుమంతుడి తోకకు చుట్టారు. దానిని నూనెతో తడిపారు. హనుమ తోకకు నిప్పు అంటించి, వారు లంక అంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుడి భవనం తప్ప, లంకనంతా కాల్చాడు. ఈ విధంగా రాముడు సీతను చూసి రమ్మని హనుమంతుడిని పంపితే, హనుమ లంకను కాల్చి వచ్చాడు.

దీనినిబట్టి లంకను కాల్చడానికి అసలు కారకుడు రావణుడు అని మనకు తెలుస్తుంది. హనుమంతుడు రాముడి పరాక్రమాన్ని గుర్తుచేసి, సీతను రాముడి వద్దకు పంపమని రావణుడికి చెప్పడానికే వెళ్ళాడు. కాని రావణుడు, తెలివి తక్కువగా హనుమ తోకకు నిప్పు పెట్టించాడు. కాబట్టి లంకా దహనానికి రావణుడే అసలు కారకుడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 6.
హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతను చూసి మాట్లాడిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
హనుమంతుడు దేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్ద ధ్వని చేస్తూ, చేతులను నడుం మీద ఉంచి, తోకను విదల్చాడు. సీతను చూసి వస్తానని, అంతరిక్షంలోకి ఎగిరాడు. హనుమ సముద్రంపై వెడుతుండగా, సముద్రుడు హనుమకు సాయం చేద్దామని తనలో దాగిన మైనాకుణ్ణి పైకి రమ్మన్నాడు. హనుమ ఆ గిరిశిఖరాలపై విశ్రాంతి తీసికొంటాడని సాగరుడు అనుకున్నాడు. పైకి లేచిన మైనాకుణ్ణి చూసి తనకు అడ్డంగా ఉన్నాడని, హనుమ తన వక్షస్థలంతో నెట్టివేశాడు. మైనాకుడు మనిషి రూపంలో గిరి శిఖరంపై నిలిచి, సముద్రుడి కోరికను హనుమకు తెలిపాడు. హనుమ తనకు మధ్యలో ఆగడం కుదరదని, మైనాకుని చేతితో తాకి ముందుకు సాగాడు.

హనుమను పరీక్షించాలని ‘సురస’ అనే నాగమాత యత్నించి హనుమ సూక్ష్మబుద్దిని మెచ్చుకుంది. ‘సింహిక’ అనే రాక్షసి హనుమను మింగాలని చూసి, తానే హనుమ చేతిలో మరణించింది. హనుమ లంకను చూశాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని తగ్గించుకొని, లంకలో ప్రవేశించాడు. లంకాధిదేవత (లంకిణి) లంకలోకి వెళ్ళడానికి హనుమంతుని అడ్డగించింది. హనుమ లంకను చూసి వస్తానన్నాడు. లంకిణి హనుమను అరచేతితో కొట్టింది. హనుమ లంకిణిని ఒక్క దెబ్బ వేశాడు. లంకిణి కూలిపోయింది. వానరుడు వచ్చి లంకిణిని జయించినపుడు రాక్షసులకు కీడు కల్గుతుందని బ్రహ్మ చెప్పాడని హనుమకు లంకిణి చెప్పింది. హనుమను లంకలోకి వెళ్ళమంది.

హనుమ ప్రాకారం నుండి లంకలోకి దూకాడు. లంకలో ఎడమపాదం పెట్టాడు. హనుమ లంకలో రాక్షస భవనాలన్నీ వెదికాడు. రావణుని భార్య మండోదరిని చూసి సీత అని భ్రమపడ్డాడు. తరువాత ఆమె సీత కాదని నిశ్చయించాడు. చివరకు సీత చనిపోయి ఉంటుందని అనుకున్నాడు. హనుమ తాను కూడా మరణిద్దాం అనుకున్నాడు. చివరకు బతికి ఉంటే శుభాలు పొందవచ్చుననుకున్నాడు.

హనుమ అశోకవనంలోకి వెళ్ళాడు. సీతారాములకు నమస్కరించాడు. హనుమ ఆ వనంలో శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలిన వస్త్రాలు ధరించిన ఒక స్త్రీని చూశాడు. ఆమె సీత అయి ఉంటుందని నిశ్చయించాడు. హనుమ చెట్టుమీదే ఉన్నాడు. తెల్లవారుతోంది. రావణుడు వచ్చి, సీత మనస్సును మార్చబోయాడు. సీత లొంగలేదు. రావణుడు సీతకు రెండు నెలలు గడువు ఇచ్చి, సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలకు చెప్పాడు. రావణుడు వెళ్ళిపోయాక, రాక్షస స్త్రీలు సీత మనస్సు మార్చడానికి యత్నించారు. సీత రాముడిని విడిచి ఉండలేక చనిపోదామనుకుంది.

విభీషణుడి కూతురు త్రిజట నిద్ర నుండి లేచింది. త్రిజట తనకు కల వచ్చిందనీ ఆ కలలో వేయి హంసల పల్లకిలో రాముడూ, తెల్లని పర్వతంపై సీత కనబడ్డారని, రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని లంక చిన్నాభిన్నం అయ్యిందని, రాముడికి జయం కల్గుతుందని చెప్పింది.

సీతకు శుభశకునాలు కనబడ్డాయి. హనుమంతుడు రామకథను గానం చేశాడు. సీత చెట్టు మీద హనుమను చూసి ఆశ్చర్యపడింది. హనుమ చెట్టుదిగి, ఆ స్త్రీని “నీ వెవరవు ? నీవు సీతవైతే నీకు శుభం అవుతుంది” అన్నాడు. తన పేరు సీత అని, ఆ స్త్రీ చెప్పింది. హనుమ తాను శ్రీరామ దూతనని చెప్పాడు. హనుమను చూసి సీత మొదట రాక్షసుడు అనుకుంది. రామదూతవయితే రాముణ్ణి గురించి చెప్పు అన్నది. హనుమ రాముని రూపాన్ని వర్ణించాడు. రాముడిచ్చిన అంగుళీయకాన్ని సీత గుర్తుగా ఇచ్చాడు.

రాముణ్ణి త్వరగా లంకకు తీసుకురమ్మని హనుమకు సీతమ్మ చెప్పింది. వెంటనే సీతను రాముని వద్దకు తీసుకు వెడతాననీ, తన వీపుపై కూర్చోమనీ, హనుమ చెప్పాడు. అందుకు సీత నిరాకరించింది. తాను పరపురుషుడిని తాకననీ, రాముడు రావణుని చంపి నన్ను తీసుకువెళ్ళడం ధర్మం అనీ చెప్పింది. హనుమంతుడు రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని సీతను అడిగాడు. సీత కాకాసురుని కథ చెప్పింది. ఆమె తన దివ్య చూడామణిని హనుమకు ఇచ్చింది. ఈ విధంగా హనుమ లంకలో సీతను కలిసి వెళ్ళాడు.

ప్రశ్న 7.
సీతాన్వేషణ వృత్తాంతం రాయండి.
(లేదా)
హనుమ లంకను కాల్చి వచ్చి, సీత జాడను రామునికి నివేదించిన వృత్తాంతాన్ని వివరించండి.
జవాబు:
సీతాదేవిని దర్శించడంతో హనుమకు ఒక ముఖ్యకార్యం పూర్తి అయ్యింది. రావణుడి శక్తిసామర్థ్యాలు హనుమ తెలుసుకుందామనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అశోక వన ధ్వంసం గురించి రాక్షస స్త్రీలు, రావణునకు చెప్పారు. రావణుడు ఎనభైవేల మంది రాక్షసులను పంపాడు. హనుమ వాళ్ళను చంపాడు. రావణుడు పంపిన జంబుమాలిని, ఏడుగురు మంత్రి పుత్రులను, ఐదుగురు సేనాపతులను, అక్షకుమారుణ్ణి హనుమ చంపాడు. చివరకు రావణుడు తన కుమారుణ్ణి ఇంద్రజిత్తును పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించాడు. అది హనుమపై స్వల్పకాలమే పని చేసింది.

రాక్షసులు హనుమను రావణుని ముందు ప్రవేశపెట్టారు. హనుమ తాను రామదూతనని చెప్పి, రాముని పరాక్రమాన్ని చాటాడు. దూతను చంపడం తగదని రావణుని తమ్ముడు విభీషణుడు చెప్పడంతో, రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించి లంకలో తిప్పమన్నాడు. రాక్షసులు రావణుని తోకకు బట్టలు చుట్టి, నూనెతో తడిపి, నిప్పు ముట్టించి ” లంకానగరంలో ఊరేగించారు. హనుమ ఆకాశంలోకి ఎగిరి, విభీషణుని భవనం తప్పించి, మిగిలిన లంకంతా తగులబెట్టాడు.

తరువాత హనుమ లంకను అంటించి తాను తప్పు చేశానని, సీతామాత ఆ మంటలలో కాలిపోయిందేమో అని, సందేహించాడు. తన తోకను కాల్చని అగ్ని, సీతను దహింపదని చివరకు ధైర్యం తెచ్చుకున్నాడు. సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని సంతోషించాడు. హనుమ సీత వద్దకు వెళ్ళి ఆమెను నమస్కరించి తిరుగు ప్రయాణం అయ్యాడు.

హనుమ ‘అరిష్టం’ అనే పర్వతాన్నుండి ఆకాశంలోకి ఎగిరాడు. మహేంద్రగిరికి చేరుతూ మహానాదం చేశాడు. జాంబవంతుడు ఆ ధ్వనిని విని హనుమ విజయం సాధించి వస్తున్నాడని వానరులకు చెప్పాడు.

హనుమ మహేంద్రగిరి చేరాడు. పెద్దలకు నమస్కరించాడు. ‘చూశాను సీతమ్మను’ అని చెప్పాడు. ప్రయాణ విషయాలు వారికి చెప్పాడు. అంగదుడు లంకకు వెళ్ళి, రావణుని చంపి సీతను తీసుకొని వచ్చి రాముని వద్దకు వెడదాం అన్నాడు. జాంబవంతుడు, అది సరికాదన్నాడు. రామసుగ్రీవులు సీతమ్మను చూసి రమ్మన్నారు. రాముడు రావణుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రామునికి విషయం తెలుపుదాం అన్నాడు.

దారిలో మధువనాన్ని వానరులు ధ్వంసం చేశారు. మధువనాన్ని రక్షిస్తున్న దధిముఖుడు, వానరుల చేతిలో దెబ్బతిని, ఆ విషయం సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు ఇదంతా శుభసూచకంగా భావించాడు. అంగద హనుమదాదులు సుగ్రీవుల దగ్గరకు వెళ్ళారు. హనుమ, రాముడికి నమస్కరించి ‘చూశాను సీతమ్మను’ అని చెప్పి, సీత ఇచ్చిన చూడామణిని రాముడికి ఇచ్చి సీతాన్వేషణ వృత్తాంతాన్ని రామునకు వివరించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 8.
లంకా దహనం వర్ణించండి.
జవాబు:
సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి. రావణుడు, అతని సైన్యపు. శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నంతా చేశాడు. ఆ కపివీరుడు. రాక్షస స్త్రీలు పరుగుపరుగున వెళ్ళి లంకేశునికీ విషయం చెప్పారు. రావణుడు ఎనభై వేల మంది రాక్షసులను ఈ పంపాడు. హనుమంతుడు వాళ్ళను మట్టుపెట్టాడు. తనపైకి వచ్చిన జంబుమాలిని, మంత్రిపుత్రులేడుగురిని రావణుడి సేనాపతులైదుగురిని, అక్షకుమారుణ్ణి అంతమొందించాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు. బ్రహ్మవరంచేత అది హనుమంతునిమీద క్షణకాలమే పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు. రావణుని ముందు ప్రవేశపెట్టారతన్ని. రావణుడడుగగా తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముని పరాక్రమమెలాంటిదో సభాముఖంగా చాటాడు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చునన్నాడు.

హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయ దిప్పమన్నాడు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు. నూనెతో తడిపారు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పుపెట్టాడు. అందుకే ‘(సీతను) చూసిరమ్మంటే (లంకను) కాల్చివచ్చాడని’ సామెత
పుట్టింది. లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి.